breaking news
Lifestyle
-
రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!
‘కాపాడుకో...కాపాడు’ నినాదంతో కోలిండియా వరల్డ్ క్లాస్ ఆల్–విమెన్ రెస్క్యూ అండ్ రికవరీ టీమ్లను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదే బాటలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఆల్–విమెన్ రెస్క్యూ టీమ్లకు శ్రీకారం చుట్టింది. శిక్షణ మొదలైంది. సింగరేణి చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలవనుంది...రెండేళ్ల క్రితమే సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సింగరేణి నిర్వహించిన ఎక్స్టర్నల్ పోస్టుల్లో మహిళా గ్రాడ్యుయేట్ ట్రెయినీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో చేరారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,995కి పెరిగింది. రెస్క్యూ శిక్షణ కోసం మైనింగ్ గ్య్రాడ్యుయేట్ ట్రెయినీలతో ఒక్కో బ్యాచ్కు 14 మంది చొప్పున రెండు బ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.కోలిండియాలోని పలు సంస్థలో ఇప్పటికే మహిళా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సింగరేణిలో జరిగిన ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కోల్ ఇండియాకు చెందిన రెండు మహిళా టీమ్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు జట్లకు పదహారు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్దతులు, గనుల్లో గ్యాస్ ఏర్పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించే విధానం...మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్లో చేరాను’ అంటోంది ఎన్.రక్షిత. ‘కోల్ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీల్లో మా జట్టు సత్తా చూపుతాం’ అంది బి.కళ్యాణి. అందరి మాటల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సాహసానికి ఇంధనం ఆ ఉత్సాహమే కదా!– కాల్వ చంద్రశేఖర్రెడ్డి, సాక్షి, గోదావరిఖనిటఫ్ జాబ్ అంటే ఇష్టం...ఏదో ఒక ఉద్యోగం చేయడం అని కాకుండా టఫ్ జాబ్ చేయడం అంటే మొదటి నుంచి నాకు ఆసక్తి. ఇప్పుడు నా ఉత్సాహానికి తగిన పని దొరికింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో రెస్క్యూ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ మాకు భవిష్యత్లో ఎంతగానో ఉపకరిస్తుంది. – ఎం.లిఖిత, భూపాల్పల్లిఆత్మస్థైర్యం పెంచేలా...మహిళ మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రెస్క్యూ బ్రిగేడియర్ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తోంది.– అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే–11 (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు
‘మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంది.. అనగానే చాలా మంది ‘నేను బాగానే నీరు తాగుతున్నా కదా అంటారు అయితే అది కొందరి అపోహ. నీరు మాత్రమే తాగితే సరిపోదు అని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ఆలివ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.అబ్దుల్ మజిద్ ఖాన్. నగరంలో వాతావరణ మార్పులకు అతీతంగా వేధిస్తున్న డీహైడ్రేషన్ సమస్య గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఎండలు మండే సీజన్లో డీహైడ్రేషన్ సమస్య గురించి తరచూ చర్చిస్తుండటం సహజం.. అయితే కాలాలకు అతీతంగా ఈ డీహైడ్రేషన్కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది అంటున్నారు భాగ్యనగరం వైద్యులు. దీనికి కారణాల్లో తగినంత నీరు తాగకపోవడం ప్రధాన కారణమైతే.. విభిన్న రకాల జీవనశైలి అలవాట్లు కూడా మరో కారణంగా చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరంలో ద్రవనష్టాలకు కారణంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ సిటిజనుల్ని సైలెంట్ డీహైడ్రేషన్కి గురిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు సైతం డీహైడ్రేషన్ ముప్పును తెస్తున్నాయన్నారు. నీరు తాగితే చాలదు.. హైడ్రేషన్ అంటే కోల్పోయిన నీటిని పొందడం మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరం ద్రవాలను మాత్రమే కాకుండా, మరిన్నింటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు. దీనినే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రొలైట్స్, ఎనర్జీ(ఎఫ్ఇఇ) ఈక్వేషన్ అని పిలుస్తారు. ఉక్కపోత నుంచి అతి వ్యాయమం వరకూ.. వీటి వల్ల శరీరం సోడియం, పొటాషియం, మెగ్నిషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను గ్లూకోజ్ను కోల్పోతుంది. గుండె లయ, నరాల సంకేతాలు, కండరాల కదలిక మానసిక ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే కేవలం కోల్పోయిన నీటి భర్తీ వల్ల ఈ సమతుల్యత పునరుద్ధరించడం జరగదు. సాదా నీటిపై మాత్రమే ఆధారపడి ఊరుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఆహారమూ కీలకమే.. మన ఆహారంలో తరచూ ఊరగాయలు, పాపడ్స్ ఉప్పగా ఉండే స్నాక్స్ ఉంటాయి. అవి కూడా ద్రవనష్టానికి దారి తీస్తాయి. కండరాల సంకోచాలు, నరాల పనితీరు హైడ్రేషన్ను నియంత్రించడానికి కీలకమైన ఖనిజం పొటాషియం. మన దేశంలో పోషకాహార ధోరణులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి పొటాషియం లోపం ఉంది. వేసవిలో పొటాషియం, సోడియం అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు, నారింజ లేత కొబ్బరి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను అత్యంత తక్కువగా తీసుకుంటారు. ఐసిఎంఆర్ ప్రకారం, ఈ ఆహారాలు మన ఉత్తమ సహజ వనరులు అని గుర్తించింది. సూచనలు: ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ గ్లూకోజ్. మూడింటి మేళవింపుగా లభించే రెడీ–టు–డ్రింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఆదరణ పొందుతున్నాయి. సరైనవి ఎంచుకోవచ్చు. డీహైడ్రేటింగ్కు కారణమయ్యే టీ, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు, అలాగే ఆల్కహాల్, ఎరేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. డీహైడ్రేషన్ వల్ల కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట లేదా మైకం లాంటివి కలుగుతుంటే విస్మరించవద్దు. వెంటనే లవణాలు గ్లూకోజ్ రెండింటినీ కలిగి ఉన్న హైడ్రేషన్ ద్రావణాన్ని తీసుకోండి విరేచనాలు వంటి తీవ్ర లక్షణాలు లేకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని నిశ్శబ్ద డీహైడ్రేషన్ అని పిలుస్తారు.– డా.అబ్దుల్ మజిద్ ఖాన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఆలివ్ హాస్పిటల్ (చదవండి: '4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!) -
'4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!
ఒత్తిడిని జయించడంఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగంగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్పై భయాలు.. ఐటీ ఉద్యోగాలు కావొచ్చు, తీరికలేని వ్యాపారాలు కావొచ్చు.. జీవితంలో ఇంకేమైనా కారణాలు కావొచ్చు, కానీ ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా మారింది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. దీంతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం పరంగా మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించడానికి పలు థెరపీలు, విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒత్తిడిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మన చేతిలోనే ఉంది.ఒత్తిడిని నియంత్రించే ‘4ఏ మోడల్’.అవాయిడ్ (తగ్గించండి): అవసరం లేని ఒత్తిడికి తలవంచకండి. కొన్ని పనులను ఇతరులకు అప్పగించండి. జీవితంలో అసలైన ప్రాధాన్యతలను గుర్తించి, వాటినే ముందుగా చేయండి. ఇది మనసును చాలా వరకు ప్రశాంతంగా ఉంచుతుంది. అడాప్ట్ (అనుకూలించండి): ప్రస్తుత పరిస్థితులను మారుస్తూ, సరికొత్తగా ఆలోచించండి. అంచనాలను ఆచరణీయంగా మార్చుకోండి. నెగటివ్ ఆలోచనల్ని పాజిటివ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకోండి. ప్రతి సమస్యలో పాఠం ఉంటుంది. దాన్ని గుర్తించి సమన్వయంగా ముందుకు సాగండి. ఆల్టర్(మార్పు తీసుకోండి): మీ అవసరాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ప్రతి పనిని చిన్నచిన్న దశల్లో విడదీసి చేయండి. సమస్యలు వచి్చనప్పుడు వాటిని తొలగించే మార్గాలు వెతకండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. యాక్సెప్ట్ (అంగీకరించండి): కొన్ని విషయాలను మనం మార్చలేం. అలాంటి వాటిని అంగీకరించడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. గతాన్ని మర్చిపోండి. ప్రతి సవాల్లో అభివృద్ధికి అవకాశం ఉందని తెలుసుకోండి. ఒత్తిడి పెరుగుతోంది అంటే భయపడాల్సిన అవసరం లేదుం దానిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి ఇచ్చే మార్గాల్ని అన్వేషించడం ఈ తరానికి చాలా అవసరమని నిపుణుల మాట. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే ‘4 ఏ మోడల్’ (అవాయిడ్, అడాప్ట్, ఆల్టర్, యాక్సెప్ట్), ‘6 ప్రాక్టికల్ టెక్నిక్స్’ బాగా ఉపయోగపడుతున్నాయి. శ్వాస వ్యాయామాలు, డిజిటల్ డిటాక్స్, మానసిక దృక్పథం మార్పు వంటి చిట్కాలతో మనశ్శాంతి ఎలా పొందాలో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించేందుకు 6 మార్గాలు.. 4–7–8 బ్రీత్ టెక్నిక్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి, 7 సెకన్లు ఆపండి, 8 సెకన్లకు మెల్లగా విడిచిపెట్టండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్: ఒత్తడికి లోనైన కండరాలను గట్టిగా పట్టుకుని మెల్లగా విడవండి. శరీరమంతా రిలాక్స్ అవుతుంది. మెల్ రాబిన్స్ 5 సెకండ్ రూల్: ఒక నిర్ణయం తీసుకునే ముందు 5 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీని వల్ల ఆలస్యం కారణంగా వచ్చే ఒత్తిడిని నివారించవచ్చు. డిజిటల్ డిటాక్స్: రోజులో కొన్ని గంటలు స్క్రీన్లను పూర్తిగా దూరం పెట్టండి. ప్రత్యేకించి రాత్రి పూట ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టడం ద్వారా మెదడు విశ్రాంతి పొందుతుంది. ఏబీసీ టెక్నిక్: ఒత్తిడికి కారణమైన సందర్భాన్ని, దానిపై మన నమ్మకాలను, దాని పరిణామాలను విశ్లేషించండి. ఇందులోని అవాస్తవ పరిస్థితులను మానసికంగా వదిలేయండి. బాక్స్ బ్రీథింగ్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి. నాలుగు సెకన్లు ఆపి వదలాలి. మరో నాలుగు సెకన్ల సమయం తరువాత ఈ పద్ధతిని మళ్లీ కొనసాగించాలి. మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థితి స్థిరంగా ఉంటుంది. (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!
ఒక పనిలో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం. సాధించాలనే కసితో పనిపై దృష్టి పెడితే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా కాన్సెంట్రేషన్ పెంచుకోవడం ఎలాగో చూద్దాం. ఒత్తిడికి ఆందోళనకు దూరంగా ఉండాలి.ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.పని, ప్రాజెక్ట్, లేదా కొత్తగా నేర్చుకోవాలనుకున్నపుడు పనికి ప్రణాళిక అవసరం. పనిని చిన్న భాగాలుగా విభజించి, ఒక్కొక్కటిగా దృష్టి పెట్టాలి.ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పని చేయడానికి కేటాయించండి.ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరంగా ఉండండి. కనీసం ఫోన్ను, నోటిఫికేషన్లను మ్యూట్లో పెట్టేయండి. బాగా అలసిపోయినప్పుడు, చిన్న విరామాలు తీసుకోండి. మెడిటేషన్ చేయండి.సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం నిపుణుల సలహాలను తీసుకోండి. అడగడానికి ఏ మాత్రం సంకోచించకండి.మీరు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారంటే, దాని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని:అధిక ఒత్తిడి లేదా ఆందోళన మీ మెదడును గందరగోళంగా మార్చేస్తాయి. కాన్ సంట్రేషన్ కుదరదు.ఎక్కువ అలిసిపోయినా మెదడు చురుకుగా పనిచేయదుచుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, ఏకాగ్రతకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. చుట్టూ ఉన్న శబ్దాలు లేదా ఇతర విషయాలు మిమ్మల్ని సులభంగా పరధ్యానంలోకి నెట్టేయవచ్చు. పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్న విజయం సాధించడం తధ్యం. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏకాగ్రత నిలపలేక పోవడానికి కారణం కావచ్చు. ఉదాహరణకు, దృష్టి లోపం, లేదా ADHD వంటివి.ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం. -
అమ్మాయిలూ.. బహుపరాక్!
వివాహం అంటే నూరేళ్ల పంట. తమ పిల్లలు నిండు నూరేళ్లు ఆనందదాయకమైన జీవితం గడపాలని ఇరు కుటుంబాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల గురించి ఆరాలు తీస్తారు. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండి, ఆ కుటుంబానికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నట్లయితే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఈ ఇంటర్నెట్ జమానాలో ఇవి మాత్రమే సరిపోదని అంటోంది ఓ అమ్మాయి. ఆ యువతి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిది మంచి ఉద్యోగం. మంచి కుటుంబ నేపథ్యం. అందుకే ఇంట్లో వాళ్లు నన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. అయితే అతడి గురించి కుణ్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. నా స్నేహితుడి ఐడీతో ఆన్లైన్లో అతనితో చాట్ చేశా. అలా.. సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్ల ద్వారా అతను వ్యవహరించే తీరు బయటపడింది. అతని తీరు నన్ను కంగుతినేలా చేసింది. కాబోయేవాడు మంచి సంపాదనపరుడైతే చాలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అయినా కూడా సరిపోదు. అంతరంగికంగా అతడి తీరు ఎలా ఉంటుందనే చెప్పి డిజిటల్ తనిఖీలు కూడా అత్యంత ముఖ్యమే. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని నా కుటుంబ సభ్యులకు వివరించి చెప్పా. అతనితో నా పెళ్లి రద్దు చేయించుకున్నా అని ఆమె ఆ పోస్టులో వివరించింది. అందువల్ల.. అమ్మాయిలూ బహుపరాక్. పెద్దలు కుదిర్చిన సంబంధాలపై గౌరవం ఉంటే సరిపోదు. నిండు నూరేళ్ల సంతోషంగా ఉండాలంటే అతని డబ్బు, స్టేటస్ కంటే అతడి వ్యక్తిత్వాన్ని బయటపెట్టే డిజిటిల్ తనిఖీ అనేది ఈ కాలంలో అత్యంత ముఖ్యం. అంటూ ఆ యువతి పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఈరోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినవాళ్లతోనే, బంధువులతోనో అయిపోతోంది. కానీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ తరహా విచారణలోనూ మార్పులు కూడా తప్పనిసరి అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. సోషల్ మాధ్యమాల పరంగా అబ్బాయి మంచోడు అనుకుంటేనే.. పెళ్లికి సుముఖత చూపాలని, లేదంటే వద్దని సూచిస్తోంది ఆ అమ్మాయి. డిజిటల్ తనిఖీలు కూడా ముఖ్యమే అని మరో యువతి వ్యాఖ్యానించింది. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!) -
భాగ్యనగరంలో మధ్యధరా-ఆసియా రుచులు..
భాగ్యనగరానికి మధ్యధరా–ఆసియా ఫ్లేవర్లను తీసుకొచ్చేందుకు ‘కైమా’ రెస్టారెంట్ ఆరంభమైంది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని సత్వా నాలెడ్జి పార్కులో నగరంలో మొదటి సారిగా కైమా రెస్టారెంట్ మంగళవారం ప్రారంభించారు. మొదటి కైమా రెస్టారెంట్ ముంబయిలోనూ, రెండో రెస్టారెంట్ పుణెలోనూ, మూడో రెస్టారెంట్ను హైదరాబాద్ నాలెడ్జి సిటీలోనూ ఏర్పాటు చేయడం విశేషం. సహజసిద్ధమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా రాళ్లు, బంకమట్టితో నిర్మించిన గోడలను తలపించే రీతిలో యాంబియన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. టెర్రకోట, గిరిజన మూలాంశాలలోని కథలను వివరించేలా ఆకర్షణీయమైన అలంకరణతో, అబ్బురపరిచే లైటింగ్ ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ యజమానులు నిఖితాపూజారి, అంకితాపూజారి, నారాయణ్ పూజారి, మేనేజింగ్ పార్ట్నర్ నిఖిల్ రోచ్లాని, చెఫ్లతో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం విభిన్న నగరమే కాకుండా వివిధ రకాల రుచులను ఆస్వాదించే ప్రజలకు అందుబాటులో ఉండేలా తమ కైమా రెస్టారెంట్ ఏర్పాటు చేశామని యాజమాన్యం తెలిపింది. ప్రత్యేకమైన వంటకాలతో.. కైమా రెస్టారెంట్లో వివిధ దేశాల సంప్రదాయ వంటకాలను ఆసియా రుచులతో అనుసంధానించేలా ఏర్పాటు చేశారు. నగరవాసులకు ప్రాన్స్రూబియాన్, చికెన్షిఫ్ తవూక్, ఈజిప్షియన్ కోషారీ, సిగ్నేచర్ క్లాసిక్ లెబ్నెహ్ షగ్, కాటేజ్ చీజ్ పాకెట్స్ వంటి వాటిని ఆహారప్రియులైన నగరవాసులు ఆస్వాదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆసియన్ వంటకాల్లో కిమ్చి–జ్జిగే సూప్, తాజా రుచికరమైన ట్రిపుల్–ఇ స్పినాచ్ ఆస్పరాగస్ సలాడ్, సిట్రస్–ఫార్వర్డ్ సాల్మన్ టిరాడిటో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ట్రిపుల్–ఇ ఎడామామ్ మనీ బ్యాగ్, గొర్రె లేదా జాక్ఫ్రూట్తో మసాలా రెండాంగ్ గ్యోజా, బోల్డ్ స్పైసీ మష్రూమ్ చెయుంగ్ఫాంగ్, ఇటాలియానో సాల్మన్ రోల్, క్వినోవా అవోకాడో రోల్ వంటి సుషీ వెరైటీలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు సాల్మన్ టామ్యమ్, చిలగడ దుంప– వాసబిమాష్, స్మోకీ–స్వీట్ లాంబ్ చాప్ బుల్గోగి, సామ్జియోప్సల్ ప్లాటర్ వంటి ప్రధాన వంటకాలు, బక్లావా చీజ్కేక్ నుంచి సుగంధ సాఫ్రాన్ మిల్క్ కేక్, కునాఫా వంటివి కూడా ఆహారప్రియులను అలరించనున్నాయి. (చదవండి: ' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!) -
' పచ్చందనమే పచ్చదనమే..' ఇంట్లోకి తెచ్చేద్దాం ఇలా..!
మెల్లి మెల్లిగా వర్షాలు పడటంతో నగరంలో చల్లదనపు వాతావరణం ఆవరించుకుంటోంది. గాలి తేమతో నిండిపోయి, ప్రకృతి కళగా మారిన ఈ సమయంలో నగరవాసులు వారి ఇళ్లకు, అపార్ట్మెంట్లకు, మిద్దెలకు ఆకుపచ్చ అందాన్ని అద్దేందుకు సంసిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు ఇది అత్యుత్తమ కాలం కావడం, అదే సమయంలో గ్రీన్ లివింగ్ పై నగరవాసుల్లో పెరిగిన ఆసక్తి వర్షాకాలాన్ని సరైన సమయంగా మార్చుతోంది. ఇంట్లో చిన్నదైనా సరే.. ఒక గ్రీన్ కార్నర్ ఉంటే, అది మన మూడ్కు, ఆరోగ్యానికి, జీవనశైలికి నూతన శోభను తీసుకురాగలదు. మొక్కలతో బంధాన్ని పెంచుకుంటే ఈ బీజీ లైఫ్లో కాసింతైనా ఉపశమనం లభిస్తుందని నగరవాసుల అభిలాష. ఈ నేపథ్యంలో మొక్కల ప్రేమికులు నర్సరీల బాట పడుతుంటే, మరికొందరు ఆన్లైన్లో ఆర్డర్స్ పెడుతున్నారు. గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, ఇంటీరియర్ ప్లాంటేషన్ వంటి అభిరుచి గణనీయంగా పెరిగాయి. పని ఒత్తిడిని తేలికపరచడానికి,ఇంట్లోకి ప్రకృతి పారవశ్యాన్ని తీసుకురావడానికి మొక్కలు సరైన ఎంపికగా మారాయి. ఇది ఒక హాబీ అనడం కన్నా.. ఓ నూతన జీవన శైలిలో భాగంగా మారిందనడం సరైనదేమో. ప్లాంట్ థెరపీ అనే ట్రెండ్ ఇప్పుడు మెట్రో లైఫ్ స్టైల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. నర్సరీల్లో సందడి.. ఈ వర్షాకాలంలో హకీంపేట్, బేగంపేట్, ఖాజాగూడ, కొంపల్లి, బాచుపల్లి, అమీర్పేట్, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో నర్సరీలు రద్దీగా మారాయి. అంతేకాదు, పాతబస్తీ నుంచీ కొత్తబస్తీ వరకూ పూల మొక్కలతో పాటు డెకరేటివ్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, కూల్ ఎయిర్ ప్లాంట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ సీజన్లో డిమాండ్ పెరగడంతో నర్సరీ యజమానులు ఎక్కువగా మొక్కలను దిగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా కడియం (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు, పుణె వంటి గార్డెనింగ్ మార్కెట్ల నుంచి నగరానికి మొక్కలు ఎక్కువగా వస్తుండటమే కాకుండా కొన్నింటి ధరలు గణనీయంగా పెరిగాయి. అయినా సరే, మొక్కలపై ఉన్న ప్రేమ ముందు ధరలు విషయమే కాదనుకుంటున్నారు ప్లాంట్ లవర్స్. హైదరాబాద్ మహా నగరంలో ఏడాదంతా అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ.. ఈ సీజన్లో ఎక్కువగా అమ్ముడుపోయే మొక్కలే తమకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయని కూకట్పల్లికి చెందిన నర్సరీ నిర్వాహకులు వేణుమాధవ్ తెలిపారు. బిజీ లైఫ్.. ఆన్లైన్ ఆర్డర్స్.. బిజీ లైఫ్లో మొక్కలు కొనడానికి సమయం లేనివారు ఇప్పుడు మొక్కలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఉగావో, నర్సరీలీవ్, మైబాగీచ, అమెజాన్, బిగ్బాస్కేట్, గార్డెనింగ్ స్టోర్, అర్బన్ మాలి వంటి ప్లాట్ఫాంల ద్వారా నేరుగా ఇంటి వద్దకే మొక్కలు డెలివరీ అవుతున్నాయి. కొంత మేరకు ఖర్చు ఎక్కువైనా, బ్రాండెడ్ ప్లాంట్ ప్యాకేజింగ్, ఎలా నాటాలి–పెంచాలనే సూచనలు, పెంపకం టిప్స్ ఇవ్వడం వల్ల కొనుగోలు ధోరణి పెరుగుతోంది. జీవనశైలిగా మారిన పచ్చదనం.. కేవలం అందం కోసమే కాక, కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా, ఇంట్లో మంచి హ్యుమిడిటీకి, ఆక్సిజన్ సరఫరాకు మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గ్రీన్ ఇంటీరియర్ డిజైనింగ్, బాల్కనీ గార్డెనింగ్, వాల్స్పై వరి్టకల్ గార్డెన్, వాటర్ సేవింగ్ ప్లాంటేషన్ వంటి కాన్సెప్ట్లు పెరుగుతున్నాయి. ట్రెండింగ్ ప్లాంట్స్.. ఇండోర్ డెకోరేటివ్ ప్లాంట్స్– మోన్సె్టరా, పీలియా, స్నేక్ ప్లాంట్, జెడ్ ప్లాంట్–పూల మొక్కలు–బోగన్విల్లా, రోసెస్, లిల్లీస్, హైబిస్కస్, హెల్కోనియా –ఔషధ మొక్కలు–తులసి, అశ్వగంధ, మఠి, అలోవెరా–ఫ్రూట్ ప్లాంట్స్–జామ, నేరేడు, మామిడి, లిచి, సీతాఫలం వంటి మొక్కలు ప్రస్తుతం ట్రెండింగ్ ప్లాంట్స్గా ఉన్నాయి. ఇంటింటా.. మిద్దె పంట.. నగరంలో ప్రధానంగా ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వారు మిద్దె పంటలకు పెద్దపీట వేస్తున్నారు. ఇంటికి సరిపడా కూరగాయలు, పూలను పెంచుకోవడంతో పాటు పచ్చదనాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా టమాట, బీర, దోస, కీరా, మునగ, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకుంటూ ఆరోగ్యాన్ని చక్కబెడుతున్నారు. (చదవండి: శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!) -
శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!
నగరంలో ఫుడీస్, ఫుడ్ లవర్స్, భోజనప్రియులు.. పేరేదైనా కానీ.. విభిన్న వంటకాలు ఆస్వాదించేవారు పెరుగుతున్నారు. మరోవైపు రెస్టారెంట్స్లో మాత్రమే కాదు సంపన్నుల బఫే డిన్నర్స్లోనూ, పారీ్టస్లోనూ విభిన్న రకాల విదేశీ రుచుల వడ్డన సర్వసాధారణం అయ్యింది. అయితే కంటికి ఇంపైనంత మాత్రాన ఇంటికి ఇంపు కావాలని లేనట్టే, నోటికి ఇంపుగా అనిపించినంత మాత్రాన శరీరానికి ఇంపు కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రుచుల వేట సాగించేవాళ్లు ముందస్తుగా ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సాధారణంగా మనుషులు తినకూడని ఆహారాలు మనకి తెలుసు. తినదగినవీ తెలుసు. కానీ కొందరికి మాత్రమే తినదగినవి, కొందరు తినకూడనివి కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా కొన్నిసార్లు అస్వస్థతకు కారణమవుతాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలు, చర్మం మీద ర్యాషెస్, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అయితే ఎటువంటి ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందో గుర్తించడం చాలా కష్టం. అనేక సందర్భాల్లో ఈ లక్షణాలు ఆహారం తిన్న కొన్ని గంటల తరువాత మాత్రమే బయటపడతాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ అలర్జీ.. లక్షణాలు ఇలా.. ఆహారం పడకపోవడం వల్ల మొదటిగా చర్మంపై పొక్కులు, ఎర్రని దద్దుర్లు, నొప్పులు రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో మొదటి లక్షణంగా చర్మంపై ర్యాష్ కనిపిస్తుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, ముక్కు పొంగడం వంటి సమస్యలు కలగవచ్చు. జీర్ణ వ్యవస్థపై దాడితో.. నాలుక ఉబ్బిపోవడం, బొజ్జ నొప్పి, నోటిలో మెటాలిక్ రుచి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనాఫిలాక్టిక్ షాక్ అనే తీవ్ర పరిస్థితి ఏర్పడినప్పుడు వేగంగా నాడీ స్పందన, పెదవులు, గొంతు ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా కనిపించడం, మూర్ఛ వంటివి కూడా రావచ్చు.నప్పనివి ఏమిటి? సాధారణంగా నప్పని ఆహారాల్లో పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, షెల్ ఫిష్, పీనట్స్, వాల్నట్, ఆల్మండ్, కాజు, పీకాన్ వంటి డ్రై ఫ్రూట్స్.. అయితే ఇవి నప్పకపోవడానికి వాటిలో ఉండే కొన్ని ఉపపదార్థాలు కూడా కారణమే. ఉదాహరణకు పాలలో ఉండే లాక్టోజ్ అనే ఒక రకమైన తియ్యటి పదార్థం, గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్, ఫుడ్ ఫ్లేవర్ పెంచడానికి ఉపయోగించే ఎంఎస్జీ అనే పదార్థం.. ఇలా.. కొన్ని సందర్భాల్లో అతి తక్కువ మోతాదులో ఈ ఆహారాలను తీసుకున్నా తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అలాగే మనకు ఏ మాత్రం పరిచయం లేని వంటకాల్లో ఏయే దినుసులు కలుపుతున్నారో వాటిలో ఏవి మనకు నప్పవో తెలీదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఆహారం.. అసహనం.. మన శరీరానికి హానికరం కాని ఆహారాలను హానికరమైన వైరస్లా గుర్తించి స్పందించే స్థితి కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు చిన్నపాటి జీర్ణ సమస్యలుగా ఉంటే, మరికొన్నిసార్లు అనాఫిలాక్టిక్ షాక్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు దీని ప్రభావానికి లోనవుతున్నారు. చాలామంది పిల్లలు పెద్దయ్యాక ఈ అసహనాన్ని సహనంగా మార్చుకోగలుగుతారు. కానీ కొందరు మాత్రం కొన్నింటిని నప్పేలా చేసుకుంటారు కొన్నింటి పట్ల అసహనాన్ని కొనసాగిస్తారు. ఫుడ్ అలర్జీ పరీక్షలు.. ఎలా? ఎక్కడ? అనుమానాస్పద ఆహారాన్ని స్వల్పంగా ప్రయోగించి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడాన్ని ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. అలాగే అనుమానాస్పద ఆహారాలను పూర్తిగా ఆపి, తర్వాత ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలో చేర్చడాన్ని ఎలిమినేషన్ డైట్, ఆహారాన్ని చర్మంపై ఉంచి సూదితో తక్కువగా గుచ్చి చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్, రక్తంలో ఐజీఇ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది పరీక్షించడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నగరంలో థైరోకేర్, మై డయాగ్నోస్టిక్స్, డీఎన్ఎ ల్యాబ్స్ ఇండియా, రెడ్ క్లిఫ్ ల్యాబ్స్, ల్యూసిడ్.. వంటి చోట్ల ఈ పరీక్షలు చేస్తున్నారు. కనీసం 200 రకాలు.. ఆ పైన అలర్జీలను గుర్తించేందుకు చేసే పరీక్షల వ్యయం కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుంది. (చదవండి: ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..) -
షారూఖ్ను మించిపోయేలా, మహేష్ టేస్ట్ అండ్ స్టైల్ : ధర రూ. 8 కోట్లు!
సెలబ్రిటీలు, సినీ స్టార్ల జీవనశైలి విలాసవంతంగా ఉంటుంది. వారునివసించే బంగ్లాలు, వారిదుస్తులు ఫ్యాషన్ స్టైల్, లగ్జరీ కార్లు ఇలా ప్రతీది స్పెషల్ ఎట్రాక్షన్గానేఉంటుంది. తాజాగా టాలీవుడ్ సూపర్హీరో, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu ) కోట్ల విలువైన విలాసవంతమైన వానిటీ వ్యాన్ నెట్టింట్ హాట్టాపిక్గా నిలుస్తోంది. మరింకెందుకు ఆలస్యం ..ఆ వివరాలేంటో తెలుసుకుందాం.తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు మహేష్బాబు. అలనాటి సూపర్ స్టార్, దివంగత ఘట్టమనేని కృష్ణ నటవారుసుడిగ బాల్యంలోనే సత్తా చాటుకున్న నటుడు మహేష్ బాబు. అందమైన రూపం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నటనతో తిరుగులేని హీరోగా ఎదిగాడు. వయసు పెరుగుతున్నా మరింత అందంగా, స్మార్ట్గా తయారవుతూ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్న హీరో. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా పలు బ్రాండ్లకు అంబాసిడర్గా సంపాదన కూడా తక్కువేమీ కాదు. తన స్టార్డంకు తగ్గట్టుగానే ఖరీదైన అభిరుచులకు కూడా పాపులర్. సొగసైన కార్లతో నిండిన గ్యారేజ్, ప్రైవేట్ జెట్ . హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఒక భారీ ఇల్లు అతని సొంతం. వీటిన్నిటి కంటే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహేష్ కారవాన్. ఇది బాలీవుడ్ షారుఖ్ ఖాన్ వోల్వో 9BR కంటే ఖరీదైనదిగా తెలుస్తోంది.ఒక ప్రకటన షూటింగ్ సమయంలో నటుడు దానిని తీసుకువచ్చినప్పుడు మహేష్ బాబు వానిటీ వ్యాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రిన్స్ వ్యక్తిగత అభిరుచి, స్టైల్కు తగ్గట్టు ఈ విలాసవంతమైన వాహనాన్ని పూణేకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ DC ద్వారా పూర్తిగా కస్టమైజ్ చేశారట. మహేష్ బాబు క్యారవాన్ ధర దాదాపు రూ. 6 కోట్లు అని పింక్ విల్లా కథనం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు హై-ఎండ్ కస్టమైజేషన్కు మరో రూ. 2 కోట్లు అదనం. సో.. వానిటీ వ్యాన్ ధర రూ. 8 కోట్లు అన్నమాట.మహేష్ బాబు కారవాన్ ఫీచర్స్ఇందులో ఒక లగ్జరీ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ను ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా మీటింగ్ రూమ్గా సులభంగా మార్చవచ్చు. ఒక మినీ కిచెన్ కూడా ఉంది, వేడి మరియు చల్లటి నీటి సరఫరా రెండూ అందుబాటులో ఉన్న వాష్రూమ్, క్లైనింగ్ సీట్లు, భారీ టీవీ, ఇంపోర్టెడ్ లగ్జరీ లైట్లు , స్పీకర్లతో కూడిన హోం థియేటర్తో పాటు ఇతర సకల సదుపాయాలున్నాయట.రూ. 8 కోట్ల ధరలో, టాలీవుడ్ స్టార్ కారవ్యాన్ ఒక విలాసవంతమైన ఇంటికంటే తక్కువేమీ కాదు.షారుఖ్ ఖాన్ వోల్వో వ్యాన్ కంటే ఖరీదైనది బాలీవుడ్ కింగ్' కంటే ‘టాలీవుడ్ ప్రిన్స్’ క్యారవాన్ అత్యాధునిక వానిటీ వ్యాన్ అని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ గతంలో అత్యంత ఖరీదైన వానిటీ వ్యాన్ కలిగి ఉన్న నటుడిగా పేరుగాంచాడు. దీని ధర రూ. 4-5 కోట్లు, నివేదికల ప్రకారం,అయితే, ఇప్పుడు మహేష్ బాబు అతన్ని అధిగమించి జాబితాలో ఈ స్థానాన్ని ఆక్రమించాడు.మహేష్ బాబు మోడల్ , నటి నమ్రతా శిరోద్కర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు గౌతమ్, సితార ఉన్నారు. తండ్రికి తగ్గ తనయగా సితార, ఎంచుకున్న రంగంలో గౌతమ్ రాణిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ( SSMB29) మహేష్ బాబు- ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఈ చిత్రం 2027 లో విడుదల కానుందని అంచనా.ఇదీ చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్గా అఖిల్ అర్థాంగి -
ఆర్టీ‘షీ’ డ్రైవర్!
ఆటో డ్రైవర్గా తండా గతుకుల రోడ్డు మీద ప్రయాణం ప్రారంభించిన సరిత నాయక్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ సవాళ్లకు భయపడి ఉంటే... తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా ప్రత్యేకత సాధించేది కాదు.సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరిత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ బాధ్యతలు భుజాలకెత్తుకుంది. అక్క భర్త దేవరకొండలో ఆటోడ్రైవర్. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఆటో నడపడం నేర్చుకుంది సరిత. బావకు విశ్రాంతి ఇచ్చి తానే ఆటో నడిపేది. తోటి డ్రైవర్లు రకరకాల ఇబ్బందులు పెట్టేవాళ్లు. ఆటోకు పంక్చర్లు చేయ్యడం, బ్రేక్డౌన్ చేసి ఇబ్బందులకు గురి చేసేవారు.అన్ని ఇబ్బందులు తట్టుకుంటూ మూడు సంవత్సరాల పాటు అక్కడే ఆటో నడిపింది. ఆ తరువాత ఆసుపత్రిలో నర్సుగా పని చేయడానికి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్ళింది. హోలి మేరీ నర్సింగ్ కాలేజిలో చేరడానికి ప్రయత్నం చేసినప్పటికి ఫీజు కట్టే స్థోమత లేక అదే కాలేజిలో వార్డెన్ ఉద్యోగంలో చేరింది. వార్డెన్ గా పనిచేస్తునే హెవీ డ్రైవింగ్ స్కూల్లో బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. అదే కాలేజీలోనే బస్ డ్రైవర్గా పనిచేసింది.తండా టు దిల్లీహెవీ వెహికిల్ నడపడంలో సరిత నైపుణ్యం ఆజాద్ ఫౌండేషన్ ప్రతినిధి భానుశ్రీ దృష్టికి వచ్చింది. ఆమె సరితకు తమ సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చింది. ‘సఖీ క్యాబ్స్’ పేరుతో వంద మంది మహిళా డ్రైవర్లతో క్యాబ్స్ నడుపుతోంది ఆజాద్ ఫౌండేషన్. దిల్లీలో క్యాబ్ డ్రైవర్గా కొత్త జీవితం ప్రారంభించిన సరిత, ఫౌండేషన్ ఇచ్చిన శిక్షణతో హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషలలో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంది. దిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో మహిళా డ్రైవర్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుంది. అన్ని పరీక్షలలో నెగ్గి ఆ ఉద్యోగానికి ఎంపిక అయింది.తెలంగాణ ఆర్టీసీ గతంలో మహిళ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన్నప్పటికీ ఎవరూ దరఖాస్తు చేయ్యలేదు. సరిత ఆర్టీసీలో బస్సు డ్రైవర్గా చేరడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళ డ్రైవర్గా ప్రత్యేకత సాధించింది. – తడకమళ్ళ శ్రీధర్, సాక్షి, సంస్థాన్ నారాయణపురంఅమ్మా,నాన్నల కోసం...దిల్లీలో ఉద్యోగం వదిలిపెట్టి అమ్మ,నాన్నల కోసం హైదరాబాద్కు వచ్చాను. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా గుర్తింపు లభించినందుకు గర్వంగా ఉంది. నేను ప్రయాణించిన దారిలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.– సరిత నాయక్ -
130 కిలోల అధిక బరువు..ఎన్నాళ్లో బతకదన్నారు..! కట్చేస్తే..
అధిక బరువు సమస్య అనేది అలాంటి ఇలాంటిది కాదు. వచ్చిందంటే తగ్గదు.. అన్నంతగా వేధిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. స్లిమ్గా మారాలి, ఆరోగ్యకరంగా ఉండాలనే స్ట్రాంగ్ మైండ్సైట్తో శరీరంపై ఫోకస్ పెట్టి తగ్గినవారెందరో ఉన్నారు. అదే సమయంలో సత్ఫలితాలను పొందలేక ఢీలా పడ్డవాళ్లు కూడా ఉన్నారు. కొన్నిసార్లు మనం సిన్సియర్గా బరువు తగ్గాలని చేసిన ప్రయత్నాలన్ని అస్సలు వర్కౌట్ కావు. అసలు అలా ఎందుకు జరుగుతుందన్నది క్షణ్ణంగా ఆలోచిస్తేనే..అధిక బరువు సమస్య నుంచి బయటపడగలం లేదంటే అంతే సంగతులు. అచ్చం అలానే చేసింది ఈ 53 ఏళ్ల సారా జేన్ క్లార్క్. ఆమె ఎంత బరువు ఉండేది తెలిస్తే విస్తుపోతారు. ఆమెలాంటి వాళ్లు తగ్గాలంటే బరువు తగ్గించే ఇంజెక్షన్ల సాయంతోనే సాధ్యం. కానీ ఆమె వాటి జోలికి పోకుండానే బరువు తగ్గి చూపించింది. ఎలాగంటే..?..సారా జేన్ క్లార్క్ టీనేజ్ వయసులోనే 130 కిలోల అధిక బరువుతో బాధపడేది. ఆమె ఉదయం క్యాడ్బరీ చాక్లెట్లు, కోకా కోలాతో మొదలయ్యేది. చక్కెర లేని పదార్థాలను ముట్టుకునేదే కాదు. అంతలా స్వీట్లకు బానిసైంది. అయితే కాలేజ్లో ఆమె స్నేహితులంతా నువ్వు లావుగా లేకపోతే ఎంతో అందంగా ఉండేదానివి అన్న మాటలు సారాను విపరీతంగా బాధించేవి. 25 ఏళ్లేక మరింత లావైపోయి..పీరియడ్స్ ఆగిపోయి వృద్ధాప్యానికి చేరువైన వ్యక్తుల మాదిరిగా ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. సారా పరిస్థితిని చూసి వైద్యులు కనీసం 40 ఏళ్లు వచ్చే వరకు కూడా బతకడం కష్టమే అని చెప్పేశారు. ఆ మాటలే ఆమెపై పవర్ఫుల్ మంత్రంలా పనిచేశాయి. అప్పడే ఆమె ఎలాంటి క్రాష్ డైట్..వెయిట్ లాస్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లకుండానే బరువు తగ్గి చూపించాలని స్ట్రాంగ్గాఐదు నియమాలు..రోజూ 30 నిమిషాల నడక, అధికంగా నీరు తీసుకోవడం. అలాగే ఎలాంటి ఆర్డర్లు వేయకుండా అన్ని పనులు చేసుకోవడంప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించడంతీసుకునే ఆహారంలో అధికంగా ఫుడ్ ఉన్నట్లయితే అస్సలు ముట్టుకోకుండా ఉండటంబరువు తగ్గే క్రమంలో ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేలా మైండ్సైట్లో మార్పుకాలక్రమేణ ఈ రూల్స్ అద్భుతమైన ఫలితాలను అందుకునేలా చేసి కేవలం 16 నెలల్లో..అనూమ్యంగా 44 కిలోల బరువు తగ్గిపోయింది. అందంగా మారడమే గాక ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు సంతరించుకున్నాయి. ఆ తర్వాత పెళ్లై ఇద్దరు పిల్లులు పుట్టాక కూడా..అదే పద్ధతిని కొనసాగించింది. అలా సారా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి ఎల్ సైజ్తో స్లిమ్గా మారిపోయింది. పైగా తన 40వ పుట్టిన రోజుని గ్రాండ్గా జరుపుకుంది కూడా. అంతేగాదు ఆరోగ్య స్ప్రూహను కొనసాగిస్తూ..అందరికి అవగాహన కల్పించేలా 5K రన్ వంటి మారథాన్లలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె 62 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది.అలా చేస్తే మనకు మనం నచ్చం..బరువు తగ్గించే ఇంజెక్షన్ల క్రేజ్ ఉన్నా..వాటిపట్ల జాగ్రత్త వహించాలంటోంది. ఇంజెక్ట్ చేసుకుని మనల్ని మనం ఎలా ప్రేమించుకోగలం. బరువు తగ్గాకా.. అబ్బా స్లిమ్గా మారిపోయే అనే గొప్ప అనుభూతి కలుగుతుందా..? అని ప్రశ్నిస్తోంది. ఆరోగ్యకరమైన నియమాలను మనకు సాధ్యమైనవి ఎంపిక చేసుకుని తూచా తప్పకుండా పాటించండి చాలు..అద్భుతాలు సృష్టించొచ్చు అని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Sarah Jane Clark (@stepbystepwithsarahjaneinsta) (చదవండి: లావణ్య బెల్లీ డ్యాన్స్కు..నటి ప్రియాంక చోప్రా సైతం ఫిదా..) -
ప్రపంచం మెచ్చిన మన ప్రాంతీయ స్వీట్స్ ఇవే..!
భారతదేశం అనేక శతాబ్దాలుగా విభిన్న వంటకాలకు పేరొందింది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన మిఠాయిలకు కూడా మనం కేరాఫ్గా ఉన్నాం. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇప్పుడు ఆయా వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తోంది. దాంతో వీటికి నకిలీలు పుట్టుకురాకుండా పలు స్వీట్స్కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ ఇచ్చారు. ఈ ట్యాగ్ ప్రత్యేక ప్రాంతానికి చెందిన, అక్కడి పద్ధతుల్లో తయారయ్యే సంప్రదాయ మిఠాయిలను పరిరక్షించడంతో పాటు గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపును ఈ ట్యాగ్ తెచ్చిపెడుతుంది. మన తిరుపతి లడ్డూ గొప్పతనం తెలిసిందే. అవి కాకుండా ప్రస్తుతం అలాంటి గుర్తింపు పొందిన గ్లోబల్ స్వీట్స్.. వాటి మూలాల గురించి తెలుసుకోవాలంటే... దార్వాడ్ పేడ, కర్ణాటక రాష్ట్రపు సంప్రదాయ స్వీట్. చిక్కటి పాలతో దీని తయారీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఎర్రనిరంగులో ఉండే ఉత్తరప్రదేశ్ బనారస్ లాల్ పేడకు ఆ రంగు రావడానికి కారణం వండే శైలి అట. వారణాసి మూలాలు కలిగిన ఈ స్వీట్ పాలపిండి, పప్పులు, సీడ్స్ మేలు కలయిక. ఇక మనకూ బాగా పరిచయమైన బెంగాల్ రసగుల్లా కూడా జిఐ ట్యాగ్ అందుకుంది. చక్కెర పాకంలో ముంచిన సున్నితంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్. పశ్చిమ బెంగాల్కి చెందింది. అలాగే ఒడిశాకు చెందిన మరో రకం రసగుల్లాకి కూడా జిఐ ట్యాగ్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాను ప్రపంచ పటంలో నిలబెట్టిన ‘‘పేపర్ స్వీట్’’ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆకర్షిస్తోంది. ఈ ఆత్రేయపురం పూత రేకులు కూడా జిఐ ట్యాగ్ను పొందాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంకు చెందిన బందరు లడ్డు.. కూడా ఈ గుర్తింపును అందుకుంది. కొబ్బరిపాలు, గుడ్లు తదితరాలను మేళశించి చేసే గోవన్ బెబింకా అనే గోవా స్వీట్ 16 పొరలతో తీయటి అనుభూతులు పంచుతూ ప్రపంచవ్యాప్త గుర్తింపునూ జిఐ ట్యాగ్ను దక్కించుకుంది. గోధుమ పిండి, నెయ్యి, బెల్లంతో తయారయ్యే తమిళనాడుకు చెందిన తిరునల్వేలి హల్వాకు కూడా జిఐ గుర్తింపు ఉంది. ఇక కేరళకు వెళ్లే పర్యాటకులు తప్పకుండా రుచి చూసేది, తమతో పాటు వెంట తెచ్చుకునే కోజికోడ్ హల్వా గురించి మనలో చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు అది ప్రపంచానికి కూడా తెలిసింది. గుమ్మడి గింజలతో తయారయ్యే పేత ఆగ్రా ప్రాంతపు వంటకంగా ప్రపంచ ప్రాచుర్యం పొందింది. తాజ్మహల్ని సందర్శించేవారు చవులూరించే పేతను కూడా రుచిచూడందే వదలరు. బీహార్కు చెందిన సిలావో కాజా... ఇలా డజనకు పైగా జిఐ ట్యాగ్ పొందిన భారతీయ మిఠాయిలు ఉన్నాయి. వీటిని రుచి చూడడం అంటే కేవలం మరో వెరైటీ వంటకాన్ని తినడం మాత్రమే కాదు ఆయా ప్రాంతపు సంప్రదాయాల్ని అవగాహన చేసుకోవడం కూడా.(చదవండి: ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది) -
గ్రామీణ సాంస్కృతిక కళా రూపం..'చేర్యాల చిత్రం'
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చేర్యాల నకాషి పెయింటింగ్స్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు ఆదరణ లేని ఈ చిత్రాలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో గ్రామీణ, సాంస్కృతిక ఇతివృత్తాలను తెలిపే చిత్రాలను వేస్తోంది బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్కు చెందిన ధనాలకోట వైకుంఠం నకాషి కుటుంబం. మహాభారతం, రామాయణం, వివిధ భారతీయ పురాణాలు వంటి హిందూ ఇతిహాసాలను చిత్రాల రూపంలో ఆలయాలు, మ్యూజియాల్లో, పలు ఎగ్జిబిషన్స్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఈ తరహా చిత్రకళపై వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. నకాషి కళాకారులు 13వ శతాబ్దం నుంచి చిత్రకళను ప్రారంభించారు. రాజులు, జమీందారులు తమ ఇళ్లలో ఇంటీరియల్ డిజైన్ కోసం, వాహనాల రూపంలో ఈ తరహా పెయింటింగ్స్ చెక్కలతో చేయించుకునేవారు. అంతేకాకుండా గ్రామ దేవతల విగ్రహాలు, బొమ్మల కొలువులు, ఆవుపేడ, చింతపిక్కలతో చిన్న పిల్లలకు బొమ్మలు చేసేవారు. వందల సంవత్సరాల క్రితమే కథ చెప్పే సంఘాలు వీటిని దృశ్య సహాయంగా ఉపయోగించుకుని కథలు చెప్పుకుంటూ తెలంగాణ గ్రామాల్లో తిరిగేవారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్ అనేది ఆడియో – విజువల్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభ రూపాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణ రాష్ట్రంలో నకాషి కులస్తులు మాత్రమే వీటిని తయారు చేస్తారు. ఎనిమిది కులాల పురాణాల చిత్రాలను వీరే వేస్తారు. దేశంలో పలు ఆలయాలు, మ్యూజియాల్లో చేర్యాల నకాషి చిత్రాలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. ఉజ్జయినిలో శివపురాణం, దీనిని ఇటీవల ప్రధాని మోదీ సందర్శించారు. శివపురాణం ఆయనను ఆకట్టుకోగా, పెయింటింగ్స్ వివరాలు తెలుసుకుని గీసిన వైకుంఠం నకాషి గురించి మన్కీ బాత్లో మాట్లాడారు. నూతన పార్లమెంట్ భవనంలో జైన్ మహావీర్ చరిత్ర ఏర్పాటు చేశారు. బొల్లారం రాష్ట్రపతి భవన్లో ఈ తరహా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. బీహారులోని తక్షశిల మ్యూజియంలో, అయోధ్యలోని తులసీదాస్ రామాలయం మ్యూజియంలో, భోపాల్లోని ఆదివాసీ లోక్ కళా చిత్రసమితి ప్రదర్శనలో ఉంచారు. స్విట్జర్లాండ్, చైనా, లండన్, మలేషియా, ఇటలీ, బెర్లిన్, సౌత్ ఆఫ్రికాలో ప్రదర్శనలో పెట్టారు. అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ చేర్యాల చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.నకాషి కళకు ప్రభుత్వాల సహకారం.. చేర్యాల నకాషి పెయింటింగ్స్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. వైకుంఠం నకాషి కుటుంబ సభ్యులు వనజ, రాకేష్ నిహారిక, వినయ్కుమార్, తన్మయ్, సారిక ఈ చేర్యాల చిత్రాలను వేస్తున్నారు. వైకుంఠానికి 2016లో జాతీయ అవార్డు, 1994, 1995లో నేషనల్ మెరిట్ అవార్డు, 1994లో రాష్ట్ర అవార్డు లభించాయి. (చదవండి: ఐదు పదులు దాటకా.. ఆ వైద్య పరీక్షలు తప్పనిసరి..!) -
ఇంటి వేడుకలు చుట్టూ ఇంతుల విజయ విహారం..!
చారిత్రక వైభవాన్ని సమకాలీన ఆధునికతను సమపాళ్లలో కలుపుకుని, విభిన్న రకాల వేడుకలకు నిలయంగా మారిన నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో మహిళలు చెప్పుకోదగిన విధంగా రాణిస్తున్నారు. మొదట ఈ రంగంలో పురుషాధిపత్యం కనిపించినా, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. తమదైన సృజనాత్మకత, అర్థవంతమైన నిర్వహణ, డీటెయిల్డ్ ప్లానింగ్తో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. సీఏ నుంచి ఈవెంట్స్ వరకూ.. చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తూ దానిని వదిలేసి, అనుకోకుండా కోవిడ్ సమయంలో ఈ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పటికి 500కి పైగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాను. మహిళలు ప్రతి ఒక్కరితో సులభంగా కలిసిపోతారు. అందుకే రాణించగలుగుతున్నారు. ప్రస్తుతం పుట్టినరోజులు, శారీ సెర్మనీలు, షష్టిపూర్తి..వరకూ ప్రతి వేడుకకీ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. – నిహారిక, శ్రీ వర్ణంఉద్యోగం కన్నా ఉన్నతంగా.. యుక్తవయసు నుంచీ మెహిందీ అంటే ఇష్టం. మా ఊరు నుంచి నగరానికి వచ్చాక ఎమ్మెస్సీ చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ ఆర్ట్ ద్వారా ఆదాయం గురించి తెలిసింది. అలా పార్ట్ టైమ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా మారాను. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో కంటిన్యూ చేస్తున్నాను. మెహందీతో పాటు నెయిల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాను. నెలలో 15రోజులు పనిచేసినా చాలు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కన్నా ఎక్కువే వస్తుంది. – శ్వేత గన్నోజు, మెహందీ ఆర్టిస్ట్ అందం.. అందరికీ.. ఇంటర్తో చదువు అటకెక్కింది. భర్త ప్రోత్సాహంతో ప్రొఫెషనల్గా నేర్చుకుని మేకప్ సేవలు అందిస్తున్నాను. బర్త్డే, ప్రీ వెడ్డింగ్ షూట్స్, సంగీత్ ఇలా ప్రతి వేడుకకూ మేకప్ అవసరం. ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఆ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ మేకప్ కావాలంటున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ రంగంలో పలువురు యువతకు శిక్షణ అందిస్తున్నా. – భవానీ నవీన్, మేకప్ ఆర్టిస్ట్సమన్వయమే.. ‘సంగీత్’కి న్యాయం.. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ బాగా చేసేదాన్ని. డ్యాన్స్ పోటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే ఈ రంగంలోకి వచ్చేశా. దీంతో ఎనిమిదేళ్ల నుంచి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నా. ఈ రంగంలో రాణించాలంటే సహనం ఉండాలి. మనకు వచి్చనట్టు, నచ్చినట్టు కాదు అతిథుల బాడీ లాంగ్వేజ్ బట్టి నేర్పించాలి. – శ్రీవాణి, కొరియోగ్రాఫర్ వెడ్డింగ్ ప్లాన్ చేయడం ఒకెత్తయితే సంగీత్, మెహందీ, హల్దీ, రిసెప్షన్ వరకూ పెళ్లిలో భాగమైన కార్యక్రమాలన్నింట్లో మహిళల పాత్రే కీలకం. గత కొన్నేళ్లుగా ట్రెండీగా మారిన డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహణా బాధ్యతల్ని సైతం మహిళలు చేపట్టడం విశేషం. ఫ్లోరల్ డెకరేషన్, టేబుల్ సెట్టింగ్స్, బ్యూటీ, కాంపాక్ట్ స్టేజింగ్ వంటివి పండించడంలో మహిళలకు సహజంగా ఉండే సున్నితత్వం ఉపకరిస్తోంది. ‘సంగీత్’ వారధి.. నృత్యానికి సారధి నాట్యం, సంగీతం, డ్రామా కలగలిపిన మ్యూజికల్ ఫెస్టివల్ సంగీత్ ప్రోగ్రామ్. నృత్యం వచ్చిన, రాని, అంతంత మాత్రమే చేయగలిగిన ప్రతి ఒక్కరినీ సమన్వయపరచి సంగీత్ని రక్తి కట్టించే కొరియోగ్రాఫర్ అనే కీలకపాత్రలో మహిళలు సునాయాసంగా ఒదిగిపోతున్నారు. సంప్రదాయంగా నాట్యం నేర్పడంలో ఉండే సమర్థత, శ్రద్ధ, సమయ పాలన వీటన్నింటికీ మించి కుటుంబంతో మమేకమైపోయే నేర్పు.. ఈ పాత్రలో మహిళలకు తిరుగులేని ఎంపిక. సాంగ్ సెలక్షన్ నుంచి స్టెప్పుల ఎంపిక వరకూ అంతా తామై వ్యవహరిస్తున్నారు. మాటే మంత్రం.. ఫ్యామిలీ ఈవెంట్స్లో బంధుమిత్రుల్ని భాగస్వాములుగా చేసే పలు కార్యక్రమాలను నడిపించే కంపేరర్లుగా కూడా మహిళలు సాటిలేని రీతిలో రాణిస్తున్నారు. భాషాపరంగా నైపుణ్యం, హాస్య చతురత, కలుపుగోలు తనంతో కంపేరింగ్ క్వీన్స్గా మారిపోతున్నారు. ఇంగ్లిష్–తెలుగు మిక్స్తో సహజంగా మాట్లాడే వీరి శైలి ఆకట్టుకుంటోంది. చిన్నితెరపై యాంకర్స్గా ఎలాగైతే దుమ్ము రేపుతున్నారో.. అలాగే వినోద భరిత కార్యక్రమాల్లోనూ కంపేరర్స్గా నగరంలో సత్తా చాటుతున్నారు. తాను ఆర్జేగా ప్రారంభమైనా వివాహ వేడుకలతో పాటు బేబీ షవర్స్, కార్పొరేట్ ఈవెంట్స్లో కంపేరర్గా స్థిరపడడానికి కారణం అందులో అవకాశాలు, ఆదాయం బాగుండడమేనని నగరానికి చెందిన పూజిత అంటున్నారు. (చదవండి: ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది) -
ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది
‘సమస్య నీలోనే ఉన్నప్పుడు...దానికి పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది’... ఇది తత్వం కాదు. నిజం. ‘నీట్’కు ప్రిపేర్ అవుతున్న క్రమంలో అవిక ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేది. కన్నీళ్లు తుడుచుకున్నాక... ఒత్తిడిని దూరం చేసే దారి కనిపించింది. ఇక ఎప్పుడూ ఆమె ఏడవ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది.‘చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనుకునేదాన్ని’ అంటున్న పదిహేడు సంవత్సరాల అవిక అగర్వాల్ జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’లో 5వ ర్యాంక్ సాధించింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అవిక ఆ వృత్తి విలువను ప్రత్యక్షంగా చూసింది.ఫరిదాబాద్కు చెందిన అవిక పదవతరగతి వరకు ఢిల్లీలో చదివింది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో కనిపించే తల్లిదండ్రులను చూడడం తనకు ఇష్టం.‘వారు ఎంతోమందిని బాధ నుంచి విముక్తి చేశారు. జీవితంపై ఆశ కల్పించారు’ అంటుంది తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులను చూసి డాక్టర్ కావాలనుకున్న అవిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ ఒత్తిడికి పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది. తనకు ఇష్టమైన టేబుల్ టెన్నిస్ ఆడడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేది.యుద్ధంలోనే కాదు పరీక్షల యుద్ధంలోనూ వ్యూహం(స్ట్రాటజీ) అనేది ముఖ్యం. ‘మేజర్, మైనర్ గోల్స్గా నా స్ట్రాటజీని విభజించుకున్నాను. నీట్ అనేది నా మేజర్ గోల్. మైనర్ గోల్...ప్రతిరోజూ ఇంటికి వెళ్లిన తరువాత విన్న పాఠాలను మననం చేసుకోవడం. డౌట్స్ లేకుండా చూసుకోవడం. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం’ అంటుంది అవిక. (చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!) -
ఐదు పదులు దాటాకా.. ఆ వైద్య పరీక్షలు తప్పనిసరి..!
