breaking news
Lifestyle
-
రాయల్ బ్లూ సిల్క్ చేనేత చీరలో మెరిసిన సమంత..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీర, ఫ్యాషన్ వేర్ అయినా..ఎందులో అయినా సమంత లుక్ ఎవర్గ్రీన్ అనేలా ఆమె మార్క కనిపిస్తుంది. సింపుల్గా కనిపిస్తూ..హైలెట్ మెరిసేలా ఫ్యాషన్ స్టైల్ని అనుసరిస్తుందామె. ఈసారి కూడా అలానే చూడాటానికి చాలా సాదాచీర అనిపించేలా లగ్జరీయస్ లుక్లో మెరిసిందామె.సమంత చీరల పట్ల ఉన్న ఇష్టాన్ని ఇలా ఏదో ఒక విధమైన స్టైల్లో కనిపిస్తూ..పరోక్షంగా చెబుతుంటారామె. ఆధునికత ఉట్టిపడేలా..మన సాంస్కృతికి చిహ్నమైన చేనేత చీరలో అదరహో అనిపించేలా ఉందామె ఆహార్యం. రాయల్ బ్లూ స్లిక్ చేనేత చీరలో రాకుమారిలా స్టైలిష్గా దర్శనమిచ్చింది. ఈ చీరను డిజైనర్ రినా సింగ్ రూపొందించారు. ఆర్గాంజ్ టైపు చీరను ప్యాచ్వర్క్, జాక్వర్డ్ బుట్టితో డిజైన్ చేశారు. దానికి మ్యాచింగ్గా ఎంబ్రాయిడరీ చేసిన వీ నైక్ బ్లౌజ్ని జత చేయడంతో.. లుక్ని మరింత అందంగా మార్చింది. స్మోకీ కళ్లు, నిగనిగలాడే పెదవులతో కూడిన మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఈ చీర ధర ఎంతంటే..సమంత ధరించిన చీర ధర రూ. 32,500 కాగా, బ్లౌజ్ ధర రూ. 12,500. మొత్తం ధర దాదాపు: రూ. 45,000 పలుకుతోంది. కాగా, సమంత చివరిసారిగా శుభం అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: -
కిడ్నీ మార్పిడి కోసం కేన్సర్ రోగిని పెళ్లాడింది..కట్చేస్తే..!
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ..ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ..అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ ...అన్న పాట గుర్తుకొస్తుంది ఈ ఘటన. ఏదో వ్యాధుల కారణంగా.. అవసరార్థం పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఎలాంటి ప్రేమ, ఇష్టం వంటివి లేదు. రోగాల కారణంగా ఒక్కటయ్యారు..కానీ వారి మధ్య విడదీయరానంత ప్రేమ చిగురించేలా చేసి..అద్భుతమే చేసింది ఆ దంపతుల మధ్య. ఎవరా ఆ జంట..? ఏమా కథ చూసేద్దామా..!2014లో చైనాలోని షాంగ్జీకి చెందిన 24 ళ్ల వాంగ్ జియావో అనే మహిళ యురేమియా అనే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి ఎంతలా ఉందంటే..ఆమెకు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరగకపోతే.. ఒక్క ఏడాదికి మించి బతకదని తేల్చి చెప్పేశారు వైద్యులు. అయితే ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు సన్నిహితులు, బంధువులు ముందుకొచ్చినా..వాళ్లెవ్వరిది ఆమెకు సరిపోలేదు. ఓ పక్క సమయం మించిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు కేన్సర్ పేషెంట్ అయిన జాంగ్ లియాంగ్ అనే వ్యక్తి ఓ విచిత్రమైనా ఆఫర్ ఇచ్చాడామెకు. "తాను కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, చనిపోయేంతవరకు చికిత్స సమయంలో తనను ప్రేమగా చూసుకునే తోడు కోసం ఆశిస్తున్నానని, అందుకు ప్రతిగా తను మరణించాక కిడ్నీని ఇస్తానని చెబుతాడు". ఇక్కడ వాంగ్కి మరో ఛాన్స్లేదు. పైగా తక్కువ వ్యవధి ఉంది. మరోవైపు జాంగ్కి సంరక్షణ, ఒక తోడు కావాలి. దాంతో బాగా ఆలోచించి వాంగ్ ఓ ఒప్పందం ప్రకారం..జాంగ్ని పెళ్లి చేసుకుంది. ఒకరు మనుగడ కోసం, మరొకరు సంరక్షణ ఆశిస్తూ చేసుకున్న ఈ వివాహం వారి జీవితాను ఊహించిన మలుపు తిప్పింది.అద్భుతం చేసిన ప్రేమ..మొదట్లో ఒప్పందాల పెళ్లి కాస్త. .బలమైన బంధంగా మారిపోయింది. అతడి కోసం వంట చేసి, కీమోథెరపీ చికిత్సలలో జాంగ్ కోరిన సంరక్షణను అందించింది. వైద్య సమస్యల కారణంగా పరిచయమైన ఈ అపరిచిత జంట వారాలు గడుస్తున్న కొద్ది.. ఇద్దరి మధ్య అనురాగం ఏర్పడి..విడిచి ఉండలేనంతగా ప్రేమ చిగురించింది. అచ్చం ప్రేమికులు మాదిరిగా అయిపోయారు ఆ దంపతులు. దూకుడుగా ఉన్న జాంగ్ కేన్సర్ వాంగ్ సహచర్యం ప్రేమ కారణంగా మెరుగవ్వుతూ..వైద్యులే విస్తుపోయేలా తగ్గిపోయింది. మొత్తానికి ఆ మహమ్మారి కేన్సర్ని జయించాడు జాంగ్. అతడు బాగుండటమే చాలు అన్నంత స్థితికి వాంగ్ వచ్చేసింది కూడా. మొదట్లో తాను బతకాలని ఆశించినా .. రాను రాను అతడు ఉంటేనే తన ప్రాణం ఉంటుంది అన్నంతగా ప్రేమను పెంచేసుకుంది. ఇక్కడ వాంగ్కి జాంగ్ కిడ్నీ రాలేదు, అయినా అలా వ్యాధితో పోరాడతూనే ఉండాలనే ఫిక్స్ అయ్యింది. విచిత్రం ఏంటంటే..ఆ వ్యాధులు ఇద్దరిని దంపతులుగా చేసి, వాటిని క్యూర్ అయ్యేలా చేశాయి. ఇక్కడ వాంగ్కి కూడా మూత్రపిండాల వ్యాధి సివియర్గా లేదని మెరుగవ్వుతుందని, మందులతో నిర్వహించొచ్చని వైద్యులు చెప్పడం విశేషం. ఇలా జరుగుతుందని ఊహించను కూడా లేదని ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ జంట. ఈ స్టోరీ ప్రేమ గొప్పతనం ఏంటో చెప్పకనే చెబుతోంది. పైగా జీవిత పరమార్థమే తానని చెప్పకనే చెప్పేసింది ఈ రెండక్షరాల ప్రేమ ..! మనం కోసం ఓ వ్యక్తి ఉన్నారు అంటే ఎంతటి అగాథాన్ని అయినా..సవాలునైనా అధిగమించి సునాయసంగా బటయపడగలం అనేందుకు ఈ దంపతులే ఉదాహరణ. ఇక్కడ ఆ జంట విషయంలో ప్రేమ అద్భుతమే చేసింది కదూ..!. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
ప్రెగ్నెంట్ అనగానే.. రెస్ట్..మస్ట్ కాదు..!?
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులకు రెస్ట్ మస్ట్ కాదంటున్నారు..అయితే చాలా మంది తెలియక అదే పనిగా రెస్ట్ తీసుకుంటున్నారని, తద్వారా నగరంలో 60.7 శాతం సీ–సెక్షన్లు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, 98 శాతం మందికి అసలు బెడ్ రెస్ట్ అవసరం ఉండదని, పూర్తిగా రెస్ట్తోనే సీ సెక్షన్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. నగరంలో సీ–సెక్షన్లు పెరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ హెల్త్ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై పలు సూచనలు.. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి మొదటిసారి తల్లికాబోతోందని తెలియగానే విపరీతమైన ముద్దుచేస్తారు. చిన్నపనికూడా చేయనీయరు. అయితే అలాంటి పరిస్థితులు మానసికంగా, శారీరకంగా గర్భిణిపై ప్రభావం చూపిస్తాయని, ఇది సీ–సెక్షన్ల సంఖ్య పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. సర్వే చెబుతోందేంటి? నగరంలోని ప్రసవాల్లో సుమారు 60.7 శాతం సీ–సెక్షన్లు ఉంటున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. ఇది దేశంలోనే అత్యధిక రేటుగా పేర్కొంటోంది. గర్భనిర్ధారణ అయిన వెంటనే అధిక శాతం మంది వైద్యులు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు. అయితే ప్రస్తుత జనరేషన్లో సుమారు 98 శాతం మంది గర్భిణులకు బెడ్ రెస్ట్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ బర్త్ కెనాల్ వీక్గా ఉన్నప్పుడు లేదా కుట్లు వేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తారని, మిగతా సమయంలో అవసరం లేదని అంటున్నారు. ఫార్మేషన్లో తేడాలుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా మిస్ క్యారీ అవుతుంది తప్ప, దినచర్య వల్ల ప్రమాదమనేది అపోహ మాత్రమే అంటున్నారు. గర్భిణులు నేను మెట్లు ఎక్కొచ్చా? నేల మీద కూర్చోవచ్చా? పనులు చేసుకోవచ్చా? అని ప్రశి్నస్తుంటారని, గర్భందాల్చడం జబ్బు కాదని, ఫిజియోలాజికల్ మార్పు మాత్రమేనని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు జరగడానికి శారీరక వ్యాయామం ఒక కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. బెడ్ రెస్ట్తో కొత్త సమస్యలు.. గర్భిణులు తొమ్మిదో నెల వరకూ అన్ని పనులూ చేసుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే బెడ్ రెస్ట్ అవసరపడుతుంది. సుమారు 98 శాతం మందికి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఒక్కసారిగా పనులన్నీ పక్కన పెట్టి బెడ్ రెస్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. మూడు నెల్లలోపు పిండం సుమారు 80 గ్రాములు మాత్రమే ఉంటుంది. కవలలు, ఐవీఎఫ్, ఏఆర్ ఇతర సందర్భాల్లో మాత్రమే జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణి ఒంటరితనం, స్ట్రెస్ ఫీలవకుండా చూసుకోవాలి. – పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: World Stroke Day 2025: లైఫ్స్టైల్ మార్పులే..స్ట్రోక్ కారకాలు..!) -
లైఫ్స్టైల్ మార్పులే.. స్ట్రోక్ కారకాలు..!
గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో స్ట్రోక్కు గురయ్యేవారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 15 నుంచి 20 శాతం మంది 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉంటున్నారని నిపుణులు అంటున్నారు. దేశంలో ఏటా 1.5 నుండి 1.8 మిలియన్ల స్ట్రోక్ కేసులు నమోదవుతుంటే, తెలుగు రాష్ట్రాలలో 1,00,000 జనాభాకు 275 మందిలో స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లు అంచనా. మారుతున్న జీవనశైలి,దీనికి ప్రధాన కారణంగా వైద్యులు అంటున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్న ఐటీ, వృత్తి నిపుణులు నిద్రలేమితో బాధపడుతున్నారు. నగర వాసుల్లో పెరిగిన స్క్రీన్ సమయం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తోందని, క్రమరహిత నిద్ర విధానాలు వాసు్కలర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లతో మధుమేహం, ప్రాసెస్డ్ ఫుడ్ రక్తపోటు తదితర వ్యాధుల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. మహిళలతో పోలిస్తే మగవారిలో స్ట్రోక్ ఎక్కువ సంభవించే అవకాశం ఉందని ఇటీవల గుర్తించారు. దేశంలో మరణానికి రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. సమయమే కీలకం.. ఈ స్ట్రోక్కు గురైన సందర్భంలో మెదడును కాపాడటానికి సమయం చాలా ముఖ్యం. ఆస్పత్రి చేరుకోవడంలో ఆలస్యం అతిపెద్ద సవాలు. ‘స్ట్రోక్, వైకల్యాలకు మధ్య అతిపెద్ద వ్యత్యాసం సమయం. స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం, రెండు మిలియన్ల మెదడు కణాలు చనిపోతాయి’ అని వైద్యులు వివరిస్తున్నారు. ‘మూడు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోవడం వల్ల పూర్తిగా కోలుకునే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని చెబుతున్నారు. దీనిని ఎదుర్కోడానికి, ఈ సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ డే థీమ్ ‘ప్రతి నిమిషం లెక్కించబడుతుంది’ అని ఎంచుకున్నారు. ‘రిహాబ్’తో సాధారణ జీవితం.. వంశపారంపర్య సమస్యలతో అత్యంత పిన్న వయసు్కలు కూడా స్ట్రోక్ బాధితులుగా మారడం ఇటీవల గమనిస్తున్నాం. జీవనశైలి మార్పుల వల్ల యుక్త వయసు్కలు దీని బారిన పడుతున్నారు. స్ట్రోక్ చికిత్స తర్వాత రికవరీ కీలక అంశం. అది సవ్యంగా అందితేనే రోగి తిరిగి సాధారణ జీవితం గడపగలుగుతాడు. స్ట్రోక్ బాధితుల కోసం దశాబ్ధం క్రితమే ‘రిహాబ్’ కేంద్రాలు ప్రారంభించాం. దేశవ్యాప్తంగా 7 సెంటర్స్ నిర్వహిస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్ పరిజ్ఞానంతో శరవేగంగా రోగుల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్.గౌరవ్ తుక్రాల్, హెల్త్– డాక్టర్.గౌరవ్ తుక్రాల్, హెల్త్ కేర్ ఎట్ హోమ్ కేర్ ఎట్ హోమ్లక్షణాలు ముందుగా గుర్తిస్తే మేలు.. ఇటీవల కాలంలో స్ట్రోక్ సాధారణ న్యూరోలాజికల్ వ్యాధిగా మారింది. ముఖ్యంగా ముఖం వంకరపోవడం, చేతి బలం తగ్గడం, ఒక చేతిని పైకి లేపడానికి కష్టపడటం. మాటల్లోనూ తడబాటు, అకస్మాత్తుగా కళ్లు మసకబారడం, తీవ్ర తలనొప్పి, శరీర సమతుల్యం కోల్పోవడం వంటివి స్ట్రోక్ లక్షణాలు. వీటిపై మరింత అవగాహన అవసరం. – డాక్టర్ వంశీకృష్ణ, న్యూరోసర్జన్, నిమ్స్ ఆస్పత్రి -
సోషల్ మీడియా సెన్సేషన్..ఎవరీ వరేణ్య..?
సృజనాత్మక కంటెంట్తో నెటిజనులను అలరిస్తోంది పది సంవత్సరాల వరేణ్య బోర్బర. అస్సామ్లోని జోర్హత్కు చెందిన వరేణ్య నెటిజనులకు ‘వివేషియస్ వరేణ్య’గా సుపరిచితురాలు. ‘నువ్వు బాగా పాడుతావు’ అని వరేణ్యను కుటుంబసభ్యులు ప్రోత్సహిస్తూ ఉండేవారు. దీంతో స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో తన గానాన్ని వినిపించింది. ఉపాధ్యాయులు, క్లాస్మేట్లు తనని ఆకాశానికి ఎత్తారు. తన మీద తనకు ఆత్మవిశ్వాసం వచ్చింది. కంటెంట్ క్రియేటర్గా మారడానికి ఆ ఆత్మవిశ్వాసమే కారణం. స్పష్టమైన, అనర్గళమైన ఆంగ్ల భాషా నైపుణ్యంతో సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది వరేణ్య. ‘ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కోసం తరచుగా ఇంగ్లీష్ సినిమాలు, కార్టూన్ షోలు చూస్తుంటాను’ అని చెబుతుంది వరేణ్య.ఇంగ్లీష్ భాషపై వరేణ్యకు ఉన్న ఫ్యాషన్, తన కంటెంట్కు సెంట్రల్ థీమ్గా మారింది. ఇంగ్లీష్ను సులభంగా ఎలా నేర్చుకోవాలి, స్పష్టంగా ఎలా మాట్లాడాలి అనేదానికి సంబంధించి ఎన్నో వీడియోలు చేసింది. వరేణ్య నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్లో వ్లోగ్స్, మ్యూజిక్, ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో వరేణ్యకు రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. -
ఫస్ట్ టైమ్ ఏఐ మేనిక్యూర్ మిషన్
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నవలలు రాస్తోంది. పెయింటింగ్స్ వేస్తోంది... ఇంకా ఎన్నో చేస్తుంది. ఇప్పుడు మరో అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మేనిక్యూర్ మెషిన్ ‘ఉమియా’ను లండన్లోని ఒక బ్యూటీ కంపెనీ లాంచ్ చేసింది. ‘ఇది జెల్ మేనిక్యూర్. మీరు మీ వేలిని మెషిన్ లోపల ఉంచినప్పుడు, అందులోని కెమెరా మీ గోరును స్కాన్ చేసి దాని పరిమాణం, లొకేషన్ అర్థం చేసుకుంటుంది. మేము దీనిని నెయిల్ డీఎన్ఏ అని పిలుస్తాం. బ్యూటీ స్పేస్లో కొత్తసాంకేతికతకు అద్దం పట్టే ఆవిష్కరణ ఇది. ఈ జెల్ నెయిల్ ప్రింటర్ ప్రతి నెయిల్ను స్కాన్ చేసి, డిజైన్ను మీ వేలికి సరిగ్గా సర్దుబాటు చేస్తుంది. సంక్లిష్టమైన నెయిల్ ఆర్ట్ను ప్రతి నెయిల్కు రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ప్రింట్ చేస్తుంది’ అంటున్నారు ‘ఉమియా’ బ్యూటీ కంపెనీ ప్రతినిధి డోంగ్.(చదవండి: భూతాపం నుంచి పుట్టిన వినోదం..!) -
భూతాపం నుంచి పుట్టిన వినోదం..!
భూతాపం వల్ల జరిగే నష్టం ఏమిటి?వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడతాయి. పర్యావరణ సమతుల్యత ప్రమాదంలో పడుతుంది... ఒక్క ముక్కలో చెలంటే భూతాపం అనేది సీరియస్ విషయం. సీరియస్ విషయాన్ని చా...లా సీరియస్గానే చెప్పాలి అనే రూలేమీ లేదు. ముంబైకి చెందిన థియేటర్ కంపెనీ ‘టఫ్రీవాలే’ గ్లోబల్ వార్మింగ్ సమస్యను సీరియస్గా చెప్పాలనుకోలేదు. నవ్విస్తూనే సమస్యను అర్థం చేయించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘ఫీవర్ డ్రీమ్’ నాటకం నాటకప్రియులు, విశ్లేషకులు, పర్యావరణవేత్తల ప్రశంసలు అందుకుంటోంది. భూతాపం అనే సమస్యను మనం ఎలా చూస్తున్నామనేదాన్ని వ్యంగ్యంగా చెప్పే నాటకం... ఫీవర్ డ్రీమ్. ఈ నాటకానికి దర్శకురాలు మేఘనా ఏటీ. సహ రచయిత్రి నయనతార నాయర్. పర్యావరణ సంబంధిత విషయాలపై మొదటి నుంచి ఇద్దరికీ ఆసక్తి ఉంది. ‘ఎందుకు ఇలా జరుగుతుంది?’ అనే విచారం ఉంది. ఆ విచారంలో నుంచే పుట్టిన వినోద నాటకం... ఫీవర్ డ్రీమ్.మొదట్లో ఈ నాటకానికి రెండు వెర్షన్లు రాసుకున్నారు. ఫైనల్ వెర్షన్లో ‘షార్క్ ఇండియా’ తరహా రియాలిటీ షో ఎపిసోడ్ను తీసుకువచ్చారు. ఇది నాటకంలో బాగా క్లిక్ అయింది. ‘వాతావరణ సంక్షోభం అనేది ఎవరో ఒకరి సమస్య మాత్రమే కాదు. ఇది అందరి సమస్య. అంతేకాదు, ఇది రేపటి సమస్య మాత్రమే కాదు నేటి సమస్య కూడా’ అంటుంది మేఘన. పర్యావరణం గురించి గతంలో ఒక షో చేసింది మేఘన. అయితే అందులో సముద్ర మట్టాలు పెరగడానికి సంబంధించే ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక పర్యావరణ కార్యకర్త మేఘనను సంప్రదించాడు. భూతాపం గురించి ఒక నాటకం వేస్తే బాగుంటుందని సూచించాడు. వాతావరణ మార్పులు అనేవి మనకు సంబంధం లేని సబ్జెక్ట్ ఏమీ కాదు. ‘ఎండా కాలం ఇంకా రానేలేదు. ఇంత వేడా!’ ‘గత సంవత్సరం కంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి’... ఇలా మనకు తెలియకుండానే రోజువారి సంభాషణలలో భూతాపం గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి భూతాపం గురించి నాటకం చేయడం అంటే భారమైన టాపిక్పై చేసినట్లు కాదు. మనకు సంబంధం లేని సబ్జెక్ట్ చేసినట్లు కాదు. సీరియస్ సమస్యను సీరియస్గానే చెప్పనక్కరలేదు. దానికి కాసింత కామెడీ దట్టిస్తే సరిపోతుంది అని నిర్ణయించుకుంది మేఘన. దాని ఫలితమే... ఫీవర్ డ్రీమ్ నాటకం.గొంతు విప్పాలివాతావరణ సంక్షోభం గురించి మరింత ఆలోచించేలా చేయడానికి మా నాటకం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ‘మార్పులో భాగం కావడానికి నేను నిజంగా ఏంచేస్తున్నాను?’ అని ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాను. వాతావరణంలో అనూహ్య మార్పులపై ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు పెట్టడం, ఒకటి రెండు పిటిషన్లపై సంతకాలు పెట్టడం మార్పుతెస్తుందని నేను అనుకోను. ప్రభుత్వాలు చెట్లు, మడ అడవులు నరుకుతున్నప్పుడు మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వ్యర్థాలతో సరస్సులు, నదులను నాశనం చేస్తున్నప్పుడు మనం మాట్లాడాలి.– మేఘన ఏటీ (చదవండి: ఇది తప్పుడు కేసు అనుకోవడానికి వీలు లేదు!) -
ఇది తప్పుడు కేసు అనుకోవడానికి వీలు లేదు!
మరొకరితో పారిపోయి, అతను మోసం చేసిన తర్వాత మరలా నాతో ఉంటాను అని వచ్చేసిన భార్యని నేను తిరస్కరించాను. డివోర్స్ కేసు వేశాను. అందుకు కక్ష సాధింపుగా నాపైన, వృద్ధులైన నా తల్లిదండ్రులపై కూడా తప్పుడు డీ.వీ.సీ – 498– ఎ (గృహ హింస) కింద కేసులు వేసింది. అందులో భాగంగా మెయింటెన్స్ కూడా వేసింది.. మా మీద సమాజంలో లేనిపోని ప్రచారాలు చేసి మమ్మల్ని క్షోభకు గురిచేయడమేగాక హైదరాబాద్ లో మా నాన్నగారు స్వార్జితంతో సంపాదించిన ఇంట్లో అద్దెకు ఉంటున్నవారిని బలవంతంగా ఖాళీ చేయించి తాను దౌర్జన్యంగా ఆ ఇంట్లో ఉంటోంది. 7 సంవత్సరాల తర్వాత తను వేసిన కేసులు అన్నీ తప్పు అని కోర్టు కేసులు కొట్టివేసింది. డివోర్స్ వచ్చేసింది. పూర్తి జడ్జిమెంటు రావాల్సి ఉంది. నాకు జరిగిన అన్యాయానికి, మా మీద వేసిన తప్పుడు కేసులకు గాను నేను – నా తల్లిదండ్రులు పరువు నష్టం దావా వేయవచ్చా? మా నాన్నగారి ఇంట్లోనుంచి తనను ఎలా పంపించాలి? – రాజగోపాల్, సూర్యాపేటభారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498 ఎ (85 బిఎన్) వివాహిత మహిళపై గృహహింసకు పాల్పడిన భర్త, అతని కుటుంబ సభ్యులపై కఠినచర్యలు తీసుకునే ఉద్దేశంతో రూపొందించిన చట్టం. కానీ చాలామంది మహిళలు తమ వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని అనేక సందర్భాలలో పలు హైకోర్టులతో సహా సుప్రీంకోర్టు సైతం పేర్కొంది. అందుకని ఇలాంటి కేసులలో సాధారణంగా అరెస్ట్ కూడా చేయడానికి వీలులేదు అని ఎన్నో నిబంధనలను సుప్రీంకోర్టు సూచించింది. వివాహ బంధాన్ని అంతం చేయాలి అనుకున్నప్పుడు స్త్రీలకు తగిన భరణం ఇవ్వకపోవడం, వారి హక్కులను గౌరవించకపోవడం వలన తప్పని పరిస్థితులలో చాలామంది స్త్రీలు రాజీ కుదుర్చుకోవడానికి (సెటిల్మెంట్) ఒక సాధనంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడం చాలా కేసులలో గమనిస్తున్నాము. మీ కేసులో జడ్జిమెంట్ ఇంకా రాలేదని అన్నారు. జడ్జిమెంట్ రాకుండా కేవలం కేసు కొట్టేశారు కాబట్టి ఇది తప్పుడు కేసు అని అనుకోవడానికి వీలులేదు. సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టేసి ఉంటే పరువు నష్టం వేయడానికి కుదరక పోవచ్చు. కానీ మీ భార్య ఉద్దేశపూర్వకంగా మీ మీద తప్పుడు కేసులు, అభియోగాలు మోపిందనే వ్యాఖ్యలు జడ్జిమెంట్లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దావా వేయవచ్చు. ఇందుకు వీలుందా లేదా అనే విషయాన్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మరో విషయం... మీ తండ్రిగారు సంపాదించిన ఇంటిలో మీ భార్య ఉండడానికి వీల్లేదు. అయితే డి.వి.సి చట్టం కింద తనకు గృహ వసతి (రెసిడెన్స్ ఆర్డర్స్) ఏమైనా ఉంటే మాత్రం మీ భార్య అలాంటి ఆర్డర్ అమలులో ఉన్నంతవరకు అక్కడ ఉండవచ్చు. అయితే మీ తల్లిదండ్రులు ఒకవేళ ‘తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007’ కింద కేసు వేసి తమ ఇంటిని తిరిగి కోరితే మీ మాజీ భార్యని బయటికి పంపవచ్చు. అయితే మీరు తనకి ప్రత్యామ్నాయ వసతి కల్పించాల్సిందిగా కోర్టు మిమ్మల్ని ఆదేశించవచ్చు. ఏది ఏమైనా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటే మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఆమె మీ మీద మోపిన అభియోగాలలో కొంచెం నిజం వున్నా, మీరు కూడా కక్ష సాధింపులకి దిగటం అంత సమంజసం కాదేమో ఆలోచించుకోండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: ఎప్పటికీ 'రియల్ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్ అప్లు..) -
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
"మోంథా" తుఫాను కోస్తా తీర ప్రాంత వాసులను వణికిస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు, ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.పాటించాల్సిన జాగ్రత్తలు 🚨 Cyclone Alert!Severe Cyclonic Storm #Montha over west central Bay of Bengal is likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening/night of 28th October, with a maximum sustained wind speed of 90-100 kmph gusting to 110… pic.twitter.com/ZD4WW6ik2k— PIB India (@PIB_India) October 28, 2025 తుఫాను లాంటి పరిస్థితులను నివారించడానికి ఉత్తమ మార్గం ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండటం అవసరం. ఆఫీసులోనో, బయటో ఉంటే, వర్షం ఆగే వరకు వేచి ఉండాలి.ఇంట్లో, ఫ్లాష్లైట్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ,ఇతర ఆహార పదార్థాలను దగ్గర్లో ఉంచుకోవాలిఅధికారుల సూచనలను పరిశీలిస్తూ ఉండాలి.భారీ వర్షాలు, ఈదురు గాలలనుంచి కాపాడుకునేలా ఇంటిలోపలే ఉండాలి. అత్యవసరమైతే తప్ప, కొన్ని జాగ్రత్తలో బయటికి రావాలి. ఇంటి లోపల కిటికీలకు దూరంగా ఉండాలి.కిటికీలు ,తలుపులను సురక్షితంగా మూసి ఉంచాలి. బలమైన గాలులకు కిటికీలుపడిపోకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలి. గాజు కిటికీలైతే మరింత అప్రమత్తత అవసరం.భారీ వర్షాల సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.విద్యుత్ పరికరాలను టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్లను ఆఫ్ చేయాలి. అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచుకోవాలి. -శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, జాగ్రత్తగా ఉండాలి.విలువైన పత్రాలు, నగదు భద్రంగా ఉండేలా చూసుకోవాలి.నిరంతరం అధికారులను సూచలను గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండిఎవరైనా ఆపదలో ఉన్నట్టు గమనిస్తే తమను తాము కాపాడుకుంటే వారిని ఆదుకోడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తగా ఉండాలి.చలిగాలులనుంచి కాపాడుకునేందుకు వెచ్చని రగ్గులు, స్వెట్లర్లు ధరించాలి. ముఖం , కళ్ళు కప్పి ఉంచుకోవడం చాలా అవసరం. వాహనంలో ఉంటే, ఎగిరే వస్తువుల ప్రమాదం లేని చోట దానిని పార్క్ చేయండి. తుఫాను సమయంలో వాహనం లోపల రేడియో ప్లే చేయవద్దు; అలా చేయడం వల్ల మీరు మెరుపులకు గురవుతారు.తుఫాను సమయంలో స్నానం చేయడం మానుకోండి. నీటిలో కరెంట్ వేగంగా వ్యాపిస్తుంది. (బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!) -
ఎప్పటికీ 'రియల్ హీరో'..! 61 ఏళ్ల వయసులో చలాకీగా పుష్ అప్లు..
కొన్ని సంఘటనలు అందర్నీ మైమరిచిపోయేలా చేస్తే..మరికొన్ని ఒక్క క్షణం ఆగిపోయి చూస్తుండిపోయేలా ఉంటాయి. వారి హోదాను కూడా పక్కన పెట్టి మనతో సామాన్యుల మాదిరిగా కలిసిపోయే వారి ఔదార్యం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. పైగా ఆ దృశ్యం అందరం ఒక్కటే అనేట్టుగా ప్రతిధ్వనిస్తుంది. అలాంటి అపురూపమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.ఢిల్లీలో జరిగిన శౌర్య వీర్ - రన్ ఫర్ ఇండియా' మారథాన్లో ఈ ఘటన ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఆ వేదికపై ప్రత్యేక సామర్థ్యం ఉన్న పిల్లవాడు అందర్నీ విస్తుపోయేలా పుష్ అప్లు చేస్తున్నాడు. ఇంతలో ఆర్మీ చీఫ్ ద్వివేది..ఆ పిల్లవాడిని ఉత్సాహపరిచేలా అతడితోపాటు ఆయన కూడా పుష్అప్లు చేశారు. ఆయన చేసిన పని ప్రజల హృదయాలను గెలుచుకుంది. నిజానికి ఈ మారథాన్ కార్యక్రమం సైన్యం, ధైర్యం అంకితభావానికి నివాళులర్పించే 79వ శౌర్య దినోత్సవ వేడుకల్లో భాగం. కరియప్ప పరేడ్ గ్రౌండ్లో వేదికపై ప్రత్యేక సామార్థ్యం ఉన్న పిల్లవాడు పుష్-అప్లు చేయడం ప్రారంభించినప్పుడు, ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఆ పిల్లవాడి ఉత్సాహాన్ని చూసి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది కూడా అతడితో చేరారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాకుండా నెటిన్ల మనసును దోచుకుంది. అంతేగాదు 61 ఏళ్ల వయసులో ఎంత అప్రయత్నంగా పుష అప్లు చేశారు సార్ అని ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు.Army Chief joins a specially-abled child for push-ups : a powerful gesture of encouragement and inclusion. 🇮🇳 leadership is about lifting others in spirit and strength. pic.twitter.com/bl3HZFyTPI— Alpha Defense™🇮🇳 (@alpha_defense) October 27, 2025 (చదవండి: Success Story: కాలేజ్కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..) -
కాలేజ్కి వెళ్లకుండానే పీజీ..కోచింగ్ లేకుండానే 12 ప్రభుత్వ ఉద్యోగాలు..
సరిగ్గా ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ టైంలో తండ్రిని కోల్పోయాడు. అంతటి విషాదాన్ని దిగమంగి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక ఆ తర్వాత చదువు కొనసాగించలేని దుస్థితి. కుటుంబ బాధ్యతలు మీద పడటంతో..కాలేజీ ముఖం చూడకుండానే..డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీస్ క్లర్క్ ఉద్యోగం నుంచి మొదలు పెట్టి.. యూపీఎస్సీ వరకు మొత్తం 12 ప్రభుత్వ ఉద్యోగాలను కొల్లగొట్టి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. అనుకోని అవాంతరంలా హఠాత్తుగా వచ్చిపడే కష్టాలనే అభ్యున్నతికి సోపానంగా చేసుకుని ఎదగడం ఎలా అనేది చూపించి ప్రేరణగా నిలిచాడు.అతడే ఐపీఎస్ సందీప్ చౌదరి. దృఢ సంకల్పం ఉన్నవారికి జీవితంలో ఓటమి ఉండదు అనేందుకు ఉదహారణ సందీప్ చౌదరి. చిన్న వయసులో తండ్రిని కోల్పోయాడు. సరిగ్గా ఇంటర్ బోర్డు పరీక్షల టైంలో తండ్రిని కోల్పోయాడు. ఆ దుఃఖాన్ని దిగమింగి..రాసి ఉత్తీర్ణుడయ్యాడు. చెప్పిరాని కష్టాన్ని ఓర్పుకుంటూ..మన గమనం ఆగిపోకూడదు అన్నట్లుగా..సందీప్ ముందుకు సాగిన తీరు ప్రశంసించదగ్గ విషయం. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల నిమిత్తమై రెగ్యులర్ కాలేజీ చదువుకి స్వస్తి పలికి దూరవిద్య ద్వారా చదవుని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అలా ఇగ్నో ఓపెన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సాయంతో బీఏ, ఎంఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పోస్టాఫీసులో పోస్టల్ క్లర్క్ ఎగ్జామ్కి దరఖాస్తు చేసుకున్నాడు. ఉన్నవి జస్ట్ 40 ఖాళీలు..దరఖాస్తు చేసుకుంది వందలాది మంది. అసలు నెగ్గుకురాగాలనా అనుకున్నాడు. కట్చేస్తే..కోచింగ్ లేకుండానే తొలి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అలా అక్కడ నుంచి మొదలు పెట్టి..మహర్షి మూవీలో మహేశ్ బాబు డైలాగ్ సక్సెస్ ఈజ్ జర్నీ కామాలే ఉంటాయ్, పులిస్టాప్ ఉండదు అన్నట్లుగా సాగిపోయింది ఆయన విజయ పరంపర. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండా మొత్తం పది ప్రభుత్వ పరీక్షలను క్లియర్ చేశాడు. వాటిలో బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సీ, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, నాబార్డ్, పంజాబ్ సివిల్ సర్వీసెస్ పరీక్ష తదితరాలు ఉన్నాయి.సివిల్స్ ఎగ్జామ్ వైపుకి దృష్టి మళ్లింది అలా..గుహతి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుండగా ఒక ఘట్టం అతడి జీవితాన్ని సివిల్స్ ప్రిపేరయ్యేందుకు పురిగొల్పింది. సరిగ్గా 2010 యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తన రూమ్మేట్ 13వ ర్యాకు సాధించిడం చూసి..తాను ఆ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్కి సన్నద్ధం కావాలని భావించాడు. అయితే సందీప్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి పూర్తి నిబద్ధత అవసరం. అందువల్ల యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టమైంది. అయినప్పటికీ..మిగతావాటికి ప్రిపేరయ్యినట్లుగానే తన శక్తి మేర కృసి చేశాడు. అలా 2014 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే సందీప్ 158వ ర్యాంక్ సాధించాడు. ఇంటర్వ్యూలో మొత్తం 240 మార్కులు సాధించాడు. అది ఆ సమయంలో దేశంలోనే అత్యధికమని సందీప్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు కూడా. ప్రస్తుతం ఆయన జాతీయ దర్యాప్తు సంస్థలో(ఎన్ఐఏ) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా పనిచేస్తున్నారు. ఏదో సాధించేశాం హమ్మయ్య అనుకోలేదు..తకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునేలా సక్సెస్ పరంపరను సాగించి.. ప్రపంచమే తనవైపు చూసేలా చేసుకుని "దటీజ్ సందీప్ చౌదరి" అనిపించుకున్నారు. (చదవండి: Delhi Police constable Sonika Yadav: వెయిట్లిప్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏడు నెలల గర్భిణి..!) -
రికార్డ్ సేల్ : పోకీమాన్ కార్డులతో రూ.3.8 కోట్లు సంపాదించాడు
బాల్యం నుంచి కొంతమందికి పోకీమాన్ కార్డులను సేకరించడం ఒక హాబీ. ఆ హాబీతోనే మలేషియాకు చెందిన పోకీమాన్ అభిమాని ఒకరు అరుదైన రికార్డ్ సృష్టించాడు. చిన్ననాటి అభిరుచి, కోట్ల ఆస్తిగా మారిన వైనం నెట్టింట విశేషంగానిలుస్తోంది. ప్యాషన్ నుండి లెగసీ వరకు సాగిన ఈ ట్రేడింగ్ కార్డ్ సేకరణతో ఏకంగా (1.87 మిలియన్ల రింగెట్లు) రూ.3.8 కోట్లను సాధించాడు. మలేషియా పోకీమాన్ కార్డ్ ఔత్సాహికుడు షా ఆలంకి చెందిన డామిరల్ ఇమ్రాన్ సోషల్ మీడియాలో ఈ సేల్ గురించి ప్రకటించాడు. ప్యాషన్, హార్డ్ వర్క్ , లెగసీ స్టోరీ అంటూ తన విజయగాథను షేర్ చేశాడు. ప్రతీకార్డు, ప్రతీ బాక్స్, ప్రతీ నిద్రలేని రాత్రికి దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఈ పోస్ట్లో ఒక రూమ్ అంతా పోకీమాన్ కార్డ్ బాక్స్లు నిండి ఉండటం గమనించ వచ్చు. ‘‘ ఇవి నా ప్రయాణంలో చాలా అద్భుతమైన క్షణాలు. ప్రతి కార్డు, ప్రతి పెట్టె, ప్రతి నిద్రలేని రాత్రి అన్నీ విలువైనవి. ఇది ముగింపు కాదు, గొప్ప ప్రారంభం మాత్రమే" అని అతను ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.NST నివేదిక ప్రకారం, కొనుగోలుదారు కూడా తోటి మలేషియాకు చెందిన వాడే. View this post on Instagram A post shared by Damiral Imran (@damiralimran)సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) గ్లోబల్ కార్డ్ వాల్యుయేషన్ ట్రాకర్ అయిన షైనీ నుండి వచ్చిన డేటాను ఉటంకిస్తూ ఇమ్రాన్ కలెక్షన్ విలువ రెండు మిలియన్ల రింగెట్లకు పైగా ఉంటుందని నివేదించింది. ట్రేడింగ్ కార్డ్లను ప్రామాణీకరించడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆథెంటికేటర్ (PSA) ద్వారా కార్డులు ధృవీకరించింది.ఇదీ చదవండి: Saudi Arabia Sky Stadium: మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియంపోకీమాన్ కార్డులు1996లో జపాన్లో మొదటిసారిగా ప్రారంభించిన పోకీమాన్ కార్డులు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, విలువైన ట్రేడింగ్ గేమ్స్ కార్డ్స్ గా అవతరించాయి. వాస్తవానికి పోకీమాన్ వీడియో గేమ్ సిరీస్తో పాటు వచ్చిన ఈ కార్డులు పిల్లల్లోనూ, సేకరించే వారిలోనూ చాలా కొద్ది కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందాయి. గత కొన్ని దశాబ్దాలుగా బహుళ-బిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ట్రేడింగ్ కార్డులు పాప్ సంస్కృతిలో విలువైన వస్తువులుగా మారిపోయాయి. ఇలాంటి అత్యంత అరుదైన కార్డులలో కొన్ని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేలంలో కోట్ల రూపాయలను దక్కించుకున్నాయి. -
ప్లేస్మెంట్లో ప్రతిసారి 'నో'..కట్చేస్తే..!
ఎన్నో స్ఫూర్తిని కలిగించే సక్సెస్ స్టోరీలను చూసుంటారు. అయితే వాటిలో..ఎన్నో వైఫల్యాల తర్వాత విజయాన్ని చవిచూసిన వారు కొందరైతే..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నవారు మరికొందరు. అలా కాకుండా మన స్నేహితులంతా సెటిల్ అవుతూ హ్యాపీగా ఉంటే..మనం మాత్రం ఓటమితో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే..మళ్లీ ప్రయత్నించాలన్నా బాధకంటే..మనమే ఎందుకు ఓడిపోతున్నాం అనే బాధ ఎక్కువుగా ఉంటుంది. కానీ ఇతడు వాళ్లతో నార్మల్గా వ్యవహరిస్తూ..యథావిధిగా తన ప్రయత్నం సాగించి..వారికంటే స్పెషల్ అనిపించుకునేలా అందనంత స్థాయిలో సెటిల్ అయ్యాడు. వైఫల్యాలను హ్యాండిల్ చేయడం అంటే ఇది బ్రో అని చెబుతున్నాడు అతడు. నెట్టింట తెగ వైరల్గా మారింది అతడి సక్సెస్ స్టోరీ.అతడే ఫ్లట్టర్ యువర్ వే వ్యవస్థాపకుడు కార్తీకే సింగ్. తన స్టోరీని సోషల్ మీడియాలో ఎక్స్లో షేర్ చేసుకున్నాడు. వింటే కచ్చితంగా వాటే సక్సెస్ స్టోరీ అంటారు. 16 ఏళ్ల వయసులో ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్నాడు. అది మిస్. సర్తే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు..అది కూడా ఫెయిల్. స్నేహితులంతా క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలక్ట్ అయిపోతుంటే..కార్తీక్కి మాత్రం రిజెక్ట్లే ఎదురయ్యేవి. మెక్రోసాఫ్ట్ నుంచి ఆటోడెస్క్ వరకు అన్ని నో చెప్పాయి. హాస్టల్ రూమ్లో స్నేహితులంతా జాబ్ కొట్టేశామన్న ఆనందంతో పార్టీలు చేసుకుంటే..తాను మాత్రం బెడ్పై పడుకుని..వందోసారి జాబ్ పోర్టల్స్ రిఫ్రెష్ చేస్తున్నా అని పోస్ట్లో రాసుకొచ్చాడు కార్తీక్. అనుకోకుండా ఒక రాత్రి ఇన్స్టాగ్రామ్లోఒక ఫ్రీలాన్సర్ని చూశాడు. ఆన్లైన్లో పనిచేస్తూ..స్థిరమైన ఆదాయం అందుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని చూసి..అతడితో సంభాషించాడు. అదే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. కార్తీక్ అతడిలా ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన, లైక్లు, సందేశాలు రాలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత నాకు సహాయం చేయగలరా అనే మెసేజ్ వచ్చింది. ఇది అతని తొలి ప్రాజెక్ట్. అందుకు అతనికి రూ. 3000 వేతనం పొందాడు. ఆ ప్రారంభ ప్రాజెక్ట్ క్రమంగా పెరిగింది. అలా క్లయింట్లురావడం ప్రారంభించారు, ప్రాజెక్టులు రేట్లు పెరిగాయి. చివిరకి ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన ఏజెన్సీని నడుపుతూ నెలకు దాదాపు రూ. 6 లక్షల మేర ఆదాయం అందుకుంటున్నాడు. ఇన్ని వైఫల్యాలు చూసిన తానే ఇంతలా సక్సెస్ని అందుకుంటే..మీరు కూడా కచ్చితంగా సాధించగలుగుతారు అని పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసులను తాకడమే కాదు..కార్తీక్ చేసిన ప్రయత్నాలకు ప్రశంసిస్తూ..ఏమి చేయలేని పరిస్థితిలో కూడా సానూకూల దృక్పథం, ఆశను వదులకోకూడదని చెబుతున్న మీ స్టోరీ చాలా స్ఫూర్తిని రగిలిస్తోందని అని పోస్టులు పెట్టారు.At 16, all I wanted was IIT.Didn't happen.At 20, all I wanted was a job offer.That didn't happen either.Microsoft said no.Autodesk said no.Everyone said no.Lying on my hostel bed, watching my friends celebrate placements while I refreshed job portals for the 100th time.…— kartikey singh (@askwhykartik) October 26, 2025 (చదవండి: ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్లోనే అత్యంత ధనిక దేశం..) -
బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ దీపావళి కానుక ఇపుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది. సిబ్బందికి దివాలీ కానుకకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది బిగ్బీ దివాలీ గిఫ్ట్కు మెచ్చుకోగా, మరికొందరు ఆయన కానుకపై నిరాశగా పెదవి విరిచారు. సిగ్గు చేటు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... బిగ్బీ తన సిబ్బందికి దీపావళి కానుకగా రూ.10,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారంటూ ముంబైలోని అమితాబ్ నివాసం జుహూ వద్ద ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ అతిపెద్ద నటుడు అమితాబ్ బచ్చన్ తన ఇంటి సిబ్బందికి ,భద్రతా సిబ్బందికి రూ. 10,000 నగదు , ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు అనే క్యాప్షన్తో ఈ వీడియోనే షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ఈ వీడియో వేలాది వీక్షణలతోపాటు నెటిజన్లలో చర్చకు దారితీసింది. పండుగ సీజన్లో తన ఉద్యోగులను ప్రశంసించినందుకు కొందరు అమితాబ్ను ప్రశంసించారు. మరికొందరు బిగ్బి లాంటి వాళ్ల స్థాయికి, ఆస్తులతోపోలిస్తే ఇది "చాలా తక్కువ" ,"ఇది చాలా విచారకరం అనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరైతే, రోజంతా మీ భద్రకోసం, మీకోసం కాపలాకాసే వారికి కేవల 10వేల రూపాయలా, సిగ్గు చేటు, దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి రెట్టింపు జీతం ఇవ్వాలి. కొంతమంది 20-25 వేలు బోనస్గా కూడా ఇస్తారు" అంటూ స్పందించారు. పలు కంపెనీలు, కార్పొరేట్లు తమ కార్మికులకు లగ్జరీ దీపావళి కానుకలు, హ్యాంపర్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సమయంలో ఈ ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది. View this post on Instagram A post shared by Sagarthakurvlog (@sagar.thakur84)నోట్: ఈ వీడియోలో అమితాబ్ క్లిప్లో పలువురు సిబ్బంది, భద్రతా సిబ్బంది బహుమతులు అందుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు. -
ట్రావెల్ కా ముహూరత్ రేపటి నుంచి..
సంవత్సరాంతంలో పర్యటనలను ప్లాన్ చేసుకునే టూరిస్టుల కోసం ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ ‘ట్రావెల్ కా ముహూరత్’ పేరిట సరికొత్త కాన్సెప్ట్ అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా, విమానాలు, హోటల్ వసతులు, హాలిడే ప్యాకేజీలు, గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్, పర్యటనలు, ఇతర ఆకర్షణీయ సేవలతో పాటు వీసా, ఫారెక్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి ప్రయాణ నిత్యావసరాలను కలిపి ఒకే గొడుగు కింద అందించనుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ రాజేష్ మాగోవ్ తెలిపారు. తమ ‘ట్రావెల్ కా ముహూరత్’ ప్రారంభ ఎడిషన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. సంవత్సరాంతం (డిసెంబర్)లో ఛార్జీలు పెరుగుతాయని భావించే పర్యాటకులు ముందుగా తమ పర్యటనలను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. (చదవండి: రిటర్న్ గిఫ్ట్.. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్..) -
రిటర్న్ గిఫ్ట్.. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్..
భాగ్యనగరవాసులకు ఆనంద ప్రతిబింబాలు అందించాలనే థీమ్తో ఇనార్బిట్ మాల్ రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్ అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా మాల్లో ఆకర్షణీయమైన అలంకరణలు, సృజనాత్మక వర్క్షాప్లు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ ఇన్స్టాలేషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇనార్బిట్ మాల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోపాలని మాట్లాడుతూ.. ఇది కేవలం షాపింగ్ గురించి కాదు, ప్రజలంతా ఒకే సమాజంలో భాగమై, కలిసి ఎదిగి, కలిసి సంబరాలు జరుపుకోవడం గురించిన అంశమని పేర్కొన్నారు. రెండు దశాబ్దాల్లో ఇనార్బిట్ అనేక వ్యక్తిగత కథలకు, నవ్వులకు, కుటుంబ సంప్రదాయాలకు వేదికగా మారింది. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్తో ఆ భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాల్లో ఏర్పాటు చేసిన కళాత్మక ఇన్స్టాలేషన్లు, యాక్టివేషన్లు ఆ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూపొందించినట్లు తెలిపారు. (చదవండి: అక్కడ సౌందర్య చికిత్సలు.. ఇక్కడ పేషెంట్స్గా..!) -
అక్కడ సౌందర్య చికిత్సలు.. ఇక్కడ పేషెంట్స్గా..!
ఏదైనా అనుభవంలోకి వస్తేకానీ తెలియదంటారు పెద్దలు.. అలాంటి అనుభవాలు ప్రస్తుతం నగరంలోని సౌందర్య పోషకులకు ఆశాభంగాన్ని కలిగిస్తున్నాయి.. సౌందర్య చికిత్సలకు పేరొందిన టర్కీలో నకిలీ చికిత్సల విజృంభణ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో రివిజన్ కేసులు కూడా పెరిగాయంటున్నారు హైదరాబాద్ నగర వైద్యులు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని శారీరక లోపాలను సవరించుకోవాలని, అందమైన రూపాన్ని అందుకోవాలని ఆశించే కొందరు భాగ్యనగర వాసులకు కేవలం ఆశాభంగం మాత్రమే కాదు చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సౌందర్య చికిత్సలకు పేరొందిన అంతర్జాతీయ గమ్య స్థానం టర్కీకి వెళ్లి వన నగరవాసులకు ఇది అనుభవంలోకి వస్తోంది. గత కొంత కాలంగా సరసమైన సౌందర్య చికిత్సలకు కేరాఫ్గా ఉన్న టర్కీ.. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. బ్యూటీ ట్రీట్మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి ఇటీవలి కాలంలో రాకపోకలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టే వ్యూహాత్మక ప్రచారం కూడా ప్రభావం చూపింది. ఒక్క 2021లోనే ఆరు లక్షల 70వేల మందికి పైగా విదేశీయులు వైద్య చికిత్స కోసం టర్కీని సందర్శించారని ఆ దేశ ప్రభుత్వ యాజమాన్యంలోని అంతర్జాతీయ ఆరోగ్య సేవల ఏజెన్సీ తెలిపింది. ఒక సంవత్సరం తరువాత, ఆ సంఖ్య 1.25 మిలియన్లకు అంటే 88% పెరుగుదల చవి చూసింది. అలాగే 2023 మొదటి ఆరు నెలల్లో, గణాంకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో భారతీయుల వాటా కూడా ఎక్కువే. రిటర్న్.. రివిజన్.. చికిత్సల కోసం వెళ్లి టర్కీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచి్చన చాలా మంది నగరవాసులు చికిత్స దుష్ఫలితాలను సరిదిద్దుకోవడానికి నేరుగా సిటీలోని చర్మ నిపుణుల క్లినిక్ల వైపు వెళ్తున్నారు. విదేశాల్లో ముఖ్యంగా టర్కీలో – జుట్టు మార్పిడి, ఫేస్లిఫ్ట్లు, రైనోప్లాస్టీ, టమ్మీ టక్ వంటివి విఫలమైన తర్వాత ‘రివిజన్ కేసులు’ గణనీయంగా పెరుగుతున్నాయని నగర వైద్యులు చెబుతున్నారు. కనుబొమ్మ, బుగ్గ లిఫ్ట్ కోసం టరర్కీకి ప్రయాణించిన 49 ఏళ్ల నగర మహిళ ముఖ కవళికలు మారిపోవడంతో పాటు తల మీద ఇన్ఫెక్షన్తో బాధపడింది. ‘అక్కడ చికిత్స సందర్భంగా మరచిపోయిన కుట్ల వల్ల దీర్ఘకాలిక గాయం ఏర్పడింది’ అని ఆ తరువాత రోగికి చికిత్స చేసిన నగరానికి చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డి.అక్షిత రావు చెబుతున్నారు. నియంత్రణ లోపం.. ఆకర్షణీయ ప్యాకేజీలు.. దేశం నుంచి రోగులను ఆకర్షించడానికి వ్యూహాత్మక కాస్మెటిక్ ప్యాకేజీలను ప్రకటించింది. గతంలో ఇటువంటి ప్రక్రియల కోసం నగరం నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లేవారు. అక్కడ రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షల (లేదా అంతకంటే ఎక్కువ) మధ్య చెల్లించాల్సి వచ్చేది. అయితే టర్కీ ప్రచార ప్రభావంతో చికిత్సార్థులు టర్కీ వైపు మొగ్గు చూపారు. అక్కడ అదే ప్రక్రియ రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలలోనే లభిస్తుండడం దీనికి కారణసరైన నియంత్రణ లేకపోవడం వల్ల అనేక టర్కిష్ క్లినిక్లు లోపభూయిష్ట చికిత్సా విధానాలను అనుసరిస్తున్నాయని నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ బండా పేర్కొన్నారు. ‘అక్కడ చికిత్సలను తరచూ సర్టీఫైడ్ వైద్యులు కాకుండా అర్హత లేని సాంకేతిక నిపుణులు నిర్వహిస్తారు’ అని ఆయన ఆరోపించారు. చాలా మంది రోగులు శస్త్రచికిత్స తర్వాత, తమకు ఎటువంటి సరైన సహకారం అందడం లేదని కూడా చెబుతున్నారు. సోషల్ మీడియా టర్కీ డిమాండ్ను పెంచుతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను ఆకర్షించడానికి క్లినిక్లు వాట్సాప్ సందేశాలను పంపుతూ ప్రచారం చేస్తున్నారు. ‘టర్కీ నుంచి ముందు–తర్వాత ఫలితాలను ప్రదర్శించే ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్లు డిమాండ్ సృష్టిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా.. టర్కీలో నిర్వహించే కాస్మెటిక్ సర్జరీ వల్ల కలిగే సమస్యల గురించి జర్మనీ ప్రజారోగ్యసంస్థ, రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ టర్కీలో బొటాక్స్ ఉదర చికిత్స తర్వాత దాదాపు 27 మంది రోగుల్లో కండరాల బలహీనత, అస్పష్టమైన దృష్టి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కొన్నిసార్లు పక్షవాతం వంటి తీవ్రమైన దు్రష్ఫభావాలను సైతం కలిగించిందని వెల్లడించింది. అలాగే గత జనవరిలో బ్రిటన్కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి బట్ లిఫ్ట్ కాస్మెటిక్ సర్జరీ కోసం ఇస్తాంబుల్కు వెళ్లి నాలుగు రోజుల తర్వాత ప్రాణాంతక గుండెపోటుకు గురయ్యారని బ్రిటిష్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ధర కన్నా నాణ్యత, ఆరోగ్య భద్రతకు మాత్రమే నగరవాసులు ప్రాధాన్యత ఇవ్వాలని నగర వైద్యులు సలహా ఇస్తున్నారు. టర్కీలో చికిత్స పొందేందుకు ఆసక్తి ఉన్న ఎవరైనా వైద్యుల అర్హతలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, యూరోపియన్ ప్రమాణాల ప్రకారం వైద్యుడు లేదా క్లినిక్ థృవీకరణ ఉందా? లేదా! అని తనిఖీ చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు. (చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!) -
Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కటెముక గాయంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత చిన్నగాయంలా అనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సాధారణంగా ఆటగాళ్లు మైదానంలో గాయపడటం సహజమే. కానీ కొన్ని గాయాలు మాత్రం ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ శ్రేయస్ ఎదుర్కొంటున్న పక్కటెముక గాయం అంత తీవ్రతరమైనదా..? అసలేంటి గాయం వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.పక్కటెముక గాయం అంటే..ఈ గాయం ఎక్కువగా కారు ప్రమాదాలు, క్రీడల్లోనూ జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. మరికొన్ని ఇతర గాయాల వల్ల కూడా ఈ పక్కటెముకల గాయం సంభవిస్తుందట. ఒక్కోసారి ఎలాంటి గాయం అవ్వకుండానే పక్కటెముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అంతర్గత అవయవాలు దెబ్బతీస్తే తప్ప పక్కటెముక గాయం సివియర్ అవ్వదని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ చేయడం అనేది కూడా అరుదు అని. చెబుతున్నారు. పక్కెటెముకల మధ్య పగుళ్లు వస్తే..తగిన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు, చికిత్స అవసరం అవుతాయని, కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందటని చెబుతున్నారు వైద్యులు. పక్కటెముక విరిగితే..పక్కటెముక విరగడాన్ని వైద్య పరిభాషలో సాధారణంగా ఎముక తప్పిందని(స్థానభ్రంశం) చెబుతుంటారు. ఇలా ఎముక విరిగినప్పుడూ చుట్టు పగులు, ఖాళీ ఏర్పుడుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి ఒక్కటే సరిపోదట. దాన్ని సరిచేసేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు. అలాగే ఇవి విరగడం అనేది కూడా అత్యంత అరుదేనట. ఎందుకంటే పెద్దపెద్ద యాక్సిడెంట్లు, లేదా ఆటల్లోనే ఇలాంటి గాయాల బారినపడే అవకాశం ఉంటుందట. ఇవి మన శరీరంలోని బలమైన ఎముకల్లో ఒకటి కావడంతో అంత సులభంగా గాయలవ్వడం అత్యంత అరుదని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..శ్వాస తీసుకున్న, దగ్గినా, ఛాతీ పైభాగాన్ని కదిలించిన త్రీమైన నొప్పిముట్టుకున్న తట్టుకోలేనంత నొప్పి, వాపుగాయం లేదా రంగు మారడంవామ్మో.. మరీ అంత డేంజరా? అంటే..పక్కటెముకలు గాయం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయట. అప్పుడు ఇతర అంతర్గత అవయవాలైనా.. గుండె, కాలేయం, కడుపు, మూత్రపిండాలు, ప్లీహాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. దీనివలన రక్తస్రావం కూడా జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. ఫలితంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఊపిరితిత్తులు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!) -
సన్నజాజిలా స్లిమ్గా అవ్వాలంటే..!
బరువు తగ్గే టాస్క్ని చాలా సింపుల్గా స్మార్ట్గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ ఎంతలా బొద్దుగా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి అమ్మాయి చాలా సన్నగా నాజుగ్గా అయిపోయింది. మాములు మార్పు కాదు..నమ్మశక్యం కానంత సన్నగా మారింది. అలాగని ఆమె ఏమి షార్ట్కట్స్ ఫాలో అవ్వలేదు. పైగా ఎలాంటి కఠినమైన డైట్, బరువు తగ్గిపోయే మందలు ఉపయోగించలేదు. కాస్త తెలివిగా స్మార్ట్గా తిని జస్ట్ ఆరు నెలల్లో 27 కిలోలు పైనే బరువు తగ్గిందామె. అందుకోసం డెడికేషన్తో దినచర్యను అనుసరిస్తే చాలంటోంది. దాంతోపాటు జంక్ఫుడ్ని పూర్తిగా మానేయకపోయినా..పరిమితం చేస్తే సరిపోతుందంటోంది. పోషకాహారాన్నితీసుకునేలా ప్లాన్ చేస్తే చాలట. అందుకోసం తాను ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సిమర్. నేచురల్గా సన్నగా మారడం కోసం..సంపూర్ణ ఆహారాలు: ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చేపలు, గుడ్లు వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవాలట. ఇవి కడుపు నిండిన అనుభూతినిచ్చే అధికంగా తినాలనే కోరికను నివారిస్తాయట. మంచి నిద్ర: శరీరం బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అని నొక్కి చెప్పిందామె. భోజనం తర్వాత వాకింగ్: మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి భోజనం తర్వాత కనీసం పదినిమిషాలు నడవాలని సూచించిందామె. చీట్ మీల్స్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ..వారాంతాల్లో చీట్మీల్స్ కూడా ఉంటాయని చెప్పింది సిమర్. అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే భోజనాన్ని సిద్ధం చేసుకుంటానని అంటోంది. అన్నింట్లకంటే ఏర్పరుచుకున్న టార్గెట్ని బ్రేక్ చేయకుండా..స్థిరంగా సాగితే..సత్వరమే మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది. అలాగే కార్బో హైడ్రేట్స్ కోసం మైదా, బ్రెడ్, ఉడికించిన బియ్యానికి దూరంగా ఉండేదట. అలాగే బయటకు వెళ్తే..కేలరీలు ఉండే పానీయాలను తీసుకుంటుందట. ఎందుకంటే అవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయట. అంతేగాదు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడే మరో నాలుగు టెక్నిక్ కూడా చెప్పారామె. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) అవేంటంటే..అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్కృత్రిమ చక్కెరవారానికి మూడు నుంచి నాలుగుసార్లు కోర్ శిక్షణప్రతి రోజు 8 వేలకు పైగా అడుగులు తప్పనిసరి అంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్తో బరువు తగ్గించే జర్నీని తక్షణమే ప్రారంభించండి అంటోంది సిమర్. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..) -
శివసేన నేతతో నటి ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల వెడ్డింగ్ బెల్స్ జోరుగా మోగుతున్నాయి. రానున్న వెడ్డింగ్ సీజన్కు తగ్గట్టుగా అందరూ మూడుముళ్ల వేడుకకు రెడి అవుతున్నారు. తాజాగా మరాఠీ నటి తేజస్విని లోనారి , శివసేన నేత సమాధన్ సరవంకర్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్మీడియాలో పంచుకోవడంతో నెట్టింట సందడి నెలకొంది.శివసేన పార్టీ యువతనేత సమాధన్ సరవంకర్ సీనియర్ నేత సదా సర్వాంకర్ పెద్ద కుమారుడు. తేజస్విని లోనారి -సమాధన్ సరవంకర్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. కుటుంబం సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. అటు పార్టీ అభిమానులు, ఇటు ఫ్యాన్స్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి జంట అంటూ వీరికి అభినందనలు వెల్లువెత్తాయి.తేజస్విని ఎంబ్రాయిడరీ ,జరీ వర్క్తో కలగలిసిన అందమైన ఎరుపు సాంప్రదాయ చీరలో అందంగా మెరిసింది. దీనికి తగ్గట్టు ఆభరణాలు, చేతినిండా గోరింటాకుతో పెళకళతో ఉట్టిపడేలా కనిపించింది. అటు ఎంబ్రాయిడరీ , సీక్విన్ వర్క్తో తయారు చేసిన వైట్ షార్ట్ షేర్వానీలో సమాధన్ శరవంకర్ అందంగా కనిపించాడు.మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి తేజస్విని. అనేక టీవీ మరాఠీ సీరియల్స్లో నటించి తనదైన ముద్ర వేసింది. మరోవైపు, సమాధాన్ సారవంకర్ శివసేనకు చెందిన చురుకైన యువ నాయకుడు. ముంబై రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సమధాన్ తండ్రిసదా శరవంకర్ మహీం నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం షిండే గ్రూపురాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. -
ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..
రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ ఎప్పటికప్పుడు తనదైన ఫ్యాషన్ సిగ్నేచర్తో కనిపిస్తుంటారామె. అటు తన వ్యాపార సామ్రాజ్యంలో తనైదైన పాత్ర పోషిస్తూనే.. ఇటు ఫ్యాషన్ పరంగా బాలీవుడ్ దిగ్గజ నటులకు తీసిపోని లుక్లో మెరుస్తుంటారామె. అందులోనూ అంబానీ కుటుంబికులు ధరించే వస్తువులు అత్యంత లగ్జరియస్ గానూ, చారిత్రాత్మకంగా పేరుగాంచిన అమూల్యమైన ఆభరణాలు తప్పక ఉంటాయి. ఈ ఏడాది దివాలీ వేడుకలకు ఇషా సన్నద్ధమైన అందమైన లుక్కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఇషాకి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నమ్రతా సోని మేకప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. “అత్యంత అందమైన ఇషా అంబానీతో దీపావళి,” అనే క్యాప్షన్ని జోడించి మరి ఈ వీడియోని పోస్టు చేసింది నమ్రతా సోని. దీపావళి వేడుకల కోసం ఇషాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వీడియోని షేర్ చేసింది. ఈ వేడుకల కోసం ఇషా డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన రంగురంగుల పట్టు చీరను ధరించింది. ఆ చీరలో రాజవంశస్థురాలి మాదిరి దర్పంతో వెలిగిపోతుందామె. ఈ ఎథ్నిక్ చీరకి రూబీ, డైమండ్, ముత్యాలతో పొదిగిని ఆభరణాన్ని జత చసింది. పూల ఆకారంలో ఉన్న నెక్లెస్ ఇషాని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేలా చేసింది. అందుకు తగ్గ చెవిపోగులు, బ్రాస్లెట్లతో ఫ్యాషన్కే అర్థం చెప్పేలా అత్యంత అద్భుతంగా ఉందామె లుక్. అందులోనూ ఆ ఆకుపచ్చని చీరకు అత్యంత కాంట్రాస్టింగ్గా ధరించిన ఎరుపు చీర ఆమె లుక్ మరింత అందంగా ఆకర్ణణీయంగా కనిపించేలా చేసింది. కాగా, ఇషా అంబానీ తన సోదరుడు ఆకాష్ అంబానీలతో కలిసి తన పుట్టినరోజు వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులంతా కదిలివచ్చి మరి సందడి చేశారు. View this post on Instagram A post shared by namratasoni (@namratasoni) (చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
కిడ్నీ మార్పిడి సురక్షితమేనా? అందువల్లే నటుడు సతీష్ షా కూడా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..నెఫ్రాలజిస్ట్లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తిట్రాన్స్ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.డయాలసిస్తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయిమునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారటనష్టాలు..అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట. అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట. రెండిటిలో ఏది మంచిదంటే..డయాలసిస్లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ప్రతిరోజూ మిల్లెట్ భోజనం..
దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తీ రోజుకు ఒక మిల్లెట్ భోజనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘వన్ మిల్లెట్ మీల్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ ఇండివీడ్యువల్’ అనే జాతీయ మిషన్లో భాగంగా మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బేగంపేట ఎస్జే ఫారŠూచ్యన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్లోని వివిధ కార్పొరేట్ ఆఫీసులను శిక్షణ పొందిన ‘మిల్లెట్ మదర్స్’తో అనుసంధానం చేసి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన మిల్లెట్ భోజనాలను అందించనుంది. ఈ కార్యక్రమం మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్, ఎంబీఎఫ్ (మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్) సంయుక్తంగా నిర్వహించిన మిల్లెట్ మదర్స్ ప్రోగ్రాంకు కొనసాగింపుగా ప్రారంభించారు. ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా నటి లయ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 100 మంది మిల్లెట్ మదర్స్కు శిక్షణ ఇచ్చారు. వీరు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 20కి పైగా మిల్లెట్ వంటకాలు తయారు చేసే నైపుణ్యాన్ని సంపాదించారు. ఈ శిక్షణను నేషనల్ మిల్లెట్ కోచ్ పూజా లకోటియ ఆధ్వర్యంలో డాక్టర్ మోనికా శ్రవంతి, డాక్టర్ గిరిధర్, మిల్లెట్ మదర్స్ కో–ఆర్డినేటర్ మాధురి సహకారంతో నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే బాగా ఆలోచిస్తారు, పనిచేస్తారు, జీవిస్తారని ఎంబీఎఫ్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ సరకడం అన్నారు. మిల్లెట్ మదర్స్ కార్యక్రమం ద్వారా అందించే ప్రతి భోజనం మహిళలను శక్తివంతం చేస్తుందని తెలిపారు. (చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!) -
ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..
నగరం.. ఫ్యాషన్కి.. కొత్త ట్రెండ్స్కి కేంద్ర బిందువు. అయితే దీనిని పాటించడానికీ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి.. అయితే ఆ సెన్స్ నాన్సెన్స్ కాకూడదని పలువురు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాషన్, ట్రెండ్ పేరుతో ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగిస్తూ.. వాటిని భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే ఈ డంప్ ప్రకృతిపై ప్రభావం చూపుతోంది.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే 9,000 టన్నుల వ్యర్థాల్లో 800 టన్నులు ఫ్యాషన్, వ్రస్తాలే ఉంటున్నాయని అంచనా.. వీటిలో చాలా వాటిని రీసైకిల్ చేయకుండానే డంప్ చేస్తున్నారని, ఇది పర్యావరణానికి ఓ సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగించేవారు రీసైకిల్/ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను వినియోగించడం ఓ జీవన విధానంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.యువతలో పెరుగుతున్న ఫాస్ట్ ఫ్యాషన్ ధోరణి పర్యావరణానికి ప్రధాన సవాలుగా మారుతోంది. అధునాత జీవనశైలి పేరుతో మనం ధరించే ప్రతి ఉత్పత్తి వెనుక ఎకో ఫ్రెండ్లీ సూత్రం దాగుంది. దానిని గ్రహించి ఉత్పత్తులు ఎంపిక చేసుకుంటే.. అటు ప్రకృతికి.. ఇటు భవిష్యత్తు తరాలకు మేలుచేసినట్లవుతుంది. ఇందుకు సామాజిక బాధ్యతతో పాటు.. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానం అలవర్చుకోవాలని నినదిస్తున్నారు. సింథటిక్ ఫ్యాబ్రిక్తో సమస్య.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా కొత్త దుస్తులు కొనడం, తరచూ ట్రెండ్స్ మార్చుకోవడం అలవాటుగా మారింది. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పరిమాణం భారీగా పెరిగింది. ఇది అధిక వ్యర్థాలకు దారి తీస్తోంది. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కర్బన ఉద్గారాలకు, 20 శాతం నీటి కాలుష్యానికీ కారణమవుతోంది. ఒక జీన్స్ తయారీకి సగటున 7,000 లీటర్ల నీరు అవసరమవుతుందంటే కాలుష్యం తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. రీ యూజ్, రీ సైకిల్ పరిష్కారం.. గతంలో ఏ వస్తువునైనా పూర్తిగా వినియోగించి, రిపేర్ చేసుకొని, తదుపరి తరానికి అందించే అలవాటు మన సంస్కృతిలో ఉండేది. అదే ‘స్లో ఫ్యాషన్’ భావన. నాణ్యమైన, దీర్ఘకాల మన్నిక కలిగిన వ్రస్తాలు వాడటం, వాడిన వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు. హైదరాబాద్లో ఇటీవల ఔత్సాహిక యువత, స్టార్టప్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ‘థ్రిఫ్ట్ మార్కెట్స్’ నిర్వహించి వాడిన దుస్తులను మళ్లీ అమ్మడం లేదా ఇతరులకు వితరణ చేయడం మొదలైంది. ఈ కల్చర్ ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలు తగ్గుతాయి. సెలబ్రిటీలు కూడా ఈ మార్పుకు తోడ్పడుతున్నారు. నటి సమంతా ఆ మధ్య ఓ ఈవెంట్లో ‘రీయూజ్ వస్త్రాలు కూడా నా ఫ్యాషన్ స్టేట్మెంట్’ అని చెప్పడం ఆహా్వనించదగ్గ పరిణామం. మోతాదుకు మించి.. హైదరాబాద్లో టైMð్ట్సల్ వేస్ట్ మోతాదుకు మించుతోంది. జీహెచ్ఎంసీ ల్యాండ్ఫిల్ ప్రాంతాల్లో రోజూ వందల టన్నుల పాత దుస్తులు, ఫ్యాబ్రిక్ డంప్ చేస్తోంది. వీటిలో 40 శాతం రీసైకిల్ చేయగలిగినవే అయినా, అవగాహన లేక నేరుగా భూమిలోకి వెళ్తున్నాయి. నిత్యం 720 నుంచి 800 టన్నుల టెక్స్టైల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. సింథటిక్ ఫ్యాబ్రిక్లో ఉన్న నైలాన్, పాలిస్టర్ వంటి పదార్థాలు సహజంగా కరగవు. వీటి నుంచి విడుదలయ్యే మైక్రోఫైబర్లు నీటిని కలుషితం చేస్తున్నాయి. వ్రస్తాల్లో ఉపయోగించే రసాయనాలు, సింథటిక్ కలర్స్ చర్మవ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు..హ్యాండ్లూమ్, ఖాదీ, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ వంటి దేశీయ ఉత్పత్తులు పర్యావరణానికి కాస్త సహాయకారిణిగా ఉంటాయి. ఇవి సహజంగా భూమిలో కరిగిపోతాయి. రసాయనాల మోతాదు తక్కువగా ఉంటుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇక్కత్ శారీస్, నారాయణపేట ఫ్యాబ్రిక్స్, మంగళగిరి కాటన్ వంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాక, కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా అవసరాన్ని బట్టి దుస్తులు కొనడం, మన్నికైన, నాణ్యమైన ఫ్యాబ్రిక్ ఎంపిక చేయడం, వాడిన బట్టలను దానం చేయడం, రీసైకిల్ సెంటర్లకు ఇవ్వడం..వంటి మార్పుకు నాంది పలకాలి. -
దుబాయ్ పర్యాటక శోభ..!
ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం బుర్జ్ ఖలీఫా. టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్స్ ఎయిన్ దుబాయ్. గోల్డెన్ టూరిజమ్ స్పాట్ మిరకిల్ గార్డెన్. ప్రపంచదేశాల కలబోత గ్లోబల్ విలేజ్. దుబాయ్ నిర్మాణ కీర్తికిరీటం బుర్జ్ ఖలీఫా. హిందూ పౌరాణిక శిల్పగ్రంథం బాప్స్ మందిరం. ద్వైపాక్షిక స్నేహబాంధవి షేక్ జాయేద్ మసీదు. ఇదీ మా దేశం... అని చూపించే దుబాయ్ ఫ్రేమ్. ఆహ్లాదకర సాయంత్రానికి థో క్రూయిజ్ విహారం. సాంస్కృతిక వేడుకల మధ్య ఎడారి అన్వేషణం. దుబాయ్ టూర్లో శోభాయమాన సొగసులివి.1వరోజుఉదయం ఏడు గంటలకు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టూర్ నిర్వహకులకు రి΄ోర్ట్ చేయాలి. విమానం పది గంలకు బయలుదేరి 12.25కి దుబాయ్కి చేరుతుంది. ఎయిర్΄ోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర టూర్ నిర్వహకులు (దుబాయ్ టీమ్) రిసీవ్ చేసుకుని లంచ్, ఆ తర్వాత బస చేయాల్సిన హోటల్కు తీసుకువెళ్తారు. హోటల్ గదిలో చెక్ ఇన్ అయ్యి కొద్ది సేపు విశ్రాంతి. సాయంత్రం ధో క్రూయిజ్లో విహారం, రాత్రి డిన్నర్ క్రూయిజ్లోనే. క్రూయిజ్ విహారం తర్వాత హోటల్ గదికి చేరుస్తారు.క్రూయిజ్ విహారంపర్షియన్ గల్ఫ్లో క్రూయిజ్ విహారం దుబాయ్ టూర్లో నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. దుబాయ్లో విస్తరించిన ఆకాశహర్మ్యాలను ఆసాంతం వీక్షించాలంటే దుబాయ్ వీథుల్లో ఎంత తిరిగినా పూర్తిగా చూడలేం. క్రూయిజ్లో నీటి మీద నుంచి నేలను చూడాలి. నింగి–నేలను తాకుతున్నట్లున్న నిర్మాణాలు కనువిందు చేస్తాయి. ఎయిర్ కండిషన్డ్ క్రూయిజ్లో దాదాపు మూడు గంటల పాటు సాగే విహారంలో బఫే భోజనం, డాన్స్ షోలను ఆస్వాదించడం గొప్ప అనుభూతి. డిన్నర్లో కాంటినెంటల్, అరబిక్ వంటకాలు నోరూరిస్తాయి. మాంసాహారంతోపాటు శాకాహార వంటకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి. దుబాయ్లో క్రూయిజ్ విహారానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం అనువుగా ఉంటుంది. అందమైన సాయంత్రాలు, ఫ్రెండ్స్తో గెట్ టు గెదర్లకు ధరించినట్లు క్రూయిజ్ విహారానికి ఆహ్లాదకరమైన దుస్తులు ధరించాలి. లైట్ కలర్, ఫ్లోరల్ డిజైన్లయితే స్కై స్క్రాపర్స్, డాన్స్ షో బ్యాక్డ్రాప్లో ఫొటోలు అందంగా వస్తాయి. 2వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్. ఎయిన్ దుబాయ్ (వరల్డ్స్ టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్స్ అడ్మిషన్) వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో భోజనం. ఆ తర్వాత డెసర్ట్ సఫారీకి ప్రయాణం. డెజర్ట్ సఫారీలోనే రాత్రి భోజనం చేసి రాత్రి బసకు హోటల్కు చేరాలి.జెయింట్కే జెయింట్ఎయిన్ దుబాయ్ కొత్త టూరిస్ట్ అట్రాక్షన్. ప్రపంచంలో అత్యంత పెద్ద అబ్జర్వేషన్ వీల్ అది. సాధారణ భాషలో చె΄్పాలంటే జెయింట్ వీల్లకే జెయింట్ వీల్. కరోనాకు ముందు దుబాయ్ పర్యటనకు వెళ్లిన వాళ్లు దీనిని చూసి ఉండరు. నాలుగేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకుంది. 850 అడుగుల ఎత్తున్న ఈ వీల్లో ఒకసారి 1,750 మంది కూర్చుని ఆకాశ విహారం చేయవచ్చు.ఎడారిలో పాదముద్రలుఓ గంటపాటు వాహనంలో విహారం, ఆ తర్వాత ఒంటె మీద విహారం, క్యాంప్ గుడారాల్లో విశ్రాంతి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ల వీక్షణం, బఫే భోజనాన్ని ఆస్వాదించడం లైఫ్టైమ్ మెమొరీ అనే చెప్పాలి. ఎడారిలో విహారం అనగానే వడగాలి వస్తుందని భయపడతాం. కానీ నవంబర్ నుంచి సాయంత్రాలు ఇసుక తిన్నెల మీద నుంచి చల్లని పిల్లగాలులు వీస్తూ విహారం ఆహ్లాదకరంగా సాగుతుంది. పగలు గాలికి ఇసుక పైకి లేస్తూ ఒంటిని తాకి కొంత సేపటి తర్వాత చికాకు పెడుతుంది. కానీ చలికాలం సాయంత్రాలు ఇసుక కూడా బరువుగా నేల మీదే ఉంటుంది. ఇసుకలో పాదముద్రలను చూసుకుంటూ నడవాలనే సరదా కూడా తీరుతుంది. 3వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత మిరకిల్ గార్డెన్లో విహారం, గ్లోబల్ విలేజ్ వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ తర్వాత బుర్జ్ ఖలీఫా విజిట్. సాయంత్రం లైట్ షో, రాత్రి భోజనం తర్వాత రాత్రి బస కోసం తిరిగి హోటల్కు చేరడం.ఎడారి పూదోటదుబాయ్ మిరకిల్ గార్డెన్ నిజంగానే ఓ అద్భుతం. పైగా ఇది ప్రపంచంలో అతి పెద్ద ఉద్యానవనం. దుబాయ్ వంటి ఎడారి దేశంలో రంగురంగుల పూలతో 72 వేల చదరపు మీటర్ల పూలతోట ఒక ఆశ్చర్యం. కోట్లాది మొక్కలు, పూలతో స్వర్గంలో విహరిస్తున్న భావన కలుగుతుంది. ఈ గార్డెన్ 2015లో గోల్డెన్ టూరిజమ్ అవార్డు కూడా అందుకుంది.దుబాయ్లో ఇండియాదుబాయ్ గ్లోబల్ విలేజ్, పేరుకు తగ్గట్టే ప్రపంచదేశాలను ప్రతిబింబిస్తున్న గ్రామం. ఆఫ్గనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కువైట్, లెబనాన్, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ దేశాల సంస్కృతి సంప్రదాయాలు కొలువుదీరాయి. సరాసరిన రోజుకు 40 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారు. 20 వేలకు పైగా వాహనాలను పార్కింగ్ చేయగలిగినంత పార్కింగ్లాట్ అది.దుబాయ్ కీర్తిశిఖరందుబాయ్ కీర్తికిరీటంలో కలికితురాయి వంటిది బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం కూడా. దీని ఎత్తు 2,722 అడుగులు. యాంటెన్నాతో కలుపుకుంటే దీని ఎత్తు 2,717 అడుగులు. ఇది 163 అంతస్థుల భవనం. ఈ భవనం మీద నుంచి పరిసరాలను వీక్షించడానికి వీలుగా 124, 125, 148వ అంతస్థుల్లో అబ్జర్వేషన్ డెక్లున్నాయి. ఇంకా పైకి వెళ్లి ప్రశాంతంగా సమయం గడుపుతూ వీక్షించడానికి 152, 153, 154 అంతస్థుల్లో విశాలమైన లాంజ్లున్నాయి. వీటికి వరల్డ్స్ హైయ్యస్ట్ లాంజ్లుగా రికార్డు కూడా ఉంది. ప్రపంచ పటంలో దుబాయ్కి గొప్ప స్థానం కల్పించాలనే ఉద్దేశంతో జరిగిన నిర్మాణాలు దుబాయ్ ప్రపంచ రికార్డుల జాబితాను పెంచేశాయి. బుర్జ్ ఖలీఫాకి పాతికకు పైగా అవార్డులున్నాయి. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్. బీపీఏఎస్ టెంపుల్ దర్శనం. ఫెరారీలో ఫొటో షూట్. షేక్ జాయేద్ మాస్క్ వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత హోటల్లో డ్రాప్ చేస్తారు.దుబాయ్ హైందవంశిల్పశాస్త్రం చెప్పిన నియమానుసారం నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 27 ఎకరాలను బహూకరించింది. ఇది 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు నిర్మాణం. స్థపతుల బృందం భారతదేశం నుంచి వెళ్లి నిర్మించింది. ఆలయంలో ప్రతి అంగుళమూ పౌరాణిక గ్రంథాల దృశ్యాలతో నిండి, శిల్పనైపుణ్యానికి అద్దం పడుతుంటుంది. కోణార్క్, రాణక్పూర్, దిల్వారా ఆలయాలు గుర్తు వస్తాయి. ఈ నిర్మాణం గత ఏడాది ‘బెస్ట్ కల్చరల్ ప్రాజెక్ట్‘ అవార్డు అందుకుంది.పెద్ద మసీదుషేక్ జాయేద్ మసీదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబిలో ఉంది. ఇది 30 ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం, దేశంలోకే పెద్ద మసీదు. రోజూ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఈ మసీదు పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, యూఏఈకి ఇతర దేశాలతో సుహృద్భావ సంబంధాలను కూడా ఏర్పరుస్తోంది. గతంలో బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్, యూఎస్ నుంచి జో బైడెన్, మన ప్రధాని నరేంద్రమోదీలు ఈ మసీదును సందర్శించారు. 5వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. దుబాయ్ ఫ్రేమ్ సందర్శన, లంచ్, షాపింగ్ తర్వాత ఆరున్నరకు టూర్ నిర్వహకులు పర్యాటకులను దుబాయ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు.గవాక్ష వీక్షణందుబాయ్ ఫ్రేమ్ అనేది ఒక వ్యూ పాయింట్. మన కోటలను సందర్శించినప్పుడు అంతఃపుర స్త్రీలు నగరాన్ని చూడడం కోసం, నగరంలో జరిగే కార్యక్రమాలను వీక్షించడం కోసం రాజమందిరాల్లో ఏర్పాటు చేసిన గవాక్షాలను చూస్తుంటాం. ఆ కిటికీ వ్యూ నగరమంతా కనిపించేటట్లు ఉంటుంది. దాదాపుగా అలాంటిదే ఇది కూడా. ఇక్కడి నుంచి చూస్తే దుబాయ్ సిగ్నేచర్ వ్యూ కనిపిస్తుంది. ఈ చట్రం నుంచి చూస్తే దుబాయ్లోని ఆకాశహర్మ్యాలన్నీ ఒక చోటకు చేర్చి దండకట్టినట్లు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఫొటో తీసుకుంటే దుబాయ్ అంతటినీ బ్యాక్డ్రాప్లో ఇముడ్చుకున్నట్లు ఉంటుంది. ప్రపంచంలో అది పెద్ద ఫ్రేమ్గా రికార్డు కూడా తన టూరిజమ్ ఖాతాలో జమ చేసుకుంది దుబాయ్. ‘ద స్లె్పండర్స్ ఆఫ్ దుబాయ్’ టూర్ తర్వాత ఈ ఫొటోలతో ఆల్బమ్ చేసుకుంటే... దుబాయ్ పర్యటనలో మధురానుభూతులను కూడా ఒక ఫ్రేమ్లో బంధించుకున్నవారవుతాం. ప్యాకేజ్లో ఏమేమి వర్తిస్తాయి?హైదరాబాద్ నుంచి దుబాయ్కి ΄ోను రాను విమాన టికెట్లు. త్రీ స్టార్ హోటల్ బస, నాలుగు రోజులు బ్రేక్ఫాస్ట్, ఐదు రోజులు లంచ్, నాలుగు రోజులు డిన్నర్. టూర్లో ఉదహరించిన సైట్సీయింగ్కి రవాణా, ఎంట్రీ టికెట్లు, లోకల్ టూర్ గైడ్ సౌకర్యం, మిరకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్, హాఫ్ డే దుబాయ్ సిటీ టూర్, అనీ దుబాయ్ దుబాయ్, గ్రాండ్ మాస్క్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫేమ్ వీక్షణం. క్రూయిజ్ జర్నీ, ఎనభై ఏళ్ల లోపు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్, దుబాయ్కి వీసా చార్జీలు, ఐదు శాతం టీసీఎస్.ఏమేమి వర్తించవు?ఎయిర్పోర్ట్లో చెల్లించాల్సి వచ్చిన అదనపు చార్జీలు (ఎక్స్ ట్రా లగేజ్ చార్జ్ వంటివి). డ్రైవర్, గైడ్లకు టిప్పులు, లాండ్రీ, మెనూలో లేని మద్యం వంటి ఇతర పానీయాలు. ఏయే డాక్యుమెంట్లు ఉండాలి!పాస్పోర్ట్ ఒరిజినల్. పాన్ కార్డ్. ఫొటో సాఫ్ట్కాపీ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి.బుకింగ్ కోసం సంప్రదించాల్సిన చిరునామా:జోనల్ ఆఫీస్, ఐఆర్సీటీసీ, 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫోర్డ్ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ. ఫోన్ నంబరు: 040–27702407.ఐఆర్సీటీసీ, నియర్ రైల్వె రిటైరింగ్ రూమ్స్, అప్ స్టైర్స్, స్టేషన్ బిల్డింగ్, విజయవాడ. ఫోన్ నంబరు: 92810–30714ఇది దుబాయ్ టూర్!ఐఆర్సీటీసీ దుబాయ్ పర్యటన కోసం డిజైన్ చేసిన ΄్యాకేజ్ పేరు ‘ద స్లె్పండర్స్ ఆఫ్ దుబాయ్’. ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఓ3. నవంబర్ 8వ తేదీన మొదలయ్యే ఈ ఐదు రోజుల టూర్లో దుబాయ్, అబూదాబీ కవర్ అవుతాయి.టికెట్ ధరలిలా:సింగిల్ ఆక్యుపెన్సీలో రూపాయలు 1,34, 950. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 1,13, 400. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 1, 12, 250 రూపాయలు.ప్రయాణం ఎప్పుడు?8–11–2025 ఉదయం పది గంటలకు ‘ఈకే–527’ విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. దుబాయ్కి 12.25 గంటలకు చేరుతుంది.12– 11– 2025 రాత్రి తొమ్మిదిన్నరకు దుబాయ్లో ‘ఈకే– 524’ విమానం బయలుదేరుతుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం) -
పాప భీతి.. దైవ ప్రీతి.. సంఘ నీతి
పాప భీతి, దెవప్రీతి, సంఘనీతి త్రయం. ఈ మూడే మన అంతరాత్మను వెలిగించే త్రివేణి సంగమం. అంతఃకరణసాక్షిత్వమే మనిషికి నిత్యమైన ధర్మం. ఈ ధర్మాన్ని నిలిపే త్రిశక్తులు: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. ఈ మూల విలువలు లోపించినప్పుడే వ్యక్తిగత జీవితంలో శాంతి నశించి, ప్రపంచం అపనమ్మకంతో నిండిపోతుంది.మనిషిని ధర్మబద్ధంగా నడిపించేవి ఈ మూడు: పాప భీతి (తప్పు పర్యవసానానికి భయం), దైవ ప్రీతి (విశ్వం పట్ల ప్రేమ), సంఘ నీతి (సామాజిక బాధ్యత). ఈ అంతర్గత విలువలు లోపించినప్పుడే, చట్టం చూడకపోయినా, ఎవరూ గమనించకపోయినా, మనిషి అవినీతికి, అన్యాయానికి పాల్పడతాడు. దీని పర్యవసానంగా, అంతఃకరణ శాంతి నశించి, ప్రపంచంలో నమ్మకం కొరవడుతుంది. పాప భీతి లేని ఒక వ్యా పారి, తక్షణ లాభం కోసం అక్రమాలకు, పన్ను ఎగవేతకు పాల్పడతాడు. చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో, ధర్మాన్ని పక్కన పెడతాడు. ఈ స్వార్థపూరిత చర్యలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.ఒక ఆటో డ్రైవర్, ప్రయాణికుడు మరచిపోయిన డబ్బు సంచిని తిరిగి అప్పగిస్తాడు. ఈ పాప భీతితో కూడిన నిజాయితీ వల్ల, అతను తిరిగి ఇచ్చిన డబ్బు కంటే, ఎక్కువ గౌరవాన్ని, నమ్మకాన్ని సం పాదించుకుని, తన కుటుంబానికి గొప్ప కీర్తిని అందిస్తాడు. ఈ మూడు విలువల కారణంగానే ఒక ఇంజనీర్ ప్రాజెక్టును అత్యంత నాణ్యతతో నిర్మిస్తాడు. ఇది కేవలం పని మాత్రమే కాదు, ప్రజల జీవితాలకు భద్రత కల్పించే తన ధర్మం అని నమ్ముతాడు. ఈ నిజాయితీ అతనికి శాశ్వత కీర్తిని, క్లయింట్లలో అ పారమైన నమ్మకాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా, అదే ఇంజనీర్ నాణ్యత తగ్గించి డబ్బు సం పాదిస్తే, తాత్కాలికంగా ధనం వచ్చినా, ఆ ప్రాజెక్టు పతనం అయినప్పుడు ఆ వ్యక్తి ఆత్మశాంతిని పూర్తిగా కోల్పోతాడు.ఈ విలువల వల్ల మీ జీవితంలో/వృత్తిలో మీకు శాశ్వత కీర్తి, తిరుగులేని నమ్మకం లభిస్తాయి. ఒత్తిడి ఎదురైనా, దైవ ప్రీతి వల్ల మనసుకు మానసిక స్థైర్యం లభిస్తుంది. ఈ విలువలు లేకపోతే, మీరు ఎంత డబ్బు సం పాదించినా అంతరాత్మ ప్రశాంతత నశించి, అభద్రతా భావం పెరుగుతుంది.కుటుంబంలోనూ ఈ ప్రభావం మరీ లోతుగా ఉంటుంది. మీ నిజాయితీ మీ పిల్లలకు గొప్ప ఆస్తి. మీరు విలువలు నిర్లక్ష్యం చేస్తే, ఇంట్లో అశాంతి, అపనమ్మకం పెరుగుతాయి. పిల్లలు మాటలకంటే ఎక్కువగా, చేతలనే చూస్తారు; తల్లిదండ్రులకు పాప భీతి లోపిస్తే, పిల్లలూ నిజాయితీని కోల్పోతారు. పాప భీతి మనల్ని తప్పుల నుండి కా పాడే కఠినమైన గురువుగా రక్షిస్తుంది. దైవ ప్రీతి మనల్ని ప్రేమతో నడిపించే తల్లిగా ప్రేరణనిస్తుంది. సంఘ నీతి మనల్ని బాధ్యతాయుత పౌరులుగా మార్చే బంధం. పాప భీతిని ఆచరించండి, దైవ ప్రీతిని పెంచుకోండి, సంఘనీతిని పాటించండి. ఈ మూడింటిని హృదయపూర్వకంగా ధరించినప్పుడే, మన వ్యక్తిగత ప్రశాంతత పెరుగుతుంది, ప్రపంచం నమ్మకం, మానవత్వంతో నిండిపోతుంది.ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందనే నమ్మకం లేనప్పుడు, మనిషిలో కరుణ, సహానుభూతి తగ్గిపోతాయి. ఫలితంగా, అతను కేవలం తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి, ఇతరుల బాధను, కష్టాన్ని విస్మరిస్తాడు. దైవ ప్రీతి లోపం ఉన్న ఓ పరిశ్రమ యజమాని, తక్షణ లాభం కోసం, నదుల్లో కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదిలివేస్తాడు. ఈ కలుషిత నీటిని తాగే జంతువులు, ఆధారపడిన ప్రజారోగ్యంపై పడే భయంకరమైన ప్రభావాన్ని అతను పట్టించుకోడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఉండాలనే కనీస బాధ్యతను విస్మరించి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడతాడు. ఈ లోపం అతన్ని సమాజానికి, ప్రకృతికి హాని కలిగించేలా నిర్దయగా మారుస్తుంది. సంఘ నీతి లోపించిన ఒక వ్యా పారి, లాభం కోసం ఆహారంలో కల్తీ చేసి, తక్షణ లాభం పొందుతాడు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, బాధ్యత లేని స్వార్థం వల్ల సమాజం రోగాల పాలయ్యే అవకాశం ఉంది.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
'కలిసి చేస్తే కలదు ఆరోగ్యం'..! క్రేజీగా పార్ట్నర్ యోగా
కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్నర్ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్నర్ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్నర్ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్నర్ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది. ఇది ఫిట్నెస్తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం. ప్రయోజనాలెన్నో.. ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం.. ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్ని కూడా పెంపొందిస్తాయి. ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్ సిద్ధా అక్షర్ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్నర్ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వార్మప్ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్నర్ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి. భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
బిడ్డ చేతికి ఫోన్..ఇంత అనర్థానికి కారణమా..!
‘‘డాక్టర్! మా పాప రోజంతా ఏడుస్తుంటుంది. కాని, మొబైల్ చూపించగానే సైలెంట్ అయిపోతుంది. అందుకే రోజూ రెండుమూడు గంటలు రైమ్స్, కార్టూన్లు పెడతాం’’ అని అమాయకంగా చెప్పింది అనిత.ఆమె మాటల్లో ప్రేమ ఉంది కాని, లోపల ఒక ప్రమాదం దాగి ఉంది. అందుకే ఆ రెండేళ్ల పాపను చూశాను. ‘‘హాయ్ బుజ్జీ’’ అని పలకరించా, స్పందన లేదు. చేతికి బొమ్మ ఇచ్చినా ఆసక్తి చూపలేదు. కాని, ఫోన్ కనిపించగానే కళ్లు వెలిగాయి, చేతులు చాపింది. రెండేళ్లకే ఆ పాప మొబైల్కు అడిక్ట్ అయ్యిందని అర్థమైంది. సైలెన్స్ వెనుక తుఫాను...‘మేము బిజీగా ఉంటాం డాక్టర్. కాసేపు పిల్లల చేతిలో ఫోన్ పెడితే తప్పేముంది?’ అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. శిశువు ఏడుస్తుందంటే తనకు ఏదో అసౌకర్యంగా ఉందని సిగ్నల్. ‘‘అమ్మా, నా దగ్గరకు రా’’ అని పిలుపు.ఆ సమయంలో బిడ్డ చేతికి ఫోన్ ఇవ్వడమంటే ఆ సిగ్నల్ను మ్యూట్ చేయడం. తల్లితో బంధాన్ని కోల్పోవడం. ఎందుకంటే, తల్లి ముఖం కంటే స్క్రీన్ వెలుతురు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫలితంగా తల్లిదండ్రులు దగ్గరున్నా బిడ్డ ఒంటరిగా పెరుగుతుంది. మెదడు మీద కాంతి దాడిశిశువు జననం తర్వాత మొదటి 36 నెలల్లో మెదడులో ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఆ కనెక్షన్లు ఆటలతో, స్పర్శలతో, సంభాషణలతో బలపడాలి. తల్లి నవ్వు, తండ్రి చూపు, అమ్మమ్మ పాట – ఇవే అసలైన మానసిక ఆహారం. కాని, ఫోన్ స్క్రీన్ ముందు కూర్చునే పిల్లల మెదడు వేరే రకంగా అభివృద్ధి చెందుతుంది. స్క్రీన్లోని వేగం, రంగులు, శబ్దం – ఇవన్నీ మెదడును ఎక్కువగా ప్రేరేపిస్తాయి. మెదడులో డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా... పిల్లలు సాధారణ ఆటలలో ఆసక్తి కోల్పోతారు. · బోరింగ్ అనిపిస్తే వెంటనే చిరాకు పెరుగుతుంది. · ఎప్పటికప్పుడు స్టిమ్యులేషన్ కావాలనిపిస్తుంది. ఇదే మొదటి దశ డిజిటల్ అడిక్షన్. స్క్రీన్ దెబ్బతో స్తంభించే మాటలు‘‘డాక్టర్, మా పాపకు రెండేళ్లు. ఒక్క మాట కూడా మాట్లాడదు’’ అనేది ప్రస్తుతం నేను వినే అత్యంత సాధారణ ఫిర్యాదు. కారణం తెలుసా? తల్లిని చూస్తూ, వింటూ, అనుకరిస్తూ పిల్లలు ‘‘మాట’’ అనే మ్యాజిక్ నేర్చుకుంటారు.స్క్రీన్లోని కార్టూన్ మాట్లాడుతుంది కాని, వినదు. బిడ్డ ప్రయత్నించినా అది స్పందించలేదు. దీనివల్ల కమ్యూనికేషన్ లూప్ ఆగిపోతుంది. ‘రెండేళ్ల లోపు పిల్లలు 30 నిమిషాల స్క్రీన్ టైమ్ వల్ల మాటలు రావడం 49శాతం ఆలస్యమవుతుంది’ అని జర్నల్ ఆఫ్ పిడియాట్రిక్స్ 2020లో జరిగిన పరిశోధనను ప్రచురించింది. ప్రేమ ముసుగులో ‘‘డిజిటల్ జైలు’’‘‘మేము ఎడ్యుకేషనల్ వీడియోలు చూపిస్తున్నాం కదా! నష్టమేంటి?’’ అని కొందరు పేరెంట్స్ అనుకుంటారు. కాని, హ్యూమన్ ఇంటరాక్షన్ను ఏ వీడియో భర్తీ చేయలేదని నాసా–యేల్ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనం చెబుతోంది. వీడియోలు నేర్పే కంటెంట్ బౌద్ధికంగా ఉపయోగపడినా, భావోద్వేగ అనుభూతిని ఇవ్వలేవు.పిల్లలు నిజమైన ముఖాల నుంచి సహానుభూతి నేర్చుకుంటారు. కథల ద్వారా ఊహాశక్తి పెరుగుతుంది. కాని, స్క్రీన్ యాంత్రికంగా నేర్చుకోవడాన్ని మాత్రమే చేస్తుంది. ఫలితంగా... · భావోద్వేగ స్పర్శ తగ్గిపోతుంది. · స్నేహం కంటే స్క్రీన్ ప్రాధాన్యం పెరుగుతుంది. · పిల్లలో ‘డిజిటల్ లోన్లీనెస్’ ఏర్పడుతుంది. స్క్రీన్తో ఏకాగ్రత లోపం... శిశువుల మెదడును స్క్రీన్లు ‘ఫాస్ట్ రివార్డ్’ సిస్టమ్లో కట్టేస్తాయి. రంగులు, ఫ్లాష్లు, సంగీతం – ఒక్కో సెకనుకు ఒక కొత్త విజువల్ షాక్. దీని వల్ల మెదడు అటెన్షన్ను నిలుపుకోలేదు. ఆ తరువాత బిడ్డ పాఠశాలకు వెళ్లినప్పుడు ఫోకస్ నిలపలేరు. హైపర్ రియల్ స్క్రీన్ ప్రపంచం నచ్చి, రియల్ ప్రపంచం బోరింగ్గా మారిపోతుంది.తల్లిదండ్రులకు సూచనలు...ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకు ఏ స్క్రీన్ కూడా చూపకూడదు. బదులుగా శిశువులతో ఆడటం, పాడటం, తాకడం లాంటివి చేయాలి. · బిడ్డ ఏడిస్తే వెంటనే ఫోన్ ఇవ్వకండి. దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకోండి. ‘నువ్వు సేఫ్గానే ఉన్నావు’ అని సాఫ్ట్గా చెప్పండి. తల్లి మాట ఆత్మస్థైర్యం ఇస్తుంది – స్క్రీన్ కాదు.శిశువుతో కలిసి నడవడం, బొమ్మలతో ఆట, నీటిలో ఆడించడంలాంటివి సెన్సరీ ప్లస్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ను ఇస్తాయి. · 2–5 ఏళ్ల బిడ్డతో కలిసి చిన్న చిన్న ఎడ్యుకేషనల్ వీడియోలు మాత్రమే చూడాలి. ఆ తర్వాత వాటి గురించి చర్చించాలి. ప్రశ్నలు అడగాలి. సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com(చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!) -
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్లో రోటీన్గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
టేస్టీ.. టేస్టీ..పాకిస్తాన్ హల్వా పూరీ, తమిళనాడు పిడి కొళుకట్టై చేసేద్దాం ఇలా..!
తమిళనాడు పిడి కొళుకట్టై కావలసినవి: బియ్యప్పిండి– ఒక కప్పు, బెల్లం తురుము– రుచికి సరిపడా, నీళ్లు– కొన్ని, పచ్చికొబ్బరి తురుము– అర కప్పు, ఏలకుల పొడి– కొద్దిగా, నెయ్యి– ఒక టీ స్పూన్, ఉప్పు– చిటికెడుతయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి స్టవ్పై పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, అందులో ఏదైనా చెత్త ఉంటే తొలగించడానికి ఆ బెల్లం నీటిని వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిని తిరిగి పాన్లో పోసి, పాకం పట్టించాలి. అందులో ఏలకుల పొడి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా గరిటెతో కలపాలి. నీరు బాగా మరుగుతున్న సమయంలో, మంటను పూర్తిగా తగ్గించాలి. ఇప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా చల్లుతూ, గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి దగ్గరపడుతూ, ముద్దలా మారడం మొదలవుతుంది. ఆపకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మొత్తం మిశ్రమం దగ్గరపడి, గిన్నె అంచులను వదిలి ముద్దలా మారిన తర్వాత, వెంటనే మంటను ఆపెయ్యాలి. ఈ ముద్దను ఒక ప్లేట్లోకి తీసుకుని, కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని, ఆ మిశ్రమాన్ని చేతులతో బాగా పిసికి, చిత్రంలో ఉన్న విధంగా చేతులతో ఒత్తుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పిడి కొళుకట్టైను పూజా సమయాల్లో నైవేద్యంగా కూడా పెడతారు.పాకిస్తాన్ హల్వా పూరీకావలసినవి: బొంబాయి రవ్వ– ఒక కప్పుపంచదార – అర కప్పు, బటర్– పావుకప్పు (కరిగించాలి)పాలు– రెండున్నర కప్పులు, పలుకులుగా చేసిన నట్స్ – ఒక గుప్పెడు, ఏలకులు – 3, నెయ్యి– 3 టేబుల్స్పూన్లుపూరీలు– 4 లేదా 5 (అభిరుచిని బట్టి పిండిలో పంచదార కూడా వేసుకోవచ్చు)తయారీ: ముందుగా ఒక పాత్రలో బొంబాయి రవ్వ, నెయ్యి వేసి, గరిటెతో తిప్పుతూ వేయించాలి. రవ్వ మంచి వాసన వచ్చాక, బటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసి కలపాలి. తర్వాత పంచదార వేసి, కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. అనంతరం నట్స్ వేసి బాగా కలపాలి. చివరిగా, పాలను నెమ్మదిగా పోస్తూ, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. దగ్గరపడే వరకు కలుపుతూ, ఉడికించాలి. హల్వా వేడిగా ఉన్నప్పుడే, నెయ్యి వేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.క్రిస్పీ కోకోనట్ చికెన్కావలసినవి: బోన్లెస్ చికెన్– అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి)జొన్న పిండి, కొబ్బరి తురుము– పావు కప్పు చొప్పున, గుడ్లు– 2పాలు– 3 టేబుల్ స్పూన్లు(చిక్కటివి)పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్ఇంగువ– చిటికెడు, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి– అర టీ స్పూన్ చొప్పునఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముక్కలకు మొత్తం ఆ మిశ్రమాన్ని పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో జొన్న పిండి, ఇంకో బౌల్లో పాలు–గుడ్లు మిశ్రమం, మరో బౌల్లో కొబ్బరి తురుము వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్క తీసుకుని, మొదట జొన్నపిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుములో ముంచి, బాగా పట్టించి– నూనెలో డీప్ఫ్రై చేసుకోవాలి. (చదవండి: ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!) -
రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్లో..
వివిధ డిజైన్లలో కనిపించే ఉంగరాలు వేళ్లకు, చేతులకు ఎంత అందాన్ని తీసుకువస్తాయో మనకు తెలిసిందే. ఇదే ఆలోచనను టేబుల్ నాప్కిన్స్కు తీసుకువచ్చారు అలంకార ప్రియులు. నాప్కిన్ రింగ్ హోల్డర్లు నాప్కిన్లను నీటుగా ఉంచుతాయి. టేబుల్ అలంకరణకు ఆకర్షణను జోడిస్తాయి. వీటిని లోహం, కలప, పూసలు, వివిధ రకాల మెటీరియల్తో చేతితో తయారు చేసుకోవచ్చు. ఒకే డిజైన్, ఒకే పరిమాణంలో ఉన్న ఈ హోల్డర్లు విందు సమయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే... నాప్కిన్లు అస్తవ్యస్తంగా లేకుండా నీటుగా ఉంటాయి. టేబుల్ అందాన్ని, వ్యక్తిత్వాన్ని, సంపూర్ణతను జోడిస్తాయి. ఈ చిన్న ఉంగరాలు విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ రింగ్స్ వల్ల నాప్కిన్లను ఒక్కొక్కటి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. బంగారం, ఇత్తడి, స్టెయిన్లెస్ స్టీల్, కలప, ప్లాస్టిక్, వెదురు, జనపనార... ఇలా వివిధ రకాల మెటీరియల్తో రుమాలు ఉంగరాలను రూపొందించవచ్చు. సాధారణ బ్యాండ్ల నుండి బొమ్మలు, జంతువులు, ఆకులు... లెక్కలేనన్ని డిజైన్లలో ఈ రింగ్స్ లభిస్తాయి. వీటిని ఎలా ఎంచుకోవాలంటే...భోజనాల గది సౌందర్యానికి అనుగుణంగా ఉండే డిజైన్స్ని ఎంచుకోవాలి. ఉపయోగించే నాప్కిన్లకు కాగితం లేదా క్లాత్ ఏదైనా, హోల్డర్ సరైన సైజులో ఉండేలా సరిచూసుకోవాలి.సులభంగా విరిగిపోయేవి, పడిపోయేవి కాకుండా తగినంత బరువుతో ఉండేలా చూసుకోండి. రింగుల హోల్డర్లు గట్టిగా ఉండాలి కానీ, మరీ బరువుగా ఉండకూడదు. మరకలు లేదా తుప్పు పట్టకుండా ఉండే రింగ్ హోల్డర్లను ఎంచుకోవాలి.రుమాలు ఉంగరాలకు చరిత్ర కూడా ఉంది. 1800 ప్రాంతంలో ఫ్రాన్స్లో ఈ మోడల్ మొదలైంది. ప్రత్యేక విందు కార్యక్రమాలలో కనిపించే వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునేవారు. వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్న నాప్కి రింగ్ హోల్డర్లను అభిరుచికి తగినవి సన్నిహితులకు కానుకలుగా ఇవ్వడానికీ సరైన ఎంపిక అవుతుంది. ఎన్నార్ (చదవండి: కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!) -
నెరిసిన జుట్టుకి సహజమైన మెరుపు..
ఇప్పుడు తల నెరిసిపోవడానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. దాంతో ముప్పయిల వయసు దాటక ముందే తలకు రంగు వేసుకోవడం కామన్ అయిపోయింది. పెరిగిన రూట్స్ కారణంగా తరచుగా సెలూన్కి వెళ్లడం కష్టమవుతూ ఉంటుంది. అయితే, సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఈ డివైస్ చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఉంటే సెలూన్లో మాదిరి టచ్–అప్ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.ఇది ఇన్స్టంట్ హెయిర్ కలర్ స్ప్రే. ఇది కేవలం నెరిసిన జుట్టునే కాకుండా, పల్చబడిన జుట్టును కూడా కవర్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎయిర్బ్రష్లాంటి ఫైన్ స్ప్రే అప్లికేషన్ను అందిస్తుంది, ఇది జుట్టు రంగుతో కలిసిపోయి సహజంగా కనిపిస్తుంది. అలాగే దీనితో జుట్టు జిడ్డుగా, గట్టిగా లేదా నిర్జీవంగా మారకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాదు, దీన్ని ఒక్కసారి అప్లై చేసుకుంటే షాంపూ చేసే వరకు నిశ్చింతగా ఉండొచ్చు. వేగంగా రూట్స్ కవర్ చేయడానికి ఇది మార్కెట్లో ఉన్న ఉత్తమ మార్గాలలో ఒకటి. బిజీ లైఫ్స్టయిల్లో ఉన్నవారికి, ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించాలనుకునే వారికి ఈ రూట్ టచ్ అప్ కిట్ తప్పక ఉండవలసిన బ్యూటీ ప్రొడక్ట్! ఈ గాడ్జెట్కి సంబంధించిన కిట్లో బ్లాక్తో పాటు చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయి.నూగు మాయం!అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించడానికి, వాటిని బలహీనపరచి, చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలామంది ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా పచ్చి బొప్పాయి గుజ్జు తీసుకుని, దానికి కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ను అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న భాగాల్లో రాసుకుని, సుమారు 15 నిమిషాలు మసాజ్ చేయాలి. అనంతరం మరో 15 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగాలి. ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు చేసినట్లయితే, నెమ్మదిగా వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. నిజానికి పచ్చి బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్ వెంట్రుకల కుదుళ్లను బలహీనపరచడానికి సహాయపడుతుంది. అవాంఛిత రోమాలతో బాధపడేవారికి ఈ చిట్కా మంచి ఫలితాలను అందిస్తుంది. (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!) -
సూట్కేస్ ఓపెన్ చేస్తే.. లైట్ ఆన్!
సూట్కేస్లో బట్టలు కాదు, ఇప్పుడు బల్బులు వెలిగించే పవర్ను సర్దేయవచ్చు! అవును, చిన్న సూట్కేస్లా కనిపించే ఇది, నిజానికి ఒక విద్యుత్ ఉత్పత్తి యంత్రం. సాధారణంగా కరెంట్ జనరేటర్స్ మాదిరి వైర్లు, బల్బులు, ట్రాన్స్ఫార్మర్లు, జేబుకు చిల్లులు పడే బిల్లులు మాదిరి కాకుండా, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తూ, కొత్తగా జర్మనీ శాస్త్రవేత్తలు ఈ సూట్కేస్ సైజ్ టర్బైన్ను డిజైన్ చేశారు. ఇది నది లేదా వాగు దగ్గర పెట్టేస్తే చాలు, నీరు ప్రవహించగానే, కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించుకొని, విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. డ్యామ్ లేదు, డ్యామేజ్ లేదు, కేవలం నీటి ప్రవాహమే దీని ఇంధనం. పైగా ఇది లైట్ వెయిట్. సెట్ చేయడం కూడా చాలా సింపుల్. ప్రవహించే నీటి పక్కన, సూట్కేస్ ఓపెన్ చేస్తే చాలు, రెండు గంటల్లో ‘లైట్ ఆన్!’ అవుతుంది. నీరు తక్కువగా ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. ఒక యూనిట్తో పది ఇళ్లు వెలుగుతాయి, రెండు యూనిట్లు పెట్టేస్తే ఊరంతా డిస్కో లైట్స్ ఆన్ చేయొచ్చు. ఇప్పటికే ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికాలో దీన్ని టెస్ట్ చేశారు. ఫలితం? సూపర్ హిట్! త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తే, గ్రామాలు, పల్లెలు అన్నీ ‘సూట్కేస్ పవర్ స్టేషన్’లుగా మారిపోతాయి. (చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్ గురు'..) -
ప్రసవ వేదన తర్వాత అంతటి వేదన..!
ముద్దుమురిపాలతో మురిపించే ఓ చిన్నారి కొత్త సభ్యుడిగా / సభ్యురాలిలా ఇంట్లోకి రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అయితే అప్పటివరకూ ప్రసవవేదన అనుభవించిన ఆ తొలిచూలు తల్లుల్లో కొందరికి మాత్రం అదో భయానకమైన అనుభవం. ప్రసవం అయ్యాక కొంతమంది తల్లుల్లో ఆ అనుభవం కొంత కుంగుబాటు (డిప్రెషన్) రూపంలో కనిపిస్తుంది. కొత్తగా అమ్మ అయిన చాలామందిలో కనిపించే ఆ డిప్రెషన్ ప్రభావాలు చాలామందిలో తక్కువగానే ఉన్నా మరికొందరిలో మాత్రం... చిన్నారి పట్ల తల్లి చూపాల్సిన కేర్కు అడ్డంకిగా మారేంత పెద్దవిగానూ ఉండవచ్చు. ఇలా ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ (పీపీడీ) అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రసవం తర్వాత తల్లికి డిప్రెషన్ వచ్చే కేసులు చాలావరకు గుర్తింపునకు కూడా నోచుకోకపోవడంతో ఆ తల్లులు తమ వేదనను నిశ్శబ్దంగా అనుభవిస్తూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, పర్యవసానాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. బిడ్డపైనా ప్రభావం... తల్లి తన బిడ్డను దగ్గరికి తీసుకోకపోవడం, తన పాలు పట్టించడానికి సుముఖంగా లేకపోవడం, బిడ్డ పట్ల విముఖతతో సమయానికి పీడియాట్రీషియన్ దగ్గరికి తీసుకెళ్లకపోవడం వంటి అంశాలతో తల్లి తాలూకు డిప్రెషన్ ప్రభావం బిడ్డపైనా పడేందుకు అవకాశం లేకపోలేదు.కొత్తగా పాపాయి పుట్టిన సంతోషం కూడా ఆ తల్లుల్లో కనిపించకుండా చేసే ఈ పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు గర్భధారణ ప్రక్రియలో అప్పటివరకు వారు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లూ, ప్రసవం తర్వాతి ఉద్వేగపూరితమైన వెల్లువ, హార్మోన్లపరంగా దేహంలో వేగంగా జరుగుతున్న మార్పులు, కొన్నిసార్లు వాళ్ల సామాజిక, ఆర్థిక అంశాలూ ఇవన్నీ ‘పోస్ట్పార్టమ్ డిప్రెషన్’కు కారణాలవుతాయి. అయితే అది తమ తప్పు కాదనీ, తమకు తెలియని కారణాల వల్ల అలా జరుగుతోందోని తెలియని తల్లులు అపరాధభావనకు లోనవుతూ మరింతగా కుంగి΄ోతుంటారు.కారణాలు... హార్మోన్ల తగ్గుదల : గర్భధారణ సమయంలో మునపటి కంటే దాదాపు పదింతలు పెరిగిన ఈస్ట్రోజెన్, పప్రొజెస్టెరాన్ హార్మోన్లు ప్రసవం కాగానే ఒకేసారి తగ్గి΄ోవడం. ప్రసవం జరిగిన మూడోరోజుకే అవి పదింతలు (ప్రీ–ప్రెగ్నెన్సీ స్థాయులకు) తగ్గి΄ోవడం ∙ప్రసవం సమయంలోని శారీరక శ్రమ, నిద్రలేమి, భవిష్యత్తులో పేరెంటింగ్ గురించి బెంగ... ఈ అంశాలన్నీ ΄ోస్ట్΄ార్టమ్ డిప్రెషన్కు కారణమవుతాయి.పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో రకాలు... తల్లులుఎదుర్కొనే భావోద్వేగాల తీవ్రతలను బట్టి వీటిని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. 1) పోస్ట్పార్టమ్ బ్లూస్ / బేబీ బ్లూస్ : పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో 50% నుంచి 75% వరకు ఈ రకమైనవే ఎక్కువ. ఈ రకం డిప్రెషన్ సాధారణంగా ప్రసవం తర్వాత మొదటివారంలో (మరీ ముఖ్యంగా మొదటిరోజు నుంచి మొదలుకొని నాలుగు రోజుల్లో) కనిపిస్తుంది. మొదట్లో కొత్త తల్లిని బాధించే లక్షణాలు చికిత్స తీసుకోకపోయినప్పటికీ రెండువారాల్లో తగ్గిపోతాయి. తల్లిలో ఈ డిప్రెషన్ కనిపించినప్పుడు భర్త, కుటుంబసభ్యులు సపోర్ట్ ఇస్తే చాలు. 2) పోస్ట్పార్టమ్ డిప్రెషన్ : ఇది మొదటిదానికంటే కాస్త ఎక్కువ తీవ్రతతో కనిపిస్తుంది. మొదటిసారి పోస్ట్పార్టమ్ బ్లూస్ కనిపించిన తల్లికి అటు తర్వాతి ప్రసవాల్లోనూ (దాదాపు 30% కేసుల్లో) ఇది రావచ్చు. సాధారణంగా కొన్ని నెలలు మొదలుకొని, ఏడాది వరకూ లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. కొద్దిపాటి సైకోథెరపీ అవసరమవుతుంది. 3) పోస్ట్పార్టమ్ సైకోసిస్ : పోస్ట్పార్టమ్ డిప్రెషన్లో అత్యంత తీవ్రమైన దశ ఇది. ప్రతి వెయ్యి ప్రసవాల్లో ఒకరిలో కనిపిస్తుంది. ఇది కూడా కొన్ని నెలలు మొదలుకొని ఏడాది వరకూ తల్లిలో దీని తాలూకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. నిద్రలేమి, విపరీతమైన కోపం, అయోమయం లాంటివి అత్యంత తీవ్రంగా ఉంటాయి.చివరగా... కేవలం ప్రసవం తర్వాతనే కాకుండా కొంతమంది మహిళల్లో ప్రసవం ముందు... అంటే గర్భధారణ సమయంలోనూ డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు ఫాలో అప్ సమయంలో ఆ విషయాన్ని డాక్టర్కు తెలపాలి. లేదా ఒక్కోసారి పేషెంట్ మాటలను బట్టి డాక్టర్లే ఆ విషయాన్ని పసిగడతారు. అలాంటప్పుడపు అవసరాన్ని బట్టి ఆ పేషెంట్కు సైకియాట్రీ చికిత్స లేదా కౌన్సెలింగ్ను డాక్టర్లు సూచిస్తారు. లక్షణాలు... పై మూడు రకాల డిప్రెషన్లలోనూ కొత్త తల్లి కనబరిచే లక్షణాలు స్వల్పమైనవిగా మొదలుకొని, రకాన్ని బట్టి ఓ మోస్తరు నుంచి చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చు. అవి... కారణం లేకుండానే తీవ్రమైన దుఃఖం, చాలా ఎక్కువగా ఏడ్వటం పాపాయి మీద ఏమాత్రం ఆసక్తికరబరచకపోవడం. (కొన్ని సందర్భాల్లో చిన్నారిపైనా ఉద్రిక్తంగా వ్యవహరించడం, డిప్రెషన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కొందరు పాపాయిపై దాడి చేయడం, గాయపరచడానికి ప్రయత్నించడం) ∙చాలా విచారంగా ఉండటం దేనిపైనా ఆసక్తి లేక΄ోవడం, గతంలో తనకు సంతోషాన్ని ఇచ్చిన వ్యాపకాలపైనా ఆసక్తి ఉండక΄ోవడంఅతి చురుకుగా లేదా అతిగా ఉండే ప్రవర్తన ఆకలి తగ్గడం నిద్రపట్టడంలో ఇబ్బంది / నిద్రలేమి (కొద్దిగా మొదలుకొని తీవ్రంగా) మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం ఎప్పుడూ నిస్పృహతోనూ విచారంగా ఉండటం, అపరాధభావన (గిల్ట్) దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఏకాగ్రత లోపించడం పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న కొందరు ఆత్మహత్యకూ యత్నించడం. నిర్ధారణ... ఈ సమస్య నిర్ధారణకు నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షా లేదు. అయితే బాధితురాలిని క్షుణ్ణంగా పరిశీలించడం, లక్షణాల గురించి బాధితురాలి భర్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.చికిత్స... బాధితురాలి సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ప్రధానంగా కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తారు. ఇలాంటి చికిత్సలో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ లాంటి వారి భూమిక చాలా కీలకం. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారికి తప్పనిసరి అయితే యాంటీ యాంగ్జైటీ మందులు లేదా యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులను సూచిస్తారు. ఎంతకీ తగ్గనంత తీవ్రత ఉన్నప్పుడు కొందరికి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ) అని పిలిచే షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అయితే కొందరు సాధారణ ప్రజల్లో దీని పట్ల అ΄ోహలు ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం హాని కలిగించనిదీ, చాలా సురక్షితమైనదని అందరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరముంది. (చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్ గురు'..) -
నవ్విస్తూ కొనేలా చేశాడు!
