breaking news
Lifestyle
-
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
'18-10-8-4-1 రూల్'..! జస్ట్ 21 రోజుల్లో ఏడు కిలోల బరువు..
స్పూర్తిదాయకమైన వెయిట్లాస్ స్టోరీలు ఎన్నో చూశాం. వాటన్నింటిలో క్రమశిక్షణ, నిబద్ధతకు పీఠం వేస్తే బరువు తగ్గడం సాధ్యమని తేలింది. ఇది కాస్త కఠినమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. అంతలా కష్టతరమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన పని లేకుండానే ఈ చిన్న ట్రిక్స్తో సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది ఈ డైటిషియన్. జస్ట్ ఈ చిన్న రూల్తో సులభంగా వెయిట్లాస్ అవ్వోచ్చు అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి ఆ రూల్ ఏంటో చూద్దామా..!డైటీషియన్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్లో తాను 21 రోజుల్లోనే ఏడు కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. అంతేగాదు తన నడుము సైజు కూడా చాలా వరకు తగ్గిందని రాసుకొచ్చారామె. తాను 18-10-8-4-1 రూల్ని అనుసరించి జస్ట్ 21 రోజుల్లోనే దాదాపు 63 కిలోలు నుంచి 56 కిలోలకు తగ్గినట్లు తెలిపారు. గంటలతరబడి ఆకలితోనూ, కార్డియో వంటి వ్యాయమాల హెల్ప్ లేకుండా స్లిమ్గా మారానని అన్నారామె. తన వెయిట్లాస్ జర్నీలో ఉపవాసం, యాక్టివ్గా ఉండటం, తగినంత హైడ్రేషన్, సమతుల్య ఆహారం, తదితర ప్రధానాంశాలు ఉన్నాయని అన్నారు.18-10-8-4-1 రూల్ అంటే..ఇక్కడ 18 అంటే..18 గంటల అడపాదడపా ఉపవాసం. తాను ఉదయం 11 నుంచి సాయంత్రం 5/6 గంటల మధ్య తింటానని తెలిపింది. ఇది బరువు తగ్గేలా చేయడమే కాకుండా మైండ్ని కూడా క్లియర్గా ఉంచుతుంది.ఇక 10 అంటే..పదివేల అడుగులు..ప్రతి ఒక్కరూ ఇన్ని అడుగులు వేసేలా దశలా వారిగా ప్రారంభించాలని సూచించారామె. ఎందుకంటే ఇది 500 నుంచి 700 కేలరీల దాక సులభంగా బర్న చేయగలదని చెప్పారు.8- ఎనిమింది గంటల నిద్ర. తగినంత విశ్రాంతి కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుందట.4- నాలుగు లీటర్ల నీరు. హైడ్రేషన్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీల అందిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి చర్మం రంగుని మెరుగుపరుస్తుంది.చివరగా 1-- ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవడాన్ని హైలెట్ చేశారు రిచా. ఇది కండరాలను సురక్షితంగా ఉండేలా బలోపేతం చేస్తుంది. View this post on Instagram A post shared by Richa Gangani - Weightloss👉Thyroid👉PCOS Expert (@dieticianricha2095) అడపదడపా ఉపవాసం ఎలా ఉండాలంటే..రిచా వివిధ రకాల అడపదడపా ఉపవాసాలను పేర్కొన్నారు. 16:8 ఎనిమిదిగంటలు తిని, 16 గంటలు ఉపవాసం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్5:2 ఇది సాధారణంగా వారంలో ఐదు రోజులు తినడం, రెండు రోజులు ఉపవాసం ఉండటం14:10 ప్రారంభికులకు గొప్పది, పది గంటలు తిరడం, పదిగంటలు ఉపవాసం ఉండటం18:6 ఇది వ్యక్తిగతం కేవలం ఆరు గంటే తినడం, ఏకంగా 18 గంటలు ఉపవాసం ఉండటం. వ్యక్తిగత సామర్థ్యం అనుసరించి పాటించాల్సిన విధానం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
కొత్త భాషలు ఈజీగా నేర్చుకోండిలా..!
కొత్త భాషలు నేర్చుకునేవారిలో జ్ఞాన విస్తృతి ఒక కోణం అయితే, ఉల్లాసం, ఉత్సాహం అనేది మరో కోణం. మరి మీరు కొత్త భాష నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా! గతంతో పోల్చితే కొత్త భాష నేర్చుకోవడం ఆట్టే కష్టం కాదు. ఇప్పుడు ఎన్నో లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి. అయితే అన్ని యాప్స్ ఉచితం కాదు. ఈ నేపథ్యలో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్కు ప్రాధాన్యత పెరిగింది. ఈ యాప్ కేవలం అనువాదానికి మాత్రమే పరిమితం కావడం లేదు. కొత్త భాషలు నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడనుంది. ‘గూగుల్ ట్రాన్స్లేట్’ యాప్ను ఏఐ–పవర్డ్ లైవ్ ట్రాన్స్లేషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్స్తో అప్డేట్ చేసింది గూగుల్.జెమిని ఏఐ ద్వారా కొత్త గూగుల్ ట్రాన్స్లేట్ ప్రాక్టీస్ మోడ్తో కొత్త భాషలు నేర్చుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్ని ఉపయోగించుకోవచ్చు. కొత్త భాషను వినే, మాట్లాడే అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. రకరకాల సంభాషణలతో భాషా నైపుణ్యాలకు పదును పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు స్పానిష్ మాట్లాడే ప్రాంతానికి వెళ్లబోతున్నారనుకుందాం. అక్కడికి వెళ్లిన తరువాత స్థానికులను ఎలా పలకరించాలి? సహాయం ఎలా అడగాలి....మొదలైన వాటిని నేర్చుకోవచ్చు. మీరు భాషను ఎంత మేరకు నేర్చుకున్నారు అనేదానికి సంబంధించి పద పరీక్షలు కూడా ఉంటాయి.ఇలా... లేటెస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లాంచ్ చేయాలి ప్రాక్టీస్ బటన్ నొక్కాలి ‘గెట్ స్టార్టెడ్’ ఎంపిక చేసుకోవాలి డిస్ప్లే లాంగ్వేజ్ (మీరు మాట్లాడే భాష), ప్రాక్టీస్ లాంగ్వేజ్(మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాష) సెలెక్ట్ చేసుకోవాలి నెక్ట్స్–బటన్ నొక్కాలి కొత్త భాషకు సంబంధించి మీ అవగాహనను ఏఐ అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుందికొత్త భాష నేర్చుకోవడానికి సంబంధించి ‘బేసిక్’ ‘ఇంటర్మీడియెట్’ ‘అడ్వాన్స్డ్’ ఆప్షన్లు ఉంటాయి ‘గోల్స్’ లిస్ట్ కనిపిస్తుంది. నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. నచ్చకపోతే టాప్ రైటర్ కార్నర్లోని స్కిప్ బటన్ నొక్కవచ్చు ఫైనల్గా ‘స్టార్ట్ ప్రాక్టీసింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి లిజన్, స్పీక్ ఆప్షన్లు ఉంటాయి. వినడం అనేది పదాల పరిచయానికి, మాట్లాడడం అనేది ఉచ్చారణను మెరుపరచడానికి ఉపయోగపడతాయి. కొత్త భాషలు నేర్చుకునే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉండొచ్చు. మీ లక్ష్యం సిద్దించిందా? కొత్త లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారా? ఇందుకోసం స్క్రీన్ టాప్లో ఉన్న ‘గోల్ బాక్స్’ను నొక్కాలి. సొంతంగా ప్రాక్టిస్ సినారియో క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త ఫ్రెండ్ను కలుసుకోబోతున్నారనుకుందాం. దృశ్య సంబంధిత సంభాషణల ఆధారంగా లెర్నింగ్ సెషన్ను క్రియేట్ చేయవచ్చు. (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
యూత్లో ఎగ్'రికల్చర్'..! కాబోయే తల్లుల పాలిట వరం...
‘ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి... ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి... ‘సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్.. జీవితంలో స్థిరపడాలి ఆ తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలి..’ ఇలా అనుకునేవారి శాతం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. వయసు మూడు పదులు దాటుతున్నా పెళ్లి, పిల్లలు అనే దశలను వాయిదా వేస్తూ ఉన్నారు. ఫలితంగా భవిష్యత్తులో పిల్లలు కలగరేమో అనే ఆందోళన కూడా ఉంటోంది. అందుకే, ముంబైలోని నవతరం అమ్మాయిల జీవనశైలి, వారి ఆలోచనా విధానంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది యువతులు తమ అండాలను నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. ఇది మారుతున్న సామాజిక ఎంపికలకు అద్దంలాంటిది. భవిష్యత్తులో మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళలకు ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.ఇటీవల జరిగిన సర్వేలో పాతికేళ్ల వయసున్న (జెన్జెడ్) దాదాపు 18 శాతం మంది యువతులు మారుతున్న జీవనశైలి వైపుగా కదులుతున్నారని, రెండింతల ఆదాయంవైపు మొగ్గుచూపుతూ పిల్లలు వద్దు అనే ఆలోచనలో ఉంటున్నారని తెలియజేసింది. మెరుగైన కెరీర్, వ్యక్తిగత ఉద్దేశాల కోసం వారు పిల్లలను కనకూడదని లేదా మాతృత్వాన్ని వాయిదా వేయాలని ఎంచుకుంటున్నారు. ఎక్కువ మంది యువతులు విద్య, వృత్తిపరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే వారిని ఎప్పుడూ హెచ్చరించే బయోలాజికల్ క్లాక్ ఒత్తిడి లేకుండా భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి అండాలను నిల్వ చేసుకోవడం ఒక మార్గంగా కనిపిస్తోంది. అయితే, సంతానోత్పత్తి ఇండికేటర్స్ గురించి అవగాహన లేకపోవడాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా అMఏ (యాంటీ–ముల్లెరియన్ హార్మోన్), ఇది స్త్రీ అండాశయ నిల్వలను అంచనా వేయడానికి సహాయపడుతుంది. సర్వే చేసిన 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, 35 సంవత్సరాల వయస్సు తర్వాత సంతానోత్పత్తి తగ్గుతుందని గ్రహించినప్పటికీ, వారిలో చాలామందికి వారి అండాలను నిల్వ చేసుకునే సమయం, కుటుంబ జీవనాన్ని మొదలపెట్టడానికి సరైన వయస్సు గురించి ఏ మాత్రం అవగాహన ఉండటం లేదని చెబుతున్నారు. వైద్యులు కూడా అలా కోరుకునేవారికి భవిష్యత్తులో సంతానోత్పత్తి ప్రయోజనాలను అందుకోవచ్చుని సలహా ఇస్తున్నారు. వంధ్యత్వం సమస్య పురుషులు, మహిళలు ఇద్దరినీ బాధపెడుతుంది కాబట్టి, అండాలు నిల్వ చేసుకోవడానికి, సంబంధిత చికిత్సలకు సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీలు కూడా ఆసక్తిచూపుతున్నాయి. దీనికి కారణం తమ ఉద్యోగుల ప్రతిభను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి మద్దతునివ్వడం ఒక కారణంగా ఉంటోంది.ఈ మార్పు చాలా మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య విద్య అవసరాన్ని వివరిస్తుంది. బహిరంగంగా చర్చలు జరపడం ద్వారా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలియపరచడం ద్వారా, మహిళలు తమ సంతానోత్పత్తి, కెరీర్, భవిష్యత్తు కుటుంబ నియంత్రణ గురించి మరిన్ని విషయాల్లో అవగాహనతో పాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే సంతానోత్పత్తి, వ్యక్తిగత ఎంపిక గురించి చర్చ ఇంకా పెరగాల్సి ఉందని స్పష్టం అవుతుంది.మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. 35 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి, జెనెటిక్ రిస్కులు పెరుగుతాయి. కెరీర్, ఎడ్యుకేషన్, వ్యక్తిగత పరిస్థితుల వల్ల తల్లి కావడం ఆలస్యమవుతుంటే, ఎగ్ ఫ్రీజింగ్ ఒక మంచి ఎంపిక. అయితే, 30 – 35 ఏళ్ల లోపు అండాల నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ వయసు అనుకూలం. హార్మోన్ ఇంజెక్షన్లతో అండాశయాల్లో ఒకేసారి ఎక్కువ అండాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. అండాలను శస్త్రచికిత్స లేకుండా సులభమైన ప్రక్రియ (egg retrieval ) ద్వారా బయటకు తీస్తారు. వాటిని ప్రత్యేకమైన సాంకేతికతతో ఫ్రీజ్ చేస్తారు. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు ఐవిఎఫ్ పద్దతి ద్వారా అండాలను ఉపయోగిస్తారు. లేటు వయసులో కూడా తల్లి కావాలనుకుంటే ఈ పద్ధతి సురక్షితమైనది. క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చి వైద్య చికిత్స జరిగినప్పుడు ఫెర్టిలిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు. అందుకని ముందే నిల్వ చేసుకున్న అండాశయాల ద్వారా బిడ్డలను పొందవచ్చు. అయితే వీటి విషయంలో వంద శాతం గ్యారంటీ అని చెప్పలేం. ఎందుకంటే నిల్వ చేసిన అండాలు విజయవంతంగా ఫలదీకరించలేకపోవచ్చు. ఖరీదైన ప్రక్రియ (లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది) కూడా. హార్మోన్ ట్రీట్మెంట్ వల్ల ఉబ్బరం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎన్ని సంవత్సరాలు నిల్వ చేసినా, అండం నిల్వ సమయంలో ఉన్న వయసు ఆధారంగానే ఫలితం వస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, న్యూఢిల్లీ నగరాలలోని హాస్పిటళ్లు ఎగ్ ఫ్రీజింగ్ అవకాశాన్నీ అందిస్తున్నాయి. – డా.శిరీష, గైనకాలజిస్ట్ (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..!