వయసు పైబడిన వయోవృద్ధులను చాలామంది ఓ భారంగా చూస్తుంటారు. ఓ రోజుకు మనమూ ఆ వయసుకు వస్తాం. అప్పటి మన ఆరోగ్య సమస్యలనూ, మన వెతలనూ ఇవ్వాళ్లే వాళ్ల పాదరక్షల్లో కాళ్లు పెట్టి ఆలోచించాలి. నిజానికి వాళ్ల అనుభవం మనందరికీ అవసరమైన అంశం. వాళ్ల వల్ల చాలా సమస్యలు తేలిగ్గా విడిపోతాయి. ఇవేవీ అవసరం లేకపోయినా...వాళ్లు అలా కుర్చీలో కూర్చుని మనల్ని పర్యవేక్షిస్తుంటే చాలు... బోలెడంత నిశ్చింత. అందుకే... మనమే ఇంకా సంపాదిస్తూ ఉన్నట్లయితే... స్త్రీ పురుషులు 50 దాటాక కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ పురుషుడు మన తండ్రీ లేదా మన తాతగారో, అమ్మ లేదా అమ్మమ్మో అయి... మనమే సంపాదిస్తూ ఉన్నట్లయితే మనమే మన తండ్రి, తాత లేదా మీకు బాగా కావాల్సినవారికి వైద్య పరీక్షలు చేయిస్తుంటే ఇంకా ఆ ఫీలింగ్ ఇంకా బాగుంటుంది. అదీ వాళ్లకూ, మనకూ ఆనందాన్ని, నిర్భీతిని పంచుతూ కుటుంబ సంబంధాలను ఇంకా బలంగా చేస్తుంది. అందుకే మీ ఇంట్లో 50 దాటిన స్త్రీ, పురుషులకు చేయించాల్సిన కొన్ని సాధారణ వైద్య పరీక్షలివి... కుటుంబ సభ్యుల్లో ఐదు పదులు నిండాక చేయించాల్సిన కొన్ని సాధారణ (కామన్) వైద్య పరీక్షలివి...డయాబెటిస్(చక్కెర వ్యాధి) కోసం...సాధారణంగా ఈ పరీక్షను రెండంచెల్లో చేస్తారు. ఉదయాన్నే పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించాలి. ఇందులో పరగడుపున ఉన్నప్పుడు చక్కెర మోతాదులు తెలుస్తాయి. ఇక ఆ తర్వాత భోజనం చేసిన రెండు గంటల్లోపు చేయించే మరో పరీక్ష చేస్తారు. దీన్ని పోస్ట్ లంచ్ / పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ గా చెబుతారు. వీటితో పాటు సీరమ్ క్రియాటినిన్, సీయూఈ అనే పరీక్షలూ అవసరం ఇక కొందరికి మూడు నెలల సగటు చక్కెర మోతాదులను తెలుసుకోడానికి ‘హెచ్బీఏ1సీ’ అనే పరీక్ష చేస్తారు ప్రతి అరగంటకోమారు గ్లూకోజ్ ఇస్తూ చేసే పరీక్షను జీటీటీ (గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్) అంటారు. సందర్భాన్నీ, అవసరాన్ని బట్టి డాక్టర్లు ఈ పరీక్షలు చేయిస్తుంటారు. అయితే సాధారణంగా ‘ఫాస్టింగ్ బ్లడ్ షుగర్’, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్’ పరీక్షలు 50 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా చేయిస్తుంటారు. మిగతా పరీక్షలను అవసరాన్ని బట్టి డాక్టర్లు సూచిస్తుంటారు.గుండె జబ్బుల నిర్ధారణ కోసం...ఇటీవల గుండెజబ్బులు చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్నందున ఇందుకోసం చేయించాల్సిన సాధారణ పరీక్షలు... ∙ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్. అలాగే కొంత అడ్వాన్స్డ్ పరీక్షలైన 2డి ఎకో, టీఎమ్టీ, సీటీ, ∙కరోనరీ యాంజియో. ఈసీజీ ఎందుకంటే: గుండెజబ్బును నిర్ధారణ చేసేందుకు అవసరమైన సాధారణ తొలి పరీక్ష ఇది. ఒకవేళ ఛాతీ నొప్పి అనిపిస్తే తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఒకవేళ అది గుండె సమస్య లేదా గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం ఈ పరీక్షతోనే నిర్ధారణ అవుతుంది. లేదా గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, ఆ విషయం బాధితులకు తెలియకున్నా ఈ పరీక్షతో గతంలో వచ్చిన గుండెపోటు సమాచారమూ తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు చాలా చిన్న చిన్న గుండెపోటు సమాచారాల్ని ఈసీజీ గుర్తించలేక΄ోవచ్చు. కాక΄ోతే ఈసీజీ మెషిన్లోని కంప్యూటరు గతంలోని గుండెజబ్బుల విషయంలో కొన్ని క్లూస్ ఇస్తుంది. అయితే ఆ క్లూస్ అన్నీ నూరు శాతం ఖచ్చితంగా నిజం కాక΄ోవచ్చు. అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే గుండెపోటు వచ్చినప్పుడు తక్షణమే ఈసీజీ తీయించినా గుండె΄ోటు వల్ల కలిగే మార్పులను ఈ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులు లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ : ఈ పరీక్షలో దేహంలోని అనేక రకాల కొవ్వు పదార్థాల వివరాలను తెలుసుకుని, అవి ఉండాల్సిన పరిమితుల్లో ఉన్నాయా లేదా అని చూస్తారు. ఒకవేళ పరిమితులకు మించి కొవ్వులు ఉంటే దాన్ని బట్టి డాక్టర్లు వాటిని అదుపులో ఉంచేందుకు అటర్వోస్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. 2 డి ఎకో పరీక్ష ఎందుకు: టూ డీ ఎకో పరీక్ష గుండెస్పందనల్లోని మార్పులు, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలిపే పరీక్ష. గుండెపోటు వచ్చినప్పుడు గుండెస్పందనల్లో మార్పులు రావచ్చు కాబట్టి గుండెపోటు నిర్ధారణ కోసం ఎకో చేస్తారు. గుండెజబ్బు కారణంగానే ఛాతీ నొప్పి వస్తే... ఆ విషయం తెలుసుకునేందుకు అవకాశాలు 2 డీ ఎకో పరీక్షలో 95 శాతం కంటే ఎక్కువ. కాకపోతే ఈ పరీక్ష ఈసీజీ కంటే కాస్తంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. టీఎమ్టీ పరీక్ష : దీన్నే ఎక్సర్సైజ్ స్ట్రెస్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది ట్రెడ్ మిల్పై పేషెంట్ను నడిపిస్తూ... నడిచినప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు గుండెపై పడే ఒత్తిడీ... అలా ఒత్తిడి పడుతున్నప్పుడు గుండె పనితీరును అంటే... గుండెవేగం, గుండె లయ (రిథమ్), గుండె అలా పనిచేస్తున్నప్పుడు పెరుగుతున్న రక్త΄ోటు వంటి అంశాలను ఈ పరీక్షలో తెలుస్తాయి. యాంజియోగ్రామ్ : గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేక΄ోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్ ఇవ్వలేక΄ోయినా ఈ పరీక్షలో ఆ వివరాలు తెలుస్తాయి. అంతేకాదు... గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి ఖచ్చితంగా తెలుస్తాయి. యాంజియోగ్రామ్లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్లు : గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపే రక్తంలో హైసెన్సిటివిటీ ట్రో΄ోనిన్ అనే రసాయనాల మోతాదులు పెరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా ఆ విషయం నిర్ధారణ అయితే... ఎంత చిన్న గుండె΄ోటు అయినప్పటికీ అది తప్పనిసరిగా గుండె΄ోటే అన్న విషయం పూర్తిగా నిర్ధారణ అవుతుంది. కొన్ని ప్రత్యేక పరీక్షలు... బోన్స్కాన్ పరీక్ష ∙పెట్ స్కాన్ పరీక్ష. (ఇవి క్యాన్సర్ నిర్ధారణలో తొలుత చేసే ప్రాథమిక పరీక్షలు, వీటిలో ఏదైనా తేడా ఉన్నట్లు తెలిస్తే మరి కాస్త అడ్వాన్స్డ్ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక క్యాన్సర్ కోసం చేసే ప్రాథమిక పరీక్షల్లో ఏమీ లేదని తెలిస్తే క్యాన్సర్ ముప్పు లేదని నిశ్చింతగా ఉండవచ్చు) పళ్లకు సంబంధించిన పరీక్షలు... దీనికోసం ప్రతి ఆర్నెల్లకు ఒకమారు డెంటిస్ట్ను సంప్రదించి అవసరాన్ని బట్టి పళ్లు క్లీన్ చేయించుకోవాలి. చిగుర్లకు సంబంధించిన సమస్యలూ, వ్యాధులూ ఏవీ లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండాలి.కంటి పరీక్షలు...ప్రతి ఏడాదికి ఒకసారి కంటి నిపుణులకు చూపించుకోవాలి. కళ్లలో ప్రెషర్ చెక్ చేయించుకుని గ్లకోమా అవకాశాలు ఏవీ లేవని తెలుసుకుని నిర్భయంగా ఉండవచ్చు. గ్లకోమా అనేది చాపకింది నీరులా క్రమంగా కంటిచూపును తగ్గిస్తూపోయే వ్యాధి. దాదాపుగా చాలావరకు చూపు కోల్పోయే వరకు ఆ విషయం తెలియదు కాబట్టి పెద్దవయసు వచ్చాక తప్పనిసరిగా కంటి పరీక్షలు ప్రతి ఏడాదీ లేదా మీ డాక్టర్ / ఫిజీషియన్ సూచించిన విధంగా చేయిస్తూ ఉండాలి. ఇక కొంతవయసు దాటాక వచ్చే కంటి సమస్యల్లో క్యాటరాక్ట్ (తెల్లముత్యం) చాలా సాధారణంగా కనిపించే సమస్య. కళ్లు మసగ్గా కనిపిస్తున్నా లేదా అక్షరాలు, అంకెలు రెండుగా కనిపిస్తున్నా కంటి డాక్టర్ను సంప్రదించి క్యాటరాక్ట్ నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ అది క్యాటరాక్ట్ అయితే చిన్న శస్త్రచికిత్సతో డాక్టర్లు ఆ సమస్యను పూర్తిగా చక్కబరుస్తారు. ఏవైనా అసాధారణతలు ఉంటే... అసాధారణతలు అంటే మామూలు సగటు వ్యక్తులకు అని అర్థం. ఒకవేళ ఆ వ్యక్తులకు పొగతాగడం, మద్యం, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్లు సూచించిన విధంగా మరికొన్ని అదనపు పరీక్షలు అవసరం కావచ్చు. ఉదాహరణకు... పొగతాగేవారైతే... గుండె పరీక్షలతో పాటు... ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పీఎఫ్టీ పరీక్ష చేయించుకోవాలి ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే... కాలేయ సామర్థ్యాన్ని తెలుసుకుని ఎల్ఎఫ్టీ పరీక్ష, గుండె పరీక్షలతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్షలు చేయించుకోవాలి స్థూలకాయం ఉంటే... బీఎమ్ఐ, టీఎస్హెచ్, ఎఫ్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్స్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది ∙ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే... వాటిని బట్టి మీ ఫిజీషియన్ లేదా డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అరవైలలో ఆరోగ్య పరీక్షలివే... సాధారణంగా మధ్యవయసుకు చేరాక చేయించుకునే పరీక్షలతో పాటు వయసు 60 దాటాక పైన పేర్కొన్న పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు అదనంగా చేయించుకోవడం మంచిది. అవి... బీపీ స్క్రీనింగ్ : ఒక వయసు దాటాక ఇక తరచూ బీపీ చెక్ చెయించుకోవడం అవసరం. ఇకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఏవైనా జబ్బులు ఉంటే దానికి సంబంధించి డాక్టర్ పేర్కొన్న పరీక్షలను క్రమం తప్పకుండా చేయించాలి కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ : యాభై దాటాక ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించి, అది నార్మల్ గనక వస్తే ఇక అప్పట్నుంచి ప్రతి ఐదేళ్లకోమారు కొలెస్ట్రాల్ స్థాయులు తెలుసుకుంటూ ఉండటం మంచిది గుండెకు సంబంధించిన ఈసీజీ, టూ డి ఎకో, టీఎమ్టీ, అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలుఒకవేళ డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ పరీక్ష తప్పక చేయిస్తూ ఉండాలి. డయాబెటిస్ కోసం: చక్కెర వ్యాధి గురించి తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూనే ఉండాలి. ఒకవేళ అది ఉన్నట్లు తేలితే డాక్టర్ పేర్కొన్న వ్యవధిలో క్రమం తప్పకుండా చక్కెర నిర్ధారణ పరీక్షలు చేయించాలి. పెద్ద పేగు క్యాన్సర్ పరీక్షలు : పెద్ద వయసులో పెద్దపేగు క్యాన్సర్ లేదని తెలుసుకుని నిశ్చింతగా ఉండటం కోసం... ఏడాదిలో ఒకసారి మల పరీక్షతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ. దీనితో పాటు స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కొలనోస్కోపీ అనే పరీక్ష యాభై దాటిన నాటి నుంచి ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది కొలనోస్కోపీ అనే పరీక్షను ప్రతి పదేళ్లకోమారు చేయించుకోవడం మంచిది ∙అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ స్క్రీనింగ్ : పురుషుల వయసు 65–75 మధ్య ఉన్నవాళ్లు... గతంలో వాళ్లకు పొగతాగిన అలవాటు ఉంటే... అయోర్టిక్ అన్యురిజమ్ అనే కండిషన్ కోసం ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది ఇక వ్యక్తిగతంగా ఉన్న లక్షణాలను, కుటుంబ చరిత్రను, రిస్క్ ఫ్యాక్టర్స్ను బట్టి డాక్టర్ సూచించిన ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వయసు పైబడ్డాక తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు స్త్రీ పురుషులెవరైనప్పటికీ వారికి 65 ఏళ్లు దాటాక అంతకు ముందు ఎప్పుడూ తీసుకుని ఉండక΄ోతే ‘న్యూమోకోకల్ వ్యాక్సిన్’ తీసుకోవాలి. ఒకవేళ గతంలో తీసుకుని ఉండి, ఐదేళ్లు దాటినా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాధి నుంచి రక్షణకోసం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ప్రతి పదేళ్లకోమారు టెటనస్–డిఫ్తీరియా బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. గతంలో ఎప్పుడూ తీసుకోక΄ోతే 65 ఏళ్లు దాటక టీ–డాప్ వ్యాక్సిన్ తీసుకోవాలి. (ఇది డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది). అరవై దాటక షింగిల్స్ లేదా హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గతంలో తీసుకుని ఉండకపోతే ఇది వెంటనే తీసుకోవడం మేలు. ఇక సాధారణంగా చూసుకునే పరీక్షలైన బరువు చెక్ చేయించుకోవడం, బాత్రూమ్లో లేదా ఇతరత్రా కింద జారిపడకుండా చూసుకోవడం, చెవులు చక్కగా వినిపిస్తున్నాయేమో చూసుకోవడం, ఉల్లాసంగా ఆహ్లాదంగా లేక΄ోతే డిప్రెషన్కు గురికాకుండా జాగ్రత్త పడటం వంటి ఎవరికి వారు చేసుకునే పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీటితో పాటు పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే నాన్నలూ, తాతలూ... లేదా అమ్మలూ అమ్మమ్మలూ, నానమ్మల వయసులో ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా... హాయిగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమన్నది తేలిగ్గానే సాధ్యమవుతుంది. -
నటి స్నేహ ఫిట్నెస్ సీక్రెట్..! ఆ డైట్ బాగా పనిచేస్తోంది..కానీ అది మాత్రం..
టాలీవుడ్ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం నుంచి వచ్చినా..తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలు పొందిన నటి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీలతో అలరించిన హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అంతే అందం గ్లామర్తో తన అభిమానులను కట్టిపడేస్తోంది స్నేహ. అంతలా వన్నెతరగని లావణ్యంతో కట్టిపడేసే స్నేహ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.తమిళంలో పున్నాగై అరిసిగా పిలిచే స్నేహ వెయిట్లాస్ ట్రైనింగ్ తర్వాతే తాను చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు భావిస్తున్నాని పేర్కొంది. తాను ఆహారపరంగా చాలా క్లీన్ అండ్ నీట్గా తింటానని చెబుతోంది. అంతేగాదు రోజులో ఎన్ని కేలరీలు తీసుకుంటాననే దానిపై పూర్తి ఫోకస్ పెడాతానంటోంది. నెలకు ఒక్కసారి తప్ప చక్కెర తీసుకునే ఛాన్సే లేదంటోంది. ఆహారం అనేది పిండిపదార్థం, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ల మిశ్రమం అందువల్ల సమతుల్యంగా తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతోంది. అంతేగాదు ఎక్కువ నీళ్లు తీసుకుంటానని అంటోంది. శుభ్రమైన నీరు, చక్కటి ఆహారం తన దినచర్యలో భాగమని అంటోంది. ఉప్పు, మసాలా చాలా తక్కువగా తీసుకుంటానంటోంది. ఇక వ్యాయామాల పరంగా..యోగా, ఏరోబిక్ వంటి అన్ని వర్కౌట్లు చేస్తానంటోంది. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) నిపుణుల సూచన..చక్కెర కలిగిన ఆహారాలు రక్తంలోని చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. పైగా తిన్న వెంటనే కొవ్వు నిల్వ, ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా సోడాలు, కాఫీలు, ప్యాక్ చేసిన ఆహారాలు, కడుపు నిండినట్లు ఉంటాయి గానీ, సరైనా ఆహార ఎంపికలు కావని చెబుతున్నారు వైద్యులు. ఎవ్వరైన చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే..రోజువారీ కేలరీల్లో దాదాపు 200–500 కేలరీలు తగ్గినట్లేనట. అంటే వ్యక్తి వారానికి 0.5 నుంచి 1 కిలో బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది సమగ్ర ఆరోగ్య విధానానికి సరైనది చెబుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉండటం అనేది మంచి ఆహారపు అలవాట్లు, శారీర శ్రమ, మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ వంటివే కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఇక నూనె, ఉప్పు, మసాలాలు తగ్గించడం అనేది మంచి జీర్ణక్రియకు ఇది సరైన పద్ధతని అన్నారు. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం తదితరాల నుంచే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా హైడ్రేటెడ్గా ఉండటమే కాకుండా బరువు కూడా అదుపులోనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవ్వుతారు) -
మోడ్రన్ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!
తొమ్మిది పదుల వయసులో చాలా చలాకీగా ఓ బామ్మ వ్యాయామాలు చేసేస్తోంది. ఆ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా నెటిజన్లను ఓ రేంజ్లో ఆకర్షించింది. యంగ్గా ఉండేవాళ్లు సైతం చేయలేని వ్యాయమాలను ఈ బామ్మ 90ల వయసులో సునాయాసంగా చేసి ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఏజ్లో ఉండే కీళ్ల సమస్యలు, కాళ్ల నొప్పులు వంటివి ఏమి లేవు ఆమెకు. పైగా వృద్ధాప్యాన్ని ఇంతలా ఆరోగ్యకరంగా నిర్వహించుకోవచ్చని చాటిచెప్పింది. జీవితం అనేది ఆస్వాదించడానికేనని, అది మన చేతుల్లోనే ఉంది అని క్లియర్గా చెప్పింది. ఇంతకీ ఎవరా బామ్మ అంటే..చైనాకు చెందిన ఈ బామ్మ పేరు లీ. ఆమెకు పుష్ అప్, సిట్ అప్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు వేస్తుందామె. ఇరవై, ముప్పైలలో ఉండే యువత సైతం చేయడానికి ఇబ్బండిపడే కష్టతరమైన వర్కౌట్లన్ని బామ్మ లీ హుషారుగా చేసేస్తుంది. ఆమె హునాన్ ప్రావిన్స్లోని జియాంగ్వా యావో అటానమస్ కౌంటీలో నివసిస్తోంది. నిజానికి ఆ ప్రాంతంలో నిరంతరం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయితే ఆ వర్షం కూడా ఆమె ఉత్సాహాన్ని నియంత్రించలేకపోయింది. అంటే ఆమె తన వ్యాయామాలు ఇంట్లోనే చేసుకునేలా చక్కగా సర్దుబాటు చేసుకుంది. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ఆమె అభిరుచి అని చెప్పొచ్చు. అంతలా నిబద్ధతతో చేస్తోందా బామ్మ. పైగా ఆమె ప్రతిరోజూ 200 పుష్-అప్లు, 100 సిట్-అప్ల మిస్అవ్వకుండా చూసుకుంటుందట. జూన్ ప్రారంభంలో యావో ఎత్నిక్ మైనారిటీ మెడిసిన్ ఫెస్టివల్ సందర్భంగా ఆ బామ్మ తన ఆరోగ్యకర అలవాట్లు వెలుగులోకి వచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు ఆమె తన దీర్ఘాయువు సీక్రెట్ని కూడా షేర్ చేసుకుంది. ప్రతి రాత్రిపూట పాదాలను వేడినీళ్లలో ఉంచే అవాట్లతో కాళ్ల నొప్పులను తగ్గించుకున్నానంటోంది. మంచి ఆహారపు అలవాట్లతో జుట్టు నెరిసిపోకుండా చూసుకుంటుందట. ఇక తన చలాకి కదలికలకు కారణం 1959లో చాంగ్షాలోని కళాశాల నుండి పట్టభద్రురాలైన వెంటనే కిండర్ గార్టెన్ టీచర్గా పనిచేయడమేనని అంటోందామె. ఎందుకంటే పిల్లలు కదలికలు చాలా అద్భుతంగా ఉంటాయి. వారిలో ఉండే చురుకుదనం తనకెంతో ఇష్టమని అంటోంది. అలానే యాక్టివ్గా జీవితాంతం ఉండాలనే ఆకాంక్ష..ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేసిందని అంటోంది బామ్మ లీ.వయస్సుతో పాటు మన శరీర కదలికలు తగ్గుతాయి..దాన్ని గమనించి మంచి ఆరోగ్య అలవాట్లు, జీవనశైలిని సరిచేసుకుంటే.. వృద్ధాప్యంలో ఎవ్వరిపై ఆధారపడకుండా..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆశ్వాదించగలమని చెబుతోంది ఈ బామ్మ. నెటిజన్లు సైతం ఆమె కథని విని..ఆమె మాములు బామ్మ కాదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: UK: సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్కు సారథిగా ఆమె..! 115 ఏళ్ల చరిత్రలో..) -
బాధ అయినా, భారం అయినా.. తప్పడం లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఊహించలేం. అలాంటిది ఇటీవల కాలంలో పిల్లలు ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తారా అని వేచిచూస్తున్న పరిస్థితి. బిడ్డల అల్లరిని తల్లిదండ్రులు నియంత్రించలేక పోతున్నారు. గారాబం కాస్త ఎక్కువ కావడంతో పిడుగుల్లా మారుతున్నారు. ఈ క్రమంలో చేసేది లేక పిల్లల్ని హాస్టళ్లలో వదులుతున్నారు. బాధను దిగమింగుకుని బిడ్డ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆర్థికంగా భారమైనా.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలను రెసిడెన్షియల్ ప్రైవేటు స్కూళ్లలో వేస్తున్నారు. తమ తాహత్తుకు మించి ఫీజులున్నా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుకు తరలిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మధ్య తరగతి, పేద కుటుంబాలే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో 6వ తరగతి నుంచే పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తుండడం ఆర్థికంగా ఆయా కుటుంబాలను చిదిమేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రెసిడెన్షియల్ ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థికి అన్నీ కలిపి రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలకు తక్కువ ఎక్కడా లేదు. డే స్కాలర్ స్కూళ్లలోనూ ఏడాదికి పుస్తకాలతో కలిపి రూ.60 వేల నుంచి రూ.80వేల వరకూ ఉంది. గుడివాడ లాంటి ప్రాంతాలకు రూ.2.50 లక్షలు చెల్లించి పంపిస్తున్న కుటుంబాలూ ఉన్నాయి. ఫీజుల భారం ఇంతలా ఉన్నా.. ఇంట్లో ఉంటే చదవడం లేదని, అప్పు చేసి అయినా హాస్టళ్లలో వేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పదో తరగతిలోపే ఒక్కో విద్యారి్థపై రూ.10 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోతున్నాయి. ఒక రకంగా సామాన్యులను ఈ ఫీజులు కోలుకోలేకుండా చేస్తున్నాయి. మొబైల్ బంధంతోనే అనర్థాలు.. చిన్నారులు మొబైల్కు బానిసలుగా మారుతుండడం తల్లిదండ్రులను దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నట్లుగా తెలుస్తోంది. నాల్గో తరగతి నుంచే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వడం, వాళ్లు దాన్ని జీవితంలో భాగం చేసుకోవడం విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. 70 శాతం విద్యార్థులు మొబైల్ వ్యసనంతోనే తల్లిదండ్రులను ఖాతరు చేయడం లేదు. అనంతపురం వేణుగోపాల్నగర్కు చెందిన శ్రీలత ప్రభుత్వ టీచర్. భర్త ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి కర్నూలులోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. పిల్లాడు ఇంట్లో చేసే అల్లరి భరించలేక కర్నూలులోని స్కూల్లో వేయాల్సి వచ్చిందని శ్రీలత చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహబూబ్బీ గృహిణి. భర్త పోస్టల్ శాఖలో పనిచేస్తారు. వీరికి ఇద్దరు కొడుకులైతే.. ఇద్దరినీ తిరుపతిలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇంట్లో ఉంటే తమ మాట వినరు కాబట్టి హాస్టల్లో వేశాం అని దంపతులు తెలిపారు. హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాంఅనంతపురం సాయినగర్లో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నా. ఇంట్లో పిల్లలు ఎప్పుడూ సెల్ఫోన్ మాయలోనే ఉంటున్నారు. అందుకే మా అక్క పిల్లలతో పాటు బంధువుల పిల్లలనూ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం- మమత, సోదనపల్లి, శింగనమల మండలం ఖర్చయినా తప్పడం లేదునాకు ముగ్గురు పిల్లలు. ఇంట్లో ఉంటే చదవడం లేదు. దీంతో చిన్నప్పటి నుంచే అనంతపురంలో రెసిడెన్షియల్ స్కూల్లో వేశా. ఖర్చయినా వారి బాగు కోసమే హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నా. –బసవ, నేమకల్లు, బొమ్మనహాళ్లి మండలంపల్లెలో చదివించడం కష్టంనాకు ఒక అమ్మాయి. అనంతపురంలో హాస్టల్ ఉన్న స్కూల్లో 10 వరకూ చదివించాను. ఇప్పుడు ఇంటర్కు కూడా హాస్టలున్న కళాశాలలోనే వేస్తు న్నాను. పల్లెలో చదివించడం కష్టంగా ఉంది. – సుజాత, పుట్లూరు మండలం -
Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?
వంటిల్లు మన మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే వంటిల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉండేలా జాగ్రత్త పడాలి. గిన్నెలను కడిగిన తరువాత శుభ్రంగా ఆరనివ్వాలి. వంటఇంట్లో వాడే తువ్వాలు దగ్గర్నుంచీ వంట దినుసులు దాకా అన్నీ ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. మరి టిప్ ఆప్ ది డేలో భాగంగా వంటిట్లో బొద్దింకలను నివారించాలంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలో పాటించాలో తెలుసుకుందాం. వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి.అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్ను అవి వచ్చే చోట ఉంచాలి. వీటితో పాటు సింక్లో ఎంగిలి గిన్నెలను అలా వదిలి వేయకూడదు. ఎప్పటికపుడు పాత్రలను కడిగేసుకోవాలి. ప్రతీ ఏడాదికి ఒకసారి తీవ్రతను బట్టి పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి. ఈ సమయంలో, పిల్లలు, పెడ్ యానిమల్స్తో జాగ్రత్తగా చూసుకోవాలి.వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.అవసరం లేని అట్ట పెట్టెలపై వంట ఇంట్లో ఉంచుకోవద్దు. వీటిల్లో చెక్క గుజ్జు బొద్దింకలకు అద్భుతమైన ఆహారం. వాటికి మంచి ఆవాసం కూడా.బొద్దింకలు కొన్ని వాసనలను ద్వేషిస్తాయి, ఉదాహరణకు: నిమ్మ, యూకలిప్టస్, లావెండర్, పుదీనా, వేప నూనెలు. ఈ నూనెలను స్ప్రే చేయడం లేదా వాటిని ఇంటి చుట్టూ ఉంచడం వల్ల బొద్దింకలను దూరం చేయవచ్చు, బేకింగ్ సోడా, చక్కెరను సమాన నిష్పత్తిలో కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాలలో ఉంచుకోవచ్చు.. బోరిక్ యాసిడ్ , మైదా కలిపి మాత్రలు చేసి బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో ఉంచడం కూడా మంచిది.వెనిగర్ తో ఇంటిని శుభ్రం చేయడం వల్ల బొద్దింకలు రాకుండా ఉంటాయి. -
మాన్సూన్లో మోటార్ రైడ్స్..!
వర్షాలు మబ్బుల్లోంచి కురిసే మధుర గీతాల్లా వినిపిస్తున్న ఈ మాన్సూన్ సీజన్కు నగర యువత నుంచి ప్రత్యేక స్వాగతం లభిస్తోంది. సాధారణంగా జూన్ రెండో వారం నుంచి మొదలయ్యే ఈ సీజన్, ఈసారి కాస్త ముందస్తుగానే ప్రారంభమైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి తక్కువ ఉష్ణోగ్రతలతో, ఎక్కువ మోస్తరు వర్షపాతం నమోదవుతుందనే ఊహతో యువతలో ప్రకృతిని ఆస్వాదించే ఆసక్తి భారీగానే పెరిగింది. నగరవాసులు ముఖ్యంగా యువత ఈ చల్లని మబ్బులు, మత్తెక్కించే వర్షపు వాసన, హత్తుకునే పచ్చటి ప్రకృతి దృశ్యాలు అన్నింటినీ ఆస్వాదించేందుకు గ్రూప్ రైడ్స్, ఔటింగ్స్, నేచర్ ట్రిప్లతో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి చినుకూ శీర్షికే..!! రీల్స్, స్టోరీస్, వ్లాగ్స్..ఇవన్నీ మాన్సూన్ థీమ్తో నిండిపోతున్నాయి. వర్షపు నీటిలో కళ్లకు తక్కువ కనిపించే పొగమంచు, డ్రోన్లతో తీసిన పచ్చటి దృశ్యాలు వీరిని ఆహ్లాదపరిచేలా ఉంటున్నాయి. మాన్సూన్ కేవలం వర్షపు చినుకుల సంగతి మాత్రమే కాదు.. ఇది ఒక మూడ్, ఒక ఉల్లాసం, రిలాక్సేషన్. పని ఒత్తిడి నుంచి కొన్ని గంటలు బయటపడేందుకు ఇదో సువర్ణావకాశం. హైదరాబాద్ యువత దీన్ని అందుకుంటోంది. ప్రకృతిని హత్తుకునేలా, జీవితాన్ని మరొక కోణంలో చూసేలా మాన్సూన్ సీజన్ మనల్ని ప్రేరేపిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని అనంతగిరి హిల్స్, సంఘీ టెంపుల్ పరిసర ప్రాంతాలు, శామీర్పేట్ లేక్ వంటి ప్రాంతాలు డ్రైవ్ డెస్టినేషన్లుగా మారాయి. వారం చివరి రోజుల్లో ఈ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య రెండింతలు పెరిగింది. శివార్లలో ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్న పొలాలు, మబ్బుల్లో నలుగుచేసే కిరణాలు, మోస్తరు జల్లుల్లో సాగే డ్రైవ్లు.. ఇవన్నీ యువత హృదయాలను తాకుతున్నాయి. వీకెండ్స్లో అయితే ఇంకొంచెం దూరమైనప్పటికీ నాగార్జున సాగర్, లక్నవరం వంటి ప్రాంతాలకు సైతం షార్ట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. వనాలవైపు పయనం.. సిటీ రైడింగ్కి అలసిన వారు మృగవాని పార్కులకు, అనుమతి ఉన్న శివార్ల అడవులకు, ఫారెస్ట్ ట్రెయిల్స్కు వెళ్లే ట్రెండ్ బాగా పెరిగింది. నగరం నుంచి మంచిర్యాల కవ్వల సర్వాయ్ ఫారెస్ట్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, భాన్సువాడ గ్రీన్ కవర్ వంటి ప్రాంతాలు ఈ లిస్ట్లో చేరిపోతున్నాయి. ఇవన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రదేశాలుగా పేరుగాంచుతున్నాయి. ఇక్కడ వన్యప్రాణులను పరిశీలిస్తూ, వాన జల్లుల్లో నడకలు వేసేలా యూత్ ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. నగరంలో మాన్సూన్ మ్యాజిక్.. నగరం వదిలి వెళ్లలేని వారు కూడా తక్కువ సమయంలో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, కేబీఆర్ పార్క్, దుమ్ముగూడ చెరువు వంటి ప్రదేశాలకు వెళుతున్నారు. ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులు, యువత, విద్యార్థులు, ఫొటోగ్రాఫర్స్ ఈ వర్షపు సీజన్ను కలర్ఫుల్గా మార్చేస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డుపై సైక్లింగ్, బంజారాహిల్స్ కెఫేలో రేయిన్ వ్యూ టేబుల్స్, టెర్రస్ కాఫీ డేట్లు, రోడ్డు పక్కన స్వీట్కార్న్ బండ్లు, షావర్మ స్టాల్స్.. ఇవన్నీ మాన్సూన్ ఎక్స్పీరియన్స్. ఈ వర్షాల సీజన్కి సోషల్ మీడియా జనరేషన్ తమదైన హ్యాష్ట్యాగ్లు తయారుచేస్తోంది. హ్యాష్ రేయిన్రైడ్, హ్యాష్ మాన్సూన్మూడ్, హ్యాష్ చినుకులు క్రానికల్స్ లాంటి క్యాప్షన్లతో యువత సోషల్ మీడియాను మాన్సూన్ డైరీగా మార్చేస్తోంది. మాన్సూన్ ఏక కాలంలో రిలీఫ్, రొమాన్స్, రిఫ్రెష్మెంట్ తీసుకురావడమే కాదు, జీవితం కొంత నెమ్మదిగా, ప్రశాంతంగా సాగేలా చేస్తుంది. (చదవండి: 62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..) -
62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..
సమాజం మనకు ఏమి ఇచ్చింది అని ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ సమాజానికి నేను ఏమిచ్చాను అని ఆలోచించే వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కడే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ. పదో, ఇరవైయ్యో కాదు.. ఏకంగా 136 సార్లు రక్తదానం చేసి పరోక్షంగా అనేక మంది ప్రణాలను కాపాడారు. 62 సంవత్సరాల వయసులో కూడా ప్రతి ఆరు నెలలకూ ఓసారి ఇప్పటికీ రక్తదానం చేస్తూనే ఉన్నారు. కేవలం రక్తదానమే కాదు తాను మృతి చెందిన అనంతరం తన శరీరంలో పనికొచ్చే అన్ని అవయవాలు ఇండియన్ ఆర్మీకి దానం చేశారు. నగరంలోని డీడీ కాలనీలో నివాసం ఉండే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ 1983లో వివేకవరి్ధని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో అక్టోబర్ 2, మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ఎన్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మొదటి సారి రక్తదానం చేశారు. ఇక అప్పటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇప్పటికీ తన రక్తాన్ని దానం చేస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీకి, నగరంలో ఏ ఆస్పత్రి నుండి ఫోన్ వచ్చినా వెళ్లి రక్తదానం చేస్తుంటాడు. యోగేష్ది ఓ నెగెటివ్ కావడంతో రక్తదానం చేసిన ప్రతిసారీ మీరు ఒకరి ప్రాణాలు కాపాడారు అని వైద్యులు అంటుంటే అందులో కలిగే ఆనందం ఎక్కడా దొరకదని ఆయన అంటున్నారు. ఈయన రక్తదానం చెయ్యడమే కాకుండా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నిపుతుంటారు. ప్రముఖుల నుంచి అభినందనలు.. ఇన్నిసార్లు రక్తదానం చేసిన యోగేష్ను ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సీని ప్రముఖులు అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నారు. ఒక వేదికపై ప్రముఖ హీరో రాంచరణ్ మేము సినిమాల్లో హీరోలమైతే యోగేష్ రాజ్ శ్రీవాస్తవ్ నిజ జీవితంలో హీరో అని అందరిముందూ పొగడడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు. పలు అవార్డులు, రికార్డులు.. యోగేష్కు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 16వ ఫిలిప్స్ గాడ్ఫ్రే బ్రేవరీ అవార్డు, క్యాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఫిలాసఫీ ఆఫ్ హ్యూమానిటీ డాక్టరేట్, 17 బంగారు, వెండి, 14 మెరిట్ సర్టిఫికెట్స్, రాజీవ్గాంధీ సమైక్యతా అవార్డు, లయన్ ఇంటర్నేషనల్ అవార్డు, స్వేచ్ఛా భారత్ పురస్కార్తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. (చదవండి: Plane Crash Victims : ఆ భయం నుంచి బయటపడటం అంత ఈజీ కాదట..!) -
Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందులో ప్రయాణించే ప్రయాణికులే గాక, ఆ ఘటనలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు, పక్కనే ఉన్న టీ స్టాల్లో పనిచేసే వ్యక్తుల తోసహా అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అంతా క్షణాల్లో బూడిదైపోయారు. ఈ ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ఘెర విమాన ప్రమాదం బారినపడి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయులెందరో ఉన్నారు. కానీ వారంతా మానసికంగా కోలుకోవడం అంత ఈజీ కాదట. చావుని చాలా దగ్గరగా చూసి రావడంతో విమానం అన్న, ఆ శబ్దం విన్నా..హడిలిపోతారని చెబుతున్నారు నిపుణులు.చాలామటుకు ఆయా బాధితులు ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియాతో బాధపడుతుంటారట. మళ్లీ విమానం ఎక్కే సాహసం చేయరట. ఎంత కష్టమైన కార్లు, లేదా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారట. కొందరైతే ప్రయాణాలే చేయరట. ఇలానే ఓ మహిళ 2010లో ఓ విమాన ప్రమాదం బారినపడి తండ్రిని కోల్పోయింది. దాంతో ఆమె దాదాపు 10 ఏళ్ల వరకు విమానంలో ప్రయాణమే చేయలేదట. మరి ఇంతలా భయబ్రాంతులకు గురిచేసే ఆ విమాన ప్రమాద భయాన్ని ఎలా అధిగమించి ఇదివరకటిలో హాయిగా జీవించాలంటే..కొన్ని మానసిక ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో సవివరంగా చూద్దామా..!.విమాన ప్రమాదం బారినపడిన బాధితులు విమాన ప్రయాణం అనే పదం ప్రస్తావిస్తేనే భయాందోళనకు గురై వణికిపోతుంటారట. విమానం చూడటం, సంబంధిత విమాన టికెట్ అన్న భయపడతారట. సాధారణంగా ఏ వ్యక్తి అయిన తీవ్రంగా ప్రభావితమవ్వడం, భయానికి గురవ్వడం జరుగుతంది. అయితే కొందరిలో ఆ భయం తీవ్ర రూపం దాల్చి ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియా బారిన పడతారట.అలాంటి వ్యక్తులకు మొదట ఆందోళనకు సంబంధించిన మందులు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత విమాన ప్రయాణం భయంకరమైనది కాదు అని తెలసుకునేలా కుటుంబసభ్యుల మద్ధుతు తోపాటు కౌన్సిలర్ల సాయం తీసుకోవాలి. విమాన భయం అధిగమించేందుకు..భయం పోయేలా 4-7-8 పద్ధతిలో శ్వాస వ్యాయామలు చేయిస్తారు. నాడీ వ్యవస్థ స్థిమిత్తంగా ఉండేలా చేసి, భయానికి సంబంధించిన ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూస్తారు. విమనాలు, వాటికి సంబంధించిన ఆడియోలను వారితో షేర్ చేసుకుంటూ..ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వివరించడం వంటివి చేస్తారు. తాను అనుభవించిన చేదు అనుభవాలు తాత్కలికమే విషయం గ్రహించేలా చేస్తారు. తరుచుగా ఆగి ఉన్నవిమానం వద్దకు తీసుకువెళ్లడం, అందులో కూర్చొనేలా చేసి..ఆయా బాధితుల్లో దాగున్న భయాన్ని పూర్తిగా పోగొడతారు. ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ (VRET)తో..విమానం ఎగిరే వివిధ దశలను (టేకాఫ్, టర్బులెన్స్ అండ్ ల్యాండింగ్) అనుభూతి చెందేలా వీఆర్ హెడ్సెట్ని ఉపయోగిస్తారు. ఆసమయంలో బాధితులు వ్యక్తికరించే వారి భావోద్వేగాలను గమనిస్తూ..కౌన్సిలర్ బాధితులకి ధైర్యాన్ని అందించేలా సహాయం చేస్తుంటాడు. అలా వాళ్లు నెమ్మదిగా ఆ భయాన్ని అధిగమించి తిరిగి విమాన ప్రయాణం చేయడానికి చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ భయం నుంచి బయటపడటానికి ఆయా వ్యక్తుల మానసికి పరిస్థితి ఆధారంగా..కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. దేన్నైనా లైట్గా తీసుకునేవారు..సానుకూల దృక్పథంతో ఉండేవారు సులభంగా ఈ విమాన ప్రమాద భయాన్ని జయించగలరని చెబతున్నారు నిపుణులు.(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్) -
ఈ సండే సూపర్ వెరైటీ స్నాక్స్ ట్రై చేయండిలా..!
కోల్కతా పెయారా చాట్కావలసినవి: జామకాయ(పెయారా)– 2 (మంచి దోరకాయలు ఎన్నుకోవాలి, చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)పచ్చిమిర్చి– 3అల్లం– ఒక చిన్న ముక్కకొత్తిమీర తరుగు– పావు కప్పుఉప్పు– తగినంతచాట్ మసాలా– అర టీస్పూన్కారం, పంచదార– ఒక టీస్పూన్ చొప్పునఆవాల పేస్ట్– 2 టీస్పూన్లునిమ్మరసం– ఒక టీ స్పూన్తయారీ: ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోసిన జామకాయ ముక్కలు వేసుకుని, అందులో పచ్చిమిర్చి–కొత్తిమీర పేస్ట్, చాట్ మసాలా, కారం, పంచదార, ఆవాల పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కావాలంటే కాస్త జోడించి, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కకు మసాలా బాగా పట్టేలా చేసుకుని తింటే ఈ చాట్ చాలా బాగుంటుంది.నూడుల్స్ టొమాటో కప్స్కావలసినవి: టొమాటో– 6 (పైభాగం కొద్దిగా కట్ చేసుకుని, లోపలి గుజ్జు తొలగించి బౌల్ / కప్పు మాదిరి చేసుకోవాలి)గుడ్లు– 4 (అన్ని గుడ్లు ఒక బౌల్లో వేసుకుని, కొద్దిగా పాలు కలుపుకుని బాగా బీట్ చేసుకోవాలి)మోజెరెల్లా చీజ్ తురుము– 100 గ్రాములుఉప్పు – తగినంతమిరియాల పొడి– ఒక టీ స్పూన్కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)ఉల్లికాడ ముక్కలు– ఒక టేబుల్ స్పూన్నూడుల్స్– గార్నిష్కితయారీ: ముందుగా ప్రతి టొమాటో కప్లో కొన్ని ఉల్లికాడ ముక్కలు, కొద్దిగా చీజ్ తురుము వేసుకుని, కొద్దికొద్దిగా గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర తురుము వేసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తర్వాత నూడుల్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే, ఇవి భలే రుచిగా ఉంటాయి.టర్కిష్ బక్లావాకావలసినవి: సిరప్ కోసంపంచదార– 200 గ్రాములునీళ్లు– సరిపడా, నిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్బక్లావా కోసంఫిలో షీట్స్ – కొన్ని (ఇవి చపాతీల్లానే ఉంటాయి కానీ చాలా పలుచగా పూతరేకుల్లా ఉంటాయి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుని గుత్తగా ఉంటాయి. వీటిని ఫ్రిజ్లో నిలువ చేసుకోవచ్చు. ఉపయోగించుకునే ముందు రూమ్ టెంపరేచర్లో ఉంచితే అవి ఈజీగా విడిపోతాయి. మైదా పిండి, గుడ్లతో ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు.) బటర్ – 225 గ్రాములు, పిస్తా, వాల్నట్ – 200 గ్రాములు (మిక్సీ పట్టుకోవాలి, ఇక గార్నిష్కి నచ్చిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకోవచ్చు)తయారీ: ముందుగా పంచదార, నీళ్లు, నిమ్మరసం కలిపి బౌల్లో వేసుకుని, చిన్న మంట మీద గరిటెతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరిగించాలి. పంచదార కరిగి, పాకం కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించి, చల్లబరచడానికి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బేకింగ్ ట్రే తీసుకుని దానిలో సుమారు పది ఫిలో షీట్స్ పరిచి, దానిపైన కరిగించిన బటర్, పిస్తా, వాల్నట్ పౌడర్ వేసుకోవాలి. అనంతరం మరో పది ఫిలో షీట్స్ దానిపై పరిచి, చాకుతో పూర్తిగా కాకుండా, నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు సగం వరకూ పాకం పోసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని, ఆ ట్రేని ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యే వరకు బేక్ చేసుకుని ఇప్పుడు మిగిలిన పంచదార సిరప్ కూడా పోసుకుని, నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని, ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. (చదవండి: సేఫ్టీ గాడ్జెట్స్.. ఈ టైంలో హెల్ప్ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్) -
సేఫ్టీ గాడ్జెట్స్.. ఈ టైంలో హెల్ప్ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్
స్కూల్ బెల్ మోగింది. పిల్లలు కొత్త బుక్స్, బ్యాగ్స్తో రెడీ. కాని, పిల్లలకు చదువుతో పాటు వారి సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. అందుకే, ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్లో పుస్తకాలతో పాటు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సేఫ్టీ గాడ్జెట్స్ గిఫ్ట్ చేయండి!క్యూట్ ఫ్రెండ్! స్కూల్లో హోంవర్క్, టెస్టులు, ప్రాజెక్టులతో కొన్నిసార్లు ఒత్తిడిగా, ఒంటరిగా అనిపించవచ్చు. అప్పుడు పక్కన ఓ సపోర్టివ్ ఫ్రెండ్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా? అలాంటి ఓ మిత్రుడే ఇప్పుడు వచ్చేశాడు. పేరు ‘ఎంకరేజింగ్ పిక్కల్’. ఇది బొమ్మ అయినా, దీని నవ్వు, రంగుల కళలు, మృదువైన స్పర్శతో పిల్లల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఓ టెస్టులో తక్కువ మార్కులొచ్చినా, ప్రాజెక్ట్ ఆలస్యం అయినా, ఈ పిక్కల్ను చూసి ఒక్కసారి మాట్లాడితే చాలు. మనసులో ఈ మాటలు వినిపిస్తాయి: ‘ఇంకొంచెం ట్రై చెయ్య్, నువ్వు చాలా గ్రేట్’ అని. ఒక చిన్న సైజు మానసిక మిత్రుడు అనే చెప్పొచ్చు. కార్న్, క్యాబేజీ, హనీపీచ్ లాంటి ఇతర ఆకారాల్లోనూ దొరుకుతుంది. ఎవరి స్టయిల్కి తగ్గట్టు వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ధర డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది.నో‘లాస్’స్కూల్ టైమ్ వచ్చేసింది! బ్యాగ్, బాటిల్, టిఫిన్ , బాక్స్– ఇలా వీటిలో ఏ ఒక్కటి మిస్ అయ్యినా అమ్మానాన్నలకు టెన్షన్ గ్యారంటీ! ‘అమ్మా, నా బాటిల్ పోయింది’, ‘నాన్నా, బ్యాగ్ మర్చిపోయా’ అన్న డైలాగ్స్తో వాటిని తిరిగి తెచ్చే వరకు పిల్లలు విసిగిస్తూనే ఉంటారు. ఇందుకు పరిష్కారమే ఈ ‘ఎయిర్ ట్యాగ్’. ఇది చిన్న బిళ్లలాగ ఉండే మాయపరికరం. దీనిని పిల్లల వస్తువులకు తగిలించండి. ఇకపై వారు ఏది ఎక్కడ మరచిపోయినా, దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా ఫో¯Œ లో వాటి లొకేషన్ కనిపెట్టచ్చు. ధర రూ.11,900 కి నాలుగు ట్యాగ్స్ వస్తాయి.బాడీగార్డ్ బర్డీ! ఇప్పటివరకు ప్రమాదం వచ్చిన ప్రతిసారి ‘అమ్మా! నాన్నా!’ అని ఒక్క అరుపుతో పరుగులు తీసే చిన్నారులు, స్కూల్కు వెళుతున్నారంటే, తమను తాము కాపాడుకునే స్టేజ్కి వచ్చేశారని అర్థం. అందుకే, కండబలం కంటే ముందు బుద్ధిబలంతో సమస్యను పరిష్కరించేలా నేర్పించాలి. ఇందుకోసం, పిల్లలతో పాటు స్కూల్కి ఈ బాడీగార్డ్ను కూడా పంపించండి. పేరు ఈ ‘బర్డీ’. చిన్న కీ చైన్లా ఉంటుంది. కాని, ప్రమాదం వచ్చినప్పుడు పిల్లలు ఒక్కసారి దీనికున్న బటన్ నొక్కితే చాలు. ఇక అది చేసే శబ్దంతో దొంగలు పారిపోవాల్సిందే! వెంటనే, ఒక పెద్ద అలారం చెవుల్లో మెగాఫోన్ పెట్టినట్టు అరుస్తుంది. ఇంకా చీకట్లో కూడా ఈ బర్డీ టార్చ్ మోడ్లో వెలుగుతూ, ‘ఇదిగో లైట్ ఉంది, నువ్వు కామ్గా పో’ అనే వార్నింగ్తో దొంగలను తరిమి కొడుతుంది. ఇది పిల్లల బ్యాగ్కు వేలాడే ఒక మినీ సూపర్ హీరో! (చదవండి: ఆ కుంటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..! ఏ రేంజ్లో స్వాగతం పలికారంటే..) -
విన్యాసాల వాయిద్యం..'మార్ఫా సంగీతం'..
గణేష్ చతుర్థి ఊరేగింపులైనా.. పెళ్లి వేడుకలైనా.. నగరాన్ని సందర్శించే ప్రముఖులను స్వాగతించాలన్నా టక్కున గుర్తొచ్చేది మార్ఫా బ్యాండ్. ఈ ఉల్లాసభరితమైన సంగీతం లేకపోతే హైదరాబాద్ సంప్రదాయం అసంపూర్ణమే. పాతబస్తీలో అందాల రాణులతో నృత్యం చేయించి, కొడుకు పెళ్లిలో నాగార్జునతో డ్యాన్స్ చేయించి.. తరాలకు, ప్రాంతాలకు అతీతంగా అలరించే శక్తి తనదని నిరూపించుకుంటోంది మార్ఫా సంగీత వాయిద్యం.. ఆఫ్రో, అరబ్ సంప్రదాయం నుంచి శతాబ్దాల క్రితం వలస వచ్చిన ఈ సంగీతం భాగ్యనగర సంస్కృతిలో భాగమైపోయింది. నగరంలో జరిగే ప్రతి వేడుకలోనూ తన ప్రశస్తిని చాటుకుంటోంది.. మార్ఫా సంగీతం.. సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా కుల, మత సంబంధం లేకుండా అభిమానులున్న నగరానికి చెందిన మార్ఫా సంగీతం ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. మధ్యప్రాచ్యంలో మార్ఫా ప్రదర్శనలు జరుగుతుంటే, మరోవైపు ఇటీవలే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి ప్రదేశాల్లో ఔత్సాహికుల నృత్యాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వైవిధ్యభరిత వాయిద్యాల సమ్మేళనం..మార్ఫా సంగీతంలో ‘మార్ఫా, సవారీ, నాగిన్, యాబు బక్కే రబు సాలా’ వంటి వివిధ శైలితో కూడిన రిథమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ దానికంటూ సొంత విలక్షణమైన వైవిధ్యంతో అలరిస్తాయి. ఈ సంగీతం అనేక వాయిద్యాల సహాయంతో పలకిస్తారు. ప్రధానంగా మార్ఫాలు (ధోలక్, డాఫ్ అని పిలుస్తారు). వీటిని సంగీతకారులు ‘థాపి’ అని పిలిచే చెక్క స్ట్రిప్లతో కొడతారు. వీరి పూర్వీకులు మేక చర్మంతో తయారు చేసిన మార్ఫాలపై కొట్టేవారు. నేటి కళాకారులు వాయించడం సులభం. ఖర్చు తక్కువ అవుతుందిని ఫైబర్ వాయిద్యాలు ఇష్టపడతున్నారు. కొన్ని విభిన్న వాయిద్యాలను కందూర, ముషాద్ జెట్టా, మార్ఫాలు, బిండియా పీటల్ అని పిలుస్తారు. వాటిలో ఎక్కువ భాగం ధోలక్ను పోలి ఉన్నప్పటికీ పరిమాణంలో తేడాలుంటాయి. ‘కళాకారులకు వారు వాయించడానికి ఎంచుకున్న వాయిద్యం ఆధారంగా వేతనం చెల్లిస్తారు’ అని కళాకారులు చెబుతున్నారు. ఆహార్యం నుంచి వైవిధ్యం.. తల చుట్టూ ఎర్రటి చెక్కిన స్కార్ఫ్లు చుట్టుకుని, తెల్లటి కుర్తాలు, లుంగీలను «మార్ఫా కళాకారులు దరిస్తారు. ఈ కళాకారులు రాత్రిపూట, నిరి్వరామంగా మూడు నుంచి ఆరు గంటల పాటు నిలబడి ప్రదర్శనలు ఇస్తారు. మెడలో బరువైన ఢోలక్ మోస్తూనే లయకు అనుగుణంగా నృత్యం చేయాలి.ఉత్సవాలు, ఊరేగింపుల్లో తీవ్ర అలసట కారణంగా మార్ఫా కళాకారుల నోటి నుంచి రక్తస్రావం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంటుంది. మార్ఫా బ్యాండ్లో సంప్రదాయంగా 8, 12, 16, 22 మంది సభ్యులు ఉంటారు. ప్రేక్షకుల ఆదరణ మేరకు, బృందంలోని కొంతమంది సభ్యులు నృత్యం చేయవచ్చు. వారి సహచరులు వాయిద్యాలను వాయించేటప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన డాగర్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఒక కళాకారుడు కత్తిని గాలిలోకి ఊపుతూ నర్తిస్తుంటే, ఇతర సంగీతకారులు క్రమంగా బీట్ టెంపోను పెంచుతారు.చరిత్రతో మమేకం.. ఈ మార్ఫా బ్యాండ్లు తరచూ జెండా మార్చ్ల వంటి కార్యక్రమాలకు నియమించుకుంటారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీదారుల పాతబస్తీ సందర్శన సందర్భంగా వారికి మార్ఫా సంగీతం స్వాగతం పలికింది. నిజాం పాలనలో నగరానికి చేరుకుందీ యెమెన్ కళారూపం. ఈ కళారూపాన్ని నగరానికి ఎవరు పరిచయం చేశారు? అనే దానిపై కొంత వివాదం ఉంది. ఇది తీసుకొచ్చింది సిద్ధిలు (ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు) అని కొందరు చెబుతుండగా, దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చింది యెమెన్ పూరీ్వకులేనని కొందరు అంటున్నారు.కళాకారులు ఏమంటున్నారు?‘నిజాం పాలనలో వేడుకల సందర్భాల్లో ఈ వాయిద్యాన్ని వినియోగించేవారు. నేటికీ గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మార్ఫా తప్పనిసరి’ అని మార్ఫా కళాకారుడు కయ్యూమ్ బిన్ ఒమర్ చెప్పాడు. గత 28 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న ఓమర్ ప్రారంభంలో 70–80 మంది మార్ఫా బృందం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 15కి తగ్గింది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నామనీ, తెలుగు రాష్ట్రాల వెలుపల కొన్ని ప్రదర్శనలు ఇస్తున్నామని ఒమర్ అంటున్నాడు. డాగర్ డ్యాన్స్ హైలెట్.. సాంప్రదాయ యెమెన్ నృత్యరూపం డాగర్ డ్యాన్స్కు అత్యంత డిమాండ్ ఉందని అరబి మార్ఫా బ్యాండ్ యజమాని మొహమ్మద్ యూసుఫ్ చెప్పారు. అయితే, నిజమైన కత్తులకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా చెక్క కత్తులను వినియోగిస్తున్నారు. ‘గతంలో కొంతమంది ప్రేక్షకులు మద్యం మత్తులో కత్తులను లాక్కొని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కత్తుల వినియోగాన్ని నిషేధించింది, కానీ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి చెక్క లేదా ప్లాస్టిక్ కత్తులను ఉపయోగిస్తున్నాం’ అని మహమ్మద్ చెప్పారు.కళను సజీవంగా ఉంచేందుకు.. ‘నా పేరు ఫిరోజ్. కానీ అందరూ నన్ను జాబ్రీ అని పిలుస్తారు. చిన్నతనం నుంచి అంటే 24 సంవత్సరాలుగా మార్ఫా ప్లే చేస్తున్నా. నగరంలో ముఖ్యంగా బార్కాస్ ఏసీ గార్డ్స్ వంటి ప్రదేశాల్లో మార్ఫా ప్రసిద్ధి చెందింది. నిజాంల కింద పనిచేసిన యెమెన్ సైనికుల ద్వారా 200 ఏళ్ల క్రితం మార్ఫా నగరానికి వచి్చందంటారు. అదేమో గానీ మా పెద్దలు ఈ కళను నాకు అందించారు. దీనిని సజీవంగా ఉంచడానికి నా వంతు కృషి చేస్తున్నా. నా బృందంలో 20 మంది సభ్యులున్నారు. నగరం అంతటా వివాహాలు, వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తాం. మతాలకు అతీతంగా ఆహా్వనిస్తారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటాం. కేవలం వారసత్వాన్ని సజీవంగా ఉంచాలన్నదే మా ఆలోచన. – ఫిరోజ్ మార్ఫా ఆర్టిస్ట్ (సోషల్ మీడియా పోస్ట్ నుంచి) (చదవండి: -
'లక్ష'ణమైన గ్రంథాలయం
ఆధునిక దేవాలయాలుగా భావించే గ్రంథాలయాలకు ఘన చరిత్రే ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి వాటిలో విజ్ఞాన కాంతులు వెదజల్లే సరస్వతీ నిలయం– శత వసంతాల సారస్వత నికేతనం అతి పురాతనమైనది. ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ పుస్తక భాండాగారానికి 1918 అక్టోబరు 15న విజయదశమి రోజున బీజం పడింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేటపాలెంలో కొంతమంది యువకులు హిందూ యువజన సంఘంగా ఏర్పడి గ్రంథాలయాన్ని నెలకొల్పారు. రెండు దినపత్రికలు, మూడు వారపత్రికలు, వంద పుస్తకాలతో ప్రారంభించగా ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నిర్వహణ వ్యయం భరించలేక నాలుగేళ్లకే తాళం వేశారు. అప్పట్లో సాహితీ ప్రియుడైన ఊటుకూరు వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి సంస్థకున్న అప్పులు తీర్చి, రూ.3 వేలతో మూలనిధి ఏర్పాటు చేశారు. మరో రూ.2 వేలు విరాళంగా అందించారు. 1923లో వేటపాలెం నడిబొడ్డున పెంకుటిల్లు కొని 1924 సెప్టెంబర్లో తిరిగి ప్రారంభింపజేశారు. దానికి ‘సుబ్బరాయ మహల్’గా నామకరణం చేశారు. 1929 ఏప్రిల్ 4న నూతన భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా ఆయన తన చేతికర్రను జ్ఞాపకంగా ఇక్కడ వదిలివెళ్లారు. సందర్శకులు దాన్ని ఒకమారు తాకి బాపూజీని తాకిన అనుభూతికి గురవుతుండడం విశేషం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, జమునాలాల్ బజాజ్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన గ్రంథాలయం సారస్వత నికేతనంగా పేరు మార్చుకుంది.స్మారక మందిరాలు1933లో బాబూ రాజేంద్రప్రసాద్ భవనం ఎదుట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తదుపరి కాలంలో మీనాక్షి కోటిలింగం స్మారక మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, శారదాదేవి స్మారక మందిరం నిర్మించారు. శ్రేష్ఠి మరణానంతరం ఆయన సతీమణి కమలమాంబ గ్రంథాలయ బరువు బాధ్యతలు స్వీకరించారు. ఎం.కామయ్య, ఎం.ఆంజనేయశర్మ, కె.సుబ్రహ్మణ్యం గ్రంథ పాలకులుగా వ్యవహరించారు. మహిళలు, వయోజనులు, పాత్రికేయుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ముద్రణ, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో ఆరితేరినవారితో ప్రసంగాలు, చర్చలు ఇక్కడే జరిగేవి.వేల అక్షరాలు.. లక్ష పుస్తకాలువంద పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయంలో ఇప్పుడా సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరింది. 1942 నుంచి 2025 వరకు అన్ని ప్రధాన తెలుగు దినపత్రికలు లభ్యమవుతాయి. పాత పత్రికలను బైండింగ్ చేసి మరీ భద్రపరచడం విశేషం. వార పత్రికలు, ప్రాచీన, ఆధునిక కవులు, రచయితల సాహిత్యం, గాంధీజీ రచనలు, తాళపత్ర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. పింగళి వెంకయ్య, ఆచార్య ఎన్జీ రంగా, కొండా వెంకటప్పయ్య, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం, రావూరి భరద్వాజ, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, ఊటుకూరి లక్ష్మీకాంతం, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, అడివి బాపిరాజు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, వావిలాల గోపాలకృష్ణయ్య, వెలగా వెంకటప్పయ్య. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, స్వామి విద్యాప్రకాశనందగిరి, సి.నారాయణరెడ్డి వంటి ప్రముఖులు సారస్వత నికేతనాన్ని సందర్శించారు. పాత్రికేయ సుప్రసిద్ధులు పొత్తూరి వెంకటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ తదితరులు ఇక్కడి పుస్తకాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.ఉద్యోగార్థులకు వరండిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల వేటలో ఉన్న యువతకు వేటపాలెం గ్రంథాలయం ఒక వరమనే చెప్పాలి. అనేక రకాలైన పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రతిరోజూ ఇక్కడికొచ్చి పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి దాదాపు 50 మంది వరకు వస్తుంటారు. పరిశోధనలు చేసే కొందరు విదేశీయులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తారు. మార్కెట్లో దొరకని ఎలాంటి పాత పుస్తకమైనా ఇక్కడ లభ్యం కావడం తథ్యం. ముగ్గురు సిబ్బంది సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సాహితీప్రియులు ఒక్కసారైనా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి తీరాలి.డిజిటలైజేషన్ దిశగా అడుగులుమా గ్రంథాలయంలో తెలుగు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం, ఇంకా ఇతర భాషలకు సంబంధించి లక్షా ఇరవై వేల పుస్తకాలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నాం. ఇందుకుగాను ఇండెక్స్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యాం. ప్రధానంగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నిత్యం చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చి పుస్తక పఠనం గావిస్తారు. పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు కూడా అధ్యయనం సాగిస్తుంటారు. గ్రంథాలయం రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారం సెలవు.పి.శ్రీవల్లి, గ్రంథాలయాధికారి (చదవండి: ఇంట్లోనే స్పా సౌకర్యం..! పట్టులాంటి చర్మం కోసం..) -
ఇంట్లోనే స్పా సౌకర్యం..! పట్టులాంటి చర్మం కోసం..