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్’ ‘యాడ్ గురు’గా విఖ్యాతుడైన పీయుష్ పాండే (70) శుక్రవారం కన్ను మూయడంతో అడ్వర్టయిజింగ్ చరిత్రలో ఒక మహోధ్యాయం ముగిసింది. ఏదైనా వస్తువును దాని ఘనతతో కంటే ‘ఆత్మ’తో కొనిపించాలని నమ్మే పీయుష్ భారతీయులు ఇష్టపడే హాస్యాన్ని మేళవించి క్యాంపయిన్స్ నిర్వహించి ప్రొడక్ట్స్ను సూపర్హిట్ చేయడంలో దిట్ట.ఫెవికాల్. కాడ్బరీస్, ఏసియన్ పెయింట్స్... ఎన్నో. ఆయనకు నివాళి.మీకు ఈ యాడ్ గుర్తుండి ఉంటుంది. ఒక పెద్దమనిషి చెరువు గట్టున కూచుని గంటల తరబడి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కాని ఒక్క చేపా పడదు. అప్పుడు ఒక తమిళ వ్యక్తి హడావిడిగా వచ్చి ఒక చిన్న కర్రకు జిగురు అంటించి నీళ్లలో పెడతాడు. అంతే. చేపలు అంటుకుపోతాయి. పెద్దమనిషి నోరెళ్లబెడుతుండగా ఆ తమిళవ్యక్తి హుషారుగా చేపలతో చిత్తగిస్తాడు. కారణం? అతడు వాడింది ‘ఫెవిక్విక్’. ఈ యాడ్ వచ్చాక ఫెవిక్విక్ అమ్మకాలు అమాంతం పెరిగాయి. దానిని తయారు చేసినవాడు పీయుష్ పాండే. ఓగిల్వి ఇండియా యాడ్ ఏజెన్సీక్రియేటివ్ చైర్మన్, సి.ఇ.ఓ.‘నువ్వు ఏ యాడ్ అయినా తయారు చెయ్. అది ముందుగా జనానికి నచ్చాలి’ అంటాడు పీయుష్.పీయుష్ పాండేది జైపూర్. అతని కుటుంబం ఢిల్లీలో స్థిరపడగా అక్కడే చదువుకున్నాడు. క్రికెటర్ కావాలని ఉండేది. రంజీ స్థాయిలో పెద్ద ఆటగాడిగా ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఆడేవాడు. కాని ఆట కంటే కూడా ఇంట్లో వాతావరణమే అతణ్ణి ఎక్కువగా తీర్చిదిద్దింది. ‘మా ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, సంగీతం, కళల గురించి చర్చ ఉండేది’ అంటాడు పీయుష్. సుప్రసిద్ధ గాయని ఇలా అరుణ్ అతడి పెద్దక్క. దాంతో అతను తెలియకనే అడ్వర్టయిజింగ్లోకి వచ్చాడు. 1982లో ముంబైలోని ఓగిల్విలో ‘క్లయింట్ సర్వీసింగ్ ఎగ్జిక్యూటివ్’గా చేరిన పీయుష్ ‘సన్లైట్’డిటెర్జెంట్కు మొదటి ప్రకటన తయారు చేయడంతో సంస్థ దృష్టిలో పడ్డాడు. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ సంస్థకు బిగ్బాస్గా మారి భారతదేశంలో నం.1 యాడ్ ఏజెన్సీగా విస్తరింపచేశాడు. ప్రపంచ వ్యాప్త శాఖలు ఉన్న ఈ ఏజెన్సీకి అన్నింటికన్నా లాభదాయమైన శాఖగా ఇండియా శాఖను నిలబెట్టాడు పీయుష్. నవ్విస్తూ కొనిపించడం, సున్నితమైన భావోద్వేగాలతో ప్రొడక్ట్ను మనసులో నాటుకునేలా చేయడం పీయుష్ ప్రత్యేకత. ‘హమారా బజాజ్’ యాడ్ అందుకు ఉదాహరణ. ఆ యాడ్లో భారతీయులకు ఒక స్కూటర్తో ఎలాంటి అనుబంధం ఉంటుందో చూపడం ద్వారా పెద్ద అమ్మకాలు సాధించాడు. స్కూటర్ కొనేవారు అదే కొనాలని, స్కూటర్ కొనలేని వారు కనీసం కలల్లో నిలుపుకోవాలని ఆ యాడ్ ద్వారా అతడు నిరూపించాడు. ఇక క్రికెట్ మైదానంలో వింత స్టెప్స్ వేస్తూ చొచ్చుకుని వచ్చే కాడ్బరీ అమ్మాయిని కనిపెట్టింది పీయుషే. కాడ్బరీ యాడ్లో చాక్లెట్ను, ఆ అమ్మాయిని ఎవరూ మర్చికోలేకపోయారు. ఒక విధంగా అమ్మాయిల ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో పీయుష్ చూపించాడు. ఆ తర్వాత పీయుష్ చేసిన ‘ఫెవికాల్’ క్యాంపెయిన్ అందరినీ నవ్వుల పూవులు పూయిస్తూ ఫెవికాల్ అభిమానులుగా మార్చింది. ‘ఈ బంధం దృఢమైనది’ అనడంలో ‘బంధం’ అనే మాటను జాగ్రత్తగా ఎంచింది. ఫెవికాల్ యాడ్లో ఒక తల్లి పని చేసుకుంటూ మాటిమాటికి అటూ ఇటూ తిరుగుతున్న పసిపిల్లాణ్ణి ఒక ఖాళీ డబ్బా మీద కూచోబెడుతుంది. అక్కడ నుంచి ఇక ఆ పిల్లాడు కదలడు. కారణం? అది ఫెవికాల్ ఖాళీ డబ్బా.అలాగే ‘ఎంసీల్’ యాడ్స్ కూడా జనానికి తెగ నచ్చాయి. ఇక ‘పగ్’ డాగ్ను ‘హచ్’ డాగ్గా మార్చిన బ్రహ్మ పీయుష్. ‘వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్’ అంటూ ఒక పసిపిల్లాడి వెంట కుక్కపిల్ల వెళుతున్న హచ్ నెట్వర్క్ యాడ్కు కోట్ల మంది అభిమానులున్నారు. ఇక వొడాఫోన్ ‘జూజూస్’ ఎంత వింత గొలిపి కుతూహలం రేడియో అందరికీ తెలుసు. ప్రకటనలు వ్యాపారానికే కాదు దేశహితవుకు కూడా ఉపయోగపడాలని నమ్మిన పీయుష్... అమితాబ్తో కలిసి చేసిన ΄ోలియో కాంపెయిన్ చరిత్రాత్మకమైనది. ‘దో బూంద్ జిందగీకె’ పేరుతో రెండు పోలియో చుక్కలు పిల్లలకు ఎంత జీవధాతువులో పల్లెపల్లెకూ చేరేలా ప్రచారం చేయగలిగాడు.పీయుష్ పేరు దేశ అడ్వర్టయిజింగ్ రంగంలో చిరకాలం నిలిచిపోతుంది. (చదవండి: Diwali 2025: ఆ గ్రామంలో దీపావళి ప్రాభవమే వేరు! ) -
వెలుగు వైపు యువత
‘దీపం అంటే ప్రమిద మాత్రమే కాదు మన మనసులను మేల్కొలిపే సాంస్కృతిక వెలుగు’ అంటారు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రచనా చౌదరి. నవంబర్ 1నుంచి 13 వరకు కోటి దీ పోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో కన్నుల పండువగా జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తర–దక్షిణ భారత దేశాల కళాసంస్కృతిని ఒకే వేదికమీదకు తీసుకురావడానికి చేస్తున్న కృషి, ఆధ్యాత్మిక సేవ, కోటి దీ పోత్సవ కార్యక్రమం తమలో తీసుకువచ్చిన మార్పుల గురించి రచనా చౌదరి ప్రత్యేకంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహమ్, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే...చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే దీపం వల్ల అన్నిపనులు సాధ్యమవుతాయి అన్నది నిజం. ప్రతిరోజూ దీపం వెలిగించడం నా దినచర్యలో భాగం. ఈ దీపం వెనక మా అమ్మ రమాదేవి, నాన్న నరేంద్ర చౌదరిల కృషి ఎంత ఉందో చూస్తూ పెరిగాను. కోటి దీ పాలు ప్రసరించే శక్తి ఎంత దూరం వెళుతుందో ప్రతియేటా చూడటమే కాదు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నా వంతు సహకారాన్ని అందిస్తుంటాను.’ మంచి మార్పులుఅమ్మానాన్న మొదట లక్ష దీ పోత్సవం అనే ఆలోచన చేసే సమయానికి నేను టీనేజ్లో ఉన్నాను. శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ స్వామివారి చేతుల మీదుగా 2012లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు అమెరికాలో బోర్డింగ్ స్కూల్ లో చదువుకుంటున్నాను. ప్రతియేటా కోటి దీ పోత్సవానికి మాత్రం తప్పనిసరిగా వచ్చి వెళ్లేదాన్ని. ఆధ్యాత్మిక విషయాల్లో పెద్దలను, గురువులను అనుసరించడం ద్వారానే ఎన్నో విషయాలను తెలుసుకోగలం. ప్రతి యేటా దీక్షగా చేసే ఈ కార్యక్రమం నాలో చాలా మార్పులు తీసుకువచ్చింది. స్టేడియం అలంకరణ, అతిథులను ఆహ్వానించడం, ఏర్పాట్లు చూడటం,.. ఇదంతా అమ్మ చేసే పనులను గమనిస్తూ, తెలుసుకోగలిగాను. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కోటి దీ పోత్సవంలో చురుకుగా పాల్గొంటున్నాను. ప్రఖ్యాతి గాంచిన శృంగేరి, కంచిపీఠం, మైసూరు దత్త పీఠం.. వంటి పీఠాధిపతులు కోటి దీ పోత్సవ కార్యక్రమానికి హాజరయేవిధంగా సమన్వయం చేస్తున్నాను. దీపం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చు అని బోధపడింది. ఈ మహా కార్యక్రమంలో ధనిక, పేద అనే తేడా ఉండదు. కళాకారులకు వేదికైన ఈ కార్యక్రమాన్ని ఏదో గొప్ప శక్తి అదృశ్యంగా ఉండి నడిపిస్తోందని నా భావన. ఈ కార్యక్రమానికి వచ్చినవాళ్లు ‘కిందటేడాది వచ్చాం.. మా జీవితంలో మంచి మార్పు జరిగింది’ అని చెబుతుంటారు. అదంతా దైవం ఇచ్చే ఆశీస్సులే అని చెబుతుంటాం. కార్తీకమాసంలో పదమూడు రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం పాజిటివ్ వైబ్స్ అనంతంగా వెలువడుతున్నాయా అనిపిస్తుంటుంది.’ ఉత్తర–దక్షిణాల కలబోతఈసారి కోటిదీ పోత్సవం పాన్ ఇండియా అయ్యిందని చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ఉత్సవ విగ్రహాలను కోటి దీ పోత్సవ వేదికపైకి తీసుకొచ్చి తెలుగు ప్రజలకు దర్శనం కల్పించేవిధంగా కృషి చేస్తున్నాం. గత ఏడాది నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రధాన దేవతామూర్తులు తరలివస్తున్నారు. అక్కడి అర్చకులే స్వయంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా అన్ని దేవాలయాల నుంచి వచ్చిన ఉత్సవమూర్తులకు కోటిదీ పోత్సవంలో దర్శన భాగ్యం కల్పించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. చాలామంది జీవితంలో దర్శించదగిన దేవాలయాల జాబితా దగ్గర పెట్టుకుంటారు. కానీ, వెళ్లలేని కారణాలేవో ఉంటాయి. అలాంటివారు ఇక్కడకు వచ్చి, ఈ కార్యక్రమంలో ఆ దేవతామూర్తులను దర్శించుకుని, పూజలలో పాల్గొని, గుండెలనిండా ఆ దివ్యానుభూతులను నింపుకుని వెళుతుంటారు.’ యువతలో సేవాగుణంఇటీవలి కాలంలో యువతలో మన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని, భక్తిని, ఆసక్తిని ఎక్కువగా గమనిస్తున్నాను. అయితే, చాలామంది సెలబ్రేషన్స్ వైపు ఎక్కువ మొగ్గుచూపుతుంటారు. మన దేశీయ వారసత్వం అంతర్గతంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తుంటారు. సంప్రదాయంగా ముస్తాబై, వచ్చి, ఈ కార్యక్రమంలో ఫొటోలు దిగుతుంటారు. దీ పాలు వెలిగించి, ఫొటోలు తీసుకొని, సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతుంటారు. పూజ ఒక్కటే కాదు ఈ దేశ ఆధ్యాత్మిక శక్తి సందేశం వారి మెదళ్లకు చేరుతుంది. అందుకే, యువత చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మా అందరికీ దీపోత్సవం కార్యక్రమంలో ప్రతిరోజూ ఒక మారథాన్లా ఉంటుంది. పూర్తయ్యాక ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక తరం మరో తరాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మా జనరేషన్ కూడా అనుసరిస్తుంది. మంచి ఎక్కడ ఉన్నా దానిని ఫాలో అవడం సహజమే. తెలంగాణలోని పల్లె ప్రాంతాలే కాదు ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు. దాదాపుగా తొంభైశాతం మంది తమ వంతు దీపం వెలిగించి హడావుడిగా వెళ్లి పోవాలని కాకుండా మహా నీరాజనం అయ్యేవరకు ఉండి, భక్తితో కళ్లకద్దుకుని వెళుతుంటారు. వయసు పైబడినవారు తమ కుటుంబసభ్యులతో వచ్చి, కార్యక్రమంలో పాల్గొని సంతృప్తితో వెళుతుంటారు. ఈ సమయంలో యువత పెద్దవారికి ఇచ్చే చేయూత గమనించినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, బి.జె.పి. సీనియర్ నేత డాక్టర్ ఎ. లక్ష్మణ్ అనూహ్య సహకారం అందిస్తున్నారు.’ రక్షణ చర్యలూ ప్రధానమే!పీఠాధిపతులు, సద్గురువులు, ప్రవచనకారులు.. అందరి సమక్షంలో జరిగే ఈ దీక్షా కార్యక్రమంలో సామూహికంగా ప్రతిరోజూ దాదాపు పదిలక్షల దీ పాలు వెలిగిస్తారు. ఇరవై మంది కూర్చొని దీపం వెలిగించి, పూజ చేసుకునేలా ఒక సెట్ ఉంటుంది. ప్రతి ఒక సెట్ దగ్గర ఒక వాలంటీర్ ఉంటారు. అలా మొత్తం 2000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్టీవీ, వనిత, భక్తి టీవీ బృందంలోని వెయ్యి మంది కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటారు. 40 కెమెరా సెటప్ను ఏర్పాటు చేస్తాం. దీ పాలతో చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ ఏ చిన్న అవాంతరం జరిగినా వెంటనే తెలిసి పోతుంది. దీనివల్ల ఎంత చిన్న సమస్య అయినా వెంటనే క్లియర్ చేసే సదు పాయం ఉంటుంది. అందుకే ఇన్నేళ్లలో ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాలేదు. అంబులెన్స్, టాయ్లెట్ సదు పాయాలు ఉంటాయి. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏం చేయాలో ముందస్తు సమావేశాలు నిర్వహిస్తుంటాం. అందరిలోనూ ఒక దైవిక శక్తి ఉన్నదా... అన్నంతగా ఈ కార్యక్రమం పూర్తయ్యేవరకు ప్రతి ఒక్కరూ తమ ఎఫర్ట్ని పెడుతుంటారు. కోటి దీ పోత్సవం ఆరంభం నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం మా సిబ్బంది చేసే కృషిని మాటల్లో చెప్పలేను. తమ సొంత కార్యక్రమంలా కార్యోన్ముఖులై పనిచేస్తారు. ప్రతిసారీ ఈ కార్యక్రమం దిగ్విజయం అయేలా చేయడం మాకు ఒక టాస్క్ అని చెప్పవచ్చు. భగవంతుడు ఉన్నాడు, లేడు.. అనే చర్చలు అవసరం లేదు. ఇది డబ్బుకు సంబంధించిన అంశం కానే కాదు. ధర్మానికి సంబంధించినది. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. మన దేశం కళలకు పుట్టినిల్లు. సాహిత్య, సాంస్కృతిక వైభవాలతో విరాజిల్లే ఘనమైన చరిత్ర ఉంది. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడి కళాకారుల సాంస్కృతిక కళారూ పాలు కనిపిస్తాయి. వాటిని ఈ వేదిక ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆ విధంగా ఎంతోమంది కళాకారులకు గుర్తింపు, ఉ పాధి లభిస్తుంది. కోట్లాదిమందికి కోటిదీ పోత్సవ వేదికగా కాంతి సందేశాలు అందుతుంటాయి’ అని వివరించారు ఈ యువ పారిశ్రామికవేత్త.’ సేవయే ప్రధానం...ప్రతియేటా ఆగస్టు రాగానే మా ఇంట కోటి దీ పోత్సవానికి సంబంధించిన సందడి నెలకొంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు, పనుల విభజన, థీమ్.. ప్రతిది ప్లానింగ్తో రెడీ అవుతుంది. పూణె, తంజావూరు నుంచి వచ్చిన కళాకారులు పువ్వులతో రంగోలీలు వేస్తారు. శాండ్ ఆర్టిస్టులు రకరకాల కళారూ పాలను చిత్రిస్తారు. బొమ్మల కొలువులు పెడతాం. రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా స్టేడియం అంతా అలంకరిస్తాం. ఏ దేవుడికి ఏ పూలు అర్పించాలి, వాటి మాలలు ఎలా ఉండాలో ప్రత్యేకించి తయారు చేయిస్తాం. కోయంబత్తూరు, బెంగళూరు నుంచి ప్రత్యేక అలంకరణ కళాకారులను తీసుకొచ్చి, వేదికను అలంకరిస్తాం. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టేడియంకు వెళ్లి, అక్కడ ఆ రోజుకు కావల్సిన ఏర్పాట్లు, అలంకరణ ఎలా ఉండాలో చూస్తాం. అమ్మ ఈ పనులన్నీ స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. వాలెంటీర్లు వచ్చి, స్టేడియం అంతా శుభ్రం చేసి, పూజ సామాగ్రి తులసి కోటతో సహా అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు. అక్కడ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చి, రెడీ అయి, మళ్లీ స్టేడియంకు వచ్చేస్తాం. ఈ పనిలో సేవయే ప్రధానం. ముందుగా అనుకున్న షెడ్యూల్ మారి పోవచ్చు. పనుల విభజనలో ఎవరు ఏ పనైనా చేయాల్సి రావచ్చు. రెండువేల మంది వాలంటీర్లు, ఛానెల్స్లో వర్క్ చేసేవారు వెయ్యి మంది, మేం.. అందరం కలిసి ఒకే ఇంటి కార్యక్రమంగా పని చేస్తాం.తంజావూరుగోపురం సెట్ఇప్పటికే దేశంలోని ప్రధాన పీఠాధిపతులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి.. మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతియేటా ఒక్కో థీమ్ తీసుకుంటాం. ఈసారి కాశీ థీమ్తో పాటు మరిన్ని కొత్త మార్పులు ఉండబోతున్నాయి. దీంతో ప్రతియేటా వచ్చినవారు కూడా కొత్త అనుభూతి పొందుతారు. ఇప్పటికి దేశంలో ఉన్న ప్రముఖులందరూ దీ పోత్సవానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం శృంగేరీ, కంచి పీఠాధిపతులు రాబోతున్నారు. నాగసాధువుల చేత శివునికి ప్రత్యేక అభిషేకాలు జరగబోతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరికీ పూజా సామాగ్రిని భక్తి టీవీయే ఉచితంగా అందజేస్తుంది. ప్రతిరోజూ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజు చేసే కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఈ సంవత్సరం తంజావూరు గోపురం నేపథ్యంలో ప్రధాన సెట్ను రూపొందిస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
ఎంఎస్ ధోనీ కుమార్తె జివా ఏం కావాలనుకుంటుందో తెలుసా? వైరల్ వీడియో
డాక్టర్ బిడ్డ డాక్టర్ కావాలని, యాక్టర్ బిడ్డ యాక్టర్, వ్యాపారి బిడ్డ వ్యాపరే అవుతుందని సాధారణంగా భావిస్తుంటాం. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టనవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే టీమీండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా ఆయన కుమార్తె క్రికెటర్గా రాణించాలనుకుంటున్నారా? మెరుపువేగంతో సెంచరీలు చేస్తూ, క్రికెట్ గ్రౌండ్లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలనుకుంటున్నారా? అయితే మీకో ఇంట్రస్టింగ్ న్యూస్. ధోని ముద్దుల తనయ పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటోందో తెలుసా?ఎంఎస్ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా. ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది. భవిష్యత్తులో ఏం చేస్తావు అంటే పిల్లలు సాధారణంగా, డాక్టర్, యాక్టర్, టీచర్, పైలట్ ఇలాంటి సమాధానాలే చెబుతారు. కానీ ప్రకృతిని ప్రేమించి, ప్రకృతి శాస్త్రవేత్తను అవుతాను ధోనీ కుమార్తె చెప్పడం విశేషంగా నిలిచింది.(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)శుక్రవారం నాడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో జరిగిన సంభాషణలో, తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని కుమార్తె జీవా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ధోని భార్య సాక్షీ, జీవా కాశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్ కి పౌరి ప్రాంతం సమీపంలోని మరొక వీడియోలో, సాక్షి మరియు ఇతరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చూపించారు. వారి సందర్శనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ ఈ వీడియోను అప్లోడ్ చేశారు. 10 ఏళ్ల చిన్నారికి ఇలాంటి కోరిక ఉండటం చాలా ఆనందం అంటూ ప్రశంసించారు.భవిష్యతుల్లో మంచి మనిషిగా రాణిస్తుంది అంటూ దీవించారు నెటిజన్లు.I want to become Naturalist : Ziva Dhoni #MSDhoni pic.twitter.com/r0gqRiLrEu— Chakri (@ChakriDhonii) October 25, 2025 -
అమ్మా? నాన్నా? బిడ్డకు ఎవరి స్పర్శ ముఖ్యం?
కేర్ కేర్మని ఏడుస్తున్న బుజ్జి పాపాయిని తల్లి తన పొత్తిళ్లలోకి తీసుకోగానే క్షణాలలో ఏడుపు ఆపేసి హాయిగా కేరింతలు కొట్టడం మనకు తెలిసిందే. పాపాయి ఏడుపు మానడానికి తల్లి స్పర్శే ప్రధాన కారణం. ఏడుపు ఆపడానికే కాదు, బిడ్డ ఎదుగుదలలో తల్లిదండ్రుల స్పర్శదే ప్రముఖ పాత్ర అని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే వెచ్చని స్పర్శ నార్మల్గా పుట్టిన బిడ్డలతోపాటు నెలలు నిండక ముందే జన్మించిన ప్రీమెచ్యూర్డ్ శిశువుల మెదడు అభివృద్ధికి మరింత కీలకమని తాజా అధ్యయనం తేల్చింది. 32 వారాల కంటే ముందు జన్మించిన శిశువులను ఇన్ఫెక్షన్లేవీ సోకకుండా ఇంక్యుబేటర్లో పెట్టడం సాధారణం. అయితే అలాంటి పిల్లలకు కూడా తల్లి లేదా తండ్రి కంగారూ కేర్ అంటే బిడ్డ శరీరాన్ని మృదువుగా తాకుతూ ఉంటే, వారి మెదడులో ముఖ్యమైన భాగాలు బలంగా అభివృద్ధి చెందుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనికి కారణం ఏమిటంటే, తల్లి గర్భాశయంలో స్పర్శ అనేది మొదటగా అభివృద్ధి చెందే ఇంద్రియమే కాబట్టి. మనం పెద్దయ్యాక మసకబారే చివరి ఇంద్రియ వ్యవస్థ కూడా స్పర్శే.అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, స్కిన్ అలర్జీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలలో స్పర్శ చూపే సానుకూల ప్రభావాలు గుర్తించబడ్డాయి. నిజానికి అమ్మానాన్నలు ముఖ్యంగా మాతృస్పర్శ పొందిన పిల్లలకు ఆటిజంపాళ్లు తక్కువగా ఉంటాయని, ఒకవేళ ఆటిజం ఉన్న పిల్లలే అయితే వారికి తల్లి స్పర్శ, మృదువైన మసాజ్ వల్ల వారిలోని మెదడు ఎదుగుదల లోపాలు ఉపశమించి వారిలోని దూకుడు స్వభావం తగ్గుతుందని నియోనేటల్ కేర్ నిపుణులు, చైల్డ్ సైకియాట్రిస్టులు చెబుతున్నారు. వీరితోపాటు డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే మసాజ్ థెరపీ వల్ల వారి కండరాల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆటిజం ఉన్న పిల్లలకు మెదడులోని న్యూరాన్లు అభివృద్ది చెందుతాయని పరిశోధనలలో తేలింది. జీవితంలోని ప్రారంభ దశలలో తమ పిల్లలతో బంధం ఏర్పరచుకోలేకపోయిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకుని తమ బిడ్డలకు క్రమం తప్పకుండా తమ స్పర్శను ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని ఆశించవచ్చు. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)ఒక భారతీయ తల్లి స్పర్శఇది కేవలం భారతీయ తల్లులకే పరిమితం కాకపోయినా, మన సంస్కృతిలో చంటిపిల్లలను తల్లి లేదా అమ్మమ్మ నానమ్మ వంటి వారు వెన్ను తడుతూ జోలపాడితే చాలు క్షణాలలోనే గాఢమైన నిద్రలోకి జారుకోవడం అందరికీ తెలిసిందే. చిన్నారులలో సంభాషణ తీరు మెరుగుపడటానికి, మెదడు ఆరోగ్యకర మైన పనితీరుకు, శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల సమతుల్యతకు, శారీరక, భావోద్వేగ శ్రేయస్సుకు స్పర్శ చాలా ముఖ్యమైనది. ప్రేమను అందించడంలోనే కాదు, ప్రేమను పొందడంలో కూడా స్పర్శ ఎంతో తోడ్పడుతుంది. కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) వంటి ఇతర న్యూరోకెమికల్స్కు ప్రతిస్పందనగా మెదడు కూడా అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య కరమైన పనితీరుకు సాధారణ స్థాయి కార్టిసాల్ అవసరం అయినప్పటికీ, స్పర్శ లోపం ఉన్న శిశువులు పెరిగే కొద్దీ వారి భావోద్వేగాలను, ప్రవర్తనను నియంత్రించడంలో తగినంత కార్టిసాల్ ఉత్పత్తి కాక పిల్లలు ఇబ్బంది పడవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు నవజాత శిశువులతో శారీరక అనుబంధాన్ని కలిగి ఉండటం వారి మెదడు ఎదుగుదలకు తద్వారా మానసిక అభివృద్ధికి చాలా అవసరం. చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలు -
ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే పార్టీ : తరలి వెళ్లిన తారలు
రిలయన్స్ సామ్రాజ్యవారసులు, యువ పారిశ్రామిక వేత్తలు, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ పుట్టిన రోజు వేడుకలకోసం అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ పార్టీని ఏర్పాడు చేసింది. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇషా , ఆకాష్ అంబానీల గ్రాండ్ బర్త్డే పార్టీ ఫోటోలు ,వీడియోల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కవల పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ అక్టోబర్ 23న తమ 34వ పుట్టినరోజును జరుపుకున్నారు. బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేతోపాటు, అనన్య పాండే, కరణ్ జోహార్తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు అనన్య, కరణ్ జోహార్ ఈ వేడుకలకు హాజరయ్యారు.పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, దిశా పటానీ, అర్జున్ కపూర్, ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తదితర సెలబ్రిటీలు జామ్నగర్కు చేరుకున్నారు. ప్రింటెడ్ హాఫ్-స్లీవ్ షర్ట్, ఫ్రేమ్ ఉన్న సన్ గ్లాసెస్తో దీపికాతోపాటు, రణ్వీర్ సింగ్ నల్ల ప్యాంటు , బిగ్ సైజు తెల్లటి టీ-షర్టులో క్యాజువల్ లుక్లో విమానాశ్రయంలో దర్శన మిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి. ఈ ట్విన్స్ బర్త్డే సందర్భంగా ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇషా అంబానీతో ఉన్న సెల్ఫీని షేర్ చేసి, "హ్యాపీ బర్త్డే! అంటూ విషెస్ తెలిపింది. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్) View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala) -
సాంకేతికత అను..బంధం
టీవీ వచ్చి ఆడవాళ్లు .. ఇంట్లోవాళ్లకు తిండి పెట్టకుండా చేసింది.. స్మార్ట్ ఫోన్ వచ్చి.. ఇంట్లోవాళ్లు ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసింది.. టెక్నాలజీ మీద సంప్రదాయం చేస్తున్న కామెంటూ.. విడుస్తున్న నిట్టూర్పూనూ!అయ్యో సాంకేతికతతో సౌకర్యాలే కాదు.. సాఫల్య అనుబంధాలూ ఉన్నాయని చెబుతున్నాయి కొన్ని అనుభవాలు!జనార్థన్, రాధ (పేర్లు మార్చాం)కి కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అమ్మాయి ఆస్ట్రేలియాలో, అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు. జనార్దన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఉద్యోగి. రాధ గృహిణి. ఇద్దరూ డెబ్భైల్లో ఉన్నారు. బీపీతో జనార్ధన్, షుగర్, థైరాయిడ్తో రాధ సహజీవనం చేస్తున్నారు. ఓ మూడేళ్ల కిందటిదాకా ఇద్దరి జీవనశైలి వేరుగా ఉండేది. ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. చిన్నిపాటి వ్యాయామానిక్కూడా బద్ధకించేవారు రాధ. కూర్చున్న చోటికే ఆమెకు అన్నీ తెచ్చిపెట్టేది వాళ్ల పనమ్మాయి. నిద్రపోయినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా యూట్యూబ్లోనే గడిపేవారు. జనార్దన్ వాకింగ్ క్లబ్ ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్లినా.. పార్క్లోని చెట్లకింద కూర్చుని కబుర్లతోనే కాలక్షేపం చేసేవారు కానీ నడిచేవారు కాదు. ఆహారం మీద అదుపు ఉండేదికాదు. అమెరికాలో ఉన్న పిల్లలు పోరగా పోరగా మెడికల్ టెస్ట్లకి వెళ్లేవారు. ఆ రిపోర్ట్స్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు కనపడేవి. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో వాళ్లు బాధపడుతూ, విదేశాల్లో ఉన్న తమ పిల్లలకు ఆందోళన కలిగించేవారు. తల్లిదండ్రుల కోసం కెరీర్ను వదులుకుని పిల్లలు వచ్చే పరిస్థితి లేదు. అలాగని వీళ్లే అక్కడికి వెళ్లినా, అక్కడ అడ్జస్ట్ అయ్యే ముచ్చట అసలే లేదు. అమ్మా నాన్నను హెల్త్లైన్లో పెట్టడమెలాగా? వాళ్లకు ఓ యాక్టివిటీ కల్పించడమెలాగా అని పిల్లలిద్దరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు కోడలు రంగంలోకి దిగింది.ఇలా సీన్ మార్చేసింది.. ఆ అమ్మాయి వృత్తిరీత్యా బిజినెస్ ఎనలిస్ట్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఇండోర్ డెకరేషన్ ఆమె ఇష్టంగా చేసే పనులు. అందుకే తన అత్తమామల జీవనశైలిని ఓ గాడిలో పెట్టేవరకు ఉద్యోగానికి సెలవుపెట్టి.. హాబీల మీద దృష్టి పెట్టింది. అలా దొరికిన సమయం, వెసులుబాటును పూర్తిగా ఇండియాలో ఉన్న ఇన్లాస్ మీదే వెచ్చించింది. అందులో భాగంగా ముందు వాళ్ల దైనందిన జీవనసరళిని పరిశిలీంచింది. వాళ్ల బాధ్యతలను చూస్తున్న కన్సల్టెంట్స్తో మాట్లాడింది. ఆ రిపోర్ట్స్, వాళ్ల లైఫ్స్టయిల్ గురించి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ న్యూట్రిషనిస్ట్తోనూ చర్చించింది. ఇవన్నీ కూడా అమెరికాలో ఉండే షెడ్యూల్ చేసుకుంది. ఈ స్టడీతో ఆమె వాళ్ల దైనందిన కార్యక్రమాల టైమ్టేబుల్ ఒకటి తయారు చేసి వాట్సాప్లో పంపింది. ప్రింట్ అవుట్స్ తీసుకొమ్మని చెప్పింది. డైట్కి సంబంధించిన పట్టీని ఫ్రిజ్కి అతికించమంది. వ్యాయామానికి సంబంధించి డ్రెసింగ్ టేబుల్కి అతికించమంది. సాయంకాలం వాళ్లు చేయాల్సిన పనుల పట్టికను టీవీ కేస్కి అతికించమంది. రోజూ ఉదయాన్నే (ఇండియన్ కాలమానం ప్రకారం) అయిదింటికల్లా ఆ ఇద్దరినీ ఫోన్ చేసి నిద్రలేపేది. వాకింగ్కి వెళ్లమని పోరేది. వాళ్లకు కావాల్సిన సరకులు, కూరగాయలు, డాక్టర్ అపాయింట్మెంట్స్ వగైరా సమస్తం తానే చూసుకోవడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే యాప్స్ ద్వారా తనిచ్చిన జాబితా ప్రకారం అన్నీ ఆర్డర్ చేసేది. మూడు నెలలకు ఒకసారి వాళ్లకు టూర్స్నీ ΄్లాన్ చేయడం.. టికెట్స్, అకామడేషన్ బుక్ చేయడం అన్నీ చూసేది. ప్రతివారం ఏడు రోజులకు సరిపడా వాళ్లకు సుడోకు, వర్డ్ పజిల్ లాంటి ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చేది. వీటన్నిటితో.. ఆరు నెలల గడిచేసరికి ఇద్దరిలో చాలామార్పు వచ్చింది. ఇద్దరూ చెరో రెండు కేజీల వెయిట్ తగ్గారు. షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇద్దరికీ కొత్త సర్కిల్ ఏర్పడింది. దాంతో ఇద్దరిలో జీవనాసక్తి, జీవనోత్సాహం పెరిగాయి. ట్రావెల్ చేయడం వల్ల ఉల్లాసంగా కనపడసాగారు. ఈ మార్పుకి ఇరుగు పొరుగు, చుట్టాలే కాదు వాళ్ల కన్సల్టెంట్ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇంట్లో పళ్లు, కూరగాయలు, సరకులు వృథా అవట్లేదు. మురిగిపోయి చెత్త బుట్ట దాఖలు కావట్లేదు. ఎప్పటికప్పుడు తాజా వాటినే వినియోగిస్తున్నారు. కారణం.. తానిచ్చిన టైమ్టేబుల్ తప్పితే ఆ వారం మనవరాలితో గానీ.. తమతో గానీ ఫోన్ ఇన్ ఉండదని, తామెవరమూ మాట్లాడమని హెచ్చరించింది కోడలు. ఈ హెచ్చరిక వాళ్ల జీవనశైలిని దిద్దడమే కాదు.. తమ కుటుంబ అనుబంధాన్నీ బలపరచింది అంటారు జనార్ధన్.‘తొలుత.. చిన్నపిల్లల్లా మాతో మా కోడలు అవన్నీ చేయిస్తుంటే చిరాకు, కోపం వచ్చేవి. మా అబ్బాయికి, అమ్మాయికి కంప్లయింట్ కూడా చేశాను. మా అమ్మాయి మా కోడలితో ‘పోనీలే వదినా.. పెద్దవాళ్లయిపోయారు వాళ్ల మానాన వాళ్లను ఉండనివ్వండ’ని చెప్పింది. పెద్దవాళ్లయ్యారు కాబట్టే.. ఈ జాగ్రత్తలు. ఒక్క ఏడాది ఓపికపట్టండి.. నా మీద నమ్మకం ఉంచండి’ అని అందరికీ చెప్పింది మా కోడలు. ఏడాది కాదు.. ఆర్నెలు తిరిగేసరికే మా కోడలు కోరుకున్నదేంటో మాకు తెలిసింది. ఆ మార్పు మా ఆరోగ్యాన్నే కాదు మా కుటుంబ బంధాలనూ గట్టిపరిచింది’ అంటారు రాధ. తాను చేసిన ఈ ప్రయోగం తన అత్తమామల ఆరోగ్యాన్ని మెరుగుపరచేసరికి దాన్ని వాళ్ల అమ్మకూ అప్లయ్ చేసింది. అంతేకాదు రాధ వాళ్లమ్మాయి తన అత్తమామల విషయంలోనూ ఆ ఎక్స్పరిమెంట్ను అమలు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించింది.విదేశాలలో ఉన్నా కూడా...విదేశాల్లో ఉన్న చాలామంది పిల్లలు ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు, ఇన్ లాస్ ఆరోగ్యం విషయంలో డాక్టర్ల అపాయింట్మెంట్స్ తీసుకోవడం, ట్రావెల్ ΄్లాన్ చేయడం, మందులు, నిత్యావసర సరుకులు ఆర్డర్ పెట్టడం పరిపాటే. కానీ ఇలా ఫిజీషియన్ ఇచ్చిన రిపోర్ట్స్ను సైకియాట్రి, సైకాలజీ నిపుణులు, ΄ûష్టికాహార నిపుణులతో చర్చించి.. భవిష్యత్లో రానున్న రిస్క్లను నియంత్రించడానికి చేయాల్సిన పనులతో పెద్దవాళ్లకు ఓ ఎక్సర్సైజ్లాంటిది ఇచ్చి.. అందులో వాళ్లను తలమునకలు చేయడం మాత్రం కొత్తే. అంతేకాదు ఆరోగ్యకరమైన ప్రయోగం కూడా. దీంతో పెద్దలు రోజుకు సరిపడా కావల్సినంత యాక్టివిటీలో ఉండి.. పిల్లలు దగ్గరలేరన్న బెంగకు గురికాకుండా మానసిక ఉల్లాసాన్ని పెం పొందించుకున్నారు. అలాగే గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. ఆ గాడ్జెట్.. వాట్సాప్ నెట్వర్క్తోనే తన ఇన్లాస్, పేరెంట్స్కి దగ్గరై.. లాంగ్ డిస్టెన్స్లో కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పింది.గాడ్జెట్స్ వల్ల బంధాలు బలహీనమైపోయి ఒంటరితనంతో కునారిల్లిపోతారన్న అపోహకూ చెక్ పెట్టింది ఈ కుటుంబం. ఏదైనా ఉపయోగించుకునే తీరులో ఉంటుందని నిరూపించింది. -
డయాబెటిస్ని తిప్పికొట్టి.. 30 కిలోల బరువు తగ్గింది!
బరువు తగ్గడం అందరూ చాలా కష్టమనే భావిస్తారు. ఎందుకంటే అంత ఈజీగా కొలెస్ట్రాల్ని తగ్గించుకుని స్లిమ్గా మారడం సాధ్యం కాదు. కానీ ఈ అమ్మాయి అధిక బరువుతో మధుమేహం బారినపడ్డప్పటికీ అధైర్యపడకుండా బరువు తగ్గింది. డయాబెటిస్ నుంచి కూడా బయటపడింది. అలాగని కఠినమైన ఆహారనియమాలేం పాటించలేదు, చిన్ని చిన్న ఆహారపు అలవాట్లతోనే ఇదంతా సాధ్యం చేసిందామె. మరి అదెలాగో ఆమె మాటల్లో సవివరంగా తెలుసుకుందామా..!.డైటీషియన్ జాకీ(Dietitian Jackie) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇలా రాశారు. తనకు 20 ఏళ్ల వయసులో ఉండగా ప్రీ డయాబెటిక్(pre-diabetic) నిర్థారణ అయ్యిందని తెలిపింది. దాంతో ఇక ఇప్పుడైనా ఆరోగ్యంపై దృష్టిసారించక తప్పదని ఫిక్స్ అయ్యానని చెప్పింది. అదీగాక పేరెంట్స్ కూడా బరువు తగ్గేలా ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోమని సూచించడంతో..తన ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. 30 కిలోలు ఎలా తగ్గిందంటే..సరైన ఆహారం: తన డైట్లో మంచి పుడ్ని తీసుకునేలా పోషకాహార నిపుణుడి సలహాలను తీసుకున్నట్లు తెలిపారు. నారింజ రసం వంటి చక్కెర పానీయాలను, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలను దూరంగా ఉంచి, గోధుమ రొట్టెలను ఆహారంలో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేలరీలను తీసుకోవడాన్ని తగ్గించి, పోషకవంతమైన ఆహారాన్ని ఎక్కువగా తినేలా చూసుకునేదట.ఫుడ్ తయారైన విధానం: వ్యాయామాలు చేసినంత మాత్రమే బరువు తగ్గరు. తీసుకునే అల్పాహారం, ఆరోగ్యకరమైనదా లేదా అని నిర్థారించుకునేదట. ముఖ్యంగా పోషకాహారం ఎంత మేర ఉందో తెలసుకుని మరి తీసుకునేదట. అలానే సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. వ్యాయామం..చిన్న వామ్-అప్ వ్యాయామాలతో మొదలు పెట్టి..ట్రెడ్మిల్, ఆరు నుంచి ఏడు మైళ్లు పరుగుపెట్టడం వంటి వ్యాయామాలని పట్టుదలతో చేసి లక్ష్యానికి చేరుకున్నట్లు తెలిపారామె. అలా బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ని క్యూర్ చేసుకున్నట్లు కూడా వివరించింది. అయితే తనకు వెయిట్లాస్ అవ్వడం కష్టమైన పని కాదని, అదొక నిర్వహణ దశ అని అంటోందామె. ఇప్పటికీ తాను ఆ అలవాట్లను కొనసాగిస్తున్నట్లు వివరించింది. తగ్గిన ఆ బరువుని నిర్వహిస్తే హెల్దీగా ఉంటామని..కేవలం జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలని చెబుతోంది డైటీషియన్ జాకీ. (చదవండి: Idli For Breakfast: ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?) View this post on Instagram A post shared by Jackie, MS, RD | Weight Loss Coach & Mindful Eating Dietitian (@the.mindful.nutritionist) -
ఆరోజు మా అమ్మ బంగారు గాజులు, నెక్లెస్లు దానం చేసింది.. మరి ఇప్పుడు?
పారిశ్రామిక దిగ్గజంఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఎప్పటికప్పడూ ఆసక్తికర ట్వీట్లతో ప్రజకు చేరువుగా ఉంటారు. ఆసక్తికరమైన ట్రావెల్స్, స్ఫూర్తిని కలిగించే విషయాలతో చైత్యన్యపరిచేలా ఉంటాయా ఆయన ట్వీట్స్. ఈసారి కూడా అలాంటి ఆసక్తికరమైన, ఆలోచింపచేసే ట్వీట్ని నెట్టింట షేర్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం వింటే..ఇది నిజమే కదా..కచ్చితంగా ఇలా సాధ్యమేనా అనే సందేహం మెదులుతుంది మదిలో..అదేంటంటే..1962లో చైనాతో జరిగిన యుద్ధంలో దేశానికి మద్దతుగా భారతీయ మహిళలు నిస్వార్థంగా బంగారు ఆభరణాలు ఇచ్చిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు అందుకు సంబంధించిన తన బాల్య జ్ఞాపకాన్ని కూడా షేర్ చేశారు. టాప్ పది దేశాల్లో కంటే బంగారం భారతీయ మహిళల వద్దే ఉంది అన్న ట్వీట్కి ప్రతిస్పందనగా ఆయన ఇలా రాసుకొచ్చారు పోస్ట్లో. బంగారం ఏఏ దేశాల వద్ద ఎక్కువగా ఉంది అనే జాబితాను వివరిస్తూ..యూఎస్ఏ: 8,133 టన్నులుజర్మనీ: 3,351 టన్నులుఇటలీ: 2,451 టన్నులుఫ్రాన్స్: 2,437 టన్నులురష్యా: 2,332 టన్నులుచైనా: 2,279 టన్నులుస్విట్జర్లాండ్: 1,039 టన్నులుజపాన్: 845 టన్నులునెదర్లాండ్స్: 612 టన్నులుపోలాండ్: 448 టన్నులునాడు 1962లో, చైనాతో యుద్ధం జరగుతున్న సమయంలో రక్షణ ప్రయత్నాల నిమిత్తమై జాతీయ రక్షణ నిధిని కోరింది. మన దేశాన్ని రక్షించుకునేందేకు ప్రజలంతా తమ ఆభరణాలను, బంగారాన్ని దానంగా ఇవ్వాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. నేడు వేల కోట్ల ధర పలుకుతున్న బంగారాన్ని అప్పుడు దేశ రక్షణ కోసం సేకరించడం నాకు ఇంకా గుర్తు ఉంది అంఊ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా నాకు అప్పుడు ఏడేళ్లు. ముంబైలో మా అమ్మ పక్కన నిలబడి ఉండగా..ఆమె ఇది విని నిశబ్ధంగా తన బంగారు గాజులు, నెక్లెస్లలో కొన్నింటిని సేకరించి, వాటిని ఒక గుడ్డ థైలాలో ఉంచి, ట్రక్కుపై ఉన్న స్వచ్ఛంద సేవకులకు అందజేసిన ఘటన ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఇవాళ ఆ స్థాయిలో స్ఫూర్తి, స్వచ్ఛంద చర్యలు జరుగుతాయా అని ప్రశ్నించారు. అంతేగాదు నాకు ఆ జ్ఞాపకం జాతీయ స్థితిస్థాపకత అనేది విధాన సాధనాలపై మాత్రమే కాకుండా, ప్రజల సమిష్టి సంకల్పంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంటుంది. అని రాశారు." అని పోస్ట్లో రాసుకొచ్చారు.(చదవండి: Diwali 2025: ఆ గ్రామంలో దీపావళి ప్రాభవమే వేరు!) -
ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?
ఇడ్లీ అనేది చాలా మంది భారతీయులకు అలవాటైన అల్పాహారం. దక్షిణాదిలో అయితే ఇడ్లీ ఇంటింటి వంటగానే చెప్పొచ్చు. అల్పాహారానికి అసలైన అర్ధంలా తేలికగా అనిపించడంతో పాటు ఇంట్లోనే ఇడ్లీని సులభంగా రుచిగా తయారు చేసుకోగలిగే వీలు దీని ప్రాధాన్యాన్ని పెంచుతోంది.అంతేకాక ఇది అన్నిరకాల జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది. మరి ప్రతి రోజూ ఉదయం ఇడ్లీ తినడం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? దీని గురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారు..?జీర్ణక్రియకు మేలు..ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహారాలు మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, ఇది సజావుగా జీర్ణక్రియ జరిగేందుకు దారితీస్తుంది. ఇది ఆవిరిలో ఉడికించబడి ఉంటుంది కాబట్టి విచ్ఛిన్నం కావడం సులభం అందువల్ల దానిని ప్రాసెస్ చేయడానికి మన కడుపు అతిగా కష్టపడాల్సిన అవసరం రాదు. ఇది ఆమ్లత్వం, బరువు లేదా తరచుగా కడుపు ఉబ్బరంతో పోరాడుతున్న వారికి మేలైన ఎంపికగా ఉంటుంది. సాంబారుతో తినడం వల్ల ప్రేవుల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఫైబర్ను కూడా జోడించినట్టు అవుతుంది.దీర్ఘకాల శక్తిఇడ్లీలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శక్తిని నెమ్మదిగా దశలవారీగా విడుదల చేస్తాయి, దాంతో ఎక్కువసేపు మనల్ని చురుగ్గా ఉంచుతాయి. ఇది ఆకస్మిక ఆకలి పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది బిజీగా ఉండే ఉదయం సమయంలో పనులపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. ప్రోటీన్ కూరగాయలతో జత చేసినప్పుడు, ఇడ్లీ తినే ఆలోచనను నియంత్రించే సమతుల్య ప్రారంభాన్ని అందిస్తుంది. స్థిరమైన శక్తి విడుదల తో మధ్యాహ్నం పూట స్నాక్స్గా జంక్ ఫుడ్ తీసుకునే అవసరాన్ని నివారిస్తుంది.గుండె ఆరోగ్యానికి మద్దతుఇడ్లీని ఆవిరిలో ఉడికించినందున, సహజంగానే కొవ్వు తక్కువగా ఉంటుంది గుండెపై భారం కలిగించే అదనపు నూనె లేకుండా ఉంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2018లో జరిపిన ఒక అధ్యయనంలో అధిక కొవ్వు గల బ్రేక్ఫాస్ట్లను తక్కువ కొవ్వు ఎంపికలతో భర్తీ చేయడం గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుందని కనుగొంది. ఇడ్లీని సాంబార్తో జత చేసినప్పుడు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు గుండె పనితీరును మెరుగ్గా నిర్వహించడానికి మరింత సహాయపడతాయి.అధిక బరువుకు చెక్...ఒక మీడియం ఇడ్లీలో దాదాపు 35 నుంచి 50 కేలరీలు ఉంటాయి, అందుకే ఇది తక్కువ కేలరీలు కోరుకునేవారికి సరైన అల్పాహారం ఎంపికగా మారుతుంది. దీని తేలికపాటి రూపం.. కడుపును మాత్రం నిండుగా ఉంచుతుంది. ఇడ్లీని సాంబార్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీతో కలిపినప్పుడు, రుచితో పాటు సంతృప్తి స్థాయి పెరుగుతుంది ఆకలి తగ్గుతుందిరోగనిరోధక శక్తిపులియబెట్టిన ఆహారాలు పేగుకు మేలు చేస్తాయని అంటారు పేగు ఆరోగ్యం రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇడ్లీ జీర్ణం కావడం సులభం పేగు బాక్టీరియా వృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెరుగైన మొత్తం శ్రేయస్సు, మెరుగైన పోషక శోషణ బలమైన సహజ రక్షణ వ్యవస్థకు దారితీస్తుంది. సమతుల్య ఉదరం ప్రశాంతమైన మానసిక స్థితి, కాంతివంతమైన చర్మం రోగనిరోధక శక్తిని అందిస్తుంది.ఇడ్లీ కొంత ప్రోటీన్ కలిగి ఉంటుంది, కానీ సాంబార్, వేరుశెనగ వంటి పప్పులతో కూడిన చట్నీలు జోడించడం వల్ల ప్రోటీన్ పరిమాణం మరింత పెరుగుతుంది.బియ్యంతో తయారైన ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది, అదే సమయంలో రవ్వ ఇడ్లీ తక్కువ ప్రోబయోటిక్ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి సాంబార్ ఫైబర్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీలతో దీన్ని జత చేయడం మేలు.మరిన్ని పోషకాల కోసం రాగులు, ఓట్స్ లేదా మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండిని కూడా ప్రయత్నించవచ్చు.(చదవండి: Young Talent: వయసు 19 భాషలు 400..! జస్ట్ ఒక్క గంటలో 20 భాషల్లో..) -
గ్లోబల్ స్టార్ గొల్లభామ..!
సిద్ధిపేటలో పుట్టిన వందల ఏళ్ల నాటి సంప్రదాయ స్వరూపం గొల్లభామ. ఈ బొమ్మలను చీరలపై ముద్రించడం దాదాపు వందేళ్ల క్రితం ప్రారంభమైంది అంటారు. చాలా కాలం పాటు అందరూ మర్చిపోయిన గొల్లభామ చీర, తిరిగి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్గా మారింది. పలువురు సిటీడిజైనర్లు సైతం పాత గొల్లభామకు కొత్త వైభవాన్ని అందించే పనిలో పడ్డారు. పాత డిజైన్కు కొత్త వెలుగులు అద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు కర్ణాటకకు చెందిన సునంద. నగరంలోని కొంపల్లిలో నివసించే సునంద అలనాటి గొల్లభామకు సరికొత్త రూపును జతచేసి అందరి దృష్టీ మనవైపు మళ్లేలా చేశారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న రివైన్డ్ గొల్లభామ అనుభవాలు ఆమె మాటల్లోనే.. దుబ్బాక క్లస్టర్ డిజైనర్గా పనిచేసినప్పుడు ఈ డిజైన్ను తొలిసారి చూశా. అనంతరం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ విత్ నేచురల్ డైస్, అండ్ నానో టెక్నాలజీ అంశంపై పీహెచ్డీ కంప్లీట్ అయ్యాక మరోసారి సిద్ధిపేటకు వెళ్లి గొల్లభామ ఫీచర్స్ పరిశీలించాను. చాలా లోకల్ ఫీల్ ఉంది.. ఫేస్లో, షేప్లో స్పష్టత లేదని, మంచి ఫేస్ లుక్ జత చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా. పాతికేళ్ల క్రితం గొల్లభామను నేసి ఇప్పుడు పక్కన పెట్టేసిన సత్య, కైలాసాన్ని కలిసి నాకు కావాల్సినట్టు చీరలు నేసి ఇస్తారా అని అడిగాను.. కష్టం మేడమ్.. బాగా టైమ్ పడుతుంది అన్నారు. చీర మొత్తం అక్కర్లేదు.. క్లాత్ మీద బొమ్మ నేసి ఇస్తే చాలు అంటే.. అతి కష్టం మీద ఒప్పుకున్నారు.. అలా రివైవ్డ్ గొల్లభామ పునర్జన్మించి.. కొత్త విజయాలు అందుకుంది.జియోగ్రాఫికల్ ఇండికేషన్..అలా రివైవ్డ్ గొల్లభామ పేరిట నేను ఇచ్చిన డిజైన్స్కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచి్చంది. తద్వారా గొల్లభామకు సిద్ధిపేట వీవర్స్ మాత్రమే హక్కుదారులయ్యారు. ప్రపంచం మొత్తం మీద ఇంకెవ్వరూ దీన్ని కాపీ కొట్టలేరన్నమాట. ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో నేచురల్ డై తో గొల్లభామకు ప్రాణం పోసి పలుమార్లు ఎగ్జిబిషన్స్ నిర్వహించాం. అప్పట్లో సినీనటి చేనేతల బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సమంత ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో కూడా నిర్వహించాం. అలా మన గొల్లభామకు స్వల్పకాలంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. పాత కాలంలో గొల్లభామ చీరలు మాత్రమే లభించేవి. అయితే ప్రస్తుతం డ్రెస్ మెటీరియల్స్, దుపట్టా, పల్లులో సైతం గొల్లభామను జత చేయడం ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్ర గొల్లభామను గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్లాలనే ఆశ ఫలిస్తోంది.కళాకారుల నైపుణ్యం.. సిద్ధిపేట కళాకారుల నైపుణ్యానికి అద్ధం పట్టే గొల్లభామ చీరలను డిజైనర్ అర్చన కొచ్చర్ మిస్ వరల్డ్ 2025 వేదికపై ప్రదర్శించారు. రీసెర్చ్ గేట్ నుంచి 2025 పరిశోధనా పత్రం గొల్లభామ క్రాఫ్ట్ను డిజిటల్గా సంరక్షించడం, దాని చుట్టూ ఆర్థిక వ్యవస్థ సృష్టించడానికి ఉద్దేశించింది. 2022 యునెస్కో నివేదికలో గొల్లభామ చీరలను ‘భారత దేశానికి ఐకానిక్ క్రాఫ్ట్’గా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వస్త్ర శాఖ ద్వారా చీరలను ప్రోత్సహిస్తోంది. స్టాల్స్ ఏర్పాటు చేయడం గోల్కొండ హస్తకళల షోరూమ్ వంటి వాటిలో అందుబాటులోకి తేవడం చేస్తోంది. గొల్లభామ చీరలకు 2012లో జీఐ ట్యాగ్ లభించింది. సిద్ధిపేట కేంద్రంగా.. కోలాటం, బతుకమ్మ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నా.. గొల్లభామ చీర తెలంగాణకే ప్రత్యేకం. ఈ చీరలు ధర కనీసం రూ.4వేల నుంచి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సిద్ధిపేటలో గొల్లభామ చీరలు నేయగలిగిన నేతన్నలు ప్రస్తుతం ఓ 20 మంది వరకూ ఉన్నారని అంచనా. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న లేపాక్షి భవన్ (ప్రస్తుతం గోల్కండ భవన్)లో అందుబాటులో ఉన్నాయిమా జీవితాలను మార్చింది.. తెలంగాణ సంప్రదాయ చేనేత కళాకారులుగా తరాల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఆ మధ్య కాలంలో కనుమరుగైపోయిన గొల్లభామ చీరలకు గత కొంతకాలంగా డిమాండ్ పుంజుకుంది. దీనికి పాత డిజైన్లో మార్పు చేర్పులు కూడా కారణం. ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారంతో పాటు ప్రభుత్వం నుంచి మాకు తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తోంది. ఈ సంప్రదాయ కళలకు యువత ఆదరణ చూపించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. – కైలాసం, చేనేత కళాకారుడుఉపాధికి ఊతం అందించింది.. సిద్ధిపేటలో గొల్లభామకు పూర్వవైభవం రావడంతో పాటు ఆ చేనేత కళాకారులకు పలువురు దీని ద్వారా ఉపాధి పొందడం ఆనందం కలిగిస్తోంది. చీర తయారు చేసే కైలాసానికి, దుపట్టా చేసే సత్యకు అవార్డు రావడంతో పాటు వారి ఆదాయం పెరగడం ఎంతో సంతృప్తినిస్తోంది. గత ఆగస్టులో కర్ణాటకకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు ఆదర్శ్ సొసైటీని సందర్శించారు. రివైవ్డ్ గొల్లభామ వెర్షన్ను చూసి ప్రశంసించారు. యువత కూడా మన సంప్రదాయ చేనేత పట్ల మరింత అవగాహన పెంచుకోవాలని కోరుతున్నా. – సునంద, ,టెక్స్టైల్స్, ఫ్యాషన్ డిజైనర్ (చదవండి: ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!) -
సోఫా డ్రెస్సే... సో బెటర్!
ఓల్డ్ సోఫా కవర్లను మూలన పడేయకుండా, వాటికి సరికొత్త అందాన్ని ఇచ్చింది రెచెల్ డిక్రూజ్. పాత సోఫా కవర్లను కాస్తా అందమైన చిక్ బ్యాక్లెస్ డ్రెస్గా మార్చి నెటిజనులను ఆశ్చర్యానందాలకు గురిచేసింది.‘అద్భుత కళా సృష్టి’ అని నెటిజనులు ఆమెను ప్రశంసించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ సోఫా డ్రెస్ వీడియోకు 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.సోఫా డ్రెస్ను ఒక కొలిక్కి తేవడానికి రెచెల్కు అయిదు గంటల సమయం పట్టింది. అయితే దీనికి వచ్చిన స్పందన తన శ్రమను మరిచి΄ోయేలా చేసింది. ‘ఈ బ్యాక్లెస్ డ్రెస్ను సోఫా ఫ్యాబ్రిక్ నుంచి తయారుచేశారు’ అని చెబితే తప్ప తెలియనంత సహజంగా ఉండడం విశేషం. (చదవండి: 200 ఏళ్లుగా అక్కడ దీపావళి లేదు..! కానీ మహాలయ అమావాస్యే..) -
‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!
కొత్త దుస్తులు కొనడం, కొత్త స్టైల్లో కనిపించడం ట్రెండ్ను ఫాలో అవడం... ఇవే ఫ్యాషన్ అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఆ ధోరణిని మార్చేసింది. ఇటీవల నటి కరీనాకపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి 30 ఏళ్ల నాటి వింటేజ్ సిల్క్ శారీ ధరించి అందరినీ ఆశ్చర్యపరించింది. ‘రీస్టైల్ ఫ్యాషన్‘ ద్వారా సస్టెయినబుల్ లివింగ్ కూడా గ్లామరే అనే సందేశాన్ని ఇస్తోంది. అదే నయా ట్రెండ్గా మన కళ్లకు కడుతోంది. ఆధునిక భారతీయ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీలు తమ దుస్తులను రీ క్రియేట్ చేస్తూ సోషల్మీడియాలో అందంగా... అబ్బురంగా చూపుతున్నారు. ఇది ఒక స్ఫూర్తిని కలిగించే మార్పు. ఈ మార్పు పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు. తరాల వారసత్వాన్ని కూడా పరిచయం చేయడం. సెలబ్రిటీల జీవనవిధానం సమాజాన్ని మార్చగలదనే విషయాన్ని అలియాభట్ తన దుస్తుల ద్వారా తెలియజేస్తుంది. లుంగీ స్టైల్ స్కర్ట్, పింక్ చికంకారీ కుర్తీని ధరించి వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత కరీనాకపూర్ ముంబైలోని తన నివాసం లో నిర్వహించిన దీ΄ావళి వేడుకలకు హాజరయ్యింది.సంగీత్ లెహంగా.. దీపావళి పార్టీలో... కిందటేడాది దీపావళి సమయంలో బాలీవుడ్ గ్లామ్ వేడుకలకు ఆలియాభట్ హాజరయ్యింది. తన పెళ్లి సమయంలో మెహెందీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ఈ గ్లామ్ పార్టీకి రీ స్టైల్ చేసి తిరిగి ధరించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ లెహంగాను రీ–స్టైల్ చేసి ధరించింది. ఈ లెహంగా సుమారు 180 టెక్స్టైల్ ప్యాచ్లతో, రియల్ గోల్డ్, సిల్వర్ నక్షీ, కోరా పూలు, వింటేజ్ సీక్వెన్సెస్తో తయారైంది. పార్టీకి కొత్త డ్రెస్ కొనకుండా, ఆమె ఆ లెహంగానే డిజైనర్ టాప్, జువెలరీ, హెయిర్స్టైల్తో రీ–స్టైల్ చేసింది. పర్యావరణ హితంపర్యావరణ స్పృహ కలిగిన దుస్తుల బ్రాండ్ ఎడ్–ఎ–మమ్మాను స్థాపించింది. ఇది పిల్లల, బాలింతలకు అవసరమయ్యే ఆర్గానిక్ దుస్తుల బ్రాండ్. ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించడానికి చేనేతలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. తన పెళ్లి సమయంలో ఉపయోగించిన లెహంగాతో సహా వివిధ రకాల తన దుస్తులను రీ క్రియేషన్ చేయడంలో అలియా ప్రసిద్ధురాలుగా పేరొందింది. అంతేకాదు పర్యావరణ అనుకూల బ్రాండ్లకు మద్దతు ఇస్తుంది.30 ఏళ్ల క్రితం చీర కొత్తగా...ఈ సందర్భంగా అలియాభట్ బంగారు రంగు చీరను ధరించింది. ఇండియన్ డిజైనర్ రీతుకుమార్ 30 ఏళ్ల క్రితం ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరను స్లీవ్లెస్ బస్టియర్ స్టైల్ బ్లౌజ్తో జత చేసింది. బంగారు చోకర్ నెక్లెస్, ఉంగరాలు, మాంగ్ టిక్కా, బ్రేస్లెట్ను ధరించింది.పాత దుస్తులను కొత్తగా తీర్చిదిద్దడం. ఆ దుస్తులు కూడా కొత్తగా కనిపించేలా మార్చడం అలియా భట్ చూపుతున్న మార్గం. ఆమె స్టైలింగ్ ఫిలాసఫీ కూడా ఇదే. ‘ఫ్యాషన్ అంటే కేవలం లుక్ కాదు, అది మన విలువల ప్రతిబింబం’ అంటుంది ఆలియా. ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ కేవలం ట్రెండ్ కాదు ఒక సందేశం కూడా! (చదవండి: మంత్లీ మ్యారేజ్ రివ్యూ!) -
మంత్లీ మ్యారేజ్ రివ్యూ!
పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంకా చెప్పుకోవాలంటే నిర్ణీత కాలవ్యవధిలో చేసే ‘వ్యాపార సమీక్ష’ల గురించి మనకు తెలుసు. అయితే ‘మ్యారేజ్ రివ్యూ’ అనేది మనం ఎప్పుడూ విని ఉండలేదు. బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ ప్రతీమ్ భోస్లే, ఫ్రెంచ్ యువకుడు సచా ఎర్బోనెల్ను వివాహం చేసుకొని ఆమ్స్టర్డామ్లో స్థిరపడింది. ఇటీవల ఆమె ‘మంత్లీ మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ రివ్యూ’ పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేసిన పోస్ట్ నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తడమే కాదు ఆలోచింపజేస్తోంది. ఈ పనులు సజావుగా జరుగుతున్నాయి, ఈ పనుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది, మెరుగు పరుచుకోవాల్సిన విషయాలు... ఇలా రకరకాల కోణాలలో మ్యారేజ్ మంత్లీ రివ్యూ రాసింది ప్రతీమ్. రివ్యూలో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా రాసింది.అనవసర సలహాలు ఇవ్వకూడదు.ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవాలి.'నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా’ ఇలాంటి మాటలతో తగాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు.అనుకోకుండా తగాదా జరిగితే దాని గురించి సోషల్ మీడియాలో రాయకూడదు.‘నవ దంపతులు ప్రతీమ్–సచా ఎర్బోనెల్ మ్యారేజ్ రివ్యూను అనుసరించి తప్పొప్పులను బేరీజు వేసుకుంటే వారి సంసారంలో ఎలాంటి సమస్యలూ ఉండవు’ అని రాశాడు ఒక నెటిజనుడు. నిజమే కదా! (చదవండి: Prabhas Diet: హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?) -
అందానికి మందార..
మందార పూలను చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా... అలాంటి అందమైన మందార సౌందర్య సాధనలో మహిళలకు ఎంతో తోడ్పడుతుంది. అందుకు చేయాల్సిందల్లా మందార పూల పొడిని తయారు చేసి ఫేస్ ప్యాక్ లేదా మాస్క్గా ఉపయోగించడమే. రెండు టేబుల్ స్పూన్ల మందార పొడి, టేబుల్ స్పూన్ పెరుగు, టీస్పూన్ తేనె కలిపి మొత్తటి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15–20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మిలమిలలాడే సౌందర్యం మీ సొంతమవుతుంది. ఎందుకంటే మందారలో ఉండే సహజమైన మ్యూసిలేజ్ సమ్మేళనాలు తేమను నిలుపుకోవడంలో తోడ్పడతాయి. అంతేకాదు, మందారలోని నేచురల్ ఆస్ట్రింజెంట్లు తైల స్రావాన్ని నియంత్రించడంలో, మొటిమలను తగ్గించడంలో సహాయపడటమేగాక ఇవి అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. సహజంగా వచ్చే చర్మం ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. (చదవండి: ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
ఒంటరితనానికి విరుగుడు అమ్మమ్మ... నానమ్మల బడి
అమ్మమ్మ... నానమ్మ... ఇప్పుడు అంతగా పట్టని మనుషులు. వాళ్ల చేతికో ఫోన్ ఇచ్చేసి, గది ఇచ్చేస్తే ఎవరూ మాట్లాడాల్సిన పని లేదని అనుకునే కుటుంబాలు ఉన్నాయి. పెద్దవయసులో ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని తిరిగి స్కూలుకు పంపితే చదువుకు చదువు, స్నేహానికి స్నేహం దక్కుతాయి. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఇలాంటి బడి నేటికీ కొనసాగుతూ ప్రతి ఊరికి ఇలాంటిది అవసరమని చాటుతోంది. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అమ్మమ్మల బడి’ గురించి...ఇది అద్భుతం. మొన్నటి మార్చి 8న మహారాష్ట్రలోని ఆ చిన్న పల్లెలో, ముంబైకి 120 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అదేమిటో తెలుసా? ‘ఆజిబైచి శాల’ దశాబ్ది ఉత్సవం. అంటే ఆ స్కూల్ పెట్టి సరిగ్గా పదేళ్లయిన సందర్భంగా ఆ స్కూలు స్టూడెంట్లు, పెద్దమనుషులు, గ్రామస్తులు... ఆ స్కూల్ని స్థాపించిన యోగేంద్ర బంగార్ అనే ఉపాధ్యాయుడు ... అందరూ వేడుక చేసుకున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటయ్యి ఇలా పదేళ్లపాటు కొనసాగి, ఇంకా కొనసాగుతూ ఉండటం ఎంత గొప్ప. ‘ఆజిబైచి శాల’ అంటే ‘అవ్వల బడి’. అందులో స్టూడెంట్స్ అందరూ అవ్వలే.మలుపు తిప్పిన ఆలోచనఒక ఆలోచన వెలిగితే అది చరిత్ర సృష్టిస్తుంది. పదేళ్ల క్రితం ఫంగణె అనే ఆ పల్లెలో ఛత్రపతి శివాజీ గాథను ఊరి వారికి ఏర్పాటు చేశారు. వచ్చిన గాయకులు శివాజీ గాథను పాడుతూ ఉంటే ఊళ్లోని వారందరూ ఒకవైపు; ఊళ్లోని అవ్వలందరూ ఒకవైపూ కూచున్నారు. వారి సంఖ్య 36. శివాజీ గాథను ఊరి వారందరూ ఉత్సాహంగా వింటుంటే అవ్వలకు ఆ కథ సరిగ్గా అర్థమయ్యీ అర్థం కాక ఇబ్బందిగా అనిపించింది. కథ ముగిశాక ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ దగ్గరకు వెళ్లిన వారందరూ ‘సారూ... మీరంతా కథ మస్తు ఎంజాయ్ చేశారు. మేం కూడా చదువుకుని ఉంటే మీలాగే ఎంజాయ్ చేద్దుము’ అన్నారు. యోగేంద్ర బంగార్కు మనసు కలుక్కుమంది. ఇంట్లో ఉండే అవ్వలు చదువు లేక పోవడం వల్ల, వయసు రీత్యా, మారిన కాలం వల్ల ఒంటరితనం అనుభవిస్తున్నారని, వీరికి ఒక ఉపయోగపడే కాలక్షేపం కల్పిస్తే మేలవుతుందని ఆయన అనుకున్నాడు. అదే సంవత్సరం అంటే 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఊళ్లోని చిన్న స్థలంలో షెడ్డు వేసి ‘అవ్వల బడి’ని ప్రారంభించాడు. అవ్వలు ముందు కంగారు పడ్డా ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఊరి వాళ్లు మెచ్చుకుని మద్దతు ఇచ్చారు. అలా మొదలైన ఆ స్కూలు ఆ నాటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.పెద్ద సమూహం, ఎంతో మేలుగ్రామంలో అంతవరకూ ఎవరికీ పట్టని ఈ అవ్వలు ఇప్పుడు కొత్త ఉనికిలోకి వచ్చారు. గౌరవం పొందారు. అంతేకాదు ఇంట్లో వీరు తమ మనవలతో, మనవరాళ్లతో పాటుగా చదవడం మొదలుపెట్టారు. అవ్వల హోమ్వర్కులో మనవలు సాయం పట్టారు. దాంతో వాతావరణమే మారి పోయింది. ఈ అవ్వలందరూ కలిసి యాత్రలకు వెళుతున్నారు. అలాగే వీరికోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు అవుతున్నాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంటారు. ఇవన్నీ వారికి ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాయి.‘ఈ బంధుగణం కావాలి’‘మన దేశంలో చిన్న వయసులో పెళ్లిళ్ల వల్ల అరవై ఏళ్లు వచ్చేసరికి స్త్రీలు ఒంటరితనాన్ని, నిరాసక్తతను అనుభవిస్తున్నారు. వీరికి చదువు లేక పోతే చాలా విషయాలకు మరింత దూరమవుతున్నారు. కనీసం ఫోను వాడకం కూడా రావడం లేదు. వీరి కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం కంటే ఇలాంటి బడులు ప్రతి ఊళ్లో ప్రతి ఏరియాలో ఏర్పాటు చేయాలి. దీనివల్ల వీరికి మనం కూడా ఎంచదగ్గ మనుషులమే అనే భావన కలుగుతుంది. అవ్వల అనుభవం, వారి చిరునవ్వు ప్రతి ఇంటా ఉండాలంటే వారిని గౌరవించి పట్టించుకోవడం అవసరం‘ అంటాడు ఈ స్కూలు స్థాపకుడు యోగేంద్ర బంగార్.నిజమే... ప్రతి ఊరూ పూనుకుని ఇలాంటి స్కూలు ఏర్పాటు చేస్తే నిరక్షరాస్యత పోవడం మాత్రమే కాదు వృద్ధుల మనోవికాసం వారికి కొత్త జవసత్వాలను ఇస్తుంది. వారి ఉదాసీనత పోగొడుతుంది. పింక్ రంగు చీరల్లో ‘స్టూడెంట్స్’ఊరిలోని వాళ్ల ఫండ్స్తో మొదలైన ఈ స్కూలుకు అవ్వలందరికీ పింక్ రంగు చీరలు యూనిఫామ్గా ఇచ్చారు. స్కూల్ బ్యాగులు, పలకలు, బలపాలు అన్నీ ఇచ్చారు. స్కూలు మొదలైన రోజున ‘చేతికర్రతో తిరిగే ఆ స్త్రీలు బలపం పట్టుకోవడానికి విద్యార్థుల్లా’ బడికి వచ్చారు. ఆ దృశ్యం అందరినీ కదిలించింది. స్కూలు గంటలు వారికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు. రోజువారీ పనులన్నీ అయ్యి, గొడ్లకు మేత వేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బడికి రావాలి. రోజూ బడి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండు గంటలు మాత్రమే జరుగుతుంది. మరాఠీ లిపి, కొద్దిపాటి లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్... అన్నీ నేర్పిస్తారు. సిలబస్ ఉంటుంది. అన్నింటికీ మించి తమదంటూ ఒక చోటు.. తమకంటూ కొందరు మనుషులు వారికి దొరుకుతారు. -
కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే!