పోటీలు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది యువతే.. అండర్ 14, అండర్ 17.. ఇలా పలు విభాగాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే మరి వయసు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? వారికేమీ ఆటలు ఉండవా? వారిలో ఎలాంటి ప్రతిభా ఉండదా? అంటే ఉంటుందనే చెబుతున్నారు ముంబయికి చెందిన ‘ఖ్యాల్’ నిర్వాహకులు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోము.. సరిగ్గా దీని కోసమే ఏర్పాటైన వేదికే ఖ్యాల్. అప్పటి వరకూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగల బాధ్యతలతో తలమునకలై.. వయసు మళ్లిన తర్వాత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకే ఖ్యాల్ ఏర్పాటు చేశారు. ఖ్యాల్ అంటే తమలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి, మెరుగుపరచడానికి కల్పించే అవకాశం.. అంటున్నారు నిర్వాహకులు.. వయసు మళ్లిన వారు అంటే చాలా మందికి ఓ చులకన భావం.. వారు ఏమీ చేయలేరు.. సాధించలేరు.. మరి అలాంటి భావాన్ని చెరిపేశారు కొందరు ప్రముఖులు.. సాధించాలనే తపన ఉంటే వయసుతో పనేంటి అను నిరూపించారు. ‘హార్లాండ్ సాండర్స్ 62 సంవత్సరాల వయసులో కేఎఫ్సీని ప్రారంభించారు. ఫల్గుణి నాయర్ 49 సంవత్సరాల వయసులో నైకాను స్థాపించారు. హెన్రీ ఫోర్డ్ 45 సంవత్సరాల వయసులో మొదటి ఫోర్డ్ మోటార్ కారును ప్రజలకు పరిచయం చేశారు..’ ఇవన్నీ కథలు కావు విజయాలకు ప్రేరకాలు అంటారు ఖ్యాల్ నిర్వాహకులు హేమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి. యువత కోసమేనా కాంటెస్ట్స్?ఏ పోటీ చూసినా అండర్ 25, అండర్ 30 ఇలా యువత, మధ్యవయసు వారికోసమే ఉంటున్నాయి. కానీ సిసలైన జీవితం 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, అభిరుచిని ఆస్వాదించే స్వేచ్ఛ అన్నీ ఉండేది అప్పుడే. వర్గీకరించబడేది వయసు మాత్రమే.. టాలెంట్ కాదు.. అందుకే ఖ్యాల్ 50 అబోవ్ 50ని ప్రారంభించింది. ఇందులో సింగర్ ఆఫ్ ది ఇయర్, చెఫ్ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్, పొయెట్ ఆఫ్ ది ఇయర్, క్రాస్ వర్డ్ చాంపియన్ ఆఫ్ ది ఇయర్... ఇలా ఏ రకమైన టాలెంట్ ఉన్నా సరే పాల్గొనేలా రూపొందించాం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ పోటీ ప్రపంచానికి గుర్తు చేయనుంది.50 విభాగాల్లో 50మంది విజేతలు..వయసు 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్లోనో, ఆధ్యాతి్మక యాత్రల షెడ్యూల్ ఖరారులోనో బిజీగా ఉండే వారి ఆలోచనల్ని సమూలంగా మార్చడమే తమ ధ్యేయం అంటున్నారు ఈ కాంటెస్ట్స్ నిర్వాహకులు. ఫిఫ్టీ ప్లస్ వయసు వారి కోసం 50 అబోవ్ 50 పేరుతో ఏకంగా 50 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా గత నెలాఖరున నగరంలోనూ ఆడిషన్స్ నిర్వహించిన సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే..ఇకిగై.. భావనకు అనుగుణంగా..జపనీయుల దీర్ఘకాల, సంతోషకర జీవనానికి దోహదం చేస్తున్న ‘ఇకిగై’ కాన్సెప్ట్కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ‘ఉద్యోగ విరమణ తర్వాత జీవితం పూర్తిగా కొత్తగా నిర్మించడం’ దీని లక్ష్యం. గత 2020లో స్థాపించిన మా ఖ్యాల్, సీనియర్ సిటిజన్లకు సబ్స్కిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తుంది. వారి శారీరక, మానసిక, భావోద్వేగ సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. మా యాప్కు మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ‘సీనియర్లు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడే ధోరణిని గమనించాం, ప్రోత్సహిస్తున్నాం, అంతిమంగా విభిన్న ఆసక్తులు కలిగిన సమూహాలను సృష్టించాలన్నదే మా తాపత్రయం.. అదే నేటి ఆడిషన్స్కు దారితీసింది. ఈవెంట్ జరిగే తీరిది.. 50 అబోవ్ 50 కోసం ఈ స్టార్టప్ ఆన్న్లైన్ వీడియో ఆడిషన్న్లను కూడా నిర్వహిస్తోంది. మే 1 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో హైదరాబాద్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, లక్నో, జైపూర్, కొచ్చి, ఇండోర్ వంటి 20 నగరాలు పాల్గొంటాయి. ఇందులో భాగంగా పోటీదారులను ఒకచోట చేర్చడానికి కారి్నవాల్ నిర్వహిస్తారు. సరదా నిండిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం వ్యక్తిగత ఆడిషన్స్ సైతం ఉంటాయి. వడపోత తర్వాత, ప్రతి విభాగం నుంచి టాప్–10 ఫైనలిస్టులను సంబంధిత కేటగిరీ నిపుణులు షార్ట్లిస్ట్ చేస్తారు. చివరకు ప్రతి కేటగిరీ కింద బెస్ట్ని ఎంపిక చేయడానికి పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు నకుల్ షెనాయ్, రచయిత్రి గీతా రామానుజం, విజువల్ ఆర్టిస్ట్ సెల్వప్రకాష్ లక్ష్మణన్, కవి–ఎడిటర్ వినితా అగర్వాల్, కర్ణాటక న్యూమిస్మాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర మరుధర్ తదితరులు ఉన్నారు. ఖ్యాల్ విజేతలకు మొత్తం కలిపి రూ.1 కోటి నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే నవంబర్లో ముంబైలోని నెస్కో మైదానంలో జరుగుతుంది.నగరంలో ముగిసిన తొలి దశ ఆడిషన్స్.. నగరంలోని హిమాయత్నగర్లో ఇటీవలే ఈ పోటీ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. పదుల సంఖ్యలో హాజరైన అభ్యర్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా పరీక్షించారు. వీరిలో ఎంపికైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్పైన స్కెచ్లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..
అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్ డైరియల్ డీహైడ్రేషన్’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. పరిష్కారం ఏమిటి? హైడ్రేషన్ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కలిగిన తక్కువ గ్లూకోజ్. క్యాలరీ, డయాబెటిక్ సేఫ్ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. డీహైడ్రేషన్ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. – డా.మోసిన్ అస్లం, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్ (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. సోలో టూరే సో బెటరూ...
ఒంటరి ప్రయాణం అనేది ఒక ఆసక్తికరమైన అనుభవం, ఎందుకంటే ఇది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, స్వీయ–ఆవిష్కరణ ఫ్లెక్సిబులిటీలను అందిస్తుంది. అయితే అలా సింగిల్గా ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఉల్లాసమైన అనుభవాలు మాత్రమే కాదు భద్రత, సౌలభ్యం కూడా ప్రధానమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే 5 దేశాలు సోలో ట్రావెల్కి అత్యంత ఎంచుకోదగినవిగా మారాయి. ఒంటరిగా ప్రయాణీకులకు కొత్త సంస్కృతులను నేర్చుకోవడానికి, విభిన్న వ్యక్తులతో సంభాషించడానికి రాజీ పడకుండా మనసుకు నచ్చిన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పించే ఆ దేశాలలో...జపాన్భద్రత, పరిశుభ్రత అత్యంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కారణంగా వ్యక్తిగత ప్రయాణికులకు నెం1 గమ్యస్థానం జపాన్. టోక్యో, క్యోటో ఒసాకా వంటి నగరాలు ప్రశాంతమైన దేవాలయాలు, రద్దీగా ఉండే మార్కెట్లు ఆధునిక ఆకర్షణలతో సంప్రదాయ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఒంటరి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రాంతాలు సందర్శించేలా ప్రజా రవాణా బాగా పనిచేస్తుంది చౌకగా బస చేయడానికి క్యాప్సూల్ హోటళ్ళు హాస్టళ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.న్యూజిలాండ్ఇది స్నేహపూర్వకంగా ఉండే ప్రజలు తక్కువ నేరాలు కలిగిన చిన్న దేశం, అందువల్ల ఒంటరి ప్రయాణానికి సరైనది. టోంగారిరో ఆల్పైన్ క్రాసింగ్ను హైకింగ్ చేయడం సౌత్ ఐలాండ్లోని ఫ్జోర్డ్లను సందర్శించడం వంటి అన్ని స్థాయిల ఫిట్నెస్కు అనుగుణంగా ఉండే కార్యకలాపాలతో న్యూజిలాండ్ సోలో ట్రావెల్కు అనుకూలతలు కలిగి ఉంది.పోర్చుగల్సుందరమైన ప్రదేశం, పురాతన పట్టణాలు పర్యాటకులను ఇష్టపడుతూ ఆకర్షించే ఆదరించే సంస్కృతి కలిగిన దేశం పోర్చుగల్. లిస్బన్ పోర్టో వంటి చిన్న నగరాలు కాంపాక్ట్, నడవడానికి అనుకూలమైనవి సాంస్కృతిక అనుభవాలతో నిండి ఉన్నాయి పాత స్మారక చిహ్నాలు సందడిగా ఉండే స్ట్రీట్ లైఫ్ రెండూ ఆకట్టుకుంటాయి. పోర్చుగల్లోని కేఫ్ సంస్కృతి పెద్ద సంఖ్యలో హాస్టళ్లు స్థానికులు ఇతర ప్రయాణికులతో సులభంగా పరిచయాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయి.కెనడాఇది వాంకోవర్, టొరంటో మాంట్రియల్ వంటి బహుళ సాంస్కృతిక, బాగా అనుసంధానించబడిన నగరాలను కలిగి ఉన్న దేశం. భద్రత విషయంలో ఉన్నత స్థానంలో ఉంది. ఒంటరి ప్రయాణికులు పట్టణాల్లోనే పలు ఆకర్షణలను సందర్శించవచ్చు. జాతీయ ఉద్యానవనాలలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు లేదా కాలానుగుణ స్కీయింగ్, హైకింగ్ వన్యప్రాణుల వీక్షణను చేపట్టవచ్చు.థాయిలాండ్చౌక ధరలకు ప్రయాణించాలనుకునే ఒంటరి ప్రయాణికులకు థాయిలాండ్ అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. బ్యాంకాక్, చియాంగ్ మాయి, ద్వీపాలు స్ట్రీట్ ఫుడ్ టూర్స్, దేవాలయాలు, బీచ్లు నైట్ లైఫ్తో సహా అన్ని రకాల అనుభవాలకూ నిలయం. థాయిలాండ్ పర్యాటక మౌలిక సదుపాయాలు హాస్టళ్లు, గైడెడ్ టూర్లు, రవాణా సేవలు మొదలైన వాటితో బాగా అభివృద్ధి చెందాయి.(చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?
ఈ సందేహం దాదాపు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం...ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం... పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృ యఙ్ఞాన్ని నిర్వహిస్తాడు... పుత్రులు లేనివారి సంగతి ఏమిటి మరి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు...లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు...అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. ఎలా పెట్టాలంటే..?సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరం) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. మహాలయం పెట్టలేని పక్షంలో కనీసం గతించిన పెద్దలను తలచుకుని వారి పేరు మీదుగా శక్తిమేరకు శుచిగా వంట చేసి భోజనాలు పెట్టాలి. ఇలాంటి క్రతువులపై విశ్వాసం లేనివారు కూడా పేదలకు అన్నదానం చేయడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, శునకాలకు, కాకులకు ఆహారం పెట్టడం మంచిది. మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రవచనం. (సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు) (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
విశుద్ధి చక్ర నిలయా..!
475వ నామం వద్ద అమ్మవారిని ‘విశుద్ధి చక్ర నిలయా‘ అనగా విశుద్ధి చక్రంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన సూక్ష్మ శరీరంలో కంఠం వద్ద ఉంటుంది. కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటునప్పుడు మనిషికి సంఘ జీవనం అలవడి, సాక్షీభూత స్థితిలో దైవికమైన చాతుర్యంతో మాట్లాడగల వాక్ శక్తి లభిస్తుంది.103వ నామం వద్ద అమ్మవారిని ‘ఆజ్ఞా చక్రాంత రాళస్థా‘అనగా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అంటూ వర్ణిస్తారు. ఈ ఆజ్ఞాచక్రం మనం నుదురు మీద బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడు మనిషి లోపల క్షమాగుణం నెలకొని పరిపూర్ణ నిర్విచార స్థితి అనగా ఆలోచనలు లేని స్థితిని పొందుతాడు. సాధారణం గా మనిషికి ఆలోచనలు లేకుండా ఉండడం నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ స్థితిని చేరుకున్న మనిషి మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాడు. 105వ నామం వద్ద ‘సహస్రారాంబుజారూఢా‘ అనగా సహస్ర దళ పద్మంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన తల మీద మాడు ప్రాంతం లేదా బ్రహ్మ రంధ్రం వద్ద ఉంటుందని, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుందని వివరిస్తారు. మానవ చేతన తన చుట్టూ ఉండే భగవంతుని పరమ చైతన్య శక్తితో అనుసంధానాన్ని పొందుతుందని, మానవ మెదడును లోపల నుండి గమనిస్తే, 1000 నరాలు కలిసి, 1000 దళాలు గల పద్మంలా కన్పిస్తుందని, అందుకే ‘సహస్రారం’ అని పిలుస్తారని చెబుతారు. 106వ నామం వద్ద ‘సుధాసారాభి వర్షిణి’ అనగా అమృతధారలు కురిపించునది అని వర్ణిస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృత ధారల వంటి ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి వల్లే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.– డా. పి. రాకేష్పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం
పూర్వం తన తల్లి దాస్య విముక్తికోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతూండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండేచోటున పడిందట. దాని ఫలితంగా అప్పట్లో ఆ మడుగులో స్నానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానూ, యవ్వనవంతులుగానూ మారిపోవడంతోపాటు అమరత్వం కూడా పొందేవారట. దాని మహిమను ప్రత్యక్షంగా చూసిన నారదుడు బ్రహ్మదేవుడికి నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, ‘‘హనూ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి‘ అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూ వుంది.ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలు΄ోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తి వద్దకు ΄పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి విన్నవించారు. విష్ణుమూర్తి అంతా విని, ‘‘నాకూ, శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!‘ అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూ వున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకు΄ోయింది.అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది– పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతాన్ని తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి ‘పుష్పగిరి’ అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై వెలుగొందుతోంది. ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ’మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.హరిహరాదుల క్షేత్రంశివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.జనమేజయుడు చేసిన సర్పయాగ పాపరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండ మీదే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవస్వామికి పూజలు జరుగుతాయి. పాతాళగణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.(చదవండి: లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..) -
నైట్ ఈటింగ్ సిండ్రోమ్..!
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైమ్కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్ఫాస్ట్ టైమ్కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.గుర్తించడం ఎలా... రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం ఉదయం లేచాక ఆకలి లేకపోవడం రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.ఇలాంటిదే మరో సమస్య...బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు... ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది. ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.నిర్ధారణ పరీక్షలు: బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.ఆరోగ్యంపై ఎన్ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్ఈఎస్కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్ఈఎస్లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.చికిత్స... సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు. (చదవండి: ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..) -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్కు కానీ, టూర్కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్ని, ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
సరదా కారాదు విషాదం.. మనకిదొక హెచ్చరిక!
సాక్షి, హైదరాబాద్: ‘‘బెంగళూరులో ఓ బాలుడు కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. సన్రూఫ్లోంచి తల బయటికి పెట్టి వెళ్తుండగా.. డ్రైవర్ రోడ్డుపై ఉన్న ఓవర్ హెడ్ బారికేడ్ను గమనించకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతే అకస్మాత్తుగా బారికేడ్ బాలుడికి తగిలి తల పగిలిపోయింది.’’ అయితే ఈ ఘటన పొరుగు రాష్ట్రంలో జరిగినప్పటికీ.. మనకిదొక హెచ్చరిక! ఈ రోజుల్లో ప్రతి మోడ్రన్ కారుకు సన్రూఫ్ (Sunroof) తప్పనిసరి అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ సన్రూఫ్ అనుభూతిని పొందాలని భావిస్తున్నారు. అయితే ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలామంది యువతీ యువకులు సన్రూఫ్లోంచి బయటికి చూస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. పిల్లలను తిప్పడం, తిరగడం పేరెంట్స్కు ఓ సరదా, స్టేటస్ సింబల్. అయితే ఈ సరదా విషాదం కాకూడదని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.సరదా కారాదు విషాదం..ఇరుకు, బిజీ రోడ్లలో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి రోడ్లలో సన్రూఫ్ నుంచి వేలాడుతూ ప్రయాణించకూడదు. విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, పతంగుల దారాలు, మాంజా, ఇతరత్రా సన్నని తీగలు రోడ్లపై వేలాడుతుంటాయి. ఇది సాధారణంగా డ్రైవర్లకు కనిపించవు. దీంతో సన్రూఫ్లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులను ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్రూఫ్లో ఉన్నవారికి పట్టు ఉండదు. దీంతో సన్రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే ఏకంగా కార్లో నుంచి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.సహజ కాంతి కోసమే..సన్రూఫ్ అనేది కేవలం వెంటిలేషన్ కోసమే ఉద్దేశించబడింది. కారు క్యాబిన్ స్పేస్ విశాలంగా అనిపించడంతో అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్రూఫ్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా వేసవి కాలంలో ఎండలో కార్ పార్కింగ్ చేసినప్పుడు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్రూఫ్ను తెరిస్తే కారులోని వేడి గాలి బయటికి వెళ్లి, కార్ క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఇరుకైన రహదారులు, బిజీ రోడ్లలో సన్రూఫ్లను వినియోగించకూడదు. వీటిని హైవేలు, వెడల్పాటి రోడ్లపై మాత్రమే వినియోగించాలి.జైలు, జరిమానా..ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనల తరహాలోనే బిజీ రోడ్లపై సన్రూఫ్ వినియోగాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. సన్రూఫ్లతో వ్యక్తిగతంగా ప్రాణాంతకమే కాకుండా రోడ్లపై ఇతర వాహనదారులకు అంతరాయం కలిగిస్తుంది. సన్రూఫ్, కారు కిటికీల నుంచి తలను బయటికి వేలాడుతూ ప్రయాణం చేస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్–281 కింద కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులలో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలాగే ఇతర వాహనాల నుంచి వెళువడే పొగ, దుమ్ము ధూళి నేరుగా ముక్కులోకి వెళ్లి రోగాలకు కారణమవుతాయి.చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్ లేకుండానే.. ఐఐటీలో అడ్మిషన్!ఆలోచింపజేసిన రాచకొండ పోస్టుసన్రూఫ్ ప్రయాణం చాలా ప్రమాదం అంటూ రాచకొండ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆలో చింపజేస్తోంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఆనందం కోసం ఇలా ప్రమాదకరంగా స్టంట్లు చేయొద్దంటూ బెంగళూరులో జరిగిన సన్రూఫ్ ప్రమాద ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లతో ఈ వీడియో హల్చల్ చేస్తుంది. -
కురులు... వివరాల విరులు..