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అలసటల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ‘పోర్టబుల్ సోనా బాత్ స్టీమర్’ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పుకోవచ్చు. ఇది ఇంట్లోనే సౌకర్యవంతమైన స్పా అనుభూతిని కలిగిస్తుంది. దీని లోపల విశాలమైన చోటుతో కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. స్టీమింగ్ టబ్తో పాటు 3 లీటర్ల సామర్థ్యం గల స్టీమ్ జనరేటర్ లభిస్తుంది. ఇది ఎక్కువసేపు ఆవిరిని అందిస్తుంది. ఈ డిజైన్ చాలా అనుకూలమైనది. ఉపయోగంలో లేనప్పుడు సులభంగా మడతపెట్టి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా సులువుగా వెంట తీసుకెళ్లవచ్చు. లోపలి భాగం వాటర్ప్రూఫ్ మెటీరియల్తో, బలమైన స్టెయి లెస్ స్టీల్ ఫ్రేమ్తో (అటాచ్డ్ స్టాండ్స్) తయారు కావడంతో శుభ్రం చేయడం, ఆరబెట్టడం చాలా సులభం.రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉండటంతో సమయాన్ని, ఉష్ణోగ్రతను సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది కేవలం 15 నిమిషాల్లో వేడెక్కుతుంది, ఆవిరి ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. డ్యూయల్ హెడ్ జిప్ ఉండటంతో దీన్ని లోపల నుంచి క్లోజ్ చేసుకోవడం కూడా తేలికే!ఈ స్టీమర్తో మడత కుర్చీ, కంట్రోలర్, మ్యాట్ వంటి ఉపకరణాలు లభిస్తాయి. ఈ స్టీమర్ అలసట, ఉపశమనం, ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తుంది. నిద్ర సమస్యలను తగ్గించి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. అలాగే మృదువైన చర్మాన్ని పొందడానికి ఈ డివైస్ భలేగా ఉపయోగపడుతుంది. ఒక్కో సైజుని బట్టి, మెటీరియల్ క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.పట్టులాంటి చర్మం కోసం..ఎక్స్ఫోలియేషన్ ట్రీట్మెంట్ – చర్మ సంరక్షణలో కీలకమైన ప్రక్రియ ఇది. చర్మం పైపొరపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, చర్మాన్ని పరిశుభ్రంగా, తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ చికిత్సతో చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ చికిత్స ప్రధానంగా భౌతిక ఎక్స్ఫోలియేషన్, రసాయన ఎక్స్ఫోలియేషన్ అనే రెండు రకాల పద్ధతుల్లో ఉంటుంది. భౌతిక ఎక్స్ఫోలియేషన్లో స్క్రబ్లు, బ్రష్లతో చర్మాన్ని సున్నితంగా రుద్ది మృతకణాలను తొలగిస్తారు. రసాయన ఎక్స్ఫోలియేషన్లో కొన్నిరకాల ఆమ్లాలను ఉపయోగించి మృతకణాలను పోగొడతారు. ఈ పద్ధతి చర్మాన్ని మరింత లోతుగా శుభ్రపరుస్తుంది. ఈ చికిత్స పొందేటప్పుడు చర్మవైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. (చదవండి: -
పీసీఓఎస్తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు
తల్లిదండ్రుల మాటలు పిల్లల్లో భద్రతనివ్వాలి, బలమవ్వాలి, ఉత్సాహాన్ని నింపాలి. కానీ చాలా సందర్భాల్లో అవే మాటలు పిల్లల్లో భయాన్ని నాటేస్తాయి. దాంతో పిల్లలు తమ తప్పులను భయంతో దాచడం నేర్చుకుంటారు. లేదా మౌనంగా తిరగబడతారు. చివరకు తల్లిదండ్రుల ప్రేమకూ, పిల్లల బాధకూ మధ్య ఓ అఘాతం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే మాటలు; ప్రేమను బెదిరింపుగా మార్చే పదాలు; పిల్లల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలి. వాటిని మార్చుకుని పిల్లల్లో ఆశనూ, ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ‘‘నీకు అన్నీ కొనిపెడుతున్నాం, చదివిస్తున్నాం. ఇంకేం కావాలి?’’చాలామంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని ప్రేమతో, బాధ్యతతో, త్యాగాన్ని గుర్తుచేసే కోణంలో చెబుతారు. కాని, పిల్లలకు ఇది లావాదేవీలా అనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం తినిపించడం, చదివించడం వంటి బాహ్య సౌకర్యాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాంతో, వారు తమ ఎమోషనల్ అవసరాలను తల్లిదండ్రుల నుంచి కాకుండా, బయటి ప్రపంచం నుంచి పొందాలని ప్రయత్నిస్తారు. కొంచెం సానుభూతి చూపినా వారికి దగ్గరవుతారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)‘‘నీకు అన్నీ సమకూర్చడం పేరెంట్స్గా మా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉన్నావా?’’ అని అడిగితే చాలు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నారనే అనుభూతిని పెంచుతుంది. ‘నా భావాలు తల్లిదండ్రులకు ముఖ్యం’ అనే భద్రతా భావన పెరుగుతుంది. కంగారు పడకుండా తమ బాధలను, కలలను, భయాలను పంచుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, అనుబంధం, కృతజ్ఞత లాంటి భావాలు పెరుగుతాయి. ‘‘నీ కోసమే బతుకుతున్నా!’’ఈ వాక్యం తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పేదే అయినా, బిడ్డ వల్లనే తన బతుకు భారమైపోయిందన్న సందేశాన్ని పంపిస్తుంది. ‘‘అమ్మ, నాన్న నాకోసం జీవితాన్నే వదిలేశారు. మరి నేను నా కోరికల కోసం బ్రతికితే ఎలా?’’ అనే భావనను నాటుతుంది. కోర్సులు, కెరీర్, పెళ్లి నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. ప్రేమ అనేది త్యాగం కావాలన్న తప్పుడు నమ్మకం వారిలో చెరగని చిహ్నంలా మిగిలిపోతుంది. తర్వాత కూడా ఇతరులతో సంబంధాల్లో తామే త్యాగం చేయాలన్న కండిషనింగ్తో బతకాల్సి వస్తుంది. ‘‘నీతో జీవించడం నా జీవితంలో అతి గొప్ప భాగం. నువ్వు నీ పంథాలో నడవాలి, నేను నీ వెంటే ఉంటాను’’ అని చెప్పి చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఆత్మీయత, స్వేచ్ఛ, అనుబంధం మూడూ వ్యక్తమవుతాయి. తల్లిదండ్రుల ప్రేమ నిబంధనలపై ఆధారపడదన్న నమ్మకంతో వారు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. కొడుకు/కూతురు అనే పరిధిలో కాకుండా తమ వ్యక్తిగతమైన గమ్యాన్ని అన్వేషించే బలమైన వ్యక్తిగా ఎదుగుతారు.‘‘నీ మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది!’’ఈ వాక్యం తల్లిదండ్రుల భావోద్వేగ బాధను వ్యక్తపరుస్తోంది అనిపించినా, నిజానికి ఇది పిల్లల వ్యక్తిత్వ అభివ్యక్తిని అణచివేసే వాక్యం. తమ మాటలు పెద్దవాళ్లకు బాధ కలిగించవచ్చని, కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని నాటుతుంది. దీంతో పిల్లలు తమ అసలు భావాలను పంచుకోకుండా దాచేస్తారు. ఫేక్ పర్సనాలిటీలో జీవించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలంలో ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా కోపానికి దారి తీస్తుంది. దీనికి బదులుగా ‘‘నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. అదేమిటో చెప్పడం వల్ల మనం నిజంగా దగ్గర కావచ్చు’’ అని చెప్పడం వల్ల పిల్లలలో భద్రతను, విశ్వాసాన్ని, స్పష్టతను నాటుతుంది. ఎలాంటి భావాలనైనా తల్లిదండ్రులతో పంచుకోవాలనిపిస్తుంది. వారు తమ నిజమైన భావాలను అంగీకరించడంలో సామర్థ్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది.‘‘నువ్విలా ఉంటే నీతో ఎవ్వరూ కలవరు!’’ఈ వాక్యం ఇతర మాటలకంటే తీవ్రంగా పిల్లల ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ తీస్తుంది. తమ వ్యక్తిత్వం పట్ల అసహనం, తమలో మారలేని లోపాలు ఉన్నాయన్న అపోహ, భవిష్యత్తులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం నాటుతుంది. దీనివల్ల సోషల్ యాంగ్జయిటీ మొదలవుతుంది. వారిని బంధాలకు దూరంగా ఉంచుతుంది. ఇతరులకు నచ్చేందుకు తమ అసలైన భావనలను, అభిరుచులను దాచిపెడతారు. ‘‘నేను కలవదగిన వ్యక్తిని కాను’’ అన్న కోర్ బిలీఫ్ బలపడుతుంది.‘‘నువ్వు మారాలనుకునే క్షణం నుంచే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం మొదలవుతుంది’’ అని చెప్తే మార్పును శిక్షగా కాక, శక్తిగా చూపుతుంది. ‘నాలో మార్పు సాధ్యమే’, ‘నేను మారగలను’ అనే గ్రోత్ మైండ్ సెట్ను నాటుతుంది. దీనివల్ల నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయనే భావన చిగురిస్తుంది. మార్పు అవకాశం బయట ఎక్కడో లేదని, తనలోనే మొదలవుతుందనే ఇంట్రాస్పెక్షన్తో పిల్లలు ఎదుగుతారు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్) -
Parenting Tip : పిల్లల్నిఇలా నిద్ర లేపండి!
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా అస్సలు లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను సులభంగా లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి....సమస్యను అర్థం చేసుకోవాలి: ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బది పడుతున్నారేమో తెలుసుకోవాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా? అసలు నిద్రపట్టలేదా? ఇంకేదైనా సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. సరిపోయిందా లేదా? స్కూలుకెళ్లే పిల్లలు కనీసం పదిగంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. చదవండి: ఉన్నత చదువులకు ఫస్ట్ ఫ్లైట్ అదే లాస్ట్..: ఆటో డ్రైవర్ కుమార్తె విషాదాంతంప్రేమతో లేపాలి: ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చె మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమగా చెప్పాలిఇష్టమైన ఫుడ్: పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరా నిద్రలేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
ఐ లవ్ యు డాడీ...
నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి పాత్ర కనిపిస్తుంది.భావోద్వేగాలకు ప్రాధాన్యంఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్ ఈవెంట్స్కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.టెక్నాలజీతో అనుబంధంఈ డిజిటల్ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్ లైన్ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్ టూల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.ఆధునిక తండ్రిమోడర్న్ ఫాదర్హుడ్ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.ఉదాహరణగా తండ్రిఓ ఆధునిక తండ్రిగా, సింగిల్ ఫాదర్గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు. పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.కరణ్ జోహర్ సరోగసీ ద్వారా జుహీ, యష్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్ డ్యాడ్గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు. -
'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?) -
సిల్క్ చీరలో సమంత.. ఇది 1930ల నాటి స్టైల్!
నటి సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) సింపుల్ డిజైనర్ వేర్లో ట్రెండీగా కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడే తన స్టైలిష్ ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటారామె. అలానే ఈసారి పచ్చి మామిడకాయ లోపలి భాగం రంగులోని చీరలో తళుక్కుమ్మంది. ఆ సంప్రదాయ చీరలో స్టైలిష్గా కనిపిస్తున్న సమంత అనుసరించిన ఫ్యాషన్ శైలి 1930ల నాటిది. అంతేకాదండోయ్ నాటి గ్లామర్ స్టైల్కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ చీర డిజైనింగ్ చెప్పే అర్థం చూస్తే షాకవ్వుతారు. ఇక్కడ సమంత రా మ్యాంగో శాటిన్ సిల్క్ చీరలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వావ్..! వాటే శారీ అనేలా ఉంది ఆమె లుక్. ఈ తాజా లుక్ 1920-30ల ఛానెల్ ఆర్డ్ డెకో శైలి అట. అంటే..ఇక్కడ సమంత ధరించిన చీర ఆర్ట్ డెకో ఉద్యమం నుంచి ప్రేరణ పొందిన డిజైన్. ఈ చీరపై కనిపించే బోల్డ్ లైన్లు, రేఖాగణిత నమునాలు, నిర్మాణ నైపుణ్యానికి సంబధించిన డిజైన్లో రూపొందిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆర్కిటెక్చర్కి సంబంధించిన గీతలే దర్శనమిస్తాయి. దీనిలో కనిపించే క్షితిజ సమాంతర రేఖలకు ప్రేరణ ఏరోడైనమిక్ డిజైన్ అని, ఇవి నాటికల్ అంశాలను కూడా నొక్కిచెబుతాయని అంటున్నారు ష్యాషన్ నిపుణులు. అయితే ఈ గీతలు, రేఖలు అన్ని చేతితో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ అట. సున్నితమైన బంగారు జరీతో డిజైన్ చేస్తారట. చూడటానికి సాదాసీదాగా కనిపించే ఈ శారీని రిచ్లుక్లో ఉండి, రాచరికానికి అద్ధం పట్టే విలాసవంతమైన స్టైలిష్వేర్గా అభివర్ణిస్తారు ఫ్యాషన్ ప్రియులు. ఆ చీరకు తగ్గ మేకప్, చెవిపోగులు, కాక్టెయిల్ రింగ్తో తన రూపాన్ని అద్భుతంగా కనిపించేలా చేసింది సమంత. పాత ఫ్యాషన్కి సరికొత్త రూపమిచ్చేలా కొత్త ట్రెండ్ని సెట్ చేసేలా ఉంది సమంత వింటేజ్ ఆర్ట్ డెకో లుక్. చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ శాటిన్ సిల్క్ చీర ధర వచ్చేసి సుమారు రూ. 50 వేలు పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by RAW MANGO (@raw_mango) (చదవండి: ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..) -
ఎవరీ లీనా నాయర్? ఏకంగా బ్రిటిష్ అత్యున్నత గౌరవం..
భారత సంతతి సీఈవో లీనా నాయర్కు బ్రిటన్ అత్యున్నత గౌరవం లభించింది. ఆమె ఛానెల్ సీఈవోగా రిటైల్ అండ్ వినియోగదారుల రంగంలో అత్యున్నతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆ రంగంలో ఆమె అందించిన సేవలకు, కృషికి గానూ..యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో సత్కరించింది. ఈ మేరకు ఛానెల్ గ్లోబెల ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీనా నాయర్ను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు. ఈ కొత్తఏడాది 2025 గౌరవ పురస్కారాల జాబితాలో ఆమె ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. అంతేగాదు ఛానెల్ బ్రాండ్ లీనా శక్తిమంతమైన నాయకురాలిగా ప్రపంచఖ్యాతీ సంపాదించుకుందని ప్రశంసించింది. దీర్ఘకాలిక సమగ్ర వ్యాపార ప్రభావాన్ని అందించింది. తన బ్రాండ్ హవాను కొనసాగించడం, క్లయింట్ అనుభవాన్ని మెరుగుపరచడం,నిలకడగా సాగేలా వేగవంతం చేయడం వంటి సేవలను అందించిదని ఛానెల్ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా భారతీయ వ్యాపార కార్యనిర్వాహకురాలిగి లీనా నాయర్ జనవరి 2022లో ఛానెల్లో బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్లో ఆమెనే తొలి భాతర సంతతి మహిళా సీఈవో. తన నాయకత్వంలో ఛానెల్ బ్రాండ్కి మంచి గుర్తింపు లభించేలా కృషి చేసింది. వినియోగదారులను ఆకర్షించేలా గణనీయమైన పురోగతిని అందుకునేలా చేసింది. ముఖ్యంగా కంపెనీ ఫౌండేషన్కు గణనీయమైన ఆర్థిక సహాయం లభించేలా చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 మిలియన్లకు పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుండటం విశేషం. ఇక ఆమె ఛానెల్లో చేరడాని కంటే ముందు..యూనిలీవర్లో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా సేవలందించారు. చివరగా లీనా స్వస్థలం భారత్లోని మహారాష్ట్రలోని కోల్హాపూర్. ఆమె బాల్యమంతా గడిచింది. ఉన్నత విద్య కోస యూకే వచ్చి అక్కడే సెటిల్ అయ్యారామె. (చదవండి: ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్ఈ') -
ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక 'ఫిన్ఈ'
ఆర్థిక అక్షరాస్యత కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఈ తరానికి ఇదొక తప్పనిసరి అవసరమని ఫిన్ఈ వ్యవస్థాపకురాలు బ్లెసిడా బెన్నీ అన్నారు. విద్యార్థులు మొదలు, వర్కింగ్ ఫ్రొఫెషనల్స్ వరకూ ఆర్థిక విద్య (ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్)ను చేరువ చేయడానికి ఫిన్ఈ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక ఫిన్వర్సిటీని ప్రారంభించామన్నారు. నగరంలోని మెర్క్యూర్ హోటల్ వేదికగా గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విప్లవాత్మక ఫిన్వర్సిటీని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవానికి మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ప్రధానమైన అంశమని, మనం మరింత విజ్ఞానం, సాధికారత కలిగిన జనాభా కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆర్థిక అవగాహనను ప్రోత్సహించడం ముఖ్యమని తెలిపారు. ఆర్థిక స్వాతంత్య్రం అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్తును నిర్మించడమే ఈ వర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం బ్లెసిడా బెన్నీ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. యువతతో పాటు నిపుణులలో ఆర్థిక అక్షరాస్యతలో గణనీయమైన అంతరం ఉందని, ఈ క్లిష్టమైన అంతరాన్ని తగ్గించే ప్రణాళికలు తమ లక్ష్యమని అన్నారు. ఫిన్వర్సిటీతో రానున్న రెండేళ్లలో 20 లక్షల మందిని మార్చుతూ.. ప్రపంచ ఆర్థిక నైపుణ్యాలతో సాధికారత కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్వి బద్రీనాథ్, ఫిన్ఈ డైరెక్టర్ నులకజోడు మధు వినయ్, నటులు శ్రీ తేజ్, అభిలాష్ శంకర, ప్రఖ్యాత గాయకుడు లక్ష నాయుడు, జబర్దస్త్ ఆర్టిస్టులు తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..
ఆషాఢమాసంలో బోనాల జాతర ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. పాతబస్తీలో ఈసారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇప్పటికే సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పాతబస్తీలో బోనాల సమర్పణ అనంతరం నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపులో ప్రధాన పాత్ర వహించే శకటాలు, కళాకారుల విన్యాసాల కోసం సంబంధిత ఉత్సవాల నిర్వాహకులు పెద్ద ఎత్తున కళాకారులకు ఇప్పటికే బుకింగ్స్ ఇస్తున్నారు.(చదవండి: ఆదివాసీ కోయిల.. ! ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాస్తా.. ర్యాప్ సింగర్గా..)కళాకారుల నృత్య ప్రదర్శనలు.. ఈసారి ఉత్సవాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు హైలెట్గా నిలువనున్నాయి. కళాకారులు ప్రదర్శించే హావభావాలను చూసే ప్రతి ఒక్కరూ భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందుతారు. ఘట స్థాపన ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు తదితర కార్యక్రమాల్లో వివిధ రకాల అలంకరణల్లో, రూపాల్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తాయి. పాతబస్తీకి ప్రత్యేకం..నిజాం కాలం నుంచి ఇక్కడి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని సమర్పించడం ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే విధంగా నగరంలో ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. తెలంగాణ జిల్లాల్లోనే అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు పాతబస్తీ ప్రత్యేకతను చాటుతాయి.ఇతర రాష్ట్రాల కళాకారులకు ఉపాధిగా.. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడుకు చెందిన కళాకారులు ఎక్కువగా పాల్గొంటారు. నగరంలో బోనాల జాతర ఉత్సవాల్లో కళాకారులు, వినూత్న తరహా సెట్టింగ్స్ కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ఈసారి కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని ప్రముఖ దేవాలయాల నిర్వాహకులు కళాకారుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో కొన్ని వందల కుటుంబాల కళాకారులకు ఈ బోనాల జాతర ఉత్సవాలు యేటా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆకట్టుకునే రూపాలు, నృత్యాలు.. బోనాల జాతర ఉరేగింపులో కేరళ పులికళి, భేరీ నృత్యం, గరిగెలు, బేతాళ నృత్యం, ఒగ్గోళ్ల నృత్యం, బోనాలు, కాళికాదేవీ, లక్ష్మీదేవీ, వేంకటేశ్వర స్వామి, పొట్టి పోతరాజులు, సింహరథం, డప్పులోళ్లు, హనుమంతునిలో రాముడు, తయ్యం, దేవ నృత్యం, ఉరుములు, కొమ్ముకొయ్య, జడ కోలాటం, యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి శకటం.. అందులో ఏర్పాటు చేసే మూర్తులు, విజయవాడ కనకదర్గమ్మ దేవాలయ రథం.. అందులో కొలువుదీరే అమ్మవారి వేషధారణలోని కళాకారుల హావభావాలు.. ఇలా ఒకటేంటి పలు రకాల శకటాలు, కళాకారుల నత్యాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
పువ్వుల డిజైనర్వేర్లో స్టైలిష్గా కనిపిద్దాం ఇలా..!
పువ్వులకు మగువలకు విడదీయరాని బంధం ఉంటుంది. పువ్వులను తమ భుజాల మీదుగా మణికట్టు వరకు అలంకరించుకుని అందంగా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్ గౌన్లలో విరివిగా కనిపించే ఈ స్టైలు ఇప్పుడు ఎల్లలు దాటి మన సంప్రదాయ డిజైనర్ వేర్లోనూ కనువిందు చేస్తోంది. ఫ్యాబ్రిక్తో పువ్వులు వచ్చేలా కుట్టడం ఈ స్టైల్ ప్రత్యేకత. ఇక పువ్వులు చేతుల్లో కాదు, చేతులకు అందంగా అలంకరించుకోవచ్చు.పింక్, పీచ్ కలర్ బ్లౌజ్ అయితే ఫెమినైన్ లుక్, రెడ్ కలర్ అయితే స్టేట్మెంట్ అటైర్గా, తెలుపు, గోధుమరంగు అయితే వేదికలపైన పల్లకీ లుక్తో కనిపిస్తారు. ఏ స్టైల్లో కనిపించాలనుకుంటే ఆ డ్రెస్సింగ్కి సరిగ్గా నప్పే ఈ గులాబీల గుచ్చాలు ప్రత్యేకంగా కనిపించడమే కాదు, ఫొటోలలోనూ విలాసంగా ఉంటుందనే ఆలోచన కూడా దీనికి క్రేజ్ పెంచుతోంది. నిన్నటి వరకు పిల్లల డ్రెస్సింగ్లో కనిపించే ఈ స్టైల్ పెద్దవారి చీరకట్టుకూ అందాన్ని తీసుకువచ్చింది. రిసెప్షన్, సంగీత్.. వంటి వేడుకలలో గ్రాండ్గా వెలుగుతోంది.స్లీవ్స్ డిజైన్ బోల్డ్గా ఉంటే, నెక్ సింపుల్గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఆభరణాలు కాకుండా సన్నని చైన్లు వాడచ్చు.గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌజ్ స్లీవ్స్ డిజైన్ చేయడం ఈ స్టైల్ స్పెషల్. ఈ పువ్వులు లేయర్లుగా మంచి ఫ్లేర్ వచ్చేలా డిజైన్ చేస్తారు. వీటిని ఎక్కువగా నెట్, ఆర్గాంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్తో తయారు చేస్తారు.ఇండో వెస్టర్న్ డ్రెస్సుల్లో, ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ + స్కర్ట్ లుక్, పెప్లం టాప్స్, షరారా, పలాజో సెట్లలో విరివిగా కనిపిస్తున్నాయి.సంప్రదాయ డ్రెస్సులకు రెండు వైపులా ఫ్యాబ్రిక్ గులాబీల కుచ్చు ఉంటే, వెస్ట్రన్ స్టైల్స్లో బ్లౌజ్ లేదా గౌన్కు, సింగిల్ షోల్డర్ ఫ్రాక్కి ఒకవైపు గులాబీ గుచ్చం కనువిందు చేస్తుంది.శారీ లేదా లెహంగా కూడా సింగిల్ షోల్డర్ రోజ్ బొకేని డిజైన్ చేయించుకోవచ్చు.శారీ బ్లౌజ్ ట్రెండ్లలో గులాబీ స్లీవ్స్ అందంగా అమరిపోతున్నాయి.రోజ్ స్లీవ్స్ ఎంచుకున్నప్పుడు జుట్టును పోనీటైల్ లేదా బన్ స్టైల్ వేసుకుంటే డ్రెస్సింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.హై నెక్ టాప్ అయితే డ్యూయల్ రోజ్ స్లీవ్స్ బాగుంటాయి. (చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..) -
తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్ వరల్డ్ 2025లో..
కూచిపూడి కళాకారిణి శ్రవ్యమానస. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టిన శ్రవ్య తనకు తానుగా ఎక్కిన నిచ్చెన మెట్లే అన్నీ. తొమ్మిదేళ్ల వయసులో గజ్జె కట్టి... నేడు ‘మిస్ వరల్డ్ 2025’ కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శనలిచ్చిన ఘనతను తన ఖాతాలో జమ చేసుకున్నారు. కళాకారుల బిడ్డ! శ్రవ్య అమ్మానాన్నలిద్దరూ కళాకారులే. సామాన్య కుటుంబం కావడంతో ఉద్యోగం మీదనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. శ్రవ్య జీవితంలో నాట్యం, చదువు రెండూ సమతూకంగానే పెరిగాయి. ఎంటెక్ పూర్తి కాగానే హైదరాబాద్ మెట్రో రైల్లో ఉద్యోగం వచ్చింది. కానీ కళ కోసం ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. దేశవిదేశాల్లో ఆమె ప్రదర్శనలు పద్దెనిమిది వందలు దాటాయి. ఆమె అకాడెమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల సంఖ్య మూడు వేలు దాటింది. అధ్యయనమే గెలిపిస్తోంది! ‘నాట్యసాధనలో నిత్యం మేధోమధనం జరుగుతూ ఉండాలి. గురువులు నేర్పించిన జ్ఞానంతో సరిపుచ్చుకుంటే అక్కడే ఆగిపోతాం’ అంటారు శ్రవ్య. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బుద్ధవనంలో ప్రదర్శన బుద్ధుడి ఇతివృత్తంగా ఉండాలన్నారు నిర్వహకులు. వారం రోజుల్లో బౌద్ధాన్ని అధ్యయనం చేసి, కాస్ట్యూమ్స్ లేత రంగులతో నిరాడంబరంగా డిజైన్ చేసి, బృందం మొత్తానికి కుట్టించడం వరకు ఎందులోనూ రాజీ పడలేదామె. అలాగే చౌమొహల్లా ప్యాలెస్ ప్రదర్శనకు సితార్ వంటి నిజాం సంగీత శైలితో సెమీ క్లాసికల్ రూపొందించి ప్రదర్శించారు. పోచంపల్లిలో తెలుగు జానపదం కోలాటం, శిల్పారామంలో బృందావనం, బంజారా, రాసలీలలు ప్రదర్శించి చూపారు. ఆర్ద్రతే కళ క్యాన్సర్ పేషెంట్కి విగ్ తయారు చేయడానికి సహజమైన కేశాలు అవసరమని తెలిసి గుండు చేయించుకుని తన కేశాలనిచ్చారు శ్రవ్య. కళాకారులను బతికించేది మనసు లోతుల్లోంచి ఉబికి వచ్చే ఎమోషనే. ఈ సున్నితత్వాన్ని తనలో పదిలపరుచుకుంటున్నారామె. అబుదాబిలో శ్రీనివాస కల్యాణం ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ రావడం మధురానుభూతి, యాసిడ్ సర్వైవర్ మనోగతాన్ని ఆవిష్కరించడం నర్తకిగా ఆమె సామాజిక బాధ్యత. కళాకారులు సామాజిక సమస్యల మీద స్పందించడంతోపాటు సాంకేతికంగా కూడా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలి. చెయ్యి పట్టుకుని నడిపించే గాడ్ఫాదర్లు లేని శ్రవ్య మానస... డిజిటల్ వేదికగా ప్రపంచానికి సుపరిచితం కావడం వల్లనే మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘వ్యక్తిగా పరిపూర్ణత సాధించిన బ్యూటీ ప్రాజంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను’... అన్నప్పుడు ఆమెలో శిఖరాన్ని అధిరోహించిన సంతోషం వ్యక్తమైంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ వెడ్డింగ్ గౌనుకి ఒకటిన్నర మిలియన్ల వ్యూస్..!
ఐదంటే ఐదు డాలర్లు పెట్టి ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం నాటి వెడ్డింగ్ గౌన్ కొనుక్కుందామె, అది తొడుక్కుని చూద్దామని టిక్టాక్లో అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసింది. అయితే అది ఆమెకు సరి΄ోలేదు. దాంతో తనకన్నా కొద్దిగా తక్కువ పర్సనాలిటీ ఉన్న తన చెల్లెలికి ఆ గౌన్ ఇచ్చింది. అది ఆమెకు అతికినట్లు సరి΄ోయింది. త్వరలో జరగనున్న తన వెడ్డిండ్కి ఆ గౌన్ని డ్రై క్లీనింగ్ చేయించి దానినే ధరించాలని డిసైడ్ చేసుకుంది. ఇక్కడ అది కాదు విశేషం. వీరిద్దరి వీడియోస్కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. షష్టిపూర్తి కూడా జరుపుకున్న నాటి ఆ గౌను అంత నాజూగ్గా ఉండటం, అది కారుచౌకగా కొనుక్కుని దానికి చిన్న చిన్న రిపేర్లు చేయించి తన వెడ్డింగ్ రోజున అదే గౌన్ను ధరించాలనుకోవడం చాలా బాగుందంటూ అందరూ ఆ అక్కచెల్లెళ్లని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఓహియోలోని కొలంబస్కు చెందిన మ్యాడీ స్ట్రేయర్ అనే ఆమె వింటేజ్ వెడ్డింగ్ డ్రెస్లు దొరికే ఎస్టేట్ సేల్లో పాతకాలం నాటి ఈ వెడ్డింగ్ గౌన్ చూసి ముచ్చటపడింది. వెంటనే ఐదు డాలర్లు చెల్లించి దానిని కొనుక్కుంది. తనకు సరిపోకపోవడంతో చెల్లెలికి దానిని ప్రెజెంట్ చేసింది. అయితే ఆమె కూడా ఆ గౌనును చూసి మురిసిపోయి త్వరలో జరగబోయే తన పెళ్లికి బోలెడంత ఖరీదు చేసి అప్పటికే వెడ్డింగ్ గౌన్ను కొనుక్కున్నప్పటికీ దానిని పక్కనపెట్టి మరీ అక్క ఇచ్చిన ఈ గౌన్ తొడుక్కోవడానికి డిసైడైంది. వీరిద్దరి వీడియోలకూ ఒకటిన్నర మిలియన్లకి పైగా వ్యూస్, లక్షా ఇరవై ఆరువేల లైకులూ వచ్చాయి. Woman Buys 1963 Wedding Dress for $5 at Estate Sale—but There's a Twist - Newsweek https://t.co/s9Cgy4hgkE— Manuco (@manuco22) June 7, 2025 (చదవండి: Different Dowry Case: కట్నంగా బైక్, నగదుతోపాటు కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..) -
కలియుగ శ్రవణ కుమారుడు
రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో స్నానానికి తీసుకువెళ్లాడు. ఈ వార్త వైరల్ అయింది. బిహార్లోని కైమూర్ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్ సింగ్ అనే అతనికి తన తల్లి అంటే పంచప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగాస్నానం చేయాలని ఉంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతంంది. అంత భారం భరించలేడు తను. అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడలమీద కూచోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్లాడు. అక్కడ పవిత్రమైన గంగాస్నానం చేయించాడు. ‘‘అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత? దుస్తులు పాడుచేసుకున్న ప్రతిసారీ బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడిబట్టలు తొడుగుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. ఉప్పెక్కించుకుని తిప్పుతుంది. పిల్లలతో గుర్రం ఆట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మనాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగాస్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేనే తనను ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది’’ అంటున్నాడు.ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్లైనర్పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! -
అధునాతన కేన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభం
టాటా మెమోరియల్ సెంటర్తో (టీఎంసీ) కలిసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC)లో కొత్త భవంతి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్రం నిర్మాణానికి రూ. 550 కోట్ల పైగా మొత్తానికి కమిట్మెంట్తో ఐసీఐసీఐ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది. ఎనిమిది అంతస్తుల ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని HBCHRC వార్షిక సామర్థ్యం 6,200 పేషంట్లుగా ఉంది. తూర్పు భారతదేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిల్చేలా రూపొందిస్తున్న ఈ కొత్త భవనంలో 215 పైగా పడకలు ఉంటాయి. అన్ని అనుమతులకు లోబడి 2027 నాటికి ఇది పూర్తవుతుందని అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్ సీఎస్ఆర్ విభాగమైన ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ దీన్ని అమలును పర్యవేక్షిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) డైరెక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. (చదవండి: Different Dowry Case: కట్నంగా బైక్, నగదుతోపాటు కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే..) -
వింత కేసు: బైక్, డబ్బు సరిపోదు, కట్నంగా కిడ్నీ కూడా ఇవ్వాల్సిందే!
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటలా ఉంటున్నాయి. భార్యభర్తల్లో ఎవరో ఒకరి వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియా క్రేజ్ వంటి రకరకాల కారణాలతో వైవాహిక బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మరికొన్ని చోట్ల వరకట్నం దంపతుల పాలిట శాపంగా మారి బాంధవ్యాన్ని ముక్కలు చేస్తోంది. ఎన్నో వరకట్నం కేసుల్లో నగదు లేదా బంగారం వంటి అత్తింటి డిమాండ్లు గురించి విని ఉంటాం. కానీ ఇలాంటి డిమాండ్లతో కూడిన వరకట్నం కేసు మాత్రం ఇదే మొదటిది. వివరాల్లోకెళ్తే..బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన దీప్తి అనే మహిళకు 2021లో అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లైన రెండు నెలల వరకు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. పెళ్లిలో ఇచ్చిన కట్నం సరిపోదంటూ.. బైక్, మరికొంత నగదు ఇవ్వాల్సిందే అంటూ దీప్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు అత్తింటివారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడూ మా అబ్బాయి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడి కోసం కిడ్నీ కూడా దానం చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీప్తి భర్త పెళ్లికి ముందు నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నడు. కానీ దీప్తికి ఆ విషయం పెళ్లైన తర్వాతే తెలిసింది. మొదట్లో అత్తంటి వారి డిమాండ్లు ప్రతీఇంట్లో ఉండేవే కదా అని తేలిగ్గా తీసుకుంది. అది రాను రాను మితిమీరి..ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేంత వరకు దారితీశాయి. ఆమె కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే కుటుంబంలో మరింత ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో పోలీసులను సంప్రదించింది దీప్తి. ఆ నేపథ్యంలో అధికారులు ఇరువురి కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా..అది కూడా విఫలమైంది. అదీగాక అత్తింటి వేధింపులతో విసిగిపోయిన దీప్తి భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించి, విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించింది. అందుకు భర్త మాత్రం ససేమిరా అంటున్నాడు. అలాగే పోలీసులు దీప్తి ఫిర్యాదు మేరకు ఆమె భర్తతోపాటు మరో ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది. ఎక్కడైనా వరకట్నం కేసులో..అధిక డబ్బు లేదా బంగారం కోసం డిమాండ్ చేయడం వంటివి ఉంటాయి ఏకంగా ఓ వ్యక్తి అవయవాన్ని సైతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన వింత కేసు ఇదేనని చెబుతున్నారు అధికారులు.(చదవండి: చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..! తనిఖీల్లో షాకింగ్ విషయాలు..) -
చూస్తే నోరూరించే వంటకాలు..తింటే అంతే సంగతులు..!
ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు హోటల్కు వెళ్లి భోజనం చేయడం చాలా మందికి అలవాటు. హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. కమ్మటి భోజనం తింటున్నామని అనుకుంటున్నారే తప్ప ఫుడ్ తయారీ విషయంలో హోటళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు. తిన్నపుడు బాగుందనే భావనతో ఇంటికి చేరుకుంటారు. కాసేపటి తరువాత కడుపులో ఏదో అలజడి మొదలవుతుంది. గొంతులో మంట, కడుపులో పేగులు మెలేసినంతగా నొప్పి వస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్ అనుకుంటారే గానీ.. తిన్న ఫుడ్ గురించి పట్టించుకోరు. అయితే ఈనెల 10న కామారెడ్డిలోని పలు హోటళ్లపై ఫుడ్సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. తనిఖీల్లో జీర్ణించుకోలేని వాస్తవాలు వెలుగు చూశాయి. పేరున్న హోటళ్లలోనూ కిచెన్లు అధ్వానంగా, కంపుకొడుతూ కనిపించాయి. ఈగల మోతతోపాటు కుళ్లిపోయిన మాంసం, రొయ్యలు, ఇతర ఆహార పదార్థాలను చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. నిత్యావసరాలు చాలా వరకు కాలం చెల్లినవి గుర్తించారు.వాడిన నూనెలనే వాడుతూ...హోటళ్లలో బ్రాండెడ్వి కాకుండా సాధారణ నూనెలు వాడుతున్నారు. దానికి తోడు ఫ్రై ఐటంలు నూనెలలో వేయించిన తరువాత నూనెను ఇతర ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో చాలా మంది పామాయిల్ వాడుతున్నారు. మరికొన్ని హోటళ్లలో లోకల్గా తయారయ్యే రిఫైన్డ్ అయిల్ను వినియోగిస్తున్నారు. కొనిచోట్ల మాత్రమే బ్రాండెడ్ ఆయిల్స్ వాడుతున్నారని తెలుస్తోంది.నిల్వ ఉంచిన మాంసం..హోటళ్లలో ఎక్కువ మంది మాంసాహారం తినడానికే ఇష్టపడతారు. ప్రధానంగా చికెన్, ప్రాన్స్, ఫిష్ ఐటంలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. హోటళ్ల నిర్వాహకులు చేపలు, రొయ్యలను ఇతర ప్రాంతాల నుంచి హోల్సెల్గా తెప్పించి ఫ్రిజ్లలో నిల్వ ఉంచుతారు. రోజుల తరబడి నిల్వ ఉంచడం మూలంగా అవి పాడవుతాయి. వాటినే శుభ్రం చేసి ఉడికించి వండి వడ్డిస్తున్నారు. అలాగే చికెన్, మటన్ కూడా నిల్వ చేసి, వేడి చేసి వడ్డిస్తున్నారు.అధ్వానంగా కిచెన్లు..చాలా హోటళ్లలో కిచెన్ గదులు అధ్వానంగా ఉంటున్నాయి. కనీస పరిశుభ్రత పాటించడం లేదు. ఈగలు మోతమోగిస్తున్నా పట్టించుకోరు. కొన్ని హోటళ్లలో ఎలుకలు కూడా సంచరిస్తుంటాయి. తినడానికి కూర్చునే గదులు, హాళ్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి.రెగ్యులర్ తనిఖీలు లేకే...సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు హోటళ్లు, స్వీట్ హోంలు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేయాల్సి ఉండగా.. నెలల తరబడి కూడా తనిఖీలు చేపట్టడం లేదు. అప్పుడప్పుడు మొక్కుబడిగా.. అదీ చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల మీద దాడులు చేయడం తప్ప పెద్ద హోటళ్లలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించేదాకా ఇక్కడి హోటళ్లలో అధ్వాన పరిస్థితులు ఉన్నట్టు ఎవరూ గుర్తించలేదు. ఇప్పటికై నా అధికారులు రెగ్యులర్గా తనిఖీలు చేపట్టి, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బ్రెస్ట్ కేన్సర్: గుర్తించండి.. పోరాడండి..
ఈ మధ్య సర్వ సాధారణంగా మారిన రొమ్ము కేన్సర్ను ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ ఫ్యూజీఫిల్మ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక ప్రచార కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రారంభించారు. అపోలో ఫౌండేషన్ అమలు చేస్తున్న ఈ ప్రచారాన్ని హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కోహినూర్ వేదికగా బుధవారం దీనిని ప్రారంభించారు. ఉపాసన మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యుత్తమ సేవలను అందించడమే కాకుండా.. బ్రెస్ట్ కేన్సర్ వంటి రోగాలను ముందుగా గుర్తించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సరైన అవగాహన, తగిన సమాచారం, సత్వరగా చికిత్సకు వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ఫ్యూజీఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఐసీఎంఆర్ వారి జాతీయ కేన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం రోగాల్లో 14 శాతం ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఫ్యూజీఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా ఈ ప్రచార వివరాలు వెల్లడించారు. దేశంలోని 24 నగరాల్లో, శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఈ ప్రచారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, సామాజిక సేవా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: డెట్రాయిట్లో 'తెలుగు పల్లెవంట') -
వసివాడుతున్న బాల్యం..
అభంశుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా లెక్కల్లోకి రాని వారెందరో..మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు బడి ముఖం చూడని వారున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పిల్ల లను పనిలో పెట్టేలా ప్రోత్సహిస్తుండడంతో..వ్యాపార వర్గాల వారు కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పనిని బాలలతో చేయిస్తున్నారు. కొందరు బాలలైతే ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనులు చేస్తూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నేడు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం సందర్భంగా.. బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల వెతలపై ప్రత్యేక కథనం.. విజయనగరం గంటస్తంభం: చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకారి్మక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.బాలలను పనిలో పెడితే...కఠిన చర్యలుబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం. ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకారి్మకుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. ఎస్డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్ (చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..) -
ఉత్త డబ్బారాయుడు : ఇలాంటి భర్తతో జీవితాంతం ఎలా?
నాకు గత ఏడాది పెళ్లయింది. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. పెళ్ళి అయిన మొదటి రోజు నుంచి నేను గమనించిందేమిటంటే... ఆయన తన గురించి తాను విపరీతంగా గొప్పలు చెప్పకుంటారు. మిగిలిన వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. నాఒక్క దానితోనే ఇలా ఉంటాడనుకున్నాను. కానీ బయట అందరితో ఇలాగే ఉంటాడని తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ తనని స్పెషల్గా చూడాలనుకుంటాడు. ఆయన చుట్టాల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఆయన్ని ‘డబ్బారాయుడు’ అంటారట. ఆఫీస్లో కూడా అందరితో ఇలా మాట్లాడు తున్నాడని తెలిసి ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఆయన ప్రవర్తన మార లేదు. కిందపడ్డా తనదే పై చేయి అంటాడు. ఈ మధ్య నా కజిన్ పెళ్ళికి వెళ్తే అక్కడ తనకంటే ఆపెళ్ళి కొడుకుకి ఎక్కువ మర్యాదలు చేస్తున్నారని అలిగి వచ్చేశాడు. ఎవరైనా చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు. ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో తెలీట్లేదు. ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఉండగలనా అనిపిస్తోంది! – అలేఖ్య, చిత్తూరుమీరు చెప్పిన విషయాలు చదివిన తరువాత మీ భర్తకి ఉన్న పర్సనాలిటీ సమస్య వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడి, అసౌకర్యానికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన సహజమే. మీ భర్త తనని గొప్పగా ప్రదర్శించుకోవడం, ఇతరుల్ని చిన్నచూపు చూడడం, విమర్శలను ఒప్పుకోకపోవడం, అందరిపై తానే మెరుగ్గా ఉండాలని కోరుకోవడం, తాను చాల గొప్పవాడిననే భావన, ఇతరుల భావాల పట్ల ఎంపతీ లేకపోవడం) ఇవన్నీ ‘నార్సిసిస్టిక్‘ వ్యక్తిత్వ లక్షణాలుగా పేర్కొనవచ్చు. తమ తప్పులకి అవతలి వాళ్ళని బాధ్యులుగా చేసి గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే ‘గ్యాస్ లైటింగ్’ అనే పద్ధతిని వీళ్ళు ఎక్కువగా వాడతారు. ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్ ఈ పర్సనాలిటీ సమస్య జన్యుపరమైన కారణాలు, పెంపక లోపాలు, బాల్యంలో వారు పెరిగిన పరిస్థితుల వలన రావచ్చు. స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ సమస్యను చూస్తాము. వాళ్ళకు తాము ఏదైనా సమస్యతో ఉన్నామనే ఎరుక ఉండదు. అందువల్ల వీరికి చికిత్స చేయడం కూడా చాలా కష్టం. వారిలో మారాలనే ఆలోచన ఎంతో కొంత ఉంటే సైకోథెరపీ ద్వారా కొంతమార్పు తీసుకురావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరసీ’ ద్వారా తన ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చుకోవచ్చు. కానీ ఇది కాస్త సమయంతో కూడుకున్న వ్యవహారం. మీరు ఇద్దరూ కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటే సహజంగానే మీ బంధాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కానీ దానికి కూడా అతను సహకరించాల్సిన అవసరం ఉంది.‘నార్సిజం’కు ప్రత్యేకంగా మందులు లేవు. కానీ వీరిలో డిప్రెషన్, ఆందోళన లేదా కోపం లాంటి సమస్యలు ఉంటే వాటికి మానసిక వైద్యులు మందులు సూచిస్తారు. అయితే వీరితో జీవితాంతం కలిసి ఉండవచ్చా అనే ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. కొంత కష్టమే అయినా మీరు అతన్ని అతనిలా అంగీకరించగలిగితే కలిసి ఉండొచ్చు. కానీ కొన్నిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తే మీరు అతనికి ఆ విషయాన్ని చెప్పగలగాలి. మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. చివరిగా మీకు నాదొక సలహా. పొగడ్తకి లొంగని మనిషి లోకంలో లేరు. అలాంటిది మీ భర్తకు పొగడ్తే ఆహారం, నీరు అన్నీ! అప్పుడప్పుడూ మీరే అతన్ని పొగిడితే అతనూ సంతోషంగా ఉంటాడు. మీరూ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. మీ లాంటి ‘సైలెంట్ సఫరర్స్’ లోకంలో చాలామందే ఉన్నారు. విడిపోవడం చాలా సులభం, కానీ కలిసి ఉండాలంటే మీవైపునుండి కొంత సర్దుబాటు, ఓర్పు, త్యాగం అవసరం. గట్టి ప్రయత్నంతో చాలా సమస్యలు సర్దుకుంటాయి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు. ఆల్ ది బెస్ట్!-డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీకsakshifamily3@gmail.com -
Eruvaka pournami సేద్యం ఓ యజ్ఞం
వేదాన్నిజీవన విధానంగా మార్చుకున్నారు భారతీయులు. పూజలు, హోమాది క్రతువుల్లో మాత్రమే కాదు, వేద ప్రతిపాదిత వృత్తులనే ఉపాధి మార్గాలుగా ఎంచుకున్నారు. వ్యవసాయం కూడా వేదం సూచించినదే! వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ... తొలకరి జల్లులతో నేలతల్లి పులకరించే క్షణాలివి. రుతుపవనాలు బలపడి, వర్షాలు మొద లవుతాయి. దుక్కి దున్ని పొలం పనులను మొదలుపెట్టడానికి ఇది అనువైన సమయం. అంతేకాదు! అందరూ ఒకే సారి పనులు మొదలుపెడితే వ్యవసాయం కూడా క్రమపద్ధతిలోఉంటుంది. అందుకోసమే జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవ సాయ పనులను మొదలుపెట్టాలని సూచించి ఉంటారు మన పెద్దలు. ఒక రకంగా ఇది వ్యవసాయానికి ఉగాది లాంటిది. పురాణాల్లోనూ వ్యవ సాయదారులకు సంబంధించిన అనేక విషయాలు చర్చించడం గమనించవచ్చు. అగ్ని, వాయు పురాణాల్లో సాగుకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. తొలిసారిగా నాగలిని భూక్షేత్రంలో గుచ్చడానికి ముందు ధరణిపూజ చేయాలని ఋగ్వేదం ఘోషిస్తున్నది. ఆ భూమిపూజ కూడా జ్యేష్ఠపౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ఠ పూర్ణిమను ‘ఏరువాక పున్నమి’ పర్వదినంగా కర్షకులు జరుపుకొంటారు. అధర్వ వేదం ఏరువాకను ‘అనడుత్సవం’గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రా లతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు వంటి మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. ఏరువాక పూర్ణిమను ‘సీతాయజ్ఞం’అనే పేరుతో కూడా జరుపుకొంటారు.హిందూ మత విశ్వాసాల ప్రకారం, వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజనుచేస్తారు. ఈ సమయంలో తమ పొలాల్లో నాగలితో దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. తెలుగు పండుగల్లో సాహిత్య ఆధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణ దేవరాయలకాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది. పరాశరుడు రాసిన ‘కృషి పరాశరం’ ప్రామాణిక వ్యవసాయ గ్రంథంగా పేర్కొంటారు. వ్యవసాయ ప్రారంభానికి ముందు నేలను పూజించి, ఆనేల తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండుగైన ఈ ఏరువాకపున్నమిని ఆనందంగా జరుపుకొందాం.– వాడవల్లి శ్రీధర్ (నేడు ఏరువాక పున్నమి) -
ముహూర్తానికి డెలివరీ లేట్ చేశారు, పాపకిక కష్టాలేనా? కేసు వేస్తా..!