కేరళలోని కవస్సేరిలో జరిగిన ఒకముచ్చటైన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు లావణ్య , విష్ణు వివాహం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఆ విశేషమేమిటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మ్యారేజ్ హాలులోనే పంచాయితీ అధికారి ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని అందుకోవడమే ఈ స్టోరీలోని ప్రత్యేకత. అదీ డిజిటల్ విధానం ద్వారా. పెళ్లి అయిన మరుక్షణమే ఈ నూతన జంట మ్యారేజ్ రిజిష్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకుంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 'K-SMART' అనే డిజిటల్ వేదిక ద్వారా ఇది సాధ్యమైంది. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్కు ఇదొక మైలు రాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు. వివాహం జరిగిన వెంటనే, ఈ జంట K-స్మార్ట్ వీడియో KYC వ్యవస్థ ద్వారా వారి వివాహ రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు. అంతేకాదు దీపావళి సెలవు రోజు అయినప్పటికీ కవస్సేరి పంచాయతీ అధికారులు దరఖాస్తును రియల్ టైమ్లో ప్రాసెస్ చేసి ఆమోదించడం, సర్టిఫికెట్ను నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా జంటకు అందించడం విశేషం. పంచాయతీ సభ్యుడు టి వేలాయుధన్ నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కవస్సేరి పంచాయతీ సిబ్బంది వారి అంకితభావానికి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.Kerala sets an example !! In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025దీంతో చాలా మంది కాబోయే జంటల్లో ఇది ఎంతో సంతోషాన్ని నింపింది. ఎందుకంటే పెళ్లి తరువాత, వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు, ఫోటోలు, సర్టిఫికెట్లు పట్టుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టాలేమీ లేకుండానే, ఆన్లైన్ వెరిఫికేషన్ కావడం, క్షణాల్లో సర్టిఫికెట్ రావడం సంతోషమే కదా. కేరళ ఒక ట్రెండ్ సెట్ చేసిందంటూ కొనియాడుతున్నారు ప్రజలు'K-SMART' అనే డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, వీడియో KYC ద్వారా వివాహ నమోదును పూర్తి చేయవచ్చు . తక్షణమే డిజిటల్లీ సైన్డ్ సర్టిఫికెట్ పొందవచ్చు. వీడియో KYCలో జంటలు, సాక్షులు ఆధార్ ఆధారిత OTP లేదా ఇమెయిల్ ద్వారా తమ గుర్తింపును వీడియో ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఇది పూర్తయిన తరువాత డిజిటల్ సంతకం చేసిన వివాహ ధృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. వీటిని వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ విధానం ముఖ్యంగా విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు (NRIs) ఎంతో సౌకర్యవంతంగా ఉంది, ఎందుకంటే వారు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. కె-స్మార్ట్ ప్రారంభించినప్పటి నుండి, కేరళ 1.5 లక్షలకు పైగా వివాహ రిజిస్ట్రేషన్లు నమెదయ్యాయి. దాదాపు 63 వేలు వీడియో KYC ద్వారా పూర్తయ్యాయి. -
ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..) -
డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్
బాలీవుడ్లో స్వీటెస్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్. తాజాగా దీపావళి సందర్బంగా గుడ్ న్యూస్ చెప్పారు. ముంబైలోని తమ డ్రీమ్ హౌస్గురించి కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు.ఇటీవల తన ప్రేమమందిరం గురించి యూట్యూబ్ వ్లాగ్లో పంచుకున్న సోనాక్షి, ఇక్భాల్ జంట అందమైన ఇల్లు కుటుంబ సభ్యులతోపాటు , దబాంగ్ బ్యూటీ ,భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి తన ముంబైలోని కొత్త ఇంటిని అభిమానులకు చూపించింది. కొన్ని స్టైలిష్, రొమాంటిక్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇవి అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ జంట తమ వివాహానికి ముందే ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశామని, తన డ్రీమ్ హౌస్ పునరుద్ధరణ పనులు చేపట్టామని వెల్లడించింది. వంటగది ,లివింగ్ స్పేస్ గురించి వివరించారు ఇద్దరూ. ఈ సందర్బంగా ఇంటీరియర్ డిజైనర్ పాయల్ మక్వానా , గార్నెట్ కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభ్రమైన, స్వచ్ఛమైన ప్లేస్ను ఊహించుకున్నానని సోనాక్షి అంటే, జహీర్ తనకు గట్టి ఫర్నిచర్ కావాలని "కాబట్టి ఎవరైనా దానిపై ఎప్పుడైనా నృత్యం చేయవచ్చు" అని చమత్కరించిన సంగతి తెలిసిందే.సోనాక్షి అప్కమింగ్ యాక్షన్ చిత్రం "జటాధార" నవంబర్ 7న తెలుగు, హిందీ భాషలలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో సోనాక్షి ఇంతకు ముందెప్పుడూ చూడని, విలక్షణమైన కొత్త అవతారంలో సూపర్ నేచురల్ విలన్గా కనిపించనుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్లో సుధీర్ బాబు, దివ్య ఖోస్లా , శిల్పా శిరోద్కర్ కూడా నటించారు. -
హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ నటుడు. ప్రతి సినిమా కోసం తన ఆకృతిని చాల సునాయాసంగా మార్చుకుంటాడు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా నిబద్ధతను చూపిస్తారు. అయితే ప్రబాస్ ఇలా సినిమా కోసం ఇంతలా తన బాడీలో వేరియేషన్ చూపించాలంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా బాహుబలిలో రాజులా ఆ పాత్రలో లీనమైపోయేలా కనిపించిన అతడి ఆహార్యం.. ఆ తర్వాత సాహో సినిమాకు చాలా స్లిమ్గా మారిపోయింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలా డైట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రూపురేఖల్ని మార్చుకుంటుంటారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా. బాహుబలి మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపించాలి కాబట్టి ప్రతి ఉదయం చాలా గుడ్లు తినేవారట. ఆ విషయమై ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ని అడగగా..ఆయన అవునని చెప్పారు. ఎందుకంటే కండలు తిరిగిన దేహంతో రాజసం ఉట్టిపడేలా కనిపించాలి కాబట్టి తప్పలేదన్నారు. అయితే అన్ని గుడ్లు తినడం చాల కష్టమని అన్నారు. చెప్పాలంటే ఒక రోజులో 20 నుంచి 30 గుడ్లు దాక తిని ఉంటానని అన్నారు. అయితే ఉడకబెట్టినవి తినడం కష్టమని అందుకని వాటిని ప్రోటీన్తో మిక్స్ చేసి ఒక జ్యూస్ మాదిరిగా తాగాల్సి ఉంటుందట. అలా అయితేనే.. గుడ్డు పచ్చి వాసన అంతగా ఉండదు కాబట్టి, అన్ని తినగలమని చెప్పారు. ఆ తర్వాత 2019లో సాహో మూవీని ప్రమోట్ చేశారు. అప్పుడాయన ఇదివరకటి ప్రభాస్లా చాలా స్లిమ్గా కనిపించారు. అప్పడు కూడా ప్రభాస్ బాహుబలి మాదిరిగానే అలాంటి ట్రిక్ ఏదైనా ఫాలో అయ్యారా అని మీడియా అడగగా..అదేం లేదన్నారు. అయినా బహుబలి పూర్తి అయ్యిన వెంటనే సన్నబడాలని అనుకున్నానని, అందుకోసం స్ట్రిక్ట్గా శాకాహారం తీసుకున్నట్లు వివరించారు. శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది బరువు తగ్గడానికి సహయపడుతుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్. బాహుబలి మూవీ టైంలో నెలల తరబడి కండరాలు పెంచేందుకు చాలా ఎక్కువగా తినాల్సి వచ్చింది, కాబట్టి దాన్ని తగ్గించాలంటే ప్యూర్ వెజిటేరియన్గా మారక తప్పదని అన్నారు ప్రభాస్. ఏ డైట్ని అనుసరించినా.. నిపుణులు పర్యవేక్షణలో ఆరోగ్యంగానే అమలు చేస్తానని అన్నారు. చివరగా ఏ డైట్ అయినా హెల్దీగా సరైన పద్ధతిలో అనుసరిస్తే మంచిగా బరువు తగ్గుతారని, అదేమంతా కష్టం కాదని అన్నారు ప్రభాస్.అంతలా గుడ్లు తీసుకోవచ్చా అంటే..గుడ్లు ఎప్పడు అద్భుతమైన ప్రోటీన మూలం. అని దాన్ని పలు రూపాల్లో తీసుకోవడం మంచిదేనని అన్నారు. అలాగే మరి అంతలా అంటే.. జీర్ణక్రియపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. అచ్చం గుడ్డులో లభించే ప్రోటీన్ మన శాకాహారంలో 20 రకాల ఆహారాల్లో కనిపిస్తుందని చెప్పారు. వాటిని తీసుకున్నా.. సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తుందిన చెప్పారు. View this post on Instagram A post shared by Prabhas cults (@prabhascults_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్ఫిల్..!) -
నాణేల సంచితో షోరూమ్కి రైతు.. కూతురి కోసం ఎంత తాపత్రయం!
ఓ త్రండి ఆర్థిక సామర్థ్యానికి మించి కుమార్తె ఓ కోరిక కోరితే.. నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు ఆ నాన్నా. అది తన తాహతుకు, శక్తికి మించిన పని అని తెలిసినా.. అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన అతడి కథ ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది.ఈ ఘటన చత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. బజరంగ్ రామ్ అనే రైతు కూతురు లక్షరూపాయ ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతడి ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం అతడికి అనితరసాధ్యమైనది కూడా. అయినా సరే ప్రతి రూపాయి వెనకేస్తూ.. ఏదోనాటికి కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంతా చేయడం ప్రారంభించాడు. తన సంపాదనలో మిగిలిని నాణేలన్నీ బాక్స్లో వేస్తూ..కొంత సొమ్ము పోగుచేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి..తాను స్కూటర్ కొనాలనుకుంటున్నా అంటూ..ఆ నాణేల సంచిని వారిముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందటూ ఆ నాణేల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూమ్ డైరెక్టర్ ఆనంద్ గుప్తాను మనసుని కదిలించింది. కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టేవారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి..ఆ సంచిలోని నాణేలన్నింటిని తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం రూ. 40,000 అని చెప్పగా. మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటానని అన్నాడు బజరంగా రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తిచేశాడు. ఆ తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ కుటుంబానికి ఆహ్వానం పలికి. టీ సర్వ్ చేసి మరి సరికొత్త హోండా యాక్టివా కీను అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడూ కూతురు చంపా కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆమె కన్నీళ్లతో ఇది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామె.(చదవండి: ఆ ప్రొఫెసర్కు 150 ప్లస్ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!) -
పండుగ ముగిసింది.. చేయాల్సింది మిగిలే ఉంది..!
దీపావళిని వైభవంగా జరుపుకునే నగరాల్లో మన సిటీ ఒకటి. ఆకాశంలో నక్షత్రాల్లా విరబూసే టపాసులతో ఉత్సాహంగా దీపావళిని జరుపుకుంటాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన వారు నగరంలో అధికంగా ఉండటంతో ఇది అందరి పండుగలా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే పండుగ ఆనందం ముగిసిన తర్వాత నగరం ఎదుర్కొంటున్న పెద్ద సవాల్ కాలుష్యం.. కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం దీపావళి రోజున పీఎం 2.5 స్థాయిలు 69కి, సాధారణంగా 50లోపు ఉండాల్సిన పీఎం 10 స్థాయిలు 153కి (మూడు రెట్లు) పెరిగాయి. అంటే గాలిలో సూక్ష్మ ధూళికణాలు, రసాయనాలు, పొగ మొదలైనవి సాధారణ రోజులతో పోలిస్తే 60–80 శాతం ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం కేవలం ఆ రోజు మాత్రమే కాకుండా, కొన్ని రోజులు నగర గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితులు జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్నారులు, వృద్ధులకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజువారీ జీవనశైలిలో కొన్ని స్మార్ట్ మార్పులు చేసుకుంటే కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని నిపుణుల మాట. హైదరాబాద్లో స్మార్ట్ హోమ్ పరికరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కాలుష్య సమయంలో హెపా(హెచ్ఈపీఏ) ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ విజువల్ వంటి ఎయిర్ మానిటరింగ్ యాప్స్ వాడటం ద్వారా గాలినాణ్యతను తక్షణం తెలుసుకోవచ్చు. ఇంట్లో గాలి సర్క్యులేషన్ కోసం రోజుకు కనీసం 15 నిమిషాలు కిటికీలు తెరిచి ఉంచడం మంచిది. గ్రీన్ లివింగ్.. నేచురల్ ఎయిర్ ఫిల్టర్స్..చిన్న స్పేస్ల్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ చాలా పెద్ద మార్పు తీసుకువస్తాయి. అరెకా పామ్, స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఆలొవెరా వంటి మొక్కలు గాలిలోని టాక్సిన్స్ను శోషించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇప్పుడు సిటీ ట్రెండ్.. బాల్కనీలో మినీ ఆక్సిజన్ గార్డెన్స్. స్మార్ట్ కమ్యూటింగ్.. కాలుష్యాన్ని తగ్గించే సిటీ మూవ్మెంట్ దీపావళి తర్వాతి రోజుల్లో వీధుల్లో వాహనాల సంఖ్య తగ్గించి.. కార్ పూలింగ్, ప్రజారవాణా, ఎలక్ట్రిక్ బైక్స్, మెట్రో ప్రయాణం మంచిది. ఇవి కేవలం గాలి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, నగర ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేస్తాయి. ‘రైడ్ గ్రీన్ హైదరాబాద్’ వంటి సిటీ కాంపెయిన్లు ఇప్పుడు ట్రెండ్గా మారుతున్నాయి. బ్రీత్ డీటాక్స్.. శరీరానికి సహజ రక్షణ కాలుష్య సమయంలో శరీరం పీలి్చన టాక్సిన్స్ నుంచి రికవరీ కావడానికి స్టీమ్ ఇన్హేలేషన్, నాసికా కర్మ, ప్రాణాయామం వంటి యోగా పద్ధతులు సహజ డీటాక్సిఫైయర్లు. అలాగే నీరు ఎక్కువగా తాగడం, విటమిన్–సి ఉన్న పండ్లు (మొసంబి, నారింజ, ఆమ్లా) తీసుకోవడం శ్వాసకోశానికి రక్షణ కల్పిస్తుంది.సామూహిక చొరవ.. క్లీన్ బ్రీత్. హైదరాబాద్లో ఇప్పటికే కొంతమంది యువత ‘స్వచ్ఛ గాలి డ్రైవ్’, ‘గ్రీన్ దీపావళి మిషన్’ వంటి ప్రచారంలో పాల్గొంటున్నారు. కాలుష్యానంతర రోజుల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ డ్రైవ్స్, పార్క్ క్లీన్ అప్ ఈవెంట్స్ వంటి కార్యక్రమాలు నగర జీవనశైలిలో కొత్త పాజిటివ్ వేవ్గా మారుతున్నాయి. (చదవండి: చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!) -
ఆ ప్రొఫెసర్కు 150 ప్లస్ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!
మహా అయితే రెండో, మూడో డిగ్రీలు చేస్తారు. గానీ ఇన్ని డిగ్రీలా..జీవితాంతం చదువుతూ ఉండటం అంటే.. అది సాధ్యం కాని పని. అయితే ఈ ప్రోఫెసర్ దాన్ని సాధ్యం చేసి చూపడమే కాదు ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో వింటే కంగుతింటారు. మరి అన్ని డిగ్రీలు చేసేందుకు డబ్బు కూడా వెచ్చించాల్సిందే కదా..!. మరి అదంతా ఆయనకు ఎలా సాధ్యమైంది..ఇలా జీవితాంత చదువుతూ ఉండాలనేంత ఇంట్రస్ట్ ఎలా కలిగింది అంటే..'ఫైనల్ ఎగ్జామ్స్' అనంగానే విద్యార్థులు రిలీఫ్ అయిపోతారు. ఇక ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది, ఏదో ఉద్యోగం పొంది..సెటిల్ అయిపోవడమే అనుకుంటాం. అదీగాక ఓ రెండు మూడు డిగ్రీలకు మించి పూర్తి చేయరు కూడా. అలాంటిది చెన్నైకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి ఎన్ పార్థిబన్(Prof Parthiban) ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నాడో తెలిస్తే నోటమాటరాదు. సినిమాల్లో చూపించిన హీరో మాదిరిగా అతడి ధృడ సంకల్పం చూస్తే..ఆశ్చర్యం వేయకుండా ఉండదు. ఇంత ఓపిక, ఆసక్తి ఆయనకెలా సాధ్యమైందనిపిస్తుంది. ఇలా డిగ్రీలపై డిగ్రీలు పూర్తి చేయాలన్న కోరిక తన తల్లి కారణంగా జరిగిందట.ఆరోజు అమ్మ అలా అనడంతో..తన తొలి డిగ్రీలో జస్ట్ అత్తెసురు మార్కులేనట. ఏదో పాసయ్యాను అని అనిపించుకన్నట్లుగా మార్కులు తెచ్చుకున్నాడట. అది చూసి ఆయన తల్లి చాలా బాధపడిందట. ఆ క్షణంలో ఆమె కోపంతో పాసవ్వడం కాదు..మంచి మార్కులు తెచ్చుకోవాలని కాస్త గట్టిగా చెప్పారట ఆమె. దాంతో ఆయన తల్లికి టాప్ ర్యాంక్ వచ్చేలా మార్కులు తెచ్చుకుంటానని వాగ్దానం చేశారట. ఇక అక్కడ నుంచి మొదలైన ఆసక్తిని.. ఆయనలా కంటిన్యూ చేశారట. అలా ఆయన 1981 నుంచి ఇప్పటి వరకు చదువుని ఆపలేదు. ఒక పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న కోరిక కాస్త..తరగని జ్ఞాన దాహంగా పరిణమించింది.సాటిలేరు అనేట్లుగా డిగ్రీలు..ప్రొఫెసర్ విజయ పరంపరం షాక్కి గురిచేశాలా ఉంటుంది. ఏకంగా 150కి పైగా పైగా డిగ్రీలు, డిప్లోమాలు పూర్తి చేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన డిగ్రీల లిస్ట్ ఓ యూనివర్సిటలో ఉండే కోర్సుల జాబిత మాదిరిగా ఉంటుంది. ఆయన ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లా వంటి అంశాల్లో చాలా మాస్టర్ డిగ్రీలు పొందారు. అన్నిట్లంకటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఏకంగా 12 ఎంఫిల్ డిగ్రీలను కలిగి ఉండటం. ప్రస్తుతం ఆయన నాల్గవ పీహెచ్డీ పూర్తి చేస్తున్నారట. మరి ఇన్ని డిగ్రీలు పూర్తి చేయడం కోసం ఆయన తన జీతంలో దాదాపు 90% విద్యకే ఖర్చు చేస్తారట. ఆయన తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరుకు అనేక సంస్థలో బోధిస్తారట. ఆ తర్వాత బోధనల మధ్య దొరికిన కొద్దిసేపు విరామంలో తన చదువుకి సమయాన్ని కేటాయించుకుంటారట. ఇంతలా అంటే ఒత్తిడికి గురవ్వుతాం కదా అంటే.. పార్థిబన్ మాత్రం పుస్తకాలతోనే విశ్రాంతి తీసుకుంటానని చెబుతుండటం విశేషం. అంతేకాదండోయ్ ఆయన ఎడ్యుకేషన్ జర్నీ ఇక్కడతో పూర్తి అవ్వదట. ఆయన తదుపరి లక్ష్యం 200 డిగ్రీల మైలురాయిని పూర్తి చేయడం అని అంటున్నారు. ఉన్నత విద్య ఒక డ్రీమ్గా ఉన్నవారందరికీ ఈయన స్ఫూర్తి. ఇక్కడ పార్థిబన్ కేవలం డిగ్రీలపై డిగ్రీలు పూర్తిచేయడం కాదు తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని గౌరవిస్తున్నాడు, అలాగే నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. పైగా విద్యనభ్యసించడం అనేది జీవిత లక్ష్యంగా మారగలదని ప్రపంచాని చాటిచెబుతున్నాడు.(చదవండి: ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!) -
ఇలా అయితే కష్టం సుమీ!
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే ప్రీ టీనేజర్లు, ఉపయోగించని లేదా తక్కువగా ఉపయోగించే వారితో పోలిస్తే చదువులో వెనకబడిపోతున్నారని, జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని తాజా అధ్యయనం ఒకటి తెలియజేస్తుంది. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జమ)లో ప్రచురించబడ్డాయి.‘పిల్లలు గతంలోలాగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే సమాచారాన్ని ప్రాసెస్ చేసే వారి సామర్థ్యాన్ని సోషల్ మీడియా మార్చేసింది. పిల్లలు బడిలో సోషల్ మీడియా వాడడం అనేది వారి అభ్యాసంపై ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ తాజా అధ్యయనం ఉపయోగపడుతుంది’ అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత, శిశువైద్య నిపుణుడు జాసన్ నగటా.ఈ అధ్యయనం కోసం జాసన్ అతని బృందం కౌమారదశపై జరుగుతున్న అధ్యయనాలలో ఒకటైన అడోలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్(ఏబీసీడీ) స్టడీ నుంచి డేటాను ఉపయోగించుకుంది. జాసన్ బృందం తొమ్మిది నుంచి పది సంవత్సరాల వయస్సుగల ఆరువేల మందికి పైగా పిల్లలకు సంబంధించిన డేటాను తమ అధ్యయనానికి ఉపయోగించుకుంది. సోషల్ మీడియాను ఉపయోగించే పిల్లలను మూడు గ్రూప్లుగా విభజించారు. వారిలో ఆరు శాతం మంది పిల్లలకు ‘హై ఇంక్రీజింగ్ సోషల్ మీడియా గ్రూప్’గా నామకరణం చేశారు. ఈ పిల్లలు మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. (చదవండి: చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!) -
మోకాళ్లు, మోచేతులు నల్లగా ఉన్నాయా?
కొందరు శరీరమంతా తెల్లగానే ఉన్నా, మోచేతులు, మోకాళ్లలో నలుపుతో బాధపడుతుంటారు. వీటి నివారణకు క్రీముల కన్నా సహజసిద్ధమైన చిట్కాలే బాగా పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో అలోవెరా జెల్ ముందుంటుంది. ఎందుకంటే, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మెరిపించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా దురద, చర్మం పొడి బారడం లాంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్ ని తగ్గించడంలోనూ సహకరిస్తాయి. ఇందుకోసం అలోవెరా జెల్ని నేరుగా మోచేతులు, మోకాళ్లపై ఎక్కడైతే నలుపుదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేసి కనీసం అరగంట టు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలకు బాగా తేమ అంది, నల్లబడిన స్కిన్ టోన్ మారుతుంది. నలుపు సమస్య ఇక రానే రాదు.కురులకు ఆముదం, రోజ్మేరీ ఆయిల్రకరకాల కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఆడ, మగ తేడా లేకుండా అందరికీ జుట్టు సమస్యలు ఎక్కువ అయి΄ోతున్నాయి. అలాంటి వాళ్లు కొబ్బరినూనెలో ఆముదం, రోజ్మేరీ ఆయిల్ రెండూ కలిపి రాయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. అంతేకాకుండా, జుట్టుకి పోషణ అంది జుట్టు రాలి΄ోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఇందులో ఒక్కో నూనెలో ఒక్కో పోషకం ఉంటుంది. ఇవి జుట్టుకి సంబంధించిన సమస్యల్ని దూరం చేస్తాయి. జుట్టు చిట్లడం, డ్రై హెయిర్ వంటి సమస్యలుంటే మీరు కొబ్బరినూనె మాత్రమే కాకుండా కొబ్బరినూనెలో కొద్దిగా రోజ్మేరీ ఆయిల్, ఆముదం కలిపి రాసి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. (చదవండి: ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!) -
ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!
నాకు 36 ఏళ్లు. నేను ఇటీ ఉద్యోగిని. ఒంగోలులో మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బయట లే– ఆఫ్ లు బాగా అవుతున్నాయి. మా కంపెనీలో కూడా కొంతమందిని తీసివేసి ఉన్న వాళ్ళతోనే పని నడిపిస్తున్నారు. దీనివల్ల ఆఫీసులో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. లాప్టాప్ ముందు 12–14 గంటలు కూచోవాల్సి వస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పని చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర పట్టడం లేదు. తలనొప్పితోపాటు. చికాగ్గా ఉంటోంది. ఇంట్లో భార్య పిల్లల మీద కూడా సహనం కోల్పోతున్నాను. జాబ్ వదిలేయాలనిపిస్తుంది. కానీ నాకున్న కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యం కాదు. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో సలహా చెప్పగలరు. – అశోక్, ఓంగోలు అశోక్ గారు! మీరు చెప్పిన పరిస్థితి ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నదే. ‘వర్క్ ప్లేస్ స్ట్రెస్‘కు మీరే ఒక ఉదాహరణ. ఉద్యోగుల తీసివేత, టార్గెట్స్. డెడ్లైన్స్ వల్ల ఒత్తిడి పెరగడం సహజం, కానీ దీని ప్రభావం మీ ఆరోగ్యం పైనే కాకుండా, కుటుంబ సంబంధాలపైనా పడుతోందన్న విషయాన్ని గమనించి దిద్దుబాటు కోసం ‘సాక్షి’ని సంప్రదించడం అభినందనీయం. మొదటగా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం మానెయ్యాలని ఎవరికైనా అనిపించడం సహజం. కానీ తమకున్న కమిట్మెంట్స్, బాధ్యతల వల్ల అలా మానివేయడం చాలా సందర్భాల్లో కుదరదు. కనుక ఉద్యోగం చేస్తూనే ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధం అవడం ఉత్తమం. పని, ఆరోగ్యం, కుటుంబం–ఈ మూడిటి మధ్య సమతౌల్యం పాటించాలి. పని సమయంలో చిన్న చిన్న విరామాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి 1–2 గంటలకు, ఐదు ఏమిషాలు నడవండి. లోతుగా శ్వాస తీసుకొని వదిలే ’డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అర్ధరాత్రి వరకు లాప్టాప్ ముందు కూర్చోవడం శరీరానికి, నిద్రకి తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి. మీ మేనేజర్తో మాట్లాడి రాత్రిపూట ఒక కటాఫ్ టైమ్ పెట్టుకోండి. ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వారాంతాల్లో వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కుటుంబంతో గడపడానికి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి. ఉదాహరణకు డిన్నర్ సమయంలో ఫోన్, లాప్టాప్ దూరంగా పెట్టేయండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. మీ కుటుంబానికి కూడా మీరు ఎమోషనల్గా అందుబాటులో ఉన్నారు అన్న భరోసా ఇస్తుంది. అలాగే వ్యాయామం ధ్యానం, యోగా లాంటి పద్దతులు మీ రోజు వారీ షెడ్యుల్లో చేరిస్తే ‘స్ట్రెస్ హర్మోన్లు’ తగ్గుతాయి. దీనివల్ల నిద్ర మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కూడా మీరు ఇంకా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లయితే, ఒక మానసిక వైద్య నిపుణుడిని కలిసి స్ట్రెస్ మేనేజ్ చేసే టెక్నిక్స్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. టార్గెట్స్, ప్రాజెక్ట్ మళ్ళీ వస్తాయి, కానీ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మీకు మీ కుటుంబానికి, మీ కెరీర్కి కూడా దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..! ఏకంగా రెండుసార్లు కేన్సర్ బారినపడ్డప్పటికీ..) -
హెయిర్ స్టైల్నే కాదు చరిత్రనే మార్చేసింది!
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకాయిచి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైయిల్లా ఉండాలి’ అని తన హెయిర్ స్టయిల్ మార్చారు. అయితే ఆమె మార్చింది కేవలం హెయిర్స్టైల్ మాత్రమే కాదు, పితృ స్వామ్య ఆధిపత్యంతో కూడిన ఎన్నో స్థిర అభిప్రాయాలను! తకాయిచి సుపరిచిత రాజకీయ జీవితం మాట ఎలా ఉన్నా, అదర్సైడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సింగర్, డ్రమ్మర్, బైక్ రైడర్, కరాటే ఫైటర్, టీవీ ప్రెజెంటర్... ఒకటా రెండా!సనే తకాయిచికి మెటాలిక, ఐరన్ మెయిడెన్, బ్లాక్ సబ్బాత్ లాంటి హెవీ మెటల్ మ్యూజిక్ బ్యాండ్లు అంటే చాలా ఇష్టం. బిగ్గరగా, దూకుడుగా ధ్వనించే రాక్ స్టైల్ హెవీ మెటల్ బ్యాండ్ల సొంతం. సంగీత అభిమానిగా ఉన్న తకాయిచి కాలేజీ బ్యాండ్లో డ్రమ్ వాయించేవారు. ఆమె బ్యాండ్ వాయించడం ఎంత ఉధృతంగా ఉండేది అంటే కర్రలు తప్పనిసరిగా విరిగిపోయేవి! అందుకే బ్యాకప్గా నాలుగు జతల కర్రలను తీసుకువెళ్లేవారు. స్కూల్ రోజుల్లో గిటార్ వాయించేవారు.వయసుతో పాటు ఉత్సాహం పెరుగుతూనే ఉంది..! కళలపై ఎంత పాషన్ ఉన్నా సరే వయసుతోపాటు కొందరిలో ఉత్సాహం తగ్గిపోతుంది. అయితే తకాయిచి అలా కాదు. ఇప్పటికీ ఇంట్లో డ్రమ్స్ వాయిస్తారు. రాజకీయాలు అన్నాక ఒత్తిడి సహజం కదా! ఎప్పుడైనా మరీ ఒత్తిడికి గురైనప్పుడు డ్రమ్స్ వాయించే సమయం రెట్టింపు అవుతుంది.రాజకీయ నేపథ్యం లేదు... ధైర్యం మాత్రమే ఉంది... జపాన్లోని పితృస్వామ్య రాజకీయ వ్యవస్థలో తకాయిచి ప్రధానిగా ఎన్నికకావడం అనేది ఆశ్చర్యకరమైన, అరుదైన విజయం. ఆమె దేశభక్తి విద్యను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధాలను త్యజించే విధానాలకు మద్దతు ఇచ్చారు. తన రాజకీయ సహచరులలో చాలామందిలా ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తండ్రి ఒక కార్ల కంపెనీలో పనిచేసేవాడు. తల్లి పోలీస్ ఆఫీసర్. రాజకీయాల్లోకి రాక ముందు తకాయిచి టీవి కామెంటేటర్గా పనిచేసేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఇంటర్వ్యూలు, టీవి కార్యక్రమాలు చేసేవారు. జపాన్ పార్లమెంట్లో మొదటిసారి అడుగు పెట్టిన కాలంలో తన జుట్టు స్టైల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైల్లా ఉండాలి’ అని హెయిర్ డ్రెస్సర్కు చెప్పారు.మార్గరెట్ థాచర్కు ఆమె వీరాభిమాని... ‘గుంపు వెంట పరుగెత్తడం కాదు... ఆ సమూహం నిన్ను అనుసరించేలా చేసుకోవాలి’... ఇలా థాచర్ ప్రసిద్ధ మాటలు ఎన్నో తకాయిచి నోట వినిపించేవి.బైక్ రైడింగ్కు గుడ్బై... బైక్ రైడింగ్ అంటే తకాయిచికి బోలెడు ఇష్టం. సమయం చిక్కేది కాదా? భద్రతా కారణాలా? తెలియదుగానీ 32 సంవత్సరాల వయసులో పార్లమెంట్లోకి అడుగు పెట్టిన తకాయిచి తనకు అత్యంత ప్రియమైన కవాసకి జెడ్400జీపి మోటర్ సైకిల్కు గుడ్బై చెప్పారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపి)లో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న తకాయిచి ఎన్నో క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో రాణించారు. పార్టీ పాలసీ రీసెర్చ్ కౌన్సిల్కు అధ్యక్షురాలిగా పనిచేశారు.భవిష్యత్ ఏమిటి? ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా? లేక పార్టీ క్షీణతను వేగవంతం చేస్తుందా?’ అంటూ విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ పండితులు.మహిళలకు సంబంధించి ఆమెకు ఉన్న అభిప్రాయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. అయితే ఎన్నికల ప్రచారంలో బేబీ సిట్టింగ్ కోసం పన్ను మినహాయింపులు, పిల్లల సంరక్షణ కోసం కార్పొరెట్ ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం అనేది మహిళా–స్నేహపూర్వక విధానాల వైపు తకాయిచి అడుగులు వేస్తున్నారు అని చెప్పడానికి సంకేతం. ఒక లవ్ స్టోరీ... లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)లో తన రాజకీయ సహచరుడు యమమోటోను తకాయిచి వివాహం చేసుకున్నారు. అతడు ఆమెను ఎంతోకాలంగా మౌనంగా ప్రేమిస్తున్నాడు. ఇట్టి విషయాన్ని ఆమె గమనించక పోలేదు. ఒకానొక రోజు ఆయన ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకున్నారు. పెళ్లి జరిగింది. ‘మీకు లవ్ యూ చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. మీరు అంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు?’ అనే ప్రశ్నకు తకాయిచి ఇలా జోక్ చేశారు... ‘నిజం చెప్పమంటారా! నేను భోజనప్రియురాలిని. మంచి రుచికరమైన భోజనం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. యమమోటోని పెళ్లి చేసుకుంటే మంచి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యంతో ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ట్రైన్డ్ చెఫ్!’ రాజకీయా అభిప్రాయాలలో తేడా కారణంగా విడిపోయిన ఈ దంపతులు 2021లో తిరిగి వివాహం చేసుకున్నారు. -
గోల్డెన్ క్రియేటర్
ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్స్టా సంస్థ బంగారు రింగ్ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్స్టా ప్రొఫైల్లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్ని ఇన్స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి. -
ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..!
నేర్చుకోవాలనే అంతులేని తపనకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు కొందరు. పైగా మంచి ఉన్నత పొజిషన్లో పనిచేసి పదవీ విరమణ పొందాక కూడా విద్యను అభ్యసించడం అంటే మాటలు కాదకదా..!. చదవాలన్న కోరిక ఉన్నా..వయసు సహకరించదు. పోనీ కొత్తగా ఆ స్పీడ్ టెక్నాలజీని అందుకుంటూ చదవాలంటే వామ్మో అనేస్తారు ఎవ్వరైనా..కానీ ఈ 80 ఏళ్ల మహిళ వాటన్నింటిని ఖతారు చేస్తూ..దిగ్విజయంగా ఎంబిఏ పూర్తి చేసింది. రెండుసార్లు కేన్సర్తో పోరాడి గెలిచి కూడా..ఏ మాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగి..నేటి యువతకు ఆదర్శంగా నిలిచారామె.ఆ మహిళే 80 ఏళ్ల ఉషా రే(Usha Ray). పూణేలోని పాటిల్ విద్యాపీఠ్ సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్లో హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్లో MBA కోసం చేరినప్పుడు ఆమె వయసు 77 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టుకి 80 ఏళ్లు వచ్చిన రెండు వారాలకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారామె. నిజానికి ఈ సబ్జెక్టు ఆమెకు కొత్త. ఎందుకంటే ఆమె జంతుశాస్త్రంలో ఎంబిఏ చేశారు. దశాబ్దాలుగా పాఠశాల ఉపాధ్యాయురాలిగా కొనసాగిన అనుభవం ఉందామెకు. ఇప్పుడు కొత్తగా ఆర్థిక శాస్త్రం అర్థం చేసుకోవడం, కంప్యూటర్తో కుస్తీ పట్టడం అన్ని సవాళ్లే ఆమెకు. అయినా..తగ్గేదే లే అంటూ ఎంబీఏ చేసేందుకు ఉత్సాహం చూపించిందామె. ఆమె ఇంగ్లాండ్, యోమెన్ వంటి అంతర్జాతీయ పాఠశాలల్లో భోధించారు కూడా. ప్రస్తుతం ఆమె లక్నోలో గోమతినగర్లోని లవ్ శుభ్ హాస్పిటల్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఈ కోరిక ఎలా పుట్టిందంటే..2009లో టీచింగ్ వృత్తి నుంచి పదవీ విరమణ చేశాక..ఆస్పత్రిలో సీఈవోగా పనిచేస్తున్నప్పుడు ఈ కోరిక కలిగిందామెకు. అక్కడ చాలామంది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడూ..ప్రతిచోట ఎంబీఏ అని కనిపించేదట ఆమెకు. అందరూ చేసే ఈ ఎంబీఏ ఏంటి?..ఎలాగైనా తెలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు ఉషా రే. అలా 2023లో ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్లో చేరింది. అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కు సంబధించిన విభాగంలో చేయడం ఆమె ఉద్యోగానికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు ఆమెకు 2003లో స్టేజ్-4 ఛాతీ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెలల కీమోథెరపీ, రేడియో థెరపీతో కోలుకుంది. మళ్లీ మహమ్మారి సమయంలో కేన్సర్ తిరగబెట్టింది. మళ్లీ ధైర్యంగా ఎదుర్కొంది. ఇన్ని ఆటోపోట్లు చూసినా ఆమె వెనక్కి తగ్గకుండా ఎంబిఏ చేయాలనుకోవడం విశేషః. ఇక్కడ ఉషా రే ఎదురుదెబ్బ తగిలినప్పుడే జాగ్రత్తగా ఉండాలే తప్ప భయంతో అస్సలు ఆగిపోకూడదు అంటారామె. చివరగా దిగ్విజయంగా ఎనిమిది పదుల వయసులో ఎంబీఏ చేయగలిగానంటే అదంతా తన కుటుంబం, సహోద్యోగుల అందించిన ప్రోత్సాహమే అంటూ క్రెడిట్ అంతా వాళ్లకే ఇచ్చేశారు ఉషారే. (చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్) -
శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..
వయసు సాహసోపేతమైన పోటీల్లో పాల్గొనేందుకు అడ్డంకి కాదని చాలామంది వృద్ధులు నిరూపించారు. అలా కాకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని ప్రారంభించి..సెంచరీ వయసు వరకు అదే ఫిట్నెస్తో ఉండటం అంటే మాటలు కాదు కదా.!. కానీ ఈ శతాధిక వృద్ధుడు ఇప్పటికీ అదే ఫిట్నెస్తో ఉండటమే కాదు..వందేళ్ల వయసులో బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు యువకుడిగా ఉండగా ఆర్మీలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు పాత్రను పోషించి అజేయమైన ధైర్య సాహాసాలు కనబర్చాడు. పైగా ఈ వయసులో కూడా హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తూ.. ఫిట్నెస్ టిప్స్ కూడా చెబుతున్నారు. చెప్పాలంటే తరతరాలకు ఆయనొక స్ఫూర్తి..ఆయనే అమెరికాకు చెందిన అత్యంత వృద్ధ బాడీబిల్డర్ ఆండీ బోస్టింటో. ఆయన బాడీబిల్డింగ్లో ప్రపంచ ఛాంపియన్ కూడా. అంతేగాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డింగ్ ఔత్సాహికులకు అంతర్జాతీయ రోల్ మోడల్. ఇటీవలే వందేళ్ల వయసులో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని అరుదైన ఘనతను సృష్టించాడు. ఈ వయసులో కాలు కదిపేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఆయన బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. అంతేగాదు ఈ ఏడాది ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్ రెండో ప్రపంచ యుద్ధంలో 101వ రెజిమెంట్గా అసామాన్య పరాక్రమాన్ని చూపించినందుకు గానూ ఆండీని కాంస్య నక్షత్రంతో గౌరవించింది.బాల్యం మొదలైంది అలా..ప్రపంచ ప్రఖ్యాత బాడీబిల్డర్గా పేరుగాంచిన ఆండీ ప్రస్థానం న్యూయార్క్ నగరం నుంచి మొదలైంది. 1925 జనవరి 11న ఇటాలియన్ కుటుంబంలో జన్మించిన అతను తల్లి, సోదరడుతో కలిసి పెరిగాడు. క్రిస్మెస్ చెట్టు బహుమతులిస్తుందని అమాయకంగా నమ్మిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ..తన ఆశను ఒమ్ము చేయకుండా విశాల హృదయంతో పొరుగింటివారు తనకందించిన బహుమతులను మర్చిపోనంటాడు. అదే తనకు దాతృత్వం విలువను నేర్పించిందని చెబుతుంటాడు. ఇక ఆండీకి చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ పట్ల మక్కువ ఎక్కువ. 12 ఏళ్లకే అందులో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. 16 ఏళ్లకు బాడీబిల్డింగ్ మ్యాగ్జైన్ల కోసం ఫోటోలు తీయబడ్డాడు కూడా. ఆ తర్వాత ఆర్మీలో చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసి..తిరస్కరణకు గురయ్యాడు. చివరికి పట్టుదలతో తనకిష్టమైన రంగంలో చేరి అక్కడి అధికారులచే ప్రశంసలందుకున్నాడు. అయితే తనకిష్టమైన బాడీబిల్డింగ్ని మాత్రం వదులుకోలేదాయన. అలా 1977లో సీనియర్ మిస్టర్ అమెరికా టైటిల్ను అందుకున్నాడు. ఆ తర్వాత తన భార్య ఫ్రాన్సిస్తో కలిసి నేషనల్ జిమ్ అసోసియేషన్ను స్థాపించాడు. అక్కడ హాలీవుడ్ దిగ్గజాలకు, యువ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుంటాడు ఆండీ. ఆండి యువతరానికి ఇచ్చే సలహా..దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ఫిట్నెస్ ఔత్సాహికులను తన అనుభవాన్ని షేర్ చేయడమే గాక సలహాలు సూచనలు షేర్ చేసుకుంటుంటారు. అందులో కొన్ని..శారీరక శిక్షణలాంటిది మానసికంగా సిద్ధంకావడం. ఇది మన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేయడమే కాదు మన సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. అవసరం అనుకుంటే సర్దబాటుని కూడా స్వీకరించండిఇక్కడ ఆండీ రెండు ప్రపంచయుద్ధం కాలికి గాయం, స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే ఆండీ తన పరిమితులపై ఫోకస్ పెట్టకుండా కేవలం శిక్షణపైనే దృష్టి పెట్టి తన సామార్థ్యానికి అనుగుణంగా మార్చుకుంటానని చెబుతున్నాడు. అన్నింట్లకంటే అప్లికబుల్ లేదా పాటించటం అనేది అత్యంత కీలకం. ఇంట్లో లేదా జిమ్లో అయినా.. సరైన టెక్నీక్స్ పాటించాలి. అప్పుడే సత్ఫలితాలు అందుకోగలరని చెబుతున్నారు ఆండీ బోస్టింటో. (చదవండి: weight loss journey: 15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..) -
సెవన్ హిల్స్ సిటీ ఎక్కడ?
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముఖ్యంగా తెలుగువారికి ఏడు కొండలు అనగానే తిరుమల, తిరుపతి గుర్తొస్తాయి. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని ఏడు కొండలవాడా అంటూ మనసారా స్మరించుకోకుండా కోట్లాది భక్తులకు రోజు గడవదు. అయితే ఏడుకొండల నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మరొక నగరం కూడా ఉంది. అలా సెవన్ హిల్స్ సిటీగా("City of Seven Hills") ప్రసిద్ధి చెందిన ఆ నగరం ఇటలీ(Italy) రాజధాని రోమ్(Rome)లో ఉంది.ఏడు వేర్వేరు ఎత్తులలో లేదా దాని చుట్టూ నిర్మించిన నగరాలను వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా సెవెన్ హిల్స్ నగరం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలా అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి రోమ్, ఈ పురాతన పట్టణం అవెంటైన్, కైలియన్, కాపిటోలిన్, ఎస్క్విలిన్, పాలటైన్, క్విరినల్ విమినల్ అనే ఏడు కొండలపై నిర్మితమై ఆ పేరుకు ప్రసిద్ధి చెందింది. ఈ కొండల భౌగోళిక లక్షణం అది మాత్రమే కాదు, అవి రోమన్ నాగరికతకు జన్మస్థలం కూడా. ఇవి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకదానికి పునాదిగా మారాయి. ఇందులో ప్రతి కొండకు ఒక ప్రత్యేకమైన కథ ఉండడం విశేషం, ఇది రోమ్ గుర్తింపును రూపొందించిన ఇతిహాసాలు, దేవాలయాలు రాజభవనాలతో నిండి ఉంది. ఇవి రోమ్ పురాణాలకు, వారి సంస్కృతికి రాజకీయ కార్యకలాపాలకు కూడా మూలం. పాశ్చాత్య నాగరికతను ప్రభావితం చేసే దీని ప్రకృతి దృశ్యాలు, రోమ్ నగర స్థాపకులైన రోములస్ రెముస్ ల కధలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి.పేరు వెనుక చరిత్రరోమ్ నగర ప్రారంభం క్రీ.పూ 753 నాటిది. కవల సోదరులు రోములస్ రెమస్ కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. రోములస్ పాలటైన్ కొండను ఆదర్శవంతమైన ప్రదేశంగా ఎంచుకుని రోమ్గా మారేలా దాని నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాలక్రమేణా, కాపిటోలిన్ అవెంటైన్ వంటి సమీపంలోని కొండల ప్రజలు కలిసి, ఒకే బలమైన విశాలమైన నగరాన్ని సృష్టించారు. ఈ ఏడు కొండలు మొదట అడవులు నదులతో చుట్టుముట్టబడిన ప్రత్యేక గ్రామాలు. జనాభా పెరిగేకొద్దీ, గ్రామాలు విలీనం అయ్యి ఒకే నగరంగా మారాయి. ఇది వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతన ప్రపంచాన్ని పాలించిన నాగరికత అయిన రోమన్ సామ్రాజ్యానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నగరంగా నిలుస్తోంది రోమ్.. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా సందర్శకులు ఈ ఏడు కొండలను సమీపంలోని చారిత్రక విశేషాలను ఆసక్తిగా అన్వేషిస్తారు.(చదవండి: The Chai Story: పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...) -
15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. టొరంటోకు చెందిన ఈ ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్. సైడ్ రైజెస్ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.ముందు, వెనుక కిక్స్ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..ఫైర్ హైడ్రాంట్స్నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.డాంకీ కిక్స్నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
నలభీములకు డూప్..రోబో చెఫ్..!
ఒకప్పుడు సంప్రదాయానికి చిరునామాగా ఉన్న వంటగది, ఇప్పుడు సాంకేతిక విప్లవానికి నిదర్శనంగా మారుతోంది. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూ పాక శాస్త్రంలో కొత్త అధ్యాయానికి తెర తీస్తోంది. దూసుకొస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ)తో నడిచే రోబోటిక్స్ నల భీములకు ప్రత్యామ్నాయాలను అందిస్తూ చేయి తిరిగిన చెఫ్లకు కొత్త సవాళ్లు విసురుతోంది. ఆహార రంగంలో కారి్మకుల కొరతను పరిష్కరించడం, ఆహార నాణ్యత నిర్ధారించడం లక్ష్యంగా వంటల రంగంలో ఆహార తయారీ నుంచి డెలివరీ వరకూ రోబోటిక్ సేవలు పెరుగుతున్నాయి. దీంతో ఈ రంగం వైపు తమ సాంకేతికతను విస్తరించడానికి రోబోటిక్ కంపెనీలు గణనీయమైన పెట్టుబడులను పెడుతున్నాయి. గత జనవరిలో, మిసో రోబోటిక్స్ కొత్త ఏఐ–శక్తితో కూడిన ఫ్లిప్పీ ఫ్రై స్టేషన్ను ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ 99% అప్టైమ్ రేటుతో అంతకు ముందు వాటి కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇది ఫ్రైస్, ఆనియన్ రింగ్స్, చికెన్తో సహా అనేక రకాల వేపుళ్లను వండగలదు. ఫ్లిప్పీని వైట్ కాజిల్ జాక్ ఇన్ ది బాక్స్ వంటి ప్రధాన ఫాస్ట్–ఫుడ్ రెస్టారెంట్ గ్రూప్స్ ఉపయోగిస్తున్నాయి. కాలిఫోర్నియాలో కొత్తగా ప్రారంభించిన బర్గర్ రెస్టారెంట్, ఏబీబీ రోబోటిక్స్ను వినియోగిస్తూ 30 సెకన్లలోçపే బర్గర్లను ఉత్పత్తి చేస్తోంది. ఏఐ మోడల్స్ మెరుగుపడుతున్న కొద్దీ, రోబోటిక్ చెఫ్లు విసు్తృత శ్రేణిలో వంట పదార్థాల శైలిని నిర్వహించగలుగుతున్నారు. ఇంటి కిచెన్స్లోనూ.. రోబోటిక్ చెఫ్లు గృహ వినియోగ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ నోష్ త్వరలోనే ఇంట్లో కూడా వంట చేసే రోబోట్ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏఐ–ఆధారిత పరికరం వన్–పాట్ మీల్స్ను ఆటోమేట్ చేస్తుంది. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా పదార్థాలను లోడ్ చేయడానికి రోబోట్ను కమాండ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఎల్జీ ఎల్రక్టానిక్స్ బేర్ రోబోటిక్స్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇది డైనింగ్ రూమ్ల కోసం ఏఐ–ఆధారిత స్వయంప్రతిపత్తి సేవా రోబోట్లను తయారు చేస్తుంది. అంతర్జాతీయ సంస్థలూ సై.. లండన్కు చెందిన మోలీ రోబోటిక్స్ 2023 చివరిలో ప్రపంచంలోనే మొట్టమొదటి లగ్జరీ రోబోట్ కిచెన్ షోరూమ్ ప్రారంభించింది. 2024లో నిర్వహించిన ఓ అంతర్జాతీయ ప్రదర్శనలో కాక్టెయిల్–మిక్సింగ్ రోబోట్ బారిస్టా బాట్లను ప్రదర్శించారు. గత జూలైలో భారత దేశానికి చెందిన ఆటోచెఫ్ అనే స్టార్టప్.. యాప్ ద్వారా నియంత్రించ గలిగిన రోబోటిక్ కిచెన్ను ప్రదర్శించింది. జూలై 2025లో, చైనీస్ కంపెనీ డోబోట్ రోబోటిక్స్ 1,800 కి.మీ దూరం నుంచి వీఆర్ హెడ్సెట్ ద్వారా రిమోట్ ఉపయోగించి స్టీక్ను సిద్ధం చేయగల హ్యూమనాయిడ్ రోబోట్ను ప్రదర్శించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఆన్లైన్ వంట వీడియోలను చూడటం ద్వారా వంటకాలను నేర్చుకుని, పునఃసృష్టించగల రోబోటిక్ చెఫ్ను పరిచయం చేశారు. కమ్మదనానికి ప్రత్యామ్నాయం కాదు.. రెస్టారెంట్ కిచెన్లోకి కొంత కాలం క్రితమే ఆటోమేషన్, ఇప్పుడు రోబోటిక్స్ రంగ ప్రవేశం చేశాయి. ఆహారాన్ని తయారు చేయడం, వడ్డించడం వరకూ అనేక పనులను ఏఐ ఆధారిత సాంకేతికత పునర్నిర్వచిస్తోంది. దీని వల్ల మెరుగైన ఆహార భద్రత, కార్మికుల కొరతకు పరిష్కారం, కచ్చితత్వంతో పెద్ద పరిమాణాలను తయారు చేయడం వంటి లాభాలున్నాయి.అయితే ఇది ఒక స్థాయికి మించి పెరిగితే ఆహారంతో పాటు అందే మానవ స్పర్శ, ప్రేమ కనుమరుగవుతాయి. అలాగే అనవసర ఖర్చులు పెరుగుతాయి. సాంకేతికతపై అతిగా ఆధారపడటం సృజనాత్మక శక్తిపై ప్రభావం చూపుతుంది. కొన్ని వ్యవస్థల్లో, భారీ పరిశ్రమల్లో అవసరం కావచ్చు కానీ, ఈ ఆటోమేషన్ ప్రక్రియ మనిషి తయారు చేసిన వంటలోని కమ్మదనానికి ప్రత్యామ్నాయం కాబోదనేది నిర్వివాదమైన అంశం. రోజువారీ సేవలు అందించే రెస్టారెంట్స్లో మానవ స్పర్శ తగిలితేనే జిహ్వకు చక్కని రుచులు అందుతాయి. – మహేష్ పడాల, చెఫ్ (చదవండి: క్యాబ్ డ్రైవర్గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..) -
ఫెమా చట్టం: అలాంటి పరిమితులు మీకు వర్తించవు
మాకు పూర్వీకుల ఆస్తి భాగాలు చేయకుండా కొంత మిగిలి ఉంది. కొందరు వారసులు 1950 లలోనే దేశం విడిచి వెళ్లిపోయారు. వారికి పుట్టిన సంతానం కూడా జర్మనీ దేశంలో పుట్టారు – అక్కడ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు మాతోపాటు వారసులైన వారు సదరు ఆస్తిని మాకు గిఫ్ట్ లాగా ఇచ్చేస్తాము, మేము ఎక్కడికీ రాలేము అని అంటున్నారు. రిజిస్ట్రార్ వద్దకు వెళితే సరైన సమాధానం దొరకడం లేదు. ఇందుకు రిజర్వ్ బ్యాంకు నుంచి ఆమోదం పొందాలనో లేకపోతే పీ.ఐ.ఓ అనే ఒక కార్డు తీసుకోవాల్సి ఉంటుందనో చెబుతున్నారు. అది నిజమేనా? సరైన విధానం వివరించగలరు.– రాజేష్, బిట్రగుంట బహుశా రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీకు చెప్పినవారు ఫెమా చట్టం – (ఊఉMఅ – ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, 1999) లోని ఎఫ్.ఈ.ఏం. (నాన్ – డెట్ – ఇన్స్ట్రుమెంట్స్) నిబంధనలు, 2019 లోని సెక్షన్ 30(2) గురించి సూచించి ఉండవచ్చు. ఈ నిబంధనల ప్రకారం విదేశాలలో నివసిస్తున్న వారు (ఇతర దేశ పౌరసత్వం కలిగిన వారు సైతం) సాధారణంగా భారతదేశంలో తమకు ఉన్న ఆస్తిని అమ్మటానికి వీలుపడదు. అయితే ఇదేమీ ఖచ్చితమైన నిబంధన కాదు. అందుకు మినహాయింపులు ఉన్నాయి. మరొక విదేశీయునికి ఆస్తి అమ్మడంపై, నగదు లావాదేవీలు ఉండటం వంటి సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆమోదం పొందడం, భారతీయ బ్యాంకు ద్వారానే సదరు లావాదేవీని చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. అంతేకానీ భారతదేశంలో ఉండే ఒక భారతీయుడికి ఆస్తిని బదిలీ చేయడం పై ఎటువంటి నిషేధమూ లేదు. మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఇలాంటి పరిమితులు మీకు వర్తించవు. ఎందుకంటే FEMA చట్టంలోని సెక్షన్ 6(5) ప్రకారం విదేశాలలో ఉండే పరాయి దేశస్థులు కూడా భారతదేశంలో ఆస్తిని కలిగి ఉండవచ్చు. అలాంటి ఆస్తి స్వార్జితం అవ్వచ్చు లేదా వారసత్వంగా కూడా వచ్చి ఉండవచ్చు. మీరు రిజర్వు బ్యాంకు నుంచి ఎటువంటి ఆమోదాలు పొందవలసిన అవసరం లేదు. అయితే మీ తోటి వారసులు భారతదేశానికి రాలేరు అని చెప్పారు కాబట్టి, వారిని ఒక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ పంపమని చెప్పండి. సదరు పవర్ ఆఫ్ అటార్నీని జర్మనీలోని భారతీయ ఎంబసీ ద్వారా ధ్రువీకరించి (అటెస్టేషన్ చేసి) పంపినట్లయితే మరలా ఇక్కడ రిజిస్టర్ చేయవలసిన అవసరం (లేదా) ఇన్పౌండింగ్ చేయవలసిన అవసరం ఉండదు. అలా కానిపక్షంలో నోటరీ చేయించిన పవర్ ఆఫ్ అటార్నీ అయితే ఇక్కడ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లి సదరు దస్తావేజును ధ్రువీకరించుకుని అప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి ద్వారా మీరు మీ పూర్వీకుల ఆస్తిని బదిలీ చేయించుకోవచ్చు. ఇది మీకు ఉన్న సులభమైన పద్ధతి. పవర్ ఆఫ్ అటార్నీ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ముందుగానే ఒక లాయర్ని సంప్రదించి పవర్ ఆఫ్ అటార్నీ సరిగా రాయించుకోవటం మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు). (చదవండి: స్వరంతో ఉర్రూతలూగించే..స్పాటీఫై క్వీన్ పరమజీత్ కౌర్..!) -
స్వరంతో ఉర్రూతలూగించే..స్పాటీఫై క్వీన్ పరమ్జీత్ కౌర్..!
ఈ అమ్మాయి పేరు పరమ్జీత్ కౌర్... వయసు 19 ఏళ్లు. ప్రత్యేకత.. పంజాబీ ర్యాపర్. తెర మీది ‘గల్లీ బాయ్’కు నిజ జీవిత ప్రతిబింబం! ఘనత.. స్పాటిఫై గ్లోబల్ 50 చార్ట్లో టాప్లో నిలిచి రికార్డ్స్ బ్రేక్ చేసింది. పంజాబ్ గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ ఖ్యాతి దాకా సాగిన ఆమె ర్యాప్ ప్రయాణం గురించి...పరమ్గా సుపరిచితమైన ఈ రాప్ గాయని తన లేటెస్ట్ ట్రాక్ ‘దట్ గర్ల్’తో స్పాటిఫై గ్లోబల్ వైరల్ 50 చార్ట్లో నంబర్ వన్కి చేరి.. ఆ ఖ్యాతిని ఆర్జించిన ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ ఆర్టిస్ట్గా చరిత్ర సృష్టించింది. పంజాబ్, మోగా జిల్లాలోని డనేకే అనే పల్లెటూరుకు చెందిన పరమ్కి సంగీతం అంటే ణం. పాటలు పాడటమే కాదు రాయటమూ అంతే ఇష్టం. ఆమె తండ్రి తాపీ మేస్త్రీ. అమ్మ ఇళ్లల్లో పనిచేస్తుంది. పరమ్ తన నేపథ్యాన్నే ర్యాప్గా వినిపిస్తుంది. తాను ఎదుర్కొంటున్న సవాళ్లూ.. చేస్తున్న పోరాటాలూ.. చూపిస్తున్న ధైర్యసాహసాలకే శ్రుతిలయలు అద్దుతోంది. ఆ సహజత్వమే తన ట్రాక్స్కి లేబుల్గా మారి ఆమెను ఈ రోజు అంతర్జాతీయ సంగీత సంచలనంగా మలిచింది. అందులోనిదే లేటెస్ట్ ‘దట్ గర్ల్’ ట్రాక్ కూడా! ఈ పంజాబీ సంప్రదాయ జానపద స్వరాలు.. ఆధునిక హిప్–హాప్ బీట్స్ల మిశ్రమమే ఆమె సంగీత బాణి. ఈ ప్రతిభ భాషనే కాదు భౌగోళిక హద్దులనూ చెరిపేసి ప్రపంచానికి వీనులవిందు చేస్తోంది. కళకు రాగాల మీటర్ కన్నా జీవితంలోని రానెస్సే మ్యాటర్ అని నిరూపిస్తోంది. ‘పంజాబ్లో చాలామంది మహిళా పాప్ గాయనులున్నారు. కాని పంజాబీ రాపర్స్ లేరు. అందుకే పరమ్జీత్.. అమె స్వరం రెండూ ప్రత్యేకమే. గల్లీ బాయ్ స్పేస్లో ఉన్న ఒకే ఒక సింగర్ ఆమె’ అంటారు మ్యూజిక్ ఇండస్ట్రీలోని పెద్దలు. ‘నాకు నచ్చిన పని ఇది. నా కల, లక్ష్యం ఒకటే.. మంచి ఇల్లు కట్టుకోవాలి.. ఆ ఇంట్లో మా పేరెంట్స్ ఏ చింతా లేకుండా హాయిగా సేదతీరాలి’ అంటుంది పరమ్జీత్ కౌర్. (చదవండి: వయసు 82... వెనక్కి తగ్గేదే ల్యా..) -
పిగ్మెంటేషన్ పీడిస్తోందా?
వయసు పెరిగే కొద్ది శారీరక మార్పులు కారణంగా పిగ్మెంటేషన్ వేధిస్తుంటుంది. ముఖం మంతా నల్లటి మచ్చలతో ముఖం కళ తప్పినట్లుగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో లభించే వాటితోనే సులభంగా చెక్పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా..!.ఒక బంగాళ దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. ఈ మాస్క్ ని పిగ్మెంటేషన్ బాగా ఉన్న ప్రదేశాలలో అప్లై చేసి అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయండి. ఇలా నెల రోజుల పాటు రోజుకి రెండుసార్లు చేయవచ్చు.నిమ్మరసం, తేనె..రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి. అవసరమున్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి మీకు ఫలితం కనిపించే వరకూ చేయవచ్చు. టేబుల్స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకొని ఈ మూడింటినీ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసి పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఆరాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.టేబుల్స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు తీసుకొని అందులో రెండు టేబుల్స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్లాగా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుందట. -
సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్ఫిల్..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు తన డైట్ గురించి ఒక ఇంటర్వూలో వెల్లడించారు. ప్రతి మహిళకు అవసరమైన ప్రోటీన్ విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యం చేయనని చెప్పారామె. అందుకోసమే తాను తప్పనిసరిగా వందగ్రాముల ప్రోటీన్ని వినియోగిస్తానని చెప్పారామె. దాదాపు 50 కిలోలు ఉండే ఆమె ఈ రేంజ్లో ప్రోటీన్ తీసుకోవడం సరైనదేనా అంటే..భారతీయ మహిళలందరికీ సాధారణంగా 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ సమంత అంతకుమించి తీసుకోవడం అంటే..బహుశా కార్బోహైడ్రేట్కి బదులుగా లేదా వర్కౌట్ల రీత్యా అవసరం అయ్యి ఉండొచ్చని అన్నారు. అయితే ఇక్కడ అంత మోతాదులో ప్రోటీన్ ఎలా అని సందేహ పడాల్సిన పని కూడా లేదని అంటున్నారు నిపుణులు. అందుకోసం కేవలం ఈ మూడింటితో భర్తి చేస్తే చాలని చెబుతున్నారు. పెరుగు, పన్నీర్, పప్పు తీసుకుంటే చాలని చెబుతున్నారు. దీంతోపాటు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రదానంగా గుర్తించుకోవాల్సినవి..వెజ్ ప్రోటీన్ ఒక్కోసారి కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో కలిసి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరి హై ప్రోటీన్డైట్ సరిపడకపోవచ్చు. గట్ సమస్య ఉన్నవారికి అదనపు ప్రోటీన్ తీసుకోవడం ప్రమాదకరం అని చెబుతున్నారు నిపుణులు. అదీగాక అధిక ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం మలబద్దకం, జీర్ణశయాంంతర సమస్యలకు దారితీస్తుందనేది గ్రహించాలని చెబుతున్నారు. ఇక్కడ గట్ఆరోగ్యంపై దృష్టిసారిస్తూ..క్రమంగా ప్రోటీన్ తీసుకోవడం పెంచడం మంచిదని చెబుతున్నారు. అదే సమయంలో ఇక్కడ సమంతా అంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది మొత్తం ఆరోగ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే సగటు వ్యక్తికి "సెలబ్రిటీ నియమావళి" వర్తించిందని, అనుసరించాల్సిన అవసరం లేదన్నారు. అందుకు బదులుగా స్మార్ట్గా ఎంపిక చేసుకుని తినడం మంచిదని సూచించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Hungover After Diwali: దీపావళి హ్యాంగోవర్ని తగ్గించే నేచురల్ డిటాక్స్..తక్షణ ఉపశమనం!) -
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
పావురాలు Vs పౌరులు: ఎవరు ముఖ్యం? పెటాపై ప్రజాగ్రహం...