అరచేతులు, అరికాళ్లు, పెదవులు, మ్యూకస్ పొరలు తప్ప శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లోనూ వెంట్రుకలు పెరుగుతాయి. ఎముకల్లోని మూలగ తర్వాత అత్యంత వేగంగా పెరిగే కణజాలం జుట్టు మాత్రమే. మనిషి తలపై సగటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. తలవెంట్రుకల్లో 90 శాతం పెరుగుతూ ఉంటే, 10 శాతం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తలపై లక్ష వరకు ఉండే వెంట్రుకల్లో రోజూ వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. పురుషుల్లో సగం మందికి యాభయ్యేళ్ల లోపు వయసులోనే బట్టతల వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల, ఐరన్ లోపంవల్ల తాత్కాలికంగా తలపై వెంట్రుకలు పలచబడతాయి. అలాగే, కొన్ని రకాల ఔషధాల ప్రభావం వల్ల కూడా తలవెంట్రుకలు గణనీయంగా రాలిపోతాయి.వెంట్రుకల ఆయుర్దాయం మూడు నుంచి ఏడేళ్లు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్లు, చేపలు, లివర్, కిడ్నీలు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడతాయి.జుట్టులోని పిగ్మెంట్స్ కారణంగానే జుట్టుకు రంగు ఏర్పడుతుంది. వయసు మళ్లే దశలో పిగ్మెంట్స్ తగ్గడం కారణంగా జుట్టు నెరుస్తుంది. వెంట్రుకలు గరిష్టంగా 90 సెం.మీ. వరకు పెరుగుతాయి. ఏడాది వ్యవధిలో వెంట్రుకల పెరుగుదల 12 సెం.మీ. వరకు ఉంటుంది. (చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు) -
శిల్పారామం వేదికగా ఛాప్..!
చేనేత, హస్తకళలు.. వీటి కొనసాగింపులో ఆధునిక ఫ్యాషన్, టెక్నాలజీ వంటి అంశాలతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమ నిర్వహణకు కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ శాఖ భాగస్వామ్యంతో ‘ఛాప్’ నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పారామం వేదికగా ఈ నెల 12 నుంచి 17 వరకూ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతినిధులు నిఫ్ట్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా భిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శిల్పారామం వేదికగా నిర్వహించే స్టాల్స్లో హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలోని టూరిజం డెస్టినేషన్ ప్రాధాన్యతను ప్రదర్శించి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని క్లస్టర్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్వ ఖురానా పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు.. దేశవ్యాప్తంగా 19 నిఫ్ట్ క్యాంపస్లు ఉన్నాయని, హైదరాబాద్ క్యాంపస్ భాగస్వామ్యంతో ఈ ప్రదర్శనలో 60 క్రాఫ్టŠస్, 40 అలుమ్ని బృందాలు పాల్గొంటాయి. ఆరు రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా చేనేత, హస్త కళాకారుల ప్రదర్శనలతో పాటు ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు, 6 ప్రధాన క్రాఫ్ట్ ప్రదర్శనలు చేపట్టామని, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్స్ కూడా ప్రదర్శిస్తాం. తెలంగాణలోని తోలుబొమ్మలాట లాంటి అరుదైన కళల ప్రాధాన్యత తెలియజేసి, పలు అరుదైన కళలకు పేటెంట్స్, జీయో ట్యాగ్ ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కలి్పంచనున్నాం. – డా.మాలిని, నిఫ్ట్ డైరెక్టర్ (చదవండి: సౌకర్యం + సంతోషం = కవాయి) -
చీకట్లో.. చిరుదీపం..
వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా రోష్నీ అనేకమంది బాధితులకు చేరువయ్యింది. 1997లో నలుగురితో ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 70 మంది సుశిక్షితులైన వాలంటీర్లతో నిత్యం కౌన్సెలింగ్ ఇస్తూ అనేక మందికి అందగా నిలుస్తోంది. వీధినాటకాలు, కరపత్రాలు, ప్లకార్డుల ప్రదర్శనలతో 28 ఏళ్లుగా వేలాది మందికి అండగా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన వారి కోసం సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులతో మానసిక చికిత్స, ఉచితంగా మందులు అందిస్తోంది. ప్రతి శుక్రవారం రామకృష్ణ మఠంలో సెషన్స్ నిర్వహిస్తోంది. 040–6620 2000, 040–6620 2001 రోష్నీ కౌన్సెలింగ్ సెంటర్ టోల్ఫ్రీ.పురుషులే ఎక్కువ.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో పురుషులే అధికంగా ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు చొప్పున ఏటా 8 లక్షల మంది, ఒక్క భారత్లోనే మూడు నిమిషాలకు ఒకరు చొప్పున యేడాదికి 1.71 లక్షల మంది, రోజుకు 512 మంది ఆత్మహత్యలు చేసికుంటున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి రోజు 6 నుంచి 8 ఆత్మహత్యలు రికార్డవుతున్నాయి. గుర్తించాలి.. ఆలోచన తుంచాలి.. ఎవరితో కలవకుండా దూరంగా ఉండటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బతకాలని లేదని అంటుండటం వంటి లక్షణాలను గుర్తించాలి. వారితో మనసువిప్పి మాట్లాడి.. కారణాలు గుర్తించాలి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. – ఆనంద దివాకర్ (సీనియర్ కౌన్సెలర్) చావు పరిష్కారం కాదు.. చిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసికుని విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. చావు శాశ్వత పరిష్కారం కాదు. మనలో బాధను ఇతరులతో పంచుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుందని గుర్తించాలి. – విద్యారెడ్డి (కౌన్సెలర్) (చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు) -
ఆ ఒక్క క్షణం..!
ఒకప్పుడు ఒకలా ఉండదు.. ఎక్కడ ఆగిపోనివ్వదు.. యెదరేముందో చెప్పదు కదిలే సమయం.. నీడలా జ్ఞాపకం వదలదు.. తోడుగా ఏ నిజం నడవదు.. ఒంటిగా సాగటం తప్పదు జరిగే పయనం.. నీతోనె మొదలైందా.. నీతోనె ముగిసిందా.. ఇదే కదా కోరిందని.. వేరే ఇంకేం కావాలని.. అన్నామంటే ఈనాటికి రేపంటూ ఉంటుందా.. ఇవ్వాళ ఎంతో బాగుందని అయినా ఏదో లోటుందని.. ఇంకా ఏదో కావాలని అనుకోని రోజుందా.. కలకే మన ఈ గమనం.. అని ‘ఊపిరి’ చిత్రంలో సీతారామశాస్త్రి చెప్పినట్లు.. ఆ ఒక్క క్షణం దాటితే అందమైన లోకం మనకళ్లముందుంటుంది. రోజులోనే కొంత సమయం చీకటి.. కొంత సమయం వెలుతురు ఉంటుంది.. అంతమాత్రానికే భయపడిపోతామా..? అక్కడే ఆగిపోతామా? అలాంటిది జీవితంలోనూ చీకటి వెలుగులు సహజమే.. అలాంటి అందకారాన్ని అధిగమిస్తేనే కదా వెలుతురు లాంటి భవిష్యత్తును చూడగలం.. జీవితంలో ఓడిపోయామనో.. బ్రేకప్ అయ్యిందనో.. లేదా కుటుంబంలో ఏదో సమస్య తలెత్తిందనో.. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎలా? అంటున్నారు పలువురు కౌన్సెలర్లు.. వయసుతో పనిలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నగరంలోనూ, దేశంలోనూ పలు ఎన్జీఓలు కృషిచేస్తున్నాయి.. ఆత్మహత్యల నివారణకు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినం సందర్భంగా ఈ కథనం.. ‘22 ఏళ్ల మహిళ.. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధమైంది. ఫోన్లో స్నేహితురాలు వద్దని వారించి.. రోషీ్నకి ఫోన్ చేయమని బతిమాలింది. దీంతో ఫోన్ చేయగా ‘అమ్మా నీ ప్రాణం నీ ఇష్టం.. కానీ నీ ఆత్మహత్యను రెండు నిమిషాలు వాయిదా వేసుకో.. నా మాటలు విన్న తర్వాత నీ ఇష్టం..’ అంటూ కన్విన్స్ చేసింది. లివింగ్ రిలేషన్షిప్లో బాబు పుట్టిన తర్వాత ఆ వ్యక్తి వదలి పెట్టాడని.. ప్రస్తుతం ఆనారోగ్య సమస్యలు వచ్చాయని.. ఎంతో ఇష్టమైన తన ఐదు నెలల బాబుని ఇంట్లో అమ్మ దగ్గర వదిలేశానని చెప్పింది. ఆ తర్వాత కౌన్సెలర్ మాటలతో ఆత్మహత్య ఆలోచన విరమించుకుంది.’ ‘చున్నీతో ఉరేసుకుంటున్నా.. మీరెలా కాపాడతారో కాపాడండి.. అంటూ 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి రోషీ్నకి కాల్ చేసి చాలెంజ్ విసిరాడు. గర్ల్ఫ్రెండ్ ఇంకొకరితో తిరుగుతోదని, తనను పట్టించుకోవడం లేదని మనసులో బాధను బయటపెట్టాడు.’ కనీ పెంచిన తల్లిదండ్రులు ముఖ్యమో.. రెండేళ్ల క్రితం పరిచయమైన అమ్మాయి ముఖ్యమో.. ఆలోచించుకో? ప్రేమించడానికి ఇంకొకరు దొరకొచ్చు.. నీ ప్రాణం పోతే మళ్లీ వస్తుందా?.. అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో పునరాలోచనలో పడ్డాడు..ఇలా.. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు చెప్పుకుంటూ.. కొన్ని వేల మందికి అండగా నిలిచింది రోషీన్.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు, ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు, వివాహం కాలేదని యువత, పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని ఉద్యోగులు, రిలేషన్షిప్లో అనుమానాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు.. ఇలా చిన్నపాటి సమస్యలకు మనసు చిన్నబుచ్చుకుంటున్నారు. గోరంత సమస్యను కొండంతగా భావించి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్నిపాటి కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. ప్రపంచంలో సమస్యలు మనకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటాయని భావించి ఆ ఒక్క క్షణం తొందరపడకుండా ఉంటే.. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవచ్చు.. మనలోని బాధను కావాల్సిన వారితోనో.. ఇతరులతో పంచుకుంటే 90 శాతం పరిష్కారాలు లభిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదో ఒకదాంట్లో ఓటమి చెందామనో..పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. తల్లిదండ్రులు మందలించారనో కుమిలిపోకుండా.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.. ఎన్జీఓల కృషి..నగరానికి చెందని పలు ఎన్జీఓ సంస్థలు ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నాయి. ఇందులో ఏటా సుమారు 18 వేల నుంచి 23 వేల మంది కాల్ సెంటర్ ద్వారా సమస్యలు చెప్పుకుంటున్నారని కొన్ని అధ్యయనాల నివేదికల చెబుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం..ఆ మూడు నెలలే కీలకం.. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఆ మూడు నెలలే కీలకంగా మారుతున్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర అకడమిక్ కోర్సుల్లో పాస్ కాలేదని కొందరు, తక్కువ మార్కులు వచ్చాయని మరికొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుల విషయంలోనూ కొందరు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. లక్షలు పోసి చదివిస్తున్నామని తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారని, ఇది వారి సున్నిత మనసును మరింత కుంగదీస్తున్నాయి. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలి. పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. – డాక్టర్ బీ.సూర్యారావు, సైకాలజిస్టుఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిలో కుటుంబ తగాదాలు, రిలేషన్షిప్, బ్రేకప్ వంటివి 30 శాతం ఉన్నాయి.ఒంటరితనం, కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలతో మరో 10 శాతం. వివాహం కాలేదని, ఇతర సామాజిక సమస్యలతో 12 శాతం. ఇలా పలు కారణాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిరుద్యోగం, అప్పులు, ఆర్థిక పరమైన సమస్యలతో 25 శాతం మంది. విద్య, వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకోలేక మరో 22 శాతం.ఆవేశంలో నిర్ణయాలు వద్దు..ఆత్మహత్యల నివారణకు 22 రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో సహా 16 ప్రాంతీయ భాషాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం. ఎక్కువ మంది మహిళలు ప్రేమ, వివాహం, కుటుంబ ఇబ్బందులని చెబుతున్నారు. మగవారిలో ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, పని ఒత్తిడితో.. పూర్తిగా నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి ఎవరికీ చెప్పుకోలేక ఒంటరితనాన్ని ఫీలవుతున్నారు. ఇటువంటి వారికి వారం లేదా 15 రోజులకు ఒక సెషన్ చొప్పున హైదరాబాద్లోనూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. 78930 78930 హెల్ప్లైన్ ద్వారా సాయం పొందవచ్చు. (చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?) -
సౌకర్యం + సంతోషం = కవాయి
‘కవాయి’ అనేది ఇప్పుడు సరికొత్త ఇంటీరియర్స్ ట్రెండ్గా మారింది. మృదువైన రంగులు, కంటికి సంతోషాన్ని ఇచ్చే వస్తువులతో జపసనీస్ ఇంటీరియర్ డిజైన్ కవాయి విజువల్ థెరపీలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ‘నా గది నా కంఫర్ట్ప్లేస్’ అనుకునేవాళ్లకు తమ గదిని మానసిక ప్రశాంతత ఇచ్చేలా తీర్చిదిద్దుకోవడానికి కవాయి డిజైన్ ఉపయోగపడుతుంది. ‘ఎంతోమంది, ముఖ్యంగా మహిళలు కవాయి ఇంటీరియర్స్ గదులను బాగా ఇష్టపడుతున్నారు. కవాయి డిజైనింగ్ వ్యక్తులపై సానుకూల ప్రభావం కలిగిస్తుంది’ అంటుంది బెంగళూరు చెందిన ఆర్కిటెక్ట్ సిరి శేఖర్. ‘కవాయి’ అనే జపనీస్ పదానికి అందమైన, ఆకర్షణీయమైన అని అర్థం. క్లౌడ్–షేప్డ్ ల్యాంప్స్, ఫ్లోరల్ ల్యాంప్స్, మష్రూమ్ మోటిఫ్స్, వాల్ స్టికర్స్, క్యూట్ బౌల్స్, మినియేచర్లు... మొదలైనవి కవాయిలో భాగం.ఫ్యాషన్, కళ, సంగీతం, జీవనశైలి (లైఫ్స్టైల్), ఇంటీయర్స్లో కవాయి ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలో కవాయి ఇంటీరియర్స్కు సంబంధించి డిజైనర్ల సంఖ్య పెరిగింది. ‘గది అలంకరణ అనేది కేవలం ఆకర్షణ కోసం మాత్రమే కాదు. ఆ అలంకరణ మనల్ని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. కవాయి ఇంటీరియర్స్తో నా గదిని తీర్చిదిద్దుకున్నాను. గదిలోకి అడుగు పెడితే ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది గోవాకు చెందిన కంటెంట్ క్రియేటర్ రిచా దేశాయ్. (చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!) -
ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!