ఇటీవలే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాకు పాప పుట్టింది. మా ఆవిడ గర్భవతి అయినప్పటినుంచి ఒకే డాక్టరు వద్ద చూపిస్తున్నాము. మా పంతులుగారిని అడిగి కాన్పుకు ముహూర్తం పెట్టుకున్నాము. హాస్పిటల్ వారికి చెప్పగా అలా చేయాలి అంటే ‘ముహూర్తం చార్జెస్’గా 10 వేల రూపాయలు ఎక్కువ కట్టాలి అని చెప్పారు. సరేలే అని అది కూడా కట్టాను. కానీ, డాక్టరు మరొక ఎమర్జన్సీ సర్జరీ ఆలస్యం అవటం వలన మా డెలివరీ ఆలస్యం చేశారు. మరొక ముహూర్తం కోసం ఆ రోజు సర్జరీ కూడా ఆపటం కుదరదు అని చెప్పారు. అందువల్ల మాపాప దుర్ముహూర్తాన పుట్టింది. దుర్ముహూర్తంలో పుట్టటం వలన పాపకి జీవితాంతం కష్టాలే ఉండ వచ్చు. అయితే పరిహారాలు చేస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది అని అంటున్నారు. వీటంతటికీ కారణం అయిన హాస్పిటల్ మీద, డాక్టరు మీద చర్యలు ఎలా తీసుకోవాలో సలహా ఇవ్వగలరు.- విక్కాంత్, సికింద్రాబాదుబాగుందండి. చాలా బాగుంది. కేసు వేయటానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారా? జడ్జిగారిని కూడా మీరు పెట్టుకున్న ముహూర్తానికే జడ్జిమెంట్ ఇమ్మని కూడా చెబుదామా? ఒకవేళ కేసు ఓడిపోతే ముహూర్త వైఫల్యం అంటారా లేక నా సలహా వైఫల్యం అంటారా? లేక ఏకంగా జడ్జీ గారికి గ్రహణం పట్టింది అంటారా? సెంటిమెంట్లు మీ వ్యక్తిగతం. మీ నమ్మకాన్ని మీరు పాటించవచ్చు, కాపాడుకోవచ్చు. అయితే అది చట్టానికి, న్యాయానికి, వ్యక్తిగత స్వేచ్ఛకి వ్యతిరేకంగా ఉండకూడదు! అదేవిధంగా ప్రకృతి విరుద్ధంగా కూడా ఉండకూడదు. ఎవరు ఎప్పుడు జన్మించాలి అనేది దేవునిపై నమ్మకం ఉన్నవారు దైవనిర్ణయంగా భావిస్తే మంచిది. ఆధునిక వైద్యవిధానం - సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మీ నమ్మకాన్ని జోడించి కాన్పు సమయాన్ని నిర్ణయించుకున్నారు. కానీ అదే సమయంలో ఇంకొక మనిషికి సహాయపడుతున్న డాక్టర్ గారిని శిక్షించాలి అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్మీకు ఇచ్చే జవాబు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రి వారికి అలాగే ప్రభుత్వాలకి కూడా ఒక సూచన చేయాలి అనుకుంటున్నాను. రాజ్యాంగంలోని 51ఎ(జి) ఒకసారి చదవండి. ప్రభుత్వాలు శాస్త్రీయతను, మానవ విలువలను, తర్కాన్ని పెంపొందించాలి తప్ప మూఢనమ్మకాలను కాదు. వ్యక్తిగత నమ్మకాల కోసం మరొకరి జీవితాలను, హక్కులను కూడా లెక్కచేయను అనే ధోరణిని అరికట్టవలసిన అవసరం ఉంది. అధిక డబ్బు వసూలు చేసి మరీ ఇలాంటి ముహూర్తాలు పెట్టి కాన్పులు చేసే ప్రైవేటు ఆసుపత్రుల దోరణిని నియంత్రించాలి. చదవండి: పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు : ఫోన్పై స్మార్ట్చెక్ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... మీ కేసులో ముహూర్తానికి 10,000 వసూలు చేసిన ఆసుపత్రి పై దావా వేసినా, కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించినా మీరు కట్టిన డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారం ఉంది. మీరు కేసు వేసి హాస్పిటల్ వారిపై ఫైన్ కూడా విధించాలి అని కోరండి. మీ కేసులో డబ్బులు తిరిగి వచ్చినప్పటికీ, మరొకసారి ఇలాంటి మతిలేని పనులు చేయడం మానేస్తారు హాస్పిటల్ వారు! మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్, 1954, పరిధిలోకి ఇలాంటి హాస్పిటళ్లను తీసుకురావాలి.– శ్రీకాంత్ చింతల,హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ప్రపంచానికి పచ్చబొట్టు
ఒకప్పుడు చేతిపై బైగ పచ్చబొట్టు కనిపిస్తే... ‘పక్కా పల్లెటూరు వాళ్లు’ అని వెక్కిరించేవాళ్లు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆదివాసీ పల్లెల్లో ఒక వెలుగు వెలిగిన బైగ టాటూ ఆర్ట్ మిణుకు మిణుకుమంటూ ఆరి పోయే స్థితికి చేరుకుంది. ఆ కళ మళ్లీ ఉజ్వలంగా వెలిగేలా గల్లీ నుంచి దిల్లీ వరకు కృషి చేస్తోంది ఆదివాసీ మహిళ మంగళ బాయ్. మధ్యప్రదేశ్లోని మారుమూల పల్లె లాల్పూర్ నుంచి సిడ్నీ వరకు బైగ టాటూ ఆర్ట్ను తీసుకువెళ్లిన మంగళబాయ్...మధ్యప్రదేశ్లోని దిందోరీ జిల్లాలోని చిన్న గ్రామం అయిన లాల్పూర్లో పుట్టింది మంగళబాయ్. తల్లి శాంతిబాయ్ బైగ టాటూ ఆర్టిస్గా గొప్ప పేరు పొందింది. తల్లి నుంచి బైగ ఆర్ట్ను నేర్చుకుంది మంగళ. శాంతిబాయ్ ఎవరికైనా టాటూ వేస్తుంటే ‘నేను వేస్తాను’ అంటూ తల్లిని బతిమిలాడేది. ‘అలాగే’ అంటూ ఒకటి, రెండు గీతలు వేసే అవకాశం ఇచ్చేది శాంతిబాయ్. ఈ మాత్రం దానికే మంగళ ఏనుగు ఎక్కినంత సంబరపడి పోయేది. ఏడు సంవత్సరాల వయసు నుంచే బైగ టాటూ వేయడం మొదలుపెట్టింది మంగళ. పదకొండు సంవత్సరాల వయసులో తన బైగ ఆర్ట్ను నేషనల్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.పాత కళకు కొత్త కళబైగ టాటూ ఆర్ట్లో చెట్ల నుంచి పక్షుల వరకు, ఆదిమ చరిత్ర నుంచి పురాణాల వరకు ఎన్నో ప్రతీకలు కనిపిస్తాయి. వాటికి అర్థం ఏమిటి? అనేది తెలుసుకోవడం గురించి ఎంతో శోధన చేయడమే కాదు నుదురు, మెడ, భుజాలు... శరీర భాగాలకే పరిమితం అయిన ‘బైగ’ను కాగితం, కాన్వస్ పైకి తీసుకురావడం ద్వారా ఆ కళకు కొత్త వెలుగు తీసుకువచ్చింది మంగళ. కాగితం, కాన్వస్పైకి తీసుకురావడం ద్వారా బైగ టాటూ ఆర్ట్ పునర్జీవానికి కొత్త మార్గాన్ని కనిపెట్టింది.అంతర్జాతీయ స్థాయిలో... ఆహా!మారుమూల ఆదివాసీ పల్లెలకే పరిమితమైన బైగ టాటూ ఆర్ట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి ఆహా అనిపిస్తోంది మంగళ. ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’లో జరిగిన గ్లోబల్ ఎగ్జిబిషన్లో మంగళ ఆర్ట్వర్క్కు మంచి స్పందన లభించింది. ‘మా సంప్రదాయ కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గర్వంగా ఉంది. ఇది మా కళ అని ప్రతి ఆదివాసీ గర్వపడేలా చేసింది’ అంటుంది మంగళ.అనేక అంశాల ప్రతీక... బైగమోడ్రన్ బాడీ ఆర్ట్తో పోల్చితే బైగ డెకరెటివ్ కాదు. రియలిస్టిక్గా ఉంటుంది. ఆధ్యాత్మిక స్ఫూర్తి, ప్రకృతిలో తమకు ఉన్న అనుబంధం, జీవితంలోని వివిధ దశలు ఈ కళలో ప్రతిఫలిస్తాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ పల్లెల్లో అమ్మాయిలలో కొందరికి ‘బైగ’పై ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ్ర పోత్సహించడం అరుదు. ‘బైగ’ వల్ల పిల్లల చదువు దెబ్బతింటుందని వారి భయం. ‘ఈ కాలం పిల్లలు మోడ్రన్గా ఉండాలనుకుంటున్నారు. సంప్రదాయ కళలలోని గొప్పదనం వారు గ్రహించడం లేదు’ అంటుంది మంగళ. గల్లీ నుంచి దిల్లీ వరకు ‘బైగ’ కళ గురించి విస్తృత ప్రచారం చేస్తున్న మంగళకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందలేదు. అయితే దాని తాలూకు అసంతృప్తి ఏదీ ఆమె మాటల్లో వినిపించదు.ఎంతోమంది దృష్టికి వచ్చేలా...నిరాశపరిచే మాటలు ఎన్ని వినబడినా బైగ కళపై ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు మంగళ. తాను ఊహించని స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బైగకు ఆదరణ లభించింది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వలన ‘బైగ’ ఆర్ట్ను విద్యావంతులు, ఆంత్రోపాలజిస్ట్లు, ఆర్ట్ కలెక్టర్ల దృష్టికి వచ్చేలా చేసింది. ‘నా లక్ష్యం బైగకు సంబంధించి ఘనమైన గతాన్ని గుర్తుకు తేవడం కాదు.భవిష్యత్ తరాలకు దాని విలువ తెలియజేయడం. దాన్ని కాపాడుకునేలా చేయడం’ అంటుంది మంగళ. ‘మన దేశంలో బైగ ఆర్ట్ అంతరించి పోకుండా ఉండడానికి మంగళ ఎంతో కృషి చేశారు. ఈ కళను బతికించుకోవడానికి ధైర్యం, శక్తి కావాలి. అవి మంగళలో ఉన్నాయి’ అంటున్నాడు మంగళ బాయ్ అసిస్టెంట్ అమిత్.మార్పు వస్తుందిమోడ్రన్ టాటూలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సంప్రదాయ టాటూలకు ఉన్న విలువ వేరు. అవి మన చరిత్ర, సంస్కృతి, పురాణాలతో ముడిపడి ఉన్నవి. ప్రతి ప్రతీకకు ఒక అర్థం ఉంటుంది. బైగ అనేది మన మూలాలను గుర్తుకు తెచ్చే కళ. నా చిన్నప్పుడు అమ్మ ఊరూరికీ వెళుతూ మహిళలకు బైగ టాటూ వేసేది. ఒంటిమీద బైగ టాటూ ఆర్ట్ కనిపిస్తే ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఉండేది. బైగను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం వలన వారిలో మార్పు వస్తుందని, ‘ఇది మా కళ’ అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది అని ఆశిస్తున్నాను. – మంగళ బాయ్ -
హోమ్లీ పెట్ ఉంటే ఒత్తిడి సెట్.. ఇంట్రస్టింగ్ సర్వే
ఈ ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక శాతం మంది నగరవాసులు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో మానవులకు మానసిక ప్రశాంతత ఒక విలాసంగా మారుతోంది. ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే పెంపుడు జంతువులే మిత్రులుగా ఎంతో సహాయ పడుతున్నాయి. ఈ విషయం ఇటీవల మార్స్ పెట్కేర్, మెడిటేషన్ యాప్ కామ్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. 20 దేశాల్లో 31 వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో భారత్కు చెందిన వెయ్యి మంది పెంపుడు జంతువుల యజమానుల అభిప్రాయాలు విశేషంగా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం – సాక్షి, సిటీబ్యూరో పెంపుడు జంతువుల కారణంగా భారతీయుల్లో 92 శాతం మంది తమ స్క్రీన్ టైమ్ తగ్గిందని చెబుతుండగా, 93 శాతం మంది రోజువారీ పనుల మధ్య బ్రేక్ తీసుకోడానికి పెంపుడు జంతువులే ప్రేరణగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, 82 శాతం మంది పెంపుడు జంతువులతో మాట్లాడటం ద్వారా రిలాక్సేషన్ పొందుతున్నామని, ఒంటరి తనానికి దూరం అవుతున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. సర్వే విశేషాలివే.. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 79 శాతం మంది భారతీయులు నిద్ర బాగా పడుతోందని చెబుతుండగా, అదే అమెరికాలో ఇది కేవలం 55 శాతం మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు, 88 శాతం మంది ఆలోచనల్లో ఆవేశం తగ్గిందని, 76 శాతం మంది ఆ క్షణాలను ఆస్వాదించే పరిస్థితుల్లో ఉన్నామని వెల్లడించారు. ఈ డేటా కేవలం గణాంకాలుగా కాకుండా, మానవుల మానసిక శ్రేయస్సులో పెంపుడు జంతువుల ప్రభావాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ సందర్భంగా మార్స్ పెట్కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ మూర్తి చెప్పినట్లు, ‘పెంపుడు జంతువులు కేవలం మనిషికి ఆనందం కలిగించడమే కాక, మెదడుకు విశ్రాంతినిచ్చే సహచరులుగా నిలుస్తున్నాయి.’ కామ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ గ్రెగ్ జస్టిస్ మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువులు మెడిటేషన్ లాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. మానవ సంబంధాల్లో మానవ–జంతు అనుబంధం ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటోంది’ అన్నారు. పెంపుడు జంతువులకు అనుకూలంగా హైదరాబాద్లోని మార్స్ కార్యాలయంపెంపుడు జంతువులతో మానసిక ప్రశాంతతఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్ఫుల్నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్ అసోసియేట్స్తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి.. చదవండి: టూరిస్టులకూ నో : మాంసాహారాన్ని బ్యాన్ చేసిన ఏకైక నగరం ఇదే..!ఈ సర్వే ద్వారా మార్స్, కామ్ మధ్య దీర్ఘకాలిక గ్లోబల్ భాగస్వామ్యం ప్రారంభమైంది. ఈ భాగస్వామ్యం ఫలితంగా కామ్ యాప్లో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల నేపథ్యంలో గైడెడ్ మెడిటేషన్లు, మైండ్ఫుల్నెస్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపుడు జంతువుల అనుబంధంతో మరింత బలోపేతం చేస్తోంది. హైదరాబాద్లోని మార్స్ కార్యాలయం కూడా పెంపుడు జంతువులకు అనుకూలంగా రూపొందించబడినదని వారు పేర్కొన్నారు. ‘మాయా’, ‘మైలో’ వంటి పెట్ అసోసియేట్స్తో సహా సంస్థ జంతుప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిశోధన స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. పెంపుడు జంతువులు ఇక కేవలం సరదా కోసం కాదు, ఆరోగ్యంగా బతకడానికీ, హాయిగా ఉండడానికీ ఒక సహజ మార్గంగా నిలుస్తున్నాయి.. ఇదీ చదవండి: Beauty Tips: బ్లాక్ హెడ్స్కు చెక్, ముఖాన్ని మెరిపించే స్క్రబ్స్ -
ఆకాశ సిందూరం
అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ గగనతలంలో ఆపరేషన్ సిందూర్ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని పట్టుకొని సింగిల్–ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ పీఎసీ 750ఎక్స్ఎల్ నుంచి దూకి ‘ఆపరేషన్ సిందూర్’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్ జోన్లోకి దూకింది.‘ఈ జంప్ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్శర్మ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఎఫ్) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్ డైవర్స్’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. యునైటెడ్ పారాచూట్ అసోసియేషన్ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్ లైసెన్స్ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్ కోచ్ అనామిక. ప్రయాగ్రాజ్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్ ఫిమేల్ స్కైడైవర్గా సంచలనం సృష్టించింది. 300ల స్కైడైవ్స్ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
సండే ఆన్ సైకిల్ : సైకిల్ మన దినచర్యలోభాగం కావాలి!
దక్షిణమధ్య రైల్వే స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్జైన్ ప్రారంభించారు. రైల్వేస్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఆయన కూడా సైకిల్ తొక్కారు. ‘ఫిట్ ఇండియా సైక్లోథీన్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే అదనపు జీఎం నీరజ్ అగర్వాల్, డీఆర్ఎం భర్తేష్ కుమార్, దక్షిణమధ్య రైల్వే వివిధ విభాగాలకు చెందిన అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్ సైక్లింగ్తో ఆరోగ్యం, ఫిట్నెస్, పర్యావరణ బాధ్యత లాంటి ప్రయోజనాలు ఉంటాయని, దీన్ని దిన చర్యలో భాగం అలవర్చుకోవాలన్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ ఎ.చిన్న సీతారామిరెడ్డి, వైస్ చైర్మన్ గిరిధారిలాల్ తోషిన్వాల్ అన్నారు. చదవండి: అఖిల్ పెళ్లి సందడి : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్సింగిలోని ఔటర్రింగ్ రోడ్డు సైకిల్ ట్రాక్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్, సమాజహితం సాధించాలంటే సైక్లింగ్ చేయాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఐక్యతని పెంపొందించేందుకు సైక్లింగ్ ఉపయోగపడుతుందన్నారు. అంతకు ముందు డీఎంకే టీమ్ నిర్వహించిన వార్మప్ సెషన్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నార్సింగి నుంచి అప్పా సర్కిల్ వరకూ సైక్లింగ్ చేశారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సహాయంతోపాటు హైడ్రేషన్, రిఫ్రెష్మెంట్ అందించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున చార్టర్డ్ అకౌంటెంట్ల కుటుంభాలు పాల్గొన్నాయి. భాగం చేసుకోవాలి. -
లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’
జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ తల్లి రేవతి కామత్ కోసం ఇటీవల ఒక లగ్జరీకారు కొనిచ్చారు. అలా కొనిచ్చిన మూడు నెలల తరువాత ఆమె బెంగళూరు మెట్రోలో ప్రయాణించడం విశేషంగా నిలిచింది. పర్యావరణవేత్త , వీణ కళాకారిణి కూడా అయిన రేవతి పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారు. దీనిపై ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.బిలియనీర్ కొడుకులు నిఖిల్, నితిర్ ఇద్దరే సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సంగతిని ఫేస్బుక్లో షేర్ చేస్తూ, తన కొడుకులు తనకు సాంప్రదాయ పద్ధతిలో, సరైన ఆచారాలతో పాటు బహుమతినిచ్చారంటూ సంతోసాన్ని వ్యక్తం చేశారు. మెర్సిడెస్ GLS ధర రూ.1.5 కోట్లకు పైగా ఉంది. విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ,పవర్ఫుల్ ఇంజిన్ ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి ఇందులో. సరిగ్గా మూడు నెలల తర్వాత మరోపోస్ట్ చేశారు. బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తూ, ప్రజా రవాణా వ్యవస్థ సౌలభ్యాన్ని ప్రశంసించారు."మెట్రోలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది, అది కూడా మహిళా కంపార్ట్మెంట్లో! నమ్మమెట్రో" అంటూ ఇన్స్టా క్యాప్షన్లో రాసుకొచ్చారు.చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్కాగా పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని వెబ్సైట్ ప్రస్తావించింది. రేవతి కామత్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఆమె లక్షకు పైగా చెట్లను నాటారు. కర్ణాటకలోని కనకపురలోని సోమనహళ్లి సరస్సును పునరుద్ధరించరు. దీంతో అదిపుడు పచ్చిన ప్రకృతితో, నిండుగా కళకళలాడుతోంది. అంతేకాదు 28 ఎకరాల భూమికి, 300 బోర్వెల్స్, 200 ఓపెన్ బావులకు ప్రయోజనకరంగా మారింది. ప్రతీ తల్లికి, ఆమె పిల్లల విజయం గొప్ప బహుమతి. కానీ రేవతి కామత్ విషయంలో ఆమె కుమారులు, జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ మరో అడుగు ముందుకు వేశారు. అయితే ఒక ‘అమ్మ’గా పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చి మరో మెట్టు ఎక్కారు అంటున్నారు అభిమానులు. ఈ అమ్మలందరూ అంతే.. అంటూ మరికొందరు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Revathi Kamath (@revathikamath.world) ఇదీ చదవండి: డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ! -
స్లిమ్గా మారిన నర్సు..బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పెరుగు..
ఈ వెయిట్ లాస్ స్టోరీ వింటే అవాక్కవ్వుతారు. బాబోయ్ ఇవేం ఫుడ్ అలవాట్లు.. అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లతోనే స్లిమ్గా మారింది, కానీ బరువు తగ్గాలనుకునే వారు తీసుకోకూడని హెవీ ఫుడ్స్తోనే ఆమె బరువు తగ్గడం విశేషం. నోటిని కట్టడి చేయకుండా.. కడుపు నిండుగా తింటూ బరువు తగ్గి చూపించింది. పైగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ..హాయిగా రుచికరమైన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలాగో చూపించింది. మరి ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగిందో సవివరంగా చూద్దామా.!.కెనడాకు చెందిన మెలనీ కోజ్(21) తన పనివేళల కారణంగా బర్గర్లు, ఫ్రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేదట. దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొందట. చిన్న వయసులోనే అంత బరువు ఉండటంతో చాలా ఇబ్బందులు పడేది కూడా. పైగా వయసుకి మించిన అధిక బరువు ప్రమాదమని హెచ్చరించడంతో బరువు తగ్గేందుకు ఉప్రక్రిమించిందట. అందుకోసం పలు రకాల వర్కౌట్లు, యోగా, వ్యాయమాలు వంటివి ఎన్నింటినో చేసి.. దాదాపు రెండేళ్లు పూర్తిగా విఫలమైంది. ఇక లాభం లేదనుకుని..డైట్లోనే ఏదైనా మార్పు చేయాలి.. లేదంటే కష్టమే బరువు తగ్గడం అని అర్థమైంది మెలోనికి. దాంతో న్యూట్రిషియన్ కోర్సులో చేరి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో సవివరంగా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి అధిక ప్రోటీన్తో కూడిన ఆహారాలు తినడం ప్రారభించింది. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా అధిక ప్రోటీన్తో కూడిన గిన్నెడు పెరుగు తోపాటు తాజా పండ్లను జోడించి తీసుకునేదట. ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించి చాలాసేపటి వరకు ఫుడ్ తినాలనే కోరికను నివారించేదట. అలాగే అనారోగ్యకరమైన చిరుతిండ్లన్నింటికి పూర్తిగా దూరంగా ఉండేదట. దాంతో తన బరువులో అనుహ్యమైన మార్పుల మొదలయ్యాయట. అలా 44 కిలోలక వరకు తగ్గానని, ప్రస్తుతం 69 కిలోలు ఉన్నట్లు తెలిపింది. అయితే తన డైట్లో తక్కువ ఫ్యాట్ కలిగిన చీజ్, చికెన్, చేపలు వంటి ఉన్నాయట. అలాగే తనకు ఇష్టమైన స్వీట్స్ కూడా తినేదాన్ని అంది. అది కూడా హెల్దీ స్వీట్స్ తప్ప..ప్రాసెస్ చేసినవి కావట. ప్రస్తుతం ఈ నర్స్ వెయిట్ లాస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్గా మారింది. అధిక ప్రోటీన్తో కూడిన ఆహారం బరువు తగ్గిస్తుందా..ఇది కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అధికంగా ఫుడ్ తీసుకోవాలనే ఆలోచనను నివారిస్తుంది. అలాగే మంచి బలాన్ని అందించి..బరువు తగ్గాలనే లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. తద్వారా కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే..కఠినమైన డైట్ల జోలికి పోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సరైన విధంగా తీసుకుంటే..ఆహారమే ఆరోగ్యం అని, అతిగా తీసుకుంటే విషంగా మారి అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లను నివారించి హెల్దీ ఫుడ్కి ప్రాముఖ్యత ఇస్తే బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుందట. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !) -
రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !
వాకింగ్ అంటే అందరు కామన్గా చేసేదే. అయితే ఈ వాకింగ్ మాత్రం చాలా విభిన్నమైనది. సంప్రదాయ వాకింగ్ కంటే మంచి ఫలితాలను పొందగలగుతారట. దీన్ని జపనీస్ వాకింగ్ అనిపిలుస్తారు. మరి ఆ నడక వ్యాయామం విశేషాలేంటో చూద్దామా..!. జనీస్ వాకింగ్ వ్యాయామం అంటే..దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ (ఐడబ్ల్యూటీ) లేదా జపనీస్ వాకింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యామ్నాయ విరామాలను కలిగి ఉంటుంది. మూడు నిమిషాల వేగవంతమైన నడక, మరో మూడు నిమిషాలు స్లో వాకింగ్. ఇలా కనీసం ఐదు విరామాల సెట్తో కూడిని వాకింగ్ చేస్తారు. మంచిదేనా అంటే..ఇలా వేగవంతంగా, మళ్లీ చాలా నెమ్మదిగా చేసే వాకింగ్ విధానం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. శారీరక ధృఢత్వాన్ని మెరుగుపరచడంలో, కండర బలాన్ని, గ్లైసెమిక్ నియంత్రణను అందిస్తుందట. వ్యాయామం చేయలేకపోతున్నా అని బాధపడేవారికి.. ఇది మరింత మేలు. అన్ని వయసుల వారికే కాదు వృద్ధులు సైతం హాయిగా ఈ విధానంలో వాకింగ్ చెయ్యొచ్చట. అంతేగాదు ఇది మంచిదేనా? కాదా అని జపనీస్ నిపుణులు సుమారు 63 సంవత్సరాల వయస్సు గల దాదాపు 200 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా మెరుగైన ఫలితాలను కనిపంచాయి. అందువల్ల ఇది సురక్షితమైనదని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే బాగా వేగంగా వాకింగ్ చేసేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదనేది కొందరి పరిశోధకులు వాదన. కలిగే లాభాలు..రక్తపోటు తగ్గుతుందిరక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎలా చేయాలంటే..ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అనేది సరిగా సాధనం చేయడంపైనే మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయట. మొదట సాధారణ వేగంతో నడిచి..ఆ తర్వాత ఓ 20 నుంచి 30 సెకన్లు వేగంగా నడవాలట. మళ్లీ బ్రేక్ ఇచ్చి స్లోగా ఇలా ..కనీసం మూడు నుంచి ఐదు సెట్ల చొప్పున చేయాలట. ప్రారంభంలో 30 నిమిషాలు కేటాయించి.. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధానాన్ని పెంచుకోవాలట. అదీ కూడా మన బాడీ తత్వానికి అనుగుణం చేయాలట. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లను ధరించి చేయాలట. అంతేగాదు ఒకవేళ ఈ క్రమంలో తలనొప్పి, వికారం వంటివి వచ్చినట్లయితే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చాలామటుకు దీన్ని పిట్నెస్ నిపుణుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రయత్నించడం మంచిదని చెప్పారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..) -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం -
ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..
ప్రస్తుతం ఈ రోజుల్లో ఏ వ్యాపారమైన క్లిక్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో వైఫల్యాల అనంతరం గానీ లాభాల బాటపట్ట లేరు. కానీ కొందరూ పెట్టుబడితో పనిలేకుండా..ప్రస్తుత అవసరాలు, డిమాండ్ వంటి వాటికి అనుగుణంగా..పెట్టుబడితో పని లేకుండా తెలివిగా వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అవుతుంటారు. అలాంటి వ్యక్తే ఈ ఆటోడ్రైవర్. జస్ట్ వినియోగదారుల నమ్మకాన్ని పొందడమే వ్యాపారానికి పెట్టబడిగా చేసుకుని లక్షలార్జిస్తున్నాడు. అతడు ముంబైలోని ఓ సాధారణ ఆటో రిక్షా డ్రైవర్. డ్రైవింగ్ చేయకుండానే లక్షలు గడిస్తున్నారు. యూఎస్ కాన్సులేట్ వెలుపల అతడి వ్యాపారం సాగుతుంది. తన వ్యాపారానికి ఆధారమే ఆ యూఎస్ కాన్సులేట్. ఎందుకంటే అక్కడకు వీసా కోసం చాలమంది వ్యక్తులు వస్తుంటారు. అయితే వారి కూడా లగేజ్ని అనుమతించారు. దీన్నే ఈ డ్రైవర్ తెలివిగా క్యాష్ చేసుకుంటున్నాడు. వ్యాపారంగా మార్చుకున్నాడు. సుమారు రోజుకి దగ్గర దగ్గర ఓ 20 నుంచి 30 మంది దాక ఈ యూఎస్ కాన్సులేట్ వద్దకు వీసా కోసం వస్తుంటారు. వారు పని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు వారి లగేజ్ని సేఫ్గా ఉంచుతాడు ఈ డ్రైవర్. అందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1000లు వసూల్ చేస్తాడట. స్థానిక పోలీసులు భాగస్వామ్యంతో లగేజ్ కోసం లాకర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నాడు అతను. చెప్పాలంటే ఐటీ డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేంజ్లో నెలకు సుమారు రూ. 5 నుంచి రూ. 8 లక్షలు ఈజీగా ఆర్జిస్తున్నాడని లెన్స్కార్ట్ ఉత్పత్తిదారుడు లింక్డ్ ఇన్పోస్ట్లో తెలిపారు. తాను వీసా కోసం యూఎస్ కాన్సులెట్ వద్దకు వచ్చినప్పుడే ఈ డ్రైవర్ గురించి తెలిసిందన్నారు. తనను కూడా సెక్యూరిటీ లగేజ్ అనుమతించనని చెప్పినప్పుడు..ఏం చేయాలో తోచక ఫుట్పాత్పై నిలబడి ఉంటే ఈ ఆటో డ్రైవర్ చేయి ఊపి..లగేజ్ సురక్షితంగా ఉంటుంది. జస్ట్ రూ. 1000 ఛార్జ్ చేస్తే చాలు అని చెప్పినప్పుడూ అతడి వ్యాపారం గురించి తెలిసిందని చెప్పుకొచ్చారు. అతడి వద్ద వ్యాపార నైపుణ్యం, సాంకేతిక, నిధులు లేకపోయినా.. జస్ట్ నమ్మకంతో కస్టమర్లకు భద్రత అందించి ప్రీమియం వసూలు చేస్తూ..వ్యాపారం చేస్తున్నాడు. సమయస్ఫూర్తితో చేస్తున్న అతడి వ్యాపారదక్షతను పోస్ట్లో ప్రశంసించారు రూపానీ. ప్రస్తుం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అవసరాలకు, డిమాండ్కు అనుగుణమైన వ్యాపారం ఆటోమేటిగ్గా క్లిక్ అవుతుందని ఈ ఆటో డ్రైవర్ ప్రూవ్ చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం అంతలా డబ్బులు ఛార్జ్ చేస్తున్నా.. పోలీసులతో కలిసి షేర్ చేసుకోవాల్సిందేగా అని ఒకరు, కాన్సులేట్ లోపల లాకర్ సౌకర్యం ఉందని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు. గమనిక: ఇది వాస్తవమేనా అనేది తెలియాల్సి ఉంది. ఎన్డీటీవి ఇంగ్లీష్ ఆర్టికల్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. (చదవండి: డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్గా నం.1 స్థానం..) -
హార్స్ రైడింగ్లో.. ధృవ సత్తా..
హార్స్ షోలో సత్తా చాటిన అత్యంత పిన్న వయస్కుడైన ఈక్వెస్టియన్ రైడర్గా నగరానికి చెందిన మాస్టర్ ధృవ నిలిచాడు. ఈక్వెస్ట్రియన్ అకాడమీ ఆధ్వర్యంలో శంకర్పల్లిలోని నాసర్ పోలో ఆవరణలో అండర్–10, 12, 14, 16, అదే విధంగా 45–125 సెంటీమీటర్ల ఓపెన్ విభాగాల్లో దాదాపు 650 మంది రైడర్లకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రెస్సేజ్ విభాగంతో పాటు ట్రోట్ సీహెచ్–2 వంటి విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఈ పోటీల్లో పదేళ్ల బాలుడు మాస్టర్ ధృవ 3 బంగారు, 1 రజితం, 1 కాంస్య పతకాలతో ప్రథమ బహుమతులు సాధించాడు. ఈ సందర్భంగా ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు ధృవ. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థి ఆరేళ్ల వయసు నుంచే గుర్రపుస్వారీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
The Labubu Doll : సెలబ్రిటీలందరి నోటా లబుబు డాల్... అసలేంటిది?
విచిత్రమైన దంతాలు , ఇంతింత కళ్లు, కుందేలు చెవులు ఇపుడు ఎక్కడ చూసినా ఈ లబుబు డాల్స్ (The Labubu Doll) ట్రెండ్ ప్రముఖంగా నిలుస్తోంది. ఇంత పాపులరైన ఈ లబుబు బొమ్మలను చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఉత్పత్తి చేస్తోంది. బ్లాక్పింక్ లిసా, రిహన్న, అనన్య పాండే ఇంకా అనేక మంది సెలబ్రిటీలు, డాల్ లవర్స్ ఈ బొమ్మల పట్ల ఎందుకంత క్రేజీగా ఉన్నారో తెలుసుకుందామా..‘బొమ్మల్లో లబుబు బొమ్మలు వేరయా!’ అంటన్నారు డాల్స్ ప్రేమికులు. సామాన్యుల నుంచి అనన్య పాండేలాంటి సెలబ్రిటీల వరకు లబుబు బొమ్మలకు ‘లవ్ యూ’ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sufi motiwala (@sufimotiwala)> జానపద కథల నుంచి స్పూర్తి పొంది హాంకాంగ్ ఆర్టిస్ట్ కసింగ్ లుంగ్ ‘లబుబు’ను రూపొందించాడు. విశాలమైన నేత్రాల ఈ బొమ్మ 2019లో మార్కెట్లోకి వచ్చింది. బ్యాగులు, కీచైన్లు....మొదలైన ఎన్నో రూపాల్లో లబుబు బొమ్మలను రూ పొందించారు. లబుబును ‘అన్బాక్సింగ్ ట్రెండ్’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీటిని బ్లైండ్ బాక్సుల్లో మాత్రమే విక్రయిస్తుంటారు. అన్బాక్సింగ్ తరువాత మాత్రమే ఆ బొమ్మ గురించి తెలుసు కోగలుగుతాం.‘లబుబు’కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనకు ఆ బొమ్మ సృష్టికర్త కసింగ్ లుంగ్ సంతోషిస్తున్నాడు. ‘నా చిన్నప్పుడు గేమ్ కన్సోల్స్, కంప్యూటర్లు లేవు. పెన్నుతో రకరకాల బొమ్మలను పేపర్పై గీసేవాడిని. బొమ్మలు తయారుచేయాలనే ఆసక్తి చిన్న వయసులోనే ఉండేది’ అంటున్నాడు కసింగ్ లుంగ్. -
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్ బాత్. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్ పరిచయమైంది. ఐస్ బాత్ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్నెస్ ప్రియులకు నూతన ట్రెండ్గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ, అనమ్ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్ బాత్ తో వారి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్బాత్ను ఒక ఈవెంట్లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. స్నాన విశేషాలివీ.. ఐస్ బాత్ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్–వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలివీ.. ఈ ఐస్బాత్ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. ‘మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్పై ఆసక్తితో థాయిలాండ్లోని ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్ బాత్ థెరపీ గురించి తెలిసింది. నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్తో పాటు మొబైల్ ఐస్ బాత్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్ బాత్ చేయగలను. జాగ్రత్తలు తప్పనిసరి.. ఐస్బాత్ ఈవెంట్లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. ఐస్ బాత్ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్లు సరిపోతాయి. శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. ప్రస్తుతం సెషన్ సెటప్ ఫెసిలిటేటర్ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది. (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
ఎంబ్రాయిడరీ నగలు..! ఇట్టే కట్టిపడేసే ఫ్యాషన్ ట్రెండ్..
చెవులకు జూకాలు, మెడలో హారాలు చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలునడుముకు వడ్డాణాలు, వేళ్లకు ఉంగరాలు రంగులుగా, అల్లికలుగా..సంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో అభివృద్ధి చెందినవి ఎంబ్రాయిడరీ నగలు. సిల్క్ దారాలు, అద్దాలు, పూసలు, మెరిసే రాళ్లు, ప్యాచ్వర్క్తో రూపు కట్టిన ఈ నగలు అందరి చూపులను ఇట్టే కట్టడి చేస్తాయి. తేలికగా.. అందంగా!లైట్ వెయిట్: సాధారణ గోల్డ్/ సిల్వర్ జ్యూవెలరీలతో పోలిస్తే ఈ ఆభరణాలు చాలా తేలికగా ఉంటాయి. వీటిలోనూ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, మాంగ్ టిక్కా, రింగ్స్,... వివిధ రకాల మోడల్స్లో ఎంచుకోవచ్చు. కస్టమైజ్డ్ : డిజైన్, రంగులు, శైలి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుంటుంది. డ్రెస్ని బట్టి మోడల్ని, కలర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డిజైన్స్: మొఘల్, జర్దోసి, మిర్రర్ వర్క్, గుజరాతీ వర్క్... లాంటి అనేక శైలులను ఈ ఎంబ్రాయిడరీలో చూపవచ్చు. పూర్తి ఎకో–ఫ్రెండ్లీ: సహజమైన వస్తువులతో తయారవడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాదు.వేడుకలకి అనుకూలం: సంప్రదాయ, ఇండో – వెస్ట్రన్ స్టైల్ డ్రెస్లకి ఇది సరైన ఎంపిక.సొంతంగా తయారీ!ఎంబ్రాయిడరీ హూప్ను కొనుగోలు చేసి, మల్టీ కలర్ దారాలు, ఫ్యాబ్రిక్ గ్లూతో నచ్చిన విధంగా తయారుచేసుకోవచ్చు. పర్యావరణహితమైన ఉత్పత్తులు కావడం, రీసైక్లింగ్ చేసే సదుపాయం కూడా ఈ ఆభరణాల తయారీలో చూపించవచ్చు.వేడుకకు తగిన ఆభరణంఉపయోగించే మెటీరియల్స్ని బట్టి ఆభరణం ఉంటుంది కాబట్టి వేడుకను బట్టి డిజైన్ని ఎంచుకోవచ్చు.సిల్వర్, జరీ దారాలతో జర్దోజి, మొఘల్ వర్క్ని గ్రాండ్గా తీర్చిదిద్దవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ చేసిన ఆభరణాలను సంప్రదాయ వేడుకలలో లెహంగాలు, శారీలకు ఎంచుకోవచ్చు. కాథా అనే వర్క్ బెంగాలీ ఫోక్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. రంగుల దారాలతో లైట్ వెయిట్ జ్యూవెలరీని రూపొదించవచ్చు. ఇవి ప్లెయిన్, ఇండోవెస్ట్రన్ డ్రెస్సులకు, కాటన్ చీరలకు బాగా నప్పుతాయి. గుజరాత్ కచ్ వర్క్, రాజస్థాన్ కళా శైలిని ప్రతిబింబించేలా పూలు, అద్దాలతో చేసిన ఎంబ్రాయిడరీ ఆభరణాలు సంప్రదాయ పండుగలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, కాలేజీ ఫంక్షన్లు.. వంటి వాటిలో స్టైల్గా కనిపిస్తాయి. లేస్ మెటీరియల్తోనూ రంగు దారాలతో పూలు, ఆకులు కుట్టి, ఆభరణంగా ధరించవచ్చు. ఇవి ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులకు బాగా నప్పుతాయి -
డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్గా నం.1 స్థానం..
26 ఏళ్ల మృణాల్ పంచల్ను దేశంలో అత్యధికమంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారట. కారణం? ఆమె రోజూ మేకప్ టిప్స్ చెబుతుంది. తన మీద మేకప్ అప్లయ్ చేసి క్షణాల్లో రీల్స్ తయారు చేసి ఆకట్టుకుంటుంది. ముఖాలను మార్చే ఈ కళతో తాజాగా వెలువడ్డ ‘కాండిరి హూరూన్ ఇండియాస్ లిస్ట్ ఆఫ్ లీడింగ్ ఉమన్ ఇన్ఫ్లూయెన్సర్’లో అగ్రస్థానంలో నిలుచుంది.మనిషికి అత్యంత ఇష్టమైన వస్తువు తన ఖ్యాతికి కారణమవుతుందని మృణాల్ పంచల్ ఊహించి ఉండదు. మనిషికి ఇష్టమైనది ఏది? అద్దం. అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు మనిషి ఏమనుకుంటాడు? కాస్త బాగా కనిపిస్తే బాగుండు అనుకుంటాడు.అలంకార ప్రియులైన స్త్రీలు ఈ మాటను ఇంకా ఎక్కువగా అనుకుంటారు. ఇక్కడే మృణాల్ పంచల్ గెలిచింది. ఏదో కాలక్షేపంగా తాను వేసుకునే మేకప్ను చూపుతూ చేసిన వీడియోలు ఆమెకు భారీగా మహిళా ఫాలోయెర్స్ను సంపాదించి పెట్టాయి. ఇన్స్టాలో ఆమెకు 55 లక్షల మంది ఫాలోయెర్లు ఉన్నారు. ఆమె వీడియోలు క్షణాల్లో వైరల్గా మారతాయి. ఇంతకీ కంటెంట్ కేవలం మేకప్పే. అందుకే ఆమె ‘కాండిరి హూరూన్ ఇండియా విమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ఎవరు ఈ మృణాల్ పంచల్.డాక్టర్ కాబోయి...చాలామంది సినిమా హీరోయిన్లు డాక్టరు కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు. మృణాల్ పంచల్ కూడా అంతే. గుజరాత్లో పుట్టి పెరిగిన మృణాల్ ఎం.బి.బి.ఎస్. చేసేందుకు అవసరమైన చదువు/శిక్షణ కోసం పూణె వచ్చింది. ‘మా అమ్మతో శపథం చేసి మరీ వచ్చాను. అయితే నేను ఒకటి తలిస్తే మేకప్ మరొకటి తలిచింది’ అంటుంది మృణాల్. చిన్నప్పుడు తల్లి నిద్రపోతుంటే మేకప్ కిట్ తీసుకుని ఆమె ముఖానికి మేకప్ వేసి ఆశ్చర్యపరిచిన మృణాల్ స్కూల్లో చదివేప్పుడు కూడా రకరకాల పద్ధతుల్లో మేకప్ వేసుకుని కాలక్షేపం చేసేది. అయితే అందులో సహజమైన ప్రతిభ చాలామందిని ఆకర్షించింది.చదవలేక...అయితే పూణె వచ్చాక భాష సమస్య ఆ తర్వాత చదువు తలకు ఎక్కక పోవడంతో మృణాల్ ఒక దశలో కుదేల్ అయ్యింది. ఇక ఇంటికి పోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నప్పుడు టిక్టాక్లో కాలక్షేపానికి మేకప్ ట్యుటోరియల్ అంటూ ఒక వీడియో చేసింది. అది వైరల్గా మారింది. స్త్రీలు కింద కామెంట్లు పెట్టి ఇలాంటివే చేయండి అనసాగారు. మేకప్ను వేగంగా, సులువుగా, మనిషిని బట్టి, చర్మాన్ని బట్టి, కన్ను ముక్కును బట్టి, వయసును బట్టి ఎలా వేసుకోవాలో రకరకాల టిప్స్ చెబుతూ సొంతంగా ఆ మేకప్ను వేసుకుని చూపుతూ మృణాల్ అతి త్వరలో ఖ్యాతి గడించింది.వెంటబడ్డ కంపెనీలుమృణాల్ ఇన్ఫ్లూయెన్స్ టిక్టాక్ తర్వాత ఇన్స్టాలో పెరగడంతో బ్యూటీ సామాగ్రి అమ్మే బడాబడా కంపెనీలు ఆమెను తమ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయమని కోరాయి. ‘అతి త్వరగా నేను ముంబైకి మారాల్సి వచ్చింది. నేను కలలో కూడా ఊహించని పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కోసం నన్ను అంబాసిడర్గా పెట్టుకున్నాయి. నా ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది’ అని చెప్పుకొస్తుంది మృణాల్.సరళంగా, అట్టహాసంగా: మృణాల్ భారతీయ మహిళల మనస్థితిని బట్టి మేకప్ టిప్స్ చూపుతుంది. ‘మన మహిళలు గ్లామర్గా మేకప్ వేసుకోవాలనుకుంటారు. కాని జంకుతారు. సరళమైన మేకప్ చూపిస్తే ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేయమని కోరుతారు. రెండు విధాలుగా సంతృప్తి పరుస్తూ వారికి టిప్స్ అందిస్తుంటాను’ అంటుంది మృణాల్. ఆమె చూపే టిప్స్లో కేశాలంకరణ, వాటి షేడ్స్, కనురెప్పలు, ముక్కును సన్నగా చూపించడం, పెదాలను అందంగా చూపించడం, ముఖంలో ఏదైనా ఒక భాగం మోతాదుకు మించి ఉన్నా, కురచగా ఉన్నా దానిని మేకప్లో సరి చేసి చూపించడం చాలా ప్రతిభావంతంగా చేస్తుంది. అందుకే మృణాల్కు యాభై లక్షల మంది ఫ్యాన్స్.సోషల్ మీడియా వచ్చాక చాలామంది విజేతలు మనకు కనిపిస్తున్నారు. అయితే వారంతా తొలిసారిగా ఎవరూ నడవని దారిని నడిచిన వారే. మేకప్ రంగంలో ఎందరో నిష్ణాతులు ఉండగా మృణాల్ దానినో ట్యూషన్గా భావించడం వల్లే ఘన విజయం సాధించింది. నేడు భారతదేశంలో అత్యంత ఇన్ఫ్లూయెన్షల్ లీడర్గా నిలిచింది. మృణాల్ నిజంగా గ్రేట్.(చదవండి: శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది) -
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..!
ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. గానీ కొన్ని గమ్మత్తైన విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎలా తెలుసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్నింటి గురించి తెలుసుకుందామా..!ఇరవైనాలుగు ఏళ్ల వయసులో రోమ్ సామ్రాజ్య పాలకుడైన కలిగ్యులా తన గుర్రానికి సెనెటర్ హోదా ఇచ్చాడు.అబ్రహం లింకన్ టాప్ హ్యాట్ ఫేమస్. ఫ్యాషన్ యాక్సెసరీగా మాత్రమే కాదు... వేరే రకంగా కూడా టాప్ హ్యాట్ను వినియోగించేవారట లింకన్.. ముఖ్యమైన నోట్స్, పేపర్లను టాప్ హ్యాట్లో స్టోర్ చేసేవారట.ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం... జెబ్లాక్బర్డ్ వయోలిన్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏమిటంటే... ఈ వాయిద్య పరికరాన్ని కలప నుంచి కాకుండా రాయితో తయారుచేస్తారు.‘ది మ్యాట్రిక్స్’ సినిమాలోని ‘గ్రీన్ కోడ్’కు మూలం... జపనీస్ సుషి కుక్ బుక్.ప్రపంచంలోనే అతి పెద్ద టీ–షర్ట్ను ప్లాస్టిండియా ఫౌండేషన్ తయారుచేసింది. రీసైకిల్ చేసిన 2,100,000 ప్లాస్టిక్ బాటిల్స్తో దీన్ని తయారుచేశారు. ఈ టీ–షర్ట్ పొడవు 96.86 మీటర్లు.‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంగ్’ పుస్తకం 1558లో విడుదలైంది. ఇప్పటికీ ప్రింట్లో ఉంది. ఈ పుస్తకం రాసిన లూయిజీ కార్నరో వంద సంవత్సరాలు బతికాడు. -
శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్ఫోన్తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...తొమ్మిది సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది మహిరమ. పదో ఏట స్నేహితులతో కలిసి చిన్న కథ రాసింది. ఆ తరువాత దీనినే నవలగా రాయాలనుకుంది. నవలగా పూర్తిరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. 500 పేజీల ఈ నవల పేరు...రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్.సంగీతంలోనూ మహీరమ రాణిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఫోర్త్ గ్రేడ్లో శిక్షణ తీసుకుంటోంది. హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఫ్రెంచి కూడా నేర్చుకుంటోంది. హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్న చల్లా మహిరమ ‘రూబీ బ్లూస్ట్రీమ్ అండ్ ద స్కీమ్ ఆఫ్ టైమ్’ పేరుతో మరో పుస్తకానికి శ్రీకారం చుట్టింది.అందరూ చదివేలా...నేను రాసిన ఫాంటసీ నవల ‘రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్’ పిల్లలే కాదు అన్ని వయసుల వారూ చదివేలా రాశాను. ఫాంటసీ సబ్జెక్ట్పై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రకృతితో ముడిపడి ఉన్న అంశాల ఆధారంగా నవల రాశాను. భూమి, నీరు, గాలి, అగ్ని...వీటితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉంటుందనే విషయం చుట్టూ నవల సాగుతుంది. – చల్లా మహిరమ (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
మేకప్ ప్రొడక్ట్స్తో బికేర్ఫుల్..! పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ..
మేకప్ వేసుకోవడం అంటే చాలామంది అతివలకు ఇష్టం. అదీగాక యూట్యూబ్ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో సౌందర్య సాధనాలతో చేసేపనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్లు సైతం మేకప్ ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెట్టేస్తారు. అలానే ఇక్కడొక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నిర్లక్ష్య ధోరణితో చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. వివరాల్లోకెళ్తే..సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే ఈ తైవాన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేకప్ ముక్బాంగ్కు ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్కి సంబంధించిన వీడియోలతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సింపుల్ చిట్కాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడం తోపాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్ టేస్ట్ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గరి నుంచి లిప్స్టిక్ వరకు అన్ని టేస్ట్ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ . సోషల్ మీడియా స్టార్డమ్ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్డమ్ సంపాదించుకుంది గానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్ ఉత్పత్తులను టేస్ట్ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించడం గమనార్హం. నిపుణుల వార్నింగ్..దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్ ప్రొడక్ట్స్లో వాడే కెమికల్స్ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. అంతేగాదు మేకప్ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలన్నారు. అలాగే మేకప్తో అలానే అస్సలు పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు. View this post on Instagram A post shared by 芭樂水水 (@guava_beauty_) (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
ముందే పలకరించిన వానలు : రెయిన్కోట్లకు, గొడుగులకు భలే బేరం!
దాదర్: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ క్యాప్లు తదితర సామగ్రి విక్రయించే హోల్సేల్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్ కోటుముంబైలో దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్సేల్ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్లు, స్పైడర్ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్ బొమ్మలతో కూడిన రెయిన్ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్ జాకెట్లు, ప్యాంట్లు, క్యాప్లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్ కవర్లు, బైక్లు, కార్లపై కప్పడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!రెయిన్ కోట్ రూ.30 నుంచి రూ.150 లోపే.. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్ ఫోల్డింగ్ గొడుగులు, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్లు, క్యాప్లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్ ప్లాస్టిక్ బూట్లు, రబ్బర్ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్ కోట్ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం -
102 ఏళ్ల డాక్టర్..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..
ఎవ్వరైన రిటైర్మెంట్ ఏజ్ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.అతడే. అమెరికాలో క్లీవ్ల్యాండ్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ హోవార్డ్ టక్కర్. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా దక్కించుకున్నాడు. 1922లో జన్మించిన డాక్టర్ టక్కర్ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్ టక్కర్. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..👉 ఈ వృద్ధ డాక్టర్ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్, స్కీయింగ్, జిమ్, ట్రెడ్మీల్ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 👉 ఈ వృద్ధ డాక్టర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ని వినియోగిస్తారు. సోషల్ మీడియా స్టార్గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 👉 అంతేగాదు డాక్టర్ టక్కర్ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. ఈ వృద్ధ డాక్టర్ మాములు గ్రేట్ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్ టక్కర్. (చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..) -
ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..
సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్ని రాకెట్లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్కు చెందిన ఆక్సియమ్ స్పేస్ మిషన్ని స్పేస్ఎక్స్-నాసా భాగస్వామ్యంతో మరికొద్దిరోజుల్లోనే ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్కు భారత్కి చెందిన శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు. మరీ ఈసారి జీరో గ్రావిటీలో చేరుకున్నందుకు గుర్తుగా వ్యోమగాములు ఏ బొమ్మను తీసుకువెళ్తున్నారు..? దాని ప్రత్యేకత వంటి విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!..ఆక్సియమ్ స్పేస్ మిషన్ ఈ నెల జూన్ 10న ప్రారంభకానుంది. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ లాంఛ్ అవుతుంది. ఈ రాకెట్ నలుగురికిపైగా వ్యోమగాములు, వారి పరిశోధన సామాగ్రితో సహా అంతరిక్ష కక్ష్యలోకి తీసుకువెళ్లనుంది. వారితోపాటు జీరో-గ్రావిటీకి గుర్తుగా ఓ చిన్న బొమ్మ కూడా ఈ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ బొమ్మను జీరోగ్రావిటీ ఇండికేటర్గా వ్యవహరిస్తారు.ఈ మేరకు ప్రీ-ఫ్లైట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆక్సియం-4 సిబ్బంది మిషన్ జీరో-గ్రావిటీ ఇండికేటర్ను ఆవిష్కరించారు. అదేంటంటే సరస్వతి దేవి వాహనమైన 'హంస'. భారరహిత స్థితిలోకి చేరుకున్న దృశ్యమానాన్ని సూచించడానికి వ్యోమగాములు తమ వెంట ఏదో ఒక బొమ్మ తీసుకువెళ్లే సంప్రదాయంలో భాగంగా ఈ సారి హంసను ఎంపిక చేసుకున్నట్లు ఆక్సియం మిషన్ పేర్కొది. ఇదే ఎందుకంటే..భారతీయులు జ్ఞానాన్ని, ఉన్నత విద్యను అందించే దేవతగా సరస్వతి మాతను ఆరాధిస్తారు. ఆమె వాహనమే ఈ హంస. ఆంనదాన్ని హంసతో పోలుస్తారు. హంస రంగులా ఆనందం నిర్మలమైన తెలుపులో ఉంటుదనేందుకు సూచిక. అలాగే దాని ముక్కు పసుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. అంటే సవాళ్లు, విజయాలు ఒకదాని వెంట ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అదీగాక ఈ మిషన్లో ప్రయాణించి నలుగు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ హంసనే సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా ఆ సభ్యులలో ఒకరైన భారతీయ వ్యక్తి వ్యోమగామి శుక్లాకు ఆ బొమ్మతో మతపరంగా మరింత లోతైన సంబంధం ఉంది. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ శుక్లా మాట్లాడుతూ..హంసకు పాల నుంచి నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందని విశ్వసిస్తారు. ఇది జ్ఞానానికి సూచిక. ఈ బొమ్మ మా మిషన్ని విజయంతం చేసేలా స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఇక ఈ మిషన్ కమాండర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మాట్లాడుతూ..వ్యోమగామి సిబ్బంది మైక్రోగ్రావిటీ గుర్తుగా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లోపల ఈ హంస బొమ్మ స్వేచ్ఛగా తేలుతున్నట్లు కెమెరాల్లో చూడొచ్చన్నారు. అంతేగాదు ఈ ఆక్సియమ్ రాకెట్ను ప్రయోగించిన కొద్దిసేపటికే.. ఈ టాయ్ మైక్రోగ్రావిటీలో మన రాకను సూచిస్తుందని చెప్పారు. ఇక మిషన్లో పాల్గొన్న మూడు దేశాల వ్యోమగాముల ఆకాంక్షలకు చిహ్నం కూడా ఈ హంస బొమ్మే. అదేలా అంటే..భారతదేశంలో ఇది జ్ఞానానికి చిహ్నం కాగా, పోలాండ్, హంగేరిలో ఇది దయకు సంకేతం. అంతేగాదు ఆ నలుగురు వ్యోమగాముల వైవిధ్యానికి, ఐక్యతకు చిహ్నంగా ఈ హంస బొమ్మ నిలవడం మరింత విశేషం. కాగా, ఈ ఆక్సియమ్ 4 మిషన్ గత నెల మే29న ప్రారంభం కావలి, అనివార్య కారణాల రీత్యా జూన్ 8కి షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత జూన్ 10 సాయంత్రం 5.52 నిమిషాలకు లాంఛ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది స్పేస్ఎక్స్. మిషన్ సోవియట్ సోయుజ్ T-11తో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడు కాగా, సరిగ్గా 41 ఏళ్లకు, ఆక్సియమ్ 4 మిషన్తో గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలిచారు. అంతేగాదు బహుళ భారతీయ ఏజెన్సీల భాగస్వామ్యంతో శాస్త్రీయ ప్రయోగాలతో కూడిన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్లో పాల్గొన్న మొదటి భారత పౌరుడు కూడా ఆయనే.(చదవండి: భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..) -
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్బర్డ్స్కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda)p; -
మిస్టర్ వరల్డ్ పోటీలు: మిస్టర్ గ్లో..మిస్టర్ స్లో..
అందాల ప్రపంచంలో అతివలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. పురుషులకూ అంతే ప్రాధాన్యత ఉంది. మోడలింగ్ కావచ్చు, గ్లామర్, సినీ రంగాల్లో రాణించాలనుకునే యువతికైనా, యువకుడికైనా బ్యూటీ కాంటెస్ట్లు చక్కని ర్యాంప్ను ఏర్పాటు చేస్తాయి. అయితే మహిళల అందాల పోటీలు రోజురోజుకూ విస్తరిస్తుంటే మగవాళ్ల అందాల పోటీల విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పోటీలు సందడిగా ముగిసిన నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలను సిటీ మోడలింగ్ రంగం గుర్తు చేసుకుంటోంది. ప్రపంచ సుందరి పోటీలు ఎంత పాపులరో, ప్రపంచ సుందరాంగుడు పోటీలు అంత తక్కువ పాపులర్ అని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీలను 1951లో ప్రారంభిస్తే.. చాలా ఆలస్యంగా.. 45ఏళ్ల తర్వాత 1996లో మిస్టర్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లే ప్రారంభించారు. అందం, శారీరక సామర్థ్యం, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని బట్టి పురుషులను విజేతలుగా ఎంపిక చేసే ఈ పోటీ లండన్లోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సారథ్యం వహిస్తున్న జూలియా మోర్లేనే ఈ పోటీలకు సైతం అధ్యక్షురాలిగా ఉన్నారు. మూడు దశాబ్దాల్లో.. పదకొండు సార్లు.. మిస్ వరల్డ్ పోటీల్లానే.. ఏటా నిర్వహించాలని ప్రారంభంలో అనుకున్నా.. స్పందనను బట్టి ఈ పోటీలను నిర్ణిత వ్యవధి అనేది లేకుండా నిర్వహిస్తున్నారు. తొలిసారి 1996లో బెల్జియం వాసి టామ్ నుయెన్స్ ఈ పోటీలో గెలుపొందగా, 1998లో వెనిజువెలా వాసి సాండ్రో ఫినోగ్లియో, 2000లో ఉరుగ్వే వాసి ఇగ్నాసియో క్లిచె, 2003లో బ్రెజిల్ వాసి గుస్తావో గియానెట్టి, 2007లో జువాన్ స్పెయిన్ కు చెందిన గార్సియా పోస్టిగో, 2010లో ఐర్లాండ్కు చెందిన కమాల్ ఇబ్రహీం, 2012లో కొలంబియా నివాసి ఫ్రాన్సిస్కో ఎస్కోబార్, 2014లో డెన్మార్క్ నుంచి నిక్లాస్ పెడర్సెన్, 2016లో మొదటి ఆసియన్ విజేతగా భారత్కు చెందిన రోహిత్ ఖండేల్వాల్, 2019లో ఇంగ్లాండ్ వాసి జాక్ హెసెల్వుడ్ గెలుపొందారు. చివరి సారిగా 2024లో ఈ పోటీ నవంబర్ 23న వియత్నాంలోని ఫాన్ థియెట్లో జరిగింది. డానియెల్ మేజియా మిస్టర్ వరల్డ్ పోటీలో, స్పోర్ట్స్ టాలెంట్ విభాగాల్లో విజేతగా నిలిచారు. అతను 60 మంది ఇతర పోటీదారులతో పోటీపడి, మొదటి స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాల్లో.. మిస్టర్ వరల్డ్ పోటీలో పాల్గొనేవారు వివిధ విభాగాల్లో పోటీ పడతారు, వారి శారీరక సామర్థ్యం పరీక్షించడానికి స్పోర్ట్స్ ఛాలెంజ్, ప్రతిభను ప్రదర్శించే టాలెంట్ రౌండ్, సామాజిక మాధ్యమాల్లో పట్టును చూపించే మల్టీమీడియా, వ్యక్తిగత శైలి ఫ్యాషన్ సెన్స్ చూపే ఫ్యాషన్ రౌండ్.. ఈ పోటీలు పాల్గొనేవారి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రూపొందించారు. ఇండియాకు టైటిల్ తెచ్చిన నగరవాసి..2016లో, రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు, ఆసియన్ కూడా. ఈ పోటీ జులై 19, 2016న ఇంగ్లండ్లోని సౌత్పోర్ట్లో జరిగింది. రోహిత్, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు కూడా గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే రోహిత్ ఖండేల్వాల్ నగరానికి చెందిన యువకుడు కావడం. ఈ నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి మన హైదరాబాద్ పూర్తిగా సరైన ఎంపిక అని పలువురు నగర మోడల్స్ అభిప్రాయపడుతున్నారు. మిస్ వరల్డ్ లాగే మిస్టర్ వరల్డ్ పోటీదారులు కూడా హైదరాబాద్ నగరంలో సందడి చేస్తారేమో వేచి చూద్దాం.. (చదవండి: మిస్ యూనివర్స్ సన్నాహకం..) -
మెల్లగా వేగాన్ వైపు..! దావత్ ఈద్ పేరుతో..
ప్రస్తుత ఈద్ అల్–అధా (బక్రీద్) పండుగ నేపథ్యంలో పెటా మరోసారి జంతుహింస పై అవగాహన కల్పిచింది. ఇందులో భాగంగా నగరంలో నిత్యం అన్నదానం చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ సర్వ్ నీడీ సహకారంతో దావత్–ఎ–ఈద్ పేరుతో వేగన్ బిర్యానీ పంపిణీ చేశారు. స్వతహాగా వేగన్ అయినటువంటి ప్రముఖ సింగర్ జహ్రా ఎస్ ఖాన్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. నీలోఫర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోని అన్నార్తులకు ప్రత్యేకంగా వడ్డించిన వేగన్ బిర్యానీ పంపిణీ చేశారు. ఏ మతమైనా కరుణను కోరుకుంటుందని, ఆయా మతపరమైన వేడుకల్లో జంతు వధ తప్పనిసరి కావాల్సిన అవసరం లేదని పెటా బృందం నినదించింది. జంతువులపై దయ, కరుణతో నిర్వహించే పండుగలకు మరితం ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. మనుషుల్లాగే జంతువులకూ..జంతు రవాణా చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక జంతువులను ఇరుకైన ట్రక్కుల్లో లాక్కెళుతూ, వాటి ఎముకలు విరిగిపోయినా, ఊపిరాడక చనిపోయినా పట్టింపు లేకుండా హింస్తుండటం బాధాకరం. నేను గత నాలుగేళ్ల నుంచి వేగన్గా మారాను. జంతు సంరక్షణే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడంలో వేగన్ ఫుడ్ ఉత్తమమైనది. ఫిట్గా ఉండటంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్లు, మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధులకు దూరంగా ఉంచడంలో ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యానికి కీలకమైనది. సినిమాల పరంగా మరో మూడు పెద్ద ప్రాజెక్టుల్లో భాగమయ్యాను, త్వరలో అవి విడుదల కానున్నాయి. – జహ్రా ఎస్ ఖాన్మంచి అనుభూతినిచ్చింది.. మహానగరంలో ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నాం.. కానీ ఈ రోజు వినూత్నంగా వేగన్ బిర్యానీ అందించడం మంచి అనుభూతినిచ్చింది. సమానత్వం, సేవ మనుషులకు మాత్రమే కాదు సాటి మూగజీవాలకూ వర్తిస్తుందనే విషయాన్ని పెటా తమ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంది. ఇది స్ఫూర్తినిచ్చే అంశం. – గౌతమ్ కుమార్, సర్వ్ నీడీ వ్యవస్థాపకులు (చదవండి: Dinner: సాయంత్రం 6.30కి తినేయడమే మంచిదా? నటి కరీనా కపూర్ కూడా..) -
భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
పర్యావరణ హితమైన క్లీనింగ్ ప్రొడక్ట్స్నే ఉపయోగిద్దాం ..!