పావురాల విసర్జన ప్రాణాంతకంగా మారుతోందంటూ భారతీయ నగరాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ముంబై వంటి మెట్రోలకు చెందిన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఇటీవల పావురాలకు ఆహారం (దాణా) వేయడాన్ని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను నిరసిస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు పెటా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.‘‘ముంబైలోని మూడు అతిపెద్ద ఆసుపత్రుల డేటా ప్రకారం, గత ఏడాదిలో వచ్చిన శ్వాసకోశ అనారోగ్య కేసుల్లో కేవలం 0.3% మాత్రమే పావురాలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధన కూడా పావురాల నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేల్చింది. పావురాలు సహజంగా బర్డ్ ఫ్లూకు నిరోధకతను కలిగి ఉంటాయి’’ అని పెటా వాదిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తోంది. కబుతర్ ఖానా దగ్గర నిర్దిష్ట దాణా సమయాలు కేంద్రాలను నియమించడం, ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం పారిశుధ్యాన్ని నిర్వహించడం సరైన దాణా పద్ధతులు పావురాల వల్ల కలిగే కనీస ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే బహుభాషా సందేశాలను ఇన్స్టాల్ చేయడం వంటివి చేయాలని సూచిస్తోంది.‘పావురాలు లేకుండా ముంబై ఆకాశం ఎలా ఉంటుంది? దాణా నిషేధాలతో, ఈ సున్నితమైన పక్షులు ఆకలి బారిన పడతాయి. ‘ప్రతి ఒక్కరూ పావురాలు కూడా నగరవాసులే అంటూ గుర్తు చేస్తూ పలువురు ముంబైకర్లు ’పావురాలు’గా మారారు‘ భారీ పావురాల ముసుగులు ధరించి ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వీడియోను పెటా షేర్ చేసింది.అయితే ఈ విషయంలో పెటాపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. గతంలో ఎన్నడూ ఏ అంశంపైనా రానంతగా ఈ విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘‘ ‘పావురాలు వాటి విసర్జన ద్వారా క్రిప్టోకోకోసిస్, హిస్టోప్లాస్మోసిస్ సిట్టాకోసిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.‘ అంటూ ఒక వ్యక్తి ఆన్లైన్లో ద్వజమెత్తారు. ‘పావురాలు ఎగిరే ఎలుకలుగా అనొచ్చు. అవి తక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ సమూహాలుగా ఉంటే, నగర నివాసితుల ఆరోగ్యంపై (శ్వాసకోశ సమస్యలు, వ్యాధి వ్యాప్తి మొదలైనవి) చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు భారతీయుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ మరో వ్యక్తి సూచించాడు. ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు దేశం గురించి ఎప్పుడూ ఆలోచించరు. పావురాల మలం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. కుక్కలు పావురాలు దేశానికి అతిపెద్ద ముప్పు. రాబోయే సంవత్సరాల్లో వాటి జనాభాను తగ్గించాలి అంటూ మరొకరు తీవ్రంగా దుయ్యబట్టారు. -
కలర్ఫుల్ స్వింగ్ 'దివాలి' డ్రెస్సింగ్..!
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్లో మన లుక్స్ ద్వారా గుడ్విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి. మినిమలిస్ట్ లుక్.. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్తో, పండుగ డ్రెస్సింగ్కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. రెడ్ గ్లామ్ లుక్.. దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్గా తీర్చిదిద్దుకుంది. లాంగ్ ఎథినిక్ జాకెట్లు.. పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్రోబ్కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.సింపుల్ లాంగ్ గౌన్లు.. సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి. పాతవే కొత్తగా.. ప్రస్తుత వార్డ్రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్ను అందిస్తుంది. దేశీ డ్రీమ్.. మరీ సింపుల్గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్గా ధరించవచ్చు. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్తో లుక్ను మరింత మెరిపించవచ్చు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్లతో సమకాలీన కట్లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్కి ఇది సరైన ఉదాహరణ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్లా చాలా సింపుల్ స్టైల్ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు. -
పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...
మన సంస్కృతిలో భాగంగా కలిసిపోయినప్పటికీ టీ జన్మస్థలం భారత దేశం కాదు ఈ పానీయంపై చైనా గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 19వ శతాబ్దంలో పెద్ద ఎత్తున టీ సాగును ప్రవేశపెట్టింది. మొదట్లో, భారతీయులను అది లక్ష్యం చేసుకోలేదు. టీ ఎగుమతి ఇతర ప్రముఖ సంపన్న దేశాలకు ఉండేది. కానీ అనూహ్యంగా భారతీయులు ఆ విదేశీ అలవాటును తమ స్వంతం చేసుకున్నారు.అయితే 1900లలో బ్రిటిష్ కంపెనీలు స్థానికంగా టీని ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, దానిని మరింత రుచికరంగా మార్చడానికి పాలు చక్కెరను జోడించమని వారే మనవాళ్లని ప్రోత్సహించారు. ఈ ఆలోచన వారు ఊహించిన దానికంటే బాగా పనిచేసింది. భారతీయులు ఆ పానీయాన్ని స్వీకరించడమే కాదు, దానిని తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు.కలిసి...కరిగిపోయి...భారతీయ వంటశాలలలో పాలు అంటే ఒక పదార్ధం కంటే ఎక్కువ ఇది పోషణ, స్వచ్ఛత సంప్రదాయం. బాల్యంలో హల్దీ దూద్ గ్లాసుల నుంచి పండుగ స్వీట్ల వరకు, పాలు అనేక రకాలుగా భారతీయుల్ని వారి అభిరుచుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. కాబట్టి అది మనం తాగే టీలో కూడా సులభంగా, వేగంగా కలిసిపోయింది. భారతదేశంలోని చిన్న పట్టణాలు మార్కెట్లలో టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతం దాని స్వంత రుచులను దానికి జోడించింది.ఆ తర్వాత మసాలా చాయ్ వచ్చింది. వెచ్చదనం కోసం అల్లం, సువాసన కోసం ఏలకులు, కిక్ కోసం లవంగం, గాఢత కోసం దాల్చిన చెక్క... పాల తర్వాత టీలో కలిపే జాబితా లో చేరిపోయాయి.చాయ్...రాజా చాయ్...20వ శతాబ్దం మధ్య నాటికి, చాయ్వాలా రైల్వే ప్లాట్ఫామ్లు వీధి మూలలను ఆక్రమించి, ప్రయాణికులకు కార్మికులకు ఆవిరితో కూడిన పాల టీ గ్లాసులను అందించారు. వలసరాజ్యాల ఎగుమతిగా ప్రారంభమైన ఈ పానీయం రోజువారీ అలవాటుగా ఎన్ని విధాలుగా అయినా మార్పు చేర్పులకు అనుకూలించేదిగా మారింది. భాష, కులం వంటకాల ద్వారా వ్యత్యాసాలున్న మన దేశంలో, టీ ఒక విధంగా ఉమ్మడి అభిరుచిని నిర్మించింది. ఇద్దరు అపరిచితులు ఒక మాటను పంచుకోకపోవచ్చు, కానీ పంచుకున్న కప్పు చాయ్ ఎంతటి దూరాన్ని అయినా కరిగించగలదు అన్నంతగా ప్రభావాన్ని చూపుతోంది.మరికొన్ని దేశాలకూ విస్తరించిన మిల్క్ టీ...భారతదేశం వెలుపల, టీ వేరే రూపాల్లో సంచరిస్తోంది. టీ పుట్టిన చైనా జపాన్లలో తేనీటి స్వచ్ఛతకు విలువ ఇస్తారు. వారి దృష్టి ఆకుపై, దాని వాసనపై మాత్రమే ఉంటుంది. వారు పాలు కలపరు. బ్రిటిష్ వారు కూడా పాలు అతి తక్కువగానే కలుపుతారు.మన దేశం కాకుండా యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, తైవాన్ థాయిలాండ్ వంటి దేశాలలోనూ పాలతో టీ అనే అలవాటు ఉన్నప్పటికీ మన దేశంతో పోటీపడే స్థాయిలో కాదు. మంగోలియా, ఇథియోపియా, బురుండి, కెన్యా ఆఫ్రికాలోని అనేక ఇతర దేశాలు ముఖ్యమైన మిల్క్ టీ సంప్రదాయాలు ఉన్నాయి. -
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!
దీపాల కాంతితో ధగధగ మెరిసే ఈ దీపాల పండుగ ఇష్టపడని వారుండరు. అలాంటి మిరుమిట్లు గొలిపే ఈ పండుగ.. టపాసుల మోత మోగిపోయేలా ఆనందహేలి తాండవించేలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి అలాంటి పండుగా మన దేశంలోనే పలు రాష్టాలు అత్యంత విభిన్నంగా జరుపుకుంటాయి. ఈ దీపావళి పండుగ నేపథ్యంలో ఆ విశేషాలు గురించి సవిరంగా తెలుసుకుందామా..!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీ΄ాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి..మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీ΄ావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోట అక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగి΄ోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. -
పేరెంటింగ్ టిప్స్: స్మార్ట్ఫోన్ వాడకంలో సరిహద్దులు తప్పనిసరి..!
‘‘డాక్టర్! మా బిడ్డ ఫోన్లో కార్టూన్ పెడితేనే తింటాడు.’’ ‘‘సర్! నా భర్తకు నాతో మాట్లాడటానికి టైం లేదు. ఆయన ఎప్పుడూ వాట్సాప్లోనే ఉంటాడు. చూస్తేనే చిరాకేస్తుంది.’’ ‘‘మా అమ్మానాన్న ఎప్పుడూ రీల్స్లోనే బిజీ. వాళ్లతో మాట్లాడాలంటే కూడా వెయిట్ చేయాలి.’’ ఇవి నా కౌన్సెలింగ్ రూమ్లో ప్రతిరోజూ వినిపించే మాటలు. చాలామంది తల్లిదండ్రులు తమ పనులకు అడ్డు రాకుండా ఉంటారని పిల్లలకు ఫోన్ ఇస్తారు. ‘‘పని చేసుకోవాలి కదా’’ అని సమర్థించుకుంటారు. కాని, ఆ రెండు నిమిషాల కంఫర్ట్ వల్ల పిల్లల మనసులు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక సైలెంట్ గ్యాప్ వస్తోంది. ‘‘నువ్వు నాకు టైమ్ ఇవ్వవు’’ అనే మాటకు బదులు – ఇద్దరూ ఒకే మంచం మీద పక్కపక్కన పడుకుని స్క్రీన్లతో బతుకుతున్నారు. ఒకప్పుడు కుటుంబ సమస్యలంటే కుర్రాళ్ల ప్రేమలు, అత్తాకోడళ్ల గొడవలు, భార్యాభర్తల వివాదాలు, పిల్లల మార్కుల టెన్షన్లు. కాని, ఇప్పుడు కౌన్సెలింగ్ రూమ్లోకి వస్తున్న కొత్త సమస్య – స్మార్ట్ఫోన్. ఈ చిన్ని యంత్రం – ఒక వైపు మనిషికి వరం, మరో వైపు నిశ్శబ్దంగా మన కుటుంబాల్ని కాలుస్తున్న శాపం.వరం లాంటి అద్భుతంమన జీవితంలో స్మార్ట్ఫోన్ తీసుకువచ్చిన విప్లవం అపారమైనది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. · ఇది కొద్ది సెకన్లలో జ్ఞానం, విద్య, సమాచారాన్ని అందిస్తుంది. · మ్యాప్లు, మెడిసిన్, బ్యాంకింగ్ అన్నీ ఒక క్లిక్ దూరంలో. దూరంగా ఉన్నవారిని వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా దగ్గర చేస్తుంది. కరోనా కాలంలో పాఠశాలలు, ఉద్యోగాలు, వైద్య సలహాలు అన్నీ ఫోన్ ద్వారానే నడిచాయి. · ఒక్క మాటలో చెప్పాలంటే, స్మార్ట్ఫోన్ మనిషిలో భాగంగా మారిపోయింది. శాపంగా మారిన వరం‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు పెద్దలు. స్మార్ట్ ఫోన్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అతిగా వాడటంతో మన చేతిలోని ఫోన్ ఒక డిజిటల్ జైలుగా మారిపోయింది. · పసిపాపలు తినడానికి ఫోన్ కావాలి. పిల్లలు ఆడుకోవడానికి స్క్రీన్ కావాలి. యువత రీల్స్, గేమ్స్కు బానిసలైపోయారు. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. పెద్దలకు నిద్ర, ప్రశాంతత దూరమయ్యాయి. మనిషి తల వంచి నడవడం ఇప్పుడు సిగ్గుతో కాదు – నోటిఫికేషన్ చూడటానికి. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని తినేవారు, ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చుని మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు. ఇది ఒక సామాజిక విపత్తుగా మారింది అనడంలో ఆశ్చర్యం లేదు.అతి వాడకంతో అనర్థాలుసైకాలజిస్టుల దృష్టిలో, స్మార్ట్ఫోన్ వినియోగానికి మూడు స్థాయులు ఉన్నాయి. వాడుక – అవసరమైన పనులకే వాడటం. దుర్వినియోగం – అవసరం లేకపోయినా గంటలు గంటలు స్క్రోల్ చేయడం. వ్యసనం – చేతిలో ఫోన్ లేకపోతే ఆందోళన, కోపం, మనసంతా శూన్యంలా అనిపించడం. జనాభాలో చాలామంది ఇప్పటికే మూడో దశలో ఉన్నారు. దీనివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అనేకానేక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. నిరంతర నోటిఫికేషన్లతో మెదడు ఫోకస్ కోల్పోతుంది. పిల్లలు ఏకాగ్రత నేర్చుకోలేరు. సోషల్ మీడియాలో పోలికల వల్ల డిప్రెషన్, అసూయ పెరుగుతుంది. ఫోన్ వల్ల భర్త–భార్యలు, తల్లిదండ్రులు– పిల్లలు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడడం తగ్గిపోతుంది. మనిషి విలువను లైక్స్, ఫాలోవర్స్తో కొలుస్తున్నాం. · ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది, ఆందోళన పెరుగుతుంది.సరిహద్దులు తప్పనిసరిస్మార్ట్ఫోన్ ఒక వరం. కాని అది మనసు, బంధాలు, పిల్లల వికాసం కన్నా పెద్దదిగా మారితే – అదే శాపంగా మారుతుంది. అందుకే స్మార్ట్ఫోన్ ప్రభావాలు, దుష్ప్రభావాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అడిక్షన్ నుంచి తప్పించుకునే మార్గాల గురించీ వారం వారం సవివరంగా తెలుసుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. ముందుగా గ్రౌండ్ రూల్స్... రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఫోన్ అస్సలు ఇవ్వకూడదు.డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ ఫోన్ ఫ్రీ జోన్లుగా మార్చాలి.వారంలో ఒక రోజు డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యాలి.ఫ్యామిలీ టైమ్లో ఫోన్ పక్కన పెట్టేయాలి.ముందుగా తల్లిదండ్రులే రోల్ మోడల్స్గా నిలవాలి. · పేరెంట్స్, స్పౌసెస్, ఇండివిడ్యువల్స్– ఈ రోజు ఒక ప్రశ్న అడగండి: ‘‘నా చేతిలో ఉన్న ఫోన్ నా జీవితానికి వరమా? శాపమా? ఆక్సిజనా? జైలా?’’సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com(చదవండి: గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందలు వాడాల్సిందేనా..?) -
Diwali 2025: ఇంటికి వెలుగుల మెరుపులు తెప్పిద్దాం ఇలా..!
దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్ తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..ఆహ్లాదకరమైన ప్రకాశం: ఆధునికమైన, విలాసవంతమైన టచ్ కోసం వెచ్చని ఎల్ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. ఇంటి లోపల, మెట్ల భాగంలో ఈ లైట్లను ఏర్పాటు చేస్తే అధిక విద్యుత్తు ఖర్చు కాకుండానే పరిసరాలను ఆహ్లాదకరంగా, కాంతివంతం చేస్తాయి.లైట్ల తోరణం: ప్రకాశవంతమైన తోరణాన్ని గుమ్మానికి ఏర్పాటు చేస్తే, పండగ ముంగిట్లోకి ఇట్టే వస్తుంది. ఇక సిల్క్ టాసెల్స్, పూసలు లేదా ఫెయిరీ లైట్లతో కూడిన స్ఫటికాలనూ ఎంచుకోవచ్చు, ఇది సంప్రదాయాన్ని అధునాతనంగా చూపడంతో పాటు అతిథుల స్వాగతానికి అందమైన కాంతిని అందిస్తుంది.పేపర్ లాంతర్లు: రంగు రంగుల కాగితపు పొరలతో చేసే ఈ లాంతర్లు కాంతిని వినూత్నంగా వెదజల్లుతుంటాయి. ఈ లాంతర్లు బాల్కనీలు, ఇంటి ముందు వసారాలాంటి స్థలాల్లో వేలాడదీయాలి. మెటాలిక్ గోల్డ్, క్రీమ్ లేదా పేస్టెల్ షేడ్స్లో వీటిని మనమే తయారు చేసుకోవచ్చు. కొవ్వొత్తి స్టాండ్లు: కలప, ఇత్తడి లేదా పాలరాతి శిల్పాకృతులను పోలి ఉండే కొవ్వొత్తి స్టాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి వెదజల్లే అందం ఇంటికి మెరుపును తీసుకువస్తుంది. పండుగ వాతావరణానికి ఈ కొవ్వొత్తుల స్టాండ్లు మేలైన ఎంపిక. వారసత్వంగా వస్తున్న కొన్ని గృహాలంకరణ వస్తువులను, తిరిగి బాగు చేయించి కొవ్వొత్తుల స్టాండులుగా ఉపయోగించవచ్చు. మట్టి దీపాలు: టెర్రకోట దీపాలు ఆధునిక ఇంటీరియర్లను వారసత్వ సౌందర్యానికి అనుసంధానిస్తాయి. విలాసవంతమైన టచ్ కోసం వాటిని హైలైట్ చేయవచ్చు. వీటిని కిటికీలు, బాల్కనీలు, లివింగ్రూమ్లు, ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దవచ్చు. కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా తయారు చేసుకొని, ఉపయోగించవచ్చు. పర్యావరణానికి మేలు చేసేవే కాదు, రీ సైక్లింగ్ పద్ధతుల వల్ల కూడా మేలైన ఫలితాలను పొందవచ్చు. ఎన్నార్ -
ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..!
చిత్రంలోని ఈ మిర్రర్ ఒక స్మార్ట్ బ్యూటీ గాడ్జెట్. ఇది మీ అందాన్ని, చర్మ సంరక్షణను మెరుగుపరచడానికి రూపొందించబడింది. సాధారణంగా ఇంట్లో ఉపయోగించే అద్దానికి అధునాతన సాంకేతికతను జోడించి స్మార్ట్ డివైస్గా మార్చారు. ఈ అద్దం ముఖాన్ని విశ్లేషించి, చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు, ఎర్రటి గుల్లలు, గీతలు, చర్మ రంధ్రాలు, నల్లటి వలయాలను ఇట్టే గుర్తిస్తుంది. ఇది ఒక సమగ్ర చర్మ నివేదికను అందించి, ఏ ఉత్పత్తులు వాడితే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది. అలాగే ఈ మిర్రర్కి ఉన్న ఎల్ఈడీ లైట్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి వివిధ రకాల వాతావరణాలను అనుకరిస్తాయి. ఉదాహరణకు, సన్ లైటింగ్, ఆఫీస్ లైటింగ్, షాపింగ్ మాల్స్ లైటింగ్, నార్మల్ లైటింగ్, నైట్ లైటింగ్ ఇలా ఐదు రకాల లైటింగ్ మోడ్లను ఇది అందిస్తుంది. దీనితో మీరు వేసే మేకప్ వివిధ ప్రదేశాల్లో ఎలా కనిపిస్తుందో ముందే తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ డివైస్ 64జీబీ సామర్థ్యంతో ఏర్పడింది. దాంతో చర్మ ఆరోగ్య నివేదికలు, మేకప్ స్టైల్ వీడియోలు ఇలా డేటాను సురక్షితంగా నెట్ సాయంతో సేవ్ చేసుకోవచ్చు. అదనంగా, ఈ డివైస్ ఏకకాలంలో నాలుగు యూజర్ అకౌంట్లను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒకే అద్దాన్ని కుటుంబంలోని నలుగురు సభ్యులు వాడుకోవచ్చు. దీనికి ఒక వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఇది చాలా సౌకర్యవంతమైన ఫీచర్. ఈ అద్దాన్ని సులభంగా పోర్ట్రైట్ (నిలువుగా) లేదా ల్యాండ్స్కేప్ (అడ్డంగా) మోడ్లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల ఈ డివైస్లో యూట్యూబ్ వీడియోలు లేదా ఇతర కంటెంట్ను చూస్తున్నప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇదే స్మార్ట్ మిర్రర్స్లోని కొన్ని మోడల్స్లో వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. దాంతో చేతులు ఉపయోగించకుండానే వాయిస్ కమాండ్స్తో అద్దాన్ని నియంత్రించవచ్చు.కుంకుమ పువ్వు, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ముఖానికి ప్రత్యేకమైన మెరుపునిస్తుంది. ఒక పావు టీ స్పూన్ కుంకుమ పువ్వుని, ఒక టేబుల్ స్పూన్ పాలలో రాత్రి అంతా నానబెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఆ పాలలో కలబంద గుజ్జు వేసి క్రీమీగా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఎండబెట్టిన గులాబీ రేకుల గుజ్జును అర టీ స్పూన్ వేసుకుని, బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అనంతరం సుమారు 30 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. -
గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందులు వాడాల్సిందేనా..?
నా వయసు 32 సంవత్సరాలు. నేను ప్రస్తుతం గర్భం కోసం ప్లాన్ చేస్తున్నాను. డాక్టర్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడమన్నారు. ఇవి నిజంగా అవసరమా? ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?– దీప్తి, హైదరాబాద్ . గర్భం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. గర్భధారణ మొదటి కొన్ని వారాల్లోనే బిడ్డ మెదడు, వెన్నెముక వంటి ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే, బిడ్డలో ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్’ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వెన్నెముక లేదా మెదడు అభివృద్ధి సరిగా జరగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ లోపాలను చాలా వరకు నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ గ్రూపుకు చెందిన నీటిలో కరిగే విటమిన్లు. సాధారణంగా శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకోవడం పూర్తిగా సురక్షితం. అదనంగా తీసుకున్న ఫోలిక్ యాసిడ్ శరీరంలో నిల్వ కాకుండా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకున్నా హానికరం కాదు. రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు ముందు నుంచే మొదలు పెట్టి, గర్భం వచ్చిన తర్వాత కనీసం మొదటి మూడు నెలలు వాడటం ఉత్తమం. ఫోలిక్ యాసిడ్తో పాటు ఐరన్ , విటమిన్ బి12, విటమిన్ డీ, క్యాల్షియం వంటి పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు కూడా వాడితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఇవి సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వవు. కొందరికి స్వల్పంగా వాంతులు లేదా మలబద్ధకం అనిపించవచ్చు, అలాంటప్పుడు వైద్యుడి సలహాతో మాత్రలను మార్చుకోవచ్చు. మొత్తానికి, మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ వాడడం ప్రారంభించండి.నా వయసు 38 సంవత్సరాలు. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు?– శ్వేత, విజయనగరం. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. బ్రెస్ట్ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. ఇది చికిత్స చేయకపోతే ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీని లక్ష్యం మహిళల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం. వయసు పెరగడం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, అధిక బరువు, శారీరక వ్యాయామం తగ్గడం, మద్యం సేవించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తల్లి, అక్క, చెల్లెలు లేదా పిన్ని వంటి బంధువులలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉన్నట్లయితే, మీకు కూడా ఆ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో హెరిడిటరీ జీన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొదట అల్ట్రాసౌండ్, తర్వాత మామోగ్రఫీ చేయించడం ఉత్తమం. ఇంట్లో నెలకు ఒకసారి స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే బ్రెస్ట్లో ఏదైనా గడ్డ, చర్మం మార్పు, నిపుల్ నుంచి స్రావం, నొప్పి లాంటివి ఉన్నాయా అని గమనించడం. ఏ మార్పు గమనించినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సర్జన్ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, పాలిచ్చే తల్లిగా ఉండటం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్యానికి ఉత్తమ రక్షణ.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!) -
జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!
ఉదయాన్నే వేడిగా గొంతులో ఒక టీ చుక్క పడితేనే కానీ భారతీయులకు సూర్యోదయం అయినట్లుండదు. ఫిల్టర్ కాఫీకి అలవాటు పడిన వాళ్లైతే నాసికను తాకే ఆ ప్రాణవాయువులకే లేచి కూర్చుంటారు. ఇక బిర్యానీకి వేళాపాళా ఉండదు. ఇప్పుడు సీటీల్లో 4 ఏఎం బిర్యానీలు కూడా వచ్చేశాయి! సరే, సమోసా గురించి చెప్పేదేముంది? స్నాక్స్లో సెలబ్రిటీ! వేడుకలలో జిలేబీ, గులాబ్ జామూన్.. మస్ట్, ది బెస్ట్. ఈ ఆరు రుచులు లేకుండా భారతదేశంలో తెల్లారదు, చీకటి పడదు. విశేషం ఏంటంటే, వీటిల్లో ఏ ఒక్కటి కూడా భారతీయులది కాదు! అంటే మనం కనిపెట్టింది కాదు! మరి, కనిపెట్టిన ఆ మహానుభావులెవరు? చాయ్ / టీ చైనా పానీయం∙క్రీ.పూ. 2700 ప్రాంతంలో చైనాలో ‘టీ’ ని కనిపెట్టటం, కాయటం మొదలైంది. అయితే భారతదేశానికి ‘టీ’ తాగే అలవాటు చైనా నుండి రాలేదు. బ్రిటిష్ వాళ్లు మోసుకొచ్చారు. 1800ల నుండి 1947లో దేశం విడిచి వెళ్లే వరకు బ్రిటిష్ వాళ్లు మన దగ్గర తేయాకు తోటల్ని పెద్ద మొత్తంలో పండించి, ‘టీ’ని పానీయంగా వినియోగించారు. ఆ అలవాటే భారతీయులకూ వచ్చేది. చివరికి ‘టీ’ పుట్టిల్లు భారతదేశమే అనుకునేంతగా జన జీవనంలో కలిసిపోయింది. భారతదేశంలో దాదాపు 80 శాతం కుటుంబాలు టీని సేవిస్తున్నాయి. ప్రపంచంలో నీటి తర్వాత ఎక్కువ మంది తాగే పానీయం ‘టీ’ నే! ‘కమీలియా సెనన్సెస్’ మొక్కల నుంచి (వాడుకలో తేయాకు) తెంపుకొచ్చిన ఆకులు క్రీ.పూ. 2732లో చైనా చక్రవర్తి షెన్ నుంగ్ చేతి నుంచి జారి మరిగే నీటిలో పడినప్పుడు వచ్చిన కమ్మటి పరిమళం ‘టీ’ ఉద్భవించటానికి కారణం అయిందని చరిత్రకారులు అంటారు. చైనాలో కొన్నేళ్ల పాటు తేయాకు కూడా కరెన్సీగా చలామణి అయింది! ఆయుర్వేదంలో ఔషధ ప్రయోజనాలకు తేయాకును వాడటం అన్నది నేటికీ అన్ని దేశాల్లోనూ ఉంది. ఇక ‘టీబ్యాగు’లను 1908లో న్యూయార్క్లోని ఒక టీ వ్యాపారి అనుకోకుండా కనిపెట్టారు. హోల్సేల్ కొనుగోలు దారులకు వివిధ రకాలైన తేయాకు నమూనాలను పంపేందుకు ఆయన చిన్న చిన్న టీ బ్యాగుల్లో వాటిని నింపేవారు. అలా క్రమంగా టీబ్యాగులు వచ్చాయి. సమోసా ఈజిప్టు ఫలహారంమనమెంతో ఇష్టంగా తినే ‘సమోసా’ కూడా మనది కాదు. కానీ, చాలా ప్రపంచ దేశాల్లో సమోసాకు ‘భారతీయ వంటకం’గా పేరు పడిపోయింది. చరిత్రకారులు సమోసాను క్రీ.శ. 10వ శతాబ్దపు మధ్యప్రాచ్య వంటకంగా గుర్తించారు. ఇరానియన్ చరిత్రకారుడు అబోల్ఫజల్ బెహకీ దీనిని తన గ్రంథమైన ‘తారిఖ్–ఇ బెహఘి’లో ‘సబోసా’గా పేర్కొన్నారు. పరిమాణంలో సమోసా చిన్నదిగా ఉండటంతో, ఇది సౌకర్యవంతమైన ప్రయాణ చిరుతిండిగా, సులభంగా జీను సంచుల్లో ప్యాక్ చేసుకుని తినటానికి వీలైనదిగా ప్రాచుర్యం పొందింది. 10వ శతాబ్దపు మద్యప్రాచ్య దేశాలంటే –బాగ్దాద్, ఇరాక్, పర్షియా, ఉత్తర ఆఫ్రికాలతో కూడిన బైజాంటైన్ సమ్రాజ్యం; అలాగే ప్రస్తుత టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు. ∙సమోసా వంటకం.. మధ్య ఆసియా వాణిజ్య మార్గాల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలంలో భారత ఉపఖండానికి చేరుకుంది. సమోసా త్రిభుజాకారంలో ఉండటానికి కారణం, మొదట దానిని కనిపెట్టిన వారు ఈజిప్టులో లేదా నాటి ఆసియా ప్రాంతాలలో ఉన్న పిరమిడ్ల ఆకృతిలో వాటిని తయారు చేయటమేనని అంటారు. సమోసా భారతదేశానికి వచ్చిన తొలినాళ్లలో కేవలం రాజకుటుంబాలు, ఉన్నతవర్గాల విందులలో మాత్రమే కనిపించేది. చివరికి ఇప్పుడు సామాన్యుల ఆహారంగా మారింది. పర్షియన్ భాషలో త్రిభుజాన్ని ‘సాన్బోసాగ్’ అనీ, ‘సాగోషాగ్’ అనీ అంటారు. అలా వచ్చిందే ‘సమోసా’ అనే మాట. సెప్టెంబర్ 5 వరల్డ్ సమోసా డే. జిలేబీటర్కిష్ తీపి చుట్లుజిలేబీ పశ్చిమ ఆసియా / పర్షియన్ మూలాలు కలిగిన తీపి వంటకం. ఆ ప్రాంతాలలో దీనిని ‘జలాబియా’ లేదా ‘జోల్బియా’ అని పిలుస్తారు. జిలేబీని 15వ శతాబ్దంలో పర్షియన్లు, ప్రధానంగా టర్కిష్ వ్యాపారులు దక్షిణాసియాకు రుచి చూపించారు. క్రమంగా ఇది అద్భుతమై రుచి కలిగిన, చుట్లు చుట్లుగా వేయించిన తీపి వంటకంగా పరిణామం చెందింది.∙విదేశాల నుంచి వచ్చినప్పటికీ జిలేబీ భారతీయ సంస్కృతి, వంటకాలతో లోతుగా ముడిపడి ఉంది. ప్రధానంగా పండుగలు, వివాహాలు, మతపరమైన నైవేద్యాలలో జిలేబీ కనిపిస్తుంది. క్రీ.శ. 10 వ శతాబ్దం నాటి బాగ్దాదీ వంటల పుస్తకంలో ఉన్న ప్రస్తావనను బట్టి జిలేబీ అంతకు ముందు నుంచే ఉందని, ‘జలాబియా’ అనే పురాతన మిఠాయికి ఇది ఆధునిక రూపం అని అనుకోవలసి వస్తుంది. క్రమేణా 15వ శతాబ్దం నాటికి జిలేబీ భారతదేశంలో అందరికీ నచ్చే తీపి వంటకం అయింది. అన్ని వంట పుస్తకాలలో, సందర్భాలలో చోటు సంపాదించుకుంది. బిర్యానీ పర్షియన్ పరిమళంభారతీయ వంటకంగా చాలా మంది పొరపడే బిర్యానీ, పశ్చిమ ఆసియా పాకశాస్త్ర నిపుణులు కనిపెట్టిన అద్భుతం అని చరిత్ర చెబుతోంది. పర్షియా భాష నుంచి వచ్చిన పదమే ‘బిర్యానీ’ అన్నది. పర్షియాలో ‘బిరియన్’ అంటే ‘వంటకు ముందు వేయించినది’ అని అర్థం. ‘బిరింజ్’ అంటే బియ్యం. అలా ‘బిర్యానీ’ అనే మాట స్థిరపడింది. చారిత్రక ఆధారాలను బట్టి క్రీ.శ. 1398లో తైమూర్ భారతదేశం పైకి దండయాత్రకు రావటానికి, బిర్యానీకి పుట్టుకకు మధ్య సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సైనికుల కోసం వారు బియ్యం, మాంసం కలిపిన వంటకాన్ని కుండలలో వండారని, అలా తయారైందే బిర్యానీ అని ఆధునిక చరిత్రకారులు రాశారు. ఇంకో ఆధారం... అరబ్ వ్యాపారులు, తమిళులు రాసుకున్న పుస్తకాలలో క్రీ.శ 2 నాటికే ‘ఓన్ సోరు’ అని అచ్చంగా బిర్యానీ వంటి వంటకమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదీ బిర్యానీని ఇష్టపడే సినీ జాతీయ స్థాయి సెలబ్రిటీలకైతే లెక్కే లేదు. పేరుకు హైదరాబాదీ బిర్యానీ అయినా, బిర్యానీ షెఫ్ మహానుభావులు మాత్రం పశ్చిమ ఆసియా వాళ్లే.ఫిల్టర్ కాఫీ యెమెన్ ఘుమఘుమ16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకు వెళ్లిన కర్ణాటకకు చెందిన సూఫీ సాధువు బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి వచ్చే మార్గంలో ఫిల్టర్ కాఫీని కనుగొన్నారనటానికి కొన్ని చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. బాబా బుడాన్ యెమన్లోని మోచా ప్రాంతం నుండి ఏడు కాఫీ గింజలను తీసుకువచ్చారు. వాటిని అప్పటి పానీయాల తయారీ విధానం ప్రకారం మద్యంలో కాకుండా; పాలు లేదా చక్కెర తోనూ కాకుండా, కేవలం వేడి నీళ్లలో కాఫీ గింజల సారాన్ని తీసి ఫిల్టర్ కాఫీ తయారు చేశారు. (మామూలు కాఫీని కనుగొంది మాత్రం 9వ శతాబ్దపు ఇథియోపియన్లు).భారతదేశంలోని మొట్టమొదటి కాఫీ హౌస్ 1936లో బొంబాయిలోని చర్చిగేట్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకే దేశ వ్యాప్తంగా కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైంది. ఇండియన్ ఫిల్టర్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాబా బుడాన్.. పాలు, చక్కెర లేని ఘుమఘుమల ఫిల్టర్ కాఫీని కనిపెడితే; కాలక్రమంలో భారతీయులు పాలు, చక్కెర కలిసిన కమ్మని పరిమళ భరిత ఫిల్టర్ కాఫీని తయారు చేశారు. ఇందుకు ఫిల్టర్ కాఫీ పౌడర్ (చికోరీతో కలిసినది), ఫిల్టర్ కాఫీ డబ్బా (స్టెయిన్లెస్ స్టీల్), వేడి నీళ్లు అవసరం అవుతాయి. గులాబ్ జామున్ మొఘల్ మిఠాయిగులాబ్ జామున్ భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే ‘డెజర్ట్’లలో ఒకటి. డెజర్ట్ అంటే తెలిసిందే కదా... భోజనానంతరం తినే స్వీటు. ఈ గులాబ్ జామూన్ను ‘లుక్మత్ అల్ ఖాదీ’ అనే అరబిక్ తీపి కుడుములకు (తీపి ద్రావణంలో నానవేసిన ‘ఫ్రైడ్ పిండి ఉండలు’) ఒక కొత్త రూపంగా మొఘలులు కనిపెట్టారు. ఒక అభిప్రాయం ప్రకారం, గులాబ్ జామూన్ను మొఘల్ చక్రవర్తి ఆస్థాన షెఫ్ సృష్టించాడు. అందుకోసం ఆ షెఫ్ పర్షియన్, టర్కిష్ డెజర్ట్ల నుండి ప్రేరణ పొందాడు. ఇంకో సిద్ధాంతం ప్రకారం ఇది తీపి ద్రావణంలో నానబెట్టిన ప్రాచీన భారతీయ వంటకానికి మరొక రూపం. ఈ విధంగా చూస్తే గులాబ్ జామూన్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయనుకోవాలి. పశ్చిమ బెంగాల్లో ‘లేడీకేనీ’ రకం గులాబ్ జామూన్ ప్రసిద్ధి. 1850లలో కలకత్తాకు చెందిన మిఠాయి తయారీదారులలో ఒకరైన భీమ్ చంద్ర నాగ్కు... నాటి గవర్నర్ జనరల్ లార్డ్ చార్లెస్ కానింగ్ నుండి తన సతీమణి లేడీ కానింగ్ కోసం ఒక ప్రత్యేకమైన స్వీట్ తయారు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భర్తతో ఉండేందుకు ఆమె భారతదేశానికి వస్తోంది కనుక ఒక కొత్త తియ్యని వంటకంతో ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేయాలని లార్డ్ చార్లెస్ అలాంటి ఆదేశాన్ని ఇచ్చారు. మొత్తానికి భీమ్ చంద్ర నాగ్... లేడీ కానింగ్ కోసం ఒక కొత్త గులాబ్ జామూన్ వంటకాన్ని తయారు చేయటంలో విజయం సాధించారు. ఆ తీపి పదార్థం లేడీ కానింగ్ను అమితంగా ఆకట్టుకోవటంతో ఆ స్వీట్కు లేడీ కానింగ్ అని పేరొచ్చింది. క్రమేణా ఆ మాట ‘లేడీకేనీ’గా మారింది. (చదవండి: వందేళ్ల హైకింగ్ స్టార్..! సెంచరీ వయసులో మొత్తం ఫ్యామిలీతో..) -
చెడును నరికేసి... మంచిని వెలిగించి!
ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద పండగ చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయిందంటే.... నరకుడు అజ్ఞానానికి, పీడనకు, హింసకు ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. ఆ చెడు తన కుమారునిలో ఉందన్న కారణంగానే అతడి సంహారానికి కారణమయింది తల్లి సత్యభామ. తనలా మరే తల్లీ ఎవరి గర్భశోకానికీ కారణం కాకూడదన్న కోరికతో తన కుమారుడి పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా వరం కోరుకుంది. అందుకే శ్రీకృష్ణుడు అతడి పేరు మీదుగానే భవిష్యతులో అందరూ ‘నరక చతుర్దశి’ జరుపుకుంటారని వరమిచ్చాడు.హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఎందుకంటే స్వయానా తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను చేసిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. నరకుడు విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు.దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీ కృష్ణుడు ఇతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు. మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం వాడికో వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగలేదు. చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ రాక్షసాధముని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపుబాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి నరకుణ్ణి నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు తేరుకుని సుదర్శన చక్రం ప్రయోగించి అతడిని సంహరించాడు. అలా ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి వల్లనే సంభవించింది.తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది.ఈ రోజు ఏం చేయాలి?ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణ చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభిముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.నరక చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు నమ్ముతారు. నరకచతుర్దశి మరునాడే దీపావళి. రావణుడు... మా ఊరి అల్లుడు!దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్లోని జోద్పూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి...మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీపావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోటఅక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగిపోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. – డి.వి.ఆర్. -
పనిమనిషి జీతం రూ. 45 వేలు : అంత అవసరమా, నెట్టింట చర్చ!
సిలికాన్ సిటీ, ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గార్డెన్ సిటీ బెంగళూరులో జీవితం అంటే చాలా ఖరీదైనదే. అలాంటిది బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ తన ఇంటి సహాయకురాలికి నెలకు రూ.45,000 కంటే ఎక్కువ చెల్లించడం చర్చకు దారితీసింది.తాజాగా రష్యాకు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా బెంగళూరు లైఫ్ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తన బిడ్డను చూసుకునేందుకు నియమించుకున్న పనిమనిషికి నెలకు రూ. 45,000 చెల్లిస్తానని వెల్లడించింది. అంతేకాదు ఇంటి పనిని కూడా "వృత్తిపరంగా" చూస్తానని, ఏదేని కార్పొరేట్ ఉద్యోగం లాగే ప్రోత్సాహకాలను అందిస్తానని అస్లమోవా చెప్పారు. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) ఇంకా ఇంటి అద్దెకు 1.25 లక్షల రూపాయలు, తన పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ.30వేలు, ఆహారంతో సహా ఇంటి ఖర్చుల కోసం రూ.75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ఈ మహిళ వెల్లడించింది. పనిమిషికి 45 వేలు ఇవ్వడం అంటే తనను "పిచ్చిదానిని" అని అనుకోవచ్చు. కానీ ఆమె విధేయత, వృత్తి నైపుణ్యం కారణంగా ఆమె ఈ ప్రతిఫలానికి అర్హురాలని తాను భావించినట్లు తెలిపింది. తన కుమార్తె ఎలినా కోసం నానీని నియమించుకునే ముందు కనీసం 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశానని ఆమె చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. బెంగళూరు సహా భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు స్పందించారు. కొందరు ఆమెను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. మీరు ఎక్కువ చెల్లిస్తున్నారనీ, ఇంతకంటే తక్కువకు ఫ్లాట్లు దొరుకుతాయని కమెంట్ చేశారు. మరొక వినియోగదారు “అది TCS, ఇన్ఫోసిస్ ,యాక్సెంచర్ టెక్ ఫ్రెషర్లకు చెల్లించే దానికంటే ఎక్కువ.” అని పేర్కొన్నారు.అయితే విమర్శలపై స్పందిస్తూ అస్లమోవా తన వైఖరికి కట్టుబడి ఉండటం విశేషం. "మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే, కర్మ మీకు ఫలితం ఇస్తుంది" అని కౌంటర్ ఇవ్వడం గమనార్హం. అలాగే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన వృద్ధికి బదులుగా ఇంటి పనికి రోజుకు చాలా గంటలు కేటాయించేవారు విలువైన అవకాశాలను కోల్పోతున్నారని చెబుతూ, వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు. -
ముద్దుల కోడలి పుట్టిన రోజు వేడుకల్లో నీతా : ఆమె టీ షర్ట్ గమనించారా?
రిలయన్స్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల ముద్దుల కోడలు, అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ పుట్టిన రోజు పార్టీ ఉత్సాహంగా జరిగింది.అనన్య పాండే, జాన్వి కపూర్ , తారా సుతారియా వంటి అనేక మంది బి-టౌన్ సెలబ్రిటీలు వేడుకలకు హాజరు కావడంతో ఈ బర్త్డే వేడుక స్టార్-స్టడ్ ఈవెంట్గా మారింది. ఓర్రీ అని పిలిచే ఓర్హాన్ అవత్రమణి తన సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో వేడుకలు వైరల్గా మారాయి.అక్టోబర్ 16న రాధిక మర్చంట్ పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగింది. ఈ వేడుకలో అత్తగారు నీతా అంబానీ హైలైట్గా నిలిచారు. రాధిక ఫోటో ఉన్నటీ షర్టు ధరించి, ముద్దుల కోడల్ని ముద్దుగా ఆలింగనం చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో ఆకాష్ అంబానీతో పాటు, రాధిక స్నేహితులు కూడా పార్టీలో కనిపించారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) కాగా వ్యాపారవేత్త వీరెన్ , శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక, తన బాల్య స్నేహితుడు, ప్రేమికుడుఆకాష్ అంబానీని ( జూలై 2024)వివాహం చేసుకుంది. -
వామ్మో.. ఏ(ఐ)డడుగులు..!
మన పురాతన తాటాకు శాసనాల గ్రంథాల్లో అన్నీ ఉన్నాయో లేవోగానీ... మన సినిమాల్లో మాత్రం సకల విజ్ఞాన శాస్త్రాలూ ఉన్నాయి. అందుకు నిదర్శనమే మనదైన పానిండియన్ సూపర్హిట్ బ్లాక్బస్టర్ సినిమా ‘రోబో’! ఏ అద్భుత ముహూర్తాన మన డైరెక్టర్ శంకర్ ‘రోబో’ తీశాడోగానీ... లోకమంతటా అవే వింతలు అచ్చం అలాగే జరుగుతున్నాయి. ఉదాహరణకు... ఇక్కడి మన సినిమాలో హ్యూమనాయిడ్ రోబో కాస్తా మానవ మానస వికాసాలూ, వికారాలూ ఒంటబట్టించుకుని ‘రోబో సేపియన్’ అవుతాడా! అలా అవ్వగానే ఆ ‘టాయ్’ఫ్రెండు కాస్తా హీరోయిన్కి ‘బాయ్’ఫ్రెండుగా మారి... అచ్చం మన మానవ కుర్రాళ్లలాగే... తనను ప్రేమించని అమ్మాయి మీద యాసిడ్లూ గట్రా విసిరేంత క్రూరమైన ‘సెల్ఫ్స్టైల్డ్ లవర్బా(టా)య్’గా మారిపోతాడు కదా. అక్కడ అమెరికాలోని ఒహాయో రాష్ట్ర చట్టనిపుణులు బహుశా ‘రోబో’ సినిమా చూసి హడలిపోయి ఉంటారేమో... మానవ మేధకూ, కృత్రిమ మేధస్సుకూ మధ్య వివాహాలు వద్దంటే వద్దంటూ గొడవ గొడవ చేస్తున్నారు. అంతేనా... ఆ మేరకు ఓ చట్టం తీసుకు వచ్చేందుకు బిల్లు కూడా ప్రిపేర్ చేశారు. అదే డైరెక్టర్ శంకర్గారి ఆయొక్క అదే ‘రోబో’ సినిమాలో... ‘‘ఇనుములో ఓ హృదయం మొలిచెలే పాటనుంచి స్ఫూర్తి పొందినట్టుగా... ఇప్పటికే మన పొరుగు దుండగీడైన చైనావాడు ‘దివిరి ఇసుకన తైలంబు’ రీతిగా దివిరి ఇనుమున గర్భసంచి నుంచి చిన్నారి పాపలను రేపీపాటికి తీసిస్తానంటూ తొడలుగొడుతూ, హడలగొడుతున్నారన్న సంగతి తెలిసిందే. అంతే కాదు... రోబోలకు సీమంతాలవీ గట్రా చేసేసి కృత్రిమ ‘ఊంబ్’ల లోంచి ఉంగా ఉంగా పాపాయిలను పుట్టిస్తానంటూ సవాళ్లు విసురు తున్నారు కూడా. అమిత వింతలకు నెలవైన అమెరికాలో... ఈ చిత్రవిచిత్రాలన్నీ చూస్తున్న ఒహాయో రాష్ట్రపు మేధావులు భయపడి పోతున్నారేమో...ఆఆందోళనతో స్థిమితంగా ఉండలేక... బహ్మాండమైన ఓ వివాహ నిషేధ చట్టాన్ని తెచ్చేందుకు నిశ్చయించు కున్నారు. ఆ మేరకు బిక్కు బిక్కుమంటూ బిల్లొకదాన్ని అక్కడి చట్టసభల్లో ప్రవేశపెట్టబోతున్నారు కూడా! దీనికి కారణ మేంటంటే... అక్కడి కుర్రకారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెళ్లిళ్లు చేసుకునేందుకు తెగ ఉత్సాహపడిపోతున్నారట!హాయ్యో...! ఇప్పటికే అతి మేధావులైన మానవులూ, అమితమైన మేధస్సుల ‘కృత్రిమ మేధ’ మధ్య పెళ్లిళ్లు జరిగితే... రేపు సదరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కాస్తా పవరాఫ్ ఆటార్నీలంటూ పవర్పట్టా తీసుకోవడం, పార్ట్నర్తో చెట్టాపట్టాలే కాకుండా, లీగల్ వ్యవహారాల్లోకి దూరి, అసలు నిపుణులు తట్టాబుట్టా సర్దుకునేలా, చెట్టూపుట్టా పట్టుకు పోయేలా, బెదిరీ చెదిరీ΄ోయేలా చేస్తాయేమోనని హడలెత్తుతున్నారు ‘ఓహాయో రాష్ట్ర’పు చట్ట నిపుణులు. అందుకే... మనుషులకూ, యంత్రాలకు మధ్య పెళ్లిమంత్రాలు వద్దంటే వద్దంటూ పట్టు పడుతున్నారు. మానవులూ, యాంత్రాల మధ్య మనువులు వద్దంటూ వాదిస్తున్నారు. ఇది ‘యంత్రమాత్రమూ’ తగదంటూ బల్లగుద్ది మరీ శాసిస్తున్నారు మన ఒహాయో స్టేట్ రిప్రజెంటేటివూ, రిపబ్లికన్ మెంబరూ అయిన మిస్టర్ ‘థాయిడస్ క్లాగెట్’ గారు! అలనాడెప్పుడో బ్రహ్మంగారు చెప్పిన వింతలన్నీ అక్కడా ఇక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీ నేపథ్యంలో ఈ పుట్టు తెలివితేటలున్న మన మానవాళీ... పెట్టు తెలివితేటలున్న రోబోయంత్రాళీ...కలగలసి సంకరమైతే... రేపు భవిష్యత్తులో సకల‘అతి’తెలివితేటలున్న బుజ్జిబుజ్జి రోబో–కంగాళీలకు ఆస్కారముంటుందేమోనని అనుమానిస్తున్నారు. అచ్చం రోబో సినిమాలోలాగే... రేపెప్పుడైనా పొరబాటున ఆ ‘చిట్టి’ చిట్టి రోబోలకు విలనీయులైన ఏ అడ్డమైన సైంటిస్టులో ‘రెడ్డు చిప్పు’ పెడితే... అప్పుడది మన మానవాళి చేతికి ‘డేంజరు చిప్పే’ననేమోనంటూ ఇన్నిరకాల ఆంక్షలూ, హాహాకారాలంటూ లోకంలోని ప్రజలంతా తెగ చెవులు కొరుక్కుంటున్నారన్నది అభిజ్ఞ వర్గాల అతి రహస్య భోగట్టా. ఇదీ చదవండి: ధన త్రయోదశి ఆరోగ్యమస్తు ధన ప్రాప్తిరస్తు.. ప్రాశస్త్యం ఇదీ!ఏఐ మ్యారేజ్ ప్రపోజల్ ప్రేమలేఖల నుంచి ఎస్ఎంఎస్ల వరకు లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ పలు రకాలు. తాజా విషయానికి వస్తే...ఒక కుర్రాడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉపయోగించి ఫేక్ డిస్నీ–స్టైల్ ట్రైలర్ ద్వారా తన స్నేహితురాలికి మ్యారేజ్ ప్ర΄ోజ్ చేశాడు. ఈ వీడియోకు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రీషేర్ చేస్తున్నారు. ‘ది ఈజీయెస్ట్ యస్. యస్, ప్ర΄ోజ్డ్ టు జె... యూజింగ్ ఏఐ’ అని వీడియోకు కాప్షన్ ఇచ్చారు. వీడియో చివరలో ‘విల్ యూ మ్యారీ మీ’ అనే కామెంట్ కనిపిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ‘యస్’ చెప్పిందా? యస్! ‘ది మోస్ట్ బ్యూటీఫుల్ మ్యారేజ్ ప్రపోజల్’ అంటూ స్పందించారు నెటిజనులు.– యాసీన్ -
యువ హవా
ఘనమైన కుటుంబ వ్యాపార నేపథ్యం ఉన్నంత మాత్రాన... ‘విజయం అనివార్యం’ అని చెప్పడానికి లేదు. అంకితభావం, కష్టం ఉంటేనే విజయం సొంతం అవుతుంది.ఘనమైన కుటుంబ వ్యాపారనేపథ్యం లేనంత మాత్రాన...‘విజయం దూరం’ అని చెప్పడానికి లేదు. ఆసక్తికి అంకితభావం, కష్టం తోడైతే విజయం సొంతం అవుతుంది. దీనికి తాజా ఉదాహరణ... అవెండస్ వెల్త్–హురున్ ఇండియా–2025 జాబితా. 35 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన 155 మంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్లు వెల్త్–హురున్ ఇండియా జాబితాలో చోటు సాధించారు. వీరిలో... వారసత్వ బాధ్యతకు తమ శక్తియుక్తులను జోడించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. కొన్ని ఉత్పత్తులలో లోపాలు కనిపెట్టి లోపాలు లేని, సౌకర్యవంతమైన ప్రాడక్ట్స్ కోసం ఎంటర్ప్రెన్యూర్లుగా మారి విజయం సాధించిన వారూ ఉన్నారు... వారిలో కొందరు యంగ్ ఫిమేల్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి..సక్సెస్ఫుల్ యూఎస్పీతో...ప్రారంభ కష్టాల మాట ఎలా ఉన్నా... ఉమెన్ యాక్టివేర్ ‘బ్లిస్క్లబ్’ మార్కెట్లో నిలుదొక్కుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఈ ఆన్లైన్ బ్రాండ్ ఆ తరువాత రెండు ఆఫ్లైన్ స్టోర్లను కూడా లాంచ్ చేసి విజయం సాధించింది. ‘మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి కదా. మీ ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ‘బ్లిస్క్లబ్’ ఫౌండర్, సీయీవో మినూ మార్గరెట్ ముందు వచ్చి నిల్చుంది. సిగ్నేచర్ ఫ్యాబ్రిక్స్, వినూత్నమైన ప్రాడక్ట్ డిజైన్ను తమ కంపెనీ యూఎస్పీగా చేసుకొని విజయం సాధించింది మార్గరెట్.నేషనల్ లెవెల్ ఫ్రిస్బీ ప్లేయర్ అయిన మినూ మార్గరెట్ యాక్టివేర్కు సంబంధించిన డీసెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘బ్లిస్క్లబ్’ స్టార్టప్ ఆలోచనవచ్చింది.‘యాక్టివేర్ రంగంలోని కంపెనీలు డిజైన్ ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తాయి. మేము మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నాం. బ్లిస్క్లబ్కు డిజైన్ క్లబ్ లేదు. ప్రాడక్ట్ ఇంజినీరింగ్ టీమ్ మాత్రమే ఉంది. ఈ టీమ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం యాక్టివేర్ సౌలభ్యానికి సంబంధించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడం. ఉదాహరణకు చెన్నైలోని ఒక మహిళ గురించి. వేడి వాతావరణంలో ఆమెకు లెగ్గింగ్స్ ధరించడం కష్టమయ్యేది. ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని వేడివాతావరణంలో కూడా సౌకర్యంగా ఉండే లెగ్గింగ్స్ను డిజైన్ చేశాం’ అంటుంది మార్గరెట్.దేశంలో తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్చెరకు, బయోప్లాస్టిక్కు సంబంధించిన ఆపరేషన్లలో యువ మార్గదర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అవంతిక సరౌగి. కాలిఫోర్నియాలో చదువుకున్న అవంతిక తమ బల్రామ్పూర్ చినీ మిల్స్ లిమిటెడ్ (బీసిఎంఎల్)ను పీఎల్ఏ (పాలీలాక్టిక్ యాసిడ్) తయారీ సౌకర్యాన్ని అందించే కంపెనీగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉంది. ఇది మన దేశంలోని మొట్ట మొదటి బయోప్లాస్టిక్ ప్లాంట్ కానుంది. పీఎల్ఏ అనేది చెరకు పునరుత్పాదక వనరుల నుండి తయారైన బయో ఆధారిత, కంపోస్టబుల్, తక్కువ ఉద్గారాల ప్లాస్టిక్. దీనిని సాధారణంగా ΄్యాకేజింగ్, త్రీడి ప్రింటింగ్లో ఉపయోగిస్తారు. మన దేశంలోని ఈ తొలి బయోప్లాస్టిక్ ప్లాంట్ వల్ల బీసిఎంఎల్ లాభాల బాటలో పయనించనుంది. టర్నోవర్ పెరగనుంది. పర్యావరణ అనుకూలంగా కూడా మారనుంది.తరగతి గదినిమార్చేలావినూత్నమైన ఆలోచన విధానంతో విద్యా, సాంకేతిక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ పరిత పరేఖ్. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకుంది. బ్రౌన్ తరువాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ‘ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్’పై మాస్టర్స్ చేసింది. స్టాన్ఫోర్డ్లో చదువుకునే రోజుల్లో పిల్లల విద్యావిధానం మీద దృష్టి పెట్టేది. స్టాన్ఫోర్డ్లో చేసిన పరిశోధనలు, నేర్చుకున్న ఆధునిక సాంకేతిక విషయాలు ఆమెను ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు నడిపించాయి.కట్టింగ్–ఎడ్జ్ ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్ఫామ్ ‘టొడెల్’తో ఎంటర్ప్రెన్యూర్గా ప్రస్థానాన్ని ప్రారంభించింది పరిత. మూస బోధన పద్ధతులకు అతీతంగా ఆధునిక బోధన పద్ధతులు, ఆలోచనలతో ‘టొడెల్’ ప్లాట్ఫామ్కు రూపకల్పన చేసింది. ‘టొడెల్’ ప్రభావంతో చాలా బడులలో ఉపాధ్యాయుల బోధన పద్ధతి మారింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే సంప్రదాయ, ఆధునిక విద్యాబోధనలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ‘టొడెల్’ కృషి చేస్తోంది. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను పెం పొందించే ప్రణాళికలతో ‘టొడెల్’ విద్యాప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది.చిన్న గదిలో మొదలై...కోట్ల టర్నోవర్ వరకుబెంగళూరులోని చిన్న గదిలో మొదలైన ‘యానిమల్’ రూ.550 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ స్థాయికి చేరింది. ఐఐటీ–దిల్లీలో చదువుకున్న కీర్తి జాంగ్ర, నీతూ యాదవ్ల బ్రెయిన్ చైల్డ్ ‘యానిమల్’. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అవ్యవస్థీకృతంగా ఉన్న మన దేశంలోని పశువుల మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.పశువుల క్రయవిక్రయాలలో ‘యానిమల్’ యాప్ కీలక పాత్ర పోషిస్తోంది. తమ స్టార్టప్ను ప్రారంభించడానికి ముందు సర్వే నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు కీర్తి, నీతూ యాదవ్. డైరీ ఇండస్ట్రీలో కీలకమైన మార్పు తేవాలనుకున్న కీర్తి, నీతూ యాదవ్లు ‘యానిమల్’ యాప్తో తమ కలను నిజం చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా మనం ఉన్న చోటు నుంచే వందల కిలోమీటర్ల దూరంలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతున్న ప్రదేశం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. -
ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్లు, పేస్ట్రీలు ఉండవు..
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్ మస్క్ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్లు, పేస్ట్రీలు, బ్రెడ్లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..ఈ బేకరీ స్టార్షిప్ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట. ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్మెంట్లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్షిప్కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ పేరే ఎందుకంటే..ఇక్కడ టైల్స్ కఠినమైన బేకింగ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది ఇది ఎలాన్ మస్క్ కలల వెంచర్. అలాగే ఈ స్టార్షిప్ని ఇంతల బేక్ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్లు నావిగేట్ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట. Our fully automated bakery in Florida is setup to produce thousands of heat shield tiles per day to outfit the coming fleet of Starship vehicles pic.twitter.com/9Ki278wakx— SpaceX (@SpaceX) October 13, 2025 (చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది. అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్ఎస్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. కుటుంబ నేపథ్యం..ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి. (చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..) -
7 సీక్రెట్స్ : ప్రేమించే భార్య, కొంచెం లక్తో సెంచరీ కొట్టేశా!
వందేళ్లు ఆరోగ్యంగా బతికిన ఓ పెద్దాయన నా దీర్ఘాయువుకు కారణాలివే అంటూ ఏడు చిట్కాలను పంచుకున్నాడు. అమెరికాకు చెందిన శతాధిక వృద్ధుడు సి లిబర్మాన్, జీవిత అనుభవాలు, ఆచరణ, ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.అక్టోబర్ 13న ది వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో 101 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన సి లిబర్మాన్ తన దీర్ఘాయుష్షు రహస్యాలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సందర్బంలో ముఖ్యంగా నాజీ జర్మనీపై శత్రువుల కాల్పుల నుండి బయటపడటం, తీవ్రమైన మాంద్యం పరిస్థితులు తదితర విషయాలను షేర్ చేశాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు తప్పలేదు. గుండెపోటు, కోమాలోకి వెళ్లి బయటపడటం లాంటి అద్భుతమైన జీవిత అనుభవాలు ఉన్నాయి.. ఆయన దీర్ఘాయువుకు కారణమైన ఏడు చిట్కాలుసంబంధాలపై దృష్టి (Focus on relationships): బంధాలు అనుబంధాలపై దృష్టిపెట్టడం ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని తెలిపారు. 76 వైవాహిక జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండే భార్య డోరతీ(97), అద్భుతమైన ఇద్దరు పిల్లలు, మరెంతో ప్రేమగా ఉండే మనవరాళ్లు తన జీవితాన్ని ప్రభావితం చేశారన్నారు. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost)సిగరెట్ తాగవద్దు (Don't Smoke) : ధూమపానం చేయకపోవడమే ప్రదానమైంది. తన చిన్నతనంలో తన స్నేహితులు దాదాపు అందరూ ధూమపానం చేసినా తాను మాత్రం దాని జోలికి పోలేదని తెలిపారు. పెళ్లికాకముందు తన భార్య అప్పుడప్పుడు ధూమపానం చేసేదనీ , మెల్లిగా దాన్ని తాను మానిపించగలిగానని చెప్పారు.వ్యాయామం, ఆహారం (Exercise and eat healthy): ఎల్లప్పుడూ ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాలని సూచించారు. అల్పాహారంగా పండ్లు, ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి. దీంతో పాటు 14 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాకు వెళ్లినప్పటినుంచి బీచ్లో నడవడం, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం లాంటివి ఉన్నాయని చెప్పారు.సానుకూల దృక్పథం (positive attitude): ఎన్ని కష్టాలొచ్చినా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. కష్టాల్లో జీవిస్తూనే పరిస్థితులు మెరుగు పడతాయనే సానుకూల వైఖరి మంచి ఫలితాలనిస్తుందని చెప్పుకొచ్చారు.తగిన వైద్య సంరక్షణ (appropriate medical care) : ఆరోగ్య పరిస్థితులకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి, ఆధునిక వైద్యం అద్భుతాలు నాకు చాలా లాభించాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. నచ్చిన పని, మీనింగ్పుల్గా చేయడం (Do work you find meaningful): ప్రైవేట్ యాజమాన్యంలోని పత్రిక ఆస్బరీ పార్క్ సండే ప్రెస్కు ఎడిటర్గా పనిచేశా. 40 ఏళ్లకు పైగా జర్నలిస్ట్గా చాలెంజింగ్ అండ్ రివార్డింగ్ జాబ్ అది చాలా ఇష్టం చేశా. ఇప్పటికీ బిజీగా ఉండటానికి రాస్తాను.కొంచెం అదృష్టం (Be a little lucky): నిజంగా భార్యతో చాలా అందమైన జీవితాన్ని గడిపాను. ఆమె కొన్ని జ్ఞాపకశక్తి సమస్య ఉన్నా, రాత్రి నిద్రపోయే ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనల్ని ప్రేమించే, మన గురించి కేర్ తీసుకునే మనిషితో జీవించడం దీర్ఘాయువుకు చాలా తోడ్పడతుంది అంటారాయన. -
ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..