‘మా అమ్మాయి పైలట్’ ‘నా మనవరాలు పైలట్’ అని చెప్పుకోవడంలో సంతోషం ఉంది. అంతకంటే ఎక్కువ సంతోషం ఆమె నడుపుతున్న విమానంలో ప్రయాణించడంలో ఉంది. ఇండిగో పైలట్ తనిష్క ముగ్దల్ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలకు విమానం ఎక్కడం అదే మొదటి సారి. అది తమ ఇంటి ఆడబిడ్డ నడిపే విమానం. యూనిఫామ్లో ఉన్న తనిష్క ఆనందబాష్పాలతో అమ్మా,నాన్నలు, తాత,అమ్మమ్మలకు ఇండిగో విమానంలో స్వాగతం పలుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్లో భారీ సంభాషణలు, గ్రాఫిక్స్ హంగామా లేకపోవచ్చు. భావోద్వేగాలే బలం అయ్యాయి.ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ...‘అమ్మానాన్నల ప్రోత్సాహం, చేసిన ప్రార్థనలు, చేసిన త్యాగాలు నేను పైలట్ కావడానికి తోడ్పడ్డాయి’ అని రాసింది తనిష్క. ‘ఆ తల్లిదండ్రుల కళ్లలో ఎంత సంతోషం కనిపిస్తుందో చూడండి’‘పిల్లలు మంచి స్థాయికి వెళ్లినప్పుడు, ఆ స్థాయిని కళ్లారా చూసినప్పుడు, వారికి అంతకు మించిన శక్తి ఏముంటుంది!’ ‘మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా తల్లిదండ్రులను ఎప్పుడూ గుండెలో పెట్టుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. View this post on Instagram A post shared by Tanishka Mudgal ♥️ | aviation | travel | fashion (@pilottanishka) (చదవండి: విలేజ్ సైంటిస్ట్ బనిత) -
మా అమ్మతో ఆరు నెలలే ఉన్న మాజీ బాయ్ ఫ్రెండ్
కొన్ని బంధాలు ఎలా బలపడతాయో ఎలా రూపుమారతాయో ఎవరూ చెప్పలేరు. అవ్యాజ్యమైన అనుబంధాలు అనుభూతించిన వాళ్లు మాత్రమే ఆ అనుభూతిని వర్ణించగలరు. ఒంటరి తల్లికి బాయ్ ఫ్రెండ్గా తండ్రి స్థానంలోకి వచ్చిన ఓ వ్యక్తి కేవలం ఆర్నెళ్లలోనే ఆమెతో బ్రేకప్ అయి విడిపోతే... కూతురు స్థానంలో ఉన్న చిన్నారితో... జీవిత కాలపు బంధం అల్లుకోవడం నిజంగా ఆశ్చర్యకరం మాత్రమే కాదు అపురూపం కూడా. దక్షిణాఫ్రికాలో నివసించే లారెన్ మెల్నిక్ ఈ తరహా అనుబంధాన్ని ఆస్వాదించారు. ఒక అంతర్జాతీయ మేగ్జైన్ కోసం ఆమె తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నాకు నాలుగు సంవత్సరాల వయసులో చార్లెస్ మా అమ్మతో ఆరు నెలల పాటు డేటింగ్ చేశాడు, ఆమెను విడిచిపెట్టినా ఆ తర్వాత కూడా నా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. బ్రేకప్ అనంతరం కూడా అతను అమ్మ స్నేహం గానే ఉన్నారు. దీని వల్ల అతను ఎక్కడ ఉంటున్నా అప్పుడప్పుడు ఇంటికి రావడం వచ్చినప్పుడల్లా నాకు చిన్న చిన్న బహుమతులు తీసుకువస్తుండేవాడు. , అతను (మేం నివసించిన) జోహన్నెస్బర్గ్ నుంచి ఆస్ట్రేలియాకు మారిన తర్వాత కూడా నాతో టచ్లో ఉండటానికి ఫోన్ కాల్స్ చేసేవాడు.మా బంధం గురించి మా అమ్మకు ఎప్పుడూ మిశ్రమ భావాలు ఉండేవి, నేను టీనేజర్గా ఉన్నప్పుడు అమ్మతో ఏదైనా గొడవ పడినప్పుడు, నేను ఫోన్ తీసుకుని, చార్లెస్కు ఫోన్ చేసి, సరదాగా అరిచేదాన్ని ‘నా తల్లితో మాట్లాడండి ఆమె సరిగా లేదు!‘ అంటూ చెబుతుంటే ఆమె నన్ను నెట్టేసేది. ఈ రోజుల్లో, చార్లెస్ నేను మా గ్రూప్ కాల్స్లో పరిహాసాలతో ఆమెను నిత్యం ఆటపట్టించేవాళ్లం. మా బంధాన్ని చార్లెస్ నాకు చూపించిన ఊహించని మార్గాలను కూడా అమ్మ అర్ధం చేసుకుంది. అతను నాకు డ్రైవింగ్ స్కూల్ పాఠాలు కూడా కొని పెట్టాడు నా విద్యార్థి రుణంలో మిగిలిన భాగాన్ని తను తీర్చడం ద్వారా మా ఇద్దరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత నేను ఉద్యోగినై సంపాదించడం ప్రారంభించినప్పుడు, అతను నా అత్యంత తరచుగా గడిపే ప్రయాణ స్నేహితులలో ఒకడు గా మారాడు.మేం కలిసి ప్రయాణించేటప్పుడు, అపరిచితులు తరచుగా ఆయన నా తండ్రి అని అనుకుంటారు ఎందుకంటే మా సంబంధంలో సాంప్రదాయ తండ్రి–కూతురు సంబంధం లోని అన్ని లక్షణాలు ఉన్నాయి – అది నిజం కాదు అనేది తప్ప. ఇలాంటి క్షణాలు మా బంధం ఎంత అసాధారణమైనదో నాకు తరచు గుర్తు చేస్తాయి.నేను పసిబిడ్డగా అతని ఒడిలో కూర్చోనివ్వమని అడిగినప్పుడు చార్లెస్ తక్షణమే బంధాన్ని అనుభవించానని చెప్పాడు. నాకు తెలిసినది ఏమిటంటే, నా తల్లి (నా తండ్రి కాకుండా) మా ఇంటికి తీసుకువచ్చిన వారిలో నేను ఇష్టపడిన అంగీకరించిన ఏకైక వ్యక్తి ఆయనే. నా జీవితంలో ఆయన ఉండాలనే ఆలోచన ప్రణాళికా బద్ధంగా జరగనప్పటికీ... విధికి మాత్రం తన ప్లాన్స్ తనకు ఉన్నాయి.అందుకే నేను చార్లెస్ను ‘రెండవ తండ్రి‘ అనే పేరుకు స్థిరపడ్డాను. ఎల్లప్పుడూ షరతులు లేని మద్దతు, మార్గదర్శకత్వం ప్రేమను అందించే వ్యక్తిని మీరు అలా కాక ఇంకా ఏమని పిలుస్తారు? డిఎన్ఎ బంధం కాకపోవచ్చు కానీ అతను తండ్రికి సిసలైన నిర్వచనం.తన లాంటి డైనమిక్ పర్సన్ని మరెవరినీ నేను ఎప్పుడూ కలవలేదు. ఖచ్చితంగా, కొందరు సవతి నాన్నలతో చక్కని బంధాలను ఏర్పరుచుకుంటారు, కానీ అమ్మ మాజీ ప్రియుడితోనా? అంటే... అవును ఇది అసాధారణమైనది, వింతైనది కుటుంబం అంటే మీ ఇంటిపేరు పంచుకునే వ్యక్తుల కంటే ఎక్కువ అని చార్లెస్ నాకు అర్థమయ్యేలా చేశాడు – అది మీరు నిర్మించేది. నిజమైన నిబద్ధత లేబుల్స్ రూపంలో రాదు అని ఆయన నాకు నేర్పించారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఒకరి జీవితంలో కనిపించడానికి మీరు ప్రతిరోజూ చేసే పని. మనలో చాలా మందికి సంక్లిష్టమైన కుటుంబ బంధాలు ఉన్నాయి, కానీ మా సంబంధం ద్వారా నేను నేర్చుకున్నది... మిమ్మల్ని నిస్సందేహంగా కావాలని ఎంచుకునే వ్యక్తులే మిమ్మల్ని ఎక్కువగా అనుభూతి చెందేలా చేస్తారు. అది మీ రక్తం అయినా లేదా మీరు కనుగొన్న కుటుంబం అయినా సరే. -
చేతుల పరిశుభ్రత కోసం..!
విద్యార్థుల్లో మంచి ఆరోగ్య పద్ధతులను, పరిశుభ్రత అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇల్నెస్ టు ఫౌండేషన్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PEFI) ‘స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్’ (ఆరోగ్యకరమైన చేతులు, ఆరోగ్యకరమైన బాల్యం) అనే ప్రచారాన్ని ప్రారంబించింది. సుమారు వంద పాఠశాలలు కవర్ చేసేలా దాదాపు 40 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం అయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. గతేడాది దాదాపు 35 పాఠశాలల్లో దగ్గర దగ్గర 30 వేల మందికి పైగా విద్యార్థులను విజయవంతంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఈ ప్రచార కార్యక్రమం విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా పాఠశాల వాతావరణం తోపాటు సమాజంలోని ప్రజారోగ్య అవగాహనను బలోపేతం చేస్తోంది. ఈ వెల్నెస్ పద్ధతులను విద్యార్థులు జీవితాంత అనుసరించేలా చేయడం తోపాటు నిజమైన స్వస్థ్ భారత్ మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ ఇల్నెస్ టు వెల్నెస్ ఫౌండేషన్ సలహా మండలి చైర్పర్సన్ అనిల్ రాజ్పుత్ తెలిపారు. కేవలం సాంప్రదాయ ఉపన్యాసాలపై మాత్రమే ఆధారపడకుండా, వివిధ రకాల ఆకర్షణీయమైన, వినూత్న ఫార్మాట్ల ద్వారా హ్యాండ్వాషింగ్ టెక్నిక్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ 'స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్' ప్రచారం ప్రారంభ కార్యక్రమం సెప్టెంబర్ 6,2025న న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ - IIలోని బల్వంత్రాయ్ మెహతా విద్యా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణమైన హ్యాండ్వాషింగ్ టెక్నిక్లపై నిపుణుల సలహాలతో కూడిన ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్ను అందించారు కూడా.(చదవండి: Weight Loss Story: లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్) -
లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్
బరువు తగ్గడం అంటే సాధారణంగా అందరు అనుకునేది నోటిని కంట్రోల్ చేయడమే మార్గం అని. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం ముమ్మాటికి అది మాత్రం కాదని చెప్పేస్తోంది. అలాగే మాటిమాటికి బరువుని చెక్చేసుకుంటూ వర్కౌట్లు చేయడం కాదని అంటోంది. ఆహారంతో ఆరోగ్యకరమై, స్థిరమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే బరువుకి చెక్పెట్టగలమని చెబుతోందామె. ఆ విధంగానే తాను బరువు తగ్గానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని బయటపెట్టారామె. ఇంతకీ ఆమె ఎలాంటి చిట్కాను అనుసరించిందంటే..సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ తన వెయిట్లాస్ సీక్రెట్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారామె. ప్రతి కేలరీలను లెక్కించడం కంటే సమతుల్యతకు పెద్దపీటను వేయమని చెబుతున్నారామె. దాంతోపాటు తాను అనుసరించిన ఈ సింపుల్ చిట్కాలను కూడా అనుసరించినట్లు తెలిపింది. సింపుల్ చిట్కాలు..నేచురల్ ఆహారం..ఆహారం పట్ల వ్యామోహాన్ని నియంత్నించేలా సహజమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాలనే స్వీకరించాలి. ఆరోగ్య అవసరాలను, ఆకలి కోరికను తీర్చే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. ఆకలి సంకేతాల తోపాటు..సమతుల్యంగా తినడం మరవకూడదంటోంది. ఆకలి సంకేతాలు..సమతుల్య భోజనంపైనే ఫోకస్ పెట్టినట్లు నర్మగర్భంగా చెప్పింది.మైండ్ఫుల్గా తినడం..పోషకాహారాలను మనఃపూర్వకంగా తినాలి. ఏదో గబగబ ితినేయడం ాకాకుండా. వాటిని ఇష్టంగా, ఎలా తింటున్నాం అనే దానిపై అటెన్షన్ ఉండాలని చెబుతోందామె.ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత..చీట్మీల్ వంటి వాటికి చోటివ్వకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని ఆహారాలు మరింత ోపోషకాలు ఉన్నా కూడా ఆరోగ్యానికి బెస్ట్ అయితేనే తీసుకోవాలి. ఒకవేళ జంక్ఫుడ్ని తినేసినా..దాన్ని కరిగించేలా వర్కౌట్లు బాగా చేయాలి. ఆహరం కంటే..లైఫ్స్టైల్ మారాలి..కేవలం డైట్కే ప్రాధాన్యత ఇవ్వొద్దు. సమతుల్యంగా తినడం, మంచి ఆహారపు అలవాట్లును భాగం చేసుకునే ప్రయత్నం చేయాలంటోంది.బ్రేక్ చేయకపోవడం..ఏర్పరచుకున్న లక్ష్యానికి అనుగుణంగా తినేలా ఉండాలి. ఏ మాత్రం ఆశయాన్ని బ్రేక్ చేయని స్ట్రాంగ్ మైండ్సెట్తో ఉండాలి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గురిష్క్ కౌర్ బరువు తగ్గడం అనేది ఎలాంటి ఆహారం ఎంచుకోవాలి అనేదాని కంటే..మనసుకి సంబంధించిన పని అని అంటోంది. అది మన నియంత్రణలో ఉంటే ప్రతీది అవలీలగా జయించగలమని చెబుతోంది. ఆ విధమైన జీవనశైలి మార్పులతోనే సుమారు 59 కిలోలు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gurishq Kaur (@gurishqkaur) (చదవండి: 'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! వైరల్గా మహిళ భావోద్వేగ పోస్ట్) -
నింద, ఒత్తిడి, మౌనం..ఇంత పనిచేయిస్తాయా?