పర్యావరణానికి మేలు చేయడానికి చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. రోజువారీగా మన ఇళ్లలో... గిన్నెలు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, ఫ్లోర్ తుడవడానికి, వాష్ రూమ్లు, గాజు పరికరాలు శుభ్రం చేయడానికి... ఉపయోగించే క్లీనర్స్ సువాసన రావడానికి ఎయిర్ ప్రెషనర్స్.. అంటూ రకరకాల రసాయన ఉత్పత్తులను వాడుతుంటాం. శుభ్రత మాట ఎలా ఉన్నా ఇవన్నీ పర్యావరణానికి హానిచేసేవే ఉంటాయి. వ్యర్థాల నుంచి తిరిగి ఉపయోగించేలా వస్తువుల తయారీ ఎంత ముఖ్యమో, ఇంటి శుభ్రతలో రసాయనాలు లేని ఉత్పత్తుల వాడకమూ అంతే ముఖ్యం. ఆల్ పర్సప్ క్లీనర్స్...దినచర్యలో భాగంగా వంటగది, బాత్రూమ్.. ఇంటిలోని ప్రతి భాగాన్ని శుభ్రం చేయడానికి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. వెనిగర్లో బాక్టీరియా నశింపజేసే గుణం ఉంటుంది. కిచెన్, గ్లాస్, బాత్రూమ్ క్లీనర్గానూ పనిచేస్తుంది.వంటలలో వాడే బేకింగ్ సోడాను ఇంటి శుభ్రతలోనూ వాడచ్చు. మరకలు తొలగించడానికి, దుర్వాసన పోగొట్టడానికి నీటిలో కలిపి ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో యాసిడ్ గుణం ఉండటం వల్ల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. కూరగాయలు కట్ చేసే బోర్డ్స్, మెటల్ పాలిష్ రిమూవర్కి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఇంట్లో మంచి పరిమళాలు రావడానికి సుగంధనూనెలను ఉపయోగించవచ్చు. ఈ నూనెలలో యాంటీబాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయిఫ్లోర్ క్లీనర్గా 5 లీటర్ల నీటిలో అర కప్పు వెనిగర్ + స్పూన్ బేకింగ్ సోడా + కొన్ని చుక్కల ట్రీ ట్రీ ఆయిల్ కలిపి ఫ్లోర్ను తుడవాలి. ఫ్లోర్పై ఉన్న మరకలు, బాక్టీరియా శుభ్రపడుతుంది. ఆల్ పర్పస్ క్లీనర్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. కప్పు వెనిగర్ + కప్పు నీరు + 10 చుక్కల నిమ్మ నూనె స్ప్రే బాటిల్లో కలిపి, గ్లాస్, కిచెన్ కౌంటర్లపై స్ప్రే చేసి, తుడవాలి. బాక్టీరియా దరిచేరదు. చక్కగా శుభ్రపడతాయి.ఆత్మీయ నేస్తం పర్యావరణ ముప్పుకు చెక్ పెట్టే అతి పెద్ద రక్షణ ‘చేతి సంచి. యూజ్ అండ్ థ్రో ΄ాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి క్లాత్తో లేదా జ్యూట్తో చేసిన సంచులను ఉపయోగించవచ్చు. సొంతంగా క్లీనింగ్ ప్రొడక్ట్స్గిన్నెలు కడగడానికి లిక్విడ్ డిష్ వాషర్కి షీకాకాయ, కుంకుడుకాయ పొడి, లెమన్పీల్ పౌడర్, ఉప్పు, బూడిద కలిపి మిశ్రమం తయారుచేసి, దానినే ఉపయోగిస్తాను. ఆరెంజ్ పీల్, నీళ్లు, బెల్లం కలిపి ఒక పాత్రలో పోసి 3–4 నెలల పాటు అలాగే ఉంచుతాను. ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి స్పూన్తో కలుపుతాను. ఆ మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, ఫ్లోర్ తుడవడానికి ఉపయోగిస్తాను. అలాగే, వాషింగ్ మెషిన్ లిక్విడ్, బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్కి కుంకుడు కాయల నుంచి రసం తీసి ఉపయోగిస్తాను. ఒంటి శుభ్రతలోనూ సహజ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను. దుస్తులకు డై చేయడంలో సహజసిద్ధమైన పద్ధతులనే ఎంచుకుంటాను. వీటి తయారీకి కొంత సమయం పడుతుంది. కానీ, పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులను వాళ్లు దోగాడటం నుంచి ఉపయోగిస్తున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ నుంచి ఎకో ప్రింటింగ్ వైపుకు నా ఆలోచనను మార్చుకున్నది కూడా పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీలో భాగం అవ్వడం కోసమే. – సవిత అలంపల్లి, ఎకో ప్రింటర్, కిస్మత్పుర, హైదరాబాద్(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ) -
పెంపుడు కుక్క మరణంతో తీవ్ర మనోవేదన!
మా పెంపుడు కుక్క 12 సంవత్సరాల వయసులో ఈ మధ్యనే జబ్బు చేసి చనిపోయింది. మాకు పిల్లలు లేని కారణంగా, కుక్కతో మాకు చాలా అటాచ్ మెంట్ ఉండేది. నాకు బాధగా ఉన్నప్పటికీ, మా ఆయన మరీ డీలా పడిపోయారు! రోజు దానిని నడకకు తీసుకెళ్ళడం, రాత్రి భోజనం పెట్టడం, స్నానం చేయించడం, ఆయన ఎంతో శ్రద్ధతో చేసేవారు. అది చనిపోయిన తరువాత ఆయన బాగా డల్ అయి మాటలు కూడా తగ్గాయి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టే ఉంటున్నారు. రాత్రులు నిద్ర పట్టక గంటల తరబడి అటు ఇటు తిరుగుతున్నారు. బిజినెస్ మీద కూడా ముందున్న శ్రద్ధ పెట్టడం లేదు నా భర్తను కోల్పోతున్నానని, భయమేస్తోంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. – మంజుశ్రీ, విశాఖ పట్టణం మీ ఉత్తరంలో మీ భర్త ఎదుర్కొంటున్న తీవ్రమైన మానసిక వేదన స్పష్టంగా కనిపిస్తోంది. 12 సంవత్సరాలుగా అంతప్రేమగా పెంచుకున్న పెట్ని కోల్పోవడం మీ ఇద్దరికీ ఎంత బాధాకరమో నేను ఊహించగలను. దానికి రోజూ మార్నింగ్ స్నాక్స్, రాత్రి భోజనం, స్నానం వంటి రోజు వారికి కార్యాలు చేయించడం ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా అయినట్లు అనిపిస్తుంది. ఆయన మనోవేదన, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత తీవ్రంగా ఉన్నట్లుంది. పెంపుడు జంతువులు అందునా ముఖ్యంగా కుక్కలు, మన భావోద్వేగ జీవితంలో ఒక అంతర్భాగం అవుతాయి. అవి నిష్కపటమైన ప్రేమను పంచుతాయి. మీ భర్త ఒంటరితనం, నిద్రలేమి, పనిలో ఇబ్బందులు చూస్తే ఆయన ‘కాంప్లికేటెడ్ గ్రాఫ్’ అనే మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని అనిపిస్తుంది. మార్నింగ్ వాక్, కుక్కకు రాత్రి భోజనం పెట్టడం వంటిని ఆయనకు ఒక నిర్దిష్టమైన రొటీన్ను అందించాయి. అవి లేకపోవడం, వల్ల అతని దైనందిన జీవితంలో ఒక శూన్యత ఏర్పడినట్లుంది. కొన్నిసార్లు కుక్క చనిపోయినప్పుడు దాన్ని బతికించుకోలేక పోయాననే గిఫ్ట్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు! మన సమాజం పురుషులను తమ దుఃఖాన్ని బయటకు వెలిబుచ్చకుండా మనసుల్లో దాచుకొనేందుకు ఒత్తిడి చేస్తుంది. ఇది కూడా ఆయన ప్రస్తుత ప్రవర్తనకు ఒక కారణం కావచ్చు. ఆయన పడుతున్న వేదనను మీరు అర్థం చేసుకొని ‘నేను నీకోసం నీతోనే ఉన్నాను’ అనే విషయాన్ని ఆయనకు అర్థం అయేలా వ్యక్తం చేయండి. ఇది అతను ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఇస్తుంది. మీ కుక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటడం లేదా ఫోటో ఆల్బమ్ తయారు చేయడం లాంటిని ఆయనతో చేయించండి. ఆయన రొటీన్ను కొనసాగించడానికి, ఉదయం నడకకు కలిసి వెళ్దామని సూచించండి. ఆయన నిద్రలేమి ఒంటరితనం, పనిలో ఇబ్బందులు కొనసాగితే ఒక సైకియాట్రిస్ట్కి చూపించి కౌన్సెలింగ్, ఇంకా అవసరం అయితే కొన్ని మందులు, వాడించండి. మీ కుక్కకు సంబంధించిన మంచి జ్ఞాపకాలు పంచుకోండి. మీ ప్రేమ, సాంగత్యం అతనికి శక్తిమంతమైన సపోర్ట్గా ఉంటాయి. మీరు ఆత్మస్థైర్యంతో ఈ పరిస్థితిని తప్పకుండా – అధిగమిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com ) -
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్లో జన్మించి ఐ సర్జన్గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా, మేరేజ్ కౌన్సిలర్గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
లాస్ట్ మీల్ ఎన్నింటికి తింటున్నారు..? నటి కరీనా కపూర్ ఏకంగా..
సాయంత్రం కాస్త ఎర్లీగా భోజనం తినేయమని చెబుతుంటారు నిపుణులు. అదే ఆరోగ్యకరమని పదే పదే నొక్కి చెబుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం అదే మాట అన్నారు. తాను కూడా అలానే తింటానని చెప్పారు కూడా. పైగాఅదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పారామె. ఆరోగ్యప్రదాత సూర్యుడి గమనం ఆధారంగానే మన జీవక్రియ పనిచేస్తుందని..దానికనుగుణంగా తింటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు కూడా. సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్న ఈ హెల్దీ ట్రిక్ గురించి సవివరంగా చూద్దామా..!.నాలుగు పదుల వయసులో ఉన్న కరీనా కపూర్ సైతం సౌందర్యపరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా చాలా మంచి జీవశైలికి పేరుగాంచిన నటి. ఈ ఏజ్లో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా కట్టిపడేసే గ్లామర్ కరీనా సొంతం. ఆమె చాలా క్రమశిక్షణాయతమైన జీవనశైలిని ఫాలో అవుతానని పలు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారామె. పోషకాహారంతో కూడిన డైట్, బాడీకి తగిన వర్కౌట్లు, త్వరిత గతిన నిద్రకు ఉపక్రమించడం వంటి మంచి అలవాట్లనే అనుసరిస్తారామె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చివరి మీల్ కచ్చితంగా సాయంత్రం 6.30 కల్లా పూర్తి అయిపోయేలా చూసుకుంటానన్నారామె. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత త్వరగానే అని అనుకున్నారు కూడా. కానీ కరీనా మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది తప్పనిసరని చెబుతోంది.అలానే మంచిదా అంటే.. సూర్యదోయం వేళ మన శరీరం చాలా చురుకుగా ఉంటుందట. ఆ సమయంలోనే మన జీవక్రియలు యాక్టివ్గా ఉంటాయట. అంటే పగలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా..సులభంగా అరిగిపోతుందట. పైగా మనం మేల్కోనే ఉంటాం కాబట్టి సులభంగా ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుందట. ఇక సూర్యాస్తమయ వేళ్లకు మన శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి ఆ టైంలో జీర్ణమవ్వడానికి అధిక సమయం తీసుకునే ఫుడ్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైగా అది కూడా సూర్యస్తమయంలోపే ఫినిష్ చేస్తే మంచిదట. దానివల్ల మనం పడుకునే సమయానికి అరిగిపోయి..త్వరితగతిన మేల్కొనడానికి ఉపకరిస్తుంది. మన శరీరధర్మానికి అత్యంత అనువైన జీవన విధానం ఇదేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మన పూర్వీకులు దీన్ని బాగా అనుసరించేవారని చెబుతున్నారు. ఇలా సాయంత్రం 6.30 కల్లా భోజనం తినేస్తామో..అప్పుడు మనం దాదాపు 12 నుంచి 14 గంటలు అడదడపా ఉపవాసం ఉన్నట్లువతుంది. పైగా ఉదయమే చక్కటి లెమన్ విత్ హనీ వాటర్తో రోజుని మొదలుపెట్టి, నచ్చిన ప్రూట్ సలాడ్ వంటి పోషకాహారాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచిదట. ఈ విధానంలో మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ దూరంగా ఉండటం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలు..జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందికడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉండదుఇలా ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది కూడాదీనివల్ల విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయిబరువు అదుపులో ఉంటుందినిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందటరోజంతా చురుగ్గా ఉంటారట మరీ అంత తొందరగా తినలేకపోయినా..కనీసం సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం ఫినిష్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి..సత్ఫలితాలను పొందండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ) -
జస్ట్ 10 నిమిషాలు అదొక్కటి చాలు! నాసా స్టడీ
అందరూ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి అనుకుంటారు. కానీ మధ్యలోనే వదిలేసేవాళ్లు కొందరైతే, మరికొంతమంది మన వల్ల కాదు అని చేతులేత్తుస్తుంటారు. అస్సలు హెల్దీగా ఉండాలంటే..అది చాలా తేలిగ్గా తెలివిగా చేసే పని అంటోంది నాసా. అందరూ బిజీ షెడ్యూల్తో శారీర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. పైగా వర్కౌట్లు కొన్ని రోజుల తర్వాత విపరీతమైన వొళ్లు నొప్పులుగా అనిపించి స్కిప్ చేసేస్తుంటారు. దాంతో చాలామంది కంటిన్యూ లేదా దైనందిన జీవితంలో ఆ వ్యాయామాలను భాగం చేసుకోలేక విఫలమవుతుంటారు. అలాంటివాళ్లు ఒక్క పదినిమిషాలు ఈ వ్యాయమానికి కేటాయించండి చాలు అని చెబుతోంది నాసా పరిశోధన. ఇది ఎంత ప్రభావవంతమైన ప్రయోజనాలందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారని అంటోంది. పైగా మధ్యలో వదిలేయరు, అది మీ జీవితంలో ఓ భాగమైపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరీ ఆ వ్యాయామం ఏంటంటే..ఎక్కువ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి ఈ వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. ఇది ఒక చిన్న ట్రాంపోలిన్పై చేసే జంపింగ్ లాంటి వ్యాయామం. పిల్లలు అమిత ఇష్టంగా చేసే జంపింగ్ క్రీడ. ఇది గనుక చేస్తుంటే తెలియకుండానే ఒక విధమైన ఆనందం..పైగా అమితోత్సాహంతో మరింతగా చేస్తారట కూడా. ఇది తెలియకుండానే బాడీలోని కేలరీలను తగ్గిస్తుందట. ఇందుకోసం కావాల్సిందల్లా..మినీ-ట్రాంపోలిన్ ఉంటే చాలు. దీంతో జంపింగ్ జాక్లు చేస్తుంటే..బరువు అదుపులో ఉండటమేగాక..బాడీ కూడా ఫిట్గా ఉంటుందని చెబుతున్నారు. పోనీ ఈ జంపింగ్ కుదరకపోతే..ఓ 30 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్తో నచ్చినట్లుగా గంతులు వేయండి. ఓ పద్ధతి అవసరం లేదు బాడీ అంతా ఊగేలా ఎంజాయ చేస్తూ నచ్చినట్లుగా డ్యాన్స్ చేయండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చాలు అని చెబుతోంది నాసా. ఇది పరుగు, జాగింగ్ కంటే కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందట. కచ్చితంగా మెరుగైన ఫలితాలు పొందగలరని చెబుతోంది నాసా పరిశోధన. ఇది శరీరంపై అధిక ఒత్తడిని కలిగించదు. అదీగాక ఎవ్వరైనా హాయిగా సులభంగా చేయగలిగేవే ఈ వ్యాయమాలని పేర్కొంది నాసా. ఆరోగ్య లాభాలు..సరదాగా ఉండే ఈ వ్యాయమాం కిల్లర్ ఫుల్ బాడీ వ్యాయామంకీళ్లపై సున్నితంగా ఉంటుంది. అయితే మోకాళ్లు, చీలమండలంపై కఠినంగా ఉంటుంది. శోషరస వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. పైగా ఇది మంచి కార్డియో వర్కౌట్ల పనిచేస్తుంది. ఆరోగ్యానికి బెస్ట్ వ్యాయామం కూడా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం) -
మరోసారి హాట్టాపిక్గా పని జీవిత సమతుల్యత..! వైరల్గా హర్ష్గోయెంకా ప్రసంగం
పని జీవిత సమతుల్యత అనే టాపిక్ మాత్రం ప్రతిసారి రసవత్తరమైన అంశంగా మారిపోతోంది. దీనిపై ఒక్కొక్కరిలో ఒక్కో అభిప్రాయం ఉంది. ఇది వారి వారి హోదాల రీత్యా సరైనది కావొచ్చు. అందరికీ వర్తించాలంటే మాత్రం కష్టమే. ఉద్యోగి శరీర తత్వం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు తదితరాల దృష్ట్యా మారుతూ ఉంటుందనేది నిపుణుల వాదన. అంగీకరించక తప్పని వాస్తవం కూడా. బహుశా ఈ విషయాన్నే సూటిగా చెప్పే ఉద్దేశ్యంతో మరోసారి వివరణ ఇచ్చినట్లుగా ఉంది నెట్టింట వైరల్ అవుతున్న హర్ష్ గోయెంకా ప్రసంగం. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎప్పటికప్పుడూ నెటిజన్లతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి తన ఉద్యోగుల నుద్దేశించి ప్రసంగించిన వీడియోని షేర్ చేసుకుని..నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఆ వీడియోలో హర్ష్ గోయెంకా..తాను ఆదివారాల్లో పనిచేయడం గురించి, జీవిత భాగస్వాములను చూస్తుండటం గురించి మాట్లాడటం లేదు. అందువల్ల కాసేపు శ్రద్ధతో నా మాటలు ఆలకించండి అన్నారు. అంతే ఆ సభా ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. ఉద్యోగులంతా ఆయన ప్రసంగానికి కడుపుబ్బా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోలో. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి మీ సంస్థలో ప్రతి ఉద్యోగి పనిలో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఐతే ఇంతకమునుపు ఇదే హాలులో ఎల్ అండ్ టి అనే కంపెనీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడిన మాటలతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. నిజానికి సుబ్రహ్మణ్యన్ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగుల పోటీతత్వం గురించి చెబుతూ ఆయన..వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. అయినా ఎంత సేపు భార్యను చూస్తుంటారు, ఆదివారం కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్నారు. ఎందుకంటే తాను కూడా ఆదివారాల్లో పనిచేస్తానని చెప్పారు. పైగా అలా చేయడం వల్ల తాను మరింత సంతోషంగా ఉన్నానని సుబ్రహ్మణ్యన్ అన్నారు. అంతే ఒక్కసారి పనిజీవిత సమతుల్యతకు ఆస్కారం ఏముందని న్యూట్రిషన్లు, ప్రముఖులు భగ్గుమన్నారు. ఇది సరైనది కాదంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పైగా ఈ అంశం హాట్టాపిక్గా మారి చర్చలకు దారితీసింది. ఇక మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..తాను పని నాణ్యతను నమ్ముతానని, ఎని గంటలు చేశామన్నది లెక్కలోకి తీసుకోనని చెప్పారు. అలాగే పనినాణ్యతపై దృష్టి పెట్టాలే గానీ, పరిమాణంపై కాదని తేల్చి చెప్పారు. ఆఖరికి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ సైతం పని గంటలు కాదు, నాణ్యతే ముఖ్యం అని చెప్పారు. ఇక వ్యాపరవేత్త హర్ష్ గోయెంకా కూడా గతంలో వారానికి 90 గంటల పనా? అని ఖండించారు. సండే అనేది సూర్యుడి డ్యూటీగా భావించి డే ఆఫ్గా ఎందుకు భావించకూదని అన్నారు. అయినా జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్ పనిగా మార్చేస్తే విజయం మాట దేవుడెరగు..అనర్థాలే తెచ్చిపెడుతుందన్నారు. ఆయన కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఆప్షన్ కాదు, అది మన అవసరం అని నొక్కి చెప్పారు. వర్క్ని చాలా తెలివిగా స్మార్ట్గా చేసేందుకు ప్రాముఖ్యత ఇస్తానన్నారాయన. సో పనిజీవిత సముతుల్యత అన్నది ఎంత ముఖ్యమో అర్థమైంది కదా..కాబట్టి బిజీకి ఛాన్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుందామా మరీ..!.Concluding part of my annual RPG townhall address to all my colleagues 😀 pic.twitter.com/sIbC34dqU2— Harsh Goenka (@hvgoenka) June 3, 2025 (చదవండి: నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!) -
పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు
ఒకప్పుడు పుస్తకాలు తెగ చదివేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి ఒక పుస్తకం చదవడం కూడా కష్టమైంది’ అనే మాట వింటుంటాం. పుస్తకం పఠనం అనేది విలువైన అభిరుచి. ఆ అభిరుచిని ఎప్పటిలాగే కొనసాగించడానికి...ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకంతో మీ రెండో ప్రయాణం ప్రారంభించండి. టీవిలో మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ‘థ్రిల్లర్’ నవలతో రంభించండి. పెద్దపెద్ద పుస్తకాలతో కాకుండా చాలా చిన్న పుస్తకాలతో చదవడం మొదలుపెట్టండి. ‘రోజుకు ఇన్ని పేజీలు’ అని నిర్ణయించుకొని వాటిని మెల్లగా పెంచుతూ పోవాలి.మీతో పాటు ఎప్పుడూ ఒక పుస్తకం ఉండాలి. బయట ఎక్కడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు, వెయిటింగ్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ చూడడం కాకుండా పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. పుస్తక పఠనం అనేది సోలో హాబీ మాత్రమే కాదు. ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. రెండు మూడు రోజులు కావచ్చు. వారం కావచ్చు...‘రీడింగ్ టైమ్’ అని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. కాస్త మార్పు కోసం, ఆసక్తి కోసం కొంత టైమ్ ఫిజికల్ బుక్స్ నుంచి ఇ–బుక్స్కు మారండి. -
చిన్నారులను కంటికి రెప్పలమై కాపాడుకుందాం..!
ఇవి..అవి..అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం పిల్లలు అనేక రూపాల్లో శారీరక, లైంగిక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారు.వారిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వారి హక్కులను ఎలా కాపాడుకోవాలి... మొదలైన విషయాలను అవగాహన పరిచే రోజు... సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే రోజు...ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’...పద్నాలుగు సంవత్సరాల వయసులో రోషిణి పర్వీన్కు వివాహం జరిగింది. పదిహేను సంవత్సరాలకే తల్లి అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో రోషిణి పడిన బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇన్నీ అన్నీ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తనలా ఏ అమ్మాయీ బాధ పడకూడదు అనుకొని ముందుకు కదిలింది.ఇప్పటివరకు అరవైకి పైగా బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకుంది.ఆ పిల్లలను మళ్లీ బడి బాట పట్టించి వారి భవిష్యత్ను వెలుగుమయం చేసింది. ఒకప్పుడు ‘నేను ఒంటరిని’ అనుకున్న బిహార్లోని సిమల్బరీ గ్రామానికి చెందిన రోషిణి ‘చైల్డ్లైన్ ఇండియా ఫౌండేషన్’లో చేరడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ‘నేను ఒంటరిని కాదు. నాతో మరెంతోమంది ఉన్నారు’ అనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ప్రాణాలకు తెగించి బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకుంది.‘సేవ్ ది చిల్డ్రన్’లాంటి సంస్థలలో పని చేసిన రోషిణి ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే సమస్యల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నో స్కూల్స్లో ‘గర్ల్స్ గ్రూప్’లను ఏర్పాటు చేసింది. బిహార్లోని రోషిణి పర్వీన్ నుంచి శ్రీకాళహస్తిలోని వైశాలి వరకు ఎంతోమంది మహిళలు పిల్లల హక్కులు, భద్రత గురించి క్రియాశీలంగా పనిచేస్తున్నారు.క్షేత్రస్థాయిలోకి...‘కొంతమంది స్నేహితులు, న్యాయవాదుల సహాయంతో బుక్లెట్ రూపొందించాను. మా అబ్బాయితో మొదట దీని గురించి మాట్లాడాను. సేఫ్ ఇండియా, హ్యాపీ ఇండియా క్యాంపెయిన్ మొదలు పెట్టి పిల్లల భద్రత గురించి ప్రచారం చేశాం. కరపత్రాలు పంచాం’ అంటుంది వైశాలి కోలా.పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్రీకాళహస్తిలో‘తేజోభారత్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది వైశాలి. ‘ఏదైనా నేరం జరిగితే దానిగురించి కాసేపు మాట్లాడుకొని బాధ పడతారు. ఆ తరువాత మరచి పోతుంటారు. కొందరు మాత్రం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటారు. అలాంటి వారు కూడా ఏదైనా చేద్దాం అంటే ముందుకు రారు. పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదాల గురించి అవగాహన కలిగించడానికి స్వరక్ష ఏర్పాటు చేశాం’ అంటుంది కేరళలోని కోచికి చెందిన అనూ సూరజ్. ‘స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ పిల్లలపై జరిగే భౌతిక, లైంగిక, మానసిక హింస గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలకు తెలియజేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.ఎందుకు ఈరోజు?ప్రతి సంవత్సరం జూన్ 4న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆగస్ట్ 19, 1982లో మొదలైంది. మొదట్లో యుద్ధ బాధితులైన లెబనాన్, పాలస్తీనా పిల్లలపై దృష్టి పెట్టినప్పటికీ తరువాత దీని ఉద్దేశాన్ని విస్తృతీకరించారు. పిల్లలు రకరకాల రూపాల్లో ఎదుర్కొంటున్న హింసను నిరోధించడానికి, వారి హక్కులను కాపాడడానికి పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ఆలోచించడమే ఈ రోజు ఉద్దేశం.ఫన్నీగానే సీరియస్ విషయాలుబ్యాడ్ టచ్, గుడ్ టచ్ పిల్లలు గుర్తించేలా చేయడానికి, ఆన్లైన్లో సురక్షితంగా ఉండడానికి, అంతర్గత శక్తిని పెంచడానికి ఆడియో–విజువల్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాం. ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తున్నాం. కథలు, ఫన్ వీడియోల ద్వారా చిన్న పిల్లలకు సీరియస్ విషయాల గురించి తెలియజేస్తున్నాం. ‘మాయ’ అనే షార్ట్ ఫిల్మ్ను కూడా రూపొందించాం. పేరెంట్స్, టీచర్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రకరకాల ఏజ్ గ్రూపుల ఆధారంగా పిల్లలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం,– అనూ సూరజ్, స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు‘చైల్డ్ మ్యారేజ్–ఫ్రీ ఇండియా’ అనేది నా లక్ష్యం. నాది బాల్య వివాహం కావడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదనుకున్నాను. గ్రామాల్లో ‘చైల్డ్ ప్రొటెక్షన్’ కమిటీలు ఏర్పాటు చేశాం. అవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘మీ హక్కులు ఇవి’ అంటూ పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించాం.– రోషిణి, సామాజిక కార్యకర్తఎన్నెన్నో రూపాల్లో..పిల్లల్ని పనిలో పెట్టుకొని వారి భవిష్యత్ను చీకటిమయం చేసే, పిల్లల్ని అపహరించి అమ్ముకునే, పిల్లల్ని అపహరించి వ్యభిచార కూపాల్లోకి దింపే సంఘటనలు ఒకవైపు... మరోవైపు యుద్ధాలలో చని΄ోతున్న పిల్లలు. యుద్ధ భీభత్సానికి బా«ధితులు అవుతున్న పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రుల తగాదాలకు మానసికంగా దెబ్బతింటున్న, అయిన వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!) -
టర్మరిక్ క్యూబ్స్తో.. మిలమిలలాడే అందం
ఇది అటు ఎండా... ఇటూ వానా రెండూ కలగలిసిన వింత వాతావరణం. ఈ సీజన్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్ వల్ల కమిలినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్క్యూబ్లతో మంచి పరిష్కారం లభిస్తుంది. టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్పొడి, కప్పు రోజ్వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒకగిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్క్యూబ్స్తో ఇరవై నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలిఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ను రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ఫ్రెష్గా మెరుపులీనుతూ కనిపిస్తుంది.అంతేకాదు, చర్మం జిడ్డు కారడం ఆగిపోయి దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!) -
వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!
1999లో మా తాతగారు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు వీలునామా రాశారు. అందులో నాకు నా కజిన్ (పెద్దమ్మ కూతురు)కి సమానమైన వాటా రావాలి అని చెప్తూనే ఆ వీలునామా మేము ఇద్దరం మేజర్లు అయిన తర్వాత మాత్రమే చెల్లుతుంది అని కూడా రాశారు. నేను, మా కజిన్ దాదాపు ఒకటే వయసు వాళ్ళం. 2007లో మేజర్లం అయ్యాం. సమస్య ఏమిటంటే, ఆ వీలునామా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఇది చాలా పాతది – ఈ వీలునామా చెల్లదు, కోర్టును ఆశ్రయించాలి అంటున్నారు. మా మేనమామకు – ఇంకొక పిన్నిగారికి కూడా సంతానం ఉంది కానీ వారికి ఈ ఆస్తిలో మా తాతగారు ఏమీ వాటా ఇవ్వలేదు. ఈ విషయాలు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మేము కోర్టుకు వెళితే వాళ్లు పేచీ పెడతారని భావిస్తున్నాము. ఏం చేయమంటారు? – సరళ, విశాఖపట్నంవీలునామా రిజిస్టర్ చేసుకోవడం మంచిది అయినప్పటికీ రిజిస్టర్ చేయాలి అనే ఖచ్చితమైన నియమం ఎక్కడా లేదు! రిజిస్టర్ చేయని వీలునామా అయినా చట్టబద్ధంగా చెల్లుతుంది. ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు తెలియజేశాను. చాలా పాత వీలునామా కాబట్టి ఇది చెల్లదు అనడం సరికాదు. వీలునామాను అమలుపరచుటకు (ఎగ్జిక్యూట్ చేయుటకు) ఎటువంటి కాలపరిమితీ లేదు. మీరు తీసుకువెళ్లిన వీలునామా ఆధారంగా రిజిస్ట్రార్ గారు ఖచ్చితంగా మీ పేరున ఆస్తి బదిలీ చేయవలసి ఉంటుంది. పైగా ఈ ఆస్తిపై, సదరు వీలునామాపై అభ్యంతరాలు ఉన్నాయి అంటూ ఎవరు ఎటువంటి ఫిర్యాదులు వాళ్లకు అందనప్పుడు రిజిస్ట్రేషన్ను ఆపే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో విషయం... కోర్టులో దావా వేస్తే మీరు అనుమానం వ్యక్తపరచిన విధంగా మీ తాత గారి సంతానం అయిన వేరే కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఇప్పుడు పేచీ పెట్టే అవకాశం లేకపోలేదు. సివిల్ కోర్టుకు వెళ్తే మీరు డిక్లరేషన్ సూట్ వేయవలసి ఉంటుంది. అయితే సివిల్ కోర్టుకు వెళ్లే ముందు, మరొక దరఖాస్తు సదరు రిజిస్ట్రార్ గారికి సమర్పించి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. వారు అప్పటికీ వినను అంటే దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా వ్రాసి ఇమ్మని అడగండి. అలా ఇచ్చినా ఇవ్వక΄ోయినా, హైకోర్టు లాయర్ గారిని సంప్రదించి రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించి రిజిస్ట్రార్ గారి నిర్ణయాన్ని (లేదా మీ దరఖాస్తుపై జాప్యాన్ని) చాలెంజ్ చేయండి. హైకోర్టు ద్వారా మీకు అనుకూలమైన ఆర్డర్ రావడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. అప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం రాదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )( -
అందరూ ఆమె బతకదన్నారు..! కానీ ఇవాళ ఆమె లుక్ చూస్తే..
కొందరు చావు అంచులు దాక వెళ్లొచ్చి..బతికొస్తుంటారు. అలా ఆయురారోగ్యాలతో ఉన్నావారెందరో. ఒకరకంగా వారంతా ఆ అనారోగ్యం మేల్కొలుపుతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ డాక్టర్. అంతటి భయానక పరిస్థితి నుంచి బయటపడ్డ ఆమె లుక్ను చూస్తే కంగుతింటారు. ఈమెనే అనారోగ్యం బారినపడింది అనే సందేహం కలుగమానదు. ప్రస్తుతం ఆమె వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి.. దీర్ఘాయువుతో ఎలా ఉండాలో చిట్కాలు చెబుతున్నారామె. మరీ ఆ డాక్టర్ ఆసక్తికర గాథ ఏంటో చూద్దామా..!.లండన్కి చెందిన 53 ఏళ్ల లైఫ్స్టైల్ వైద్య నిపుణురాలు డాక్టర్ అల్కా పటేల్ని చూస్తే 23 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. ఆమె జీవ సంబంధమైన వయసు కేవలం 23 ఏళ్లేనని ఆమెనే స్వయంగా చెబుతున్నారు. మనలో కొందరూ ఏజ్ పరంగా చాలా పెద్దవాళ్లైన లుక్చూస్తే చిన్నవాళ్లలా ఉంటారు. అలా మనం కూడా ఉండొచ్చని అల్కా అంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలితో ఆరోగ్యాన్నే కాదు మన ఏజ్ని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారామె. ఒకప్పుడామె..ఆమె రెంబు దశాబ్దాలకు పైగా జనరల్ ప్రాక్టీషనర్ సేవలందించిన డాక్టర్ ఆమె. ఎక్కువ సమయం తన పేషెంట్ల బాగోగుల, కుటుంబ బాధ్యతలకు కేటాయించి తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారామె. దాంతో సడెన్గా తన 39వ పుట్టనరోజున ఎడతెరగని జ్వరం బారినపడింది. సాధారణ జ్వరం కాస్త సివియర్ అయిపోయింది. నెమ్మదిగా అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. అసలు ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో వైద్యులకే అంతు చిక్కలేదు. ఇక లాభం లేదని అవయవాలు పనిచేసేలా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిదంటే..తన పిల్లలకు అమ్మగా తానేం చేయకుండానే చనిపోతాననే బెంగతో జీవచ్ఛవంలా అయిపోయింది. ఒకరకంగా ఆ అనారోగ్యం అల్కాకు తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టేలా చేసింది. ఎలాగైన తన పిల్లల కోసం ఈ అంతుచిక్కని వ్యాధిని ఎలాగైనా జయించాలనే ధైర్యాన్ని కూడగట్టుకుంది. అలా నెమ్మదిగా..తగినంత విశ్రాంతి, పోషకాహారంపై దృష్టిపెట్టి తనను తాను బాగుచేసుకుంది. ఆ తర్వాత మరింత ఆరోగ్యంగా ఉండేలా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఆహారంపై ఫోకస్ పెట్టారు అలా ఆమె యవ్వనంగా మారడమే గాక పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించారు. ఆ అనారోగ్యమే తన కళ్లు తెరిపించిందని అంటారామె. పైగా ఇవాళ ఆమె దీర్గాయువు నిపుణురాలిగా సేవలందిస్తున్నారు కూడా. ఇక ఆమె ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని నిర్వహించడం కోసం ఆరింటిని తప్పనిసరిగా పాలోకండని సూచిస్తున్నారామె. అవేంటంటే..సూర్యకాంతిలో గడపటం: ప్రతిరోజు ఉదయం కనీసం ఒక్క నిమిషం సూర్యకాంతిలో గడపటం. ఓ పదిసెకన్లు కళ్లు మూసుకుని మీకోసం మీతో గడపాలట.వాకింగ్: గుండె ఆరోగ్యం, శక్తిని పెంచడానికి ఓ 20 సెకన్ల పాటు నడవాలట. హైడ్రేటెడ్ ఉండటం: ప్రతి 30 నిమిషాలకు నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టడంపొగడ్తలు, గర్వంగా ఫీలైన క్షణాలు: మిమ్మల్ని మెచ్చకున్న వ్యక్తులను గుర్తుచేసుకోండి. అలాగే మీకు మద్దతు, సహయం చేసేవారిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలటవర్కౌట్లు: శరీరంలో మంచి కదలికలు ఉండటం కోసం ఓం 50 సెకన్ల పాటు వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయలటబ్రీథింగ్ వ్యాయామాలు: నాడీ వ్యవస్థను శాంతపరిచేలా ప్రతి రోజు ఒక గంట శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం తదితరాలతో వ్యాయమాన్ని తిప్పికొట్టి ఆరోగ్యవంతంగానే కాకుండా నిత్య యవ్వనాన్ని సొంత చేసుకోగలమని చెబుతున్నారు డాక్టర్ అల్కా పటేల్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
వయసు 70 ఏళ్లు.. ఇప్పటికీ 40 కి.మీ. సైకిల్పైనే..
చిన్న వ్యాపారమే నడుపుతున్నా.. రయ్రయ్మని.. బైక్ లేదా కార్లలలో వెళ్తుంటారు. పైగా అది స్టేటస్ సింబల్గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా.. ఇప్పటికీ సాధారణ సైకిల్పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కిలోమీటర్లు పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భరంగా అంతలా ఫిట్నెస్ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్ లెజెండ్గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపారవేత్త అయినా ఆయన ఫిట్నెస్కి వీరాభిమాని. వ్యాపారిగా తన కెరీర్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సూరత్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ.. సైకిల్పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్ని సలాబత్పురా నుంచి అంకలేశ్వర్ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్లోని తన ఇంటి నుంచి స్టేషన్కి మూడు కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్ కంపెనీ సైకిల్ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే.. ఆ సైకిల్ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. ఇంత బిజీ లైఫ్లో కూడా ఆయన రోజూ 10వేల అడుగులపైగా వాకింగ్ చేస్తాడట. మారథాన్, రన్నింగ్ రేస్ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే.. మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కిలోమీటర్లు సైకిల్పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!(చదవండి: 'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్ నటుడు గోవింద్ వైఫ్ సైతం..) -
'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్ చేసుకునేలా మార్కెట్ డయాబెటిస్ వాళ్లకు ఉపయోగపడే రైస్, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో గోవింద్ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్తో పేషెంటేనని, అందుకని రైస్ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్రైస్ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్కి ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. ‘డయాబెటిక్ రైస్’ అంటే..ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..నల్ల బియ్యంఎర్ర బియ్యంగోధుమ బియ్యందంపుడు బియ్యంతక్కువ GI బాస్మతి బియ్యంమిల్లెట్ ఆధారిత బియ్యంప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యంవాటిల్లో గ్లైసెమిక్ సూచిక..తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుందిదీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదుశుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్నిపుణులు ఏమంటున్నారంటే..ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారుగ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. (చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..) -
‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే ..?
సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చినప్పుడు ‘షాక్ ట్రీట్మెంట్’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్మెంట్. బాధితులకు షాక్ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్ ట్రీట్మెంట్ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...షాక్ ట్రీట్మెంట్ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... అసలు కరెంటు షాక్ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్ / కన్వల్సెన్స్)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్ ఈసీటీ రూపంలో ... ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్ యాక్టింగ్) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. ఇందులో బాధితులకు తమకు కరెంట్ షాక్ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్పేషెంట్ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. ఎలక్ట్రో కన్వల్సివ్ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు ఉన్నవారికి. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. బైపోలార్ డిప్రెషన్ ఉన్న బాధితులకు మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్థెరపీ బాగా ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గాతొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్ లొకేట్ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్లొకేషన్) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.ఈసీటీపై అపోహలూ వాస్తవాలు అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్ ప్రవహించవచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. అపోహ: కరెంట్ షాక్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్నెస్ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్ ఆక్సీమీటర్ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులైజేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వైహెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
ఇదేం ఫ్యాషన్..? ఏకంగా దుప్పటినే లెహంగాలా..
‘ఫ్యాషన్ అనేది ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి కాదు మన ఊహాల నుంచి మొదలవుతుంది’ అంటారు. సిమ్రాన్ క్రియేటివిటీని చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ ఆనంద్ ఇరవై కిలోల బెడ్ షీట్ను ఆకట్టుకునే లెహంగాగా మార్చి ఔరా..! అనిపించుకుంది. చక్కటి ఎంబ్రాయిడిరీతో అందంగా ఉన్న ఈ బెడ్షీట్ని ఇలా కూడా ఉపయోగించొచ్చు అనే ట్రెండ్కి తెరతీసింది. అదేనండి మనసుంటే మార్గం ఉంటుంది. అన్నట్లుగా ఈ అమ్మడు తన సృజనాత్మకతకు పదునుపెట్టి మరీ మనకు సరికొత్త ఫ్యాషన్ని పరిచేయం చేసింది సిమ్రాన్‘ఔట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్’ కాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సిమ్రాన్.‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘బెడ్ షీట్లలో నాకు ఫ్యాషన్ కనిపించింది’ ‘లెహంగాగా మార్చడం ద్వారా దుప్పట్లకు సెకండ్ లైఫ్ కూడా ఇవ్వవచ్చు’ అంటుంది సిమ్రాన్. ఇక నెటిజనుల స్పందన విషయానికి వస్తే... ‘దుప్పటితో లేహంగా ఏమిటీ!’ అనే వెక్కిరింపుల కంటే.. ‘క్రియేటివ్ ఐడియా’ అనే ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. View this post on Instagram A post shared by Simran Anand (@simrananand21) (చదవండి: ‘పేరెంట్ షాలా’: పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!) -
పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!
ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం ఒక ఛాలెంజింగ్గా మారిందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్ స్టైల్ ఇందుకు ముఖ్య కారణాలని ప్రముఖ మనస్తత్వవేత్త సుదీర్ సండ్రా తెలిపారు. సుధీర్ ఆధ్వర్యంలో నగరంలోని శిల్పకళా వేదికగా నిర్వహించిన సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్లో 1,300 మందికి పైగా తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఉపయోగపడే అధునాతన యాప్ ‘పేరెంట్ షాలా’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్నారులకు సరైన గైడెన్స్ ఇచ్చే వేదిక కోసం వెతుకుతున్నారని, దీనికి అనువైన వేదిక ‘పేరెంట్ షాలా’ అని పేర్కొన్నారు. వారికి ఇదొక మెంటార్ లా సాయపడుతుందని చెప్పారు. నిపుణుల మార్గదర్శకత్వంతో పాటు కమ్యూనిటీ పరంగా సహాయం అందిస్తుందని, భారతీయ సంప్రదాయాలకు, ఆధునిక పేరెంటింగ్ పద్ధతులను జతచేసి అనుబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా చిన్నారుల దృష్టిని మళ్లిస్తుందని, అలాగే తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే వేదికపై సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్లో భాగంగా నలుగురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత స్టోరీ టెల్లర్ రమా రావి, డాక్టర్ ఇప్పలపల్లి రమేశ్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ (ఎన్హెచ్ఏ) డైరెక్టర్ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్) -
చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్
ఇప్పుడంటే మోటారు సైకిల్, కార్లు సర్వసాధారణం అయ్యాయిగాని.. ఒక జనరేషన్ వెనక్కి వెళితే సైకిల్ అనేది స్టేటస్ సింబల్గా ఉండేది. ఊర్లో అక్కడక్కడా కనిపించేవి. పెళ్లిళ్లలో మగ పెళ్లివారు సైకిల్ బహుమానంగా ఇవ్వాల్సిందేనని అడిగి మరీ తీసుకునేవారు. ఆ పరిస్థితుల నుంచి మధ్యలో కొంత కాలం విరామం వచ్చింది. ప్రస్తుతం మళ్లీ సైకిల్కు క్రేజ్ పెరుగుతోంది. ఆరోగ్యం, శారీరక వ్యాయామం, ఒత్తిడి నుంచి రిలాక్సేషన్, కాలుష్య నివారణ, పెట్రోల్ వినియోగం తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించిన పట్టణ యువత తిరిగి సైక్లింగ్ వైపు మొగ్గుచూపుతోంది. జూన్ 3 ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఆకారంలో మార్పు.. ధరల్లో వ్యత్యాసం..సైకిల్ తయారు చేసిన తొలినాళ్లలో దాని ఆకారం ఇప్పుడున్నట్లు లేదు. ముందు చక్రం పెద్దదిగాను, వెనుక చక్రం చిన్నదిగాను ఉండేది. కాలక్రమేణా దాని రూపం మారుతూ వచ్చింది. సైకిల్ ధర అప్పట్లో రూ.వందల్లో ఉండేది. ప్రస్తుతం మోడల్ బట్టి వేలల్లో అమ్మకాలు చేస్తున్నారు. 1980లో సుమారు రూ.500 నుంచి రూ.800 మధ్యలో లభించేది. అది కాస్త 2000 సంవత్సరం వచ్చే సరికి సుమారుగా రూ.3 వేల నుంచి రూ.4500 వరకూ పెరిగింది. ప్రస్తుతం పాత తరం వినియోగించే మోడల్స్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1950 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు సైకిల్ విరివిగా వినియోగించేవారు. హెర్క్యులస్, హీరో, అట్లాస్ వంటి సైకిల్ కంపెనీలు భారత దేశంలో గుర్తింపు పొందిన కంపెనీలు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు దీని వినియోగానికి విరామం ఏర్పడింది. అనంతరం కొత్త మోడళ్ల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులు తొక్కే సైకిల్ ప్రారంభ ధర రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు సుమారు రూ.3 వేల నుంచి రూ.పది వేలకుపైబడిన ధరల్లో అమ్ముడుపోతున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, సైక్లింగ్ చేసేవాళ్లు, ఇలా వేర్వేరు కేటగిరీలు, విభిన్నమైన మోడళ్లలో సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఉపయోగాలు.. సైకిల్ తొక్కువడం వల్ల ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగానూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు అన్నిటికంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాన్సర్, మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, దీర్ఘకాలిక రోగాలకు సైక్లింగ్తో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నగరవాసులు బిజీ లైఫ్లో ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు, ఇతర రంగాల వారికి తమతమ పనుల్లో శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మోటారు సైకిళ్లు, కార్లకు బదులుగా సైకిళ్లను వినియోగిస్తే కాలుష్య నివారణతో పాటు, ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. నగరంలో సైక్లింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఓఆర్ఆర్, కేబీఆర్ పార్క్, తదితర ప్రదేశాల్లో సైకిల్ ట్రాక్స్ నిర్మించింది. దేశంలో సైకిల్ చరిత్ర ఇలా.. భారత దేశంలో 1890ల్లో యూరోపియన్ దేశస్తులు సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఉన్నత, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు స్టేటస్ సింబల్గా వినియోగించేవారు. 1920–1935 మధ్య కాలంలో ప్రపంచ సైకిల్ యాత్రలు ప్రారంభమ్యాయి. బ్రిటిష్, నవాబుల పరిపాలనలో సమాచార సరఫరా, తపాలా, పోలీసులు, సైన్యం సైతం వివిధ అవసరాలకు సైకిళ్లనే వినియోగించేవారు. తొలి నాళ్లలో కార్మికులు హెర్క్యులస్ సైకిళ్లు వినియోగిస్తే.. ఉన్నత వర్గాలు రాలీ, జేమ్స్ సైకిళ్లను వినియోగించేవారట. ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది.. సైక్లింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులంతా కలసి సైక్లింగ్ చేస్తాం. ఫలితంగా రొటీన్ లైఫ్కు భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ లభిస్తుంది. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించవచ్చు. – నేహ, మణికొండ పర్సనల్ టైం సైక్లింగ్.. తొమ్మిదేళ్ల నుంచి సైక్లింగ్ చేస్తున్నాను. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకూ సైక్లింగ్ చేస్తాం. ఇంటికి చేరుకుని కుటుంబం, పిల్లలు ఇతర పనుల్లో బిజీ అయిపోతాం. నాకంటూ దొరికే పర్సనల్ టైం సైక్లింగ్. ఔట్ సైడ్ నేచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. 70 కిలోమీటర్ల వరకూ వెళ్తుంటాను. 500 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలన్నది నా లక్ష్యం. 35 మంది మహిళలు కలిసి వెళ్తుంటాం. అంతా మంచి మిత్రులైపోయాం. – వందన లోకేష్ యుగంధర్, మణికొండ (చదవండి: womens safety: ఆపదలో అండగా...!ఈ స్మార్ట్ డివైజ్తో భద్రంగా ఉండొచ్చు..) -
ఉమెన్ సేఫ్టీ: ఆపదలో అండగా..!
బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కరణ్ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్(ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ జీయోఫెన్స్–ఎనేబుల్డ్ వేరుబుల్స్ సిస్టమ్స్) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ను ఎలార్ట్ చేస్తుంది.‘డివైజ్లోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి...జియోఫెన్స్–బేస్డ్ డిటెక్టర్. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్ సందేహాస్పద వ్యక్తి మొబైల్ ఫోన్ను గాని, బ్లూటూత్ డివైజ్ అడ్రస్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్.ఈ డివైజ్లో జియోఫెన్స్–బేస్డ్ సేఫ్టీ టైమర్ కూడా ఉంటుంది. యూజర్ ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్ ఆమె జియోలోకేషన్ని మానిటర్ చేస్తుంది. సెట్ చేసిన టైమ్ లోపు ఇంటి జియోఫెన్స్లోకి రాకపోతే డివైజ్ ఆటోమెటిక్గా ఆమె లోకేషన్ని ఎమర్జెనీ కాంటాక్ట్కి పంపిస్తుంది. డివైజ్లో ‘రిటర్న్ హోమ్ సేఫ్టీ రిమైండర్’ కూడా ఉంటుంది. డివైజ్లో మరో సేఫ్టీ ఫీచర్...డేంజర్–జోన్ నోటీఫైయర్. ఇది హై–రిస్క్ జీపీఎస్ లొకేషన్స్ ప్రీలోడెడ్ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్ బజర్ యాక్టివేట్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్కి తెలియజేస్తుంది. (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..
కొన్ని రకాల కూరగాయలు అందరు ఇష్టపడరు. దాని రుచి రీత్యా తినేందుకు మక్కువ చూపించరు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓ షోలో తనకు కూడా కొన్ని కూరగాయలు నచ్చవని చెప్పారు. పైగా ఆయన చాలా చమత్కారంగా ఆ కూరగాయలను తినదగినవి కావు..కానీ తింటేనే ఆరోగ్యం అని అన్నారు. మరీ బిగ్ బీ సైతం ఇష్టపడి ఆ కూరగాయాలు ఏవి..?. వాటివల్ల కలిగే లాభాలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనకు కూడా కొన్ని కూరగాయలంటే అస్సలు ఇష్టం ఉండదని అన్నారు. అవేంటో షేర్ చేసుకున్నారు కూడా. అయితే వాటిని అందరూ తప్పక తీసుకోవాల్సిందేనని, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు మరీ అని నవ్వేశారు. ఆ కూరగాయలే పనస, గుమ్మడి కాయ, కాకరకాయ. పనస: దీన్ని కూరగానూ, పండుగానూ కూడా తీసుకుంటారు. ఇందులో పోటాషియం సమృద్ధిగా ఉంటుందట. గుండె కండరాలతో సహా మొత్తం కండరాల పనితీరుని నిర్వహించడంలో కీలకంగా ఉంటుంది. అంతేగాదు శరీరంలోని సోడియం నియంత్రణను నిర్థారిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా అధికంగా ఉంటుందట. ఐరన్ మూలం కూడా.ముఖ్యంగా రక్తహీనతతో పోరాడటానికి, జీవక్రియను పెంచడానికి ఉపకరిస్తుందట. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సీ, రాగి వంటివి కూడా ఉంటాయట. ఇవి రక్త నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.గుమ్మడికాయగుమ్మడికాయలలో కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం, ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. ఇది బీటా-కెరోటిన్కి అద్భుతమైన మూలం. కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతిస్తుంది. పొటాషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేసి రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహారం కూడా. దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందట. కాకరకాయఇందులో విటమిన్ ఏ,సీలు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ తదితర కీలకమైన పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ, మధుమేహ నిర్వహణలో సహాయపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది., ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.అలాగే ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడేలా చేసి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ అధికంగా ఉంటుంది, సంతృప్తిని ప్రోత్సహించి, బరువుని అదుపులో ఉంచుతుంది. దాంతోపాటు కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చి..శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..?
చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం ఎందుకొస్తుంది అని ఆలోచించారా ఎప్పుడైనా..?. వాట్ ఇదేం కామెడీ ప్రశ్న అనుకోకండి. ఎందుకంటే చప్పట్లు కొడితే శబ్దం ఆటోమేటిగ్గా రాకుండా ఉండదు కదా అని చెప్పేయొద్దు. చూడటానికి గమ్మత్తుగా అనిపించే ఈ చిన్న విషయాన్ని కనుగొంటే.. శబ్దం ఎలా జనిస్తుందో అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరికినట్లువుతుంది. రెండు గట్టిపదార్థాలను ఒకదానికొకటి తాకిస్తే శబ్దం వస్తుది. అదే ప్లాస్టిక్, చెక్క వంటి వాటి నుంచి రాదుగా. మరీ రక్తం, కండరాలతో నిర్మితమైన చేతుల నుంచి ఎలా వచ్చేస్తోందన్న సందేహం కొందరి శాస్త్రవేత్తల బుర్రలను తొలిచింది. దాని పర్యవసానంగా..అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చిందిఇన్నాళ్లుగా మనమంతా అనుకున్నట్లుగా..రెండు చేతుల దగ్గరకు చరచడం వల్ల కానేకాదట. ఒక చిన్న స్థలంలో గాలి కుదించబడి బయటకు నెట్టడం వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కుదించబడిన గాలి హెల్మ్హోల్ట్జ్ రెసొనేటర్ లాగా ప్రవర్తిస్తుందట. అందుకు ఉదాహరణే బాటిల్ గుండా గాలిని ఊదితే వచ్చే శబ్దమేనని వివరించారు. అరచేతులు ఒక కుహరాన్ని సృష్టిస్తాయి. అంటే ఒక చిన్న స్వరంగం మాదిరి అన్నమాట. ఇక్కడ బొటన వేలు, చూపుడు వేలు కారణంగా కుదించబడిన కుహరంలా(చిన్న బాటిల్ మూతిలా) ఏర్పడుతుందట. సరిగ్గా గాలి ఆ కుహరం నుంచే బయటకు నెట్టబడటంతో ధ్వని తరంగాలను సృష్టిస్తుందట. దాంతో టప టప అని సౌండ్ ఉత్ఫన్నమవుతుందని చెప్పుకొచ్చారు. చప్పట్ల వేగాన్ని అనుసరించే వచ్చే శబ్దాలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైందని అన్నారు. అలాగే ప్రతి వ్యక్తి చప్పట్లు కుహరం ఆకారం, చర్మ స్థితిస్థాకత వంటి వాటిని బట్టి వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని.. ఏ ఒక్కరిది ఒకేలా ఉండదని తేల్చి చెప్పారు. ఇది మనకు మనషుల గుర్తింపులో ఉపయోగపడే మరో కొత్త అంశమని చెప్పుకొచ్చారు కార్నెల్ అండ్ మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ అధ్యయనం ఫిజికల్ రివ్యూ జర్నల్లో ప్రచురితమైంది. (చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
ఘనంగా 'తెలంగాణ కథలు'ను ప్రారంభించిన ఓనమాలు..!
ప్రాంతీయ పాక వారసత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా జరుపుకోవాలనే ఆశయంతో తెలంగాణ కథలు’ను ఘనంగా ప్రారంభించింది ’ఓనమాలు‘. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)కి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం, తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు, కథలను పండుగలా నిర్వహించింది. చిత్రనిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు , ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి, వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారుచేసిన సర్వపిండి, బక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు స్థానికంగా లభించే పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి గోండులు, మహువా సమాజానికిచెందిన గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఈ వేడుకకు ఉత్సాహభరితమైన ప్రాంతీయ సౌరభాలను సమరకూర్చాయి. “తెలుగును ఒకమాటలో వర్ణించలేం. ఒకే ఒక్క సాధారణ స్వరంలో చెప్పలేం. ఇది వెయ్యి సూక్ష్మ కథలతో, అనేక ఉప-ప్రాంతీయ వైవిధ్యాలతో జమిలిగా అల్లిన కథ. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వినడానికి, కనుమరుగవుతున్న వాటిని సంరక్షించడానికి మేము ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, హైదరాబాద్ కోసం సూక్ష్మ-ప్రాంతీయ సంఘాలను నిర్మిస్తున్నాము, ”అని ది క్యులినరీ లాంజ్ CEO , ఓనమాలు ఉద్యమంలో కీలక సూత్రధారి గోపి బైలుప్పల అన్నారు. “ఈసారి, ప్రయాణం ఎప్పుడూ లేనంతగా ఇంటికి దగ్గరగా ఉంది.” అని పేర్కొన్నారు.ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్క్లాస్లు, సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి, ఔత్సాహికులకు స్థానిక ఆహారం, సాహిత్యం, సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తాయన్నారు. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో అన్విక్షికి పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు వెంకట్ సిద్ధా రెడ్డి కూడా పాల్గొన్నారు.ఆయన పాక పునరుజ్జీవనం, సాహిత్య పునరుజ్జీవనం మధ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు “అన్విక్షికి తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించే దృక్పథంతో స్థాపించారు. స్థానిక వ్యాపారాలలో చిన్న స్వయం-సేవ పుస్తక దుకాణాలు, చలనచిత్ర నిర్మాణ కార్యాలయాలలో లైబ్రరీల ద్వారా తాము తమ పరిధిని విస్తరిస్తున్నామని వెంకట్ తెలిపారు. ఈ చొరవ పాఠకుల సంఖ్యను, ఆదాయాన్ని అందిస్తూనే ఆయా ప్రదేశాలకు సాంస్కృతిక విలువను జోడిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం ’బలగం‘తో అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి, మరో అవార్డు గ్రహీత, తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ది క్యులినరీ లాంజ్లో అన్విక్షికి ప్రత్యేక పుస్తకాల షెల్ఫ్ను ప్రారంభించారు.ప్రముఖ విద్యావేత్త, నటీ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ అమర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ వంటలను ఆస్వాదించి, నిర్వహకులను అభినందించారు.బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సర్వపిండి, బక్షాలను గురించి ఈతరం పిల్లలకు తెలియదనీ, భవిష్యత్ తరానికి తెలంగాణ పురాతన వంటకాల గురించి తెలియజేయడానికి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం గొప్పదనీ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఓనమాలు గురించితెలుగు మాట్లాడే రాష్ట్రాలలోని వైవిధ్యమైన పాక వారసత్వాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, వాటిని ముందుతరాలకు అందించే లక్ష్యంతో 2024లో లాంచ్ అయింది ’ఓనమాలు‘ అనే కమ్యూనిటీ ఇనీషియేటివ్. సూక్ష్మ వంటకాలను అన్వేషించడం, పురాతన వంటకాలను పునరుద్ధరించడం, పరిశోధన, వాటి గురించి సవివరంగా చెప్పడం, ఆచరణాత్మక అనుభవాల ద్వారా కమ్యూనిటీలను నిమగ్నం చేయడమే ఓనమాలు లక్ష్యం. డాక్టర్ ఎ.వి. గురవా రెడ్డి KIMS-SUNSHINE హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ITEC), పరిశ్రమలు అండ్ వాణిజ్య విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో సీనియర్ IAS అధికారి జయేష్ రంజన్ ’ఓనమాలు‘ను ప్రారంభించారు. గత సంవత్సరంలో ఓనమాలు 27,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, పెద్దలు, రైతులు, గృహ వంటవారు. ఇతర నిపుణులను కలిసి, కనుమరుగవుతున్న రుచులను, మరచిపోయిన పాక పద్ధతులను తిరిగి గుర్తించారు. ఈ వేదిక ఫ్లూట్ రిసిటల్స్, పాక థియేటర్ ప్రదర్శనలు, సాంప్రదాయ రుచికరమైన వంటకాలను అందించే లైవ్ ఫుడ్ స్టేషన్ల నిర్వహణతో రుచి, సంప్రదాయం ద్వారా తరాల అంతరాలను తగ్గిస్తోంది. తెలుగు పాక పరి జ్ఞానాన్ని సంరక్షించి, గర్వంగా అందించేలా వంట మ్యూజియంను స్థాపించడం, ట్రైనింగ్ వర్క్షాప్లను నిర్వహించడంతోపాటు, గృహిణులు, చెఫ్లు, ఆహార చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులతో సహకారాన్ని పెంపొందించడం అనేవి ఓనమాలు భవిష్యత్ ప్రణాళికలు.(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..!