దీపావళి పండుగంటే టపాసులు ఖర్చు కాదు.. ఈ వెరైటీ స్వీట్స్ కూడా అంతే ఖరీదు. నిజానికి లక్ష్మీ దేవి పండుగ అయినా ఈ దీపావళి రోజున బంగారం, వెండి కొంటుంటారు కొందరు. కానీ ఆ బంగారాన్నే ఆస్వాదించేలా తయరు చేస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్స్ స్టాల్. వీటిని బంగారం, వెండిపూతతో ఆస్వాదించేలా తయారు చేస్తున్నారు. ఈ తియ్యటి మిఠాయిల ఖరీదు ఎంతో తెలిస్తే గుండెల్లో టపాసులు పేలినంతం పనవ్వుతుంది. వామ్మో..! ఇంత ఖరీదా అనిపిస్తుంది. మరి ఆ కథాకమీషు ఏంటో చూసేద్దామా..!.త్యోహార్ జైపూర్ స్వీట్స్ స్టాల్ ఈ ఖరీదైన స్వీట్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సీజన్లో ఈ స్వీట్స్ మహా ఫేమస్. బంగారు ఆభరణాలను ధరించడమే కాదు నోటిలో కరిగిపోయేలా కూడా ఆస్వాదించొచ్చు అనేలా అందిస్తోంది ఈ ప్రసిద్ధ స్వీట్ షాప్. అంజలి జైన్ అనే మహిళ ఈ వెరైటీ స్వీట్లకు శ్రీకారం చుట్టింది. ఈ గోల్డ్ స్వీట్స్ సిరీస్లో అత్యంత ఖరీదైన స్వీట్ స్వర్ణ ప్రసాదంగా పిలిచే మిఠాయి. దీని ధర కిలోగ్రాముకు రూ. 1,11,000 పలుకుతుంది. చదరపు ఆకారంలో ఉండే ఈ స్వీట్ తినాలంటే అంత ఖర్చు చేయక తప్పదు. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం, రాయల్టీని అందించే స్వీట్స్ ఇవి. ఆయుర్వేదంలో స్వర్ణ భస్మం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలది అని చెబుతుంటారు. ఆ నేపథ్యంలోనే ఇలా స్వీట్స్ తయారీలో లోహాలను వినియోగిస్తున్నట్లు చెబుతోంది ఈ స్వీట్స్ సృష్టికర్త అంజలి. వీటిని ప్యాక్ చేసే బాక్స్లు సైతం అత్యంత విలక్షణంగా బంగారుపెట్టెలను తలపించేలా ఉండటం విశేషం. ఎవరీమె అంటే..చార్టర్డ్ అకౌంటెంట్(CA)గా తన కెరీర్ను ప్రారంభించి.. అనుకోకుండా పాకశాస్త్రంలోకి అడుగుప్పెట్టి తన క్రియేటివిటీకి పదును పెట్టింది. అలా తన రుచికరమైన వంటకాలతో ప్రంపంచాన్ని జయించాలని మహమ్మారి సమయంలో ఈ రంగంలోకి అడుగు పెట్టింది. తన సీఏ నేపథ్యం ఈ స్వీట్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిందని అంటోంది. ఇక తన ఉత్పత్తులన్నింటికి ప్రామాణికత ఉందని, సాధారణ వంటకాలకు తన సృజనాత్మకతను జోడించి విలక్షణంగా పరిచయం చేయడమే తన విజయ రహస్యమని చెబుతోంది. సంప్రదాయ వంటకాలకు ఆధునికతను జోడించి సక్సెస్ని అందుకున్నాని చెబుతోంది. ఈ స్వీట్స్లోని కొన్నింటి ఖరీదు..చాంది భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,150స్వర్ణ్ భస్మ్ భారత్ - ఒక్కో ముక్కకు రూ. 1,950/ కిలోకు రూ. 85,00024 క్యారెట్ కాజు కట్లి - కిలోకు రూ. 3,50024 క్యారెట్ పిస్తా లోంజే - కిలోకు రూ. 7,00024 క్యారెట్ లడ్డూ - కిలోకు రూ. 2,500(చదవండి: ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..) -
ఆయుష్మాన్ భవ.. ! కాలుష్యాన్ని జయిస్తున్న జీవన విధానం..
ఓ వైపు పెరుగుతున్న కాలుష్యం.. కల్తీ ఆహారం.. అనారోగ్య కారకాలు వంటివి మనిషి సగటు జీవన ప్రమాణాలను ఆయుర్దాయాన్ని దెబ్బతీస్తున్నాయి.. మరోవైపు ఆశ్చర్యకరమైన ఫలితాలను అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే దీనికీ ఓ లెక్కుందండోయ్..? అదే ఆరోగ్యకరమైన జీవన విధానం.. అందుకు కావాల్సిన సౌకర్యాలు.. ప్రామాణికాలు.. గతంతో పోలిస్తే మెట్రో నగరాల్లో పలు వనరులు కాలుష్యానికి గురైనా.. మరోవైపు ప్రజల్లో పెరిగిన అవగాహన, విజ్ఞానం, వైద్య సౌకర్యాలు వాటిని అధిగమిస్తూ కొత్త అడుగులు వేయిస్తున్నాయి. ఫలితంగా మానవుని ఆయుఃప్రమాణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హైదరాబాద్తోపాటు దేశంలోని పదికి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, కల్తీ ఆహారం వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ఇది 3 నుంచి 4 శాతం సగటును నమోదు చేసుకుంటున్నాయి. అయితే అదే సమయంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన సగటున ఆయుర్దాయాన్ని(Life Expectancy)పెంచడానికి దోహదం చేస్తున్నాయని, దీని వల్ల నగరాల్లో జీవన కాలాన్ని సగటున 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచిందని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ వంటి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ అధ్యయన ఫలితాలు మాత్రం ఇది వాస్తవమని చెబుతున్నాయి. పూర్తి భిన్నంగా.. మహానగరాలు గాలి, నీరు, ఆహారం, శబ్ద కాలుష్యంతో నిండిపోయాయి. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే నగర ప్రజల ఆయుః ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధనలే చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజా అధ్యయనాలు పరిశోధకులను, ఆరోగ్య నిపుణులను విస్తుపోయేలా చేస్తున్నాయి. పట్టణాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితులు పల్లెల్లో ఉంటాయనేది అందరికీ తెలిసిన వాస్తవం.. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ.. ఈ ఫలితాలు ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే.. అయితే ఫలితాలు చెప్పే వాస్తవాలను ఓ సారి పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి జీవన ప్రమాణాల్లో పెరుగుతున్న నాణ్యత అవగాహనే కారణమని తెలుస్తోంది. సర్వే చెబుతోన్నదేంటి!? గతేడాది ప్రచురితమైన బీఎమ్సీ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. దేశంలో అధిక ఆదాయం ఉన్న నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రజలకంటే సగటున 7.5 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నారని తేలి్చంది. మెరుగైన ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యపై పెరుగుతున్న చైతన్యం, ఆరోగ్య బీమా, మెరుతైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలే కారణాలు ఇందుకు కారణాలుగా పరిశోధనలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, వంటి ఇతర సరీ్వస్ రంగాల ఉద్యోగాలు మధ్యతరగతి ప్రజల జీవన విధానం, ఆలోచనా ధోరణిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు నగరంలో ప్రభుత్వాలు చేపట్టే ‘క్లీన్ ఎయిర్ ప్లాన్’, ‘హరిత హైదరాబాద్’ వంటి ప్రాజెక్టులు కూడా ఓ ముఖ్య భూమికను పోషిస్తున్నాయని, దీంతో పాటు ప్రజల్లోనూ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం, నిద్ర, ఆహార నియమాలు మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. అవగాహన లేమి.. నగరాలతో పోలిస్తే గామీణ ప్రాంతాలు వెనుకబడడానికి అసలు కారణం అవగాహనా లేమి.. మెరుగైన సౌకర్యాలు లేకపోవడం, ఆదాయ వనరులు, వ్యక్తి శుభ్రత ప్రభావం చూపుతున్నాయని తెలిసింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. సరైన అవగాహన లేక, సదుపాయాలు లేక, ఆయా సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను సరైన సమయంలో గుర్తించక ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారని, పల్లెతో పోలిస్తే వైద్యు సేవలు, డిజిటల్ కన్సల్టేషన్, టెక్నాలజీ, టెలీమెడిసిన్, ఫిట్నెస్ సెంటర్లు, యోగా వంటివి ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రజలకు తెలిసిన వాస్తవ కోణం.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ బోర్డు తాజా గణాంకాల ప్రకారం హైదరాబద్ నగర గాలిలో నాణ్యత ‘మోస్తరు నుంచి హానికర స్థాయికి’ మధ్యలో ఊగిసలాడిందని తెలిపింది. జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, ముసీ నది కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్ఏఎన్యూయూ పరిశోధకులు వెల్లడించారు. పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు, రసాయన అవశేషాల వల్ల భూగర్భజలాలు కూడా కలుషితమౌతున్న విషయం తెలిసిందే. ఆహార విషయంలోనూ హానికర రసాయనాలు నగర మార్కెట్లో మితిమీరిన స్థాయిలో ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. వ్యక్తిగత భద్రత ముఖ్యం.. విజ్ఞానం, సాంకేతికత ద్వారా అందే ఫలాలను అందరూ అందుకోగలగాలి. అప్పుడే జీవిత కాలం పెరగడంతో పాటు, ఒక మెరుగైన జీవితాన్ని అనుభవించగలరు. ఇందుకు విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన, పరిసరాల–వ్యక్తిగత పరిశుభ్రత వంటివి చాలా ముఖ్యం.! అందుకే కాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల కంటే గ్రామాల్లో ఆయుఃప్రమాణాలు తక్కువ.! పట్టణాల్లో కాలుష్యం తగ్గించే ప్రయత్నాలతో పాటు, గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే, గ్రామ ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. – డా.ప్రతిభా లక్ష్మి, జనరల్ మెడిసిన్ – ప్రొఫెసర్ -
ఆహా ఏమి రుచి..! నోరూరించే వివిధ రకాల వంటకాలు..
నోరూరించే వివిధ రకాల వంటకాలకు నగరం వేదికైంది.. పాకశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన పలువురు చెఫ్లు వివిధ ప్రాంతాల వంటకాలతో ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలోని సనత్నగర్లో అగ్రోమెచ్ స్టూడియో తెలంగాణ, ఆంధ్ర చెఫ్ల వంటకాలకు గురువారం వేదికైంది. అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమం చెఫ్ల ఐక్యత, వారసత్వ కళ, పాకశాస్త్రానికి వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన చెఫ్లు కేవలం వేడుక జరుపుకోవడానికి మాత్రమే కాకుండా, ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి, మెరుగైన భవిష్యత్తుకు తమ అనుభవాలను పంచుకున్నారు. పాకశాస్త్రంలో పేరెన్నికగన్న చెఫ్స్ కాశీ విశ్వనాథన్, శేఖర్, సంజయ్ తుమ్మ, సుధాకర్ ఎన్.రావు, మిస్టర్ పాల్గుణి నాయుడు, సుధా కుమార్, మిస్టర్ అన్మోల్ ప్రభు, మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రవీందర్ రెడ్డి వంటి ప్రఖ్యాత చెఫ్లు, ముఖ్య అతిథులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా పాక శాస్త్రం, ఆరోగ్యం, ఆవిష్కరణల పరిణామంపై ప్రభావవంతమైన సూచనలను అందించారు. ఆహారం అంటే పోషకాహారం మాత్రమే కాదు, సంరక్షణ, సృజనాత్మకత, స్థానిక భాష.. అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెషనల్ చెఫ్లతో పోటీ పడుతూ తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అనుభవజ్ఞులైన చెఫ్ల నేతృత్వంలోని ఇంటరాక్టివ్ షేరింగ్ సెషన్స్, మనదైన వారసత్వ వంటకాలను పంచుకున్నారు. బెస్ట్ వంటకాల ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. చెఫ్ల మధ్య సోదరభావాన్ని ఏర్పరిచింది. ఈ సందర్భంగా సీఏటీఏ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి చెఫ్ యాదగిరి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు.. ఇది ఓ కుటుంబం, ఆహారానికీ జీవం పోసే ప్రతి కళాకారుడినీ వృద్ధిలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం’ అన్నారు. చెఫ్స్ ఐక్యత, సేవా సందేశంతో తెలంగాణ, ఆంధ్ర అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం– 2025 వేడుకను ముగింపుగా కాకుండా ఒక ప్రారంభ సూచికగా నిలిచింది.. (చదవండి: ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..) -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..) -
ఇంటిపని నుంచి తోటపని వరకు...'ఫిగర్ వో 3'
‘ఫిగర్ ఏఐ’ అనేది హ్యూమన్ రోబోలకు సంబంధించిన స్టార్టప్. తాజాగా ‘ఫిగర్ వో 3’ అనే హ్యూమన్ రోబో గురించి ప్రకటించింది కంపెనీ. ‘రోజువారీ అవసరాలకు ఉపయోగపడే సాధారణ హ్యూమనాయిడ్ రోబో ఇది. గదిని శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, ఆహారాన్ని వడ్డించడం, గిన్నెలు కడగడం, బట్టలు మడత పెట్టడం...మొదలైన ఎన్నో పనులు చేస్తుంది’ అని ‘ఫిగర్ వో 3’ వివరాలు వెల్లడి చేసింది కంపెనీ.కాలిఫోర్నియాకు చెందిన ‘ఫిగర్ ఏఐ’ స్టార్టప్ మునుపటి తరం హ్యూమనాయిడ్లతో పోల్చితే సరికొత్త, సాంకేతికంగా ఒక అడుగు ముందుండే హ్యూమనాయిడ్స్ దృష్టి పెట్టింది. పూర్తిగా రీడిజైన్ చేసిన సెన్సరీ సూట్, హ్యాండ్ సిస్టమ్, నెక్ట్స్ జనరేషన్ విజన్ సిస్టమ్తో ఈ సరికొత్త హ్యూమనాయిడ్ రోబో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. (చదవండి: పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!) -
'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్ని తలపించేలా..
తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’ మూవీలో ఎలాగైతే మనుషులు ప్రవర్తిస్తారో అలా బిహేవ్ చేస్తారట ఈ జిలాజిన్ డ్రగ్ తీసుకుంటే. దీన్ని కొందరు మత్తు పదార్థలతో కలపి తీసుకుంటారట. దాంతో మనుషులు అచ్చం జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తారట. ఒక్కోసారి మోతాదు ఎక్కువైతే శరీరం కుళ్లిపోయి..ప్రాణాలు కూడా కోల్పోతారట. ఇంతకీ అసలేంటి డ్రగ్..?. అసలు దేని కోసం దీన్ని తయారు చేశారు?, ఏవిధంగా మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారు అంటే..ప్రస్తుతం యూఎస్లో ఈ డ్రగ్ సంబంధిత మరణాలు అధికంగా ఉన్నాయి. అక్కడ ఫెంటానిల్ అనే మత్తు మందుని యువకులు సేవిస్తుంటారట. దానిలో 'జోంబీ' అనే జిలాజిన్ డ్రగ్ కలిపి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇది శరీరంపై పలు దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాంతకమైనది కూడా. నిజానికి ఇది జంతువులను సులభంగా అదుపులోకి తెచ్చే మత్తుమందు. దీన్ని పశువైద్య మందుగా ఉపయోగిస్తారు. అలాంటి డ్రగ్ని అక్రమ మాదకద్రవ్యాల్లో కలిపేస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఫెంటానిల్ అనే మత్తు మందులో కలపడం వల్ల దాని దుష్ఫ్రభావం మరింత తీవ్రతరం అవుతుందట. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన మరణాలు అధికమవ్వడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ప్రస్తుతం దీనికి సంబంధించిన బాధితులను యూఎస్ ఫిలడెల్ఫియాలోని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రుల్లో వారానికి ఒకసారి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు వైద్యులు.జిలాజిన్ అంటే ఏమిటి?జిలాజిన్ అనేది శక్తివంతమైన α-2 అడ్రినెర్జిక్ అగోనిస్ట్. దీనిని మొదట 1962లో బేయర్ అనే శాస్త్రవేత్త రక్తపోటు ఔషధంగా సంశ్లేషణ చేశారు. అయితే దీని తీవ్రమైన దుష్ప్రభావాల కారణంగా పశువైద్య కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. తరువాత ఇది 2000ల ప్రారంభంలో ప్యూర్టో రికోలో వీధి ఔషధంగా దుర్వినియోగం అవడం ప్రారంభించి..రాను రాను వ్యసనంగా మారింది. ఈ మందుని ఇంజెక్ట్ చేయగానే..కండరాలు సడలించి, నొప్పిని తగ్గించి వ్యక్తులను ఒక విధమైన మత్తులో జోగేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే నోర్పైన్ ఫ్రైన్ విడుదలను తగ్గించి..ట్రాన్స్ లాంటి స్థితిని ప్రేరేపిస్తుంది. దీని ఫలితంగా జోంబీ లాంటి ప్రభావం ఏర్పడుతుంది. అదేనండి జాంబీ రెడ్డి మూవీలో విధంగా మనుషులు మారిపోతారని మాట. Welcome to Michigan 🥴🥴🥴🥴😂 pic.twitter.com/CfE1vE2fiM— 0HOUR (@0HOUR1__) September 6, 2025 ప్రమాదకరమైన ప్రభావాలు..ఈ డ్రగ్ నెమ్మదిగా హృదయ స్పందన రేటు పడిపోయేలా చేస్తుందట. తర్వాత తక్కువ రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిగి కలిగిస్తుంది. రక్తనాళాలను సంకోచించేలా చేసి తీవ్రమైన చర్మగాయాలకు దారితీస్తుందట. దీన్ని ఎక్కడ ఇంజెక్ట్ చేశామో ఆ ప్రాంతంలో రక్తసరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుందట. తద్వారా కణజాలం చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఇది అచ్చం మాంసం తినే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను పోలి ఉంటుందట. కొన్ని సందర్భాలలో కణజాల నెక్రోసిస్ కారణంగా అవయవాలు స్వయంచాలకంగా విచ్ఛిన్నమవడం, ఎముకలు బహిర్గతం అవ్వడం జరుగుతుందట. ఈ డ్రగ్ సంబంధిత గాయాలనేవి.. మోతాదు వినియోగం, వ్యక్తి స్థితిని బట్టి మారుతుంటుందట దాని ప్రభావం. ఆ డ్రగ్ ఇంజెక్ట్ అయిన ప్రాంతంలో నరాలకు కోలుకోలేనంత నష్టం ఏర్పుడతుంది కాబట్టి యథాస్థితి రావడం అసాధ్యమని చెబుతున్నారు నిపుణులు. కానీ ఈ వ్యసనం బారినుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని అనుభవించేలా మాత్రం చికిత్స అందించగలమని నిపుణులు చెబుతున్నారు. అలా బయటపడి పూర్తి స్థాయిలో కోలుకున్నవాళ్లుకూడా ఉన్నారని చెబుతున్నారు.📍For informational purposes:These chilling scenes are coming out of Philadelphia, USA, linked to the widespread use of a drug called Xylazine.It’s so potent that it’s been described as a drug that “zombifies” humans 😳Could this be the beginning of an apocalypse? pic.twitter.com/r8Uiq2rYCz— ADTed✨ (@Eduo_Prince) September 6, 2025 (చదవండి: తెర వెనుక డాక్టర్ అనస్థీషియా..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..) -
అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?
పండుగలు, పబ్బాలు అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలంకరించుకోవడం మొదలు పూజలు, పిండివంటలు అబ్బో ప్రతీ ఇంట్లోనూ ఈ హడావిడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి కుబేరుల దాకా ఈ సందడి ఉంటుంది. ఇక వెలుగుల పండుగ దీపావళి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. దీపావళి వేడుకలు, భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటగా రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు? అసలు అక్కడ ఫుడ్ మెనూ ఎవరు ప్రిపేర్ చేస్తారు. వంటింట్లో ఎవరి ప్రాముఖ్యత ఎంత?ముంబైలోని అతి విలాసవంతమైన భవనం, ముఖేష్ అంబానీ ఉండే భవనం ‘యాంటిలియా’లో వందలాది మంది సిబ్బంది పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి ఇంట్లో వంటింటి పెత్తనం ఎవరిది అనేది ఇపుడు చర్చ. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ముఖేష్, నీతా దంపతులకు ముగ్గురు సంతానం, ఆకాష్,అనంత్, ఇషా. కూతురు పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లింది. ఇక ఇద్దరు కొడుకులు, కోడళ్లతో నివసించే ఉమ్మడి కుటుంబం. అలాగే రిలయన్స్ ఫౌండర్ దివంగత ధీరూభాయ్ అంబానీ సతీమణి, ముఖేష్ తల్లి కూడా వీరితోపాటే ఉంటారు. చదవండి: Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!Radhika Merchant Vs Sloka Mehta ఈ ఉమ్మడి కుటుంబంలో కిచెన్ బాధ్యత ఎవరిదన్న కుతూహలం అందరిలో ఉంటుంది. పెద్ద కోడలు శ్లోక మెహతా, చిన్నకోడలు రాధికా మర్చంట్ మధ్య చాలా సఖ్యత ఉంటుందట. అంబానీ కుటుంబం శాఖాహారులు. తాజా వార్తల ప్రకారం పెద్ద కోడలు శ్లోక మెహతా రోజువారీ మెనూను నిర్ణయిస్తారు. శ్లోకకు కుటుంబ సంప్రదాయాలు ఆహార ప్రాధాన్యతలు బాగా తెలుసు. ఆమె వంట గదిని పర్యవేక్షిస్తుంది. కుటుంబం, అతిథులు, పండుగలు, విందు భోజనాలను ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్ ఇటీవల అంబానీ కుటుంబంలో చేరిన నేపథ్యంలో ఇంటి పద్ధతులను ఆచారాలను ఇపుడిపుడే అవగాహన చేసుకుంటోంది. సంప్రదాయాలను నేర్చుకుంటోంది. కుటుంబ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ ముద్దుల కోడలు అనిపించుకుంటోంది.(బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు )కాగా అంబానీలు ఆరోగ్యకరమైన, సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడే స్వచ్ఛమైన శాఖాహారి. క్షణాల్లో వంటకాలను తయారు చేసి, వేడిగా వడ్డించేందుకు చెఫ్లు రెడీగా అందుబాటులో ఉంటారు. దీనికితోడు అప్పుడప్పుడు హోటళ్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారాల్లో ముంబైలోని 'మైసూర్ కేఫ్' నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
Anesthesiologist: తెర వెనుక డాక్టర్..! వైద్య రంగంలో వారి సేవలు అద్భుతం..
పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడం వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. శరీరంలోని ప్రతీ అవయవానికి చేసే సర్జరీకి ముందుగా మత్తుమందు(అనస్థీషియా)ఇస్తారు. దీంతో నొప్పి బావన ఉండదు. క్లిష్టమైన, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు అనస్థీషియా నిపుణులు చేస్తున్న సేవలు అత్యంత ముఖ్యమైనవి. తెరవెనుక డాక్టర్ అనస్థీషియా. వీరికోసం ఏటా అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1846 అక్టోబర్ 16న తొలిసారి విలియం టీజీ మోర్టన్ అనే వైద్యుడు ఈథర్ అనస్థీషియాను విజయవంతంగా ప్రదర్శించారు. మత్తుమందు లేని రోజుల్లో.. అనెస్తీషియా అమలులోకి రానిరోజుల్లో పేషెంట్కు శస్త్రచికిత్స చేయాలంటే, మత్తు రావడానికి తలపై గట్టిగా కొట్టడం, పాములతో కరిపించడం, వివిధ రకాల మత్తు పదార్థాలు తినిపించడం, గట్టిగా చేతులతో పట్టుకుని ఆపరేషన్లు చేసేవారని చెబుతున్నారు. అనస్థీషియాను కనిపెట్టాక చిన్న సూదితో శరీరంలో మత్తు ఎక్కించేసి పేషెంట్కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తున్నారు. జీజీహెచ్లో 13 మంది అనస్థీషియాలు.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అనస్థీషియాల సహకారంతో ప్రతీనెల వేలాది ఆపరేషన్లు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ సిమ్స్ అనుబంధ జీజీహెచ్లో అనెస్తీషియా విభాగం ప్రత్యేకంగా ఉంది. ఇందులోని ఇద్దరు ప్రొఫెసర్లు, 10 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఎస్ఆర్ సేవలు అందిస్తున్నారు. పేషెంట్ కోలుకునే వరకు.. పేషెంట్కు మత్తుమందు ఇచ్చేది అనస్థీషియాలే అయినా.. శస్త్రచికిత్స పూర్తయి, కోలుకునే వరకూ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. పేషెంట్ త్వరగా కోలుకున్నాడంటే అందులో అనస్థీషియా పాత్రకీలకంగా ఉంటుంది.వైద్యరంగంలో కీలకం వైద్యరంగంలో అనస్థీషియా చాలా కీలకమైనది. ప్రస్తుత వైద్య విధానంలో మత్తుమందు లేకపోతే అనే ఊహనే కష్టంగా ఉంటుంది. మత్తుమందు అందుబాటులోకి రావడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.– దండె రాజు, ఆర్ఎంవో, జీజీహెచ్ తెరవెనుక వైద్యుడు తెరవెనుక వైద్యుడు అనస్థీషియా. ఆపరేషన్ చేయడానికి సర్జన్తోపాటు అనస్థీషియా కూడా కీలకమే. పేషెంట్ కోలుకునే వరకు పర్యవేక్షిస్తుంటాడు. జీజీహెచ్లో చాలా హైరిస్క్ కేసులు కూడా అనెస్తీషియాల సహకారంతో విజయవంతంగా చేస్తున్నాం. – అరుణ, గైనిక్ హెచ్వోడీ, జీజీహెచ్(చదవండి: -
చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త!
దసరా అయిపోయింది..దీపావళి పండుగ సన్నాహాలు మొదలైపోయాయి. దీపాల పండుగ వచ్చేస్తుందటంట..వణికించే చలి మొదలైపోతుంది. సరదాగా అనిపించినా.. ఈ కాలంలో ఆహారం, ఆరోగ్యం రెండూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేగాదు రైతులు కూడా ఈ అధిక చలికారణంగా నష్టాలను చవిచూస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల నుంచి సేఫ్గా ఉండాలంటే..మరీ ఏడాది చలి ప్రభావం ఏ రేంజ్లో ఉందో ముందుగానే తెలుసుకుందామా..!.వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ఏడాది భారత్ అత్యంత శీతల శీతకాలన్ని చవిచూడనుందని పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ సైతం ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, తరుచుగా చలి గాలులు, భారీ హిమపాతం వంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈవిధమైన వాతావరణ మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటికే జమ్ము కాశ్మీర్లోని సింథాన్ వంటి ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక ఇండో గంగా మైదానాల్లోకి చొచ్చుకుపోతున్న చల్లని గాలి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. అలాగే వాతావరణ ఉష్ణోగ్రతలు తరుచుగా మార్పులు చోటుచేసుకుంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో సీనియర్ క్లైమాటాలజిస్ట్ డాక్టర్ రీతు శర్మ అన్నారు. ఈ ముందస్తు శీతాకాలపు సూచన ముఖ్యంగా వ్యవసాయం, ప్రజారోగ్యం వాటికి సంబంధించి మెరుగైన సంసిద్ధతకు మేల్కొలుపుగా పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు అధిక శీతగాలుల కారణంగా గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అలాగే ఆరోగ్యపరంగా.. శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఈ వాతావరణ మార్పు, ఆహార భద్రత ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపుడుతున్నాయో హైలెట్ చేశారు. అలాగే ఈ ముదస్తు వాతావరణ హెచ్చరికతో ఎలాంటి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే మంచిదనేది నిర్ణయించొచ్చని ఎఫ్ఏఓ ప్రతినిధి ప్రియామీనన్ అన్నారు. అలాగే చలికాలం సమీపిస్తున్నందున ప్రజలంతా తమ నిత్యావసరాలను అనువైన విధంగా నిల్వ చేసుకోవడం తోపాటు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిపుణులు.(చదవండి: Success Story: ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..) -
ఆఫీస్ బాయ్ నుంచి సీఈవో రేంజ్కి..! ఏకంగా డిజైన్ దిగ్గజం కాన్వాతో..
ఒకప్పుడూ ఒక ప్రముఖ సాఫ్టవేర్ దిగ్గజం ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్గా కంప్యూటర్లను క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత వాటితో పనిచేసే స్థాయికి చేరుకుని..ప్రోఫెషన్ డిజైనర్గా మారాడు. ఇంతలో మహమ్మారి తన ఆశలపై చన్నీళ్లు జల్లి గ్రామంలో కూర్చొబెట్టింది. అయినా సరే ..అక్కడ నుంచి వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి..అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ డిజైన్ దిగ్గజంతో పోటీపడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఎవ్వరి ప్రస్థానం అయినా ఏమి తెలియని సున్నా స్థాయి నుంచి మొదలవ్వుతుంది..ఆ శూన్యం విలువని పెంచడం అనేది మన చేతిలోనే ఉంది అనేది తన చేతలతో చెప్పకనే చెప్పాడు ఈ వ్యక్తి. అతడెవరు? అతడి ప్రస్థానం ఎలా మొదలైందో సవివరంగా చూద్దామా..!.ఎక్కడో కరువు బాధిత గ్రామం నుంచి వచ్చి..జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ వ్యక్తి దాదాసాహెబ్ భగత్(Dadasaheb Bhagat ). ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన మన కీ బాత్లో అతడి గురించి ప్రస్తావించడమే కాదు మేక్ ఇన్ భారత్కు సరైన అర్థం ఇచ్చాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భగత్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందినవాడు. అతడి కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అతడి కుటుంబం తన విద్యకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అయినా భగత్ ఐటీఐ వరకు ఏదోలా చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత మెరుగైన భవిష్యత్తు కోసం పూణేకు వెళ్లి నెలకు 4 వేలు జీతం ఇచ్చే పనిక కుదిరాడు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఆఫీస్ బాయ్(Infosys office boy) ఉద్యోగాలు గురించి తెలుసుకుని అక్కడ జాయిన్ అయ్యాడు. అక్కడ రోజువారి పనులు చేస్తూ..అందులో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడుతుండేవాడు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలంటే కనీసం డిగ్రీ చేసి ఉండాలని చెప్పారు అక్కడి ఉద్యోగులు. పోనీ కంప్యూర్ జాబ్ కావాలంటే గ్రాఫిక్ డిజైన్ వంటి యానిమేషన్ కోర్సులు ద్వారా ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు అని సూచించారు భగత్కి. వాటికి క్రియేటివిటీ ముఖ్యం అని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. అలా రాత్రిళ్లు ఆఫీస్ బాయ్గా డ్యూటీ చేస్తూ.పగలు యానిమేషన్ కోర్సునేర్చుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వేరే చోట ఉద్యోగం చేయడం కంటే తనకంటూ సొంత మార్గంలో వెళ్లాలనేది అతడి ఆలోచన. ఆ నేపథ్యంలోనే తొలుత డిజైనర్గా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించాడు..ఆ తర్వాత సొంత డిజైన్ కంపెనీని ప్రారంభించాడు. అయితే అతడి కలలపై నీళ్లు జల్లినట్లుగా కోవిడ్మహమ్మారి విజృంభించి తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయేలా చేసింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు భగత్. గ్రామంలో బతకడం ఈజీ..కానీ తన గ్రాఫిక్ డిజైన్ కంపెనీ ప్రారంభించడం అంత సులభం కాదు. ఎందుకంటే తరుచుగా విద్యుత్ కోతలు..సరైన ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి దీన్ని పరిష్కరించేలా తన బృదం సాయంతో మార్గాన్ని అన్వేషించాడు. తమ ఊరిలో కొండపై ఉండే గోశాల వద్ద మొబైల్ సిగ్నల్ బేషుగ్గా ఉంది. కాబట్టి అక్కడ తన డిజైన్ టెంప్లేట్ ఆఫీస్ను పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్నగా మొదలైంది అతడి కార్యాలయం. స్థానిక యువకులకు గ్రాఫిక్ డిజైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. వారికి డిజిటల్ నైపుణ్యాల అందివ్వడంలో సహాయం చేశాడు. అతడి వినూత్న స్ఫూర్తి మీడియా కంటపడి..మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆయన మన్ననలను అందుకోవడమే కాదు షార్క్ ట్యాంక్ ఇండియాకు చేరుకుంది అతడి విజయగాథ. దాంతో చిన్నగా మొదలైన డిజైన్ టెంప్లేట్ కాస్తా అంచలంచెలుగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక షార్క్ ట్యాంక్ షోలో బోట్ వ్యవస్థాపకుడు సీఎంఓ అమన్ గుప్పా ఏకంగా అతడి కంపెనీలో పదిశాతం ఈక్విటీని కోటి రూపాయలకు విక్రయించాడు. అయితే ఆ షోలో తన కంపెనీ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వడంలో తడబడ్డానని, అప్పుడు రాధికా గుప్తా మంచినీళ్లు ఇచ్చి ఏదో ఆఫీస్ ప్రెజెంటేషన్లా కాదు..నీ ప్రస్థానాన్ని తోటి స్నేహితులకు వివరించినట్లుగా చెప్పుచాలు అని ధైర్యం ఇచ్చారని నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు భగత్. అయితే ఈ డిజైన్ టెంప్లేట్ భారతీయ వినియోగదారుల కోసం భగత్ రూపొందించిన క్రియేటివిటీ సాధనం. ఇప్పుడు ఇది అంతర్జాతీయ డిజైన్ ఫ్లాట్ఫామ్ కాన్వాతో పోటీపడే రేంజ్కి చేరుకుంది. ఆఫీస్ బాయ్ కాస్తా ప్రోఫెషనల్ డిజైనర్ స్థాయికు చేరుకుని తానే ఉద్యోగాల ఇచ్చే రేంజ్కి చేరడం అంటే..అది అలాంటి ఇలాంటి సక్సెస్ జర్నీ కాదు కదూ..! కాగా, భగత్ స్థానిక క్రియేటర్లకు సాధికరత కల్పించి..డిజిటల్ డిజైన్లో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నాడు భగత్. View this post on Instagram A post shared by Dadasaheb Bhagat (@dadasaheb_bhagat) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
సహజమైన స్టైల్ దుస్తులే ఇష్టం: కునాల్ కపూర్
బాలీవుడ్ నటుడు ఓ స్టోర్ లాంచింగ్లో సందడి చేశారు. కొత్తగూడలోని శరత్సిటీ మాల్లో ఇండియన్ టెర్రైన్ ఎండీ నర్సింహన్తో కలిసి బుధవారం ఆయన సరికొత్త కాన్సెప్ట్ స్టోర్ను ప్రారంభించారు. ఫ్యాషన్ ప్రేమికులకు నాణ్యమైన వివిధ డిజైన్ల దుస్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సహజమైన స్టైల్గా ఉండే దుస్తులు ఇష్టమని ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న కునాల్ కపూర్ పేర్కొన్నారు. చేనేత..ఓ ప్రామాణికత..ఫ్యాషన్ అంటే అనుసంధానం చేసేది, అనుభూతిని కలిగించేది.. మనం ధరించే వ్రస్తాలు అందమైన అనుభూతులనే కాకుండా సామాజికంగా మంచిని ప్రోత్సహించాలని నటి తేజస్వి మడివాడ తెలిపారు. కళాధర్ హ్యాండ్లూమ్స్ ఆధ్వర్యంలో రానున్న హైఫ్రీక్వెన్సీ దుస్తుల శ్రేణి కోసం నటి తేజస్వి సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజంగా లభించే ఫైబర్స్, స్వచ్ఛమైన పత్తి, నార, పట్టు నుంచి తయారైన దుస్తులను అమితంగా ఇష్టపడతాను, ఇలాంటి చేనేత ఫ్యాషన్ ఔత్సాహిక ఉన్న బ్రాండ్తో భాగస్వామిగా మారడం సంతృప్తిగా ఉందని అన్నారు. ప్రామాణికతపై నమ్మకం, చేతన ఫ్యాషన్ పట్ల నటి తేజస్వీకి ఉన్న ఉత్సుకత ఈ తరం ఫ్యాషన్ ప్రియులకు ఆదర్శమని కళాధర్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ కళాధర్ రచబతుని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా మొదటి డ్రాప్లో క్లీన్ సిల్హౌట్లు, బ్రీతబుల్ టెక్చర్తో సమకాలీన హంగులతో భారతీయ హస్తకళను ప్రదర్శించే సీజన్లెస్ కలెక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. (చదవండి: ఫ్యాషన్ టు డైరెక్షన్..! కాదేదీ సృజనకు అనర్హం) -
ఫ్యాషన్ టు డైరెక్షన్..! కాదేదీ సృజనకు అనర్హం
దుస్తులు చెక్కిన చేతులు దృశ్యాలకు రూపమిస్తున్నాయి. మోడల్స్ని మెరిపించిన సృజన యాక్టర్స్ను కదిలిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగం వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కాదేదీ సృజనకు అనర్హం అనుకుంటూ తమ స్కిల్స్కు సాన పెడుతున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభం కాగా.. నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. సినిమా రంగం వైపు డిజైనర్ల చూపు ‘అక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ రావాలి.. ఆ షేడ్ ఇంకొంచెం మార్చాలి’.. వగైరా సూచనలు చేసిన వారే ‘లైట్స్, కెమెరా, యాక్షన్..’ అంటూ నిర్ధేశిస్తున్నారు. నగరంలో కొన్ని సినిమా షూటింగ్స్లో డైరెక్టర్లుగా మారిన ఫ్యాషన్ డిజైనర్లు చేస్తున్న సందడి ఇది. బాలీవుడ్తో మొదలై.. ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే జాబితాలో ముందుంటాయి విక్రమ్ ఫడ్నిస్, మనీష్ మల్హోత్రా అనే పేర్లు. అయితే ఇప్పుడు వీరి పేర్లకు ముందు ఇప్పుడు డిజైనర్లతో పాటు డైరెక్టర్లు అనే కొత్త ప్రొఫెషన్ కూడా చేరింది. కొన్నేళ్ల క్రితమే సినిమా దర్శకత్వంలో అడుగుపెట్టి హృదయాంతర్(2017), స్మైల్ ప్లీజ్(2019) అనే రెండు మరాఠీ చిత్రాలకు విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వం వహించారు. అదేవిధంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హిందీ చిత్రం ద్వారా మనీష్ మల్హోత్రా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అయితే వీరు మాత్రమే కాకుండా గతంలో ఇతర డిజైనర్లు కూడా రంగుల లోకంలో భిన్న పాత్రలను పోషించారు. కాంతార ద్వారా దేశవ్యాప్తంగా అటు దర్శకత్వం, ఇటు హీరోగానూ పేరు సాధించిన రిషబ్ శెట్టి తొలి దశలో తాను తీసిన రిక్కి అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేశారు. అదే విధంగా డిజైనర్గా సినిమా రంగంలో అడుగుపెట్టిన కేరళకు చెందిన స్టెఫీ జేవియర్ సైతం కొన్నేళ్ల తర్వాత మధుర మనోహర మోహం అనే సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. నగరానికి వచ్చేసిన ట్రెండ్.. ఇప్పుడు అదే ట్రెండ్ నగరానికి కూడా విస్తరించినట్టు కనిపిస్తోంది. నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్లు సినిమా రంగంపై తమ దృష్టి మళ్లించినట్టు స్పష్టమవుతోంది. డిజైనర్గా విజయవంతంగా కొనసాగుతున్న రామ్జ్.. పచ్చీస్ అనే సినిమా ద్వారా హీరోగా మారాడు. అలాగే ఫైటర్ రాజా పేరిట మరో సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఇక డైరెక్టర్లుగా మెగాఫోన్ పడుతున్నవారూ క్రమక్రమంగా పెరుగుతున్నారు. వీరిలో సినీ స్టైలిస్ట్, డిజైనర్గా పేరొందిన నీరజ కోన త్వరలో విడుదల కానున్న తెలుసు కదా సినిమాతో దర్శకురాలిగా ఆరంగేట్రం చేస్తున్నారు. గోదావరి వంటి సినిమాలకు పనిచేయడం ద్వారా శేఖర్ కమ్ములకు సన్నిహితుడైన మరో ప్రముఖ డిజైనర్ అరవింద్ జాషువా కూడా పేషన్ పేరుతో ఒక సినిమా తీస్తున్నారు.డిజైనర్గా ఉన్నా కాబట్టే డైరెక్టర్గా మారా.. దాదాపు 12ఏళ్ల పాటు కాస్ట్యూమ్స్ డిజైనర్, స్టైలిస్ట్గా ఉన్నాను. అందువల్లే నేను డైరెక్టర్గా మారగలిగాను. సినిమా రంగంతో సన్నిహితంగా ఉంటూ తొలుత స్క్రిప్ట్ రాయడం మీద పట్టు సాధించి అలా అలా ఒక స్టోరీని రెడీ చేసుకుని ఇప్పుడు సినిమా డైరెక్షన్ చేశాను. ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను. – నీరజ కోన, ఫ్యాషన్ స్టైలిస్ట్, దర్శకురాలుఅదే ప్యాషన్తో.. సినిమా సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ తరహాలో కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. స్క్రిప్ట్ చదవడం దగ్గర నుంచి ప్రతీ అంశంపై నా ఆసక్తిని గమనించి శేఖర్ కమ్ముల బాగా నన్ను ప్రోత్సహించారు. అణువణువునా సృజనాత్మకత నింపే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది రెగ్యులర్ స్టడీస్ లాంటిది కాదు. నిఫ్ట్లో చదువుతున్నప్పుడు నాతో పాటు సహ విద్యార్థుల్లో కూడా గమనించిన ప్యాషన్ను బుక్గా రాశాను. అదే నా సినిమాకి ఇప్పుడు నేపథ్యం. – అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, దర్శకుడు (చదవండి: హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
హెయిర్కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ టెలివిజన్ నటి, దీపికా కాకర్(Dipika Kakar) షోయబ్ ఇబ్రహీంల జంట బాలీవుడ్లో ఎంతో ఫేమస్ తెలిసింది. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తమ విషయాలను షేర్ చేస్తూ..తమ అభిమానులను సంతోషపరుస్తూ ఉంటారు. అలానే ఈసారి తమ హెయిర్ సీక్రెట్కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ..తమ అందమైన కురులు రహస్యం బియ్యపిండి మాస్క్ అని వెల్లడించారు. దీన్ని తమ రెండేళ్ల కుమారుడి జుట్టుకి కూడా అప్లై చేస్తామని, ఇది శిరోజాలకు ఎంతో మంచిదంటూ చెప్పుకొచ్చారు అంతేగాదు ఇందులో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారో కూడా వివరించాడు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం. అసలేంటి ఈ ప్యాక్..?, ఇది నిజంగానే హెయిర్కి మంచిదా అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. బియ్యపిండి మాస్క్(Rice Flour mask)లో బియ్య పిండి, అవిసె గింజెలు, కొబ్బరి నూనెల మిశ్రమమే ఈ బియ్యపిండి మాస్క్. ఇది కురులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు దీపికా కకార్ దంపతులు. మరి ఇది హెయిర్కి మంచిదేనా..?, అంత చిన్నపిల్లలకు అప్లై చేయొచ్చా? అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ నిపుణులు ఇందులో ఉపయోగించే బియ్యపిండి, అవిసె గింజలు, కొబ్బరి నూనె వంటి వన్నీ సహజ పదార్థాలని, వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. అయితే పెద్దలకు మంచివైనవి ఎప్పుడూ చిన్నారులకు మంచివి కావనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితం..అందులోనూ వారి బుర్ర ఇంకా గట్టిపడదు..కాబట్టి అక్కడ చర్మం మరింత మృదువుగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి వంటింటి చిట్కాలను అనుసరించే మందు కాస్త కేర్ఫుల్గా ఉండాలన్నారు. జుట్టుకి మంచిదేనా అంటే..బియ్యపిండి జుట్టుని సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేసి అదనపు నూనెలను తొలగిస్తుందట. అలాగే ఇక్కడ అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కురుల ఆకృతిని మెరుగుపరుస్తాయిట. ఇక కొబ్బరి నూనె జుట్టుని తేమగా ఉండేలా చేస్తుందట. కానీ శిశువు చర్మానికి ఇవి అస్సలు పనికిరావనిచెబుతున్నారు. అంతేగాదు బియ్యపిండిలో ఉండే అమైనో ఆమ్లాలు, స్టార్చ్ జుట్టుని బలోపేతం చేసి మెరిసేలా చేస్తాయట. అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెండ్లు జుట్టుని ఉండలు కట్టకుండా చేస్తుందట. తలపై మంటను తగ్గించి, పెరుగుదలను ప్రేరేపింస్తుందట. పర్యావరణ హానికరమైన ప్రభావాన్ని నుంచి రక్షిస్తుందట. నిజానికి ఈ పదార్థాలన్నీ జుట్టు వేగవంతంగా పెరిగేలా చేయకపోయినా..ఆరోగ్యంగా..మెరుగ్గా ఉండేలా చేస్తాయట. తత్ఫలితంగా జుట్టు పెరుగుదల సులభతరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే సహజసిద్ధమైనవన్ని సురక్షితం కాదనే విషయం గమనించాలని అంటున్నారు నిపుణులు. అవన్ని ఇంట్లో పరిశుభ్రమైన పద్ధతిలో తయారైనవే అని నిర్థారించుకోవాలని చెబుతున్నారు. అలాగే శిశువులకు ఉపయోగించాలనుకుంటే మందుగా డెర్మటాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..) -
మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
వ్యవసాయం చేయడం అంటే మాటలుకాదు. చెమటలు చిందించాలి. ఆను పాను తెలియాలి. ఏ పంటకు ఎలాంటి చీడపీడలు వస్తాయి, వాటికి పరిష్కారం ఏమిటి అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. కష్టాలు కన్నీళ్లు ఎన్ని వచ్చినా ఓపిగ్గా ఉంటూ కృషిని నమ్ముకోవాలి. వీటన్నింటికి తోడు మట్టిని ప్రేమించాలి. అపుడు మాత్రమే ఊహించని ఫలితాలు సాధ్యం. అలా కర్ణాటకకు చెందిన ఒక రైతు అద్భుతాలు సాదించాడు. ఏడాదికి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని కళ్ళ చూస్తున్నాడు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.కర్ణాటకకు చెందిన ఉమేశ్ రావు మునగ సాగుతో భారీ లాభాలు సాధించిన తనలాంటి ఔత్సాహిక రైతులకు ప్రేరణగా నిలిచాడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఉమేశ్ కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో పూర్వీకుల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది ఎకరాలకు పైగా చెరకు, మొక్కజొన్న, రాగులు, కూరగాయలు, ఇతర పంటలను పండించాడు. కానీఆశించిన ఫలితాలు పెద్దగా లభించ లేదు. ఇంతలో మొరింగ సాగు గురించి తెలుసుకున్నాడు.2010లో మొరింగ ఒలిఫెరా మొక్క విత్తనాలను నాటాడు ఉమేష్. దాదాపు 900 మొక్కలతో తన జర్నీని మొదలు పెట్టాడు. మొదట్లో మునక్కాయలను క్రమంగా మునగాకు పౌడర్ను విక్రయించడం మొదలు పెట్టాడు. పదేళ్ల పాటు ఆర్థికంగా కుదుట పడ్డాడు. 2020లో కోవిడ్ మహమ్మారి రావడంతో మునగ పొడి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ డిమాండ్ కనుగుణంగా ఇతర పంటలను నిలిపివేసి సేంద్రీయ పద్ధతుల్లో మునగ సాగు చేశాడు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!ఇది ఇలా ఉండగా భూవిషయంలో కుటుంబ వివాదం నేపథ్యంలో తన సాగును వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూర్లో బంజరు భూమిని పదేళ్లకు లీజుకు మోరింగ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇట్లా చిన్నమొత్తంలో కేవలం రెండు ఎకరాల్లో ఒకవైపును సాగును కంటిన్యూ చేస్తూ భూమిని సారవంతం చేసుకున్నాడు. కోడి ఎరువు, మేక ఎరువు , ఆవు పేడ ఎరువును కలిపి నేలను సారవంతంగా తయారు చేసాడు. ఇది నేల సారాన్ని, నీటిని నిలుపుకోవడాన్ని పెంచుతుంది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను వేరు చేయడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడింది. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి ఫలితాలు లభించాయి. మార్కెట్ను స్టడీ చేసి మెరుగైన (ఓడీసీ-3 వెరైటీ) చెందిన మొక్కలను నాటాడు. ఇవి అనుకున్నట్టుగానే 3-4 నెలల్లోనే కాపుకు వచ్చి , ఆరు నెలల్లో మంచి దిగుబడి వచ్చింది.ప్రస్తుతం ఉమేష్ ఎకరానికి 10 టన్నుల తాజా మునగ ఆకులను సేకరిస్తాడు. ఆకులను షేడ్ నెట్ల కింద సహజంగా ఎండబెట్టి, దాదాపు 2.5 నుండి 3 టన్నుల దాకా, కిలోకు సగటున రూ.140 చొప్పున విక్రయిస్తాడు. ఎక్స్ట్రాక్టర్లు, ఫార్మా కంపెనీలు, న్యూట్రాస్యూటికల్ కంపెనీలు ,ఎరువుల కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తాయి. దీని ఫలితంగా ఎకరానికి రూ.4 లక్షల టర్నోవర్ వస్తుందని ఉమేష్ చెప్పారు. ఇదీ చదవండి: 45 కిలోలకు పైగా వెయిట్లాస్..బెల్లీ ఫ్యాట్ దెబ్బకి కరిగింది!ఏడాదికి రూ. 40 లక్షలుఅలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు. -
44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్లాస్ పాఠాలు..
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.ఫిట్నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు. దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు. అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు. మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి. View this post on Instagram A post shared by Yash Vardhan Swami (@trainedbyyvs) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
అన్నా చెల్లెలు టీచర్లు..ఒకే పాఠశాలలో విధులు..
ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అన్నా చెల్లెలు చివరకు ఒకే పాఠశాలలో పోస్టింగ్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలోని ఆత్మకూరుకు చెందిన బాలస్వామి (హెచ్ఎం), నాగమణి దంపతుల కుమారుడు, శ్యామూల్ రాజు, కుమార్తె సారాపింకి కొత్తగా ఉపాధ్యా య ఉద్యోగాలు పొందారు. ఒకేసారి ఉద్యోగా లు పొందడమే కాకుండా ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరడం విశేషం. మండలంలోని హు సేనాపురం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మంగళవారం విధుల్లో చేరారు. వీరి సోదరి మౌనిక కూడా అమలాపురంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు శ్యామ్యూల్ రాజు, సారాపింకి తెలిపారు. ఒకే పాఠశాలలో ఇద్దరం విధుల్లో చేరడం ఆనందంగా ఉందని, విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు.(చదవండి: ఆ కారణంతోనే ఐశ్వర్యని వెనక్కినెట్టి.. సుస్మితా మిస్ ఇండియాగా గెలుపొందింది..!) -
ఆ కారణంతోనే సుస్మితా మిస్ ఇండియాగా గెలుపొందింది..!
అందాల పోటీకి సంబంధించి భారత్కి.. 1994 అతి ప్రాధాన్యత సంతరించుకున్న ఏడాది. ఎందుకంటే ఆ ఏడాదే ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలు రెండూ దక్కాయి. 28 ఏళ్ల తర్వాత రీటా ఫారియా తదనంతరం ఇద్దరు సుందరీమణులు ఈ ఘనతను దక్కించుకున్నారు. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ ఆ ఘన కీర్తిని భారత్కు అందించారు. దేశమే గర్వించేలా చేశారు. అయితే వీళ్లిద్దరూ మిస్ ఇండియా ఫైనల్లో తలపడ్డాడరు. కానీ కిరీటం సుస్మితా సేన్నే వరించింది. నిజానికి ఐశ్వర్యనే గెలుస్తుందనేది అందరి నమ్మకం. ఇలా ఎందుకు జరిగిందో నాడు పోటీల్లో పాల్గొన్న సహ పోటీదారురాలు రూబీ భాటియా ఆ విషయాన్ని వివరించింది. ఆఖరికి సుస్మితా సైతం గెలుపొందుతానని అనుకోలేదంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మిస్ యూనివర్స్గా సుస్మితాకు కిరీటం ఎందుకు దక్కిందో కూడా వివరించారామె.1994 మిస్ ఇండియాలో పోటీల్లో రూబీ భాటియా కూడా పాల్గొన్నారు. అయితే సుస్మితా సేన్(Sushmita Sen ) మిస్ ఇండియా(Miss India) కిరీటాన్ని(crown) గెలుచుకుందని, ఐశ్వర్య రన్నరప్గా నిలిచారంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. నిజానికి జ్యూరీ ప్యానెల్ ఆ సమయంలో మోడలింగ్లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఐశ్వర్య రాయ్(Aishwarya Rai)ను కాదని సుస్మితాను ఎందుకు ఎంచుకుందో వివిరించింది. నాడు పోటీల్లో ర్యాంప్పై నడుస్తుండగా ఐశ్వర్య జారిపడింది..అందువల్ల సుస్మితాను మిస్ ఇండియా కిరీటం వరించిందేమో అనుకున్నా కానీ..అది నిజం కాదని అందుకు ప్రత్యేక కారణం ఉందంటూ అసలు విషయం చెప్పారామె. నాటి మిస్ ఇండియా పోటీల్లో న్యాయనిర్ణేతల్లో ఒకరైనా ఫెమినా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ వవిమ్లా పాటిల్ని దీని గురించి అడిగానని, ఐశ్వర్య ర్యాంప్పై స్లిప్ అవ్వడం వల్ల కిరీటం చేజారిపోలేదని తేల్చి చెప్పారంటూ నాటి సంగతి వివరించింది. మిస్ యూనివర్స్కి పోటీపడటానికి నిర్ధిష్ట లక్షణాలు గల పోటీదారుడి కోసం వెతుకుతున్నామని..ఆ నేపథ్యంలోనే సుస్మితాను విజేతగా ప్రకటించినట్లు ఆమె చెప్పారని రూబీ చెప్పుకొచ్చింది. అంతేగాదు మిస్ యూనివర్స్గా సుస్మితా, మిస్ వరల్డ్గా ఐశ్వర్య ఎందుకు సరిపోతారో కూడా ఆమె వివరించినట్లు తెలిపింది. మరి వారే ఎందుకంటే..మిస్ యూనివర్స్ తెలివైన, అందం కలిగిన మహిళ కోసం అని, అందుకు సుస్మితా సేన్ సరిపోతుందని ఆమె చెప్పినట్లు రూబీ పేర్కొంది. మిస్ వరల్డ్ అంటే మరింత కలలు కనే అందమైన దివా మహిళ అని అందుకు ఐశ్వర్య తగినదని అందుకే ఆ ఇద్దరు చెరొక అంతర్జాతీయ టైటిళ్లను కైవసం చేసుకున్నారని రూబీ చెప్పుకొచ్చింది. అలాగే సుస్మితా కూడా ఓ ఇంటర్వ్యూలో మిస్ ఇండియా పోటీలో ఐశ్వర్య కూడా పోటీపడనుందని తెలిసి..నాకు కిరీటం వచ్చే ఛాన్సే లేదనే అనుకున్ననని స్వయంగా వెల్లడించింది కూడా. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేటప్పుడూ అన్ని అనుమానాలు, భయాలతో పాల్గొన్న సుస్మిత..చివరికి ఊహించని విధంగా కిరీటం గెలుకుని మిస్ యూనివర్స్ టైటిల్ని అందుకుంది, ఐశ్వర్య మిస్ వరల్డ్గా గెలుపొదింది. చివరికి ఇద్దరూ..చరిత్రలో తమ పేర్లను లిఖించుకున్నారు. (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
Diwali 2025: దీపావళికి అలరించనున్న గిఫ్ట్ ఫ్యాక్స్
దీపావళి పండుగకు నగరం ముస్తాబవుతోంది.. ముఖ్యంగా ఈ పండుగలో స్వీట్స్దే అగ్రభాగం.. ఈ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పలుకరించుకుని స్వీట్స్, లేదా డ్రైఫ్రూట్స్ వంటి గిఫ్ట్ బాక్సులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ సారి దీపావళికి అందమైన ర్యాపింగ్తో ఆకట్టుకునే గిఫ్ట్ ప్యాక్స్ హడావుడి మొదలైంది.. మార్కెట్లో వివిధ రకాల స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో ఈ గిఫ్ట్ ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రంగు రంగుల ర్యాపింగ్, రకరకాల మోడళ్లలో గిఫ్ట్ ప్యాకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహికులతో నగరంలోని బేగంబజార్ సందడిగా కనిపిస్తోంది. సంప్రదాయ వెరైటీ డిజైన్లలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, స్వీట్ బాక్సులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇవి వివిధ రకాల ఆకారాల్లో, వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇమిడిపోయిన సంప్రదాయం.. దీపావళికి గిఫ్ట్ బాక్సులు ఇచ్చే సంస్కృతిని మార్వాడీలు, గుజరాతీలు ఎక్కువగా పాటిస్తారు. ఇదే పద్ధతి ప్రస్తుతం నగరంలోని ప్రజల్లోనూ క్రమంగా ఇమిడిపోయింది. దీంతో పండుగ పూట ఇంటికి వచ్చే అతిథులకు, లేదా ఇరుగు పొరుగు వారికి, మరీ ముఖ్యంగా సన్నిహితులకు ఈ గిఫ్ట్ బాక్సులు అందజేస్తుంటారు. కొనుగోళ్లు షురూ.. ఇప్పటికే బేగంబజార్లో కొనుగోళ్లు షురూ అయ్యాయి. డ్రై ఫ్రూట్ మార్కెట్ కిటకిటలాడుతోంది. స్వీట్షాపుల నిర్వాహకులు, సాధారణ ప్రజలు కొనుగోళ్లకు వస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఉద్యోగులు, వ్యాపారుల్లో ఈ గిఫ్ట్స్ ఇచ్చే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో గిఫ్ట్ బాక్సుల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడింది. – రాజ్కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని బాక్స్ల ధరలు ఇలా.. సాధారణంగా ఈ గిఫ్ట్ బాక్స్ల ధరలు రూ.250 నుంచి రూ.2 వేల వరకూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన బాక్స్ల్లో బాదం, కాజు, కిస్మిస్, పిస్తా, ఆప్రికాట్తో పాటు అంజీర వంటి డ్రై ఫ్రూట్స్ పెడుతుంటారు. వీటితో పాటు కొందరు వివిధ రకాల స్వీట్లు కూడా ప్యాక్ చేస్తుంటారు. ఈ బాక్స్ల్లో డ్రైఫ్రూట్స్ 750 గ్రాములు, 500 గ్రాములు, 250 గ్రాములు ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. -
పెయింట్ విత్ పప్పీస్..!
ప్రాణుల పట్ల భాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రతి అడుగూ విలువైనదే. ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతు సంరక్షణ, దత్తత, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో హైదరాబాద్ నగర వేదికగా నిర్వహించిన ‘పెయింట్ విత్ పప్పీస్’ అనే వినూత్న కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రముఖ గ్లోబల్ కంపెనీ ‘మార్స్’ ఆధ్వర్యంలోని మార్స్ గ్లోబల్ అడాప్షన్ వీక్–2025లో భాగంగా ఈ వర్క్షాప్ నిర్వహించింది. ఆర్ట్, ఆనందం, ఆదరణ కలగలిపిన ఈ మార్స్ వెల్నెస్ డ్రైవ్ మూగజీవాల పట్ల కళాత్మక ఆత్మీయతను ప్రదర్శించింది. పాజిటివ్ వైబ్స్తో ఆర్ట్ థెరపీ..ఈ ప్రత్యేక కార్యక్రమం ‘పావాసన’ అనే జంతు సంక్షేమ సంస్థతో కలిసి మార్స్ కార్యాలయంలో నిర్వహించింది. 100 మందికి పైగా అసోసియేట్లు ఇందులో పాల్గొని, చిన్న చిన్న పప్పీలతో కలిసి చిత్రలేఖనం చేస్తూ మానసిక విశ్రాంతి, ఆనందం, కరుణను ఒకే వేదికపై ప్రదర్శించారు. ఈ అడాప్షన్ వీకెండ్ హైదరాబాద్తో పాటుగా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో జరిగింది. 14 ఎన్జీఓలు, వందలాది వాలంటీర్లు, వేల మంది సందర్శకులు దీనిలో భాగమయ్యారు. హైదరాబాద్లో బ్లూ క్రాస్, ఎన్ఎస్ఏఏఎస్ మేడ్చల్ సహకారంతో అడాప్షన్, వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. నిరాశ్రయ జంతువులు ‘ఫరెవర్ హోమ్స్’ సహాకారాన్ని పొందాయి. అంతేకాకుండా మార్స్ సంస్థ తన ‘టూ లీవ్స్ చేంజ్డ్’ అనే అంతర్జాతీయ సంస్థ చొరవతో భారత్తో పాటు అమెరికా, యుకే, థాయ్లాండ్, మెక్సికో వంటి 25 దేశాల్లో ఈ మానవతా కార్యక్రమాన్ని విస్తరించింది. ఒక పెంపుడు జంతువును దత్తత తీసుకోవడం అంటే ఆ ప్రాణికి మాత్రమే కాకుండా మన జీవితంలో మార్పుకు ఆహా్వనం పలకడమేనని మార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి తెలిపారు. కేవలం అవగాహన కలి్పంచడమే కాకుండా మూగజీవాల పట్ల దయ, సంరక్షణకు మార్గం చూపే ప్రయత్నమని పేర్కొన్నారు. కామ్ సంస్థ భాగస్వామ్యంతో చేసిన అధ్యయనంలో జంతువుల వల్ల యజమానుల్లో 88 శాతం మంది ఆందోళన, ఒత్తిడి తగ్గుతుందని వెల్లడైందని, 76 శాతం మంది మానసిక సాంత్వనను పొందుతున్నట్లు తేలిందన్నారు. ఇది సృజనాత్మకత, సేవల కలయిక అని పావాసన సహ వ్యవస్థాపకురాలు అన్నన్య అభివరి్ణంచారు. -
ఇండోనేషియా భామతో తమిళ యువకుడి పెళ్లి
అన్నానగర్: తమిళనాడలోని తిరువారూర్ జిల్లాలోని ముత్తు పెట్టి సమీపంలోని కరయంగడు గ్రామానికి చెందిన సోమసుందరం. ఇతని భార్య వాసుకి, వీరి కుమారుడు యోగాదాస్ (30), ఇతను గత పదేళ్లుగా సింగపూర్లోని ఒక ప్రైవేట్ కంపె నీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇండోనేషియాలోని అమానుషన్ బరాతకు చెందిన డేని యల్ టీపు-మాతా నియోసన్ థామ్పటి కుమార్తె డయానా టీపు(26) ఒకే కంపెనీలో పనిచేస్తోంది. ఈమె యోగాదాను గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని ఈ జంట. నిర్ణయించుకున్నారు. తమిళనాడు ఆలయంలో వివాహ వేడుకను నిర్వహించాలని యోగాదాస్ నిర్ణయించుకుని, వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి, బంధువులు, స్నేహితులు, గ్రామ స్తులందరికీ పంచిపెట్టారు. అనుకున్న ప్రకారం ఆదివారం అక్కడి కరై ముత్తు మారియమ్మన్ ఆలయంలో చాలా సరళంగా వివాహం జరిగింది. పట్టు చీర ధరించిన తమిళ మహిళలా కనిపించే డయానా టీషునకు యోగాదాస్ తాళి కట్టాడు. ఈ వేడుకలో బంధువులు, గ్రామ స్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..! -
గ్రామాల్లో ‘బిగ్’బజార్!
సామాన్య, పేద, మద్యతరగతి ప్రజలకు వారసంతలు బిగ్ మార్ట్లయ్యాయి. మరోవిధంగా చెప్పాలంటే.. ఉన్న ఊరులోకే నడిచే వచ్చే మొబైల్ మార్ట్లుగా మారాయి. ఇక్కడ నిత్యావసరాలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మసాలా, కూరగాయల విత్తనాలు, టమాట, వంకాయ, ఉల్లినారు, నువ్వులు, పెసలు, బబ్బెర్లు, అలసందలు, పసుపు, కొన్నిరకాల డిష్వాష్, డిటర్జెంట్ పౌడర్లు, సబ్బులు, చింతపండు, కారప్పొడి, ఎండు మిరపకాయలు, టీ పైడర్ ఇలా ఒక్కటేమిటీ.. అన్నిరకాల దుస్తులూ చవకగా లభిస్తున్నాయి. గతంలో మండల కేంద్రాల్లోనే జరిగే వారసంతలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు నాలుగు వరకు అనుబంధ గ్రామాలు ఉంటున్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతలో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని, వరంగల్, జమ్మికుంట, పరకాల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర దూర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరూరా మొబైల్ మార్ట్లు.. సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు మొబైల్ మార్ట్లుగా రూపాంతరం చెందిన వారసంతలు.. ఇప్పుడు ఒక్కోగ్రామంలో ఒక్కోవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అటు వినియోగదారులకు, ఇటు చిరువ్యాపారులకు ఇవిఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యాపారులకు ఉపాధి, వినియోగదారులకు బడ్జెట్ ధరల్లోనే అవసరమైన సరుకులు లభ్య మవుతున్నాయి. పంచాయతీలకూ ఆదాయం ఆయా గ్రామాల్లో నిర్వహించే వారసంత(మొబైల్ మార్ట్)ల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఒక్కో దుకాణ నిర్వాహకుడి(చిరు వ్యాపారి) నుంచి కనీసం రూ.20 నుంచి రూ.100 వరకు రుసుం వసూలు చేస్తున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది. చాలామందికి ఉసాధి వారసంతలో వ్యాపారుల నుంచి నిర్వహణ రుసుం(చిట్టి) వసూలు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పలువురు వ్యాపారులు.. ఏడాదిపాటు అనుమతి కోసం రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు బహిరంగ వేలం ద్వారా అనుమతి పొందుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 600 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.(చదవండి: దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!) -
ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..