దేశవ్యాప్తంగా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, అవి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇందుకు సంబంధించి పలు అంశాలు వెల్లడించింది. తమకు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ, ఆర్థిక, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నారని.. దానివల్ల వారిలో ఆత్మహత్యల ఆలోచనలు వస్తున్నాయని వెల్లడించింది.1 లైఫ్ హెల్ప్లైన్కు ఏడాదికి సగటున 23వేల కాల్స్ వస్తుంటాయి. వీటిని కౌన్సెలర్లు విశ్లేషించి, సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ కష్టాల నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం. వాటిలో వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడం, వ్యవస్థాపరమైన సమస్యలు, నిరాశావాదం లాంటివి చాలా ఉంటాయి. ప్రతి కాల్లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యక్తులు ఎదురవుతారు. వాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం, మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కౌన్సెలర్లు మాట్లాడతారు.మానసిక ఆరోగ్యం మీద బహిరంగంగా జరగాల్సిన చర్చలను నింద, మౌనం ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ డేటా చెబుతుంది. చాలా కుటుంబాల్లో వ్యక్తులు తమ సమస్యలను చెప్పడానికి అనుమతించరు. ఎవరైనా తమను తప్పుగా అనుకుంటారేమో, లేదా సమాజంలో చిన్నచూపు చూస్తారేమోనన్న భయంతో కూడా తమ లోపలి ఆలోచనలను బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోతుంటారు. తమ లోపలి భావాలను బయటపెట్టకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దాంతో వాళ్లు మరింత ఒంటరి అయిపోయినట్లు భావిస్తారు. ఈ తరహా ట్రెండ్లను బట్టి చూస్తే.. జాలి, సమయానికి జోక్యం చేసుకోవడం లాంటి వాటి ప్రాధాన్యం సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 1లైఫ్ భావిస్తోంది.హైరిస్క్ ఫోన్ కాల్స్ విషయంలో..రిలేషన్షిప్ సమస్యలు (సుమారు30%): గొడవలు, బ్రేకప్ లేదా వైవాహిక సమస్యలు చాలావరకు ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్నాయి. కాల్ చేసేవారిలో చాలామంది తమ మాట వినిపించుకోవడం లేదని, ఒంటరిగా అయిపోయామని చెబుతూ ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని భావిస్తారు. కుటుంబాల్లో సరిగా మాట్లాడుకోలేకపోవడం, యుక్త వయసులో భావోద్వేగాలను తట్టుకునే శిక్షణ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంతవరకు వస్తుంది. సామాజికంగా చురుగ్గా ఉంటున్నా, విజయాలు సాధిస్తున్నా కూడా వ్యక్తిగత సంబంధాల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నవారు తమలో తామే కుమిలిపోతున్నారని కౌన్సెలర్లు గుర్తించారు.అప్పులు, ఆర్థికసమస్యలు (25%): నిరుద్యోగం, పెరిగిపోతున్న అప్పులు, బెట్టింగ్ యాప్లలో నష్టాలు, తిరిగి ఇవ్వని వ్యక్తిగత రుణాలు, ఆర్థిక మోసాలకు గురికావడం లాంటివి చాలామందిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా విఫలమయ్యామన్న కుంగుబాటు, అప్పులవాళ్లు, కుటుంబసభ్యుల నుంచి పెరిగిపోయే ఒత్తిడి వల్ల ఇక నిస్సహాయంగా మిగిలిపోతారు. చాలామందికి తమ కుటుంబాలను పోషించలేకపోవడంతో సిగ్గుపడి, అది చివరకు తీవ్ర నిరాశలోకి దించేస్తుంది. ఆర్థిక అక్షరాస్యత, సమాజం నుంచి మద్దతు లాంటివి బలహీనంగా ఉండడంతో ఊరట కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్దామనుకున్నా అవి ఉండవు.విద్య/వృత్తిపరమైన ఒత్తిడి (సుమారు 22%): విద్యార్థులు, యువ వృత్తినిపుణులు తరచు తమకు పరీక్షలు, వృత్తిపరమైన సమస్యలు, పనివాతావరణం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెబుతారు. విఫలం అవుతామన్న భయం, అంచనాలను అందుకోలేకపోవడంతో తరచు తమమీద తమకే అనుమానం వచ్చి, ఆందోళనతో ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. పక్కవాళ్లతో పోల్చిచూడడం, సోషల్ మీడియాలోనూ పోలికలు ఎక్కువ కావడంతో ఈ సమస్యలు ఎక్కువైపోయి తాము వెనకబడుతున్నామని అనుకుంటారు. మెంటార్లు లేదా మద్దతిచ్చే వృత్తివాతావరణం లేకపోవడంతో చాలామంది తమ పరిస్థితి డెడ్ ఎండ్ అని భావిస్తారు.మానసిక ఆరోగ్య సమస్యలు (సుమారు 10%): ఒంటరితనం, ఒత్తిడి, కుంగుబాటు, పనికిరామన్న భావనలు ఎక్కువమంది కాలర్స్లో కనిపిస్తున్నాయి. కుటుంబం నుంచి సమాజం నుంచి తగిన మద్దతు లేకపోతే చాలామంది మౌనంగా బాధపడుతూ, కనిపించని ఇబ్బందిలో మునిగిపోతారు. కొందరు సాయంకోసం ప్రయత్నించినా తమను ఎద్దేవా చేస్తున్నారని, కొట్టిపారేస్తున్నారని చెబుతూ మరింత ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు లేకపోవడంతో వారు సరైన సమయానికి సాయం అందుకోకవడం కష్టమవుతోంది.సామాజిక సమస్యలు (సుమారు 12%): ఎల్జీబీటీక్యూ లాంటి కొన్ని వర్గాలకు చెందినవారు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది, తరచు వీరిని వెలివేస్తారు, లేదా తాము అంగీకరించని గుర్తింపుతో జీవించాల్సి వస్తుంది. ఇలా తరచు ఉండే ఒత్తిడి వల్ల వారికి తప్పనిసరిగా ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. చాలా సందర్భాల్లో కుటుంబం, సమాజం వెలివేయడంతో వాళ్లకు చాలా అవసరమైన మద్దతు దొరకదు. తమ గుర్తింపును నిరూపించుకోవడానికి పోరాడుతుంటే తరచు ఎదురయ్యే ఛీత్కారాలు వారికి తీవ్ర మానసిక సమస్యలను సృష్టించి, తప్పించుకోవడాన్ని అసాధ్యం చేస్తాయి.ఈ మేరకు 1 లైఫ్ ఆత్మహత్యల నిరోధ హెల్ప్లైన్లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్ మిస్ రెబెక్కా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక భరించలేని బాధ, భయం, లేదా ఒంటరితనంతో పోరాడే ఒకవ్యక్తి ఉంటారు. నిజానికి వాళ్లు చనిపోవాలని అనుకోరు. కానీ తమ కష్టాలకు ముగింపు కోరుకుంటారు. వాళ్లను జడ్జ్ చేయకుండా, వారికి ఒక ఆశ కల్పించేలా వినడం ద్వారా జీవించడానికి తగిన కారణాలు కనుగొనడంలో వారికి సాయం చేయగలం. ఒకసమాజంగా, మనం తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం, సామాజిక సమస్యలు తగ్గించడం, బేషరతుగా మద్దతు ఇవ్వడం లాంటివి చేయాలి” అని వివరించారు.కష్టాల్లో ఉన్నవారు మౌనంగా బాధపడడం కంటే సహాయం పొందడాన్ని 1లైఫ్ ప్రోత్సహించింది. తగిన సమయానికి చేసే కౌన్సెలింగ్.. నిరాశను అనుకూలతగా మార్చగలదని సంస్థ పేర్కొంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలను రూపొందించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, ఉద్యోగ నియామక సంస్థలు, సమాజంలో నాయకులు కూడా ప్రోయాక్టివ్ చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యల నిరోధం అనేది కేవలం హెల్ప్లైన్ల బాధ్యత మాత్రమే కాదని 1లైఫ్ నొక్కిచెబుతోంది. కుటుంబాలు, కార్యాలయాలు, మొత్తం సమాజం కలిసికట్టుగా చేయాల్సిన పని అని పేర్కొంది. -
కొద్దిసేపు ఆనందం..డిప్రెషన్ జీవితాంతం..!
నగరం మత్తెక్కుతోంది.. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన కొందరు వాటిని తరలించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మత్తులో జోగుతూ వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్లు, పబ్బులు దాటి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం మత్తు పదార్థాల అమ్మకాలకు అడ్డాలుగా మారుతున్నాయి.. ఇదేదో ఉత్తిగనే చెప్పే మాటలు కావు.. ఇటీవల జరిగిన ఘటనలే దీనికి బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలు రకాల డ్రగ్స్తో పాటు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసే గంజాయి వ్యర్థాలు గుప్పుమంటున్నాయి.! వరుస ఘటనల్లో విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటూ వెలుగు చూస్తున్న వాస్తవాలు తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్కు చెక్ పెట్టేదెలా..? విద్యార్థులకు డ్రగ్స్ దూరం చేసేదెలా..? అనే అంశాలపై తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ‘ఓపెన్ చేస్తే’.. నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్కు చెందిన కొందరు విద్యార్థులు డ్రగ్స్ సరఫరాలో భాగస్వాములైనట్లు గుర్తించారు. ఏకంగా యూనివర్సిటీకి సరఫరా చేసే డిక్షనరీ మధ్యలో, మట్టిగాజుల మాటున డ్రగ్స్ సరఫరా చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. అయితే కొన్ని కొరియర్ సంస్థల నుంచి రెండేళ్లలో సుమారు వంద కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విష సంస్కృతి విద్యార్థులను ఆకర్షించడం, భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన కలిగించేలా.. నగర యువత గంజాయి, డ్రగ్స్ బాధితులగా మారిపోతున్నారన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. పబ్స్ మొదలు ఇంటర్, డిగ్రీ, వర్సిటీ హాస్టల్స్ను డ్రగ్స్ అడ్డాలుగా మార్చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తున్న యువత వరకూ ఎంతో మంది మత్తుకు బానిసైపోతున్నారు. స్టైల్, ఫ్యాషన్ అంటూ మద్యం సేవించడం మొదలు డగ్స్ర్ వైపు అడుగులు వేసే విషసంస్కృతి వేళ్లూనుకుంటోంది. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే సమాజంలో తలెత్తుకోలేని విధంగా, నేరస్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. పని ప్రదేశాల్లో, తరగతిగదుల్లో స్వేచ్ఛగా ఉండాల్సిన యువత కటకటాల వెనుక ఊచలు లెక్కబెడుతున్నారు. సమాజానికి, కుటుంబానికి శత్రువులుగా మారిపోతున్నారు. క్షణికానందం కోసం జీవితాంతం పలు మానసిక రుగ్మతలకు, రోగాలకు, మెదడు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్స్ డీ–అడిక్షన్ సెంటర్లకు.. ఒక దఫా అలవాటుపడితే డ్రగ్స్ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంత సులువేంకాదని నిపుణులు చెబుతున్నారు. దీనిని నుండి బయట పడడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్కు భారీ సంఖ్యలో బాధితులు చేరుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే మద్యం, గంజాయి, మత్తు పదార్థాల భారి నుంచి విముక్తి కోసం 612 మంది డీ–అడిక్షన్ కేంద్రానికి వచ్చారని అధికారిక నివేదికలు చెబుతున్నాయంటే మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.యాంటీ సోషల్ పర్సన్గా మారతారు.. మద్యం తాగే వారితో పోలి్చతే డ్రగ్స్, గంజాయి బాధితులు వేంగంగా బానిసలైపోతారు. మానసిక ఆస్పత్రికి పాలీసబ్స్టెన్స్ కేసులు అధికంగా వస్తున్నాయి. సమయానికి డ్రగ్స్ దొరక్కపోతే పిచి్చవారిగా ప్రవర్తిస్తారు. విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమీ లేకున్నా ఎవరో వస్తున్నారని భయపడటం, ఆందోళన, అనుమానాలు, అపోహలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర పట్టదు. ఇటువంటి వారి కుటుంబాల్లో గృహ హింస ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, రఫ్గా వ్యవహరించడం, వైలెంట్గా మారిపోవడం జరుగుతుంది. ఇటువంటి వారితో చాలా ప్రమాదం. సామాజిక వ్యతిరేక వక్తిత్వానికి అలవాటుపడతారు. – డాక్టర్ ఆర్ అనిత, ఎర్రగడ్డమానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్అవార్డింగ్ హార్మోన్స్తో ప్రమాదం.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో అవార్డింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో వ్యక్తి నేను చాలా గొప్పవాడిననే ఫీలింగ్లో ఉంటాడు. నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా నాకు ఎదురు లేదనే ఓవర్ కాని్ఫడెన్స్లోకి వెళతాడు. ప్రవర్తనలోనూ విపరీత ధోరణి కనిపిస్తుంది. క్షణికానందం కోసం వెంపర్లాడతాడు. ఆ వెంటనే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. డ్రగ్స్లో ఉండే కెమికల్స్ మెదడులోని న్యూరాన్స్పై తీవ్రపభ్రావం చూపిస్తాయి. నెమ్మదిగా జ్ఞాపకశక్తి నశిస్తుంది. తీవ్ర ఒత్తిడి, భయం, ఆందోళనకు గురవుతాడు. హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. ఫిట్స్, బీపీ వంటివి వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో కలసి తొలిసారి ఏదో సరదాగా రుచి చూద్దామనుకుంటే.. చివరికి మానుకోలేని వ్యసనంగా మారిపోతుంది. ఇటువంటి వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు సైతం పిల్లల ప్రవర్తన, నడవడికపై దృష్టిసారించాలి. డగ్ర్ దొరక్కపోతే ఆత్మహత్య ఆలోచనలకు వెళ్లిపోతారు. ప్రతి ఒక్కరినీ అనుమానించడం, పరిస్థితులను సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం, ఎదుటివారి మాటలను అంచనా వేయలేకపోవడం, సెల్ఫ్ జడ్జిమెంట్ చేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. – డాక్టర్ బీ వెంకట నాని కుమార్, జనరల్ సర్జన్ (చదవండి: ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్) -
ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్
‘ఫ్యాషన్ అంటే మనల్సి మనం అందంగా తీర్చిదిద్దుకోవడం.. సౌందర్యంగా కనిపిస్తూనే సౌకర్యంగా ఉండటం మరింత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ మధ్యనే సరికొత్త కథాంశంతో విడుదలైన ‘పరదా’ సినిమాలో మగువల భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెరకెక్కించాం. ఇది ప్రభావవంతమైన కథాంశం, నటన పరంగానూ అందరి ప్రశంసలు పొందింది.’ అంటూ చెప్పుకొచ్చారు అందాల తార అనుపమ పరమేశ్వరన్. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ ఫ్లాగ్ప్ స్టోర్లో సోమవారం సందడి చేశారు. ఈ వేదికపై నూతనంగా రూపొందించిన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫ్యాషన్ ట్రెండ్స్, తదుపరి సినిమాల విశేషాలు ఆమె మాటల్లోనే..! హైదరాబాద్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ హంగులను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నా స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా కాటన్, స్మూత్కాటన్ ఇష్టపడతాను. గ్రాండ్ లుకింగ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. మన మూలాల్లోని ఫ్యాబ్రిక్, సంస్కృతి–అధునాతన డిజైనింగ్ సమ్మిళిలితం చేస్తే ఎక్కువగా ఆకర్షిస్తుంది. వాటిని ప్రోత్సహిండం ఇష్టం. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అమ్మాయిలకు అనువుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి శారీస్, ఈవెంట్స్ను బట్టి డ్రెస్ వేసుకుంటా. మహిళల ఫ్యాషన్ వేర్ అంతర్గత శక్తిని, మానసిక స్థితిని తెలియజేస్తుందని నమ్ముతాను. నాకు రెడ్ కలర్, మస్టర్డ్ యెల్లో రంగుల దుస్తులే నచ్చుతాయి. రెడ్ అంటే పవర్ఫుల్.. నేను ఎక్కువ షాపింగ్ చేయను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లినప్పుడు కచి్చతంగా షాపింగ్ చేస్తుంటాను. సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి షూటింగ్స్ వెళ్లినప్పుడు ఎయిర్పోర్ట్లో, సందడి లేని ఇతర షాపింగ్ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తాను. ‘డిఫరెంట్ బై డిజైన్’ అనే ఫిలాసఫీని ప్రతిబింబించేలా బిబా అందిస్తున్న దసరా కలెక్షన్ మన సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తుంది. వరుస షూటింగ్స్తో బిజీ.. సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాతావరణంలో సరికొత్త అనుభూతిని పొందుతాను. ఈ మధ్యే తెలుగులో నా ‘పరదా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ‘కిష్కిందపురి’ సినిమా విడుదల కానుంది. కిష్కిందపురి తరువాత ‘బైసన్’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ రెంటితో పాటు ‘భోగీ’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది షూటింగ్ పూర్తి కానుంది. మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాను. ఇవి కాకుండా మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా. -
వయసు పెరిగినా..నోరు బోసి పోదు..!
వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలు ఉంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పే కథనమిది. ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో కష్టపడాల్సినంత పడి... తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే... ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అ΄ోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడి΄ోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడి΄ోవడమో లేదా వదులై΄ోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి.వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే సమస్యలు...సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు అరిగి΄ోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు...ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో... యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా...పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై–బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా... బీపీ, షుగర్లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు, మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జైటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్... ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో సంపాదన లేమితో : వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం ఉందక΄ోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది. పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్కూ ఇబ్బందులు కలుగుతాయి.వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలుడయాబెటిస్... పళ్ల సమస్యలు : ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో... ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్ప్లానస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.నివారణకు సూచనలివి : పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ΄ాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి.గుండెజబ్బులూ... చిగుర్ల వ్యాధులు...ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో... తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూపోతుంది. కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది.నివారణకు సూచనలివి : ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే... పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు. పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి (ప్లాక్) వంటివి, పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాదముంటుంది. నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి.చివరగా... ఒకవేళ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, దురదృష్టవశాత్తూ తమ పళ్లు కోల్పోయినప్పటికీ... వాళ్ల దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నప్పటికీ, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనకు అందుబాటులో ఉన్న నేటి డెంటిస్ట్రీలో అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చడం, ఎలాంటి దంతసమస్యలకైనా పరిష్కారాలను అందించడమూ పూర్తిగా సాధ్యమయ్యే విషయమే.ఆర్థరైటిస్... పంటి సమస్యలుదాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగి΄ోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందులు) వాడటం సాధారణం. ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి. లాలాజల గ్రంథులు...నోటి సమస్యలు నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ బాధితులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుర్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సూచనలూ – మరికొన్ని చికిత్సలు... లాలాజల స్రావాలు తగ్గి తరచూ నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్ను చాలా తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ను మానివేయడం మేలు.హైబీపీ – పంటిసమస్యలుఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై–బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడి మందుల) వల్ల... హై–బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతోపాటు మరో ప్రమాదమూ ఉంది. హై–బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా... పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది. క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్ఎఫెక్ట్గా జింజివల్ హైపర్ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే ఇది కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది.నివారణకు సూచనలివి...హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్ (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
మరణాన్ని ఓదార్పు అడగకు
బతుకులో జ్వాలలు ఉన్నాయని శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడం పరిష్కారం ఎలా అవుతుంది అంటారు విజ్ఞులు. ‘అన్ని కష్టాలకు విముక్తి చావే’ అనే మాటకు మించిన అవివేకం లేదంటారు కౌన్సెలర్లు. బలవన్మరణం ఆ వ్యక్తిని చనిపోయాక కూడా వెంటాడుతుంది. ఒక అపప్రథగా... కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. మనిషి లేని లోటు ఏం చేసినా తిరిగి రాదు. అటువంటి సమయంలో మరణం ఎందుకు? నిరాశ, నిస్పృహ పరిస్థితులు, సవాళ్లు ఎవరికీ కొత్త కాదు. బతకడమే చేయవలసింది. నిపుణుల సలహాలతో కథనం.అంకెలు దుర్మార్గమైనవి. అవి నిజమైన నష్టాన్ని చూపించవు. కావాలంటే ఈ అంకె– 1,80,000 చూడండి. దీనిని చూస్తే ఏమీ అనిపించదు. కాని మన దేశంలో ప్రతి ఏటా ఇంతమంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. వీరందరి ఫొటోలను సముద్రతీరం వెంబడి ప్రదర్శిస్తే ఎన్ని కిలోమీటర్ల తీరం కావాలి? అలా ప్రదర్శిస్తే తెలుస్తుంది తీవ్రత,,, ఇంత మంది చనిపోతున్నారా అని. వీరిలో కనీసం 1,20,000 మంది పురుషులు. ఇప్పుడు ఆలోచించండి. పితృస్వామ్య ఆధారితమైన మన సమాజంలో పురుషుడు చనిపోతే ఆ ఇంట్లోని ఎంతమంది సభ్యులు దిక్కులేనివారు అవుతారు. జీవితాలు తల్లకిందులు చేసుకుంటారు. మరెన్నో కష్టాల్లో కూరుకుపోతారు. కరోనా అనో మరోటనో మహమ్మారులను చూసి భయపడటం కాదు. ఈ భూగ్రహాన్ని పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఆత్మహత్యే. ప్రతి ఏటా అన్ని దేశాలలో కలిపి 8 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇది ఒక రకంగా కాకిలెక్కే. అసలు లెక్క తెలియక పోవడమే మంచిది. మరో విషయం తెలుసా? ప్రతి మరణానికీ ఒకరు చనిపోవడమే కనిపిస్తుంది... కాని ఆ సమయానికి మరో ఇరవై మంది ఆత్మహత్యాయత్నం చేసి బతికి బయటపడ్డ వాళ్లు ఉంటారు.ఆరుకు ఒకరుప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 29 మధ్య వయసు లో ఉన్న పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశంలోని ప్రతి ఆరు ఆత్మహత్యల్లో ఒకటి ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం–∙చదువు ఒత్తిడి ∙పని చోట పీడన∙బంధాలలో దగా ∙ఆర్థిక సమస్యలు ∙అన్ని జీవన పార్శా్వలలో బెస్ట్గా ఉండమని కోరే సాంఘిక నియమంఇదొక జబ్బుఆత్మహత్యను జబ్బుగా ఎవరూ చూడరు. కాని ఇదొక జబ్బు. పట్టలేని ఉద్వేగం వల్ల, క్షణికావేశం వల్ల, నేను చస్తే అవతలివాళ్లు పశ్చాత్తాపంతో బాధ పడాలి అన్నట్టుగా, సమస్యలకు పరిష్కారమే ఉండదన్న నెగెటివ్ స్వభావం వల్ల, పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువివ్వాలనే భావన వల్ల, నోరు తెరిచి సమస్యను బయటపడేయని స్వభావం వల్ల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరచి చూస్తే ఇవన్నీ మెదడు చేసే విన్యాసాలే. కెమికల్ రియాక్షన్సే. ఉద్వేగాలను, ఆవేశాలను దాటి వస్తే, మనం పోయి మరొకరిని సాధించడమనే భావన ఎంతటి హాస్యాస్పదమో ఎరుకలోకి వస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే నమ్మకం కలిగి ఉంటే, పరువు ప్రతిష్టలు తర్వాత ముందు ప్రాణం ముఖ్యం అనుకుంటే, ఆత్మాభిమానం కంటే సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అనుకుంటే ఆత్మహత్యలు జరగవు. మరో విషయం ఏమిటంటే ఒకరికి ప్రపంచ సమస్యగా ఉండేది ఎదుటివారికి అసలు సమస్యే కాకపోవచ్చు. ‘ఇంత చిన్న విషయానికి చనిపోయాడా?’ అని ఆశ్చర్యపోతారు తప్ప జాలి కూడా చూపరు. మరి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆత్మహత్య ఆలోచనలు వస్తే జ్వరానికి మాత్ర మింగినట్టు ఆ ఆలోచనలు పోయే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మిత్రుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి. అంతే చేయవలసింది. చనిపోవడం కాదు.భళ్లున తెల్లారుతుందిఈ చీకటి రాత్రి విషమ పరీక్షలు ఎన్ని పెట్టినా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే మరునాడు భళ్లున తెల్లారుతుంది. ఆ వెలుతురు దారి చూపిస్తుంది. కొత్త ఊపిరి వస్తుంది. కాని రాత్రే శాశ్వతం అన్నట్టు ప్రాణాలు తీసుకుంటారు కొంత మంది. గత రాత్రి వ్యక్తి చనిపోయినా మరుసటి రోజు లోకం స్తంభించదు. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. సినిమా లు ఆడుతుంటాయి. కెఫేలు బిజీగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నిర్జీవం కావడం తప్ప అంతా మామూలుగా ఉంటుంది. ఆ అంతా మామూలుగా ఉండే జగత్తులో ఉంటూ జీవితాన్ని మిస్ కాకుండా ఉండాలనే భావన కలిగించుకుంటూ ఉండాలి. అందరూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఎవరిని కదిపినా తెలుస్తుంది. మరి వారంతా చనిపోనప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అనుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఈ కమ్యూనికేషన్ రోజుల్లో 24 గంటలు ఎన్నో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాల్ చేస్తే సాయం చేస్తారు. ఆ సాయం పొందాలి. వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ బలాన్ని, బంధుబలాన్ని, స్నేహబలాన్ని, సమాజ బలాన్ని తోడు తీసుకోవాలి. సోషల్ మీడియాలో సమస్యను పంచుకుని బయటపడినవారు ఉన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధులు వీరంతా పౌరులకు ఏదో ఒక మార్గం చూపాల్సినవారే. వారి సాయం పొందాలి. అన్నింటికి మించి జీవితాన్ని సరళంగా, సులభం గా నిర్మించుకుంటే, ఆరోగ్యకరమైన జీవన విధానాలు, అలవాట్లు, క్రమశిక్షణ, ఆహారం, స్నేహితులు.. తోడు చేసుకుంటే జీవించడంలో ఆనందం తెలుస్తుంది.చెప్పుకునే మనిషీ కోరుకునే అండమనిషి తనకొచ్చే కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోడు. ఆ కష్టాలను వినే మనిషి లేకపోవడం వల్ల, నేనున్నాననే భరోసా దొరకకపోవడం వల్ల, నిస్సహాయత ఫీలయ్యి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడం ఒక నిమిషపు నిర్ణయం కాదు చాలామంది విషయంలో. కొందరు రోజుల తరబడి దీని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన మార్పులు వ్యక్తులలో, కుటుంబ సభ్యులలో గుర్తించడం చాలామటుకు సాధ్యం. సమస్య ఏమిటో తెలుసుకుంటే, వారిని కదిలించి రాబట్టగలిగితే వారు ప్రమాదపు అంచుకు వెళ్లరు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులే ఒకరిని మరొకరు గమనించలేనంతగా బిజీగా ఉంటూ అంతా అయ్యాక కళ్లు తెరుస్తున్నారు. -
లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.ఆ వీడియోలో బీహార్కి చెందిన వ్యక్తి లండన్లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అంతేగాదు ఒక బిహారీ లండన్లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk) (చదవండి: భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..) -
మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!
ఒకప్పుడు డ్యాన్స్ క్లాస్లో చేరుతున్నారంటే.. నృత్యంలో నైపుణ్యం సాధించడానికి అని అనుకునేవాళ్లు. ఇప్పుడు అది క్యాలరీల ఖర్చుకో, వెయిట్లాస్ కోసమో అన్నట్టు మారింది. నగరంలో డ్యాన్స్ను ఆసక్తితోనో, ఆదాయ మార్గంగా మలుచుకుందామనో అనుకునేవారికన్నా.. సమూహంలో కలిసిపోవడానికి, సందడిగా గడపడానికి, వీటన్నింటినీ మించి ఆరోగ్య మార్గంగా చూస్తున్నవారే ఎక్కువయ్యారు. బరువులు మోస్తూ వ్యాయామం చేయడానికి ఇష్టపడని, జిమ్ వర్కవుట్స్కి దూరంగా ఉండే వారు ఫిట్నెస్ సాధించడానికి డ్యాన్స్ ప్రత్యామ్నాయంగా అవతరించింది. నగరంలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో నేమ్బోర్డుల్లో డ్యాన్స్కు అదనంగా‘ఫిట్నెస్’ జోడిస్తున్నారు. ఏరోబిక్స్ను ఒక వ్యాయామంగా కన్నా డ్యాన్స్ వర్కవుట్గానే చాలా మంది ఇప్పటికీ పరిగణిస్తున్నారు.అధ్యయనాలు చెబుతున్న లాభాలు..అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్సైజ్ ప్రకారం, జుంబా గంటకు 300–600 కేలరీల మధ్య బర్న్ చేయగలదు, ఇది ఉత్సాహంగా ఉంటూనే బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన మార్గం అని.. జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, డ్యాన్స్ కార్డియో హృదయనాళాల ఆరోగ్యంతోపాటు మొత్తం ఫిట్నెస్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. క్యాలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం. జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్లోని అధ్యయనం ప్రకారం, హిప్–హాప్ డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.క్యాలరీలు కరుగుతున్నాయ్..సుమారు 100కిలోల బరువున్న వ్యక్తి నిమిషం పాటు నృత్యం చేస్తే దాదాపు 1.4 క్యాలరీలు ఖర్చు అవుతాయి. 70కిలోల బరువున్న వ్యక్తి 20 నిమిషాలు నృత్యం చేస్తే దాదాపు 196 క్యాలరీలు ఖర్చు అవుతాయని, సావధానంగా చేయడం వల్ల 20 నిమిషాలకు 140 నుంచి 150 క్యాలరీలు, మధ్యస్థంగా చేయడం వల్ల 160 నుంచి 180 క్యాలరీలు, వేగంగా చేసే విధానం వల్ల 180 నుంచి 200 క్యాలరీలు ఖర్చవుతాయని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ డ్యాన్స్ వర్కవుట్స్ని వారంలో 2 నుంచి నాలుగు సార్లు తమ వ్యాయామ రొటీన్లో భాగంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లాటిన్ అంతర్జాతీయ సంగీతాన్ని సరదా, ఉత్సాహభరిత నృత్య కదలికలతో మిళితం చేసే నృత్య వ్యాయామం జుంబా. ఇది వ్యాయామాన్ని డ్యాన్స్ పారీ్టగా మారుస్తుంది. దీని ద్వారా మనం వ్యాయామం చేస్తున్నామనే విషయం మర్చిపోయేలా ఇది రూపొందింది.లాభాల నృత్యం.. ఫుట్ వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పుతుంది. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. కొన్ని సైకలాజికల్, బిహేవియర్ సమస్యలకు నాన్ వెర్బల్ సైకోథెరపీగా పనిచేస్తుందని డాన్స్ థెరపిస్టులు అంటున్నారు. డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్ వంటి సమస్యలను దూరంచేస్తుంది. ఎముకల్లో క్యాల్షియం సమన్వయానికి, ఆస్టియోపొరోసిస్ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. లో బీపీ, అధిక కొలె్రస్టాల్ సమస్యలకూ సమాధానం ఈ డాన్స్. కోర్ మజిల్స్ పటిష్టతకు సహకరిస్తుంది. ఫీల్గుడ్ హార్మోన్ లైన అడ్రినలిన్, సెరొటోనిన్, ఎండారి్ఫన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. బాడీ లాంగ్వేజ్ మెరుగుపరుస్తుంది. కాళ్లు, హిప్ జాయింట్స్తో పాటు లోయర్ పార్ట్ మరింత దృఢత్వాన్ని సంతరించుకునేందుకు దోహదం చేస్తుంది. డ్యాన్స్ఫ్లోర్.. పారా హుషార్.. చల్లని వాతావరణంలో నర్తించేటప్పుడు ముందుగా బాడీ వార్మప్ కావాల్సిందే. లేకపోతే గాయాలకు కారణమవుతుంది. బాల్రూమ్ ప్రాక్టీస్కు తగిన షూస్ ఎంపిక చేసుకోవాలి. టర్న్ తిరిగేటప్పుడు అత్యుత్సాహం కూడదు. షోల్డర్ జాయింట్స్ మీద ఒత్తిడిని గమనించాలి. సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణీత సమయంలో చేయడం మేలు. ఒత్తిడిని జయిస్తుంది..ఆరోగ్యసాధనకు ఉపకరించి పని ఒత్తిడిని దూరం చేస్తుంది నృత్యం. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.. ‘కార్పొరేట్ ఉద్యోగుల్లో అత్యధికులు జంటగా చేసే సల్సా నృత్యం పట్ల మక్కువచూపుతున్నారు. చక్కని ఫిట్నెస్కు ఇదో మార్గమని వారు చెబుతున్నారు. కనీసం గంట పాటు చేసే నృత్యం 450 నుంచి 550 క్యాలరీలు ఖర్చవుతాయని స్పెషల్ డ్యాన్స్ ట్రైనింగ్ ప్యాకేజ్లు అందిస్తోన్న స్టెప్స్ అకాడమీ నిర్వహకులు పృధ్వీరాజ్ చెప్పారు.డ్యాన్స్ మస్ట్.. లుక్ బెస్ట్.. ‘బాగా డాన్స్ చేయడమంటే బాగా కని్పంచడమే’ అని ప్రసిద్ధ ఫిట్నెస్ శిక్షకురాలు దినాజ్ వర్వత్ వాలా సూత్రీకరించారు. సిటీలో ఇంటర్నేషనల్ డ్యాన్సింగ్ స్టైల్స్కు భారీగా ఆదరణ ఉంది. వీటిలో చిన్నారుల్ని బాలీవుడ్ డ్యాన్స్ స్టైల్స్ ఆకర్షిస్తుంటే.. టీనేజర్స్ హిప్–హాప్, వర్కింగ్ పీపుల్ సల్సాని లైక్ చేస్తున్నారని డ్యాన్స్ మాస్టర్ బాబీ చెబుతున్నారు. హిప్–హాప్ డ్యాన్స్.. హిప్–హాప్ వర్కౌట్లు ఫిట్నెస్ను తాజా నత్య కదలికలతో కలపడానికి ఒక గొప్ప మార్గం. ఈ దినచర్య తరచూ బలం, చురుకుదనం, సమన్వయాన్ని కలిగి ఉంటాయి. ఉల్లాసమైన సంగీతాన్ని ఇష్టపడేవారి ఫిట్నెస్ దినచర్యకు కొంచెం చురుకుదనాన్ని జోడిస్తుంది హిప్–హాప్. (చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
సంభాషణ హృదయాల కలయిక
మనిషినీ జంతువునీ వేరు చేసేది మాట, మనిషినీ మనిషినీ వేరు చేసేదీ మాటే. నిజమైన సంభాషణ మనకు జీవం పోస్తుంది. మనలో ధైర్యాన్ని నింపే దీపం, మనలో ఆశను వెలిగించే వెలుగు. అది మన గమ్యాన్ని నిర్దేశించే మార్గదర్శి, మనలోని భయాన్ని జయించే సైనికుడు. మాటే మన కీర్తిని నిర్మించే శిల్పం, మాటే భవిష్యత్తు అనే వనంలో విత్తే తొలి విత్తనం. మనం పలికే ప్రతి మాటా ఒక సంబంధానికి మూల బీజం. అది బంధాలను విడగొట్టగలదు, లేదా కొత్త సంబంధాలను స్థాపించగలదు.అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ్ఢ స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ఇతరులకు బాధ కలిగించని, సత్యంతో కూడిన, ప్రియమైన, మేలు చేసే మాటలను పలకడం, మరియు ఆత్మ పరిశీలన చేయడం – ఇవి తపస్సుగా చెప్పబడ్డాయి. ఈ శ్లోకం సంభాషణ కేవలం మాటల మార్పిడి కాదని, అది ఒక పవిత్రమైన సాధన అని తెలియజేస్తుంది.సంభాషణ ఒక మహోన్నతమైన కళ. అది కేవలం పెదవుల నుండి వచ్చే పదాల సమూహం కాదు, అది ఆత్మల మధ్య జరిగే గానం. నిజమైన సంభాషణ మన అంతరంగపు చీకటిలో వెలుగును నింపుతుంది, కన్నీళ్లను ఆనందపు జల్లులుగా మారుస్తుంది, యుద్ధం లేకుండానే విజయాన్ని సాధిస్తుంది.దీనికి అత్యుత్తమ ఉదాహరణ శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం. ధర్మానికి, కర్మకు మధ్య చిక్కుకున్న అర్జునుడి మనసు సంశయం అనే దట్టమైన పొగమంచులో నిలిచిపోయింది. కానీ, శ్రీకష్ణుని మాటలు కేవలం గొంతు నుండి రాలేదు; అవి జ్ఞానపు సూర్యోదయంలా ఆ పొగమంచును తొలగించి, మార్గాన్ని స్పష్టంగా చూపాయి. ప్రేమతో, కరుణతో నిండిన ఆ మాటలు, అర్జునుడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, శాంతితో కూడిన విజయాన్ని అందించాయి.మాటలకు ఉన్న శక్తికి మరొక ఉదాహరణ, ఒక అసాధ్యమైన సముద్రాన్ని చూసి నిరాశలో ఉన్న హనుమంతుడు ఒకప్పుడు, తన అపారమైన శక్తిని మరచిపోయే ఒక శాపంతో బంధించబడిన హనుమంతుడు నిరాశలో ఉన్నప్పుడు, ఆ శాపాన్ని తొలగించే మంత్రం లాంటి జాంబవంతుడి మాటలు, ‘ఓ వాయుపుత్రా! నీ అపార శక్తిని మరచితివి!’ అని గర్జించాయి. ఆ మాటల గర్జనకే, హనుమంతుడిలో నిద్రపోయిన సామర్థ్యం తిరిగి మేల్కొల్పబడింది. ఆ ఒక్క మాటే వేలాది యోజనాల సముద్రాన్ని దూకే శక్తినిచ్చింది. మాట అంటే కేవలం ఒక ధ్వని కాదు, అది మనలోని అంతులేని సామర్థ్యాన్ని బయటకు తెచ్చే ఒక ప్రేరణ.సంగచ్ఛధ్వం సంవదధ్వం, సం వో మనాంసి జానతామ్అందరూ కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, మీ మనసులు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఈ సూక్తి సంఘటిత జీవితానికి సంభాషణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. హృదయాల మధ్య గోడలు కట్టే మాటల బదులు, వారధులు నిర్మించే మాటలను పలకాలి. అదే అసలైన సంభాషణ. మన మాటలు మన వ్యక్తిత్వానికి, మన హృదయానికి ప్రతిబింబాలు. వాటిని శుభ్రంగా, సున్నితంగా, ప్రేమతో ఉంచినప్పుడే మన జీవితం ఒక అందమైన కవితలా మారుతుంది.మాటలు కేవలం అక్షరాల సమ్మేళనం కాదు, అవి మన అంతరంగపు భావాలకు ప్రతిరూపాలు. మనసులో ఉన్న ఆలోచనలను, హృదయంలో ఉన్న అనుభూతులను వెలికి తీసే ఒక అద్భుతమైన శక్తి సంభాషణకు ఉంది. అది ఒక నిశ్శబ్ద ప్రవాహం. ఒకరి హృదయాన్ని మరొకరి హృదయంతో కలిపే ఒక అద్భుతమైన వారధి. ఈ వారధి ఎంత దృఢంగా ఉంటే, మన మధ్య సంబంధాలు అంత గాఢంగా ఉంటాయి. అందుకే సంభాషణ కేవలం సమాచార మార్పిడి కాదు, అది హృదయాల కలయిక. – కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
మా ఆడపిల్లల్ని "అదోలా" చూస్తున్నారు..