బాలీవుడ్లో ప్రఖ్యాత నటి, నాట్యకళాకారిణిగా ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్న హీరోయిన హెలెన్. 80లలో ప్రసిద్ధ ఐకానిక్ పాటల్లో నర్తించి ప్రేకక్షకులను మంత్రముగ్దులను చేసేది. ఇప్పటికి ఆ పాటలు చెవిన పడగానే..నాటి కుర్రకారుని ఉర్రూతలూగించిన అందాల నటి హెలెన్ కళ్లముందు కదలాడుతుంది. అంతలా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందామే. ఇప్పుడామె ఎనిమిది పదుల వయసుకి చేరుకుని బామ్మలా ఉన్నా కూడా..అంతే జోష్ హుషారుతో ఉంటారామె. అచ్చం 85 ఏళ్ల అమ్మాయి అనేలా ఉంటుంది ఆమె ఉత్సాహం చూస్తే. కాలక్రమేణ వచ్చే వృద్ధాప్యానికి చెక్పెట్టి..యవ్వనంగా బతకడం ఎలా అనేందుకు ఆమెనే ఓ ఉదాహరణ. మరి అంతలా ఆమె ఎవర్గ్రీన్ ఎనర్జీ వెనకున్న ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా నటి హెలెన్కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా హెలెన్ మరింత ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఏజ్లో కూడా ఇంత ఎనర్జీనా అని నెటిజన్లు విస్తుపోతున్నారు. 85 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా చెంగుచెంగుమని తిరుగుతున్న ఆమె యాక్టివిటీని చూసి.. వృద్ధాప్యం చిన్నబుచ్చికుని దూరంగా వెళ్లిపోయాందా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ..నటి హెలెన్ తనను తాను పరిచయం చేసుకుంటూ..బలంగా, చరుగ్గా ఉండాలంటే పైలేట్స్ వ్యాయామాలు మన దినచర్యలో భాగం కావాలని చెబుతున్నట్లు కనిపిస్తుంది. తాను 85 ఏళ్ల అమ్మాయినే బామ్మను మాత్రం కాను అని నవ్వుతూ చెబుతున్నారామె. ఇప్పుడు కూడా మీరు ఈ కఠినతరమైన పైలేట్స్ వ్యాయామాలు చేస్తారా అని ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ ప్రశ్నించగా..ఓ చేద్దాం అని నటి హెలెన్ అన్నారు. వెంటనే పైలేట్స్ బాల్ మీద పడుకుని..శ్వాసను సమన్వయం చేస్తూ వ్యాయామాలు ఈజీగా చేశారామె. అలాగే ఎవరి సాయం లేకుండా ఈజీగా లేవడం, నిలబడటం వంటివి చేయగలరు. ఆఖరికి స్టెప్స్పై కూడా చకచక నడిచేస్తారామె. అంతేగాదు హాయిగా జంపింగ్, రన్నింగ్ కూడా చేస్తారామె. తన ఈ ఉత్సాహానికి కారణం పైలేట్స్ తన దినచర్యలో భాగమవ్వడమేనని అన్నారు. అంతేగాదు ఆ వీడియో చివరలో ఓ మై డార్లింగ్ అనే పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఆమె వృద్ధాప్యాన్ని ఆరోగ్యకరంగా నిర్వచించడానికి స్ఫూర్తిగా నిలిచారు . View this post on Instagram A post shared by We The Women Asia (@wethewomenasia) వృద్ధులు తప్పకుండా చేయాల్సిన పైలేట్స్ వ్యాయామాలు..సింగిల్ లెగ్ పుల్ అండ్ డబుల్ లెగ్ పుల్ - ఈ వ్యాయామాలు కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. శరీరం సమతుల్యత, స్థిరత్వానికి చాలా అవసరం.సైడ్-లైయింగ్ సిరీస్ - ఇది మన కదలికలను మెరుగుపరుస్తుందిమోడిఫైడ్ ప్లాంక్ - కీళ్లపై ఒత్తిడి పెట్టకుండా బలాన్ని పెంచుతుంది.వాల్ పైలేట్స్ - ఈ వ్యాయామాలను గోడ సాయంతో చేయవచ్చు.తొడ మడతలు - ఈ వ్యాయామాన్ని కుర్చీ సహాయంతో చేయవచ్చు . పైగా వృద్ధులు ఈజీగా నడిచేందుకు హెల్ప్ అయ్యే మంచి వ్యాయామం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఇలాంటి వ్యాయామాలు చేసే ముందు ఫిట్నెస్ నిపుణుల సలహాలు, సూచనలతో చేయడం ఉత్తమం.(చదవండి: వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! క్యూకడుతున్న ప్రసిద్ధ బ్రాండ్లు) -
ఈ రోజు క్రియేటివ్ థియేటర్ ప్రదర్శన ..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్రియేటివ్ థియేటర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో సోమవారం సాయంత్రం 6:45 గంటలకు ‘గొల్ల రామవ్వ’ నాటికను ప్రదర్శించనున్నారు. ఈ నాటికకు మూలకథ స్వర్గీయ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన ప్రసిద్ధ కథ ‘గొల్ల రామవ్వ’. గ్రామీణ నేపథ్య జీవితాల విశిష్టతను ప్రతిబింబించేఈ కథను నాటికగా మలచి ప్రదర్శిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరుగనుంది. క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు అజయ్ మంకెనపల్లి ఆధ్వర్యంలో దీనిని ప్రదర్శించనున్నారు. నాటకరంగ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ విలక్షణ నాటికను ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ నాటికలో తమ సంస్థ నుంచి పలువురు యువ థియేటర్ ఆరి్టస్టులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: క్రేజ్ ఫుల్.. బోబా బబుల్ టీ..! స్పెషాల్టీ ఇదే..) -
క్రేజ్ ఫుల్.. బోబా బబుల్ టీ..! స్పెషాల్టీ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్న తాజా డ్రింక్ సంచలనం.. బోబా టీ, లేదా బబుల్ టీ. తైవాన్లో పుట్టిన ఈ పానీయం ఇప్పుడు భాగ్యనగరంలోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇటీవల బోబా టీ షాప్స్ ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్ వంటి నగరంలోనూ పెరుగుతున్నాయి. కాలేజీ యువత, వర్కింగ్ ప్రొఫెషనల్స్ దీనిని చల్లదనాన్నిచ్చే ఆహ్లాదకరమైన డ్రింక్గా ఎంజాయ్ చేస్తున్నారు. బోబా టీ అనేది టీ ఆధారిత పానీయం. అదే దీనికి ప్రత్యేకతను చేకూర్చే అంశం. టాపియోకా పెరల్స్ లేదా బోబా బాల్స్. ఇవి చిన్న గోళాకార బంతుల్లా ఉంటాయి. తీపిగా, కొద్దిగా చిక్కదనం ఉండే ఈ బంతులు టీతో కలిసినపుడు ఒక వినూత్న రుచిని జత చేస్తాయి. బోబా టీ కూడా బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా మిల్క్ టీ తరహాలోనూ వినియోగించవచ్చు. లేదా దీనికి పండ్ల ఫ్లేవర్స్, సిరప్లు, పాలు లేదా క్రీమ్లను కూడా కలుపుతారు. బోబా టీలో భాగంగా టాపియోకా బాల్స్ కాకుండా జెల్లీ, ఫ్రూట్ బిట్స్ వంటి వేరే రకాల టాపింగ్స్ కూడా వినియోగిస్తారు. ఎన్నెన్నో.. వెరై‘టీ’లు బోబా టీ వివిధ రుచుల్లో మ్యాంగో, స్ట్రాబెర్రీ, చెరకు, కొబ్బరి వంటి అనేక ఫ్లేవర్లలో లభ్యమవుతోంది. ప్రత్యేకమైన టేక్–అవే గ్లాస్లు, స్టైలిష్ స్ట్రా, బాల్స్ వల్ల యువత ఈ పానీయం పట్ల అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆకట్టుకునే కలర్ కాంబినేషన్లు, ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ వల్ల బోబా టీ ఇన్స్టా, ఇతర సామాజిక మాధ్యమాల్లో రీల్స్ల ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. పోషక విలువలు.. కాసావా స్టార్చ్ లేదా సముద్రపు పాచి సారం నుండి తయారు చేసిన ఈ ముత్యాలు సహజంగా గ్లూటెన్ రహితమైనవి. పైగా పూర్తి శాకాహారం. కాసావా అనేది విటమిన్ ‘సి’ మంచి మూలం. ఇది వాపును తగ్గించే, కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే యాంటీఆక్సిడెంట్. దీంతోపాటు ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం సంగతేం ‘టీ’.. బోబా టీ కాస్త అధికంగా తీపి పదార్థాలతో కూడినందున దీనిని అప్రమత్తంగా వినియోగించాలి. ఎందుకంటే దీనిలో అధిక క్యాలరీలు ఉంటాయి. అయితే కొంతమంది టాపియోకా బాల్స్ను, చక్కెరను తగ్గించి ఆరోగ్యకరమైన రీతిలో కూడా తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, నగరంలోనూ ఉన్న ప్రముఖ కేఫ్ చైన్ యమ్మీ బీ, బోబా టీకి కొత్త వెర్షన్ను తాజాగా మార్కెట్లోకి తెచ్చింది. ఆరోగ్యాభిలాషులను దృష్టిలో పెట్టుకుని షుగర్–ఫ్రీ బోబా టీని ఆన్లైన్ ద్వారా అందిస్తోంది. మ్యాంగో బోబా టీ, థాయ్ బోబా టీ, మాచా బోబా టీ.. వంటి పేర్లతో ఈ బోబా/బబుల్ టీ నగర ఆహార ప్రియుల అభి‘రుచుల్లో’ ఒకటిగా మారింది. (చదవండి: ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేయండిలా..) -
ఛత్రపతి విజయ విహారం..! ఆరో రోజుల టూర్..
ఈ టూర్లో గిరిదుర్గాలే ప్రధానం. ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీకలు. తిరుమల కొండలంత ఎత్తులో ఉన్నాయి. ఇక... ఓ వనాలయం... మరో నగరాలయం. అవి... దట్టమైన వనాల్లో విస్తరించిన జ్యోతిర్లింగం.మరోటి... ప్రాచీన నగరంలో విలసిల్లిన లక్ష్మీదేవి ఆలయం.1వ రోజుఉదయం ఆరున్నరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, థానేలలో ఎక్కడైనా రైలెక్కవచ్చు. రైలు రాయగఢ్ వైపు సాగుతుంది. రైల్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. పదిన్నరకు రైలు మాన్గోవ్ స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రాయగఢ్ కోటకు చేరాలి. మధ్యాహ్న భోజనం ఎక్కడ అనేది సమయాన్ని బట్టి నిర్ధారిస్తారు. రాయగఢ్ పర్యటన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మాన్గోవ్ స్టేషన్కు వచ్చి రైలెక్కాలి. రైలు ఆరు గంటలకు పూనే వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే. పది గంటలకు రైలు పూనేకు చేరుతుంది. హోటల్కు చేరడం, పూనేలో రాత్రి బస.పట్టాభిషేక దుర్గంరాయిగఢ్ కోట ఉన్న పట్టణం పేరు మహద్. మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలో ఉంది. ఇది మహాదుర్గం. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఈ కొండమీదకు చేరడానికి రోప్వే, ఏరియల్ ట్రామ్వే ఉన్నాయి. కోట లోపల శివాజీ సింహాసనం, పట్టాభిషేకం జరిగిన ప్రదేశం, చెక్కతో నిర్మించిన రాణి ప్యాలెస్, శివాజీ తల్లి జిజాబాయి సమాధి, శివాజీ సమాధి ఉన్నాయి. కోటగోడలు, దర్వాజాల మీదకు అల్లుకున్న పిచ్చి చెట్లుతీగలనుచూస్తే ఈ కోట పరిరక్షణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి బాధ్యత అప్పగించడంతో పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. ఈ కోట మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి సౌందర్యం అంతా దండగా అల్లి అమర్చినట్లుంటుంది. ఇది ఒక ఫీల్గుడ్ టూరిస్ట్ డెస్టినేషన్.2వ రోజుహోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత పూనాలోని లాల్ మహల్, కాస్బా గణపతి ఆలయాల సందర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత శివ్శ్రుతి వీక్షణం. రాత్రి భోజనం తర్వాత హోటల్ గదికి చేరడం. ఆ రాత్రి బస కూడా పూనేలోనే.లాల్ మహల్ అంటే శివాజీ బాల్యం గడిచిన ΄్యాలెస్. శివాజీ తండ్రి షాహాజీ భోసాలే తన కొడుకు, భార్య కోసం కట్టించిన ప్యాలెస్ ఇది. నిజానికి షాహాజీ కట్టించిన నిర్మాణం నిర్వహణ సరిలేక శిథిలమైంది. ఇప్పుడు కనిపిస్తున్న ప్యాలెస్ అదే నమూనాలో చేసిన పునర్నిర్మాణం. ఇక నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం కాస్బా గణపతి. ఇది శివాజీ తల్లి రాజమాత జిజాబాయి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం. పూనే వాసులు గ్రామదేవతగా కొలుస్తారు. ఈఈ గణపతికి ఉన్న చారిత్రక ప్రత్యేకత ఏమిటంటే జాతీయోద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్ సామూహిక గణపతి ఉత్సవాలు మొదలు పెట్టింది ఈ ఆలయంలోనే. ప్రజలను ఒక చోటకు చేర్చడానికి, వారిని జాతీయోద్యమ బాట పట్టించడానికి ఈ ధార్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు తిలక్. 3వ రోజుశివనేరి కోట సందర్శనకు ఉదయాన్నే ఆరు గంటలకు టీ తాగిన తర్వాత హోటల్ నుంచి బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ ΄్యాక్ చేసి ఇస్తారు. పూనే నుంచి శివనేరి కోటకు రెండు గంటల ప్రయాణం. మధ్యాహ్న భోజనం తర్వాత భీమశంకర్ దర్శనానికి వెళ్లాలి. ఈ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత పూనేకి వచ్చి రాత్రికి హోటల్లో బస చేయాలి.మరాఠా రాజ్యం పుట్టింది!శివ్నేరి కోట ఛత్రపతి శివాజీ పుట్టిన ప్రదేశం. మరాఠా రాజ్య నిర్మాత పుట్టిన నేల అంటే మరాఠా రాజ్యం పుట్టిన నేల కూడా. శివాజీ తాత మాలోజీ భోసాలే నివసించిన కోట ఇది. బహమనీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాలకు కేంద్ర బిందువు కూడా. ఈ కోట లోపల గంగ, యమున పేరుతో రెండు నీటి గుండాలున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరు ఉంటుంది. ఈ కోట పై అంతస్థు నుంచి చూస్తే నారాయణగఢ్, హద్సార్, చావాంద్, నీమ్గిరి కోటలు కనిపిస్తాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉండడంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ కోటను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. శివ్నేరి కోట నుంచి 70 కిమీల దూరంలో ఉంది భీమశంకర్. చిక్కటి పచ్చదనంతో విస్తరించిన సహ్యాద్రి శ్రేణుల్లో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం. మహారాష్ట్రలో భీమనది తీరాన ఉంది. 4వ రోజుఉదయం పూనేలో హోటల్ గది చెక్ అవుట్ చేసి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బయలు దేరుతుంది. బ్రేక్ఫాస్ట్ రైల్లో ఇస్తారు. రైలు పది గంటలకు సతారా స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ప్రతాప్గఢ్ కోటకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం, కోట సందర్శనం, రాత్రి భోజనం తర్వాత పదిన్నరకు రైలెక్కాలి. పదకొండున్నరకు రైలు కొల్హాపూర్ వైపు బయలుదేరుతుంది.మరాఠ విజయంమరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలకమైన కోట ప్రజాప్గఢ్. మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీకి బహమనీ సుల్తాన్ అజమ్ఖాన్కు మధ్య జరిగిన భీకర యుద్ధంలో శివాజీ గెలిచాడు. శివాజీ కొలిచిన తుల్జా భవానీ మాత ఆలయం ఈ కోటలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట అందమైన ప్రకృతి సౌందర్యవీక్షణానికి వేదిక కూడా. 5వ రోజుతెల్లవారు జామున ఐదు గంలకు రైలు కొల్హాపూర్లోని షాహూ మహారాజ్ టెర్మినస్కు చేరుతుంది. రైలు దిగి హోటల్కు వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత పన్హాల ఫోర్ట్ సందర్శనం. ఆ తర్వాత కొల్హాపూర్లోని రైల్వేస్టేషన్కు వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ముంబయి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.కొల్హాపూర్ మహారాష్ట్ర కాశీభారతీయులు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలని కోరుకునే ప్రదేశం కొల్హాపూర్. ఇక్కడి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి ఉత్తర– దక్షిణ భారతాల వాళ్లు వస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి. దక్షిణాది ఆలయాల్లాగ విగ్రహాల సుమహారంగా ఉండదు. ఉత్తరాది నిర్మాణాల్లాగానూ ఉండదు. స్థూలంగా నిర్మాణం రెండింటి కలయికగా ఉంటుంది. సునిశితంగా శిల్పనైపుణ్యాన్ని గమనిస్తే జామెట్రికల్ డిజైన్స్తో ఆచ్చెరువు కలిగిస్తుంది. దక్షిణ కాశిగా చెప్పుకుంటారు. పెద్ద పట్టణం, మరాఠీ సినిమా పరిశ్రమ కేంద్రం. ఈ పర్యటనలో కొల్హాపూర్ లక్ష్మీదేవి దర్శనం తర్వాత న్యూ ప్యాలెస్ వీక్షణం. ఆ తర్వాత కొల్హాపురి చెప్పులు ఒక జత కొనుక్కోవడం మర్చి΄ోవద్దు. ఎందుకంటే పనితనం రీత్యా వీటికి జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ కూడా వచ్చింది.పన్హల ఫోర్ట్శివాజీ ఈ కోటను బీజాపూర్ సుల్తానులతో యుద్ధం చేసి సాధించాడు. ఆ తర్వాత మరికొన్ని నిర్మాణాలు చేశాడు. శివాజీ వారసులు ఈ కోట నుంచి మొఘల్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధాలు చేశారు. ఈ కోట నిర్మాణపరంగా పెద్దది కాదు, కానీ మరాఠాల పాలన ముందుచూపుకు నిదర్శనం. కోట లోపల ధాన్యాగారం ఉంది. అందులో నిల్వ చేసిన ధాన్యం కోట లోపల ఉన్న వారికి మాత్రమే కాదు, రాజ్యంలో కరువు సంభవిస్తే ప్రజల ఆకలి తీర్చడానికి ఒక ఏడాదికి సరిపడినంత ధాన్యాన్ని నిల్వ చేసేవారు. కోట లోపల ఒక దిగుడు బావి ఉంది. స్టెప్వెల్లు గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలోనూ ఉన్నాయి. హైదరాబాద్లోనూ ఉంది. తెలంగాణ జిల్లాల్లో కూడా ఉండేవి. ఆర్కియలాజికల్ సర్వే విభాగం తవ్వకాల్లో ఇటీవల కొన్ని స్టెప్వెల్లు బయటపడ్డాయి. భారతీయ శాస్త్రీయత నిర్మాణాలకు ఇవి తార్కాణాలు. 6వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది. దాదర్, థానేల్లో కూడా దిగవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్క్యూట్ ప్రతాప్గఢ్... ఇది ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న ఆరు రోజుల టూర్ ప్యాకేజ్. జూన్ 9వ తేదీన మొదలవుతుంది. ముంబయిలో మొదలయ్యే ఈ టూర్లో రాయగఢ్ ఫోర్ట్, పూనే, శివనేరీ ఫోర్ట్, భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం, ప్రతాప్గఢ్ ఫోర్ట్, కొల్హాపూర్, పన్హలా ఫోర్ట్ కవర్ అవుతాయి.కొంకణ్ రైల్వేస్ ట్రైన్ ముంబయిలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి టూర్ మొదలవుతుంది. మాన్గోవ్, పూనే, సతారా, ఛత్రపతి షాహూ మహారాజ్ టెర్మినస్ కొల్హాపూర్ మీదుగా తిరిగి ముంబయికి చేరుతుంది.టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ (ఎకానమీ)లో ఒకరికి 13,155 రూపాయలు, ధర్డ్ ఏసీ (కంఫర్ట్)లో దాదాపుగా 20వేలు, సెకండ్ ఏసీ (సుపీరియర్)లో 27 వేలకు పైగా అవుతుంది. రాత్రి బసకు ఎకానమీ క్లాస్కు నాన్ ఏసీ గదులు డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్లో ఇస్తారు. రైలు దిగిన తరవాత రోడ్డు ప్రయాణానికి నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం. కంఫర్ట్, సుపీరియర్ ΄్యాకేజ్లో బస ఏసీ గదుల్లో. ఒక్కరుగా బుక్ చేసుకున్న వారు ఇతర ప్రయాణికులతో రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఏసీ వాహనాలు. ప్యాకేజ్లో చెప్పిన టికెట్ ధరలకు ట్యాక్స్ అదనం. ప్యాకేజ్లో ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, సెక్యూరిటీ ఉంటుంది. భోజనం శాకాహారం ఇస్తారు. పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఖర్చులు ప్యాకేజ్లో వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!) -
కీలు మారాక 'ఫీల్ ఎలా ఉంది'?
చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం ఈ కథనం.మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్ నీ– రీప్లేస్మెంట్ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ – రీప్లేస్మెంట్ సర్జరీ). వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. పోలికలు వద్దు... పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్నెస్ : శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.మెరుగుదల ఆధారపడే అంశాలివే... శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్’ అంటారు. ఈ ప్రోస్థెటిక్ డిజైన్ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్ రేంజ్లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి... శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా కేవలం మీ డాక్టర్తో మాట్లాడటమే మంచిది. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది.మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...చేయాల్సినవి... బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్స్ట్రింగ్ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్), సైక్లింగ్, నడక (వాకింగ్) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.చేయకూడనివి... పరుగు (రన్నింగ్), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. కృత్రిమ కీలు ప్రోస్థెసిస్)లోని పాలీ ఇథిలీన్ / ప్లాస్టిక్ స్పేసర్ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్ లేదా వాకింగ్ స్టిక్ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఇంటర్ తర్వాత వాట్ నెక్స్ట్..? టెన్షన్ వద్దు..
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ + స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..! మరింత అందంగా ఇల్లు..) -
జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..!
వ్యర్థాలతో కళాత్మక వస్తువుల తయారీ గురించి మనకు తెలిసిందే! కేరళ వాసి అంజలి పవన్ అప్సైకిల్డ్ వ్యర్థాలతో తన ఇంటి ఆవరణలో ఓ తోటను ఏర్పాటు చేసింది. దానికి తన తల్లితో కలిసి వాడేసిన డబ్బాలు, సీసాలు, టైర్లు, పాత బట్టలు వంటి వ్యర్థాలను ఉపయోగించి, అప్సైక్లింగ్ చేయడం ద్వారా వాటి రూపు రేఖలనే మార్చేసింది.తల్లీ కూతుళ్ల వినూత్న ప్రయోగం‘‘మా అమ్మ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ జపనీస్ కళ కోకెడామా చూశాను. కోకెడామా అనేది జపనీస్ తోటపని పద్ధతి. ఇక్కడ మొక్కల వేళ్లను నాచుపట్టిన బంతిలో చుట్టి, వేలాడే తోటలను సృష్టిస్తారు. నేను కోకెడామాను చాలా ఇష్టపడ్డాను. సొంతంగా అలాంటి తోటను నేను సృష్టించుకోవాలనుకున్నాను. ఆన్లైన్లోను, యూట్యూబ్లోను శోధించిన తర్వాత, ఈ గార్డెన్ క్రియేషన్ను అమల్లో పెట్టాను. ఒకదాని నుంచి మరిన్ని మొక్కలను నాటడం ప్రారంభించాను. దీంతో మా తోట వికసించడం మొదలైంది. దానిని మరింత పెంచడానికి మరిన్ని కొత్త పద్ధతులను కనిపెట్టాం. పడేసే వస్తువులతో పర్యావరణ అనుకూలమైన ప్లాంటర్లుగా మార్చాను. దీనికి మా అమ్మ కూడా సాయం చేసింది. పెయింట్ డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పొట్టు, ప్లాస్టిక్ సీసాలు, పాత కుట్టు మిషన్లు, డ్రమ్స్ వంటి వాటిని ఉపయోగించాం. ఇప్పుడు మా తోట మొత్తం వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. కానీ, అవి అత్యంత అందంగా మారిపోయాయి’’ అని చెబుతుంది అంజలి. మాక్రేమ్ ఆర్ట్ ఉపయోగించి వీరు ప్లాంట్ హ్యాంగర్లను కూడా తయారు చేశారు. అంజలి తల్లి పాత దుస్తులను ఉపయోగించి, మొక్కల కుండీలను తయారు చేస్తుంది. వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా, ఈ తల్లీ కూతుళ్లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మార్కెట్ నుంచి ప్లాంటర్లను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసే డబ్బును కూడా ఆదా చేసే మార్గాన్ని కనిపెట్టారు. ఇప్పుడు వీరి ఇంటి ఆవరణ పచ్చదనంతో అత్యంత ఆహ్లాదంగా మారిపోయింది. ఎన్.ఆర్ (చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..) -
నటి మడోన్నా సెబాస్టియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్. ఇందుకోసం ఆమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్సే ఇవి.చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్ వచ్చింది. మోడర్న్ వన్ పీస్ డ్రెస్స్ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్మెంట్ లుక్గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. చీర, లెహంగా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టయిల్, సింపుల్ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్లాగా.అందం అందులో ఉండదు..అందం అంతా క్రీమ్స్, మేకప్స్లో ఉండదు. మంచి స్కిన్ కేర్లోనే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మసాజ్, నేచురల్ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేరే నా బ్యూటీ సీక్రెట్. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్. -దీపిక కొండి(చదవండి: ఘనంగా ముగిసిన మిస్ వరల్డ్ అందాల పోటీలు) -
కొత్త అల్లుడికి కొసరి..కొసరి..
తెలుగు నాట సంక్రాంతి అల్లుళ్లకు ఎలాంటి ఆదరాభిమానాలు అందుతాయో పశ్చిమబెంగాల్కు చెందిన బెంగాలీలకు కూడా అల్లుళ్లను గౌరవించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి యేటా తిథి, నక్షత్రం ప్రకారం అల్లుళ్లను గౌరవంగా ఇంటికి ఆనించి సత్కరిస్తారు. జమై షష్టి అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించే బెంగాలీలు అమ్మవారికి అందించే సకల గౌరవ మర్యాదలు, సత్కారాలను అల్లుళ్లకు సమర్పిస్తారు. కొత్త బట్టలు పెట్టి ఇష్టమైన వంటకాలను వడ్డిస్తారు. జేష్ట మాసంలో జరిగే ఈ పండుగను జూన్ ఒకటో తేదీన జమై షష్టి మహోత్సవం పేరుతో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే బెంగాలీలు పూర్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా స్థిరపడిన బెంగాలీలు ఏడానికోసారి కన్నులు పండుగగా దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అల్లుడు అత్తారింటికి వచ్చిన రోజు జరిగే హంగు ఆర్భాటాలు, అందుకు అయ్యే ఖర్చులను అత్తగారి భరిస్తారు. ఇక మరుసటి రోజు అల్లుడి వంతు ఉంటుంది.అల్లుళ్ళకు రాజభోగం.. అమ్మవారి కరుణ కటాక్షం మా కుటుంబంతో పాటు అల్లుళ్లపై ఉండాలని కోరుతూ జమై షష్టి నిర్వహిస్తాం. ఒకరికొకరు కొత్త బట్టలతో, బహుమతులతో గౌరవించుకుంటాం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. – మౌసమీ– బెంగాలీ మహిళఖర్చంతా అల్లుడిదే.. అత్తారింటికి చేరిన అల్లుడు మరుసటి రోజు జరిగే ఉత్సవానికి ఆయనే ప్రధాన బాధ్యుడిగా ఉంటారు. అంటే ఆ రోజు జరిగే ఖర్చంతా అల్లుడు భరించాల్సి ఉంటుంది. ఇంట్లోని వారందరికీ బహుమతులతో పాటు అత్తగారికి చీరను బహూకరిస్తారు. ఇతర కుటుంబ సభ్యులకు మర్యాదపూర్వకంగా గిఫ్ట్లు అందజేస్తారు. ఈ ఖర్చంతా అల్లుడు చూసుకుంటాడు. జమై షష్టి.. బెంగాలీల ఆచారం.. జమై షష్టి..అనేది బెంగాలీ ప్రజల సంప్రదాయ, సాంస్కృతిక ఆచారం. ఈ ఆచారాన్ని జైష్ట మాసం శుక్ల పక్ష ఆరవ తిథి నాడు నిర్వహిస్తారు. జమై అంటే అల్లుడు. షష్టి అంటే చంద్ర పక్షంలోని ఆరో రోజు. జమైషష్టి అనేది అల్లుళ్లను గౌరవించడానికి అంకితం చేసే పండుగ. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అత్తగారు వారి శ్రేయస్సు కోసం దుర్గా దేవిని పూజిస్తారు. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..) -
మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..
సోషల్మీడియాలో యుగంలో ప్రతి ఒక్కటీ వింతే.. అన్నట్లు ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏఐ ఏఐ హవా నడుస్తోంది. రెండు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో హోరెత్తిన సోషల్మీడియా.. తాజాగా బేబీ పాడ్కాస్ట్, బేబీ ఏఐ వీడియోలతో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు బేబీ రూపంలో చేసిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరూ దీనిని ట్రెండ్గా ఫాలో అవుతున్నారు. సోషల్మీడియాలోని ఇన్స్టా, ఫేస్బుక్లతో పాటు అన్ని యాప్లలో బేబీ పాడ్కాస్ట్ విడియోలే దర్శనమిస్తున్నాయి. సినిమాల్లోని వైరల్ సీన్లను బేబీ పాడ్ కాస్ట్ రూపంలోకి తీసుకొచ్చి సందడి చేస్తున్నారు. చాట్జీపీటీ ఏఐతో ఈ బేబీ పాడ్కాస్ట్ వీడియోలు చేస్తున్నారు. సినిమా, పొలిటికల్, నెటిజన్లు చేసిన వీడియోలు దీనికి కేంద్రబిందువుగా మారుతున్నాయి. గిబ్లీ ఆర్ట్ చేసిన రచ్చను మించి బేబీ పాడ్కాస్ట్ చేస్తుందని నెటిజన్ల అభిప్రాయం. (చదవండి: ఆసియాలో అతిపెద్ద భూగర్భ లైబ్రరీ..! పైన దేవాలయం..కింద గ్రంథాలయం) -
మొఘులుల కాలం నాటి ఖుర్బానీ కా కహానీ..!
విందు భోజనం తినే ముందు ఆకలిగా అనిపించడం సహజమే. కానీ సిటీలోని వేడుకల్లో పాల్గొనేవారికి విందు దాదాపు ముగింపునకు వచ్చేటప్పుడు కూడా కొత్త ఆకలి పుట్టుకొస్తుంది. కారణం ఖుర్బానీ కా మీఠా. ఈ డెజర్ట్ లేకుండా నగరంలో ఏ విందూ పూర్తి కాదు. తినకుండా ఏ జిహ్వా శాంతించదు. ఇంతగా సిటిజనుల అభి‘రుచి’లో అల్లుకుపోయిన ఈ ఖుర్బానీ కా మీఠా కహాని దాని తియ్యదనమంత గొప్పది. కునాఫా చాక్లెట్లు, చీజ్కేక్లు, మాకరూన్లు వంటి కొత్త కొత్తవి సిటీ డెజర్ట్స్ మెనూలోకి రావడానికి చాలా కాలం ముందు నుంచే ఓ మిఠాయి రాజదర్పంతో కింగ్ ఆఫ్ డెజర్ట్స్గా నగరంలో వర్థిల్లుతోంది. నిజాం వంశాల వంటగదుల్లో జచిన ఈ మిఠాయి, హైదరాబాద్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకల భోజనాలు ఈ డెజర్ట్తో ముగిస్తేనే.. అది సంపూర్ణ విందుగా పరిగణిస్తారు. రాత్రంతా నానబెట్టిన డ్రై ఆప్రికాట్లను చక్కెరతో మగ్గించి, బాదం లేదా ఆప్రికాట్ గింజలతో అలంకరించడంతో ఇది స్వీట్ రూపం దాల్చుతుంది. ఈ రుచికరమైన డెజర్ట్ను మలాయ్, వెనిల్లా ఐస్క్రీమ్ లేదా కస్టర్డ్తో కలిపి కాంబినేషన్గా అందిస్తున్నారు.మొఘలుల కాలం నుంచే.. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్కు ఫెర్గానా లోయ (ఉజ్బెకిస్తాన్)లో పండే ఆప్రికాట్లు బాగా నచ్చేవట. భారతదేశపు వేడిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు తన స్వదేశ పండ్లను బాగా మిస్ అయ్యేవాడట. ఆ తర్వాత భారత ఉపఖండంలోకి అలా వచ్చిన ఆప్రికాట్లు నాటి చక్రవర్తుల పుణ్యమాని మొఘల్ వంటల్లో కూడా ప్రాధాన్యం పొందాయి. నగరాన్ని పాలించిన ఆసఫ్ జాహీ రాజవంశం హయాంలో ఈ మిఠాయి హైదరాబాద్ క్యుజిన్లో ప్రాముఖ్యం పొందింది.నగరం నలువైపులా..హైదరాబాద్ వంటకాలకు పేరొందిన ప్రతి రెస్టారెంట్ ఖుర్బానీ కా మీఠాను ప్రత్యేకంగా అందిస్తుంది. బిర్యానీకి పేరొందిన ప్యారడైజ్ రెస్టారెంట్, షాదాబ్ హోటల్, బావర్చీ హోటల్, నవాబ్స్ రెస్టారెంట్, సర్వీ, నానీస్ ప్యూర్ వెజ్, కబూల్ దర్బార్ వంటివన్నీ ఈ డెజర్ట్ను సర్వ్ చేస్తున్నాయి. అలాగే మినర్వా కాఫీ షాప్స్, చట్నీస్లో క్లాసిక్ ఖుర్బానీ కా మిఠాను ఐస్క్రీమ్తో కలిపి అందిస్తారు. కరాచీ బేకరి, ఆల్మండ్ హౌజ్ వంటి కొన్ని మిఠాయి దుకాణాల్లో ప్యాకింగ్స్లో కూడా దొరుకుతుంది. దీని ధరలు రూ.70 నుంచి రూ.600 వరకూ ఉన్నాయి. సితార ఫుడ్స్ వంటివి కిలోల లెక్కన విక్రయిస్తున్నాయి. చైనాలో పుట్టి.. చరిత్రకెక్కి.. ఖుర్బానీ కా మిఠా కేవలం ఒక మిఠాయి కాదు. తరాలుగా మనతో పాటు అల్లుకున్న చారిత్రక, సాంస్కృతిక సంపద. ఖుర్బానీ అంటే ఉర్దూలో ఆప్రికాట్. చైనాలో జన్మించిన ఈ పండు, క్రీ.పూ.4వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ సైనికుల ద్వారా భారతదేశం మీదుగా యూరప్కు ప్రయాణించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.ఆధునిక రూపం.. ఆప్రికాట్ డిలైట్.. ఈ మధ్య కాలంలో ఖుర్బానీ కా మిఠాకు సరికొత్త అవతారం దాల్చింది. అదే ఆప్రికాట్ డిలైట్. ఇందులో అసలు మిఠాయి రుచిని అలా ఉంచుతూనే కేక్, కస్టర్డ్, విప్డ్ క్రీమ్ వంటి కొత్త రుచులు జోడించి ట్రైఫిల్ లాగా తయారు చేస్తారు. ఈ కొత్త వెర్షన్ జూబ్లీహిల్స్లోని ది స్పైసీ వెన్యూ హోటల్కి చెందిన ఎల్.రవీందర్ కుమార్ రూపొందించారు. ఈ డెజర్ట్ సోషల్ మీడియా, ఫుడ్ బ్లాగర్ల ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. పారంపర్యానికంటే భిన్నంగా ఉందని కొన్ని వర్గాలు విమర్శిస్తున్నా మరికొందరు దీనిని పాత మిఠాయికి కొత్త జీవం పోసే ప్రయత్నంగా స్వీకరిస్తున్నారు. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..) -
Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే..
ప్రపంచ వేదికపై హైదరాబాద్ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు క్యాట్ వాక్ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు సాంగ్కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్ 4లో నిలిచిన పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్ కాంటెస్టెంట్ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్ కూడా హైదరాబాద్కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా) -
చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..
అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...పదహారడుగుల లోతులో...రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్. అధ్యయన భవన్లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. భడారియా మహారాజు కృషి ఫలితంభడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్సింగ్ నిర్మల్. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. విశాలమైన భోజనశాలలుపలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని స్టార్ ఫీల్డ్ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. తిరుమలరావు కరుకోల(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
రాచ సాలీడు..! టాలెంట్కి ఫిదా అవ్వాల్సిందే..
‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే సినిమా డైలాగ్లా కాదు. కొన్నిసార్లు కటౌట్తో పనిలేకుండా కూడా కొన్ని కొన్ని నమ్మేయాలి. ఎందుకంటే, ఫొటోలో చిన్నగా బొద్దుగా ఉండే ఈ సాలీడు టాలెంట్ తెలిస్తే అలాగే అనిపిస్తుంది. ఇది సాలీడు జాతికే రారాజులాంటిది. పేరు ‘డార్విన్ బార్క్ స్పైడర్’. కేవలం ఇరవై రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కాని, అది అల్లే సాలెగూడు పరిమాణం ముందు సినిమాల్లోని స్పైడర్ మాన్ కూడా తలదించుకోవాల్సిందే! గాలిలోకి దాని జిగురు దారాలను వదిలి, ఎక్కడో ఓ చెట్టుకి అంటుకునేలా చేస్తుంది. అలా మొదలైన దాని సాలెగూడు ఏకంగా ఇరవై ఐదు మీటర్ల దూరం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన గూడు నిర్మించుకునే సాలీడుగా ఇది రికార్డులకెక్కింది. గూడు ఎంత పెద్దదైతేనేం అంత బలంగా ఉండదనుకోకండి. దాని జిగురు దారాల బలం, పట్టుదారం కంటే పదిరెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. దాని సాలెగూడులో పడి, ఒకేసారి దాదాపు ఇరవై దోమలు, ఈగలు బ్రేక్ఫాస్ట్ బఫేగా మారిపోగలవు. దీని గురించి తెలిస్తే స్పైడర్మాన్ కంటే ఈ నిజమైన వెబ్ హీరోకే ఫిదా అయిపోతారు. (చదవండి: కింగులా బతికాడు సింగిల్గా..!) -
పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!
నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?– రమణి, శ్రీకాకుళం. మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్ అని అర్థం. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని అర్థం. అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్ లేదా వాటర్ లీక్ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్బీట్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్ క్రాక్స్ వస్తున్నాయి. బ్లడ్ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – లావణ్య, తిరుపతి. బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్ క్రాక్స్ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్ సర్కులేషన్ వస్తుంది. వ్యాసలిన్ లేదా పారాఫిన్ లేదా ప్యూరిఫైడ్ లోషన్తో నిపుల్ మీద మసాజ్ చెయ్యాలి. ఇలా ప్రతి ఫీడ్ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్ ఇవ్వండి. బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్ కాకుండా ప్రివెంట్ చెయ్యడానికి ఫీడ్ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి నిపుల్ మీద రాసి, తరువాత కవర్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ షీల్డ్ అని మెడికల్ షాప్స్లో రబ్బర్ కవరింగ్స్ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్ ఎక్కువ ఉండి, బ్లీడింగ్ అవుతుంటే క్రీమ్స్ రాసి దాని తరువాత సరైన సైజ్లోని షీల్డ్ పెట్టి ఫీడింగ్ ఇస్తే నిపుల్కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నిపుల్ క్రాక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. రొమ్ముల ఐరోలా, నిపుల్ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. నిపుల్ ఒక్కటే పట్టుకొని సక్ చేస్తే క్రాక్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్ కన్సలెంట్ని కలసి మీకు పొజిషన్స్ ఫర్ ఫీడింగ్ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్ బాగా వస్తుంది, నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..) -
వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! నెటిజన్లు ఫిదా
వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్లైన్’లో ఈ బామ్మ పేల్చే బ్లష్ బ్లాస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్ బ్రష్ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్ మీడియాను షేక్ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్కు చెందిన జోన్ పార్ట్రిడ్జ్. ఈమె వయసు 103.సరదా సరదాగా బ్యూటీ పాఠాలురోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్ బ్రష్ పట్టుకుంటుంది. ఆపై మొబైల్ కెమెరా ఆన్ చేసి, టిక్టాక్లో మేకప్ ట్యూటోరియల్ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరోజు బ్లష్ బ్రష్ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్ టెక్నిక్స్ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్ ఫిదా అయ్యారు. ‘ఇలా కాజల్ వేయాలి, ఇలా బ్రష్ తిప్పాలి, ఇలా బ్లష్ టచప్ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్ అయినా, సీరియస్గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్టాక్’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.వరుస గిఫ్ట్ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్ ఐటమ్స్ను కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాషన్ బ్రాండ్స్కు ట్యాగ్ చేశారు. బ్రాండ్స్ వాళ్లు కూడా బామ్మ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్టాక్లో వైరల్ స్టార్, మేకప్ గురు, బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్బుక్ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్ చేస్తున్నారు. బ్లష్ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్టాక్ స్టార్లుగా రెడీ అవ్వడానికి! (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
కాంతిమంతమైన ముఖం కోసం..
ముఖం కాంతిమంతంగా, ఆకర్షణీయం కనిపించడం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే సహజసిద్ధంగా ఇంట్లో లభించేవే మంచివంటున్నారు నిపుణులు. మన ప్రతి నిత్యం చూసే వాటితో చాలా సింపుల్గా మన సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో చూద్దామా..!.టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ రోజ్వాటర్ను తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంది మొటిమలు తగ్గుముఖం పట్టడంతోపాటు, చర్మం మృదువుగా తయారయి నిగారింపు సంతరించుకుంటుంది. బాగా మగ్గిన అరటిపండు తొక్క తీసుకుని టేబుల్ స్పూన్ తేనె వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. ఈప్యాక్ను రెండురోజులకొకసారి వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది, మెరుపులీనుతుంది. ట్యాన్ను తరిమేస్తుంది..మూడుస్పూన్ల ముల్తాని మట్టిలో రెండు టీస్పూన్ల రోజ్వాటర్, మూడు టీస్పూన్ల పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లలోకి పోకుండా ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్ క్రమంగా పోతుంది. చర్మానికి విటమిన్ ఏ, తేమ అంది ఆరోగ్యంగా ఉంటుంది. (చదవండి: పాలీవర్కింగ్ గురించి విన్నారా..?) -
పాలీవర్కింగ్ గురించి విన్నారా..?
ముంబైకి చెందిన సారా ఒక టెక్ కంపెనీలో టాలెంటెడ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. యోగా ఇన్స్ట్రక్టర్, ఫ్రీలాన్స్ కాపీరైటర్గా కూడా పనిచేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ప్రైమరీ జాబ్ చేసే సారా సాయంత్రం తరువాత లోకల్ స్టూడియోలో యోగా పాఠాలు చెబుతుంది. వీకెండ్స్లో ఫ్రీలాన్స్ రైటింగ్ ప్రాజెక్ట్లు చేస్తుంటుంది.పాలీవర్కింగ్ వల్ల ఆర్థికస్థిరత్వం తోపాటు తన పాషన్ను కూడా కొనసాగించే వీలు కలుగుతోంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం...పాలీవర్కింగ్. కోవిడ్ మహమ్మారి తరువాత ఈ ధోరణి బాగా పెరిగింది. అస్థిరమైన ఉద్యోగాల కారణంగా యువ ఉద్యోగులు మునుపెన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు.‘వోల్ ల్యాబ్స్’ సర్వే ప్రకారం 46 శాతం మంది ఉద్యోగులు సెకండరీ జాబ్ చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న మిలీనియల్స్లో 52 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో 24 శాతం మంది మూడు ఉద్యోగాలు చేస్తున్నారు. 33 శాతం మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేస్తున్నారు. ఇక జెన్ జెడ్లో సగం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీలు పాలీవర్కింగ్’ ట్రెండ్కు కారణం. ‘ఆదాయం పెంచుకోవడం మాత్రమే కాదు, అనేక రకాల నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఈ ట్రెండ్ ఉపకరిస్తుంది’ అంటుంది సారా. (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..
‘ది సెకండ్ విండ్’ చిత్రానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘ఎవరీ మయూర శివల్కర్?’ అనే ప్రశ్న ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముగ్గురు మహిళల నిజజీవిత సంఘటనల ఆధారంగా ఇందిర బైరికర్ ‘ది సెకండ్ విండ్’ చిత్రాన్ని రూపొదించారు. ఆ చిత్రంలో మయూర శివల్కర్ జీవితం కూడా ఉంది...కర్నాటకలోని బెల్గావికి చెందిన మయూర శివల్కర్ మారథానర్, అథ్లెట్, బ్రెస్ట్ కేన్సర్ సర్వైవర్. ‘ది సెకండ్ విండ్’లో మయూర శివల్కర్ పాత్ర భావోద్వేగాలకు పరిమితమైనదే కాదు ప్రభావం వంతమైనది.ధైర్యమిచ్చేది... దారి చూపేది.ముప్పైలలో తనకు బ్రెస్ట్ కాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు ఆమె కాసేపు విచారపడి ఉండొచ్చుగానీ కష్టాలు, ప్రతికూలతలకు తలవొగ్గకూడదని నిర్ణయించుకుంది. పోరాట బాటను ఎంచుకుంది. ఎన్నో మారథాన్లలో ఉత్సాహంగా పాల్గొంది. ఆమె పేరు ఆశావాదానికి అరుదైన ప్రతీకగా మారింది. మయూర ఆశావాదమే, అరుదైన ధైర్యమే ‘ది సెకండ్ విండ్’ కథలోకి వచ్చింది. కాస్త వెనక్కి వెళితే... మయూర రేసులలో పాల్గొన్నప్పుడల్లా... ‘ఈ పరిస్థితుల్లో ఎందుకు?’ అన్నవారు లేకపోలేదు.ఆ సందేహానికి ఆమె చిరునవ్వే... సమాధానం. 36 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్లోనూ రేస్ను పూర్తి చేసింది. తాను యావరేజ్ స్విమ్మర్ అయినా తొలి సీ–స్విమ్ను విజయవంతంగా పూర్తి చేసింది. బైకింగ్లోనూ ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తావు! ఇది ఎలా సాధ్యం?’ అని మయూరను అడిగేవారు. ఉత్సాహం కొని తెచ్చుకునేది కాదు కదా!అది ఆమె రక్తంలోనే ఉంది. మయూర తల్లిదండ్రులు ఆమెకు తల్లిదండ్రులు మాత్రమే కాదు స్నేహితులు, మార్గదర్శకులు. ‘నా తల్లిదండ్రులు ఒకమాట చెప్పే వారు... మొదటి నుంచి నీదైన ఒక మార్గాన్ని ఎంచుకున్నావు. ఆ మార్గం నుంచి బయటకు రావద్దు. మంచి రోజులను ఎంజాయ్ చేసినట్లే, చెడు అనుకునే రోజులను ఎంజాయ్ చెయ్. ఫుల్స్టాప్ కంటే కామా బెటర్’ అని గతాన్ని గుర్తు చేసుకుంది మయూర శివల్కర్. (చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట) -
ఆద్యకళను అడ్డుకోవడమా?
‘ఆద్యకళ’ పేరిట ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు గత కొన్నేళ్లుగా వివిధకేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పురావస్తు ప్రదర్శనలు విశేష ఆదరణ పొందు తున్నాయి. జానపద పరిశోధకుడిగా ఆయన దశాబ్దాలుగా సేకరిస్తూ, ప్రద ర్శిస్తున్న వేలాది ఆదివాసీ కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాద్యాలు, లోహ ప్రతిమలు, సాంస్కృతిక చిహ్నాలు వెలకట్టలేనివి. అయితే వీటిసంరక్షణ తన శక్తికి మించిన పని అవుతోందనీ, వాటి కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనీ తిరుమలరావు ఎంతో కాలంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిలో కొన్నింటి భద్రత, ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కొంత స్థలాన్ని కేటాయించింది. అదేవిధంగా ఉస్మా నియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న అధ్యాప కుల నివాస స్థలాల్లో రెండు గృహాలను ఈ పురా వస్తు సంరక్షణ, ప్రదర్శన, భద్రత కోసం అధికారికంగా అప్పగించారు. అయితే ఆ నివాసాలు శిథిలావస్థలో ఉన్నందున వాటికి ప్రభుత్వం మరమ్మతు పనులు చేయిస్తుండగా విద్యార్థి సంఘాలకు చెందినవారు ‘ప్రయివేటు వ్యక్తులకు ప్రొఫెసర్ క్వార్టర్లు కేటాయించడం కుదరదు. తక్కువ రెంటుతో లబ్ధి పొందుతున్నారు’ అని అభ్యంతరం చెబుతూ నిర్మాణ సామగ్రిని కూలదోసి, చిందరవందర చేశా’రని తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఇదే విశ్వవిద్యాలయంలో చాలా కాలం పని చేసినవారే. ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు ఎవరితోనైనా చేతులు కలిపి పని చేసేందుకు తాను సిద్ధమే అనేది ఆయన ప్రతిపాదన. రెండేళ్ల క్రితం పురాతత్త్వ ప్రదర్శనశాల వారి ఆహ్వానంపై తిరుమల రావు ప్యారిస్ వెళ్లారు. అప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల ప్రతి నిధులు వాటిలో కొన్నింటిని తమ మ్యూజియాలలో భద్రపరుస్తామని ముందుకు వచ్చారు. అయితే ఇది భారతదేశ సంపద అని వారి ప్రతిపాదనను ఆయన ఒప్పుకోలేదు. గత ఏడాది ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలో వీటికి గౌరవం దక్కింది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది! కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ చాలా కాలంగా తిరుమలరావుకు బాసటగా నిలబడి, ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకై ప్రభుత్వాలకు ఎన్నో వినతులను సమ ర్పించారు. చివరకు ప్రదర్శనశాల ఒక కొలిక్కి వస్తున్న దశలో అశని పాతంలా వచ్చి పడిన ఈ విద్యార్థి సంఘాల వారి బెదిరింపు ఖండనార్హం. – బద్రి నర్సన్ -
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్ థాపర్ (Valmik Thapar) ఇకలేరు. టైగర్ మ్యాన్గా ప్రసిద్ది చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్తో కలిసి పనిచేశారు. Valmik Thapar, a legendary figure in the world of conservation over the past four decades - especially tigers - has just passed away. It is a great loss. Today's Ranthambore, particularly, is a testimony to his deep commitment and indefatigable zeal. He was uncommonly… pic.twitter.com/6TP60wMleo— Jairam Ramesh (@Jairam_Ramesh) May 31, 2025వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (1997) టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలునురచించారు. ఇంకా ఆయన సహనిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలుయ చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997) బాగా పాపులర్. 2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు వాల్మీక్ థాపర్ఎవరీ వాల్మీక్ థాపర్వాల్మీక్ థాపర్ బొంబాయిలో రాజ్-రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్ను వివాహం చేసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మిక్ థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు, యు మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రస్తుతం రణతంబోర్ థాపర్ అభివృద్దికి ఆయన అవిశ్రాంత అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. ఇంకా పలువురు పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెలిబుచ్చారు.Rest in Peace, Valmik Thapar, the international voice of Indian tigers for many many years.As a tribute to him, do read the many books he penned on tigers: ‘Tiger Fire’, ‘Living with Tigers’ and others. pic.twitter.com/SJJzZeELYn— Neha Sinha (@nehaa_sinha) May 31, 2025ఫియర్లెస్ టైగర్ ఛాంపియన్ అంటూ పరిరక్షణ జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వాల్మీక్ థాపర్ మృతిపై నివాళి అర్పించారు. తనకోసం తాను మాట్లాడలేని ఒక మూగ జీవికి స్వరాన్చిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం నిలిచిపోతారన్నారు. -
చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా శునక రాజా... ఆకట్టుకుంటున్న హైదరాబాద్ కంపెనీ
పెట్స్ పేరుకే పెంపుడు జంతువులు కానీ వాటిని సొంత మనుషుల్లా చూసుకునే వాళ్లే ఎక్కువ. వాటికి పేర్లు పెట్టి, పుట్టినరోజులు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటారు చాలామంది. ఇంటిలో పెట్స్ను పెంచుకోవడం మామూలే కానీ ఒక ఆఫీసులో స్ట్రెస్ రిలీవర్గా.. చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా ఒక ఉత్తమజాతికి చెందిన శునకాన్ని నియమించింది ఒక స్టార్టప్ కంపెనీ. అది ఎక్కడో కాదు... హైదరాబాద్లోనే. ఆఫీసులో పని ఒత్తిడి సర్వసాధారణం. ఆ ఒత్తిడి నుంచి ఉద్యోగులను బయట పడేయడం ఎలా? ఆఫీస్లో రిక్రియేషన్ క్లబ్ పెట్టడం కన్నా ఓ మేలుజాతి శునకాన్ని రిక్రియేషన్ ఆఫీసర్గా నియమిస్తే కాస్త వెరయిటీగా ఉంటుంది కదా అని ఆలోచించింది ఆ స్టార్టప్ కంపెనీ. ఇంకెందుకాలస్యం.... వెంటనే డెన్వర్ అనే ఒక శునకాన్ని కంపెనీలో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా నియమించేసింది. ఇంతకూ ఈ డెన్వర్ ఉద్యోగుల ఒత్తిడిని ఎలా తొలగించగలదు? సంతోషాన్ని ఎలా ఇవ్వగలదనే కదా సందేహం? అక్కడికే వద్దాం... ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఉద్యోగులందరి దగ్గరకూ వరసబెట్టి వస్తారు ఈ ఆఫీసర్గారు... అందరినీ ప్రేమగా పలకరిస్తారు. స్నేహపూరితంగా షేక్ హ్యాండ్ (సారీ... ఇక్కడ లెగ్ అనాలి కాబోలు) ఇస్తారు. వీలయితే తనతో ఆడుకోవడానికి రమ్మని బాల్ తెచ్చి ఇస్తారు. ఆడుకున్న వారికి ఆడుకున్నంత సంతోషం. అన్నట్టు గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ కూడా తన స్ట్రెస్ బస్టర్ అయిన పెంపుడు శునకాన్ని తనతో పాటు ఆఫీసుకు తీసుకువస్తారట. ఒత్తిడిగా అనిపించినప్పుడు దానితో ఆడుకుంటారట. మరో విషయం... డెన్వర్కు లింక్డ్ ఇన్లో ప్రొఫైల్ కూడా ఉంది.. ఫలానా కంపెనీలో చీఫ్ హ్యానీనెస్ ఆఫీసర్గా పని చేస్తున్నట్లుగా.. బాగుంది కదూ...ఇంట్లో పెట్స్ ఉన్నవాళ్లు ఒత్తిడి లేకుండా.. సంతోషంగా ఉంటారని, ఎక్కువ పని చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దానిని వాకింగ్కి తీసుకెళ్లడం, ఫుడ్ పెట్టడం వంటి వాటివల్ల బీపీ, షుగర్ వంటివి దరిచేరవట. అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వారి పెట్స్తో సహా ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తున్నాయట! బాగుంది కదూ..చదవండి: కొత్త పుస్తకాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి? -
Moral Story: ఆ పక్షులు నవ్వాయి.. పెద్దల మాట వినాలి!
అనగా అనగా ఒక అడవిలో పక్కపక్కనే రెండు రావిచెట్లు ఉండేవి. వాటి మీద పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. వాటిల్లో ఒక గుడ్లగూబ కూడా ఉండేది. అక్కడున్న పక్షుల్లో అదే పెద్ద వయసున్న పక్షి కావడంతో అప్పుడప్పుడూ మిగిలినవాటికి సలహాలు, సూచనలు ఇచ్చేది. ఆ మాటల్ని కొన్ని పక్షులు వినేవి. మరికొన్ని మాత్రం లక్ష్యపెట్టేవికావు. రెండు రావిచెట్లు గుబురుగా పెరగడంతో ఒకదాని కొమ్మలు మరొక చెట్టుతో రాసుకుంటూ ఉండేవి. భారీ గాలివానలొచ్చినప్పుడు చెట్లు కూలిపోతాయేమో అన్నంతగా కదిలి΄ోయేవి. ఆ పరిస్థితి చూసిన గుడ్లగూబ ‘ఈ చెట్లు చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా ఇవి కూలి΄ోయే ప్రమాదం ఉంది. మనందరం కొత్త చెట్టు చూసుకోవాలి’ అని చెప్పేది. కొన్ని పక్షులు బద్దకంతో ‘తర్వాత చూసుకుందాం’ అన్నాయి. మరికొన్ని పక్షులు ‘నీదంతా చాదస్తం. మరో వందేళ్లయినా ఈ చెట్టుకు ఏమీ కాదు’ అని చెప్పాయి. వానాకాలం మొదలైంది. కొద్దిగా జల్లులు కురుస్తున్న సమయంలో గుడ్లగూబ మరోసారి రెండు చెట్ల మీదున్న పక్షుల వద్దకు వెళ్లి–‘వానలు మొదలయ్యాయి. ఈ రెండు చెట్లు ఇప్పటికే బలహీనంగా తయారయ్యాయి. వాటి వేర్లు భూమిలోనుంచి బయటకు వచ్చేశాయి. వెంటనే మనమంతా మరో చెట్టు చూసుకుందాం’ అని చెప్పింది. కానీ ఎవరూ ఆ మాట లక్ష్యపెట్టలేదు. దీంతో చేసేదిలేక గుడ్లగూబ దగ్గర్లో ఉన్న మరో చెట్టు మీద కొత్తగా గూడు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయింది. గుడ్లగూబ కొత్తగూడును చూసి కొన్ని పక్షులు నవ్వుకున్నాయి.మరో నెల రోజుల తర్వాత వానలు ఉధృతంగా కురిశాయి. పక్షులు గూళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హోరుగాలికి రావిచెట్లు బలంగా ఊగి, వేర్లతో సహా కూలిపోయాయి. దీంతో చెట్టు మీదున్న పక్షుల గూళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఆ కొమ్మల కిందపడి ఎన్నో పక్షులు మరణించాయి. మిగిలిన పక్షులు గూడ్లగూబ ఉన్న చెట్టు మీదకు చేరాయి. ఆ వర్షంలో గూడు కట్టుకునే వీలు లేక వానకు తడుస్తూ ఇబ్బంది పడ్డాయి. ముందే గుడ్లగూబ మాటలు విని ఉంటే తమకు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదని, తమ మిత్రులు బతికేవారని అనుకొని బాధపడ్డాయి. -
Fitness: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..?