కొన్ని దేశాల్లో ఉండే ఆచారాలు ఎంతలా వింతగా ఉంటాయంటే..వినడానికి నమ్మశక్యం కానంతగా ఉంటాయి. ఇవేమి పద్ధతులు..ఎందుకిలా అని ఆరా తీసినా..వాటి వివరణ సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. అచ్చం అలాంటి విచిత్రమైన సంస్కృతే ఇండోనేషియాలోని ఓ తెగ ఆచరిస్తుంది. ఆ కారణంగానే వార్తల్లో నిలిచింది కూడా. అంతేకాదండోయ్ దాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం ఎగబడుతున్నారు. పైగా అలాంటి థ్రిల్ కావలంటూ.. మరి వస్తున్నారట టూరిస్టులు. మరి ఇంతకీ అంతలా ఆశ్చర్యపరిచే ఆ ఆచారం కథాకమామీషు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.కుటుంబంలో ఎవ్వరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు..ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు వారి వర్గాల నేపథ్యం అనుసరించి పదకొండు అంతకు మించిన రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది అత్యంత సర్వసాధారణం. కానీ ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్లోనే తానా తోరాజా అనే గిరిజన తెగ మాత్రం అలాచేయరు. చనిపోయిన వారిని మమ్మీలుగా మార్చి వాటితో జీవిస్తారట. అంత్యక్రియలకు కావల్సినంత సొమ్ము సమకూరాక గానీ నిర్వహించరట. పైగా ఆ వారి పూర్వీకుల శవాలను ఎంతో భద్రంగా చూసుకుంటారట. కొత్తబట్టలు తొడిగి, ఆహారాలను కూడా నివేదిస్తారట. వారి కుటుంబంలోకి కొత్తగా వచ్చిన తరాలకు వీటని చూపించి..ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ మమ్మీలను బయటకు తీసి..కొత్త బట్టలు వేయడం, ఆహారం నివేదించడం వంటివి చేస్తారట. ఎందుకిలా అంటే..అక్కడ అంత్యక్రియల తంతు చాలా ఖర్చుతో కూడుకున్నదట. అందువల్ల వారికి వాటిని ఖననం చేయడాని సంత్సరాల తరబడి సమయం పడుతుందట. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఒక ట్రావెలర్ దీని గురించి ఆరా తీయగా.. అందుకు ఏకంగా రూ.4 కోట్లు పైనే ఖర్చు అవుతుందని చెప్పారట ఆ తెగ ప్రజలు. వాళ్లకి అంత్యక్రియలనేవి వేడుకలాంటివట. ఈ తంతు ఐదురోజుల జరుగుతుందట. పైగా ఆ కుటుంట సభ్యుల సంఖ్యను అనుసరించి అంతే సంఖ్యలో గెదెలను, పందులను బలి ఇవ్వాలి. అలాగే వందలాది మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి. దీంతోపాటు చనిపోయిన వారికి ఒక కొత్త స్థలంలో గుడిసెను నిర్మించి అందులో దహన సంస్కారాలు నిర్వహిస్తారట. అందువల్ల అంత డబ్బు సమకూరేంత వరకు వాటిని మమ్మీలుగా మార్చి జాగ్రత్తగా సంరక్షిస్తారట ఆ తెగ ప్రజలు. అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులంతా ఆ శవాలతోనే జీవిస్తారు. చెప్పాలంటే..వాళ్లు తమతో ఉన్నట్లుగానే వాళ్లు వ్యవహరిస్తారట. కాగా, ఇటీవల ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ ఇండోనేషియా గ్రామాన్ని సందర్శించి..అక్కడ సంస్కృతిని వీడియో రూపంలో నెట్టింట షేర్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆమె తానా తోరాజా ఏజెన్సీ సందర్శించి చనిపోయిన వారి మద్య జీవించడం, వారితో కలిసి ఉండటం వంటి థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందానని పోస్ట్లో వివరించింది. అంతేగాదు ఈ ప్రత్యేకమైన సంస్కృతిని తిలకించేందుకే పర్యాటకులు ఇక్కడకు తండోపతండాలు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sharanya Iyer 🇮🇳 | Travel (@trulynomadly) (చదవండి: ఇటలీలో డీజే ఫెస్టివల్లో మారుమ్రోగిన శివ తాండవస్త్రోతం..!) -
పాప్ కల్చర్ కామికాన్..! దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్
హైదరాబాద్ నగరంలో మరోసారి పాప్ కల్చర్ సందడి మొదలైంది. ప్రముఖ కాస్ప్లేయర్లు, గేమింగ్ సెలబ్రిటీలు, యానిమే, ఫిల్మ్ స్టార్స్ నగరానికి చేరుకోనున్నారు. నగర వేదికగా దేశంలోనే అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ ‘కామికాన్ ఇండియా 2025–26’ సీజన్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగనుంది. కామిక్స్, గేమింగ్, కాస్ప్లే, యానిమే, ఫిల్మ్స్, టీవీ, మెర్చండైజ్ వంటి విభిన్న, వినూత్న కార్యక్రమాలు, ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించే అతిపెద్ద యూత్ లైఫ్స్టైల్ ఫెస్టివల్ కామికాన్ ఇండియా. ప్రస్తుతం హైదరాబాద్ కేవలం ఐటీ సిటీ కాదు, ఇదొక కల్చరల్ క్రియేటివ్ సెంటర్గా అవతరించింది. ముఖ్యంగా ఈ తరం యువత గ్లోబల్ పాప్ కల్చర్ని తమదైన రీతిలో అర్థం చేసుకుంటూ ‘లైఫ్స్టైల్ సెలబ్రేషన్’గా అలవర్చుకుంటోంది. ప్రస్తుతం కామికాన్ కేవలం కామిక్స్ ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది కొత్త తరం జీవనశైలికి ప్రతిబింబం. పాప్ కల్చర్ నుండి లైఫ్స్టైల్ వరకూ.. ఫ్యాషన్, ఆర్ట్, డిజైన్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ తదితర అంశాలతో కలిసిన ఫ్యూజన్కి ఇది కేంద్రబిందువు. యానిమే టీ–షర్టులు, కామిక్ క్యారెక్టర్ కలెక్టబుల్స్, ఆర్ట్ పోస్టర్లు, గేమింగ్ జోన్లు.. ఇవన్నీ ఆధునిక యువతకు ‘లైఫ్స్టైల్ ఎక్స్ప్రెషన్’గా మారిపోయాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ గెస్ట్లు, సెలబ్రిటీలతో ప్రశ్నోత్తర సెషన్లు, లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, యానిమే షోకేస్లు, ఈ–స్పోర్ట్స్ గేమింగ్ అరీనాలు, ఎక్స్క్లూజివ్ మెర్చండైజ్ లాంచ్లు, కంటెంట్ క్రియేటర్ల మీట్–అండ్–గ్రీట్స్ అన్నీ కలిపి ‘బెస్ట్ వీకెండ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కామికాన్ ఇండియా సీఈఓ షెఫాలీ జాన్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ యువతలో సృజనాత్మకత, ఎనర్జీ, గ్లోబల్ కల్చర్పై ఆసక్తి విపరీతంగా ఉంది. అందుకే ఈ నగరమే తమ కొత్త సీజన్ ప్రారంభానికి సరైన వేదికని అభిప్రాయపడ్డారు. సృజనాత్మక హరివిల్లు.. కాస్ప్లే.. కాస్ప్లే ఇప్పుడు కేవలం ఆట కాదు.. ఇది ఒక ఆర్ట్ ఫార్మ్. అభిమానులు తమకు ఇష్టమైన సూపర్ హీరోలు, విలన్స్, యానిమే క్యారెక్టర్ల వేషధారణను రంగరించి, వ్యక్తిత్వాన్ని కొత్త రీతిలో చూపిస్తారు. ఈ కల్చర్ ద్వారా యువతలో ఫ్యాషన్ సెన్స్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గత కొంత కాలంగా హైదరాబాద్లో కాస్ప్లేయర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. గతంలో నగరంలో నిర్వహించిన కామికాన్ హైదరాబాద్ ఫెస్ట్కు 40 వేల మందికి పైగా హాజరై ఈ తరం ఔత్సాహికత్వాన్ని ఘనంగా ప్రదర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్యను మించి ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. డిస్ట్రిక్ట్, మై జొమాటో ఈ సీజన్కు ప్రత్యేక టికెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ కామిక్ కాన్ 2025–26 ఈవెంట్కి సంబంధించిన టికెట్లు డి్రస్టిక్ట్ యాప్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. క్రియేటివ్..కేరాఫ్ హైదరాబాద్..ఈ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని ఆరొమాలే కెఫే, క్రియేటివ్ కమ్యూనిటీ వేదికగా కామికాన్ ఇండియా ఆధ్వర్యంలో కాస్ప్లే వర్క్షాప్ సైతం నిర్వహించారు. పాప్ కల్చర్ అభిమానులకు, క్రియేటివిటీకి, ఫ్యాండమ్కి ఇదొక అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈ వర్క్షాప్లో వివిధ ప్రాంతాల నుంచి వచి్చన 150 మందికి పైగా కాస్ప్లే అభిమానులు పాల్గొని తమ కళాత్మకతను, సృజనాత్మకతను ప్రదర్శించి సందడి చేయనున్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్నవారికి కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రాప్ క్రియేషన్, ఫోమ్ కటింగ్, ప్యాటర్న్ మేకింగ్ వంటి బేసిక్ టెక్నిక్స్ను ప్రాక్టికల్గా నేరి్పంచారు. ముఖ్యంగా ‘రియలిస్టిక్ ఎఫెక్ట్స్’.. బాటిల్ డ్యామేజ్ లుక్ వంటి ఫినిషింగ్ టచ్లు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇచ్చారు. ఫోమ్ను వేడి చేసి ఆకట్టుకునే ఆకారాలు మార్చే పద్ధతిని చూపించారు. ఈ సెషన్ ఇండియన్ చాంపియన్షిప్ ఆఫ్ కాస్ప్లే (ఐసీసీ) రెండు సార్లు గెలిచిన అక్షయ్ చూరీ నడిపించడం విశేషం. ఆయన కాస్ట్యూమ్ తయారీ, ప్రెజెంటేషన్, డీటైలింగ్కి సంబంధించిన చిట్కాలను పంచుకున్నారు. అదనంగా.. వీఎఫ్ ఎక్స్ మేకప్, విగ్ స్టైలింగ్, కాంటాక్ట్ లెన్స్ వినియోగం.. వంటి అంశాలపై ప్రత్యేక సెగ్మెంట్ నిర్వహించే.. దీనిలో సేఫ్టీ, హెల్త్, కంఫర్ట్పై దృష్టి పెట్టారు. నచ్చిన క్యారెక్టర్తో మొదలుపెట్టండి.. హైదరాబాద్ యానిమే క్లబ్, కాస్ప్లే క్లబ్ హెడ్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. కాస్ప్లే మొదలుపెట్టేందుకు ముందే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడే క్యారెక్టర్తో మొదలుపెడితే చాలు. అదే మీకు ఆసక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ వర్క్షాప్లో ఐసీసీ 2024–25 హైదరాబాద్ క్వాలిఫయ్యర్ శుక్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆయన రూపొందించిన వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ క్యారెక్టర్ ‘అండుయిన్ వ్రిన్’ ఆర్మర్ కాస్ట్యూమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం క్లాస్ కాదు, ఒక ఫన్ ఇంటరాక్టివ్ సెషన్. పారి్టసిపెంట్లు స్వయంగా ప్యాటర్న్లు కట్ చేయడం, ఫోమ్ గ్లూ చేయడం నేర్చుకోవడం వావ్ అనిపించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్క్షాప్ ఒక బిగినర్ ఫ్రెండ్లీ సెషన్గా.. నగరంలోని కాస్ప్లే ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసం పెంచి కొత్త ఊపునిచ్చింది. (చదవండి: బన్ మస్కా..! వేడి వేడి ఇరాన్ చాయ్ కాంబినేషన్ అదుర్స్..!) -
బన్ మస్కా..! వేడి వేడి ఇరాన్ చాయ్ కాంబినేషన్ అదుర్స్..!
వర్షాల సీజన్లో వేడెక్కే క్రేజ్ బన్మస్కా. వేడి వేడి ఇరానీ చాయ్తో పాటు ఈ సీజనల్ ఫుడ్కి కూడా మూడొస్తుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో ఫుడ్ లవర్స్, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ ప్రేమికుల నుంచి బన్ మస్కా లేదా మలై బన్ లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. తాజా క్రీమ్తో మేళవించి పొరలుగా ఉండే ఈ మృదువైన బ్రెడ్ను ఇరానీ కేఫ్లు, సంప్రదాయ బేకరీలు అందిస్తాయి. నగరంలో చినుకులు పడే ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది తినే చిరుతిండి ఇది. గత కొన్నేళ్లుగా ఫుడ్ బ్లాగర్ల కారణంగా ఆధునికుల్లోనూ మరింత ప్రజాదరణ పొందింది. నగరం అంతటా అనేక కేఫ్లు నగరానికే ప్రత్యేకించిన ఈ సంప్రదాయ ట్రీట్ను అందిస్తూన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైన రుచికి పేరొందాయి. ఈ వర్షాకాలంలో మంచి మలై బన్ను పొందగల కొన్ని చిరునామాలివి.. పిస్తా హౌస్ వారి మలై బన్లో కుంకుమపువ్వు (జాఫ్రాన్) పరిమళాన్ని కూడా కలిపి అందిస్తోంది. ఇది వీరి జఫ్రానీ చాయ్ కాంబినేషన్తో ఆస్వాదించడం సిటిజనుల అలవాటు. లక్డికాపుల్లోని కేఫ్ నీలోఫర్లో బన్ మస్కా ఉదయం 4 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. బేగం బజార్లో ఉన్న ఈ చట్టు రామ్ యాదవ్ మిల్క్ షాప్ 1944లో స్థాపించారు. ఇప్పుడు ఆ వంశీకుల్లో ఆరో తరం దీనిని నిర్వహిస్తోంది. హైదరాబాదీలకు మలై బన్ను పరిచయం చేసింది వీరే. ఇటీవలి సంవత్సర కాలంలో హసన్ డైరీ అనే కొత్త సంస్థ సిటీ ట్రెడిషనల్ బన్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇది మలై గులాబ్ జామూన్ బన్, హనీ బన్, నుటెల్లా బన్, కోవా బన్ వంటి వెరైటీలను అందిస్తోంది. అబిడ్స్, మాధాపూర్లో శాఖలు నిర్వహిస్తున్న ‘నయన్తారా’ మలై బన్ ప్రియుల్లో బాగా ఫేమస్. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని బాగా షేర్ చేస్తున్నారు. (చదవండి: పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..) -
అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!
కొన్ని సక్సెస్ స్టోరీలు ఎంతలా ప్రేరేపిస్తాయంటే.. జీరో నుంచి మిలియనీర్గా అవతరించడం ఎలా అనేది నేర్పిస్తాయి. తాతల తండ్రులు కాస్త సంపాదించే పెడితే కదా జీవితం బాగుండేది..మంచి చదువులు చదవగలిగేది అనుకుంటారు చాలామంది. అవన్నీ సాధించడం చేతకాని వాడు చెప్పే చెత్తకబుర్లే అవి పలువురు విజేతలు ప్రూవ్ చేశారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ వ్యక్తి. అతడికి ఎలాంటి వ్యాపార సామ్రాజ్య వారసత్వం లేకపోయినా.. కేవలం తనపై ఉన్న అచంచలమైన నమ్మకం, పట్టుదలతో కుభేరులు అవ్వొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.అతడే గుజరాత్కి చెందిన పంకజ్ రామన్భాయ్ పటేల్(Pankaj Ramanbhai Patel). కోటీశ్వరుడి కావాలంటే వారసత్వం, వ్యాపార సామ్రాజ్యం ఉండాల్సిన పనిలేదంటాడు పటేల్. ఆయన సంపదలో గౌతమ్ అదానీ తర్వాత రెండో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కాడు. ఆయన సంపద విలువ అక్షరాల రూ. 84,510 కోట్లు. ఆయన ఓ సాదాసీదా కంపెనీలో జాయిన్ అయ్యి..దాన్ని లాభాల బాట పట్టించి.. నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడమే కాదు దానికే నాయకత్వం వహించే రేంజ్కి వచ్చాడు. ఫార్మసి, లైఫ్సైన్సు అండ్ లాలో డిగ్రీలు చేసిన ఆయన..తరుచు ఏం చేయాలి,..ఏంటి లక్ష్యం అని ఆలోచిస్తుండేవాడు. అలా కాడిలా హెల్త్కేర్ అనే ఒక చిన్న కంపెనీలో చేరాడు. ఆయన ఉద్యోగిగా మొదలైనప్పుడూ ఆ కంపెనీ చాలా సాదాసీదా కంపెనీ. అయితే పంకజ్ పర్యవేక్షణలో శరవేగంగా అభివృద్ధి బాటలో పయనించి..కాడిలా జైడస్ లైఫ్సైన్సెస్గా పరిణామం చెందింది. ఇప్పుడు ఏకంగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది..ఆయన ఎదుగుదలను కూడా అత్యంత నిరాడంబరంగానే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి పబ్లిసిటీలకు చోటివ్వరాయన. కోవిడ్ సమయంలోనే ఆయన పేరు బయటకొచ్చింది. అప్పటి దాక ఏ సరికొత్త టీకాలు లేదా ఔషధాల ఆవిష్కరణకు విదేశాల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండేది. కానీ ఆ కష్ట సమయంలో జైడస్ భారతదేశంలో మొట్టమొదటి DNA-ఆధారిత COVID-19 వ్యాక్సిన్ అయిన జైడస్ జైకోవి-డిని అభివృద్ధి చేసి..అతిపెద్ద శాస్త్రీయ విజయం అందుకుంది. పైగా దీనికి విదేశీ ధ్రువీకరణతో పనిలేదంటూ ఓ సరికొత్త మైలురాయిని సాధించింది. ఇక పంకజ్ వ్యక్తిగతం జీవితం దగ్గరకి వచ్చేటప్పటికీ..ఆయన ప్రీతి పటేల్ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆయన కుమారుడు డాక్టర్ షార్విల్ పటేల్ ఆ కంపెనీలోనే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక కూతురు శివాని కూడా అన్న బాటలో పయనిస్తున్నారు. ఇక 2003లో పంకజ్ పటేల్కు ఉత్తమ ఫార్మా మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు లభించింది. ఈ గుర్తింపుని సైతం ఆయన నిశబ్దంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక పంకజ్ వృద్ధి అనేది మంచితన లేకుండా సాధ్యం కాదని గట్టిగా నమ్ముతారు. ఆ నేపథ్యంలోనే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. అహ్మదాబాద్లో ఉండే ఇల్లు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అత్యంత సాదాసీదా ఉంటుంది . ఆయన ఎప్పుడు చెప్పేది ఒక్కటే..నిలకడగా ఉండటం అలవర్చుకుంటే..ఏదైనా సాధించొచ్చు అని. ఒకటి అనుకుని ఇంకొకటి చేస్తూ..అస్థిర మనసుతో ఉంటే.. ఏం సాధించలేం అని సదా చెబుతుంటారాయన. ఏపనైనా ఎంచుకునేటప్పుడూ..వందశాతం కచ్చితత్వం, స్తిరత్వంతో(నిలకతో) చేయాలి. అప్పుడు ఎలాంటి రంగంలోనైనా మంచి విజయాన్ని అందుకుంటామని నొక్కి చెబుతున్నారు పంకజ్ రామన్భాయ్ పటేల్. (చదవండి: Sherry Singh: భారత్కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..) -
సరదా అకేషన్...మెట్రో స్టేషన్
హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లు ఎంటర్టైన్మెంట్ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. కేవలం ప్రయాణానికే కాదు.. షాపింగ్ నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకూ అన్నింటా ముందుంటోంది. ఆహార కేంద్రాలు, ఫొటో బూత్లు వంటివి ప్రయాణికులకు ఆలంబనగా నిలుస్తున్నాయి. నచ్చిన రుచులను ఆస్వాదిస్తూ.. ఇష్టమైన బ్రాండ్స్ను కొనుగోలు చేస్తూ.. సరదాగా కాసేపు కాలక్షేపం చేయాలనుకునే వారికి వేదికలుగా నిలుస్తున్నాయి. ఫొటోలు దిగుతూ.. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. బ్రాండెడ్ ఉత్పత్తులు దొరికే స్టోర్స్, సంగీత ప్రదర్శనలు.. ఇవన్నీ ఒకే చోట దొరకాలంటే చాలా మందికి బహుశా నగరంలో పేరొందిన మాల్సే గుర్తుకొస్తాయేమో.. కానీ ఆ జాబితాలోకి మేం కూడా వస్తున్నాం అంటున్నాయి మెట్రో స్టేషన్స్. – సాక్షి, సిటీబ్యూరోఅమీర్పేట మెట్రో స్టేషన్ ప్రస్తుతం నగరంలోని రోజువారీ మెట్రో ప్రయాణికులకు పరిచయమైన ఒక ఏరియా స్టాప్ కంటే చాలా ఎక్కువ. దీని సందడికి మెట్రో ఇంటర్చేంజ్ దోహదం చేస్తుండగా మరోవైపు ఈ స్టేషన్ ఒక చిన్న తరహా అధునాతన జీవనశైలి కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ జూడియో వంటి పేరొందిన ఫ్యాషన్ అవుట్లెట్స్, కేఎఫ్సీ, థిక్షేక్ ఫ్యాక్టరీ, సబ్వే వంటి ఆహార పదార్థాలు దొరికే ఫుడ్ కోర్ట్ స్పాట్ను తలపిస్తుంది. దీంతో పాటు గిఫ్ట్ స్టోర్స్, గ్రోసరీ షాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు మాత్రమే కాదు పలువురు తమ కుటుంబాలతో కూడా ఇక్కడ తరచూ ఆగుతుంటాయి. ఇది ప్రయాణం కోసం మాత్రమే కాకపోవచ్చు ఓ సరదా సాయంత్రపు కాలక్షేపం కోసం, త్వరిత షాపింగ్ కోసం కూడా కావచ్చు. ఫొటో బూత్ అదనపు అట్రాక్షన్.. ఈ స్టేషన్లో పెరుగుతున్న ఆకర్షణల జాబితాకు సరికొత్త హంగులు తోడవుతున్నాయి. ఈ ట్రాన్సిట్ జోన్ను ఆకస్మిక జ్ఞాపకాల ప్రదేశంగా మారుస్తోంది రెట్రో–శైలి ఫొటో బూత్. అమీర్పేట మెట్రో స్టేషన్లోని మొదటి అంతస్తులో ఉన్న ఇన్స్టా స్నాప్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన ఫొటోబూత్ ప్రయాణికులను జ్ఞాపకాలను కాపాడుకోడానికి ఆహ్వానిస్తోంది. స్కూల్స్, కాలేజీలకు వెళుతున్నా, పనికి వెళ్తున్నా లేదా తదుపరి రైలు కోసం వేచి ఉన్నా, రోజువారీ రద్దీ నుంచి రిఫ్రెష్ చేసే మరో దారి ఈ బూత్. సిబ్బంది అవసరం లేని ఈ ఫొటో బూత్ పూర్తిగా ఆటోమేటెడ్ పోలరాయిడ్–శైలి ఫొటో స్ట్రిప్లను కేవలం రెండు నిమిషాల్లో అందిస్తుంది. ఇంటర్ఫేస్ స్క్రీన్–గైడెడ్ చాలా సులభం. బటన్ ప్రెస్ చేయడం, ఫొటో స్టైల్ ఎంచుకోవడం, స్కాన్ చేసి చెల్లించడం.. ఆపై నాలుగు సరదా భంగిమలను ఎంజాయ్ చేయడం.. సోలో షాట్ల నుంచి జంట క్లిక్లు లేదా గ్రూప్ స్నాప్ల వరకూ ఈ బూత్ అమీర్పేట మెట్రో స్టేషన్లో సెల్ఫీ ప్రియులకు సందర్శనీయ ప్రదేశంగా మారుతోంది. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?సోషల్ ఇన్స్టా జోన్లుగా.. ఫుడ్ కోర్టులు, షాపింగ్ కియోస్క్లు, గిఫ్ట్ స్టాల్స్, ఫ్యాషన్ అవుట్లెట్స్కు నిలయంగా ఉన్న అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ వేదికగా నిలుస్తోంది. ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్చాట్ వంటి ఇంటరాక్టివ్ స్పాట్స్కు కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా నగరంలోని యువత నిత్యం ఈ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి రావడం, ఇది ఇంటర్ చేంజింగ్ స్పాట్ కావడం.. ప్రయాణీకుల టైంపాస్ కోసం ఏర్పాటు చేసిన వివిధ ఎంటర్టైన్మెంట్ వేదికలు కూడా దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రజల కోసం మెట్రో స్టేషన్లో కలి్పంచే మౌలిక సదుపాయాలలోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈవెంట్స్ సైతం.. సిటీ మెట్రో స్టేషన్స్లో తరచూ సంగీతం, నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిమిత సంఖ్యలో కళాకారులను ఆహ్వా నిస్తూ సంగీత దినోత్సవాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మెట్రో రైలు స్టాపులు ఇప్పుడు విందు, వినోద కేంద్రాలుగా అవతరిస్తున్నాయి.(వేయించుకు తినండి..అదిరిపోయే రుచి!) -
భారత్కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ విజయ కేతనం ఎగురవేసింది. భారత్కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, మొట్టమొదటి తల్లిగా చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె సుమారు 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.తొమ్మిదేళ్ల క్రితం సికందర్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి, ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఈ విజయం హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని అదే తాను ప్రపంచానికి చూపాలనుకున్నా." అంటూ భావోద్వేగంగా చెప్పారామె. అంతేగాదు ప్రతి గృహిణి తన కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ.. తను కన్న ప్రతి కలను నిజం చేసుకోగల సత్తా ఆమెకు ఉందని సగర్వంగా చెప్పింది. పైగా తన విజయం ప్రతి మహిళను ప్రేరేపించి అడ్డంకులను చేధించి తన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుందని పేర్కొంది. కాగా, చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్స్టాలో 2.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by UMB PAGEANTS: MISS AND MRS INDIA (@umbpageants) (చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!
అక్టోబర్, నవంబర్లో భారీగా ముహూర్తాలు ఉండడంతో పెళ్లి సందడి షురూ అయ్యింది. షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, బంగారం షాపులు కొనుగోలు దారులతో సందడి మారుతున్నాయి. రెండు నెలల పాటు పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడం, ఆ తరువాత మూడు నెలల పాటు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది ఈ రెండు నెలల్లోనే వివాహాలు జరిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలో పెళ్లి సందడి మొదలైంది.. దీంతో నగరంలోని ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, హోటళ్లు, కల్యాణ మండపాలకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఈ నెలలో ఇప్పటికే మొదటి వారంలో పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు జరిగాయి. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి నవంబర్ 27 వరకూ వరుస ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్ 12 నుంచే హడావుడి మొదలైంది. దీంతో పాటు అక్టోబర్ 24, 26, 29, 30, 31 తేదీలు, నవంబర్ 7, 8, 15, 22, 26, 27 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తరువాత నవంబర్ 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకూ మూఢాలు ఉన్నట్లు చెప్పారు. అంటే నవంబర్ చివరి నుంచి డిసెంబర్, జనవరి నెలల్లో ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇంచుమించు మూడు నెలల పాటు వివాహాలు జరిపేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది ఈ రెండు నెలల్లోనే తమ ఇళ్లల్లో భాజా భజంత్రీలు మోగించాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! -
చాక్లెట్ ప్రేమికుల కోసం ‘ఉత్సవ టేబుల్’
అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లు.. ‘తియ్యని వేడుక చేసుకుందామా’ అనే పదం ఎంత తియ్యగా అనిపిస్తుందో.. అదేరీతిలో.. సమయం సందర్భం ఏదైనా.. అది మొదలయ్యేది మాత్రం ‘తియ్యని వేడుక’తోనే.. ఇప్పుడీ సోదంతా ఎందుకంటే.. ప్రస్తుతం దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో స్వీట్స్కు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తియ్యటి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఎంచుకుంటారు.. ప్రతీ ఇంటా వెలుగులు చిమ్మే ఈ దీపావళి సీజన్లో మనం చేసుకునేది కేవలం ఉత్సవం కాదు.. ఓ ఆత్మీయ కలయిక. స్నేహాన్ని బలపరుచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం అనే భావనల సమ్మేళనం. దీపావళి నేపథ్యంలో నగరంలో స్వీట్లు, చాక్లెట్ల సందడి గురించి తెలిసిందే. అయితే ఈసారి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా కోకో తోటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ వరకూ సాగిన పంచదార రుచి కథలతో.. శ్రమ, కళ, ఫ్యాషన్ సమ్మిళిత చాక్లెట్ ఉత్సవాన్ని నగరవాసులకు పరిచయం చేస్తోంది మనం చాక్లెట్. ఈ సారి దీపావళి ఎడిషన్–2025లో భాగంగా మనం ‘ఉత్సవ టేబుల్’ అనే వినూత్న ఆలోచన చుట్టూ తన సృజనాత్మకతను విస్తరించింది. పంచుకోడానికి, రుచి చూడడానికి, ఆ అనుభూతిని పొందడానికి ఎన్నో మధుర క్షణాలను చాక్లెట్ రూపంలో అందించింది. పాశ్చాత్య శైలితో కాకుండా, భారతీయ భావనతో రూపొందిన ఈ కలెక్షన్లో ప్రతి డబ్బాలో గోదావరి కథలతో ఒక కొత్త అనుభవాన్ని పంచుతోంది. మనం చాక్లెట్ ఖార్ఖానా భారతదేశంలోని మొదటి చాక్లెట్ బ్రాండ్. ఈ ఖార్ఖానాలో ఆంధ్రప్రదేశ్లోని పశి్చమ గోదావరి జిల్లాలో పండించిన చక్కటి రుచి గల కోకో బీన్స్తో తయారు చేసిన చాక్లెట్తో తయారు చేయబడిన 300 కంటే ఎక్కువ ఉత్పత్తులు నగరంలోని విభిన్న రుచులను ఆస్వాదించే చాక్లెట్ ప్రియులను అలరిస్తున్నాయి. డిజిటల్ ఆర్టిస్ట్ నమ్రతా కుమార్ సృష్టించిన ప్రత్యేక డిజైన్లు ఈ ప్యాకేజింగ్కి కొత్త ఉత్సవ రూపాన్ని ఇస్తున్నాయి. ఆమె చిత్రాలలో కేవలం వేడుక కాదు, సమాజం, భాగస్వామ్యం, ఆనందం అనే విలువలు ప్రతిబింబిస్తున్నాయి. దీపావళి అనేది కేవలం వెలుగుల పండుగ కాదు, మనసులు దగ్గరయ్యే సందర్భం. ఆ భావనను మానం చాక్లెట్ తన ప్రత్యేక రుచులతో మరింత బలపరుస్తోంది. ఇండో–అమెరికన్ రుచులతో తయారు చేస్తున్న ఈ చాక్లెట్స్ ప్రత్యేకమైన వేగన్ స్టైల్లో తయారు చేశారు. ఈ చాక్లెట్స్ ఆరోగ్యకరమైన సమ్మేళనాలతో ఏ వయసు వారైనా ఇష్టంగా తీనగలిగే విధంగా రూపోందించారు. ఈ ఎడిషన్లో డార్క్చాక్లెట్–ఆరెంజ్ క్లస్టర్స్, గుంటూరు మిర్చి–డ్రింకింగ్ చాక్లెట్ మిక్స్, సీ సాల్ట్ స్ప్రింకిల్ థిన్స్, గోదావరి కోకో నిబ్స్ థిన్స్, నట్టీ ప్రాలిన్ బార్క్స్, పిస్తా ఫడ్జ్ ఇన్క్లూజన్ టాబ్లెట్, ఇండియన్ ఆరిజిన్ టాబ్లెట్ నెం.6 వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఉన్నాయి. వేగన్ స్టైల్లో..(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
మనిషి లక్షణాలు
ఒక వ్యక్తి గురించి తెలియటానికి వారి గురించిన పరిచయ పత్రమో, నివేదికో చదివిన దానికన్న, వారిని ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అన్నదాన్ని చాణక్యుడు చక్కగా తెలియ చేశాడు. ఆచారం కులాన్ని తెలియచేస్తుంది అన్నాడు. ‘‘కుల’’మంటే ఈనాడు మనమనుకునేది కాదు. ఒక వృత్తిని అవలంబించే వారి సముదాయం లేక సంఘం. ఆచారమంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు మొదలైనవి. ఇవి ఒక కుటుంబానికి మరొక కుటుంబానికే మారిపోతూ ఉంటాయి. అటువంటిది వృత్తులని బట్టి మారటం సహజమే కదా! ఉదాహరణకి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమయపాలన, క్రమశిక్షణ తప్పులు లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం మొదలైనవి అలవాటవుతాయి.అందుకే ఎవరైనా తాను నిక్కచ్చిగా ఉండి, ఎదుటివారిని కూడా అట్లా ఉండమంటే ‘‘మరీ క్లాసు టీచర్ లాగా వెంట పడుతున్నాడు’’ అనటం వింటూ ఉంటాం. పనిచేసే తీరుని బట్టి కూడా ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవాళ్లని చెప్పవచ్చు. అన్ని వృత్తులు కూడా అంతే! కుల శబ్దానికి శీలమనే అర్థం కూడా చెప్పారు. శీలమైనా వ్యక్తమయ్యేది అలవాట్లలోను, పని చేసే తీరులోనే కదా! మాట తీరు ఆవ్యక్తి ఏ్రపాంతానికి చెందినవాడో తెలియచేస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళే అయినా వాళ్ళు మాట్లాడే తెలుగు స్వస్థలం ఏదో చెప్పకనే చెపుతుంది. ‘‘ఈ పోరగాడు’’ అనగానే ఎక్కడివారో చెప్పనక్కర లేదు. ‘‘ఈ పిలగాడు’’ అని ఎవరంటారో అందరికి తెలుసు. ‘‘ఈ గుంటడు’’ అంటే ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వారని చెప్పనవసరం లేదు. మాటలే కాదు మాటాడే తీరు, అంటే యాస వాళ్లెక్కడి వాళ్ళో పట్టిస్తుంది. అందుకే పండితులైన వాళ్ళు శిష్టవ్యవహారికం రాయటమే కాదు, మాట లో కూడా ప్రాంతీయత తొంగిచూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే యాసలో మాట్లాడటం తప్పో, తక్కువో అని కాదు. సమతని పాటించటం కోసం అంతే! అదే పరాయిభాష అయితే మరీ తేలికగా తెలిసి పోతుంది. ఉత్తరదేశీయుల ఇంగ్లీషుకి, తెలుగువారి ఇంగ్లీషుకి, తమిళుల ఇంగ్లీషుకి, బెంగాలీల ఇంగ్లీషుకి తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. విదేశీయులది సరే సరి. మాట వినగానే ఎక్కడివాళ్ళో వెంటనే తెలిసిపోతుంది. ఇక శరీరం తిన్న ఆహారాన్ని ప్రకటిస్తుంది. ఎటువంటి ఆహారం ఎంత తింటారు అన్నది ఆకారాన్ని చూసి చెప్పవచ్చు. మితాహారుల శరీరం చూడ ముచ్చటగా ఉంటుంది. అన్నీ నోటితో చెప్పనక్కర లేదు. చూడగానే తెలిసిపోతాయి. మన గురించి మంచి అభిప్రాయం ఎదుటి వారికి కలగాలంటే ప్రవర్తనని, భాషని, ఆహారపుటలవాట్లని సరిచేసుకుంటే సరి. ఆచారః కుల మాఖ్యాతిదేశ మాఖ్యాతి భాషణంసంభ్రమః స్నేహ మాఖ్యాతివపురాఖ్యాతి భోజనం’’ నడవడిక కులాన్ని (శీలాన్ని), మాటతీరు ప్రాంతాన్ని, సంభ్రమం (మర్యాదచూపే తీరు) ప్రేమను, శరీరం ఆహారపు అలవాట్లను తెలుపుతాయి.సంభ్రమం అంటే మర్యాద చేయటానికి పడే హడావుడి, కంగారు. ఈ సంభ్రమం ఎంతప్రేమ ఉన్నదో తెలియచేస్తుంది. ఇష్టమైనవాళ్ళు వస్తున్నారంటే కాళ్ళుచేతులు ఆడవు. వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే తాపత్రయంలో ఒకదానికి ఒకటి చెయ్యటం కూడా కద్దు. ఆ విధంగా పొరబడటం అవకతవకగా చెయ్యటం ప్రేమకి చిహ్నమే కాని, చేతకానితనం కాదు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంలో విదురుడు అరటిపండ్లు ఒలిచి ప్రేమగా పెడదామనుకుని, తొక్కలు కృష్ణుడి చేతిలో పెట్టి, పండు బయట పడేశాడుట! కృష్ణుడు ఆప్యాయంగా ఆ తొక్కలని తిన్నాడు ఆ సంభ్రమం వెనక ఉన్న ప్రేమని గుర్తించాడు కనుక. అదే ఇష్టంలేని వాళ్ళు వస్తే ఉన్నచోటు నుండి కదలబుద్ధి అవదు. తప్పనిసరి అయి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసి వస్తే చేయవలసిన మర్యాదలన్నీ ఎక్కువగానే చేసినా మనసుపెట్టి చేసినట్టుగా ఉండదు. యాంత్రికంగా అనిపిస్తుంది.– డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
ఈ ఆదివారం వెరైటీగా టేస్టీ.. టేస్టీ..ఉప్మా సమోసా ట్రై చేయండిలా..!
ఉప్మా సమోసాకావలసినవి: బొంబాయి రవ్వ– ముప్పావు కప్పు, పెరుగు– అర కప్పుమైదాపిండి– ఒక కప్పుఉల్లిపాయ– ఒకటి (చిన్నగా తరగాలి)అల్లం తురుము– కొద్దిగాపచ్చిమిర్చి– 2 (చిన్నగా కట్ చేసుకోవాలి)పచ్చి బఠానీలు– 50 గ్రాములు (నానబెట్టి ఉడబెట్టి పెట్టుకోవాలి), క్యారెట్– ఒకటి (తురుముకోవాలి)క్యాప్సికం– ఒకటి (సన్నగా తరగాలి)ఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాన్లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అనంతరం అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ వేయించాలి. అనంతరం బఠానీలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు ఇలా అన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి. ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని ఉప్మా బాగా మగ్గించి, స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలో మైదాపిండి, తగినంత ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీల్లా చేసుకుని సమోసాలా చుట్టుకుని దానిలో కొద్దికొద్దిగా ఉప్మా మిశ్రమాన్ని నింపుకుని ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించి టమోటో సాస్తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.ఫ్రాన్స్ లాబ్స్టర్ థెర్మిడార్ కావలసినవి: లాబ్ట్సర్ (పీత జాతి) – ఒకటి (రెండు లేదా మూడు రొయ్యలతో కూడా ఇలా చేసుకోవచ్చు, లాబ్స్టర్ను శుభ్రం చేసుకుని, సగం ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇరువైపులా ఉండే కాళ్ల భాగాలను మరో వంటకానికి వినియోగించుకోవచ్చు)ఆలివ్ నూనె– 2 టేబుల్ స్పూన్లుబటర్– 3 టేబుల్ స్పూన్లుఉల్లిపాయ ముక్కలు– అర కప్పువెల్లుల్లి తరుగు– ఒక టీ స్పూన్మైదా– 2 టేబుల్ స్పూన్లుపాలు– ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్– పావు కప్పుఆవాల పేస్ట్– అర టీ స్పూన్ , చికెన్ స్టాక్– పావు కప్పు, పార్మెసాన్ చీజ్– అర కప్పు, ఉప్పు– సరిపడామిరియాల పొడి– కొద్దిగాకొత్తిమీర తురుము– కొద్దిగాతయారీ: ముందుగా ఒక పాన్ లో బటర్ వేసి కరిగించాలి. బటర్ కరిగిన తర్వాత, తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు మైదా వేసి 2 లేదా 3 నిమిషాలు వేయించాలి. నెమ్మదిగా పాలు, చికెన్ స్టాక్ వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత, ఆవాల పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా, కట్ చేసి పెట్టుకున్న లాబ్ట్సర్ ముక్కలు లేదా రొయ్యలు, ఫ్రెష్ క్రీమ్ వేసి, కొన్ని నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పున్ లో బేక్ చేసుకోవాలి. చీజ్ బంగారు రంగులోకి మారి కరిగేవరకు 10–15 నిమిషాలు బేక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.త్రిపుర మాయిదుల్కావలసినవి: అన్నం– 2 కప్పులు, ఉప్పు– సరిపడావెల్లుల్లి రెబ్బలు– 4 (తురుములా చేసుకోవాలి)పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, బియ్యప్పిండి– ఒక టేబుల్ స్పూన్బేకింగ్ సోడా, అల్లం పేస్ట్– కొద్దికొద్దిగాతయారీ: ముందుగా అన్నాన్ని చేత్తో పిసికి బాగా మెత్తగా చేసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పు, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, అల్లం పేస్ట్ ఇలా అన్నీ బాగా కలిపి.. కొద్దికొద్ది మిశ్రమంతో గుండ్రటి బంతుల్లా చుట్టుకోవాలి. వాటిని బొగ్గులపై దోరగా కాల్చి, వేడి వేడిగా ఉన్నప్పుడు టొమాటో సాస్ లేదా నచ్చిన చట్నీలతో తినొచ్చు. (చదవండి: మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..) -
రీసైకిల్ కమ్ డెకరేషన్గా.. బాటిల్ ఆర్ట్..!
మన ఇళ్లలో ఖాళీగా ఉన్న గాజు లేదా ప్లాస్టిక్ బాటిళ్లు చెత్త బుట్టలోకి చేరుతుంటాయి. కాని కొంచెం సృజనాత్మక ఆలోచన, కొంచెం కలర్, పెయింట్ లేదా క్రాఫ్ట్ ఐడియాలతో ఆ బాటిళ్లను అందమైన హోమ్ డెకరేషన్లో షో పీసులుగా మార్చుకోవచ్చు. ఇది రీసైక్లింగ్కి తోడ్పడటమే కాకుండా ఇంటికి ఒక ప్రత్యేకమైన లుక్ను ఇస్తుంది.డెకరేషన్ కోసం ఉపయోగించే మెటీరియల్స్ఆక్రిలిక్ పెయింట్స్, స్ప్రే పెయింట్స్గ్లిట్టర్, బీడ్స్, మిర్రర్ పీసెస్జూట్ రోప్స్టిక్కర్స్, టేప్ఫాబ్రిక్ పీసెస్, లేస్ డిజైన్స్బాటిల్స్ .. క్రియేటివిటీపెయింటెడ్ బాటిల్స్బాటిల్పై స్ప్రే పెయింట్ వాడి ఒకే రంగులో కలర్ చేయాలి.ఆక్రిలిక్ పెయింట్స్తో పూలు, ఆకులు లేదా జామెట్రిక్ డిజైన్స్ వేయాలి.జూట్ రోప్ ర్యాప్జూట్ తాడుతో బాటిల్ మొత్తం చుట్టి, పై భాగంలో షెల్స్ లేదా పూలు అతికిస్తే రస్టిక్ లుక్ వస్తుంది.జనపనార తాడును ఉపయోగించి, అందమైన సన్నని అమ్మాయి, అబ్బాయి బొమ్మలను తయారు చేయవచ్చు.లైట్ బాటిల్ ల్యాంప్స్ఖాళీ బాటిల్లో ఫెయిరీ లైట్స్ పెట్టి నైట్ ల్యాంప్లా వాడుకోవచ్చు.బొమ్మలుగా ఉండే సంగీత పరికరాలను అతికించి, షో పీసులుగా అమర్చవచ్చు. గ్లాస్ పేస్టింగ్ ఆర్ట్బాటిల్కు కలర్ పేపర్, గ్లిటర్, స్టోరీస ... అతికిస్తే రిచ్ లుక్ వస్తుంది. అలంకరణలో ప్రత్యేకంగా ఉంటుంది.పెయింట్తో పాటు పూసలు, అద్దాలు అతికించి మరింత అందంగా మార్చవచ్చు. ఫ్లవర్ వేజ్పెద్ద పెద్ద గాజు బాటిళ్లను పెయింట్ చేసి, అందులో తాజా పువ్వులు లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అలంకరించి లివింగ్ రూమ్, సెంటర్ టేబుల్పై పెడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాటిల్ డెకరేష మనలోని సృజనాత్మకతను చూపించే ఒక అద్భుతమైన మార్గం. చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు, ప్రతి ఒక్కదాన్ని కళాఖండంగా మార్చుకోవచ్చు.ఎన్నార్ -
మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..
చాలామంది తమలో వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందంగా, యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఇప్పుడు కొత్త ‘పోర్టబుల్ హ్యాండ్హెల్డ్ యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్’ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం చర్మ ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఈ డివైజ్ సాయంతో చర్మాన్ని లిఫ్ట్ చేసి, బిగుతుగా ఉంచుకోవచ్చు. చర్మంపై ఉండే సన్నటి ముడతలను ఈ పరికరం సమర్థవంతంగా తగ్గిస్తుంది. చర్మంపై కనిపించే రంధ్రాలు పెద్దవిగా ఉంటే, ఈ పరికరం వాటిని చిన్నవిగా చేయడానికి సహాయపడుతుంది.ఈ డివైజ్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొలాజెన్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా మార్చి, దానిని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ డివైజ్ అయానిక్ మోడ్ ఆప్షన్లతో పనిచేస్తుంది. దీనిలో హై, లో, మీడియం వంటి మైక్రో కరెంట్ పవర్ ఆప్షన్లు ఉంటాయి. దీనితో చర్మ అవసరాలకు తగినట్టుగా కరెంటు స్థాయిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చికిత్స సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ బ్యూటీ డివైస్కి ట్రీట్మెంట్ హెడ్స్ వేరువేరుగా ఉంటాయి. ముక్కు, కళ్లు భాగాలను మసాజ్ చేసుకోవడానికి ఒక హెడ్, ముఖానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరో హెడ్, మొత్తం బాడీని మసాజ్ చేయడానికి ఇంకో హెడ్ ఇలా మూడు వేరువేరు హెడ్స్ లభిస్తాయి. ఈ రకమైన ఫీచర్లు ఉన్న డివైస్తో చర్మ సంరక్షణను సులభతరం చేసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. (చదవండి: Back pain during pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..) -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!
‘‘అమ్మా.. నేను క్లాస్ ఫస్ట్ వచ్చా!’’ ‘‘వావ్... కంగ్రాచ్యులేషన్స్ నాన్నా. నువ్వు తెలివైనవాడివి! ’’ అని మెచ్చుకుంది తల్లి. తల్లి ప్రశంసలతో ఆ బిడ్డ కాసేపు సంతోషపడుతుంది. గర్వపడుతుంది. కానీ వారం తర్వాత కాస్త కష్టమైన టాపిక్ రాగానే, ‘‘నేను తెలివైనవాడినైతే ఇది ఎందుకు రాలేదు?’’ అని ఆలోచనలో పడిపోతుంది. అక్కడినుంచి మెల్లగా మోటివేషన్ పోతుంది. ప్రశంస అంటే కేవలం మాటలు కాదు. అది మెదడులోని న్యూరాన్లకు ఇచ్చే సూచన. ప్రతి మాట మీ బిడ్డ మెదడులో కొత్త కనెక్షన్లు నెలకొల్పుతుంది. అందుకే మెచ్చుకోవడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెచ్చుకున్నా తప్పేనా? పిల్లలు ఏదైనా సాధించగానే ‘‘శభాష్, నువ్వు బెస్ట్, నువ్వు ఇంటెలిజెంట్’’ అని టీచర్లు, పేరెంట్స్ మెచ్చుకుంటారు. ఇలాంటి తప్పు రకమైన ప్రశంసలు పిల్లలను ట్రాప్లో పడేస్తాయి. ఇతరులతో పోల్చే ప్రశంస తాత్కాలికంగా ఉత్సాహాన్నిస్తుంది. కాని, ‘ఇతరులకంటే ముందుండడమే నాకు విలువ’ అనే తప్పు నమ్మకాన్ని ఏర్పరుస్తాయి.చిన్న విషయాలకే పెద్ద ప్రశంసలు ఇస్తే వాటి విలువ తగ్గిపోతుంది.నువ్వు సక్సెస్ అయితేనే ప్రశంసిస్తామనే తీరు చాలా ప్రమాదకరం. దీంతో ఆప్యాయతను పర్ఫార్మెన్స్తో లింక్ చేసుకుంటారు. తరచుగా ప్రశంసలపై ఆధారపడితే పిల్లలు అంతర్గత కుతూహలం కోల్పోతారు. స్వతంత్రంగా ప్రయత్నించడం తగ్గిపోతుంది. ప్రశంసలో నిజాయితీ లేకపోతే పిల్లల నమ్మకం దెబ్బతింటుంది. సైన్స్ ఏమంటుంది?పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడంపై మానసిక శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. మీరిచ్చే ప్రశంసలు వారి మెదడును, మైండ్ సెట్ను షేప్ చేస్తాయని వాటిలో వెల్లడైంది. న్యూరోప్లాస్టిసిటీ: మన మెదడు అనుభవాల ఆధారంగా రీవైర్ చేసుకుంటుంది. ప్రయత్నం, పద్ధతి, పట్టుదలపై ఇచ్చే ప్రశంస డోపమైన్ అనే ‘మోటివేషన్ కెమికల్’ను విడుదల చేస్తుంది.ఎపిజెనెటిక్స్: జీన్స్ మన జీవితాన్ని నిర్ణయించవు. ఏ జీన్స్ ‘ఆన్’ అవ్వాలి, ఏవి ‘ఆఫ్’ అవ్వాలనేది వాతావరణం నిర్ణయిస్తుందని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెప్తున్నాయి. సెల్ఫ్–డిటర్మినేషన్ థియరీ: పిల్లలు సక్సెస్ అవ్వాలంటే అటానమీ, కాంపిటెన్స్, రిలేటెడ్నెస్ అనే మూడు అవసరాలు తీరాలి. సరైన ప్రశంస ఈ మూడింటినీ అందిస్తుంది. ఫ్లో సైకాలజీ: ఫ్లో స్టేట్ అంటే నైపుణ్యాలు, సవాళ్లు సమపాళ్లలో ఉండే స్థితి. సరైన ప్రశంస పిల్లలను ఫ్లో స్టేట్ వైపు నెడుతుంది. అప్పుడే పిల్లల అసలు జీనియస్ వెలుగులోకి వస్తుంది.సరైన ప్రశంసలకు 10 టిప్స్...‘‘నువ్వు స్టెప్ బై స్టెప్గా చేసిన తీరు చాలా నచ్చింది’’ అని ప్రాసెస్ని గుర్తించండి.‘‘నీ ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. సైంటిస్ట్లా ఆలోచిస్తున్నావు’’ అని క్యూరియాసిటీకి విలువనివ్వండి. ‘‘ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వదల్లేదు, అదే నిజమైన శక్తి’’ అని ప్రయత్నాన్ని హైలైట్ చేయండి.‘‘నీ ఆలోచన ప్రత్యేకంగా ఉంది’’ అని ఒరిజినాలిటీని సెలబ్రేట్ చేయండి. ‘‘గతంలో కష్టమనిపించింది ఇప్పుడు బాగా చేశావు. ఇదే నిజమైన అభివృద్ధి’’ అని ఇంప్రూవ్మెంట్పై ఫోకస్ చేయండి.‘‘నీ వ్యాస పరిచయం చాలా స్పష్టంగా ఉంది’’ అని స్పెసిఫిక్గా చెప్పండి.‘‘ఒకే సమస్యకు పలు మార్గాల్లో ప్రయత్నించడం చాలా స్మార్ట్ స్ట్రాటజీ’’ అని ప్రాబ్లమ్ సాల్వింగ్ని ప్రోత్సహించండి.‘‘ఈ ప్రాజెక్ట్లో ఏ భాగం నీకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది?’’ అని రిఫ్లెక్షన్కి దారి చూపండి.‘‘ఈ పనిని ప్రేమగా చేసినప్పుడు ఎంత అందంగా వచ్చిందో గమనించావా?’’ అని ఎఫర్ట్తో పాటు ఎమోషన్ని గుర్తించండి.‘‘ఇది బాగా చేశావు, ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ ప్రయత్నిస్తావా?’’ అని ప్రశంసని చాలెంజ్తో కలిపి ఇవ్వండి. సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!) -
చిన్నారులకు ఆస్తమా..! ఇన్హేలర్స్..నో వర్రీస్..
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు. చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్హేలర్స్ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్హేలర్స్ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్హేలర్స్తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా. అయితే ఈ ఇన్హేలర్స్కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు. (చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..) -
ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యం కోసం..
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. ఊరూ... ఊరి వ్యక్తులతో సంబంధాలే కాదు... నోటి పలువరస బాగుంటే, దంతాలకు సంబంధించిన వ్యాధులేమీ లేకపోతే వ్యక్తి చిరునవ్వు, ఇనుమడించిన ముఖపు అందం, మంచి పలువరస కారణంగా చక్కటి ఉచ్చారణ... ఇలా చాలా అంశాలు బాగుంటాయి. నోరూ లేదా దంతాలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే... అప్పటికప్పుడు ఆ సమస్యకు చికిత్స అందించడమన్నది కాకుండా... ఓ పూర్తి స్థాయి చికిత్సను ‘సమగ్రం’గా అందించడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడే చికిత్స ప్రక్రియే‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’. సంక్షిప్తంగా ‘ఎఫ్ఎమ్ఆర్’ అని పిలిచే ఈ చికిత్స ప్రక్రియ గురించి తెలిపేదే ఈ కథనం. నోటిలోని పళ్లకూ, పలువరసకూ అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ పళ్లు అరిగి΄ోవడం, కొన్ని విరిగి΄ోవడం, కొన్ని చోట్ల సందులు రావడం వంటివి జరుగుతుండటం మామూలే. దీనికి తోడు కొందరిలో చిగుర్ల సమస్యలూ రావచ్చు. మరికొందరిలో ఒకటో రెండూ పళ్లు ఊడి΄ోవచ్చు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ తమకు సంబంధించినంతవరకూ ఏ సమస్యా లేక΄ోతే కొందరు దంతవైద్యుడి వద్దకు వెళ్లరు. చికిత్స తీసుకోరు. కారణం... పని నడుస్తోంది కాబట్టి అలా రోజులు వెళ్లదీయడమే పనిగా పెట్టుకుంటారు. కొన్ని సమస్యలు...అలా నోటిలో పళ్లు అరగడం, విరగడం, దంతాలూ ఊడిపోవడం వల్ల సందులు రావడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మరికొన్ని సమస్యలు రావచ్చు. ఉదాహరణకు... పలువరసలోని కొన్ని పళ్లు ఊడటం వల్ల దంతాల మధ్య సందులు (గ్యాప్) వచ్చి అక్కడ ఆహారం చిక్కుకుపోయి, అది కుళ్లుతుండటం వల్ల దంతక్షయం మరింత వేగంగా జరగడం. అలా పళ్లు ఊడిన చోట ఆహారం చిక్కుకు΄ోయి కుళ్లుతుండటంతో నోటి దుర్వాసన వస్తుండటం. పళ్లు ఊడిన కారణంగా ముఖం ఆకృతి చెడిపోయి మునపటి కంటే అందవిహీనంగా కనిపించడం. పళ్లు ఊడటం లేదా పలువరసలో సందుల కారణంగా మాట్లాడుతున్నప్పుడు పళ్లసందుల నుంచి గాలిపోతూ ఉచ్చారణ సరిగా లేకపోవడం, దాంతో సరైన కమ్యూనికేషన్ జరగక... ఎదుటివారికి మాట సరిగా అర్థం కాకపోవడం. ఊడినపళ్ల కారణంగా చిరునవ్వు నవ్వేందుకు ఇబ్బంది పడుతూ నలుగురిలో మనస్పూర్తిగా నవ్వలేకపోవడం.ఆరోగ్యపరంగానూ మరికొన్ని నష్టాలు... ఊడిన పళ్ల కారణంగా ఆహారాన్ని సరిగా / పూర్తిగా నమలలేకపోవడం. పలువరసలో వచ్చిన గ్యాప్ కారణంగా పళ్లు ఉన్నచోటి నుంచి పక్కకు కదిలిపోతూ ఉండటం. ఊడిన పళ్ల వల్ల వచ్చిన సందుల కారణంగా పలువరస చెడిపోయి కొరికినప్పుడు పైవరస, కింది వరస పళ్లు సరిగా అమరకపోఒవడం (అలైన్మెంట్ సరిగా జరగకపోవడం). (రెండు దవడలూ కలిసినప్పుడు అవి సరిగా అమరకపోవడం).నములుతున్నప్పుడు కింది దవడ కదిలినప్పుడల్లా క్లిక్ క్లిక్ మంటూ శబ్దం (క్లికింగ్ సౌండ్) రావడం.మానసిక సమస్యలకూ దారితీసే ప్రమాదం... ఇలా పలువరసకు వచ్చే సమస్యలతో కేవలం భౌతికంగా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం లుక్స్పరంగా ఇబ్బంది కలగడం మాత్రమే కారణంగా... ఆత్మవిశ్వాసం లోపించడం, చిరునవ్వు నవ్వలేకపోవడంతో కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ సమస్య మానసికమైన రుగ్మతలకూ కారణమయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు. పై ప్రక్రియలన్నింటి సాయంతో కొన్ని కొన్ని సిట్టింగులలో నోటికి అవసరమైన పూర్తిస్థాయి సమగ్రమైన సంయుక్త చికిత్సను ఈ ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’లో అందిస్తారు. దాంతో పేషెంట్లకు దంతపరంగా లేదా నోటి ఆరోగ్యపరంగా అవసరమైన అనేక అవసరాలు ఒకే సమగ్రచికిత్సలో తీరి΄ోవడం సాధ్యమవుతుంది.అన్ని రకాల సమస్యలకూ కలిపి ఒక సమగ్ర చికిత్సే ‘ఎఫ్ఎమ్ఆర్’... దంతాల సమస్యలకు చికిత్సలు విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు పళ్లు అరిగినప్పుడు ఫిల్లింగ్ చేయడం లేదా క్యాప్ వేయడం, అలాగే చిగుర్లకు వచ్చే జింజివైటిస్, పెరియోడాంటైస్ వంటి సమస్యలకూ ఇవ్వాల్సిన చికిత్సలూ ఇలా రకరకాల సమస్యలకు నిర్దిష్టంగా చికిత్సలు ఇస్తుంటారు. అయితే అనేక రకాల సమస్యలు ఒకేసారి కనిపించినప్పుడు అనేక చికిత్సలను కలగలిపి ఒకే సమగ్ర చికిత్సగా ఇవ్వడమూ సాధ్యమవుతుంది. ఇందులో అరిగిన / విరిగిన పళ్లకు పైన దంతాన్ని పునర్నిర్మించడం (క్రౌన్స్), పన్నుకూ పన్నుకూ మధ్య మరో పన్ను పోయినప్పుడు బ్రిడ్జ్ చికిత్సలు, ఆర్థోడాంటిక్స్ (దవడ పళ్లు లేదా దవడల అమరిక సరిగా లేనప్పుడు ఇవ్వాల్సిన చికిత్సలూ), చిగుర్లకు చికిత్సలూ... వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా చికిత్సలను అందించడాన్ని ‘ఫుల్ మౌత్ రీ–హ్యాబిలిటేషన్’ (ఎఫ్ఎమ్ఆర్)గా చెబుతారు.ఎఫ్ఎమ్ఆర్లో ఏం జరుగుతుంది... ఈ సమగ్ర చికిత్స ప్రక్రియలో కంప్యూటర్ సహాయంతో నోటి తాలూకు పూర్తి చిత్రీకరణ... ఉదాహరణకు... కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ (క్యాడ్) అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (క్యామ్) లతో నోటి నిర్మాణాన్ని తొలుత రూపొందించుకుంటారు. అటు తర్వాత నోటిలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకుని, ఏయే రకాల సమస్యలకూ ఏయే చికిత్సలనే ఓ సమగ్ర ప్రణాళికను రచించుకుంటారు. అవసరాన్ని బట్టి ఎలాంటి కృత్రిమమైన ఇంప్లాంట్స్ అమర్చాలో నిర్ణయించుకుంటారు. ఇక అందానికీ, లుక్స్కు సంబంధించిన సమస్య అయితే దానికి తగ్గట్టుగా కాస్మటిక్ చికిత్స కోసం అవసరమైన వినీర్స్ (బాధితుల వ్యక్తిగత అవసరాల కోసం తగిన విధంగా రూపొందించిన పంటిపై అమర్చేందుకు ఆ పంటి రంగే కలిగిన పలుచటి పొరల్లాంటివి) సమకూర్చుకుంటారు. చిగుర్ల సమస్యలు ఉంటే దానికి ఇవ్వాల్సిన మందులను సూచిస్తారు. డాక్టర్ సుధీర్ చౌదరి కరణంఆర్థోడాంటిస్ట్ – ఇంప్లాంట్ స్పెషలిస్ట్ (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
రాక్స్టార్ పుట్టిన రోజు : ఫ్యాన్స్ ‘జల్సా’, మమత స్పెషల్ విషెస్
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోలు ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్పతి షో ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించుకున్న సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ఎన్నో విలక్షణమైన పాత్రలు గంభీరమైన స్వరం, అనన్య సామాన్యమైన నటన, అంతకుమించిన వ్యక్తిత్వం ఆయనను లెజెండ్రీగా నిలబెట్టాయి. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం ముందు ఫ్యాన్స్చేసిన సందడి అంతా ఇంతా కాదు.అమితాబ్ బచ్చన్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. మ ముంబై లోని బిగ్ బీ బంగ్లా 'జల్సా' వెలుపల గుమిగూడారు. అంతేకాదు ఆయన పోషించిన ప్రముఖ పాత్రల వేషధారణలో, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు బిగ్ బీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్డే విషెస్ అందించారు.#WATCH | Mumbai, Maharashtra | Fans of the Veteran Actor Amitabh Bachchan gather outside his bungalow, 'Jalsa', to catch a glimpse of their favourite movie star on the occassion of his birthday. His fans dressed up as famous characters played by the actor, and sang songs and… pic.twitter.com/MfE34Y5RWl— ANI (@ANI) October 10, 2025 బిగ్ బీతో కలిసి నటించిన హీరో ప్రభాస్, కాజోల్, అజయ్ దేవ్గన్, శత్రుఘ్న సిన్హా,సునీల్ శెట్టి అ లాంటి సినీప్రముఖులతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అమితాబ్కు విషెస్ చెప్పడం విశేషం. "లెజెండరీ అమితాబ్ బచ్చన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ఎపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తిని ప్రసాదించాలన్నారు. అలాగే 1984లో తామిద్దరం ఎంపీలు అనే విషయానఇన గుర్తు చేసుకున్నారు. -
గొంగడి గురించి తెలుసా? ఇంతకుముందెప్పుడూ వినని విశేషాలు!
పిల్లలూ! ‘గొంగడి’ గురించి మీకు తెలుసా? మీ ఇంట్లో గొంగడి ఉందా? ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గొంగడి ఉండేది. వ్యవసాయ, పాడి ఆధారిత కుటుంబాల్లో తప్పకుండా కనిపించే వస్తువు ఇది. ప్రస్తుతం పట్టణాల్లో దీని వాడకం తగ్గినా పల్లెల్లో ఇంకా వాడుతున్నారు.ముఖ్యంగా పశువుల కాపర్లు జీవాలను మేతకు తీసుకువెళ్లే సమయంలో గొంగడిని తమ వెంట తీసుకువెళ్తుంటారు. భారతదేశానికి వస్త్ర పరిశ్రమ రంగంలో గొంగడికి కీలకమైన స్థానం ఉంది. గొంగడి అనేది ఉన్నితో తయారు చేసిన దుప్పటి. మరాఠీలో దీన్ని ‘ఘొంగడి’ అంటారు. దీన్ని చేత్తో తయారు చేస్తారు. దీనికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక విలువలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో వివాహ ప్రతిపాదనలు ఏర్పాటు చేసేటప్పుడు గొంగడిని వినియోగించేవారు.ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూర్చోడానికి, విశ్రమించడానికి దీన్ని వాడేవారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణగా నిలిచేందుకు ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షంలో ఈ గొంగడి కప్పుకుంటే గొంగడి తడిసిపోయినా లోపలున్నవారికి ఆ తడి తగలదు. అది గొంగడి విశిష్టత.చదవండి: కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనెమహారాష్ట్రలోని పలు గ్రామాల్లో అతిథులను స్వాగతించడానికి నేటికీ ఈ గొంగడిని ఉపయోగిస్తారు. అతిథుల్ని గొంగడిపై కూర్చోబెట్టడం గౌరవప్రదంగా భావిస్తారు. జూన్–ఆగస్టు నెలల మధ్య గొంగడి తయారీ ప్రారంభమవుతుంది. ఈ నెలల్లో గొర్రెల నుండి ఉన్నిని తీస్తారు. దాన్ని రంగుల ఆధారంగా వేరు చేస్తారు. సాధారణంగా ఉన్ని నలుపు, తెలుపు, గోధుమ రంగులలో ఉంటుంది. ఇందులో తెల్ల రంగు గొంగడి చాలా అరుదుగా కనిపిస్తుంది. 8 అడుగుల గొంగడిని తయారు చేయడానికి 350 గజాల ఉన్ని అవసరం. 10, 12 అడుగుల గొంగడికి 400, 450 గజాల ఉన్ని అవసరం అవుతుంది. చేతి మగ్గంపై ఒక గొంగడిని నేయడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. నేయడం పూర్తయ్యాక దుప్పటికి చింతపండు గింజల రసం పూసి, రెండు నుండి మూడు రోజులు ఎండలో ఉంచుతారు. ఆ తర్వాత గొంగడి వినియోగానికి సిద్ధమైనట్లే.చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! -
వయసు 84 ఏళ్లు..కానీ ఇతడి టాలెంట్ మాములుగా లేదుగా..!