తమ ఊరికి మంచి పేరు తేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఊరి పేరే తమకు చెడ్డ పేరు తెస్తోందని ఆ ఊరివాళ్లు వాపోతున్నారు. గతంలో అప్పుడెప్పుడో తమ తాతల కాలం నాడు వాడుకలోకి వచ్చిన ఆ పేరు ఇప్పుడు తమ పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు కూడా అడ్డంకిలా పరిణమించిందని ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుండడం విశేషం. ఆ ఊరు ఏంటి? ఆ ఊరి పేరు ఎందుకు ఆ ఊరివాళ్ల పాలిట గుదిబండలా మారింది అనే వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఉన్నాయి పక్కపక్కనే ఉన్న రెండు ఊర్లు. ప్రస్తుతం ఆ ఊరి పేర్లే మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అసభ్యకరంగా ఉన్న ఆ పేర్లను చెప్పడానికి ఇబ్బందిగా ఉందని తాము సభ్యతగా జీవిస్తున్నా తమ ఊరి పేరు మాత్రం తమను దిగజారుస్తోందనేది వీరి ఆవేదన. ఆ ఊర్లకు అలాంటి పేర్లు రావడానికి కూడా గత చరిత్ర దోహదం చేసిందని ఆ ప్రాంతంలోని పాత తరం వారు చెబుతున్నారు. ఈ రెండు గ్రామాలు కొండల్ని ఆనుకుని ఏర్పడ్డాయి చాలా కాలం క్రితం సంపన్నులైన పర్లాఖిమిండి రాజవంశీయుల ప్రాపకంతో ఆ ఊర్లు ఏర్పడ్డాయట. సదరు రాజ వంశంలోని మగవారు తమ ఆధీనంలోని ఉంపుడుగత్తెలను ఉంచడం కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నారట. అంతేకాకుండా వారికి కొన్ని భూములను కూడా బహుమతులుగా ఇచ్చారట. ఈ కారణంగానే ఆ ఊర్లకు అలాంటి పేర్లు వచ్చాయని ఆ ఊరి చరిత్ర గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అక్కడ ఉంపుడుగత్తెలను ఉంచేవారు కాబట్టి ఆ ఊర్లను సానిపాలెం, సవర సానిపాలెం అంటూ పిలిచేవారట. అలా అలా అదే పేర్లు రికార్డులలోకి కూడా ఎక్కాయట. ఆ ఊర్లలోని ఒకటైన సానిపాలెంలో దాదాపు 220 కుటుంబాలు ఉన్నాయి. ఆ దగ్గరలో ఎస్టీ కులాల వారు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని సవర సానిపాలెంగా పిలుస్తున్నారు. కొంత కాలం పాటు ఆ పేర్లు అలాగే కొనసాగినా... ప్రస్తుతం ఆ ఊర్లలో అనేక మంది విద్యావంతులుగా , అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందుతుండడంతో ఆ ఊరి పేర్లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో గ్రామస్తులు తమ ఊర్ల పేర్లను మార్చాలని కోరుతున్నారు. ఆధార్, రేషన్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లలో ఆ ఊరి పేర్లు ఉండటంతో అవమానంగా ఉందని, మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపధ్యంఓ తమ ఊర్ల పేరు మార్చాలని కోరుతూ ఈ రెండు గ్రామాల ప్రజలు తహసీల్దార్, డీఆర్వోలకు అలాగే శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో కూడా . వినతిపత్రాలు అందజేశారు. సానిపాలెం పేరును రామయ్యపాలెంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, గ్రామాల పేర్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆ ఊరివాళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పేరు మార్పునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.చాలా సందర్భాల్లో తమ ఊరి పేరు చెప్పాలంటేనే సిగ్గుగా ఉంటోందని స్థానికులు అంటున్నారు.. తమ గ్రామం పేరు చెప్పి అవమానాలు కూడా పడ్డామంటున్నారు. కొందరు ఊరి పేరు చెప్పగానే నవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో రాజుల కాలం నాటి పేర్లు అలాగే ఉన్నాయని.. వాటిని ఇప్పుడైనా మార్చాలని కోరుతున్నారు. వీరి వినతికి స్పందించి ప్రభుత్వం పేరు మార్పు ఎప్పుడు చేస్తుందో...చూడాలి. -
యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం
వెయిట్ లాస్ జర్నీలకు సంబంధించిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలను విన్నాం. ఎన్నో త్యాగాలు, కఠినమైన డైట్లు అవలంబించామనే చెబుతుంటారు చాలామంది. ముఖ్యంగా ఇన్ని గంటలు వర్కౌట్లు, డైట్ వంటివి క్రమంతప్పకుండా చేస్తేనే మంచి ఫలితం అని విన్నాం. కానీ ఈ బామ్మ యోగాతో అద్భుతం సృష్టించింది. ఏకంగా ఒక్క ఏడాదికే కిలోలుకొద్ది బరువు తగ్గి యోగా పవర్ ఏంటో చాటిచెప్పి.. అందరికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ బామ్మనే అమృత్సర్కు చెందిన 87 ఏళ్ల శకుంతల దేవి. ఆమె యోగాతో ఒక ఏడాదిలోనే 83 కిలోలు పైనే బరువు తగ్గింది. వయస్సుని ధిక్కరించేలా అత్యంత చురుకుగా ఉందామె. వృద్ధురాలిలా కాకుండా ఒక వండర్ బామ్మని చూసిన అనుభూతిని కలిగిస్తోంది. బాలీవుడ్ బుల్లితెర షో లాఫ్టర్ చెఫ్స్ 2లో కనిపించి..అందరినీ ఆశ్చర్యపరించిందామె. ఆమె అసామాన్య ఎనర్జీని చూసి అక్కడ సెలబ్రిటీలే విస్తుపోయారు. ఆ షో హోస్ట్ భారతి సింగ్తో మాట్లాడుతూ తాను ఒకప్పుడు దగ్గర దగ్గర.. 123 కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా విస్తుపోయారు. తాను యోగా మీద నమ్మకంతో వెయిట్లాస్ జర్నీని ప్రారంభించానని చెప్పుకొచ్చింది. "బరువు తగ్గడం అనేది ఒక స్థిరమైన ప్రయాణం. కేవలం క్రమశిక్షణతో కూడిన స్థిరత్వంతో శరీరం బరువు తగ్గించేలా మనసుని ప్రేరేపించగలం అని చెబుతోంది". ఆ షోలో శకుంతలా దేవి వేసిన యోగాసనాలను చూసి అంత షాకయ్యారు. ప్రతి ఒక్క ఆసనాన్నిచాలా అలవోకగా వేసిందామె.123 కిలోల నుండి 40 కిలోలకు ఎలా చేరుకుందంటే..2008 ఆ సమయంలో శకుంతల దేవి విపరీతమైన బరువు పెరిగి ఇబ్బందిపడింది. దాంతో ఆమె దైనందిన జీవితం భారంగా మారింది చిన్న చితక పనులు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది. భారతీయ గురువు బాబా రాందేవ్ ఆమెను యోగాకు పరిచయం చేసినప్పుడు తన పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతోందామె. టెలివిజన్లో ఆయన యోగాసనాలు ప్రదర్శించడం చూసి తన వెల్నెస్ నియమావళిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యిందట. ఆమె చికిత్స కోసం మందులను ఆశ్రయించకూడదని ఇంట్లోనే సాధారణ ఆసనాలను అభ్యసించడం ప్రారంభించింది. ఒక ఏడాది తర్వాత 2009లో శకుంతలా దేవి యోగాను సరిగా నేర్చుకోవడానికి హరిద్వార్కు వెళ్లింది. రోజువారి దినచర్యలో భాగంగా 4 గంటలకు మేల్కొని ఆసనాలు వేయడం చేసేది. దాంతో కేవలం ఒక్క ఏడాదిలోనే బరువు తగ్గడమే కాకుండా యోగా ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇది ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె కఠినమైన ఫిట్నెస్ నియమాన్ని అనుసరిస్తుంది. అలాగే ఇతరులకు యోగాని నేర్పుతోంది. దృఢ సంకల్పం, నిబద్ధతలతో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలమని శకుంతల దేవి వెయిట్ లాస్స్టోరీనే చెబుతోంది. కాగా, హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం, యోగా కేలరీలను బర్న్ చేయడమేగాక, అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గేలా చేస్తుందని జర్నల్లో పేర్కొంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by 𝐀𝐍𝐀𝐘𝐀 ᥫ᭡. (@minexspace) (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
ఫ్లోర్కూ వాల్ పేపర్..!
పువ్వులు, లతలు, బీచ్ తీరాలు, కొలనులు వంటి ఆకర్షణీయమైన ప్రకృతి హంగులన్నీ మన కాలి కింద కొలువుదీరితే, చూడటానికి ఎంత అందంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. త్రీడీ ఫ్లోర్ వాల్పేపర్ ఆ హంగులన్నీ మన గదుల్లోకి తీసుకు వస్తుంది. గది వైశాల్యం, రంగు, డిజైన్కు తగిన వాటిని ఎంచుకోవడంలో శ్రద్ధ పెడితే చాలు. ప్రకృతి దృశ్యాలన్నీ మన కళ్ల ముందే నిలిచి ఉంటాయి.గది థీమ్ను మార్చేసేలా..సముద్ర తీరాలు, స్కై లైన్ వంటివి గది థీమ్నే మార్చేస్తాయి. ఆధునిక లివింగ్ రూమ్ కోసం రేఖాగణిత నమూనాలను ఎంచుకోవచ్చు. పెద్ద, బోల్డ్ డిజైన్లు విశాలమైన గదులకు, చిన్న డిజైన్లు తక్కువ స్థలం ఉన్న చోటుకు బాగా సరిపోతాయి.రంగు.. స్థలంఫర్నిచర్, గది గోడల రంగులను ఎలివేట్ చేసేలా ఫ్లోర్ డిజైన్ వాల్ పేపర్ల ఎంపిక ఉండాలి. గోడల రంగు ప్లెయిన్గా, లైట్ కలర్లో ఉండే ఫ్లోర్ డిజైన్ బోల్డ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవచ్చు. గోడల రంగు గాఢత ఎక్కువ ఉంటే సాదా సీదా ఫ్లోర్ డిజైన్స్ను ఎంచుకోవచ్చు. ఫ్లోర్ వాల్ పేపర్స్ కొనుగోలుకు ముందు మీ గదుల వాస్తవ స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. ఆ డిజైన్స్ ఎంత కాలం వరకు ఉంటే బాగుంటుందో ముందే నిర్ణయించుకొని, దాన్నిబట్టి ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రయోజనాలుత్రీడీ ఫ్లోర్ వాల్పేపర్లు ప్రత్యేకమైన, అద్భుతమైన దృశ్య అనుభవాన్ని సృష్టిస్తాయి.త్రీడీ ఫ్లోర్ వాల్పేపర్ మన్నిక ఎక్కువ. దీర్ఘకాలం ఉంటుంది.చాలా త్రీడీ వాల్పేపర్లను శుభ్రం చేయడం సులభం. తడి క్లాత్తో తుడవడం చాలా సులువు. ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది. .ఇన్స్టాలేషన్ సులువు. నచ్చకపోతే తొలగించి, మరొక వాల్పేపర్ని అతికించవచ్చు. డిజైన్ల ఎంపిక కోసం, ఎలాంటి లోపాలు లేని త్రీడీ వాల్ పేపర్ను నిపుణుల సాయంతో ఎంపిక చేసుకోవడం తెలివైన ఎంపిక. గది వైశాల్యాన్ని బట్టి త్రీడీ వాల్ పేపర్ల ధరలు ఉంటాయి. (చదవండి: రోబో కుందేళ్ల పాముల వేట!) -
ప్రచారం లేకుండా... పేటెంట్ల పరంపర!