మనదేశంలో ఏటా మధుమేహంతో పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. షుగర్ నియంత్రణలో ఉండాలంటే వర్కౌట్లు తప్పనిసరి కానీ ఈ బిజీ లైఫ్లో వ్యాయమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. మరీ అలాంటప్పడు వ్యాయమాలు చేయకుండానే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఈ ‘2 పర్ 20’ రూల్ని పాటిస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. మరీ ఆ రూల్ ఏంటి, ఎలా షుగర్ని నియంత్రిస్తుందో చూద్దామా..మనం ఎక్కువసేపు కూర్చొని ఉండటంతో కాళ్లలోని కండరాలు నిరుపయోగంగా మారతాయి. ఎందుకంటే రక్తం గ్లూకోజ్ని శోషించడం నెమ్మదిస్తుంది. అదే భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అందువల్ల ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడి నడిస్తే..కండరాల కార్యకలాపాలు బలోపేతంగా ఉండి, గ్లూకోజ్ శోషణ రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్ స్థాయిలు 25% తగ్గుతాయని, ఇన్సులిన్ సమస్యలు ఉత్ఫన్నం కావని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఎవరికి మంచిదంటే..ఈ విధానం ప్రీడయాబెటిక్ వ్యక్తులు లేదా డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కార్యాలయాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్లే గాక వ్యాయమానికి తగినంత సమయం కేటాయించలేనేవారే. అందువల్ల ఆయా వ్యక్తలకు ఈ రూల్ని అనుసరిస్తే మంచి పలితాలను పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అలాగే రోజులో చిన్నపాటి కదలికలు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. కనీసం 30 సెకన్లు కూర్చోవడానికి విరామం ఇచ్చి..అటు ఇటు నాలుగు అడుగుల వేస్తేనే మంచి ప్రభావాన్ని పొందగలమని అన్నారు. అయితే ఇది మెరుగైన హృదయ ఆరోగ్యం, కండరాల బలం వంటి నిర్మాణాత్మక వ్యాయామ ప్రయోజనాలను అందించకపోయినా..2 పర్ 20 వాకింగ్ రూల్' బిజీగా ఉండే వ్యక్తులకు, వ్యాయామం చేయడం కుదరదు అనుకున్న వ్యక్తులకు ఇది బెస్ట్ అని చెబుతున్నారు. దాంతోపాటు సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలని చెబుతున్నారు. మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణకు ఇది బెస్ట్ అని ధీమాగా చెబుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట) -
1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!
దేహం ఎంత ధృఢంగా ఉన్నా.. సిగరెట్, బీడీ అలవాటు ఉంటే చాలు పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ"కూర్చిన" రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.ఒక్కటి చాలు అంటూ మెల్లిగా మొదలెట్టి 2, 3, 4 అలా రోజూ డబ్బా, ఇలా పర్సు ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు. సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.. దమ్ము కొట్టినపుడు సిగరెట్లో పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డీఎన్ఏను నాశనం చేసే పనిలో పడతాయి. సరళంగా చెప్పాలంటే ఓ వ్యక్తి జాతకాన్ని.. ధూమపానికి ముందు, తర్వాత అని చెప్పొచ్చు.అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలున్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు "దగ్గర" అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతేగాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్లు సైతం యువతను అటువైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. "బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్" అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఉక్కు లాంటి కండరాల్ని తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్) అడ్డగోలుగా పెరగడానికి కారకం అవుతాయి. తద్వారా కేన్సర్కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డిఎన్ఏను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో, మనిషి ఆరోగ్యానికి కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.చదవండి: NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లుసిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డీఎన్ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు.. రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి. దేహ పోరాట పటిమను సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండయాత్ర చేసి.. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి?ధూమపానానికి దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మన దగ్గరే ఉంటుంది.- మాచన రఘునందన్పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీతతెలంగాణ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ -
Jeff Bezos మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే జాగ్రత్తపడుతున్న బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు, భూమిపై అత్యంత ధనవంతులలో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది బిజినెస్ వ్యవహారమో, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించో కాదు. ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే బిలియన్ డాలర్ల తన సంపదను కాపాడుకునేందుకు న్యాయపరంగా ఒక కీలకమైన చర్య తీసుకోబోతున్నాడు. అమెరికన్ టీవీ, రిపోర్టర్ లారెన్ సాంచెజ్ (Lauren Sánchez)తో 2023లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వచ్చే నెలలో గ్రాండ్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి. మొదటి భార్యతో విడాకులు, భారీ భరణం నేపథ్యంలో బెజోస్ తాజా ఏర్పాట్టు మరింత ఆసక్తి కరంగా మారాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ వివాహం ఇప్పటికే చాలా అలస్యమైన కారణంగా వీలైనంత త్వరగా తమ వివాహాన్ని చేసుకోవాలని 61 ఏళ్ల జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్లాన్ చేస్తున్నాడట. అయితే జెఫ్ 220 బిలియన్ డాలర్ల సంపదను ( సుమారు 18.84 లక్షల కోట్ల రూపాయలు) భద్రపరచడానికి ఐరన్ క్లాడ్ ప్రెనప్కు సన్నాహాలు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. వివాహానికిముందే చేసుకోబోయే ఈ పటిష్ఠ ఒప్పందాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నందున పెళ్లికి సమయం తీసుకుంటున్నాడట. అటు గ్లోబల్ న్యాయనిపుణులు దీనిపై భారీ కసరత్తే చేస్తున్నారు.అసలేంటీ ప్రెనప్వివాహానికి ముందు ఒక జంట వ్రాతపూర్వకంగా చేసుకునే ఒప్పందం. విడాకులు లేదా మరణానికి సంబంధించిన సంభావ్య ఆర్థిక సంక్లిష్టతలను నిర్వహించడానికి ఇది ఒక మార్గం, విడాకుల సందర్భంలో ఆస్తులు , అప్పులు ఎలా విభజించబడతాయో ఇందులో పొందుపరుస్తారు. ముఖ్యంగా ఆయా జంటలు రాష్ట్రం లేదా దేశంలోని నియమ నిబంధనలపై ఆధారపడకుండా వారి స్వంత నిబంధనలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫైడ్ ఫ్యామిలీ లా అటార్నీ ఆల్ఫోన్స్ ప్రొవిన్జియానోను సంప్రదించిన జెఫ్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నాడు. ప్రస్తుత ఆస్తులు, ఆస్తులు, హోల్డింగ్ పెట్టుబడులు మొదలైన వాటి జాబితా ఉండవచ్చని , వాటిని ప్రత్యేక సంస్థలుగా లేబుల్ చేయవచ్చని వివరించారు. కాబట్టి, భవిష్యత్తులో లారెన్ సాంచెజ్ జెఫ్ వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడటానికి ముందుకు వచ్చినప్పటికీ, ఒక వేళ విడిపోతే, ఆ సందర్భంలో వాటి యాజమాన్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త. అయితే, వ్యాపారవేత్త తన ఆర్థిక , ఆస్తులన్నింటినీ బహిర్గతం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లీగల్ అగ్రిమంట్ డ్రాఫ్టింగ్ కష్టతరంగా మారిందట. ముఖ్యంగా అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, ఆర్థిక సలహాదారుల బృందంతో సంప్రదింపులు జరగాల్సి ఉంటుందని అంచనా. అంతేకాదు ఇది సాధారణంగా రెండు వైపులా న్యాయవాదుల బృందాలను కలిగి ఉండే సుదీర్ఘ ప్రక్రియ. దీనికి చెల్లింపులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. ఇరు పార్టీల అంగీకారంతో జరిగే ఈ ముందస్తు ఒప్పందానికి చర్చోపచర్చలు, అంగీకారాలు అవసరమంటున్నారు నిపుణులు. కేన్స్ సమీపంలో 500 మిలియన్ డాలర్ల సూపర్యాచ్లో లారెన్కు జెఫ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుండి, ఈ జంట అనేక ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చుతో అత్యంత ఘనంగా జెఫ్ రెండోపెళ్లి జరగనుందని సమాచారం.ఇదీ చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బహిష్కరణఅమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ 1993లో మెకంజీ స్కాట్ను పెళ్లి చేసుకున్నాడు.. వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే 25 ఏళ్ల దాంపత్యం జీవితం తరువాత 2019లో విడాకుల ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని విస్మయపర్చింది. అయితే మెంకజీతో విడాకులకు ముందు (2018) నుంచే జెబోస్, 54 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్తో డేటింగ్లో ఉన్నాడు. కొన్నాళ్లకు విలాసవంతమైన నౌకలో 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.21 కోట్ల) డైమండ్ రింగ్తో ఆమెకు ప్రపోజ్ చేశాడు. అటు లారెన్ శాంచెజ్కు ఇప్పటికే రెండుసార్లు వివాహమైంది. పాట్రిక్ వైట్ సెల్ తో, పెళ్లి ఇద్దరు పిల్లలు తరువాత విడాకులు తీసుకుంది. ఆ తరువాత మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజెలెజ్ను పెళ్ళాడింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా! మెకెంజీతో జెఫ్ బెజోస్ ఖరీదైన విడాకులుచరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు అంటే జెఫ్, మెకంజీదే. అమెజాన్ కేవలం ఆన్లైన్ పుస్తక రిటైలర్గా ఉన్నప్పుడు వివాహం, అమెజాన్ విజయంలో అండగా నిలిచిన అతని మాజీ భార్యకు కంపెనీలో నాలుగు శాతం వాటా లభించింది. దీంతో ఆమె అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో చేరింది. -
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట
భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ ఉండకపోవచ్చు. ఆయన తండ్రి కే.సుబ్రహ్మణ్యం.. 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు. అంతేగాదు భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన జై శంకర్ కూడా అంతే చురుకుగా ఉంటూ.. దూకుడుతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా?.. వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండే జైశంకర్ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే మొదలైపోతుందట. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కాల్స్, వార్తపత్రికలు సమాచారం తెలుసుకోవడం, ఆ రోజు ఉన్న ఈవెంట్లు, హాజరుకావల్సిన కార్యక్రమాలు షెడ్యూల్ చూసుకోడం వంటి గందరగోళంతో ఉంటుందట. అంత ఫుల్బిజీలో కూడా తనకున్న ఒక్క అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. అదే తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు జైశంకర్. ఎప్పుడే ఏ దేశంలో ఉంటామన్నది తెలియని పరిస్థతి కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు, యోగా వంటివి చేయడం కుదరదని చెబుతున్నారు. అందువల్ల ఆయన దినచర్య తానున్న ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుందట. సాధారణ రోజుల్లో మాత్రం చాలామటుకు తన రోజు.. ఉదయం ఆరుగంటల నుంచి మొదలవ్వుతుందట. అయితే కచ్చితంగా ఉదయం స్క్వాష్ గేమ్ ఆడతారట. ఎంత బిజీ షెడ్యూల్ అయినా..ఓ అరగంట అది ఆడాల్సిందేనని చెబుతున్నారు. అలాగే తప భార్యతో కలిసి ఓ అరగంట వాక్ చేస్తానన్నారు. ఎందుకంటే తన భార్యతో స్పెండ్ చేసేందుకు అదే తనకు తగిన సమయమని చెబుతున్నారు. అదీగాక నిత్యం పర్యటించే జై శంకర్కు కుటుంబంతో గడపడం, ఫిట్నెస్పై దృష్టిసారించడం అనేవి అత్యంత సవాలుతో కూడినవి. కాబట్టి తన లైఫ్స్టైల్కి అనుగుణంగా ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించి కనీసం రెండు అలవాట్లను తప్పనిసరిగా తన దినచర్యలో భాగం చేసుకుంటారట. అలాగే కుటుంబంతో గడపటం కోసం..భార్యతో సంభాషిస్తూ చేసే వాకింగ్ అనేది కూడా తప్పనిసరి అని అన్నారు. పర్యటనలో లేకపోతే..తన భాగస్వామితో గడపటానికి తప్పనిసరిగా అరగంట సమాయాన్ని కేటాయిస్తానని చెప్పారు. అలాగే తన వర్క్ లైఫ్ ఉదయం 9.30 గంటలకు మొదలవుతుందట. ఇక అక్కడ నుంచి ఉన్నత స్థాయి సమావేశాలు, సమీక్షలు, మంత్రిత్వ శాఖ ఫైళ్లను క్లియర్ చేయడం, పాశ్చాత్య దేశాలతో ఫోన్లో దౌత్య సంభాషణలు జరపడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోతానని చెప్పారు. ఇక సినిమాలు చూసే ఛాన్సే లేదని అన్నారు. ఎందుకంటే.. రెండు గంటల్లో అయిపోయే సినిమా ఉండదు కదా అని నవ్వేశారు. చివరగా ఆయన విదేశాంగ మంత్రిగా వర్క్కి సంబంధించి..24/7 అత్యంత బిజీగా ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యానికి సంబంధించిన ఆ అలవాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్ అవ్వనని చెప్పారు. అంతేగాదు ఎంత పని గందరగోళంతో ఉన్నా..జీవితాన్ని అందంగా ఓ నిర్షిష్ట పద్ధతిలో నిర్మించుకోవడంలో విఫలమవ్వకూడదని అన్నారు జైశంకర్. బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే కానీ, జీవితాన్ని అందంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్. చెప్పాలంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అసలైన అర్థం మన విదేశాంగ మంత్రి లైఫ్స్టైలే కదూ..! సో.. మనం కూడా పని జీవితం తోపాటు..మన కుటుంబ జీవితానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం..ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం. (చదవండి: మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..? అందుకే ఇజ్రాయెల్..) -
స్టడీ అండ్ సర్వీస్ : గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో యువత సేవలు
చదువులు, ఉద్యోగాలు ఆ తర్వాత జీవితపు బాధ్యతలలో తలమునకలవడంతోనే సరిపెట్టుకోకూడదు అనుకుంటుంది నవతరం. సమాజసేవను బాధ్యతగా తీసుకుంటూ చదువు–సేవ రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా దాదాపు తొంభై మంది యువ విద్యార్థులు నగరంలోని స్లమ్స్తో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి సేవలు అందిస్తూ ‘మేమున్నాం’ అని బాసటగా నిలుస్తున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలు బాగుపడినప్పుడే దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నది మహాత్ముని మాట. ఇప్పుడు ఆ మాటలు నిజం చేస్తూ యువత ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలను హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా నిర్వహిస్తున్నారు. తమ సేవాకార్యక్రమాలతో మారుమూలస్థాయి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ కాలేజీల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు తమ సేవలను అందిస్తున్నారు. ‘యువతలో సాధికారత, సామాజిక మార్పు’ అనే నినాదంతో వీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇరువైపులా అవగాహనఇప్పుడు మేం చేస్తున్నది రెవల్యూషనరీ సీజన్. దీనిలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సోలార్ పవర్, శుభ్రత పట్ల అవగాహన, మంచినీటి సౌకర్యం, ఆహార వ్యర్ధాన్ని నిరోధించడం, వాటర్ వీల్ డిస్ట్రిబ్యూషన్... మొదలైన వాటి మీద వర్క్ చేస్తున్నాం. ఇందులో దాదాపు 90 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని మారు మూల ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాం. నగరంలోని స్లమ్స్, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని సమస్యలను గుర్తించడం, పరిష్కార దిశగా చేసిన ఆలోచలను మూడు నెలలకు ఒకసారి అందరం కలిసి, చర్చిస్తాం. ఎక్కడ ముందస్తు సేవ అవసరం అవుతుందో దానిని ప్రధానంగా తీసుకుంటాం. వీటి ద్వారా చదువొక్కటే కాకుండా సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన కూడా కలుగుతుంది. బాధ్యత పెరుగుతుంది. – లాస్య వంకదారి,ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ చైర్ పర్సన్ప్రాజెక్ట్ రిపోర్ట్తో: ప్రతి సీజన్లో ఎనిమిది ప్రధాన సమస్యలపై వర్క్ చేస్తుంటాం. ముందుగా అందరం కలిసి, చర్చించుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసుకుంటాం. మెంబర్స్ అందరం అమ్మానాన్నలు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఫండ్ సేకరిస్తాం. ఆ మొత్తాన్ని యూత్ అసెంబ్లీ ద్వారా ఒక మంచి పనికోసం కేటాయించి, సేవలో పాల్గొనడం సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్కి సంబంధించి ఈవెంట్ చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న తాండాల వారికి, గర్భవతులకు, పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేలా ప్లాలాన్ చేస్తున్నాం. నవజాత శిశువులకు అవసరమయ్యే వస్తువులను కూడా అందిస్తున్నాం. కిందటిసారి ములుగులో చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. – విజయ్, బిటెక్ ఫస్టియర్, కరియర్ గైడెన్స్లో అవగాహన: హైదరాబాద్స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్లో మూడేళ్ల పాటు వర్క్ చేశాను. ఇప్పుడు యూత్ అసెంబ్లీ నుంచి సేవలు అందిస్తున్నాను. పట్టణాల్లో ఉన్న నిరుపేదల జీవనశైలిని మార్చే ప్రయత్నం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, స్కూల్స్కు వెళ్లి కెరియర్ గైడెన్స్ వంటివి చేస్తున్నాం. సిద్దిపేటలోని కిష్టాపూర్, ములుగు ప్రాంతంలోని తక్కెళ్లగూడెంలో సోలార్ ΄్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, డిజిటల్ అవేర్నెస్... వంటివి చేశాం. – చంద్రశేఖర్, బీటెక్ థర్డ్ ఇయర్, ఇంబ్రహీంపట్నం -
అలరించిన మహా నృత్యోత్సవం..
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ నాట్య శిల్పి ఆర్ట్స్ అకాడమీ 35వ ఉచిత నాట్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందిన వంద మంది చిన్నారులు మహా నృత్యోత్సవం పేరిట కూచిపూడి, జానపద, దాండియా నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. చిన్నారులకు ఉచితంగా శాస్త్రీయ సంగీత కళలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతకు ముందు అకాడమీ వ్యవస్థాపకులు వాసుకి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రదర్శించిన లైట్ ఆఫ్ బుద్ద నాటకం హైలెట్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు లయన్ సర్దార్ హర్బీందర్ సింగ్, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి, అకాడమీ డైరెక్టర్ పుష్పలత పాల్గొన్నారు. (చదవండి: విశ్వ వేదికపై.. నాటు పాట..! వైరల్గా తెలుగు పాటలు..) -
బాధ్యతను గుర్తుచేసేలా.. అబ్బురపరుస్తున్న వన్యప్రాణుల చిత్రాలు..!
వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్రం బేగంపేట ప్రకాశ్నగర్ ఫ్లైఓవర్ పిల్లర్స్ను వన్యప్రాణుల చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను వన్య ప్రాణుల బొమ్మలు కట్టిపడేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడే రీతిలో చిత్రకారులు గీసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిరుతలు, పులులు, ఏనుగులు, ఎగులుబంట్లు, జాతీయ పక్షి నెమళ్లు, జింకలు, సింహాలు.. ఇలా రకరకాల వన్యప్రాణుల చిత్రాలు చూస్తే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను అటుగా వెళ్లే ప్రయాణికులకు గుర్తుచేస్తున్నాయి. భారత జులాజికల్ సర్వే(జెడ్ఎస్ఐ) ప్రకారం దేశంలో మొత్తం 89 వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి వన్య ప్రాణులను సంరక్షించుకోవడం ద్వారా అటవీ సంపదను కాపాడిన వారమవుతామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పర్యావరణ వేత్తలు నిత్యం పలు రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లైఓవర్ల సుందరీకరణలో భాగంగా బేగంపేట ప్రకాష్నగర్(ఎయిర్పోర్ట్ ఎదురుగా) ఫ్లైఓవర్ పిల్లర్స్కు వేసిన చిత్రాలను చూస్తే అద్భుతమనిపిస్తోంది. సందేశాత్మక థీమ్తో అబ్బురపడేలా వేసిన చిత్రాలు ఒక దానికి మించి మరొకటి ఉంది. (చదవండి: డీఎన్డీ మోడ్..! ఈజీగా నోటిఫికేషన్స్, ఫోన్కాల్స్ మ్యూట్ చెయ్యొచ్చు..) -
కొబ్బరి చిప్పలతో వాటర్ బాటిల్స్..!
వ్యర్థానికి కూడా అర్థాలు చెప్పవచ్చంటూ ఓ విద్యార్థి తనదైన శైలిలో కొబ్బరి చిప్పలతో ‘కోకోనట్ షెల్ వాటర్ బాటిల్’ తయారు చేసి తన సత్తాను చాటారు. ఏదైనా వినూత్నంగా వెదురుబొంగు, కొబ్బరి, బనానా ఫైబర్, తాటాకుల సహాయంతో నూతనంగా ప్రజావసరానికి అనుగుణంగా వినియోగించే వాటిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోకోనట్ షెల్తో ఈ వాటర్ బాటిల్ రూపొందించినట్లు విద్యార్థి స్పష్టం చేశారు. రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ (ఎఫ్డీడీఐ–హైదరాబాద్) బి.డెస్ (లైఫ్ స్టైల్ అండ్ యాక్సెసరీస్ డిజైన్)ఎల్ఎల్పీడీ విభాగం కోర్సులో మూడో ఏడాది చదివే మత్తగుంజ అనిరుద్ ప్యాకేజ్ డిజైన్ రూపకల్పనలో భాగంగా ఈ వాటర్ బాటిల్ను తయారు చేయడం విశేషం. (చదవండి: ఫ్యాషన్కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..) -
Miss World 2025: విశ్వ వేదికపై.. నాటు పాట..
అంతర్జాతీయంగా ప్రపంచ సుందరి పోటీలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మిస్ వరల్డ్గా భారతీయులు కిరీటం గెలిస్తే గొప్పగా కీర్తించుకున్నాం.. కానీ గతేడాది 71వ మిస్ వరల్డ్ ముంబైలో, ఈ సారి 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ (హైదరాబాద్)లో నిర్వహించడంతో ఇండియా విశిష్టత విశ్వవ్యాప్తమైంది. అయితే ఈ సారి నగరంలో జరుగుతున్న పోటీల నేపథ్యంలో హైదరాబాద్కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు తెలుగు పాటలు సైతం వైరల్గా మారాయి. ఏ దేశంలో ఈ పోటీలు జరిగినా ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు రావడం సహజమే. అయితే వినూత్నంగా ఈ సారి తెలుగు పాటలు వైరల్గా మారాయి. దీనికి కారణం.. ఈ సారి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు పాటలకు అభిమానులుగా మారడం చెప్పుకోవాల్సిన విషయం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బసచేస్తున్న ట్రైడెంట్ హోటల్ వేదికగా మిస్ నైజీరియా పాడిన ‘రానూ.. బొంబైకి రానూ’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జానపద సాహిత్యంతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్ రాను బొంబైకి రాను..!! తెలంగాణతో పాటు దక్షినాది వరకూ ఫేమస్ కావడం ఓకే.. కానీ ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ పాటను పాడటం, దీనికి స్టెప్పులేయం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ పాట వైరల్ అవ్వడమో లేదా మిస్ నైజీరియాకు తెగ నచ్చేసిందో తెలియదు కానీ.. మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమైన టాలెంట్ రౌండ్లోనూ ఈ ముద్దుగుమ్మ ఇదే పాటకు డ్యాన్స్ వేశారు. వినూత్నంగా ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ అంటూ ఈ తెలుగు పాట, తమ దేశానికి చెందిన పాటలతో తన టాలెంట్ రౌండ్ను ప్రదర్శించారు. ఐతే ఇదే రౌండ్ చివరలో 20 దేశాలకు చెందిన టాలెంట్ రౌండ్ ఫైనలిస్టులు మళ్లీ ఇదే పాటకు స్టెప్పులేయడం మరోసారి వైరల్గా మారింది. ఇందులో మిస్ ఇండియా నందినీ గుప్తా అదిరిపోయే స్టెప్పులేశారు.. మార్ఫా స్పెషల్.. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మిస్ తారలతో నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ‘హెరిటేజ్ వాక్’ నిర్వహించిన విషయం విధితమే. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన మార్ఫా సంగీతానికి ఈ సుందరీమణులు డ్యాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియోలు తమ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా తిలకించారు.కుర్చీ మడత పెట్టి.. అందరూ తెలుగు పాటలతో అదరగొడితే.. మిస్ ఇండియా నందినీ గుప్తా మాత్రం సూపర్ స్టార్ మహేష్బాబు ‘కుర్చీ మడత పెట్టి...’ అనే డైలాగ్ కం పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఎలా ఉన్నారూ..?? మరో కార్యక్రమంలో భాగంగా ఈ ముద్దుగుమ్మలంతా తెలంగాణ వారసత్వ వైభవాన్ని, విశిష్టతను తిలకించడానికి వరంగల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ కెనడా.. తెలుగులో ‘నమస్తే.. ఎలా ఉన్నారు’ అని సందడి చేయగా, మిస్ యూఎస్ఏ.. ‘అందరూ బాగున్నారా’ అంటూ పలకరించారు. మిస్ అర్జెంటీనా ఐతే పాన్ ఇండియా ఫేమస్ తెలుగు డైలాగ్ ‘తగ్గేదే లే’ అంటూ అలరించారు. ఈ అందాల తారల నోటి వెంట ముచ్చటగొలిపే ఈ మాటలు సైతం యూట్యూబ్లో, సోషల్ యాప్స్లో చక్కర్లు కొడుతున్నాయి.బాలీవుడ్ స్వరాలు సైతం.. ఇవే కాకుండా జిలేబి బేబీ, ఓం శాంతి ఓం, ధూమచాలే వంటి బాలీవుడ్ ఇండియన్ బాలీవుడ్ పాటలతోనూ పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు.తీన్మార్.. నగరంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్ ఈవెంట్లో కూడా తెలుగు పాటలకు, తీన్మార్ బ్యాండ్కు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. హోర్ట్ ఆఫ్ గోల్డ్ పేరుతో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో సైతం అనాథ చిన్నారులను ఉత్సాహపరచడానికి తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాటతో పాటు డీజే టిల్లూ, ఇడియట్, అద్దాలా మేడలున్నవే అనే తెలుగు పాటలకు డ్యాన్సులు చేసి మరో సారి తెలుగు సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించారు.అందాల బొమ్మ నోట.. బుట్టబొమ్మా పాట..మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ జర్మనీ సైతం మరో తెలుగు పాటతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందాలొలికే ఈ ముద్దుగుమ్మ క్యూట్ క్యూట్ వాయిస్తో బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా నను చుట్టూకుంటివే అనే అల్లూ అర్జున్ టాప్ హిట్ సాంగ్ పాడి అందరి మనసులూ దోచుకున్నారు. ఈ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా చుమ్కా కీరా హోయ్ అనే మరో బాలీవుడ్ పాటను సైతం పాడారు. (చదవండి: Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
డీఎన్డీ మోడ్..! ఈజీగా నోటిఫికేషన్స్, ఫోన్కాల్స్ మ్యూట్ చెయ్యొచ్చు..
పనిచేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ల నుంచి తరచుగా వచ్చే నోటిఫికేషన్లు దృష్టిని మరల్చుతుంటాయి. అలా అని ఫోన్ను ఏరోప్లేన్ మోడ్లో ఉంచడం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎన్డీ మోడ్గా ప్రసిద్ధి చెందిన ‘డూ నాట్ డిస్టర్బ్ మోడ్’ అవసరం. అప్లికేషన్ల నుండి నోటిఫికేషన్లను బ్లాక్ చేయడానికి, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు దృష్టిని మరల్చే ఫోన్కాల్లను మ్యూట్ చేయడానికి డీఎన్డీ ఉపయోగపడుతుంది. డీఎన్డీ సెట్టింగ్ బ్రాండ్ నుంచి బ్రాండ్కు భిన్నంగా ఉంటుంది. కానీ బేసిక్స్ మాత్రం అలాగే ఉంటాయి.డీన్డీ సెట్ చేయడానికి...ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చెయ్యాలి ∙ ‘డోన్ట్ డిస్టర్బ్’ అని సెర్చ్బార్లో టైప్ చేయాలి. ∙ఆండ్రాయిడ్ ఫోన్లోని క్విక్ సెట్టింగ్ ప్యానెల్లో కూడా డీఎన్డీ కనిపిస్తుంది. ∙ఇప్పుడు డీఎన్డీ మోడ్ ఆన్ చేయవచ్చు డీఎన్డీని షెడ్యూల్డ్ చేయడానికి ‘షెడ్యూల్డ్’ను క్లిక్ చేయాలి ప్లస్(+) సైన్లోకి వెళ్లి యాక్టివిటీని ఎంపిక చేసుకోవాలి. ఉదా: వర్కింగ్, స్లీపింగ్, స్టడీ... మొదలైనవి డీఎన్డీ మోడ్ టైమింగ్స్ ఎంపిక చేసుకోవచ్చు ∙ఎక్సెప్షెన్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఉదా: బాస్, వైఫ్, ఫాదర్, మదర్... మొదలైనవి ∙నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవాలనుకునే యాప్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.(చదవండి: డైట్ సెన్స్ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..) -
డైట్ సెన్స్ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..
ఇన్స్టాగ్రామ్లో 1.5 మిలియన్ల (15 లక్షలమంది) ఫాలోవర్స్ ఉన్న ఫిట్నెస్, న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్ తన పుస్తకాల ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకంతో పాపులర్ అయింది. ఆమె తాజా పుస్తకం...కామన్సెన్స్ డైట్. మన ఆహారం, ఆహారపు నియమాలు, ఉపవాసాలు... ఇలా అనేక అంశాలపై తలెత్తే సందేహాలకు సమాధానం ఇస్తుందామె.‘ఏది తినాలి... ఏది తినకూడదు అని తెలుసుకోవడానికి ఇబ్బంది పడనక్కర్లేదు. అదేమీ రాకెట్ సైన్స్ కాదు. కామన్ సెన్స్ మాత్రమే. హెల్త్ అంటే సిక్స్–ప్యాక్ మెయింటైన్ చేయడం. బరువు తగ్గడమే పనిగా పెట్టుకోవడం కాదు’ అంటుంది రుజుత.‘మంచి ఆరోగ్యం గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. బేసిక్స్ను చెక్ చేసుకుంటే సరిపోతుంది. సమయానికి భోజనం చేస్తున్నామా? వ్యాయామాలు మరీ ఎక్కువగా చేస్తున్నామా? అసలే చేయడం లేదా? రాత్రి లేటుగా నిద్ర΄ోతున్నామా?... మొదట ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి’‘ఆరోగ్యానికి సంబంధించి ఏది సరిౖయెన సమాచారమో, కాదో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా హెల్త్కు సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’‘తినే ఆహారం మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. అలా కాని పక్షంలో జాగ్రత్త పడాల్సిందే’... ఇలాంటి విషయాలెన్నో ‘కామన్ సెన్స్ డైట్’ పుస్తకంలో ఉన్నాయి. (చదవండి: కెమిస్ట్రీ ప్రొఫెసర్నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!) -
ఎవరీ జోనాస్ మాసెట్టి ..? అలవోకగా వేదాలు, భగవద్గీత..
భారతీయ సంప్రదాయాలకు ఆకర్షతులై ఆ జీవన విధానంతో బతికే విదేశీయలు ఎందరో ఉన్నారు. మన దేశ సంస్కృతి గొప్పతనం ప్రపంచానికి తెలియడానికి ఒక రకంగా ఇలాంటి విదేశీయులు కూడా కారణమని చెప్పొచ్చు. అలానే బ్రెజిల్కి చెందిన జోనాస్ మాసెట్టి మన దేశ సంప్రదాయాలకు ఆకర్షితులై వేదాన్ని నేర్చుకోవడమే గాక తన దేశంలో వాటి గురించి ప్రచారం చేసి..సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మన ప్రధాని మోదీ సైతం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మనకీ బాత్లో కూడా ఆయన గురించి ప్రస్తావించించారు. ఇంతకీ ఎవరీ జోనాస్ అంటే..బ్రెజిల్లోని రియో డిజెనిరియోలో జన్మించిన జోనాస్ మాసెట్టి మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (IME) నుచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రెజిలియన్ ఆర్మీలో ఐదేళ్లు పనిచేశారు. అలాగే కొన్నాళ్లు కన్సల్టింగ్ స్టాక్ కంపెనీల్లో కూడా పనిచేశాడు. భారతీయ సంప్రదాయాలకు, వేదాలకు ఆకర్షితుడై, చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చాడు. కోయంబత్తూర్లోని అర్ష వైద్య గురుకులంలో 4 సంవత్సరాల పాటు వేదాలను అభ్యసించాడు. ఆ తర్వాత బ్రెజిల్ వెళ్లి అక్కడ ‘విశ్వ వైద్య’ అనే ఆర్గనైజేషన్ను నెలకొల్పి.. వేదాలు వాటి విలువను, సారాంశాన్ని తన దేశ ప్రజలకు బోధిస్తున్నారు. అలాగే అవి మరింతమంది ప్రజలకు చేరువయ్యేలా ‘వేదాంత.లైఫ్’ అనే వెబ్సైట్ సాంకేతికతను వాడుకూంటూ.. వేదాల గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. అంతేకాదు జోనస్ తన పేరు చివరన ‘విశ్వనాథ్’ను యాడ్ చేసుకోవడం విశేషం. అలాగే మన ప్రధాని మోదీ సైతం ఆయన చేస్తున్న పని అభినందనీయమైనదని కొనియాడారు. అంతేగాదు జోనస్ తన 'ఫ్రీ ఓపెన్ కోర్సు' ద్వారా ఏడేళ్లలో సుమారు 1.5 లక్షలకు పైగా విద్యార్థులకు వేద విలువలను బోధించారని మన్కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు మోదీ. అంతేగాదు ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక కృషికి గానూ భారత ప్రభుత్వ పద్మ శ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. మరో విశేషమేమిటంటే వేద గురువు జోనాస్ చెప్పుల్లేకుండా తెల్లటి ధోతి, నుదుటన తిలకంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా ఆయన గతేడాది జీ20 శిఖరాగ్ర సమవేశానికి హాజరై అతని బృందంతో సంస్కృతంలో రామాయణాన్ని ప్రదర్శించి అలరించారు కూడా. (చదవండి: కెమిస్ట్రీ ప్రొఫెసర్నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!) -
పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల కాలంలో అందిరిలోనూ ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉంచుకునే యత్రం చేస్తున్నారు. అందులో భాగంగా మార్నింగ్ సమయంలో పచ్చి కూరగాయ సలాడ్లు, స్మూతీలు వంటివి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడొక మహిళ బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా సలాడ్లు తీసుకునేది. ఆ తర్వాత కొద్దిరోజులకే అనారోగ్య పాలైంది. ఆమె ఎందికిలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని..పరీక్షించగా అసలు విషయం తెలిసి వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు దయ చేసి పచ్చి కూరగాయలు తినేందుకు ప్రయత్నించొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలా పచ్చిగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి సవివరంగా వెల్లడించారు. మరీ అవేంటో సవివరంగా తెలుసుకుందామా..!.35 ఏళ్ల మహిళ తరుచుగా తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నానంటూ ఆస్పత్రికి వచ్చింది. బరువు తగ్గే క్రమంలో స్ట్రిక్టడైట్ ఫాలో అయ్యి ఇలా ఇబ్బంది పడుతుందా అనే దిశగా ఆ మహిళను విచారించారు. అయితే ఆ మహిళ స్ప్రుహతప్పి పడిపోవడం, మూర్చ వంటి పలు సమస్యలను ఎదుర్కొనడంతో రక్త పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమె మెదులో గాయంతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దానికి కారణమేంటని..చూసిన వైద్యుడి ఆరోగ్య చరిత్రలో తలకు గాయమైన దాఖాలాలు లేవు. దీంతో ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారని ప్రశ్నించగా..ఆమె పచ్చి క్యాబేజీ, పాలకూర వంటి కూరగాయలను తీసుకుంటానని చెప్పింది. దీని కారణంగానే ఆమె బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతుందని వైద్యులు నిర్థారణకు వచ్చి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా జరగడానికి కారణం..ఈ పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్ లేదా బ్రెయిన్ వార్మ్ అని పిలుస్తారు. దీనికారణంగా పిల్లలు, పెద్దలు తరుచుగా మూర్చ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మరీ ఈ మహిళ ఈ పరిస్థితి బారిన పడటానికి ప్రధాన కారణం బ్రేక్ ఫాస్ట్గా సలాడ్లో తీసుకునే పచ్చి కాయగూరలేనని చెప్పారు. పచ్చి కాయగూరలు తీసుకోవడం మంచిది కాదా..? అంటే..ముమ్మాటికి మంచిది కాదనే అంటున్నారు వైద్యులు. వీటిల్లో బద్దె పురుగులు(టేప్వార్మ్ ) ఉంటాయట. మన నీటితో చక్కగా వాష్ చేశాం అనుకుంటాం గానీ.. అవి ఆకు మడతల్లో ఉండిపోతాయి. అంటే వాటికి సంబంధించిన లార్వాలు వంటివి పచ్చి కూరగాయల్లో ఉండిపోతాయట. ఎప్పుడైతే సలాడ్ పేరుతో పచ్చిగా తింటామో అవి నేరుగా మన కడుపులోకి నేరుగా వెళ్లిపోతాయి. దీంతో బ్రెయిన్ సిస్ట్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. మనం ఇలా పచ్చి కూరగాయలు తినగానే ఆ టేప్వార్మ్ సంబంధిత లార్వాలు రక్తప్రవాహంలోకి వెళ్లి..అక్కడ నుంచి మెదడు ప్రయాణించి తిత్తులుగా ఏర్పడతాయన్నారు. అంటే వాపు లేదా ద్రవం రూపంలో పేరుకుపోతాయట. దీంతో సదరు వ్యక్తికి తర్చుగా మూర్చలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.చికిత్స..యాంటీబయాటిక్, స్టిరాయిడ్లతో ఈ సమస్యను నివారిస్తామని తెలిపారు వైద్యులు. అయితే ఒక్కోసారి ఈ లార్వా గనుక చనిపోయినా..సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని అన్నారు. బాధితుడు తలనొప్పి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకుండా..సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్య నుంచి త్వరితగతిని బయటపడగలరని చెప్పారు. అలాగే ఒక్కోసారి ఈ టేప్ వార్మ్ లార్వా ప్రేగులలో కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. తద్వారా చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయట.క్యాబేజీలోనే ఎక్కువ..!క్యాబేజీ బ్యాక్టీరియాకు నిలయమా..? అంటే..అది పెరిగే నేల, కడగడానికి ఉపయోగించే నీరు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే క్యాబేజ్ని నీటితో వాష్ చేసినప్పటికీ టేప్ వార్మ్ లార్వాలు ఆకుమడతల్లో ఉండిపోతాయి. అందువల్ల వీటిని వేడినీటిలో కొద్దిసేపు ఉడికించి.. సలాడ్గా తీసుకుంటే ప్రమాదం ఉండదని చెబుతున్నారు వైద్యుల. ఈ టేప్ వార్మ్ లార్వాలు తక్కువ ఉడికించే కూరగాయలు, మాంసంలో అలానే ఉండిపోతాయట. అందుకని తగు మోతాదులో ఉడికిస్తే ఎటువంటి సమయం ఉండదని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్) -
అందాల తారలు.. అందమైన హృదయాలు..
అందాన్ని దాటి అద్భుతమైన హృదయాన్ని చూడగలిగితే స్ఫూర్తినిచ్చే మనసులెన్నో, మనుషులెందరో..! దీనికి నిదర్శనంగా నిలిచింది నగరంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ వేదిక. రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నిర్వహించిన హార్ట్ ఆఫ్ గోల్డ్ చారిటీ ఈవెంట్ దీనికి నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బాలసదన్ అనాథ పిల్లలకు సహకారం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ అనాథ చిన్నారులకు మేమున్నామంటూ పలకరించారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారుల చిట్టి పొట్టి పలుకులను ఆస్వాదించారు. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)వారితో ఆడారు, పాడారు, గుండెకు హత్తుకుని ఆతీ్మయత పంచారు. తారలు దిగివచ్చిన వేళ అంటూ సాగిన ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న, హెచ్ఐవీతో జీవిస్తున్న పలువురు చిన్నారులు కష్టాలను మర్చిపోయి మధుర స్మృతులను పొందారు. సిస్టర్ సిస్టర్ ఈ తెలుగు పాటకు అలా స్టెప్ వేయొద్దు, నన్ను చూడు ఇలా వెయ్యు అంటూ పసితనాన్ని, స్వచ్ఛతను మిస్ తారలకు చూపించారు. కార్యక్రమంలో మాజీ మిస్ వరల్డ్ క్రిస్టీనాతో పాటు మిస్ ఇండియా నందిని గుప్తా, వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. (చదవండి: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'
ఒకప్పుడు షూటింగుల్లో పాల్గొనడం అంటే అది నటీనటులకు మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు షూట్స్ అంటే పలువురికి రోజువారీ వ్యాపకం కూడా అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ పెంచుకోవాలనుకుంటున్న అనేక మందికి తమ ఫాలోవర్లను మెప్పించే క్రమంలో తరచూ కొత్త గెటప్స్లో కనిపించాల్సి వస్తోంది. అలాంటి వారికి ఈ అద్దె దుస్తులు బాగా అక్కరకొస్తున్నాయి. మరోవైపు పెళ్లికి ముందు సర్వసాధారణంగా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్స్తో పాటు అనేక రకాల స్వీయ చిత్రీకరణలు కూడా బాగా పెరిగాయి. ఇవి కూడా అద్దె దుస్తుల డిమాండ్ను పెంచేస్తున్నాయి.పార్టీల జోరు.. ధరల బేజారు.. నగరంలో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగింది. వారానికి కనీసం రెండు మూడు పారీ్టలకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి సిటీలో బిగ్ సర్కిల్ ఉన్న ప్రతీ వ్యక్తికీ సర్వసాధారణంగా మారింది. అయితే పారీ్టకి వెళ్లే ప్రతిసారి కొత్త డ్రెస్ కొనడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొంతమంది ప్రస్తుతం రెంటల్ వార్డ్డోబ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. వీటి వల్ల బ్రాండెడ్వి, అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించే అవకాశం కూడా ఉంటుంది. గత కొన్నేళ్లలో ‘నేను రెంట్ డ్రెస్ వేశాను’ అని చెప్పడం కొంతమందికి ఇబ్బంది, సిగ్గు కలిగించేది. కానీ ఇప్పుడు అది ‘కూల్’ ట్రెండ్గా మారిపోయింది.ట్రెండ్ వయసు టెన్ ఇయర్స్.. నగరంలో ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది ‘ర్యాప్డ్’ అనే రెంటల్ సరీ్వస్ అని చెప్పొచ్చు. ‘నేను ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు చాలామంది ఇది మంచి ఐడియా కాదు, ఎవరూ డ్రెస్లను రెంట్కు తీసుకోరని వారించారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారిని మా స్టోర్లో చూడవచ్చు’ అంటూ చెప్పారు ర్యాప్డ్ నిర్వాహకులు రితూ మల్హోత్రా. ‘నేటి ఫ్యాషన్ వేగంగా మారుతుంది ప్రతి కొత్త ట్రెండ్ను కొనుగోలు చేయడం ఖరీదైనదే కాక, వాటిని ఉంచడానికి అవసరమైన ప్రదేశం కూడా పెద్ద సమస్య అవుతుంది. అందుకే.. రెంటల్ సర్వీసు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఈ ట్రెండ్ను ప్రోత్సహించడం అంటే కేవలం మన జేబుకు మాత్రమే కాదు.. పర్యావరణానికి కూడా మంచిది’ అన్నారామె. కొన్ని సంవత్సరాలుగా రెంట్ డ్రెస్లు వేసుకుంటున్నాను. చాలా గొప్ప డిజైన్లు, ఎంపికలు ఉన్నాయి. పైగా, చాలా మంచి క్వాలిటీని కూడా అందిస్తున్నారు’ అంటున్నారు సైకాలజీ విద్యార్థిని వైష్ణవి. సూచనలు.. అడ్వాన్స్ బుకింగ్: ప్రత్యేక సందర్భాలకు ముందుగానే బుకింగ్ చేయడం మంచిది. పలు సంస్థలు ఫ్రీ అల్టరేషన్లు అందిస్తాయి. దుస్తులు డబుల్ డ్రైక్లీన్ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేసుకోవాలి. ఒక రోజు, 36 గంటలు.. ఇలా విభిన్న కాలవ్యవధులు ఉన్నాయి కాబట్టి సరిగా ధ్రువీకరించుకోవాలి. సందర్భోచితంగా.. అందుబాటు ధరల్లో..నగరంలో అద్దెకు తీసుకునేందుకు పార్టీ వేర్కి ఒక రోజుకు అద్దె సుమారు రూ.1,500 నుంచి రూ.3,500 వరకూ.. సంప్రదాయ దుస్తులైతే రూ.2,500 నుంచి రూ.6,000 వరకూ, వెస్టర్న్ ఫ్యాషన్ (డ్రెసెస్, సూట్స్) రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు(ఒక రోజు అద్దె) వరకూ మగవాళ్ల దుస్తులు(షర్ట్స్, టీ–షర్ట్స్, బ్లేజర్స్): రూ.800 నుంచి రూ.2 వేల వరకూ ఉన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మహిళల లెహంగాలు, షేర్వానీలు, గౌన్లు, పాశ్చాత్య దుస్తులు అందించేందుకు ర్యాప్డ్ మదాపూర్ – బేగంపేట్ పరిసరాల్లో సేవలు అందిస్తుండగా, వీరి దగ్గర దుస్తుల అద్దెలు రూ.3 వేల నుంచి, రూ.16,500 వరకు లభిస్తున్నాయి. అలాగే ఈసీఐఎల్ ప్రాంతంలోని తారా డిజైనర్స్ సంస్థ ప్రీ–వెడ్డింగ్ గౌన్లు, మ్యాటరి్నటీ ఫొటోషూట్ దుస్తులు, కపుల్ అవుట్ఫిట్స్కు పేరొందింది. కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని సైలీజింగ్ అనే సంస్థ లాంగ్ ట్రెయిల్ గౌన్లు, లెహంగాలు, మ్యాటరి్నటీ గౌన్లుకు పేరొందింది. అమీర్పేట్లోని ప్రీ వెడ్డింగ్ గౌన్స్ రెంటల్ బాల్ గౌన్లు, లెహంగాలు, శెర్వానీలు అందిస్తుంది. ఇక మగవాళ్ల దుస్తులకు ప్రత్యేకించిన కేపీహెచ్బీ ప్రాంతంలోని స్టైల్ హిమ్లో బ్లేజర్లు, శెర్వానీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లైరోబ్ సంస్థ శెర్వానీలు, జోద్పురి సూట్లు, నెహ్రూ జాకెట్లు, పాశ్చాత్య దుస్తులు అందిస్తోంది. ఆన్లైన్ బుకింగ్ నుంచి ఆల్టరేషన్స్ దాకా ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. అలాగే కస్టమ్ ఫిట్టింగ్, హోమ్ డెలివరీ. హైజీన్ గ్యారెంటీ, డిపాజిట్ రిఫండబుల్.. ఆఫర్ చేస్తున్నాయి. (చదవండి: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..!
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కీలక ఘట్టాలకు తెరలేచింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. నగరంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ సారి భారతీయ సుందరి నందిని గుప్తా గెలిస్తే.. అది మరో కిరీటాన్ని భారత్కు అందించడం మాత్రమే కాదు అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న దేశం అనే రికార్డ్ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నా.. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ టైటిల్స్ను సాధించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. అదే విధంగా వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది. తద్వారా ఇండియా, వెనిజులా – రెండూ సమానంగా 6 టైటిల్స్ గెలుచుకుని నెంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాయి. మన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ (యుకె) 5 టైటిల్స్, జమైకా, ఐస్లాండ్ – రెండూ చెరో 3 టైటిల్స్ గెలుచుకున్నాయి.నగరంపై నజర్ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లామర్ ప్రపంచం దృష్టి మొత్తం నందిని గుప్తాపైనా, హైదరాబాద్ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్ను నందిని గెలిస్తే అది భారత్ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది. కాబట్టి ఆ ఘనత నగరం వేదికగా సాకారం కావాలని గ్లామర్ రంగ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?) -
మణికట్టుపై పల్స్ లేకపోవడం ప్రమాదకరమా!.. బిగ్బీకి సైతం..
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిని గొప్ప నటుడు. ఏ పాత్రలోనే ఇట్టే ఒదిగిపోయి..ప్రేక్షకుల, విమర్శల ప్రశంసలు అందుకున్న దిగ్గజ నటుడు. అయితే ఆయకు మణికట్టుపై పల్స్ అస్సలు ఉండదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్లో చెప్పారు. ఆ సీజన్ ఎపిసోడ్లో ‘సాధారణంగా హార్ట్ బీట్ తెలుసుకోవడానికి రెండు వేళ్లను శరీరంలో ఏ భాగంపై ఉంచి చూస్తారు?’ అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు మణికట్టు సమాధానం. ఆ నేపథ్యంలో బిగ్బీ తన మణికట్టుపై వేళ్లు పెట్టినా నాడి దొరకదని చెప్పుకొచ్చారు. దానికి గల కారణాన్ని కూడా వివరించారు. మరీ ఇలా పల్స్ ఉండకపోవడం ఏదైనా అనారోగ్యానికి సంకేతమా..?, ఎందువల్ల ఇలా జరుగుతుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.1982లో కూలీ సినిమా సమయంలో అమితాబ్ ప్రమాదం బారినపడ్డారు. ఆ ప్రమాదం కారణంగా చాలా రోజులు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. అదీగాక ఆస్పత్రి సిబ్బంది ప్రతి అరగంటకొకసారి రక్తం తీసుకోవడానికి సూదులు గుచ్చేవారని అన్నారు. దాంతో మణికట్టుపై పల్స్ పనిచేయడం ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతం తన మెడపై మాత్రమే పల్స్ ఉంటుందని అన్నారు. ఇది సర్వసాధారణమా లేక ప్రమాదమా..?ఇది సర్వసాధారణంగా గాయం, శస్త్ర చికిత్స లేదా రక్తనాళాలను ప్రభావితం చేసే వైద్య పరిస్థితులు వంటి వాటి కారణంగా సంభవిస్తుంది. వాస్తవానికి ఆరోగ్యవంతమైన వ్యక్తుల మణికట్టు వంటి ప్రామాణిక పాయింట్లలో పల్స్ సులభంగా తెలుస్తుంది, గుర్తించగలం కూడా. అయితే గాయం లేదా ధమనులకు సంబంధించిన సమస్యల కారణంగా కొత్తమందికి బలహీనమైన పల్స్ ఉండొచ్చని అన్నారు వైద్యులు. అయితే ఇలా లేకపోవడం మాత్రం మొత్త ఆరోగ్యానికి అంత ప్రమాదకరమేమి కాకపోయినా..కారణమేంటన్నది తెలుసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు.మన హార్ట్ బీట్ని గుర్తించడానికి ఉపకరించేవి శరీరంలోని పల్స్ పాయింట్లేనని అన్నారు. మన శరీరంలో ఎక్కడెక్కర్ పల్స్ ఉంటాయంటే..రేడియల్ పల్స్: బొటనవేలు బేస్ దగ్గర మణికట్టు మీదకరోటిడ్ పల్స్: మెడకు ఇరువైపులా, వాయునాళం పక్కనఫెమోరల్ పల్స్: గజ్జ ప్రాంతంలోపాప్లిటియల్ పల్స్: మోకాలి వెనుకడోర్సాలిస్ పెడిస్ పల్స్: పాదం పైభాగంలోపోస్టీరియర్ టిబియల్ పల్స్: చీలమండ ఎముక వెనుకఇలా శరీరంలోని ఈ విభిన్న ప్రాంతాల్లోని నాడీ స్పర్శ సాయంతో హృదయ స్పందనని అంచనా వేస్తారు ఆరోగ్య సంరక్షణ నిపుణులు.పల్స్ తెలుసుకోవడం ఎలా అంటే..పల్స్ను తనిఖీ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. పైగా సింపుల్ తెలుసుకునే క్లినకల్ అంచనా. అందుకోసం మన చూపుడు, మధ్య వేళ్లను పల్స్ పాయిట్లపై ఉంచి.. వారి హృదయస్పందన రేటు ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉందనేది అంచనావేస్తారని చెబుతున్నారు నిపుణులు. అలా అని నిర్లక్ష్యం చెయ్యొద్దు..మణికట్టులో పల్స్ లేకపోతే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే..ఆ వ్యక్తికి గాయం లేదా ఎలాంటి శస్త్ర చికిత్సలు జరిగిన ఆరోగ్య చరిత్ర లేకపోతే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ఇది రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా ధమని అడ్డంకి లేదా నరాల సంబంధిత సమస్యని సూచిస్తుంది. దీన్ని గనుక నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించనట్లయితే అంతర్లీనంగా ఉన్న వైద్య పరిస్థితిని ముందుగా గుర్తించి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by ❤🔥Magic_or_fun😆 (@magic_or_fun) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: భారతీయుల దంతాలు బాగుంటాయ్..! జర్మన్ వ్యక్తి ప్రశంసల జల్లు) -
భారతీయుల దంతాలు బాగుంటాయ్..!
ఇంతవరకు భారతదేశంలోని ప్రాంతాలు, వివిధ ప్రజల సంస్కృతులు, ఆచార వ్యవహారాలపై ప్రశంసల జల్లు కురిపించారు కొందరు విదేశీయలు. ఇంకొందురు ఓ అడుగు ముందుకేసి మరీ..ఈ దేశంలోనే తమ పిల్లల బాల్యం గడవాలని..ఇక్కడైతేనే విలువలతో పెరుగుతారంటూ భారతదేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ విదేశీయడు భారతీయుల దంత పరిశుభ్రతను మెచ్చుకుంటూ ఓ పోస్టు పెట్టారు. ఇది నెట్టింట వైరల్గా మారడమే గాక.. ఇది ఎంత వరకు సబబు అంటూ వివిధ చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్లో ఏం పేర్కొన్నాడు..? నెటిజన్లు ఏమంటున్నారు..? అంటే..జర్మన్కి చెందని ఓ ఉద్యోగి తన భారతీయ సహోద్యోగుల దంత పరిశుభ్రతపై చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన పోస్ట్లో ఆయన తన భారతీయలు సహోద్యోగులందరి దంతాలు చాలా బాగున్నాయని, వాళ్లందరివి తెల్లగా మెరుస్తూ ఉంటాయని అన్నాడు. పైగా వారి నోటి నుంచి దుర్వాసన అనేది రాదని, వారందరికి చాలా చక్కటి దంత సంరక్షణ అలవాట్లు ఉన్నాయని పేర్కొన్నాడు. వాళ్ల దంతాలే అంతలా తెల్లగా ఎలా ఉన్నాయని తెగ ఆలోచించానని అన్నారు. బహుశా వారు తీసుకునే ఆహారంలోని వ్యత్యాసమా లేక దంత పరిశుభ్రతకు సంబధించి సంప్రదాయ అలవాట్ల అందుకు కారణమా అనేది మిస్టరీగా ఉందని రాసుకొచ్చాడు. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని చాలా కుతుహలంగా ఉందని పోస్ట్లో పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే గాక..కొందరూ అందుకు కారణాన్ని వివరించారు. మరికొందరు తాము ఫేస్ చేసిన కొందరు వ్యక్తుల దంత అపరిశుభ్రత గురించి షేర్ చేసుకున్నారు. కానీ ఒక నెటిజన్ వైద్యుడిగా.. అందుకు గల రీజన్ని చాలా వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్లో. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం తోపాటు..పరగడుపునే బ్రష్ చేయకుండా ఏం తీసుకోని భారతీయుల అలవాటే అందుకు కారణమని అన్నారు. అలాగే భారతీయులు ఏ ఆహారం తిన్నా..వెంటనే పుక్కిలించడం వంటివి చేస్తారు. అయితే పాశ్చాత్య దేశాల్లో అంతగా పట్టించుకోరు..లైట్ తీసుకుంటారు. ముఖ్యంగా పాలు తాగడం, వివిధ మాంసాహారాలు తిన్నప్పుడు కచ్చితంగా దంత సంరక్షణ పాటిస్తారని అన్నారు. అలాగే చాలామంది భారతీయ పేషెంట్లలో దంత అపరిశుభ్రత ఉండటాన్ని గమనించానన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పోగాకు, గుట్కా వంటి చెడు అలవాట్ల కారణంగా దంతాలు పసుపు వర్ణంలో ఉండి, దుర్వాసనతో ఉన్న చాలామంది వ్యక్తులకు ట్రీట్మెంట్ చేశానని అన్నారు. ఏదీఏమైనా..ఈ పోస్ట్ వల్ల అనాదిగా మన పెద్దల నుంచి వచ్చిన అలవాట్లే మన భారతీయుల దంత పరిశుభ్రతకు ప్రధాన కారణమనే విషయంల హైలెట్ అయ్యింది. మనమే చెత్త అలవాట్లతో చేజేతులారా మన ఆరోగ్యాన్ని, దంతాలను పాడు చేసుకుంటున్నామనే విషయం కూడా వెల్లడైంది. కాబట్టి..మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే మంచి అలవాట్లను వినే ప్రయత్నం చేద్దాం.. అందరం ఆరోగ్యంగా ఉందాం.!.(చదవండి: డిష్ వాష్బార్లతో చేతులు పాడవ్వుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..) -
అమ్మా..నాకు జీతం వచ్చిందోచ్..!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమిష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది. చిన్న నగరాల నుంచి..‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్–జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు.కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్. ముందుగా అమ్మకు..తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది. ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు. దానంలోనూ, పొదుపులోనూ మహిళలే మొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు. దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తమవారికి కృతజ్ఞతగా..తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.బంగారం కొంటున్నారు..పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపుచేయాలనుకుంటున్నారు.(చదవండి: అమ్మలకు ఆదాయ పన్ను మినహాయింపు..!) -
ఈ సమ్మర్ కలర్ఫుల్ జ్ఞాపకంగా ఉండాలంటే..బొమ్మలు వేయాల్సిందే..!
వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులెన్నో చెప్పుకున్నాం. ఇంకా కొన్నే మిగిలాయి. ముఖ్యమైనది పెయింటింగ్. పిల్లలూ... మీరు నేచురల్ పెయింటర్స్. అంటే మీరు బ్రష్ తీసుకుని ఏది గీసినా అందులో అందం ఉంటుంది. బొమ్మలు వేయడంలో చాలా విధానాలున్నాయి. బొమ్మలు వేయకుండా పిల్లలు ఉండకూడదు. ఈ సమ్మర్ను కలర్ఫుల్ జ్ఞాపకంగా మిగుల్చుకోవాలంటే కాసిన్ని బొమ్మలేసి దాచుకోవాల్సిందే.రంగులకు ఏ విలువా లేదు. కాని వాటితో వేసే రూపాలకు విలువ. పిల్లలూ... బొమ్మలు వేయడం మనిషి పుట్టుకతో వచ్చే ఒక కుతూహలం. బొమ్మలు ఎప్పటికీ రాని వాళ్లు కూడా పెన్నూ పేపర్ దొరికితే పిట్ట బొమ్మో పిల్లి బొమ్మో గీస్తారు. మన చేతుల్లో నుంచి ఒక రూపం పుట్టడం మనిషికి ఆనందం. చెట్టు వేసి దాని మీద గూడు వేసి ఆ గూటిలో పిల్లల్ని వేసి ఆ బొమ్మను చూసుకుంటే సంతోషం కలుగుతుంది. మనం బొమ్మలు ఎందుకు వేస్తామంటే మనం చూసింది, ఊహించింది రంగుల్లో నిక్షిప్తం చేసుకోవడానికి. బొమ్మలు వేయడం మంచి హాబీ. కాలక్షేపం. మీరు మంచి పెయింటర్లుగా ఎదిగితే ఆ బొమ్మలను కొనేవాళ్లు కూడా ఉంటారు. నిజం. మన దేశంలో త్యాబ్ మెహతా అనే ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన బొమ్మలు ఇప్పటికీ కొంటారు. ఎంతకు తెలుసా? ముప్పై కోట్లు... నలభై కోట్లు... చిన్న బొమ్మ. అంత డబ్బు. అయితే ఆ బొమ్మల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. మీ బొమ్మల్లో కూడా ప్రత్యేకత ఉండాలి. అది సాధన చేస్తే వస్తుంది. బొమ్మలు వేయకుండా సెలవుల్ని ముగించకూడదు. అసలు మీ అందరి దగ్గర కలర్స్, కలర్ పెన్సిల్స్, చార్కోల్స్, బ్రష్షులు తప్పకుండా ఉండాలి. వాటర్ కలర్స్తో వండర్స్ సృష్టించొచ్చు తెలుసా?చిత్రలేఖనంలో రకాలు..బొమ్మలు గీయడమంటే మీకు చాలా ఇష్టం. తెల్ల కాగితం, రంగుల పెన్సిళ్లు కనిపిస్తే ఏదో ఒకటి తోచింది గీస్తూ ఉంటారు కదా. దాన్నే మరింత నైపుణ్యంగా గీస్తే చిత్రలేఖనం మీ చేతికి వచ్చేసినట్లే. చిత్రలేఖనంలో అనేక రకాలున్నాయి. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, ఫిగరెటివ్ పెయింటింగ్స్, ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్, యానిమల్స్ పెయింటింగ్స్, గాడ్ పెయింటింగ్స్... ఇలా. వాటి గురించి మీరు బొమ్మలు గీసేకొద్దీ తెలుసుకుంటారు. ఇవి కాకుండా కార్టూన్లు, క్యారికేచర్లు... కూడా గీయొచ్చు. లైన్ ఆర్ట్ సాధన చేయొచ్చు. రాజా రవివర్మ, దామెర్ల రామారావు, పాకాల తిరుపతిరెడ్డి, ఎం.ఎఫ్.హుస్సేన్, ఆర్.కె.లక్ష్మణ్, బాపు, మోహన్, బాలి, చంద్ర, ఏలే లక్ష్మణ్ లాంటి అనేక మంది చిత్రకారుల బొమ్మలు మీకు నెట్లో దొరుకుతాయి. వాటిని చూసి వారిలా వేయడానికి సాధన చేస్తూ కూడా బొమ్మలు నేర్చుకోవచ్చు.చిత్రలేఖనం వల్ల లాభాలు..ఏకాగ్రత: చిత్రలేఖనమంటే రంగులతో మాత్రమే పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. మనసులోని భావాలను కాగింతపై బొమ్మగా మారేందుకు ఆలోచించాలి, నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. చిత్రలేఖనం సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు చదువు మీద దృష్టి నిలిపేందుకు తోడ్పడుతుంది.మానసికోల్లాసం: రంగులతో బొమ్మలేయడం వల్ల మానసికోల్లాసం లభిస్తుంది. ఖాళీ కాగితం మన చేతిలో రంగులమయం మారుతున్నకొద్దీ మనలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. మన చేతివేళ్లు చకచకా కదిలి, బొమ్మగా రూపుదిద్దుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది. ఇదంతా చిత్రలేఖనం వల్ల సాధ్యపడుతుంది.క్రియేటివిటి: సమాజంలో రోజూ మీరు చూసే అంశాలను బొమ్మలుగా గీయాలనుకునే క్రమంలో మీలో క్రియేటివిటి పెరుగుతుంది. బొమ్మల్ని గీసే పద్ధతిలో మీదైన కొత్త విధానం ఒంటబడుతుంది. ఇది మీ మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. కొత్త విషయాలు ఆలోచించేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు ఉపకరిస్తుంది.గుర్తింపు: చిత్రలేఖనం లలిలకళల్లో ఒకటి. అనేకమంది చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి చిత్రాలు నేటికీ మనకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. మీరు చిత్రలేఖనం సాధన చేయడం ద్వారా అందరిలో గుర్తింపు పొందుతారు. మరింత పట్టు సాధించడం ద్వారా గొప్ప చిత్రకారులుగా పేరు పొందుతారు. అది మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుంది. చిత్రలేఖనం ఎక్కడ నేర్చుకోవాలి?పిల్లలకు చిత్రలేఖనం నేర్పడానికి ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు, సంస్థలు ఉన్నాయి. రోజూ కొంత సమయం అక్కడికి వెళ్లి, వారి చెప్పిన పద్ధతిలో బొమ్మలు గీయడం సాధన చేయవచ్చు. చిత్రలేఖనం నేర్పేందుకు ఈ వేసవిలో కొన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు. వాటిలో చేరొచ్చు. ఆన్లైన్ ద్వారా చిత్రలేఖనం నేర్పేవారు కూడా అందుబాటులో ఉంటారు. ఆ పద్ధతిలో రోజూ సాధన చేయవచ్చు. మీకు మరింత ఆసక్తి ఉంటే సెలవుల తర్వాత కూడా దాన్ని కొనసాగించవచ్చు. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
డిష్ వాష్బార్లతో చేతులు పాడవ్వుతున్నాయా..?
మార్కెట్లో దొరికే డిష్ వాష్బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధ రకాల చర్మసమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం...వెనిగర్లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి.గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తొమితే మురికితోటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది.బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో గిన్నెలు తోమితే మురికి వదలడమే గాక మంచి వాసన కూడా వస్తాయి.గోరంత అందం..గోళ్ల రంగుని శుభ్రంగా తొలగించి.. గోరువెచ్చని జొజోబా నూనెను గోళ్లమీద, చుట్టూ్ట ఉన్న చర్మంపైన వేసి గుండ్రంగా మర్దన చేయాలి. దీనివల్ల గోళ్లకు రక్త సరఫరా జరిగి చక్కగా పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు మర్ధన చేసి ఉదయం కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల గోళ్లు అందంగా పెరుగుతాయి. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!
ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? – పవన్ కుమార్, రాజమండ్రిమీరు వెంటనే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? – ఎస్డీ. జహంగీర్, హైద్రాబాద్మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..) -
ఆ చిన్నారి ప్రతిభకి బ్రిటన్స్ గాట్ టాలెంట్ ఫిదా..!
బ్రిటన్స్ గాట్ టాలెంట్ (బీజీటీ) అనేది బ్రిటన్ టెలివిజన్ టాలెంట్ షో. ఈ వేదికపై తమ ప్రతిభను చూపించుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తుంది యువత. ఈ ప్రపంచ వేదికపై ఫేమస్ అయిన ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ షోకి ఉన్న ఆదరణ, క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ షోలో మన భారతదేశం నుంచి చాలామంది తమ టాలెంట్ చూపించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. అయితే ఈ సీజన్ ఎపిసోడ్లోలో ఈశాన్య భారతదేశం నుంచి తొమ్మిదేళ్ల బినితా చెట్రి ఫైనల్కి చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ టాలెంట్ షో సెమీ ఫెనల్స్లో బినితా అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే గాక బినితాకి అధిక ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఇన్స్టాలో ఆ చిన్నారి బినితా.."ఆ ప్రోగ్రామ్ తాలుకా ఫోటోలను షేర్ చేస్తూ..ప్రతి క్షణం గొప్పగా ఉంది. మీ అందరి సపోర్టు లేకుండా ఇదంతా చేయలేను." అని పోస్టులో రాసుకొచ్చింది. కాగా, అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇవ్వాలనే తన కలను సాకారం చేసుకోవడానికి తన తండ్రితో కలిసి యూకేకి వెళ్లింది. అక్కడ ప్రదర్శన ఇచ్చే ముందు జడ్డీలతో ఇచ్చిన సంభాషణలో అమాయకంగా మాట్లాడిన ఆ చిన్నారి మాటలు అందర్నీ విస్మయానికి గురి చేశాయి. ఈ పోటీలో గెలిచి.. పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనేది తన కోరికని అత్యంత అమాయకంగా చెప్పడం విశేషం.ఆ ముద్దు మాటలు అందరి మనసులను దోచుకున్నాయి. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెట్రీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆమె ప్రతిభను ప్రశంసించారు. "యూకేలో అస్సాం ప్రతిభ ప్రకాశిస్తోంది. ఈ లిటిల్ బినితా న్యాయనిర్ణేతలు అందరూ ఆహా అనేలా శక్తిమంతమైన ప్రదర్శన ఇచ్చింది.ఆ చిన్నారి కచ్చితంగా తదుపరి రౌండ్కి వెళ్తుంది. అలాగే ఆమె కోరుకున్నట్లుగా పింక్ ప్రిన్సెస్ ఇంటిని కొనుగోలు చేయగలదని ఆశిస్తున్నా. "అని పోస్టులో పేర్కొన్నారు ముఖ్యమంత్రి హిమంత. ఇక చెట్రి తదుపరి పోటీలో దాదాపు తొమ్మిది మంది ఫైనలిస్ట్లో పోటీ పడనుంది. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
ఈతరం నేర్చుకోలేకపోతున్న లైఫ్ స్కిల్స్ ఇవే..!
ప్రస్తుతం జనరేషన్ అంత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల టెక్నాలజీ యుగంలో పెరుగుతోంది. అలా అని టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే.. దానికంటే..కనీస ప్రాథమి జీవిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి. అత్యంత కీలకమైనది ఇదే అంటున్నారు నిపుణుల. మరీ ఈ తరం నేర్చుకోలేకపోతున్న ఆ జీవన నైపుణ్యాలేంటో తెలుసా..!.టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో చాలామంది యువకులకు కారు టైర్ మార్చడం, కుట్టడం వంటి చిన్న చిన్న పనులపై కనీస అవగాహన లేదంటున్నారు. చెప్పాలంటే ఈ జెన్ జెడ్ తరం అధికంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతోందని, ముఖ్యంగా ఊబకాయంతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఇంకొందరికి కనీసం చెల్లింపులు, డబ్బు ఖర్చు పెట్టే విషయం, వడ్డీరేట్లు గురించి అస్సలు సరిగా తెలియదని అన్నారు. ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్న చదువు వారి జీవన గమనానికి ఉపయోగపడకపోవటం బాధకరమని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత తప్పక నేర్పించాలని చెబుతున్నారు నిపుణులు. అలాగే తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడూ ఎలా ఇంటిని నిర్వహించాలి, ప్రమాదాలు వాటిల్లకుండా ఎలా వంట చేసుకోవాలి తదితరాలపై కొంచెం కూడా అవగాహన లేదని చెప్పారు. ముందు వాళ్లకు కనీస ప్రాథమిక జీవిత నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తూ..క్లాస్లో దీనిపై సెషన్లు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఇక మానసిక నిపుణులు ఆ నేపథ్యంలోనే 'అడల్టింగ్ 101' ఆన్లైన్ కోర్సు రూపొందించాయి. ఈ కోర్సులో ఏం నేర్చుకుంటారంటే..పోషకాహారం అంటే ఏంటీ, గృహ నిర్వహణ, కిరాణ దుకాణానికి ఎలా వెళ్లాలి, ఎలా కొనుగోళ్లు చేయాలి వంటి అంశాలపై యువతకు తర్ఫీదు ఇస్తారు. నిజానికి ఈ తరం జనరేషన్ ఇవి తెలుసుకోకపోవడానికి ప్రధాన కారణం తగిన స్వేచ్ఛ లేకపోవడమేనని అంటున్నారు. అన్ని అమర్చిపెట్టేయడం, ఏదైనా చెయ్యబోతుంటే..అమ్మో..! వద్దు ఏదో అవుతుందంటూ పేరెంట్స్ అతి ప్రేమ ఒలకపోయడంతో ఈ జెన్ జెడ్ జీవిన విధానానికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా పోయిందని చెబుతున్నారు నిపుణులు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన యువతరానికి ప్రాథమిక జీవన నైపుణ్యాలు తెలియదని అన్నారు. ఇలా 'అడల్టింగ్ 101' క్రాష్ కోర్సుల సాయంతో వాళ్లు తెలుసుకునేలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిపుణులు.(చదవండి: కల్చర్ మారింది సామీ..! అడవి బిడ్డల వివాహాల్లో 'పెళ్లి సందడి'..!) -
టెర్రస్ గార్డెన్స్ : ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్
నగరంలో టెర్రస్ గార్డెనింగ్(మిద్దె పంట) ఒక ట్రెండ్గా, సరికొత్త జీవనశైలిగా మారిన విషయం విధితమే. ఇందులో భాగంగానే నగరంలోని భవనాలు పచ్చదనం అల్లుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ అనే తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతీ ఇంటిపై చిన్న తోట ఉండాలనే ఆకాంక్ష ఒక్కొక్కరి హృదయంలోనూ నాటు వేస్తోంది. ప్రస్తుతం నగరంలోని మిద్దె తోటల ప్రేమికులువర్షాకాలాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ముందుగానే కురవడం, ఈ తొలకరి జల్లులు వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడానికి అనువైన ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి విత్తన సేకరణ మొదలుపెట్టారు. -సాక్షి, సిటీబ్యూరో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా విత్తనాల సేకరణ మొదలైంది. పాత కాలపు ‘నువ్వు ఇస్తే.. నేను ఇస్తా‘ పద్ధతిలో విత్తనాల మారి్పడి జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ విత్తన మారి్పడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ యాప్స్లో వందలు, వేల మందితో ఉన్న మిద్దెపంట గ్రూపులు ఈ విత్తన సేకరణపై దృష్టి సారించాయి. ప్రముఖ సోషల్ మీడియా గ్రూపులు వాట్సప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ విత్తనాల మారి్పడి సంస్కృతి మొక్కల కోసం మానవ సంబంధాలు పెరిగే సూచికగా మారాయి. ఈ గ్రూపుల సభ్యులు తమ వద్ద ఉన్న హెయిర్లూమ్ సీడ్స్, దేశీ విత్తనాలను ఇతరులకు పంచిపెడుతున్నారు. అయితే హైబ్రిడ్ విత్తనాలకు బదులుగా జెనెటిక్ డైవర్సిటీని నిలబెట్టే పద్ధతుల వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. సిటీలో పచ్చదనపు స్పర్శ టెర్రస్ గార్డెనింగ్ నగరానికి కొత్త కాకపోయినా, కోవిడ్ తర్వాత ఈ సంస్కృతి విస్తృతమైంది. ఇంటింటా పిల్లలకు మొక్కల తాలూకు పరిచయం కలిగిస్తూ, విత్తనాలు నాటే పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా కిడ్స్ సీడ్ స్వాప్ సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది పాత తరం జీవితానికి దగ్గరగా చేరే ఒక మార్గం కావడంలో సందేహం లేదు.‘‘ఇది మాకు ఆహారం కోసం మాత్రమే కాదు, మనశ్శాంతి కోసం కూడా’’ అని అంటున్నారు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మిద్దె పంట ప్రేమికురాలు సూర్యప్రభ. శ్రమకోర్చి నాటిన విత్తనాలు తర్వాత మొలక వేసిన మొక్కను చూడటం, తన చేతులతో పండించిన కూరగాయలను ఇంట్లో వండుకోవడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆమె పేర్కొన్నారు. మీట్స్తో పాటు అవగాహన ఈ నెలాఖరులో నగరంలోని బేగంపేటలో ఒక సీడ్ స్వాప్ మీట్ను నిర్వహించనుంది. ఇక్కడ ఎటువంటి డబ్బు లావాదేవీలు ఉండవు. ఇది పూర్తిగా మార్పిడి పద్ధతిపై ఆధారపడిన సదస్సు. దీనితో పాటు జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో విత్తన మార్పిడి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు గ్రూపుల్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మీట్లో విత్తనాల మార్పిడితో పాటు విత్తన భద్రతా పద్ధతులు, కంపోస్టింగ్ టెక్నిక్స్, ఇండోర్ ప్లాంట్స్ గురించి అవగాహన, జీరో వేస్ట్ గార్డెనింగ్ వంటి అంశాలపై చిన్న చిన్న సెషన్లు కూడా నిర్వహిస్తారు. విత్తనాల మార్పిడి ద్వారా కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధాలు కూడా నాటుతున్నారు. ఇంటికి అనువైన మొక్కలు ఈ వర్షాకాలంలో మిద్దె తోటల ప్రేమికులు ప్రధానంగా కూరగాయలు, పూల మొక్కలు, హెర్బ్స్ను నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా గోంగూర, బీరకాయ, దోసకాయ, ముల్లంగి, మిరపకాయ, టమోటా వంటి కూరగాయలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూహీ, చామంతి, గులాబీ, హిబిస్కస్ వంటి పూల మొక్కలతో పాటు తులసి, కరివేపాకు, వెల్లుల్లి కాడ, ధనియాల మొక్క, అలవేరా వంటి హెర్బ్స్ పెంచడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ స్థలంలో, కంటైనర్లలో సులభంగా పెరగడం ఈ మొక్కల ప్రత్యేకత. అలాగే ఈ మొక్కల వాసన, ఆకృతి, వండినప్పుడు వచ్చే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మిద్దె తోటల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. -
కల్చర్ మారింది సామీ..! అడవి బిడ్డల వివాహాల్లో 'పెళ్లి సందడి'..
కొండ కొనల్లో నివసించి..అడవి తల్లిని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగించే డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు వారి సంప్రదాయాలను గౌరవిస్తు ఆధునిక పద్ధతిలో వివాహాలు చేసుకుని తమదంటూ నాగరికతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు వివాహాలు వారి సంప్రదాయాల ప్రకారం గుట్టు చప్పుడు లేకుండా జరిగేవి. నచ్చిన యువతిని తీసుకువచ్చిన వరుడు తమ పెద్దల సమక్షంలో వివాహం చేసుకునే వారు. ఆచార వ్యవహారాల ప్రకారం వారి ఇద్దరిని వివాహం చేసేవారు పెద్దలు. కాని అందుకు భిన్నంగా నేటి యువత వివాహాలను ఆర్భాటంగా కొనసాగిస్తున్నాయి. వివాహాల్లొ ఆధునికత ఊరేగింపులు విందు, వినోదాలతో పాటు సంప్రదాయ నృత్యాలతో వివాహాలు కొనసాగుతున్నాయి. వధువు, వరుని తరఫున పెండ్లి కి ఆహ్వానించే కార్డులను ముద్రించి వారి బంధువులను ఆత్మీయులను ఆహ్వానించడం కనిపిస్తుంది. జిల్లాలొని బిసంకటక్ సమితి కుర్లి గ్రామంలొ డ్రేకు జకసిక కొడకు సేతు జకసిక అదే గ్రామానికి చెందిన బండీ వడక కూతురు వనిత వడకతొ వివాహం నిశ్చయమయ్యింది . ఈ క్రమంలో వివాహం సొమవారం నాడు జరిగింది. వరుడుకి ముకుటం ధరించి డిజే సౌండ్ ల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం అందరిని ఆకర్షించింది. యువత నృత్యాలతో కొనసాగిన ఊరేగింపులో భాగంగా సాంప్రదాయమైన ఆదివాసీ నృత్యా లు కూడా చోటు చేసుకున్నాయి. సుమారు 5 వేల మంది బంధువుల మధ్య వివాహాం జరిగింది. ఇంతటి ఆర్భాటంగా వివాహం జరగడంతో డొంగిరియా తెగన్లో ఇదే ప్రధమమని చెప్పాలి. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..) -
World Marketing Day: ఆన్లైన్ షాపింగ్ మంచిదేనా..?
స్కూటీపై కూర్చున్న ఇతను పవన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్నగర్కు చెందిన పవన్ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు. షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై మంగళవారం ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన రమేశ్ గతంలో కూరగాయల మార్కెట్కు నడిచి వెళ్లి కూరగాయలు, ఇతర వస్తువులు కొని తెచ్చేవాడు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులను పలకరిస్తూ బేరం చేసి మరీ కొనేవాడు. కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రైవేటు హోం డెలివరీ ఏజెన్సీలు రావడంతో ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాడు. ఎక్కువ సేపు కదలకుండా ఉండడంతో శారీరక శ్రమ కరువైంది. ఇప్పుడు రమేశ్కు సయాటిక సమస్య వచ్చింది.జగిత్యాలకు చెందిన నవీన్, అనిత దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఉరుకులు.. పరుగుల జీవితం. ఇలాంటి పని ఒత్తిడిలో షాపింగ్కు వెళ్లి వస్తువులు కొనే సమయం, తీరికలేక ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంట్లోకి, పిల్లలకు ఏ సామగ్రి అవసరమున్నా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. ఫలితంగా శారీరక శ్రమ తగ్గింది. ఈ మధ్య నవీన్ తీవ్రంగా అలసిపోవడంతో డాక్టర్ వద్దకు వెళ్తే షుగర్ వచ్చిందని నిర్ధారించారు.ఒక చేతిలో కిరాణ సామగ్రి, మరో చేతిలో సెల్ఫోన్లో మాట్లాడుతున్న ఇతను అంబ దాస్. సిరిసిల్లకు చెందిన అంబదాస్ డిగ్రీ వరకు చదివి ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. సిరిసిల్ల పట్టణంలో ఎవరు కిరాణ సామగ్రి, ఇతర వస్తువులు ఆర్డర్ చేసినా ఇంటి వరకు వెళ్లి డోర్ డెలివరీ చేశాడు. ఇలా పనిచేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. మంచినూనె.. వాటర్ విులన్.. టీషర్ట్.. చెప్పులు.. మందులు.. బిర్యానీ.. ఇలా ఏది కొనాలన్నా సెల్ఫోన్ ఉంటే చాలు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే నిమిషాల్లో డెలివరీ చేస్తారు. ఆన్లైన్ వ్యాపారం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఇరుగు పొరుగు.. కుటుంబ సభ్యులతో బజారుకు వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేవారు. దుకాణాలకు వెళ్లడం ద్వారా వ్యాపారులు, వినియోగదారుల మధ్య అనుబంధం పెరిగేది. నేడు ఆ పరిస్థితులు లేవు. చాలామంది అడుగు తీసి బయట వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డ నేటి జనం ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే మధుమేహం.. రక్తపోటు.. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. విస్తరిస్తున్న వ్యాపారంఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు మేజర్ గ్రామాల్లోనూ ఆన్లైన్ వ్యాపారం విస్తరిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వ్యాపారాన్ని గల్లీ వరకు విస్తరించేశాయి. డోర్ డెలివరీ విధానంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు అన్నీ ఇంటికే అందిస్తామని వ్యాపారం ప్రారంభించి విస్తరిస్తున్నారు. ఇలా వ్యాపారాభివృది్ధతోపాటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆన్లైన్ సేవల్లో మూడు వేల మంది డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. కనీస శ్రమ లేక ఆరోగ్య సమస్యలుమనిషి సగటున నిత్యం 6వేల అడుగులు వేయాలని వైద్యులు చెబుతున్నారు. కనీస శారీరక శ్రమ లేక అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. నిత్యం నడకతో జీవితాన్ని ప్రారంభించే వారు ఒక్క శాతం ఉంటే.. అసలు శారీరక శ్రమ లేకుండానే జీవించే వారు 99 శాతం మంది ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మనకు తెలియకుండానే జబ్బులతో జీవిస్తూ.. ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో వైద్యవ్యాపారం ఇప్పటికే చాలా వరకు విస్తరించింది. దీనికి కనీస శ్రమ లేక పోవడంతో ప్రధాన కారణం.కొత్తగా ప్రారంభించాంసిరిసిల్లలో కొత్తగా ‘వీఆర్ విత్ యూ’ పేరుతో ఆన్లైన్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాం. బిజీ లైఫ్లో ఉన్న వారికి ఏది కావాలన్నా 15 నిమిషాల్లో ఇంటికి చేర్చుతున్నాం. – గాజుల రాకేశ్, సుభాష్నగర్, సిరిసిల్లరోజూ 35 డెలివరీలు నేను ఈ మధ్యే డెలివరీ బాయ్గా చేరాను. ఇప్పుడు రోజూ 35 డెలివరీలు ఇస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలతోపాటు శివారు గ్రామాల వరకు వెళ్తుంటాను. ఆన్లైన్ ఆర్డర్లు చాలా పెరిగాయి. నాలాగే అనేక మంది ఉపాధి పొందుతున్నారు. – సంగెం తరుణ్, డెలివరీ బాయ్, సిరిసిల్ల టైం లేకే ఆర్డర్లుమార్కెట్కు వెళ్లి తెచ్చుకునే టైం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్లే ఎక్కువ. సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వేగం పెరిగింది. ఆన్లైన్ వ్యాపారం పెరిగింది. సమయం ఆదా అవుతుంది. బయటకు వెళ్లి వచ్చే టైంలో ఇంకో పని చేసుకోవచ్చు. ఆర్డర్ 15 నిమిషాల్లో ఇంటికే చేరుతుంది. ఇలాంటి సౌకర్యం ఉండగా షాపింగ్కు బయటకు ఎవరూ వెళ్తారు. – మామిడాల శ్యాం, సిరిసిల్లశారీరక శ్రమ ఉండాలి నిత్యం శారీరక శ్రమ ఉంటేనే ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి వ్యాయామం లేకుండా చాలామంది గడిపేస్తున్నారు. షుగర్ పెరగడానికి శారీరకశ్రమ లేకపోవడమే కారణం. మారిన జీవన శైలి కూడా కారణం. నిత్యం కొంత దూరమైన వాకింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు. – డాక్టర్ వంగ మురళీకృష్ణ, ఎండీ ఫిజీషియన్, సిరిసిల్ల (చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!) -
అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?
అగ్రరాజ్యం వేదికపై తెలంగాణ తేజం మెరిసింది. అమెరికా మెచి్చన అందం మన హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన చూరి్నకా ప్రియ కొత్తపల్లి సొంతం. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు అందాల పోటీల్లో దూసుకెళ్లింది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన చూర్ణికా ప్రియ డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఎవరీ చూర్ణికా ప్రియ..పుట్టింది పశ్చిమగోదావరి భీమవరం. పెరిగింది హైదరాబాద్ ఏఎస్రావునగర్ డివిజన్లోని భవానీనగర్లో.. తల్లిదండ్రులు కొత్తపల్లి రాంబాబు, వనజ ప్రోత్సాహంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న ఆమె ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని నిర్ణయించుకుంది. డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొంది.ఈ పోటీల్లో మొత్తం 5,300 మంది పాల్గొన్నారు. ఇందులో ఫైనల్కు 20 మంది యువతులు ఎంపికయ్యారు. ఆ తర్వాత టాప్–5, టాప్–3లో చోటు దక్కించుకుని సోమవారం తెల్లవారుజున(అమెరికాలో ఆదివారం అర్ధరాత్రి) జరిగిన గ్రాండ్ ఫైనల్లో రన్నరప్గా నిలిచింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ సింగర్ గీతామాధురితో పాటు మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు.. ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది. చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటాలనే లక్ష్యంతో చూర్ణికా ప్రియ ఈ పోటీల్లో పాల్గొంది. మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొన్నట్లు మొదట మాకు తెలియదు. టాప్–20లో సెలక్ట్ అయిన తర్వాత మాకు చెప్పింది. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. తర్వాత మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది. తన ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు. తనకు నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. టాప్–3లో ఉన్నాను ఫైనల్కు సెలక్ట్ అయ్యాను చెప్పింది. తర్వాత ఫోన్ చేసి ఫైనల్లో రన్నరప్గా నిలిచాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – కొత్తపల్లి రాంబాబు, తండ్రి(చదవండి: కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు) -
నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే..
ప్రతి వ్యక్తి జీవిత కాలంలో అతడు / ఆమె ఏదో ఓ సమయంలో నడుము నొప్పితో బాధపడతారు. అందునా జనాభాలోని 75 – 85 శాతం మందిలో... ఒక వయసు తర్వాత...మరీ ముఖ్యంగా నడి వయసు తర్వాత నడుము నొప్పి తప్పక కనిపించే అవకాశాలే ఎక్కువ.దీనికి అనేక కారణాలున్నప్పటికీ అందులో ఒక కారణమేమిటంటే... వెన్నుపూసల మధ్య భాగంలో ఉండే స్థలం సన్నబడటం.వైద్య పరిభాషలో దీన్నే ‘లంబార్ కెనాల్ స్టెనోసిస్’ అంటారు. ఇటీవల ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొదట్లోనే ఈ నొప్పి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసుకుంటే సమస్యను అదుపులో పెట్టవచ్చు. ఇంత విస్తృతంగా వచ్చే ఈ నొప్పి గురించి అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి వ్యక్తిని నిటారుగా నిలబెట్టే వెన్నెముక నిర్మాణమే ఓ అద్భుతం. ఇందులో 32 నుంచి 34 పూసలు వరసగా ఉంటాయి. ఇంగ్లిష్ అక్షరమైన ‘ఎస్’ను దాదాపుగా ΄ోలి ఉంటే ఈ వరస పూసలు ఇంత సమన్వయం తో ఉంటాయంటే... దారం దండలోని పూసల్లా... ఈ ఎముకలన్నీ వరస లో కలిసి ఉంటాయి కాబట్టి వాటిని పూసలుగా చెబుతుంటారు. ఇక పూసల్లోని మధ్యనుండే ఖాళీ స్థలంలోంచి దారం ఉన్నట్టే... ఈ వెన్నుపూసల ఖాళీ స్థలంలోంచి ‘వెన్నుపాము’ ఒక తాడులా వెళ్తుంది. అయితే ఇది తాడు కాదు.... అనేక నరాలు పెనవేసుకున్న సంక్లిష్ట నిర్మాణం. ఆయా నరాలన్నీ వెన్నుపూసల మధ్యనుండే ఖాళీల నుంచి బయటకు వస్తూ... ఆయా అవయవాలకు వెళ్తూ వాటిని పనిచేయిస్తూ ఉంటాయి. ఈ నరాల ఆదేశాలతో పనిచేసే ఆ అవయవాలు... చేతులూ, కాళ్లూ, వేళ్తూ, కీళ్లూ కాగా... ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తుండటంతోపాటు... మరికొన్ని ఇతర అవయవాలనూ సమన్వయ పరుస్తూ, వాటినీ పనిచేయిస్తాయి. ఈ 32 నుంచి 34 పూసలన్నింటితో పాటు... లోపల ఉన్న వెన్నుపాము మొత్తం నిర్మాణమంతటినీ కలుపుకుని దాన్ని ‘వెన్ను’ (స్పైన్)గా చెబుతారు. ఈ స్పైన్లోని... మెడ దగ్గర ఉండే భాగంలో ఏడు (సర్వేకల్ ఎముకలు) పూసలుండగా, ఛాతి, కడుపు భాగంలో పన్నెండూ (థోరాసిక్), అలాగే నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), ఇక మిగతావి ఒకదానితో మరోటి కలిసి΄ోయి ఉండే శాక్రల్ ఎముకలన్నీ కలిసి వెన్ను నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. కాక్సిక్ అనేది చివరన తోకలాగా ఉండే ఎముక. సంక్లిష్టమైన ఈ వెన్ను నిర్మాణంలోని మరో అద్భుతమైన నిర్మాణ ప్రక్రియ ఏమిటంటే... వెన్నుపూసలోని ఎముకకూ ఎముకకూ మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. ఈ నరాలే కాళ్లూ, చేతులతోపాటు వివిధ అవయవాలను కదిలిస్తూ, వాటితో పనులు చేయిస్తూ ఉంటాయి.నిర్ధారణకు ఉపయోగపడే ప్రధాన లక్షణం ఏమిటంటే... కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా పట్టేస్తాయి. అటు తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ నడవగలుగుతారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇలా నడవగలిగే దూరాలు క్రమంగా తగ్గుతూపోతాయి. విశ్రాంతి వ్యవధులు క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు తొలుత 600 మీటర్ల తర్వాత కాళ్లు బిగుసుకుపోతే అటు తర్వాత అలా బిగుసుకుపోవడం అన్నది 400 మీటర్లకే జరగవచ్చు. అటు పిమ్మట 200 మీటర్లకే బిగుసుకుపోవచ్చు. ఇలా దూరాలు తగ్గుతూ... విశ్రాంతి సమయపు వ్యవధి పెరుగుతూ ΄ోతుంది. ఇలా జరగడాన్ని ‘క్లాడియేషన్ డిస్టాన్సెస్’ అంటారు. ఇది లాంబార్ కెనాల్ స్టెనోసిస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణమని చెప్పవచ్చు. నిర్ధారణ ఇలా... బయటికి (క్లినికల్గా) కనిపించే నొప్పి లక్షణాలతో ‘లంబార్ కెనాల్ స్టెనసిస్’ను స్పష్టంగా అనుమానించవచ్చు, కొంతవరకు గుర్తించవచ్చు. అయితే దీని నిర్ధారణ కోసం ఎక్స్రే, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈ సమస్యతో పాటు ఒకవేళ వెన్నుపూసకీ వెన్నుపూసకీ మధ్యనున్న డిస్క్లు అటు ఇటు జరిగితే... అలాంటి డిస్ప్లేస్మెంట్ కూడా సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్ ప్రక్రియల్లో కనిపిస్తుంది. డిస్క్లు ఇలా స్థానభ్రంశమై కదలి΄ోవడాన్ని ‘హెర్నియేటెడ్ డిస్క్’ అని కూడా పిలుస్తారు. సీటీ స్కాన్ కంటే ఎమ్మారై చాలా ముఖ్యం.వెన్ను నొప్పికి ఒక ప్రధాన కారణం లంబార్ స్టెనోసిస్... నడుము భాగంలోని వెన్నుపూసల మధ్య స్థలం తగ్గడంతో నడుము నొప్పి వస్తుంటుంది. ఇలా ఖాళీ తగ్గినప్పుడు ఈ పూసలు... వాటి మధ్యనుంచి బయటకు వచ్చే నరాలను నొక్కేస్తుంటాయి. నరం తీవ్రంగా నొక్కుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే నొప్పికి కారణమయ్యేలా వెన్నుపాము ఉండే ‘లంబార్ కెనాల్’లో ఖాళీ తగ్గడాన్ని, తత్ఫలితంగా లంబార్ కెనాల్ ఇరుకుగా మారడాన్ని వైద్య పరిభాషలో ‘లంబార్ కెనాల్ స్టెనోసిస్’ అంటారు. లంబార్ అనేది నడుము దగ్గర ఉండే పూసలు కాబట్టి... అక్కడి ఖాళీ తగ్గింది కాబట్టి నొప్పి ‘నడుము ప్రాంతం’లో వస్తుంటుంది. అయితే ఇది కేవలం నడుము వరకే పరిమితం కాదు. కొన్ని సందర్భాల్లో నడుముకు ఇరువైపులా పిరుదులు, తొడలు, కాళ్లలోనూ నొప్పి కనిపిస్తుంది. చాలాసేపు నడిచినా లేదా ఒకేచోట చాలాసేపు నిలబడ్డా నొప్పి, అలసట ఎక్కువవుతాయి. గతంలో చాలా దూరాలు శ్రమలేకుండా నడిచేవారు కూడా ఇప్పుడు అంతగా నడవలేకపోతున్నామనీ, నడుము లేదా పిరుదులు, తొడలు, కాళ్లలో నొప్పి వస్తుందంటూ కంప్లెయింట్ చేస్తుంటారు. ఇక నడుముతో పాటు కొందరికి నేరుగా వెన్నులోనే నొప్పి కనిపించవచ్చు.వెన్నుపూస సన్నబడ్డట్టు తెలిసేదిలా... వెన్నుపాముని కలిగి ఉండే వెన్నుపూసల మధ్యనుండే ఖాళీ స్థలం ఒకే గది ఉన్న ఇంటి స్థలంలా ఉంటుంది. కిందనుండే డిస్క్ ఫ్లోరింగ్ అనుకుందాం. అప్పుడు పైన ఉండేది కప్పు అవుతుంది. వెన్నుపూస ఖాళీ తగ్గుతున్న కొద్దీ పైనా కిందా ఉండే ఎముక భాగాలు ఉబ్బుకొచ్చినట్లుగా బయటికి వస్తాయి. వీటినే ‘ఆస్టియోఫైట్స్’ అంటారు. ఇవి ఇలా ఉబ్బుకుని వచ్చి లోపలికి పెరుగుతాయి కానీ... ఒకసారి పెరిగినవి మళ్లీ తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు. ఇలా పొడుచుకొచ్చినట్లుగా ఉండే ఎముకభాగాల (బోనీ స్ట్రక్చర్స్)కు తోడుగా అక్కడి కణజాలం, మెత్తటి ఎముక (మృదులాస్థి) భాగాలు, లిగమెంట్లు... ఇవన్నీ వాపునకు (అంటే ఇన్ఫ్లమేషన్కు) గురవుతాయి. కేవలం ఎముక మధ్యలో ఉండే ఖాళీ స్థలమే కాకుండా... ఎముకకూ, ఎముకకూ మధ్యన ఉండే రంధ్రం (దీన్ని ఫొరామెన్ అంటారు) కూడా సన్నబారుతుంది. ఎముక మధ్య భాగం ఇంటి ఖాళీ స్థలం అనుకుంటే... దీన్ని ప్రవేశద్వారం అనుకోవచ్చు. అంటే ఇంటి మధ్యభాగంలో ఉన్న స్థలమే కాకుండా... ఇంట్లోకి వచ్చే ప్రదేశద్వారం కూడా సన్నబారిపోతుంది.సన్నగా అవడంతో జరిగేది ఇదీ...ఎముకలోని ఖాళీ భాగాలూ, ఎముక ప్రవేశద్వారం లాంటి ఫొరామెన్ అన్నీ సన్నబడటంతో... ఎన్నెన్నో నరాలు పెనవేసుకుని΄ోయి ఉండే వెన్నుపాము ఒత్తిడికి గురవుతుంది. నడుము భాగం (లంబార్) ప్రాంతం నుంచి కిందికి అంటే శాక్రల్, కాకిక్స్ అనే ప్రాంతాల నుంచి దాదాపు కనీసం 11 నరాల వరకు ఒత్తిడికి గురికావడంతో ఆయా భాగాలకు సప్లై అయ్యే నరాలు బాగా ఒత్తుకు΄ోయి నడుము వెనక భాగం, నడుము కిందిభాగం, పిరుదులు, వెన్ను కిందిభాగం పరిసరాల్లో నొప్పి వస్తుంటుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నొప్పి తీవ్రతరమవుతుంటుంది. అందుకే ఈ నరాలు ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశమున్న కదలికల్లో... అంటే వ్యక్తులు అకస్మాత్తుగా ముందుకు ఒంగినా, కుర్చీ నుంచి ఒక్కసారిగా లేచినా, అకస్మాత్తుగా కదిలినా తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు... ఆ నొప్పి... అక్కడికే పరిమితమైపోకుండా... పక్కనుండే పరిసరాల్లోకి పాకినట్లుగా అవుతుంది. దాంతో అవయవం చుట్టుపక్కల ప్రాంతాలూ నొప్పికి గురవుతాయి. అంటే అసలు భాగంలోని కాకుండా ఇలా పక్కలకు నొప్పి పాకడాన్ని ‘రిఫర్డ్ పెయిన్’ అంటారు. ఇలాంటి రిఫర్డ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు ఒక్కోసారి ‘సయాటికా నొప్పి’లాగానే అనిపించవచ్చు. ఇది నొప్పిని అనుకరిస్తున్నట్లుగా ఉండటంతో దీన్ని ‘సయాటికా మిమికింగ్ పెయిన్’ అని కూడా అంటారు. పుట్టుకతో వచ్చే... కంజెనిటల్ స్టెనోసిస్...కొంతమందికి పుట్టుకతోనే వెన్నుపూసల్లోని ఖాళీ స్థలం ఇరుగ్గా ఉండవచ్చు. అయితే వారు పెద్దయ్యాక వెన్నుపూసల మధ్యభాగం ఇరుగ్గా మారి... ఆ వయసులో లక్షణాలు బయటపడవచ్చు. ఇలా పుట్టుకతోనే వెన్నుపూసల మధ్యభాగం సన్నగా ఉండటాన్ని ‘కంజెనిటల్ స్టెనోసిస్’గా పేర్కొంటారు. వీళ్లలోనూ నొప్పి, ఇతర లక్షణాలన్నీ మామూలుగా లంబార్ స్టెనోసిస్తో బాధపడేవారిలాగే ఉంటాయి. కాక΄ోతే వీళ్లది చాలావరకు అనువంశీకంగా వచ్చే సమస్య. కొన్ని అసాధారణమైన ఇతర రకాల నడుము నొప్పులు...ఓ వయస్సు దాటాక (ముఖ్యంగా మధ్యవయస్కుల్లో) నడుం నొప్పి రావడం చాలా సాధారణం. అయితే మరి కొంతమందిలో అసాధారణంగా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనేక కారణాలుంటాయి. అవి... పుట్టుకతోనే వెన్నెముకలో లోపాల వల్ల, వెన్నుకు అయ్యే గాయాల వల్ల, ఇన్ఫెక్షన్లు, గడ్డలు, మహిళల్లో మెనోపాజ్, వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వల్ల,స్టెరాయిడ్స్ వాడేవారిలో ఎముకలు మెత్తగా అయిపోవడం వల్ల, కొందరిలో స్పైన్ విరగడం, డిస్క్ పక్కకు తొలగడం వల్ల... ఇలా వెన్నుకు వచ్చే నొప్పులకు కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. నివారించుకోవడమిలా...స్ట్రెచింగ్తో బాలెన్స్నూ, ఇతర ఎక్సర్సైజ్లతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం. రోజూ ఉదయాన్నే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం.వార్మప్ తర్వాతనే ఎక్సర్సైజ్ మొదలుపెట్టడం. (అకస్మాత్తుగా మొదలుపెడితే నడుము పట్టేయడం వంటి అనర్థాలతో వెన్నునొప్పులు మరింత పెరిగే అవకాశం. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం. (తరచూ అంటే... ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఓసారి కాసేపటి కోసమైనా సరే... పొజిషన్ మారుస్తూ ఉండటం. నిల్చున్నప్పుడు అవకాశం ఉంటే... స్టూలు వంటి చిన్న ఎత్తుపైనో– కాసేపు ఓ కాలు, ఇంకాసేపు మరో కాలు ఆనిస్తూ నిలబడటం. యోగా వంటివి చేస్తున్నప్పుడు శిక్షణ పొందిన ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయడం. (తమ బరువుకు తగని ఆసనాలు సొంతంగా వేయడం మంచిది కాదు). ఏదైనా వస్తువును ఎత్తేప్పుడు దానికి సాధ్యమైనంత దగ్గరగా వెళ్లి కూర్చుని ఎత్తడం. (కేవలం నడుం మాత్రమే వంచి, తానే వంగి ఎత్తకుండా మోకాళ్లు కూడా వంచి కూర్చున్న భంగిమలోకి వెళ్లి ఎత్తడం మంచిది. కింది వస్తువులు ఎత్తేటప్పుడు నడుము మీద కాకుండా... తుంటి, మోకాలు భాగాలను వంచి వాటిమీద మాత్రమే ఒత్తిడి పడేలా ఎత్తడం మంచిది. అంతే తప్ప నిలబడ్డవారు ముందుకు ఒంగి ఏదైనా ఎత్తడం సరికాదు)అపోహవెన్నునొప్పి వచ్చినప్పుడు గట్టిగా ఉండే ఉపరితలంపైన పడుకోవాలన్నది ఇప్పటివరకూ ఉన్న ఓ అపోహ. వాస్తవం మరీ మెత్తగా ఉండే పరుపు మీద తప్ప...సౌకర్యంగా(కంఫర్టబుల్)గా ఉన్న ఏ పరుపు మీదైనా పడుకోవచ్చు.చికిత్స...నడుము నొప్పి ఏదైనా మొదట డాక్టర్లు ఫిజియోథెరపీ వ్యాయామాలను సూచిస్తారు. ఇక నొప్పి ఉపశమనం కోసం వేణ్ణీళ్ల కాపడం లేదా ఐస్తో కాపడం పెట్టడంతోపాటు అల్ట్రాసౌండ్ తరంగాల చికిత్స, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ థెరపీ ఇస్తారు. వెన్నుపూసల్లో స్థలం తగ్గి ఆ ఒత్తిడి నరంపై పడుతున్నప్పుడు ఆ నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తారు. తట్టుకోలేనంత నొప్పి ఉన్నవారికి కొద్దికాలంపాటు నొప్పినివారణ మందులూ ఇవ్వవచ్చు. (ఇది డాక్టర్లు సూచించిన నిర్ణీత వ్యవధి మేరకే వాడాలి. ఆ తర్వాత కూడా అలా కొనసాగించడం సరికాదు). ఇక తప్పని సందర్భాల్లో చివరి ప్రయత్నంగా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అయితే ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో ఈ తరహా శస్త్రచికిత్సలు మరింత తేలిగ్గా, సులువుగా చేయడం సాధ్యమవుతోంది. -
జస్ట్ వ్యాయమాలతోనే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుందా..?
మహిళల్లో కొందరు డెలివరీ తర్వాత బెల్లీఫ్యాట్తో ఇబ్బందిపడుతుంటారు. అలాగే కొందరు మగవాళ్లు కూడా ఈ సమస్యను ఎదర్కొంటుంటారు. దీన్ని తగ్గించుకోవడం గురించి పలు డైట్లు, వ్యాయామాల వర్కౌట్ల సమాచారం నెట్టింట ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి కూడా. అయితే దీన్ని జస్ట్ వ్యాయామాలతోనే కరిగించేసుకోగలమా అంటే..ఇటీవల ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాను ఒక వర్కౌట్ ప్రాక్టీస్ చేశానని అది బాగా వర్కౌట్ అయ్యి బెల్లీఫ్యాట్ తగ్గిందని చెప్పుకొచ్చింది. ఆ వ్యాయామం వల్లే తన బెల్లీఫ్యాట్ ఎనిమిది అంగుళాల వరకు తగ్గిందని తెలిపింది. ఆర్యోకరంగా ఉండటానికి వ్యాయమాలు అవసరమే కానీ అదొక్కటి చేసి బరువు తగ్గించుకోగలమా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. అలాగే బెల్లీఫ్యాట్ కూడా ఒక్క ఆ వ్యాయమంతోనే తగ్గిపోతుందని నిర్థారించలేమని అంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరకమైన ఆహారం, బ్రీథింగ్ ఎక్సర్సైజ్ల తోపాటు సరైన వ్యాయమాలతోనే దీన్ని తగ్గించుకోవడం సాధ్యమని చెబుతున్నారు. సాధారణంగా వ్యాయమాలు చేయగానే వేలాడే పొట్ట తగ్గిన అనుభూతి వస్తుంది. ఎందుకంటే కేలరీలు బర్న్ అవ్వడమే గాక పొట్ట తగ్గడమే లక్ష్యంగా వ్యాయమాలు చేస్తారు కాబట్టి తగ్గినట్లు అనిపిస్తుంది గానీ..కొన్నిరోజుల తర్వాత యథావిధిగా వేలాడే పొట్ట ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. బొడ్డుకొవ్వు తగ్గించుకోవడం తోపాటు బరువు కూడా అదుపులో ఉండాలని వ్యాయమాలు, చక్కటి డైట్ పాటిస్తేనే మంచి ఫలితం పొందగలరని నిపుణులు వెల్లడించారు. మనం తీసుకునే కేలరీలకు అనుగుణంగా ఎనర్జీ బర్న్ అయ్యేలా మన వర్కౌట్లు ఉండేలా ఫిట్నెస్ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నారు.కండరాలు బలోపేతం అయ్యేలా బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..ఆటోమేటిగ్గా బెల్లీఫ్యాట్ మాయం అవుతుందని అన్నారు. ఇక్కడ పోషకాహార, సరైన వర్కౌట్లు కీలకమనే విషయం గుర్తెరగాలని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Deepti dhakar (@ultimatefitness_with_deepti) (చదవండి: మస్తుమజా ‘మష్రూమ్స్’..! ఆదివాసులు మెచ్చే ఆహారం..) -
కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు
సినీ ప్రముఖుల, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 అంగరంగా వైభవంగా జరిగింది. ఈ నెల 13న మొదలైన ఈ వేడుక శనివారంతో ముగిసింది. ఈ ఫ్యాషన్ వేడుకలో మనదేశం తరఫున ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. వారంతా విలాసవంతమైన దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాలతో రెడ్కార్పెట్పై మెరిశారు. అయితే ఈ కాన్స్ ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటి అలియా భట్ హైలెట్గా నిలిచారు. ఆమె ఈ కేన్స్లో పాల్గొనడం తొలిసారి. పైగా అలియా లోరియల్ పారిస్కు బ్రాండ్ అంబాసిడర్గా ఈ వేడుకలో ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ముగింపు వేడుకల్లో అలియా గూచీ చీర లుక్ అందర్నీ మిస్మరైజ్ చేసింది. స్ఫటికాలు, ఐకానిక్ జీజీ మోనోగ్రామ్తో అలంకరించబడిన కస్టమ్-మేడ్, వెండి రంగు గూచీ చీర ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఈ మేరకు వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆ చీరలో రెడీ అవ్వడానికి ఎంతలా పాట్లు పడ్డానో వివరించారు అలియా. కాన్స్ ముగింపు వేడుక కోసం ప్రిపేర్ అవ్వుతుండగా..ఒక రకమైన గందరగోళం ఎదురైంది. తాను ముగింపు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా ఆత్రుతగా ఉంటే..సరిగ్గా రెడీ అయ్యే టైంకి కరెంట్ లేదు. దాదాపు నాలుగు గంటల నుంచి కరెంట్ లేదు. విద్యుత్ లేకపోతే మేకప్ దగ్గర నుంచి చీర కట్టుకునేంతవరకు ఏ పని సవ్వంగా అవ్వదు. ఏంటో టెన్షన్ నన్నువెతుక్కుంటూ వస్తుందా అనే ఫీలింగ్ వచ్చిందంట అలియాకి. హెయిర్ స్టైలిస్ట్లు, మేకప్ మ్యాన్లు తమ సౌందర్య పరికరాలను పనిచేసేలా ఎండలో ఉంచి..తనని రెడీ చేసేందుకు ట్రై చేస్తుండగా.. కరెంట్ వచ్చేసిందంటా. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ ఆఘమేఘాలపై అలియాని రెడీ చేశారట. థ్యాంక్ గాడ్..ఉత్కంఠ రేపేలా టెన్షన్కి గురిచేసినా..గూచి బ్రాండ్ తయారు చేసిన ఈ చీరలుక్ అందరి మదిని దోచుకోవడం సంతోషాన్నిచిందని అంటోంది. అలాగే ఈ ఆనందం అతకముందుకు అనుభవించిన హైరానా మొత్తం ఉఫ్మని ఎగిరిపోయేలా చేసిందిని చెబుతోంది అలియా. ఇక గూచీ బ్రాండ్ రూపొందించిన ఈ చీరకు బ్యాక్లెస్ బ్లౌజ్, ప్లంగింగ్ నెక్లైన్, ఫ్లోర్-గ్రేజింగ్ స్కర్ట్ ఎంత సూటబుల్గా ఉంది. చెప్పాలంటే అలియా లుక్ భారతీయ సంప్రదాయాన్ని సమకాలీన అంశాలతో మిళితం చేసినట్లుగా ఉంది. పైగా కాన్స్ 2025లో చిరస్మరణీయమైన సైలిష్ లుక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాళిని బ్యూటీ రహస్యం ఇదే..!) -
Mysore Pak: అలానే పిలవాలి..మార్చకూడదు..! ఎందుకంటే..
గత నెలలో జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తదనంతరం భారత్ పాక్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ చాలా చోట్ల దుకాణలో ఐకానిక్ స్వీట్ మైసూర్ పాక్ పేరుని మార్చేశారు కొందరు దుకాణాదారులు. దాంతోపాటు పాక్ పేరు వినిపించేలా ఉన్న కొన్ని రకాల ప్రసిద్ధ వస్తువుల పేర్లను కూడా మార్చేశారు. అయితే ఆ స్వీట్ని మైసూర్ శ్రీగా మార్చి.. అమ్మడం వివాదాలకు దారితీసింది. మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ IV పాలనలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో తయారైంది ఈ స్వీట్. ఆ రాజు వంటవాడి ఘనతకు నిదర్శనం ఆ స్వీట్. దాంతో ఆ వంటవాడి వారుసులు ఇలా పేరు మార్చడంపై మండిపడుతున్నాడు. ఇప్పటికీ మైసూర్ ప్యాలెస్లోనే తయారయ్యే ఆ స్వీట్ సృష్టికర్త కాకాసుర మాడప్ప మునిమనవడు ఎస్ నటరాజ్ అలా పేరు మార్చడాన్ని అస్సలు అంగీకరించటం లేదు. అలానే పిలవండి..ఆ స్వీట్ని మైసూర్ పాక్ అనే పిలవండి. ఎందుకంటే మా పూర్వీకులు అందించిన ఈ పాక ఆవిష్కరణకు మరో పేరు ఉండకూదని అన్నారు. ప్రతి స్మారక చిహ్నం లేదా సంప్రదాయానికి ఒక ప్రత్యేక పేరు ఉన్నట్టే..ఈ స్వీట్కి ఓ ప్రత్యేక పేరు ఏర్పడింది. దాన్ని తప్పుగా సూచించకూడదు..అలాగే మార్చకూడదు కూడా అని వ్యాఖ్యానించారు నటరాజ్.'పాక్' అనే పదం ఎందుకు వచ్చిందంటే..కన్నడలో 'పాక్' అనే పదం చక్కెర సిరప్ను సూచిస్తుంది. అలాగే ఈ స్వీట్ని మైసూర్ ప్యాలెస్లో తయారు చేయడంతో ..ఈ రెండు పేర్ల కలయికతో ఆ స్వీట్ని అలా పిలవడం జరగిందని అని వివరించారు నటరాజ్. అందువల్ల దీన్ని వేరే పేరుతో పిలిచే ప్రశ్నే లేదు అని తెగేసి చెప్పారు. అంతేగాదు..ఆ పేరే ఎందుకు ఉండాలంటే..ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా..ఆ స్వీట్ని చూసినా..దాన్ని చూడగానే ఎలా తయారైందని కథ గుర్తొచ్చేలా ఆ పేరులో ఉండాలి. అప్పుడే ఆ స్వీట్కి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దాని పేరు మార్చే హక్కులేదని నొక్కి చెప్పారు నటరాజ్. కర్ణాటకలో మైసూరు ప్రసిద్ధ గురు స్వీట్స్ కుటుంబం దీన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు దాని ఐదవతరం స్వీట్లో రారాజుగా పేరొందిన ఈ మిఠాయిని ప్రజాక్షేత్రంలో మరింత ప్రాచుర్యం కల్పించేలా నటరాజ్ ముత్తాత దుకాణాలను ప్రారంభించారు. అలా దీని గురించి దేశమంతటా తెలిసిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అంతేగాదు ఆ కుటుంబం నాల్గోతరం సభ్యుడు సుమేఘ్..వైసూర్, కర్ణాటక సాంస్కృతిక చారిత్రకలతో ముడిపడి ఉన్న స్వీట్ అని చెబుతున్నారు. ఇది తమ కన్నడిగ సమాజానికే గర్వకారణమని అన్నారు. ఇది మా ప్రజల మాధుర్యాన్ని కన్నడ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా మధురంగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ స్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి దీన్ని అనవసర వివాదాల్లోకి లాగొద్దని కోరుతున్నారు ఆ స్వీట్ సృష్టించిన కుటుంబ వారసులు. నోటిలో ఈజీగా కరిగిపోయే ఈ స్వీట్ భారతదేశం అంతటా వివిధ వేడుకలకు, పండుగల్లో తప్పనిసరిగా ఉండే ప్రముఖ స్వీట్ ఇది.(చదవండి: ‘మైసూర్’లో ‘పాక్’ మాయం! ) -
అడవి అందాల మధ్య వాక్
అడవి అందాలు, పక్షుల కిలకిల రావాలు, అనేక రకాల క్షీర జాతుల వీక్షణలతో ప్రకృతి ప్రేమికులు సందడిగా గడిపారు. మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకూ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన ఎకో టూరిజం బ్రాండ్ డెక్కన్ ఉడ్స్, ట్రయల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాక్టర్నల్ వాక్, బర్డ్ వాక్ కార్యక్రమంలో 22 మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి సమయంలో టార్చ్లైట్ల వెలుగులో నేచరలిస్టులు అఖిల్, సుమన్, అపరంజని పర్యవేక్షణలో నాగార్జునసాగర్ రేసర్ పాము, రెండు కట్ల పాములు, పాడ్డీ ఫీల్డ్ ఫ్రాగ్స్, ఒర్నేట్ నారో మౌత్డ్ ఫ్రాగ్లు, బుల్ ఫ్రాగ్లను వీక్షించారు. ఉదయం బర్డ్ వాక్లో గ్రే బెల్డీ కుక్కూ, బ్లూ ఫస్త్రస్ట్ మాల్కోకా, ఒరియంటల్ హనీ బజార్డ్, శిఖర, ల్యాంప్ వింగ్స్, నైట్జార్, బాక్ షోల్డర్ కైట్స్ వంటి అరుదైన పక్షులను వీక్షించారు. ఔత్సాహిక ప్రకృతి ప్రేమిలకుల కోసం నేచర్క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తిగలవారు తమను సంప్రదించాలని ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.రంజిత్నాయక్ సూచించారు. (చదవండి: కాస్మో'టెక్' సిటీ..మేకప్ రంగానికి పెరుగుతున్న ఆదరణ..)