ఒకే మనిషిలో ఒకటికి మించి టాలెంట్లు ఉంటే అబ్బా అనేస్తాం. కానీ విభిన్న రంగాల్లో మనోడు సత్తా మాములుగా లేదు. ప్రతిదాంట్లోనూ తానే ముందున్నాడు. అతడి ఆహార్యం నుంచి కెరీర్ పరంగా టాలెంట్ వరకు..ఎవర్రా అది అని నోరెళ్లబెట్టేలా సత్తా చాటుతున్నాడు ఈ 84 ఏళ్ల హోండా కంపెనీ ఇంజనీర్.వయసుపరంగా వృద్ధుడే అయినా..ఆహార్యం పరంగా యువకులకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతనిది. అతడి విలక్షణమైన టాలెంట్లు గురించి వింటే..మాటల్లేవ్ అంతే అని చెప్పొచ్చు. అతడే జపాన్కి చెందని షోటారో ఓడేట్ అనే 84 ఏళ్ల ఇంజనీర్. ఆధునాత భద్రతా సాంకేతికతకు సంబంధించిన డెవలపర్. అతడి హెయిర్ స్టైల్ కారణంగా వార్తల్లో నిలవడమే కాదు నెట్టింట వైరల్గా మారాడు. విలక్షణమైన హెయిర్ స్టైల్..జపనీస్ సినిమాల్లోని పాత్రల్లోని అనిమే-ప్రేరేపిత హెయిర్ స్టైల్లో అతడి జుట్టు ఉంటుంది. నిజానికి ఆ పాత్రల్లోని హెయిర్స్టైల్ని నిజజీవితంలో అనుకరించడం అతం ఈజీ కాదు. మెయింటైన్ చేయడం కూడా కష్టమే. కానీ ఇతడి హెయిర్మాత్రం అందుకు విరుద్ధం. అత్యంత సహజమైన అనిమే-ప్రేరేపిత హెయిర్ స్టైల్ మాదిరిగా ఉండటం విశేషం. అయితే ఈ జపనీస్ ఆటోమోటివ్ ఇంజనీర్ మాత్రం తాను ఐదేళ్లుగా ఈ హెయిర్ స్టైల్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాడు. తన చిన్నతనం వరకు సాంప్రదాయ పద్ధతి హెయిర్ స్టైల్లోనే ఉన్నాడట. గత కొన్ని ఏళ్లుగా తన ఎడమ కన్నుపై పడుతున్న జుట్టుని స్లైలిష్గా మార్చేప్రయత్నంలో ఈ స్టైల్ని అనుసరించాడట. ఇక తన జుట్టు ఈ స్టైల్లో సులభంగా మారిపోవడానికి ప్రధాన కారణం సరైన నిద్ర అలవాట్లు లేకపోవడమేనట. ఇక అతను 2003లో హోండాలో సీటు బెల్ట్లలో ప్రత్యేకత కలిగిన ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టి..అందుకు సంబంధించిన సురక్షితమైన డ్రైవింగ్ టెక్నాలజీలో దాదాపు 253 పేటెంట్లను పొందారు. అలాగే ఇదే కంపెనీలో ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS వ్యవస్థ వెనుక ఉన్న లీడ్ ఇంజనీర్ విభాగానికి, డ్రైవర్ల కంటి కదలికలను పర్యవేక్షించే స్మార్ట్ కెమెరా టెక్నాలజీనిను అభివృద్ధి చేసే బృందానికి ఈయనే సారథ్యం వహించారు. సేఫ్టీ టెక్నాలజీలు..సింపుల్గాచెప్పాలంటే ఆయన పని ఎల్లప్పుడూ.. "జీవితాన్ని సురక్షితంగా ఉంచడమే" లక్ష్యంగా సాంకేతికతలను అభివృద్ధి చేయడమే. ఆయన కేవలం టెక్నీలజీ డెవలప్పర్గానే కాకుండా హోండాలో ప్రముఖ సభ్యుడిగా కొత్త కార్లను కూడా ప్రమోట్ చేస్తారు కూడా. ఆఖరికి ఫిట్నెస్లో కూడా..చివరిగా ఫిట్నెస్ పరంగా అతనికి వేలకొద్ది అభిమానులు ఉన్నారట. అంతేగాదు 170 కేజీల బెంచ్ప్రెస్ బల శిక్షణా వ్యాయామాన్ని వరుసగా ఐదుసార్లు ప్రదర్శించిన రికార్డు కూడా అతని పేరు మీద ఉందట. ఇలా కెరీర్, ఫ్యాషన్, హెల్త్ పరంగా ఇంతలా ప్రతిభను చాటుకోవడం అంత ఈజీ కాదు కదూ..!.This is 84-year-old Shotaro Odate, Chief Engineer at @Honda recognized for his significant contributions to automotive safety technology, including the development of the Honda SENSING 360+ system. Odate holds over 250 patents and has published nine scientific papers on topics… pic.twitter.com/r3tXDCTJB8— Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) September 22, 2025 (చదవండి: Success Story: ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా..) -
ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా..
కనీసం డిగ్రీ కూడా లేకుండా ఉద్యోగం సంపాదించడం కష్టం. అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే..అస్సలు సాధ్యం కాదు. కానీ ఈ వ్యక్తి ఏ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడో అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని ఈ వ్యక్తి ఎలా ఇంత పెద్ద ఉద్యోగాన్ని సంపాదించగలిగాడో వింటే..నేర్చుకోవడం విలువ కచ్చితంగా తెలుస్తుంది. లింక్డ్ఇన్లో వైరల్గా మారిన ఇతని స్టోరీ నేటి తరాని స్ఫూర్తి. ఎన్ని డిగ్రీలు చేశామన్నాది కాదు స్కిల్ ఎంత ఉంది అన్నది ముఖ్యం అని చెబుతోంది ఇతడి కథ.అతడే అబ్దుల్ అలీమ్. లింక్డ్ ఇన్ పోస్ట్లో తన సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారిన తన సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నారు. 2013లో ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో బయటకొచ్చేశానని, రైలు టికెట్ కోసం రూ. 800లు ఖర్చు చేశానంటూ నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు అబ్దుల్. చిన్నపాటి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఎక్కడకి వెళ్లలేని తన దీనస్థితిని గురించి వివరించాడు. అలా రెండు నెలలు వీధుల్లో గడిపిన అనంతరం..జోహో సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పదోతరగతి వరకే చదివిన అతడికి హెచ్టీఎంఎల్(HTML)పై కొంచెం పట్టు ఉంది. అయితే మరింతగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా..అదెలా అనేది తెలియలేదు అబ్ధుల్కి. సరిగ్గా ఆ సమయంలో జోహోలో సీనియర్ ఉద్యోగి శిబు అలెక్సిస్తో పరిచయం..ఒక్కసారిగా అబ్దుల్ జీవితమే మారిపోయింది. అతడు అబ్దుల్ మాటల్లో ఏదో చేయాలనే తపనను గుర్తించి..మార్గనిర్దేశం చేసేందుకు ముందుకొచ్చాడు. అలా ఎనిమినెలల పాటు పగటిపూట భద్రతా విధులను పూర్తి చేసి, సాయంత్రం ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అబ్దుల్. చివరికి ఒకరోజు వినియోగదారు ఇన్పుట్ను దృశ్యమానం చేసే ఒక సాధారణ యాప్ను రూపొందించాడు. దానిని అలెక్సిస్ జోహూ మేనేజర్కు చూపించాడు. దీంతో మేనేజర్ అబ్దుల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అయితే తనకు డిగ్రీ లేకపోవడంతో కాస్త తడబడుతున్న అబ్దుల్ని చూసి ఆ కంపెనీ మేనేజర్..కాలేజ్ డిగ్రీ అవసరం లేదు, నైపుణ్యం ఉంటే చాలు అంటూ అతడిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా నియమించారు. అలా సెక్యరిటీ గార్డుగా పనిచేసిన ఎనిమిదేళ్ల తర్వాత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా నియమాకం అందుకున్నాడు. ఇలా తన కథను వివరిస్తూ..తనకు గురువులా మార్గనిర్దేశం చేసిన శిబు అలెక్సిస్కు, అలాగే తనని తాను నిరూపించుకునేలా అవకాశం ఇచ్చిన జోహో కంపెనీ మేనేజర్కి ధన్యావాదాలు తెలిపాడు పోస్ట్లో. చివరగా ఆయన "నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా ప్రారంభించొచ్చు..ఆలస్యం అనే పదానికి ఆస్కారం లేదు" అని పోస్ట్ని ముగించారు. కాగా, జోహో అనేది చెన్నైకి చెందిన గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ. 1996లో శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీ సరసమైన సాంకేతికత, డేటా గోప్యత, భారతదేశంలో ఉత్పత్తులను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. యూఎస్ సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అనేకమంది మంత్రులు ఈ దేశీ టెక్కంపెనీని ప్రమోట్చేయడంతో జోహూ కంపెనీ వార్తల్లో నిలిచింది. (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్
ఈ ఇంటర్నెట్ యుగంలో పిల్లల పెంపకం అనేది ప్రతి తల్లిదండ్రులకు అతిపెద్ద సవాలు. మొబైల్, సోషల్మీడియా వంటి వ్యసనాలకు లోనుకాకుండా జాగ్రత్త పడుతూ..ప్రయోజకులుగా తీర్చిదిద్దడం అంత ఈజీ కానప్పటికీ..అసాధ్యం మాత్రం కాదు. ప్రతి పేరెంట్ తమ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. దాంతోపాటు మంచి వ్యక్తిత్వం ఉండాలని ఆశిస్తారు. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు ఈ ఐఏఎస్ అధికారిణి చెప్పే అద్భుతమైన పాఠాలను తెలుసుకోవాల్సిందే. ప్రతిదీ అందుబాటులో ఉండే ఈ కాలంలో పిల్లలను మంచిగా పెంచడం అనేది ఓ టాస్క్ మాత్రమే కాదు, ఏ మార్గాన్ని అనుసరించాలనేది కూడా గందరగోళమే అంటున్నారామె. తన తల్లి నుంచి నేర్చుకున్న ఆ అమూల్యమైన పాఠాలే తన ఇద్దరి కూతుళ్లను పెంచడానికి ఉపయోగ పడుతున్నాయంటూ 12 పేరెంటింగ్ పాఠాలను చెప్పుకొచ్చారామె. అవేంటంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్లల్ తన తల్లి ముగ్గురు పిల్లలను పెంచిందని, వారంతా జీవితంలో మంచిగా సెటిల్ అయ్యారని సోషలమీడియా ఎక్స్ పోస్ట్లో చెప్పుకొచ్చారు. ఆ పేరెంటింగ్ పాఠాలనే తాను నేర్చుకున్నానని, అనుసరిస్తున్నాని రాసుకొచ్చారామె పోస్ట్లో. అంతేగాదు సోషల్మీడియా వేదికగా ఇద్దరు కుమార్తెల తల్లిగా తన స్వంత అనుభవాల ఆధారంగా కొన్ని పేరెంటిగ్ సూచనలు కూడా అందించారామె. అవేంటంటే..పిల్లలతో తరచుగా..ఏదైనా సాధించగలవు అని చెప్పండి: తరుచుగా ఇలా అనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందడమే గాక, క్లిష పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేలా చేస్తుంది.పడిపోనివ్వండి లేదా ఓటమిని ఎదుర్కొననివ్వండి: దీనివల్ల తప్పిదాలు తెలుసకోవడమే కాదు, తన కాళ్లపై ఎలా నిలబడాలో తెలుస్తుంది. పొంచి ఉండే ఆపదల నుంచి బయటపడటం ఎలా అనేది కూడా అలవడుతుంది.పోటీ: పోటీ పడటానికి ప్రోత్సహించండి. అది ఆరోగ్యకరమైన విధంగా ఉండాలని చెప్పండి. దాంతో వైఫల్యాలనేవి జీవితంలో భాగం అనేది తెలుస్తుంది. తద్వారా సానుకూలంగా వ్యవహరించడం అలవాటు చేసుకోగలుగుతారురిస్క్ తీసుకోనివ్వండి: సాహసక్రీడల్లో పాల్గొనివ్వండి. గాయపడినప్పుడూ బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలుగుతారు. మీ ఆలోచనలు రుద్దకండి: మీకున్న ఉన్నని అవకాశాలు పొందలేకపోయామన్న నిరాశను వ్యక్తం చెయ్యొద్దు. అలాగే మీ ఆకాంక్షలను రుద్దొద్దు. ఆదర్శంగా ఉండండి: మొదట మీరు ఆచారించే పిల్లలకు చెప్పాలి. అప్పుడే పేరెంట్స్ మాటపై వారికి విలువ, గురి ఉంటాయి. మీ బిడ్డపై నమ్మకం ఉంచండి: ఆశ అనేది అందిరికి ముఖ్యం. ముందు మనం వారిని నమ్మకపోతే ఇంకెవ్వరు వారి సామర్థ్యాలను నమ్ముతారు. పిల్లలు ఎన్ని ఓటములు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులుగా ఏదో ఒకనాడు గెలుపు అందుకుంటాడనే స్ట్రాంగ్ నమ్మకంతో ఉండాలిపోల్చవద్దు: అతి పెద్ద తప్పు పోలిక. మీ పిల్లలను ఎవ్వరితోనూ పోల్చవద్దు. వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి: స్వతహాగా ఎదగడం ముఖ్యం. కాబట్టి వారికి వారికి కొన్ని అనుభవాలను పొందే అవకాశం ఇవ్వాలి. వినండి: పిల్లలు చెప్పే ప్రతీది ఓపికతో వినండి, తద్వారా వారు వినడం అనే అలవాటును అవర్చుకోగలుగుతారు. సురక్షితంగా ఉన్నామనే భరోసా: పిల్లలు ధైర్యంగా ఉండేలా భరోసా ఇవ్వాలి. తమ భావాలను మనసు విప్పి చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రేమపూరిత వాతావరణం కల్పించాలి.పైన చెప్పిన అన్నింటిని మనం పిల్లలకు అందిస్తే..తప్పకుండా ప్రయోజకులు అవ్వుతారని చెప్పుకొచ్చారు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్. కాగా దివ్య మిట్టల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జీవిత పాఠాలపై యువతకు అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. My mother raised 3 kids- all 3 went to IIT, then IIM & doing well in their lives. Based on my own childhood and journey of raising 2 little daughters, some insights on parenting. Please retweet for wider reach. 🧵— Divya Mittal (@divyamittal_IAS) August 23, 2022 (చదవండి: ప్లాస్టిక్ను సరికొత్త రూపంలో చెక్పెడుతున్న అతివలు..!) -
మోసగాళ్లున్నారు..లివ్ఇన్పై జాగ్రత్త..లేదంటే : గవర్నర్ ఆనందీబెన్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్షిప్లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.చదవండి : జస్ట్ 10 లక్షల లోన్తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్షిప్లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్షిప్ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel "I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025 "విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
లైవ్ కిచెన్..! నేరుగా వీక్షిస్తూ..ఆస్వాదించేలా..
భాగ్యనగర వాసులకు నాలుగు రకాల ప్రత్యేక వంటకాలను రుచి చూసే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ‘4–నోట్’ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఇది లైవ్ కిచెన్స్ థియేటర్గా రూపొందించిన సరికొత్త రెస్టారెంట్. అతిథులు రెస్టారెంట్ లోపల లేదా బయట కూర్చొని ప్రతి షో కిచెన్ నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకొని, వైవిధ్య భరిత రుచుల అనుభవాన్ని పొందే సౌకర్యాన్ని ఈ రెస్టారెంట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ 4–నోట్లో ఒకే స్థలంలో నాలుగు ప్రత్యేక కిచెన్స్కు అతిథ్యమిచ్చేలా రూపొందించారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్, ఓరియంటల్, తెలుగు రుచులు, యూరోపియన్ వంటకాలను, అతిథులు లైవ్ కిచెన్ ప్రదర్శనలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి వంటకం వారి ముందు తయారయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఆహార ప్రియులు ఉత్సాహంగా, ఆనందంగా, ఓ అద్భుతమైన థియేటర్ అనుభవంగా మారనుంది. ఈ కార్యక్రమంలో హయత్ హైదరాబాద్ మేనేజర్ క్రిసెల్లె ఫెర్నాండేజ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ అలోక్, అసోసియేట్స్ డైరెక్టర్ మిచెల్ ఎవాన్స్, డైరెక్టర్ ఆఫ్ సేల్స్ శ్రావణ్బతినా పాల్గొన్నారు. మరచిపోలేని అనుభవం కోసం.. 4–నోట్ కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇది లైవ్ కిచెన్. క్యూరేటెడ్ ఫుడ్తో ఆతీ్మయ అనుభూతి కలిగిస్తుంది. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో 4–నోట్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ప్రపంచ స్థాయి, హైదరాబాద్ అతిథులను అలరించేలా, మెప్పించేలా వైవిధ్యమైన రుచులను ఈ లైవ్ కిచెన్ థియేటర్ అందిస్తుంది. – పియుష్శర్మ, హయత్ హైదరాబాద్ ఫుడ్ అండ్ బివరేజ్ డైరెక్టర్ (చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్ సక్సెస్ అయినట్లే..) -
డెలీ'వర్రీ' వద్దు..! మెడిటేషన్ మస్ట్..
మహానగరంలో సగటు గర్భిణి డిప్రెషన్కు గురవుతోంది. గర్భందాల్చిన విషయం తెలిసిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకూ యాంగ్జైటీకి గురవుతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రసవ సమయంలో 15 నుంచి 20 శాతం మంది గర్భిణులు, ప్రసవానంతరం 25 శాతం మంది ఈ రకమైన డిప్రెషన్కు గురవుతున్నారని యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలపై చేపట్టిన సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రసవానంతరం మూడు నెలల పాటు నెగిటివ్ థాట్స్ వేధిస్తున్నాయట. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ లింగ వివక్ష కనిపిస్తోందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో మాతృ మరణాల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గినప్పటికీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధానంగా పేదరికం, ఆర్థిక అసమానతలు, గృహ హింస, సూటిపోటి మాటలు, కుటుంబ సభ్యుల మద్ధతు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలే కారణం.. నగర జీవితంలో ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. గర్భిణిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో ఒత్తిడి, ఇంట్లో ఒంటరి తనం వేధిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సలహాలు, సూచనలతోనూ గర్భిణులు ఇబ్బందిపడుతున్నారట. పట్టణ జీవితంలో సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ అంతర్జాలంలో చూసి ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది గర్భిణుల్లో నాకు అన్నీ తెలుసు అనే ధోరణి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. లైఫ్ స్టైల్ ప్రభావం.. సుమారు 60 శాతం మంది గర్భిణులు సూర్యుడిని చూడటంలేదట. ఫలితంగా విటమిన్–డి లోపం కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైయిల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెడిటేషన్ మస్ట్..గర్భిణుల్లో వ్యాయామం, డెలివరీ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటూనే.. మెడిటేషన్కు సమయం కేటాయించాలి. రెండు నుంచి మూడు శాతం మందికి మాత్రమే బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. మిగతావారు పనులు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గర్భిణిగా గుర్తించిన తొలి రోజుల నుంచి యాంగ్జైటీ మొదలై చివరి వరకు కొనసాగుతోంది. సోషల్ మీడియాకు ప్రభావితం కావొద్దు. పోస్ట్ డెలివరీలో హార్మోన్ ఛేంజెస్ ఉంటాయి. తగినంత రెస్ట్ అవసరం. క్యాల్షియం డెఫిషియన్సీ, రోగ నిరోధక శక్తి సమస్యలు వేధిస్తున్నాయి. రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కనీసం అర గంట ఎండలో ఉంటే డి–విటమిన్ లోపాన్ని అధిగమించొచ్చు. – డాక్టర్ పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: Benefits of Barefoot: ఫుట్ వేర్కి బై.. 'బేర్ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..) -
ఫుట్ వేర్కి బై.. 'బేర్ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..
అప్పులేకుండా తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే ఆర్థికంగా స్థిరపడినట్టే అనేవారు పెద్దలు. కానీ చెప్పుల్లేకుండా తన కాళ్లపై తాను నడవడం అంటే ఆరోగ్యం లభించినట్లే అంటున్నారు నేటి వైద్య నిపుణులు. ప్రస్తుతం గ్రౌండింగ్/ఎర్తింగ్ పేర్లతో మెట్రో నగరాల్లో పాదరక్ష రహిత నడక ఆరోగ్య సాధనంగా మారింది. దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వెల్నెస్ చికిత్సా కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న ఈ బేర్ఫుట్ వాక్పై నగరవాసుల్లో క్రమంగా ఆకస్తి పెరుగుతోంది. ఆరోగ్య రక్షణపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాన సౌకర్యాలూ లేవు.. కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. ఎటువంటి పాదరక్షలూ లేకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలివే.. పాదాలకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి, కాళ్లకూ మధ్య మెరుగైన సమన్వయం, రక్త ప్రసరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పాదరక్షలు లేకుండా నడవడం స్వేచ్ఛగా, కొంత సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ఈ నడక వల్ల నేలతో మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఇది ప్రొప్రియోసెప్షన్ (శరీర కదలికల–అవగాహన)ను మెరుగుపరుస్తుంది. శరీరం కదలిక స్థానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచి పాదాలపై పట్టు జారిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. మెరుగైన ప్రొప్రియోసెప్షన్తో మెరుగైన భంగిమ వస్తుంది. కొంతకాలం పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్నెముక, కీళ్లు బలోపేతమై మరింత స్థిరత్వంతో తక్కువ వంగి నడవడానికి కూడా సహాయపడుతుంది. పాదాలకు అసంఖ్యాక నరాలు, రక్త నాళాలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వాటిని చురుకుగా మారుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. ప్రసరణ సమస్యలు ఉన్నవారికి, చల్లని పాదాలకు లేదా రోజంతా కూర్చొని గడిపే వారికి ఇది చాలా మేలుచేస్తుంది. అంతేకాదు ఇది నాడీ వ్యవస్థను కూడా మేల్కొలుపుతుంది. భూ ఉపరితలంతో ప్రత్యక్ష సంబంధం ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో సంభవించే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని స్పర్శాజ్ఞానం అత్యుత్తమం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్ స్కిల్స్.. బాడీ బ్యాలెన్సింగ్ నైపుణ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. షూస్, సాక్స్లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్ నుంచి తప్పించుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ? దేనిపై అడుగు పెడుతున్నారు? పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చదునైన పాదాలు, ప్లాంటార్ ఫాసిటిస్ లేదా పాదాల నొప్పి ఉన్నవారు దీన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఆర్చ్లు, ప్లాంటార్ ఫాసిటిస్, లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని ప్రత్యేక తరహా పాదాలు ఉంటే చెప్పులు లేకుండా నడవడం మరింత దిగజార్చుతుంది. అందరికీ కాదు.. అన్ని చోట్లా కాదు.. పాదరక్షలను వదిలే ముందు, పాడియాట్రిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్ను ముందస్తుగా సంప్రదించడం అవసరం ఇది అందరికీ లేదా ప్రతి వాతావరణానికి తగినది కాదు. పట్టణ ప్రాంతాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. గడ్డి, ఇసుక లేదా నేల వంటి సహజ ఉపరితలాలపై సహజమైన ప్రకృతిలో మాత్రమే పాదరక్ష రహితంగా నడవవచ్చు. పరిశుభ్రమైన పరిసరాలు కూడా తప్పనిసరి. వృద్ధులకు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది సరైన ఎంపిక కాదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తెస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని కఠిన ఉపరితలాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. బేర్ ఫుట్ వాక్ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటిబయాటిక్ సోప్స్ లేదా లోషన్స్ ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవడం మంచిది. పచ్చని గడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్ మీద నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద నగక కూడా మంచిదే. ఆరోగ్యకరం.. తగిన జాగ్రత్తలు తీసుకుని బేర్ఫుట్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా దీనివల్ల ఫుట్ పొజిషన్ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్ పెరగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పిరుదులు, కీళ్లు, కోర్ మజిల్స్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. సరిగా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పడుతుంది. లోయర్ బ్యాక్ ప్రాంతపు కండరాలను శక్తివంతం చేస్తుంది. – డా.కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్ (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
ఇయర్ చెయిన్స్: ప్రాచీన అలంకరణే ట్రెండీ స్టైలిష్గా
రమణుల ఆభరణాల అలంకరణలో చెవుల నుంచి హెయిర్ వరకులేయర్లుగా చెయిన్ ఉండటం ఫ్యాషన్ మాత్రమే కాదు మన సంస్కృతి, సౌందర్యం, ఆచారం కూడా. దక్షిణ భారతదేశంలో చెంపసరాలు, మాటీలుగా పేరున్న ఈ ఇయర్ చెయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. ఇటీవల దుర్గా నవరాత్రుల్లో సెలబ్రిటీలు ధరించిన మాటీల అందం నవతరపు చూపులను ఇట్టే కట్టిపడేసింది.ప్రాచీన ఆభరణంగా, అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా నిలిచే మాటీలు వివాహ వేడుకలలో వధువు సింగారంలో తప్పనిసరై వెలుగొందుతోంది.పండగల రోజులలో ధరించిన డ్రెస్సుల తగిన ట్రెండీ మోడల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. బంగారం, డైమండ్స్లోనే కాదు వివిధ రకాల పూసలు, సిల్వర్, ఆక్సిడైజ్లలోనూ ఈ మాటీల అందం మనసు దోచేస్తుంది. సాంప్రదాయ ఆభరణాలకు మోడర్న్ మెరుపులు జోడించడమే ఈ ఇయర్ చెయిన్స్. ఒకప్పుడు దేవతల విగ్రహాల్లో, అమ్మమ్మల చెవులకు కనిపించిన చెంప సరాలు ఇప్పుడు రన్ వే వేదికలపై అడుగులు వేసే మోడల్స్ చెవుల్లో, మ్యాజిక్ ఫెస్టివల్ లుక్స్లో, బ్రైడల్ ఫొటోషూట్లలో కొత్త శైలిలో మెరిసి΄ోతున్నాయి. దక్షిణ భారతీయ సంప్రదాయాల్లో చెంప సరాలు (ఇయర్ చెయిన్)ఒక ముఖ్యమైన అలంకారం. నాటి కాలంలో మహిళల గౌరవం, ఆభరణ సంపూర్ణతకు చిహ్నంగా వెలుగొందిన చెంప సరాలు రాబోయే వేడుకలలో మరిన్ని ఆకర్షణలను జోడించనున్నాయి.అద్దుకున్న ఆధునికతఈ రోజుల్లో ఆ చెంప సరాలు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. సిల్వర్, ఆక్సిడైజ్డ్, మెరూన్ కలర్ పూసలు, ముత్యాల చెయిన్లు, ఫ్యూషన్ ఫ్యాషన్లో కూడా ఇయర్ చెయిన్స్ స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. సాదాసీదా కుర్తా మీదకైనా, లెహంగా లేదా చీర ధరించినా ఆభరణాల అలంకరణలో ఇయర్ చెయిన్ అందం జత చేరితే ఆ అందం ఇనుమడిస్తుంది.శక్తి సరాలు..ఇది కేవలం అలంకారం కాదు. చెవులు–జుట్టు ప్రదేశంలో ఈ సరాలు కదలడం మన ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుందని చెబుతారు. అందుకే కొంతమంది దీనిని ‘శక్తి సరాలు’గా భావిస్తారు.సెలబ్రిటీల స్టైల్ టచ్బాహుబలి సినిమాలో అనుష్క ధరించిన చెవి జూకాలు, చెంప సరాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల దుర్గా నవరాత్రుల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలైన అలియా భట్, జాన్వికపూర్, సోనమ్కపూర్, శోభిత ధూళిపాల, నయనతార... లాంటి నటీమణులు తమ ట్రెడిషనల్ ఫొటోషూట్లలో ఇయర్ చెయి ధరించి ట్రెండ్ సెట్ చేశారు. ఆ లుక్స్ వల్లే ఈ పాత ఆభరణం మళ్లీ యంగ్ జనరేషన్లో పాపులర్ అయింది. పాత ఆభరణానికి కొత్త రూపం దక్కింది. ఇప్పుడు వాటి డిజైన్ , మెటీరియల్, వాడుక అన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త భాషను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది కళాకారులు రీసైకిల్ మెటల్, హ్యాండ్ మేడ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్తోనూ వీటిని రూపొందిస్తున్నారు. అమ్మమ్మల నాటి సంప్రదాయ నెమలి, మామిడిపిందెల నుంచి ప్రారంభమైన చెంప సరాల డిజైన్లు ఈ రోజుల్లో ఇయర్ కఫ్స్ వరకు వినూత్నంగా కళ్లకు కడుతున్నాయి. (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
భారత్ పిలిచింది..!
బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన యూకే అథ్లెట్ జాక్ ఫెంట్కు ప్రతికూల ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఇండియా గుర్తుకు వచ్చింది. వెంటనే రంగంలో దిగాడు. ‘ఇండియా–80 రోజులు–4,000 కిలోమీటర్లు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.ఇండియాలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అతడిలో ఉత్సాహం మొదలైంది. ఇండియాలో తన ‘80–డే రన్’ తాలూకు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ‘ప్రొటెక్టర్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో తనను ప్రమాదం నుంచి రక్షించిన వీధి శునకం గురించి చెప్పాడు.ఆ శునకంతో తనతో పాటు పదమూడు కిలోమీటర్లు నడిచింది. దానికి ‘మనాలి’ అని పేరు పెట్టాడు జాక్.‘80 రోజులలో రోజుకు 50 కిలోమీటర్ల దూరం పరుగెత్తడానికి ఇండియాకు ప్రయాణమవుతున్నాను. మంచుతో కప్పబడిన కొండల నుంచి కేరళ ప్రకృతి అందాల వరకు ఎన్నో చూడబోతున్నాను. బ్రెయిన్ ట్యూమర్ అని నాకు నిర్దారణ అయిన తరువాత నా మనసు భయం, గందరగోళం, దుఃఖంతో నిండిపోయింది. నాకే కాదు భూమి మీద ప్రతి ఒక్కరికీ కష్టాలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇండియాకు వెళ్లాలను కోవడం అనేది నా ఎంపిక. మళ్లీ పూర్వంలా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాను’’ అని తన యాత్ర ప్రారంభానికి ముందు షేర్ చేసిన పోస్ట్లో రాశాడు జాక్ పెయింట్. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? ఏకంగా 93 కిలోలు నుంచి 50కిలోలు తగ్గిన మహిళ..) -
మనసు మాట విందాం!
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు. మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి.. సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం. ఆమాత్రం చేయలేమా?ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని -
వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? 43 కిలోల బరువు తగ్గిన మహిళ..
వెయిట్ లిఫ్టింగ్ అనగానే..మగవాళ్లు చేసేది అనే భావనే అందిరిలో ఉంటుంది. అయితే ఇటీవల కొందరు ఫిట్నెస్ ఔత్సాహిక మహిళలు ఆ మూసధోరణిని బద్ధలు కొట్టి మరి వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటారు. చాలామంది ప్రముఖ ఫిట్నెస్ నిపుణులు సైతం ఈ వెయిట్లిఫ్టింగ్లు మహిళలకు సరిపడవని, మగవాళ్ల ఫిజిక్లా కనిపించేలా చేస్తుందని చెప్పేవారు. అయితే ఆ అపోహను అబద్ధం అని కొట్టిపారేసేలా ఈ మహిళ అద్భుతం చేసి చూపింది. అంతేగాదు మహిళలకు ఈ వెయిట్లిఫ్టింగ్ ఎంత మేలు చేస్తుందో సవివరంగా వెల్లడించారామె. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన సుష్మా పచౌరి ఖాడియా కంటెంట్ క్రియేటర్, ఫిట్నెస్ కోచ్. ఆమె ఒకప్పుడు స్వతహాగా 93 కిలోలు బరువు ఉండేది. వెయిట్లిప్టింగ్తో సుమారు 43 కిలోల మేర తగ్గి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతలా సంతరించుకున్న తన శరీర మార్పు గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారామె. ప్రజలంతా అనుకున్నట్లు వెయిట్లిఫ్టింగ్లు ఆడవాళ్లను మగవాళ్లలా రఫ్గా మార్చదని, ఎంతో ప్రయోజనకరమైనదని అంటోంది. ఇది మహిళల్లోని ఫ్యాట్ని కరిగించి వెయిట్లాస్కు చెక్ పెడుతుందని చెబుతోంది. తాను శుభ్రంగా ఇంట్లో వండిన ఆహారం, క్రమ తప్పకుండా వ్యాయామాలు చేసి ఇంతలా బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. సుష్మా పోస్ట్లో 'వెయిట్లిఫ్టింగ్ దుష్ప్రభావాలు' అనే క్యాప్షన్ జోడించి చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. 18 ఏళ్ల వ్యక్తికి తల్లి అయిని సుష్మా పచైరి వెయిట్లిఫ్టింగ్ని తన దినచర్యలో భాగం చేసుకున్న తర్వాత నుంచి తన జీవితం ఇంతలా మారిందని తెలిపింది. View this post on Instagram A post shared by Sushma Pachouri Khadia (@sushma.pachouri) సంతరించే మార్పులు-ప్రయోజనాలు..ఆకాశాన్ని అంటేలా శక్తి స్థాయిలు పెరుగుతాయి. స్లిమ్గా మారుతున్నట్లు తెలుస్తుంది. దుస్తుల సరిపోతాయిఅందరి అటెన్షన్ మీపై ఉంటుంది. ఎలా బరువు తగ్గారు అని కచ్చితంగా ప్రశ్నించడం మొదలవుతుంది. సోమరితనం దరి చేరదుఒత్తిడి అనే మాటకు ఆస్కారం ఉండదుకిరాణ సామాగ్రి వంటి పలు రకాల లగేజ్లను సులభంగా ఎత్తేయగలుగుతారుమంచి నిద్ర పడుతుంది. ఇలాంటి మంచి ఫలితాల కోసం ఫిట్నెస్కోచ్ సూచించే సలహాలను తప్పక పాటించాలని చెబుతోంది. ఇక్కడ ఈ వెయిట్ లిఫ్టింగ్ మహిళల్లో లీన్ కండరాలను అభివృద్ధి చేయడానికి, శరీరాన్ని పెద్ద పరిమాణంలో కనిపించకుండా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిజానికి ఇది మహిళలకు బలం, ఫిట్నెస్ తోపాటు మంచి ఆత్మవిశ్వాసాన్నికూడా అందిస్తుందని నమ్మకంగా చెబుతోంది ఫిట్నెస్ కోచ్ సుష్మా పచౌరి. View this post on Instagram A post shared by Sushma Pachouri Khadia (@sushma.pachouri)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వచ్ఛందంగా ఇలా ప్రయత్నిస్తే..స్వచ్ఛ భారత్ సక్సెస్ అయినట్లే..) -
'వాకింగ్' తినక ముందా? తిన్నతర్వాతా?
ప్రస్తుతం ఆరోగ్యం కోసం అత్యధికులకు అందుబాటులో ఉన్న మంచి వ్యాయామం వాకింగ్. ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామం కావడంతో దీనిని అనేకమంది ఎంచుకుంటున్నారు. అయితే వాకింగ్కు సంబంధించి పూర్తి ప్రయోజనాలు లభించాలంటే ఎప్పుడు ఎలా వాక్ చేయాలి అనేదానిపై అవగాహణ ఉండాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రోజూ మూడు లేదా నాలుగు పూటలా తినే అలవాటున్నవారు ఈ విషయంలో మరింత అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం...భోజనం ముందు...అప్పటికి ఖాళీ కడుపుతో ఉన్నా లేదా తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకుని ఉన్న స్థితిలో నడవడం వల్ల కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ కరుగుతుందన్నమాట. నడకకు ముందు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన భోజనంతో పోలిస్తే ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, నడకకు అవసరమైన శక్తి ఖర్చు తగ్గుతుంది. అల్పాహారం లేదా భోజనానికి ముందు చిన్నపాటి నడక భోజన కాంక్షను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంపై గ్లూకోజ్ లోడ్ పడకుండా చురుకుదనాన్ని పెంచుతుంది. ఉదయం లేదా మధ్యాహ్న భోజనానికి ముందు ముందు 10–20 నిమిషాలు, తేలికపాటి నడక మేలు.భోజనం తర్వాత...భోజనం తర్వాత కూర్చోవడం కంటే 2–10 నిమిషాలు తేలికగా నడవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చోటు చేసుకునే చక్కెర స్థాయి తగ్గుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. భోజనం తర్వాత వెంటనే 10 నిమిషాల నడక కలిగించే లాభాలు మిగిలిన సమయాల్లో చేసే సుదీర్ఘ నడకతో ధీటుగా ఉంటాయని అవి తేల్చాయి. నడక జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, గ్లైసెమిక్ నియంత్రణ కోసం ప్రతి భోజనం తర్వాత చిన్న నడక అవసరం. భోజనం తర్వాత తేలికపాటి నడక గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది యాసిడ్ ఎక్స్పోజర్ను తగ్గిస్తుంది; అయితే భోజనం తర్వాత తీవ్రమైన లేదా వేగవంతమైన నడక మాత్రం మంచిది కాదు. అలాగే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం 10–20 నిమిషాల వ్యవధిలో ప్రారంభించి 5–15 నిమిషాలు కొనసాగిస్తే జీర్ణ ప్రయోజనాలకు ఉపయుక్తం.లక్ష్యాన్ని బట్టి సమయ పాలన...ప్రాథమిక లక్ష్యం కొవ్వు తగ్గడం అయితే, ఖాళీ కడుపుతో నడవడం వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఏమీ తినకుండా శ్రమించినప్పుడు శరీరం గతంలో పేరుకున్న కొవ్వు నిల్వలను శక్తి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఈ ప్రక్రియను కొవ్వు ఆక్సీకరణం అంటారు. సరైన ఆహారం తీసుకుంటూ ఇలా చేస్తే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే కొందరికి తినడానికి ముందు నడవడం వల్ల తల తిరుగుతుంది లేదా అలసట రావచ్చు, అలాంటి వారు నడకకు ముందు ఒక చిన్న బలవర్ధకమైన చిరుతిండి (ఉదాహరణకు బాదం వంటి నట్స్తో చేసినవి)తీసుకోవడం మంచి ఆలోచన.డయాబెటిస్ తగ్గాలంటే...రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి, భోజనం తర్వాత నడవడం మంచిది. తిన్న 30 నిమిషాలలోపు 10–15 నిమిషాలు తేలికపాటి నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.మనసు మాట వినాలి...కొంతమందికి ఖాళీ కడుపుతో నడవడం వల్ల బాగా శక్తివంతంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం. ఉపవాసం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా వారు మానసికంగా పదునుగా మారి పనిపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు ఫీలవుతారు. మరికొందరికి భోజనం తర్వాత నడవడం వల్ల చురుకుగా అనిపించవచ్చు. అంతిమంగా, వ్యక్తిగత ప్రాధాన్యత ముఖ్యం, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది కూడా గమనించాలి. ఉదయాన్నే నడుస్తున్నా లేదా రాత్రి భోజనం తర్వాత అయినా, క్రమం తప్పకుండా నడవడం మాత్రం చాలా అవసరం. గుండె, మెదడు, మానసిక స్థితి జీవక్రియకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.(చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
చదివింది ఎనిమిదో తరగతి..కానీ ఇవాళ ఏకంగా బుర్జ్ ఖలీఫాలో నివసించే రేంజ్కి..
చాలామంది ఉపాధి కోసం దుబాయ్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు పయనమవుతుంటారు. అక్కడకు వెళ్లి బ్రోకర్ల చేతిలో మోసపోయిన వాళ్లు కొందరైతే..మరికొందరు సవ్యంగా ఆయా దేశాలకు వెళ్లి..మంచి స్థాయిలో స్థిరపడి..తమకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే సతీష్ సన్పాల్. అతడి సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుంది. ఒక్కోమెట్టు ఎక్కుతూ..స్వయంకృషితో పైకి రావడం ఎలా అనేది నేర్పిస్తుంది అతడి కథ. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన సతీష్ సన్పాల్ ఎనిమిదో తరగతితోనే చదువుకి స్వస్తి పలికాడు. తన తల్లి ఇచ్చిన రూ. 50 వేల రూపాయలతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించాడు. జస్ట్ 15 ఏళ ప్రాయానికి భారత్లో చిన్న దుకాణం ప్రారంభించాడు. ఆ వ్యాపారం పెట్టిన రెండేళ్లకే మూతపడ్డప్పటికీ..అదే అతడికి ఎన్నో అమూల్యమైన పాఠాలను నేర్పించింది. అయితే సతీష్లో ఆ పరాజయం మరింత కసి, పట్టుదలను పెంచేశాయి. ఏదో సాధించాలనే దృఢ సంకల్పంతో అవకాశాల కోసం అన్వేషిస్తూ..అలా దుబాయ్కి పయనమయ్యాడు. కనీసం డిగ్రీ చదువు కూడా లేకపోయినప్పటికీ..తన స్వీయ తెలివితేటలు, అభిరుచిలనే పెట్టుబడిగా పెట్టి..తనకంటూ ఒక సొంత మార్గాన్ని స్వయంగా నిర్మించుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. అక్కడ తనకంటూ ఎలాంటి వ్యాపార సెటప్ లేకపోయినా..చిన్నగా క్లయింట్లు స్టాక్ మార్కెట్ బ్రోకర్లతో కనెక్ట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యే అంశంతో తన ప్రస్థానం ప్రారంభించాడు. అది అతనికి మంచి అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలా నెమ్మదిగా వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తూ..2018లో ఏఎన్ఏఎక్స్ హోల్డింగ్ నిర్మించడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ బృదంలో మూడు ప్రధాన వ్యాపార దిగ్గజాలు ఉన్నాయి. ఒకటి ఏఎన్ఏఎక్స్ డెవలప్మెంట్స్, ఏఎన్ఏఎక్స్ హాస్పిటాలిటీ, ఏఎన్ఏఎక్స్ క్యాపిటల్ తదితరాలు..సంక్షోభాన్ని..లాభంగా మార్చేయడం..కోవిడ్ సంక్షోభంలో చాలా తెలివిగా తక్కువ విలువ కలిగిన దుబాయ్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టి..కోట్లకు పడగలెత్తాడు. వాటి విలువ ఇవాళ పది రెట్లు పెరిగాయి. ఆయన పొదుపు, ఖర్చులని చాలా తెలివిగా బ్యాలెన్స్ చేస్తాడట. సతీష్ ఎక్కువగా రియల్ ఎస్టేట్, లగ్జరీ గడియారాలు, బంగారం, కార్లపై పెట్టుబడులు పెడతాడట. ఆయన సాహసోపేతమైన నిర్ణయాలకు నిదర్శనమే వెయ్యి కోట్ల హిల్స్భవనం. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి బుర్జ్ ఖలీఫాలో నివసిస్తున్నాడు. సతీష్కు లగ్జరీ కార్ల గ్యారేజ్ ఉంది. అవి ఆయన హోదాకు నిదర్శనంగా కాకుండా తన ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా చూస్తాడట. అంతేగాదు సతీష్ 2034 నాటికి ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లలో ఒకరిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నాడు. ఇక ఈ ఏడాది అతని కంపెనీ దుబాయ్, యూకేల వెంచర్లతో సహా డీహెచ్3 వంటి బిలియన్లకు పైగా నాలుగు కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించడం విశేషం. చివరగా యువతకు ఆయన ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటంటే.. "క్రమశిక్షణతో నేర్చుకుంటూ ఉండండి, ఎప్పుడూ ఆశను వదలుకోవద్దు, ఓడిపోయానని చేతులెత్తేయొద్దు" అని సూచిస్తున్నారు. మనం తినే ఎదురుదెబ్బలే విజయానికి దారితీస్తాయనే విషయం గుర్తురెగాలని చెబుతున్నాడు సతీస్ సన్పాల్.(చదవండి: Success Story: ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..) -
ఆన్లైన్ ఒత్తిడికి విరుగుడుగా..
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(అక్టోబర్ 10)ని పురస్కరించుకుని యువజన మీడియా ప్లాట్ఫామ్ ‘యువ’ భాగస్వామ్యంతో ‘స్నాప్ ఇంక్’ ఆధ్వర్యంలో ‘కేర్ నాట్ కంట్రోల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సోషల్ మీడియా, అభద్రత, ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం టీనేజర్ల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను పెంపొందించడమే ప్రధానంగా దీని ఉద్ధేశ్యమన్నారు. భారతీయ స్నాప్చాటర్ల డిజిటల్ శ్రేయస్సుకు ఇది మద్దతు అందిస్తుందని వివరించారు. ఈ వీడియో ప్రచారం ఈ నెల 10 వరకూ కొనసాగుతుందన్నారు. చిన్నపాటి చిట్కాలు..అలాగే బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడువెంటనే అమ్మకు ఫోన్ చేసి ఆమె గొంతు వినండి... చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట వింటూ హాయిగా నిద్దురలోకి జారినంత తేలిగ్గా మీరు ఒత్తిడి నుంచి బయట పడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: Custard Apple: సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ నుంచి..) -
యువ డిజైనర్లతో ఫ్యాషన్ బ్రాండ్స్ భేటీ
హైదరాబాద్ నగరంలో డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులను పలు ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రతినిధులు బుధవారం కలిశారు. నగరానికి చెందిన ప్రముఖ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ హామ్స్ టెక్ ఆధ్వర్యంలో నాగార్జునహిల్స్లో నిర్వహించిన కెరీర్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన వందలాది విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరొందిన పలు ఫ్యాషన్ బ్రాండ్స్కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. డిజైనర్లలో సృజనాత్మక శక్తిని, ఇప్పటి వరకూ చేసిన వర్క్స్ను బేరీజు వేసుకుని వారికి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు అరవింద్ ఫ్యాషన్స్, షాపర్స్ స్టాప్, లేబొల్ ది స్టోరీ, సింఘానియా, ఐశారావు, మై పర్ఫెక్ట్ ఫిట్ తదితర బ్రాండ్లతో కలిసి పనిచేసేందుకు ఎంపికయ్యారని వివరించారు.పట్నంలో.. గ్రామీణభారత్ మహోత్సవంచేనేత కార్మికులు, హస్తకళ కళాకారులు, ఇతర మహిళా సంఘాలు సృష్టించిన చేనేత–హస్తకళా ఉత్పత్తులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అమీర్పేట్లోని కమ్మ సంఘం వేదికగా ఏర్పాటు చేసిన ‘గ్రామీణ భారత్ మహోత్సవం’ బుధవారం ప్రారంభమైంది. నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రామీణ భారత్ మహోత్సవాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 21 రాష్ట్రాలకు చెందిన 53 స్టాల్స్లో చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఇందులో మన రాష్ట్రం నుంచి 14 స్టాల్స్ ఉన్నాయి. (చదవండి: అంతరిక్ష వేదికపై హైదరాబాద్..!) -
అంతరిక్ష వేదికపై హైదరాబాద్..!
సిటీకి అంతరిక్షంతో విడదీయరాని అనుబంధం ఉంది.. దేశం ఏ పరిశోధనలు చేసినా అందులో భాగస్వామ్యం అవుతోంది. కొంత కాలంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పరిశోధనల్లో మన నగరం ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ప్రతిష్టాత్మక భారతీయ స్పేస్ ప్రాజెక్టుల్లో కీలక వీడి భాగాలను, సాంకేతికతను నగరంలోని పలు సంస్థలు అందిస్తుండటం విశేషం. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లు మొదలు అంతర్జాతీయ స్థాయిలో ప్రంపంచ దేశాలకు పోటీగా నిర్వహిస్తున్న చంద్రయాన్లోనూ భాగ్యనగరం భాగస్వామ్యమవుతూ తన ప్రశస్తిని కొనసాగిస్తోంది. అయితే ప్రతి సంవత్సరం ఈనెల 10వ తేదీ వరకు ‘ప్రపంచ అంతరిక్ష వారం’ (వరల్డ్ స్పేస్ వీక్)ను అధికారికంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా స్పేస్ సైన్స్కు సంబంధించి అంతర్జాతీయ వార్షిక ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వరల్డ్ స్పేస్ వీక్ను ‘లివింగ్ ఇన్ స్పేస్’ థీమ్తో జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఒకసారి భారత అంతరిక్ష ప్రయాణంలో మన సిటీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకోకుంటే ఎలా..?! విద్యార్థులకు, యువ పరిశోధకులకు, ఔత్సాహిక నిపుణులకు శాస్త్ర సాంకేతికత, ఇంజనీరింగ్, అంతరిక్ష అన్వేషణ, ఇనోవేషన్తో పాటు సమగ్ర అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించడానికి వరల్డ్ స్పేస్ వీక్ను నిర్వహిస్తారు. సాంకేతికతతో పాటు పరిశోధన సాధనలు, ప్రయోజనాలు, మానవాళికి ఈ విజ్ఞాన ప్రాముఖ్యతను తెలియజేయడానికి జరుపుతారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు వరల్డ్ స్పేస్ వీక్ను జరుపుకుంటారు. 1957 అక్టోబర్ 4న మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పూతి్నక్ –1ను ప్రయోగించడం.. ఈ శాటిలైట్ 1967 అక్టోబర్ 10న చంద్రుడితో సహా ఇతర ఖగోళ ప్రాంతాల్లో అంతరిక్ష అన్వేషణ చేపట్టింది. చంద్రయాన్ నుంచి పీఎస్ఎల్వీ వరకు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నగరానికి చెందిన సంస్థలు, పరిశోధన వేదికలు, పరిశ్రమలు తనదైన ముద్ర వేశాయి. పరికరాల తయారీ నుంచి ఉపగ్రహ డేటా విశ్లేషణ వరకు అనేక రంగాల్లో ఇక్కడి నుంచి నిపుణులు, సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రయాన్–3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసినప్పటికీ, ఆ విజయానికి వెనక ఉన్న ఇంజినీరింగ్ విజయాల్లో మన పాత్ర మరువలేనిది. ఈ మిషన్ విజయవంతం కావడంలో నగరానికి చెందిన అనేక సంస్థలు కీలకంగా పనిచేశాయి. శ్రీవేంకటేశ్వర ఏరోస్పేస్ ఆధ్వర్యంలో రాకెట్ స్ట్రక్చర్, విడిపోయే భాగాలు(సెపరేషన్ సిస్టమ్), నోజిల్స్, ల్యాండర్, రోవర్కు సంబంధించిన కీలక భాగాలను రూపొందించింది. నాగసాయి ప్రిసీసన్ ఇంజనీర్స్ సంస్థ, ల్యాండర్కు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీల రక్షణకు అల్యూమినియం ఆలాయ్ కేవ్స్ను రూపొందించింది. అలాగే ఎమ్టీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్, హై సైకిల్ లైఫ్ వాల్వులు వంటి అనేక అత్యాధునిక భాగాలను తయారు చేసింది. నగరంలోని ప్రభుత్వ రంగ సంస్థ మిధాని.. క్రయోజెనిక్ ఇంజిన్లు, ప్రొపెల్లెంట్ ట్యాంకులు, రాకెట్ మోటార్ భాగాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక లోహాలు, మిశ్రమాలను ఇస్రోకి సరఫరా చేసింది.పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ.. అనంత్ టెక్నాలజీస్ సంస్థ పీఎస్ఎల్వీ–సీ52, పీఎస్ఎల్వీ–సీ56, జీఎస్ఎల్వీ–ఎఫ్14, ఇన్సాట్–3డీఎస్ వంటి అనేక ఉపగ్రహ ప్రయోగాలకు విమానాల ఎల్రక్టానిక్స్, పవర్ సిస్టమ్స్, టెలిమెట్రీ ప్యాకేజులు, నావిగేషన్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, పైరో కంట్రోల్ సిస్టమ్స్ వంటి అనేక భాగాలను రూపొందించి ఇచ్చింది. ఈ సంస్థ అనేక ఉపగ్రహాల అసెంబ్లీ, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ ప్రక్రియల్లో భాగమవుతూ ఇస్రోకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తోంది. ఇస్రో భాగస్వామ్యంతో 100కి పైగా ఉపగ్రహాలు, లాంచ్ వెహికిల్స్కు సిస్టమ్స్ సరఫరా చేసింది.ఉపగ్రహ డేటా కేంద్రంగా.. ఎన్ఆర్ఎస్సీ హైదరాబాద్లోని ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) ఉపగ్రహాల ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి, వ్యవసాయం, నీటిపారుదల, విపత్తుల నిర్వహణ వంటి అనేక రంగాలకు ఉపయోగించేలా మారుస్తోంది. ఇది ఇస్రోకు భూమి పరిశీలన సంబంధిత సేవల్లో ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.పరిశోధన, స్టార్టప్లకు ప్రోత్సాహం.. ఇస్రో– ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంయుక్తంగా ‘ఏఐ ఫర్ స్పేస్‘ అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి, విద్యార్థులు, స్టార్టప్లకు ఉపగ్రహ సాంకేతికతపై అన్వేషణకు అవకాశమిస్తోంది. ధృవ స్పేస్, స్కైరూట్ ఏరో స్పేస్ వంటి సంస్థలు హైదరాబాద్ ఆధారితంగా ఉపగ్రహ వ్యవస్థల అభివృద్ధిలో ముందున్నారు. (చదవండి: Custard Apple: సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ నుంచి..) -
సీజన్లో నిండుగా..సిటీలో పండు'గ'
మామిడి, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా కావొచ్చు.. ప్రతి సీజనల్ పండుని పండుగలా ఎలా జరుపుకోవాలో నగరవాసులకు తెలుసు. ప్రస్తుతం సీతాఫల్(కస్టర్డ్ ఆపిల్) సీజన్ ప్రారంభమైంది. దాంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్ డెజర్ట్ మెనూలకు ఈ క్రీమీ ఫ్రూట్ కొత్త రుచులను అద్దుతోంది. సీతాఫలం సీజన్లో నేరుగా పండ్లను తీసుకోవడం మాత్రమే కాకుండా భాగ్యనగరవాసులు దానిని అనేక రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. అన్ని పండ్ల మాదిరిగానే సీతాఫల్ జ్యూస్లు సరే.. అయితే.. కూలింగ్ మిల్క్షేక్ల నుంచి రుచికరమైన ఐస్క్రీముల వరకు, స్వీట్లు, పేస్ట్రీలు.. వివిధ రకాల వంటకాలలో ఇవి మేళవించడం విశేషం. వీలైనన్ని రూపాల్లో వెరైటీ డిష్లను తయారు చేసేందుకు ఉపయోగించ గల ఏకైక పండుగా సీతాఫలాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతాఫల్ రబ్డీ అనేది సిటీ రెస్టారెంట్స్లో బాగా ఫేమస్. ఈ నేపథ్యంలో నగరంలో సీతాఫల్ రుచులు అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి.. అబిడ్స్లోని సుల్తాన్ బజార్లో ఉన్న మయూర్ జ్యూస్ సెంటర్ సీతాఫలం రుచులకు ఫేమస్. ముఖ్యంగా నిండుగా గుజ్జుతో ఉన్న సీతాఫల్ జ్యూస్ ఇక్కడ క్రీమీగా రుచికరంగా ఉంటుందనేది ఫ్రూట్ లవర్స్ మాట. సికింద్రాబాద్, బండ్లగూడ, టోలిచౌకిలలో ఉన్న నైస్ జ్యూస్ సెంటర్ కూడా సీతాఫల వెరైటీలకు పేరొందింది. భిన్న రకాల పండ్ల పేరిట మలాయ్లను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ సెంటర్ సీతాఫల్ మలైని కూడా అందిస్తోంది.సీతాఫల్.. వైరల్.. ఇటీవలే సీతాఫలం రుచి, దాని ఆకారంలో రుచికరమైన వంటకాన్ని ప్రముఖ భారతీయ పేస్ట్రీ చెఫ్ తేజస్వి చందేలా రూపొందించారు. ఈ వంటకం తయారీ వీడియో ఇన్స్ట్రాగామ్ రీల్ ఆన్లైన్లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ విషయంలో తనకు ఫ్రెంచ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ ప్రేరణగా పేర్కొంది. అతడు పండ్లను పోలి ఉండే డెజర్ట్ల తయారీకి ప్రసిద్ధి చెందాడు. పలువురు హోమ్ మేడ్ సీతాఫల్ బర్ఫీ, హల్వా, ఖలాఖండ్ కూడా తయారు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్లపై అందిస్తున్నారు. జూబ్లీహిల్స్తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నేచురల్ ఐస్క్రీమ్స్ కూడా చవులూరించే కస్టర్డ్ యాపిల్ రుచులకు కేరాఫ్. సీజనల్ స్పెషల్ సీతాఫల్ ఐస్ క్రీం ఇక్కడ ఫేమస్. బంజారాహిల్స్లోని రోడ్ నెం.13లో ఉన్న లె టెసోరోలో ఓ ప్రత్యేక సీతాఫల్ రుచి అందుబాటులో ఉంది. సీతాఫల్ సోఫుల్ జార్ పేరిట అందించే ఈ డిసర్ట్.. వావ్ అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో రోడ్ నం.36లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్కి సీతాఫల్ లవర్స్ ఓ రౌండ్ కొట్టొచ్చు. ఇక్కడి కస్టర్డ్ యాపిల్ డిలైట్ కృష్ణపట్నం డిలైట్గా పేరొందింది. కొండాపూర్ లోని తారా– సౌత్ ఇండియన్ కిచెన్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్ని వడ్డిస్తోంది. ఈ సీజన్లో తారాస్ సీతాఫల్ రబ్డీని రుచి చూడటం సిటీలోని ఫుడ్ లవర్స్కి ఓ అలవాటు. బంజారాహిల్స్లో ఉన్న సీతాఫల్ ఫ్రెష్ జ్యూస్ తన పేరులోనే ఈ ఫలాన్ని ఇముడ్చుకోవడంతో పాటు పలు రకాల మిల్క్ షేక్స్లోనూ మేళవిస్తోంది. సీతాఫలాన్ని ఇష్టపడేవారి కోసం మిల్క్ షేక్లతో సహా వివిధ రకాల కస్టర్డ్ యాపిల్ డెజర్ట్లను అందిస్తోంది. -
మాన్పించబోయి బానిసనై పోయా! హాఫ్ బాటిల్ సరిపోవడం లేదు ఇద్దరికీ
నా వయస్సు 38. మా ఆయన పెద్ద బిజినెస్ మేన్. అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. కానీ నేను ఎవరికీ చెప్పుకోలేని ఒక విష వలయంలో ఇరుక్కు΄ోయాను. మావారికి మొదటి నుంచి ‘డ్రింక్ అలవాటుంది. ఆయన చేత ఆ అలవాటు మార్పించాలని ఎంతో ప్రయత్నించాను. ‘బిజినెస్లో ఇలాంటివి తప్పవు. నాకోసం తాగక పోయినా, కంపెనీ కోసం తప్పదు’ అని నా నోరు మూయించేవారు. పోనుపోను పగలు కూడా మందు పుచ్చుకుని ఆఫీసుకు పోవడం మొదలు పెట్టారు. ఎప్పుడూ ఫ్రెండ్స్, బిజినెస్ మీటింగ్స్, కేంప్స్ అని, ఏ తెల్లవారు జామునో ఇంటికి ఒళ్ళు తెలియని స్థితిలో వచ్చేవారు. బయట తాగొద్దు, అంతగా తాగాలని ఉంటే ఇంట్లోనే తీసుకోమని అంటే ఆయన నేను కూడా కంపెనీ ఇస్తే అలాగే చేస్తానన్నారు. ఆయన్ను కాపాడుకోవాలనే ఆరాటంలో రోజూ రాత్రి ఆయనతోపాటు కూర్చుని ఒక స్పూన్ విస్కీలో, ఒక బాటిల్ సోడా కలుపుకుని కంపెనీ ఇచ్చేదాన్ని. నేను, నాకు తెలియకుండానే ఆయనతో సమానంగా డ్రింక్ తీసుకునే స్థాయికి వెళ్ళాను. ఒక హాఫ్ బాటిల్ ఒక రాత్రికి మా ఇద్దరికి సరిపోడం లేదు. చివరకు ఆయన ఊర్లో లేక΄ోయినా, నేనొక్కదాన్నే ఇంట్లో తాగే పరిస్థితికి వచ్చాను. పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నారు. ఇప్పటి వరకూ వారి కంటపడకుండా నెట్టుకుంటూ వచ్చాను. రేపు వారికి వారి తల్లి తాగుబోతని తెలిస్తే నా గతేమిటి! నేను ఈ వ్యసనం నుంచి బయట పడే మార్గం చెప్పండి. – శకుంతల, విశాఖపట్నం నిర్భయంగా మీ సమస్యను బయటపెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. విస్కీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మీవారిని రక్షించే దానికి మీ చేతినందించి, ఆయన్ను బయటకు లాగబోయి చివరకు మీరు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. సరదా కోసం డ్రింక్ మొదలు పెట్టి అది ఒక సమస్యగా మారేవారు కొందరైతే, సహాయం చేసి మాన్పిద్దామని అందులో దిగి, ఇంకో కొత్తసమస్యను మీరు కొని తెచ్చుకున్నారు. ఒకసారి రుచి మరిగితే, నరనరాలు దానికోసం పరితపించి తనకు బానిసగా మార్చుకునే శక్తి ఉంది మద్యానికి. ఇంటికి పెద్ద దిక్కయిన మీరిద్దరూ ఈ వ్యసనానికి బానిసలయితే, చివరకు ఈ పరిస్థితి ఎటు వెళ్తుందో ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము. ఆయన్ని మాన్పించడమేమో గాని, ముందు మీరు దీంట్లోంచి బయట పడటం, మీకుటుంబ శ్రేయస్సు దృష్ట్యా చాలా అవసరం. మీకు సిన్సియర్గా మారాలని ఉంటే తప్పకుండా మీ అలవాటును మాన్పించవచ్చు. చదవండి: ఇదీ చదవండి:చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మద్యం అలవాటు మాన్పించేందుకు పవర్ఫుల్ మందులు, ఇతర మానసిక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ‘తాగాలి’అనే తపన తగ్గించేందుకు ‘యాంటి క్రేవింగ్ మెడిసిన్స్ మద్యం పైన అవర్షన్ కల్గించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులు, ఈ అలవాటు నుండి బయటపడేందుకు అద్భుతంగా పని చేస్తున్నాయి. మీరు హాస్పిటల్లో సుమారు 2–3 వారాలు ఉండాల్సి వస్తుంది. మీ వారికి నచ్చచెప్పి మీరు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కండి. మీరు మారితే మిమ్మల్ని చూసి ఆయన కూడా వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడవచ్చు. మీరే మానేస్తే ఆయన్ను బలవంతంగానైనా ఒప్పించేందుకు మీకు నైతిక బలం వస్తుంది. మీరు వెంటనే సైకియాట్రిస్ట్ని కలిసి మీ సమస్యను వివరించండి. మీ సమస్యను కాన్ఫిడెన్షియల్గా ఉంచి సరియైన వైద్యం చేస్తారు. ఆల్ ది బెస్ట్ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!
దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశలోని సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్ని భోపాల్కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.An MP IAS officer Sanskriti Jain, Collector Seoni,was given a unique farewell by her staff. Unheard of before.Many officers hv been popular during their postings owing to people-oriented works & honesty, yet this was something new.Let more officers be like her.@IASassociation pic.twitter.com/wsebdt9ELw— Abhilash Khandekar (@Abhikhandekar1) October 5, 2025 (చదవండి: డిజిటల్ డిటాక్స్లో ఉండగా ..వరించిన నోబెల్ బహుమతి! ట్విస్ట్ ఏంటంటే..)