ఎలక్ట్రిసిటీ అంటే ఎడిసన్, టెలిఫోన్ అంటే గ్రాహం బెల్, కంప్యూటర్ అంటే ట్యూరింగ్ గుర్తొస్తారు. కాని, ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ శాస్త్రవేత్త గురుతేజ్ సంధు పేరు చేర్చాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా యూఎస్లో ఎడిసన్ పొందిన పేటెంట్ల సంఖ్యను కూడా దాటేసిన ఈ టెక్ టైగర్– ప్రపంచ టెక్నాలజీని వేగవంతం చేసిన మాస్టర్మైండ్! ఆయన పేరు ఇప్పటివరకు ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కాని, ప్రపంచవ్యాప్తంగా రోజూ వాడే టెక్నాలజీకి ఆధారం ఆయన ఆవిష్కరణలే! అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీలో పనిచేస్తూ, టెక్ రంగంలో నిశ్శబ్దంగా విప్లవం సృష్టించారు. వివిధ టెక్నాలజీలపై ఆయనకు ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1,380 పేటెంట్లు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడిసన్ యూఎస్ పేటెంట్స్ కౌంట్ 1,093 కంటే ఎక్కువ. సాధారణంగా పేటెంట్ అనేది సాధించడమే ఓ పెద్ద విషయం. ఒక్కటి పొందటానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అత్యధిక పేటెంట్స్ కలిగిన భారతీయుడుగా గురుతేజ్ సంధు నిలిచారు. మన ఫోన్లు, ల్యాప్టాప్లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేగం, సామర్థ్యం పెంచడంలో ఆయన పాత్ర అంచనాకు అందని స్థాయిలో ఉంది. ఆయన అభివృద్ధి చేసిన ‘అటామిక్ లేయర్ డిపాజిషన్’, ‘పిచ్ డబ్లింగ్’ లాంటి సాంకేతిక పద్ధతులు మెమరీ చిప్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. అంటే చిన్న పాకెట్లో పెద్ద ప్రపంచాన్ని నిక్షిప్తం చేయగల టెక్నాలజీని గురుతేజ్ రూపొందించారు. ప్రస్తుతం ఇవే గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇండస్ట్రీ స్టాండర్డ్గా మారిపోయాయి. మీరు ఫోన్లో వీడియో చూస్తుంటే, ప్రతి పది సెకన్లకు ‘పాజ్’ కాకుండా స్మూత్గా ప్లే అవుతుంటే, దానికి మూల కారణం గురుతేజ్ సంధునే! ఇలానే, మరెన్నో మనం రోజూ వాడే టెక్నాలజీ పరిజ్ఞానాల్లో ఆయన మేధస్సు పనిచేస్తోంది.ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. ఆయనకు ‘ఐఈఈఈ ఆండ్రూ ఎస్. గ్రోవ్ అవార్డ్’ అనే అత్యున్నత గౌరవం దక్కింది. అంతేకాదు, ఆయనకు అంతర్జాతీయ మైక్రాన్ సంస్థలో అతి ముఖ్య సాంకేతిక గౌరవమైన ఫెలో హోదా దక్కింది. వివిధ టెక్నాలజీ పరిశోధనల్లో అద్భుత ప్రతిభ చూపినందుకు గాను ‘జార్జ్ ఈ. పేక్’ బహుమతిని కూడా అందుకున్నారు. అయితే, ఇంతటి ఘనత ఉన్నా ఆయన పేరు బహిరంగ ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యకరం. ఫ్యామిలీ స్టార్! ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి ఈ మేధావి కథ ప్రారంభమైంది! లండన్లో జన్మించిన గురుతేజ్ సంధు, మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో భారత్కు వచ్చేశారు. తండ్రి సర్జీత్ సంధు, తల్లి గురుమీత్ సంధు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే మేధావిగా ఎదిగాడు. అలా ఆయన మేధస్సు మొదట ఐఐటీ ఢిల్లీ గేట్లు దాటింది, అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికా ప్రయాణం, నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో పీహెచ్డీ సాధించారు. అప్పటి నుంచే ల్యాబ్లో సైలెంట్గా పని చేస్తూ, ప్రపంచ మెమరీ చిప్లకు మెమరబుల్ సైంటిస్టుగా మారారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు సంగీతంలో ప్రావీణ్యం పొంది డీజేగా గుర్తింపు పొందారు. మరొకరు ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇలా ఆయన ఇద్దరు కుమారులు కూడా, ఒకరు మ్యూజిక్లో, మరొకరు మైక్రోచిప్లతో తమ తమ రంగాల్లో మ్యాజిక్ చేస్తున్నారు!. ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. -
సాహసానికి అరవై ఏళ్లు
ఇండో–పాక్ యుద్ధం మొదలై అప్పటికి పదహారు రోజులు– ఆరోజు 1965 సెప్టెంబర్ 5, ఉదయం ఆరున్నర గంటలకు పాకిస్తాన్ యుద్ధవిమానాలు రెండు కొండలను చాటు చేసుకుని, భారత భూభాగంలోకి దూసుకొస్తున్నాయి. అవి శత్రుదుర్భేద్యమైన శాబర్జెట్ ఫైటర్ విమానాలు. జమ్ము–కశ్మీర్లోని తావి బ్రిడ్జిని సమీపించేలోగానే అక్కడి శిఖరం పైనుంచి భారత ఎయిర్క్రాఫ్ట్ గన్ గర్జించింది. మూడువేల అడుగుల ఎత్తులో 1300 కిలోమీటర్ల వేగంతో వస్తున్న శాబర్జెట్ విమానం పేలిపోయింది. ఆ విమానాన్ని కూల్చిన వీరుడు మన ఆంధ్రుడు హవల్దార్ తాతా పోతురాజు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న శాబర్జెట్ విమానాలను 1942 నాటి మన పాత గన్లతో కూల్చడం సాధ్యం కాదనే భావనతో ఉన్న నాటి భారత సైన్యానికి పోతురాజు గురితప్పకుండా ఛేదించిన లక్ష్యం స్ఫూర్తినిచ్చింది. అదే ఉత్సాహంతో అప్పటి 27 ఏడీ రెజిమెంట్ ఏకంగా పన్నెండు పాక్ యుద్ధ విమానాలను కూల్చింది. ఇంతటి స్ఫూర్తికి కారకుడైన హవల్దార్ పోతురాజుకు భారత ప్రభుత్వం నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ పురస్కారాన్ని బహూకరించింది.తెనాలి సమీపంలోని నిజాంపట్నం గ్రామంలో రైతు కుటుంబంలోని ఐదుగురు కుమారుల్లో నాలుగోవాడు పోతురాజు, ఎస్ఎస్ఎల్సీ చదువుతుండగా ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్లి, వేరుశెనక్కాయలు ఆరబెట్టారు. అటుగా వెళుతున్న బావాజీపాలెం సైనికులు అక్కడాగి వేరుశెనక్కాయలు తింటూ కాసేపు కూర్చున్నారు. ‘నేను మిలటరీకి పనికొస్తానా?’ అని పోతురాజు వారిని అడిగాడు. తప్పకుండా పనికొస్తావని బదులిచ్చారు. ఎలాగోలా సైన్యంలో చేరాలనే కోరిక పుట్టింది. తండ్రికి భోజనం తీసుకువస్తానని చెప్పి, ఇంటికి బయలుదేరిన పోతురాజు, అటునుంచి అటే గుంటూరు ఆర్మీ సెలక్షన్స్కు వెళ్లాడు. అందులో ఎంపికయ్యాక నాసిక్లో శిక్షణకు పంపారు. ఆవిధంగా 1958లో 18 ఏళ్ల వయసులో పోతురాజు సైన్యంలోకి ప్రవేశించాడు. అక్కడ స్పెషల్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవటంతో ‘యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ’ శిక్షణనిచ్చారు. స్క్రీన్ పై రకరకాల విమానాల కదలికలను గుర్తించే ‘స్పాటింగ్ టెస్ట్’లో పోతురాజు నూరుశాతం మార్కులు తెచ్చుకోవడంతో 27 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్లోకి తీసుకున్నారు. 1965 ఆగస్టు 14 నుంచి పాక్తో యుద్ధం తలెత్తినప్పుడు పోతురాజు ఆర్మీ మెయిల్ సర్వీస్లో ఉన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి పాకిస్తాన్ ఎయిర్ ఎటాక్ చేయటానికి సిద్ధంగా ఉందని గూఢచార వర్గాల సమాచారం రావడంతో జమ్ము ఎయిర్ఫీల్డ్కు, బ్రిడ్జికి ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వెళ్లాయి. పోతురాజు గన్ కూడా వెళ్లింది. యుద్ధం చేయకుండా డాక్ సర్వీసులో కొనసాగేందుకు పోతురాజుకు మనసొప్పలేదు. రెజిమెంట్ కమాండర్ను కలిసి, తనను యుద్ధానికి పంపాల్సిందేనని పట్టుబట్టాడు. పోతురాజు పట్టుదలకు ముచ్చటపడ్డ కమాండర్, 1965 సెప్టెంబరు 1న తావి బ్రిడ్జి రక్షణ అప్పగించారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్కు చెందిన రెండు శాబర్జెట్ విమానాలు రాడార్లకు అందనంత తక్కువ ఎత్తులో దూసుకొస్తుండటం బైనాక్యులర్లో గమనించిన పోతురాజు ఉలిక్కిపడ్డాడు. తన దగ్గరున్న సమచార సాధనంతో కమాండర్ను సంప్రదిస్తే, ‘కచ్చితంగా గుర్తించగలిగితే కొట్టు. ఆ బాధ్యత నీదే!’ అన్నారు. శిక్షణలో నేర్చుకున్న పరిజ్ఞానంతో అప్పటికే వాటిని శాబర్జెట్గా పోల్చుకున్నాడు పోతురాజు. వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేశాడు. మొదటి శాబర్జెట్ కెనోబీపై గురితప్పకుండా పేలిన గుండుకు ఫర్లాంగు దూరంలోని సిటీలో పడిపోయింది. రెండో విమానం డైవ్ కొట్టి గన్ రేంజికి దూరంగా వెళ్లిపోయింది. ఈ పరిణామానికి భారత సైన్యం రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి, ఒక్కో ఏరియాను స్వాధీనం చేసుకుంటూ సియోల్కోట వరకు వెళ్లాయి. ఆ తరుణంలో తాష్కెంట్ ఒప్పందంతో యుద్ధం ఆగిపోయింది. తర్వాత పోతురాజును భారత ప్రభుత్వం ‘వీరచక్ర’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంతో పోతురాజుకు సెలవు మంజూరుచేసి పంపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పోతురాజుకు ఘనసత్కారాలు జరిగాయి. ఒంగోలులో ఒక ట్రక్కుపైన ఎయిర్క్రాఫ్ట్ ఏర్పాటుచేసి తనను కూర్చోబెట్టి చేసిన ఊరేగింపు మరిచిపోలేదని అంటారు పోతురాజు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పోతురాజు ముక్తివాహిని సైన్యంలో పనిచేశారు. రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘వీరచక్ర’ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తనను పరిచయం చేసినపుడు, ఆమె రెండు చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు పోతురాజు ‘హాత్ జోడ్కే నమస్తే నహీ కర్తా! సోల్జర్ సెల్యూట్ కర్తా! నైతో షేక్హాండ్ లేతా హై!’అని వినమ్రంగా చెప్పాడు. ఆ మాటలకు ఎంతగానో సంతోషించిన ప్రధాని ఇందిరాగాంధీ ‘ఓకే! ఆప్ వీర్ జవాన్ హై!’ అని షేక్హ్యాండ్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.1965 యుద్ధం ముగిసిన కొంతకాలానికి వివాహం చేసుకున్న పోతురాజుకు బాధ్యతలు వచ్చిపడ్డాయి. తండ్రి మరణంతో మరింత పెరిగాయి. పదహారున్నర సంవత్సరాల సర్వీసుతో 1975లో హవల్దార్గా స్వచ్ఛంద విరమణ చేశారు. అప్పటికే ఆ కుటుంబం తెనాలిలో స్థిరపడింది. గుంటూరులో ఆర్టీసీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా చేరారు. 1998లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైరయ్యారు. ప్రస్తుతం శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి (చదవండి: చాకిరీనే ఆమె నౌకరీ) -
పట్టులాంటి జుట్టు కోసం..!
ఒత్తైన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది. ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.ఒతై ్తన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది.ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.పట్టులాంటి జుట్టుకు...పట్టులా సుతిమెత్తగా ఉండే జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మృదువుగా ఉంటే స్టైలింగ్ చేయడం కూడా ఈజీ. అయితే పెరిగిన కాలుష్యం, జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జుట్టు పొడిబారి, రఫ్గా మారుతుంది. ఇలాంటి జుట్టుకు తగిన తేమ, పోషణను అందించే చికిత్సే డీప్ కండిషనింగ్. ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు తేమగా, ఆరోగ్యంగా మారుతుంది. దీంతో మెరిసే జుట్టును పొందవచ్చు. ఇంట్లో డీప్ కండిషనింగ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవాలి. పెరుగు–తేనె, గుడ్డు–ఆలివ్ నూనె మాస్క్ అయితే బెటర్. కండిషనింగ్ చేసుకునే ముందు తక్కువ గాఢత ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు ఆరిన తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సుతిమెత్తని జుట్టు మీ సొంతమవుతుంది. ఇంట్లో డీప్ కండీషనింగ్ చేసుకోలేని వారు పార్లర్కు వెళ్లవచ్చు. బ్యూటీ పార్లర్లోని నిపుణులు జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన ఉత్పత్తులతో కండిషనింగ్ చేస్తారు. అవసరం బట్టి పార్లర్లో స్టీమ్ థెరఫీ కూడా ఇస్తారు. దీనివల్ల జుట్టుకు మరింత పోషణ అందుతుంది. కురులు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!
చాలామంది గర్భిణులు ప్రీఎక్లాంప్సియా సమస్యకు లోనవుతుంటారు. ఇప్పటి వరకు ఈ సమస్య వచ్చాక గుర్తించి, చికిత్స చేసే పద్ధతులే ఉన్నాయి తప్ప ముందుగా గుర్తించే పద్ధతులేవీ అందుబాటులో లేవు. అయితే, ఇటీవల స్పానిష్ వైద్య నిపుణులు ప్రీఎక్లాంప్సియాను నెలల ముందుగానే గుర్తించగల రక్తపరీక్ష విధానాన్ని కనుగొన్నారు. ప్రీఎక్లాంప్సియా సాధారణంగా గర్భిణుల్లో మొదటి ఇరవై వారాల తర్వాత తలెత్తుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం; మూత్రంలో ప్రొటీన్ పోవడం; శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల బరువు పెరగడం; ముఖంలోను, చేతుల్లోను వాపులు రావడం; వాంతులు, వికారం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ‘ప్లాస్మా సెల్ ఫ్రీ ఆర్న్ఏ’ (సీఎఫ్ఆర్ఎన్ఏ) రక్తపరీక్ష ద్వారా ప్రీఎక్లాంప్సియా వచ్చే అవకాశాలను నెలల ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షను స్పానిష్ వైద్య పరిశోధన సంస్థ ‘ఐప్రీమామ్’కు చెందిన టమారా గారిడో గోమెజ్ నేతృత్వంలోని వైద్య నిపుణులు రూపొందించారు. వీరు 2021–2024 మధ్య 9,586 మంది మహిళలకు ఈ రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైన ఫలితాలను సాధించారు. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?) -
ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?
డాక్టర్గారు, నాకు 45 ఏళ్లు. దాదాపు సంవత్సరం రోజులుగా రుతుస్రావం రాలేదు. ఇది మెనోపాజ్ అనుకున్నాను కాని, ఇప్పుడు మళ్లీ రక్తస్రావం వస్తోంది. ఇది ఏదైనా పెద్ద సమస్యనా అని చాలా భయపడుతున్నాను.– లావణ్య, తూప్రాన్ఒక మహిళకు 45 ఏళ్లు దాటాక వరుసగా 12 నెలలు రుతుస్రావం లేకపోతే మెనోపాజ్ దశలో ఉన్నట్లుగా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత రక్తస్రావం వస్తే దాన్ని పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇది తరచు కనిపించే సమస్యలలో ఒకటి. అయినప్పటికీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదు. సుమారు ఐదు శాతం మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. అందులో ఎక్కువగా కనిపించే కారణం అట్రోఫిక్ వెజైనిటిస్. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల యోని గోడలు పలచబడి చిన్న గాయాలు అవుతాయి. దాంతో రక్తస్రావం మాత్రమే కాకుండా, పదే పదే మూత్రపిండ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. మరికొంతమందిలో గర్భాశయం లోపల ఏర్పడే పాలిప్స్ వలన రక్తస్రావం ఉంటుంది. ఇవి గడ్డల్లా మారుతాయి. పోస్టు మెనోపాజల్ బ్లీడింగ్ ఉన్నవారిలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఇవే కారణం అవుతాయి. వీటిలో తొంభై శాతం ఫాల్స్ అయినప్పటికీ నిర్ధారణ అవసరమే! ఇంకా కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లాసియా లేదా గర్భాశయ క్యాన్సర్కు కారణం అవుతుంది. దాదాపు పది శాతం కేసుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. హైపర్ప్లాసియాలో కూడా ఏటిపికల్ అనే రకం ఉంటే కేన్సర్గా మారే ప్రమాదం ఎక్కువ. అరుదుగా యోని లేదా వల్వా కేన్సర్లు కూడా ఈ రక్తస్రావానికి కారణం కావచ్చు. మధుమేహం ఉన్నవారు, అధిక బరువు కలిగినవారు, గర్భాశయ కేన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మెనోపాజ్ లక్షణాలను తగ్గించుకోవడానికి ఈస్ట్రోజన్ మాత్రలు తీసుకునే కొంతమందికి కూడా రక్తస్రావం కలగవచ్చు. అందుకే మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వస్తే అది పెద్ద విషయం కాదని ఊహించుకోవడం తప్పు. ఎక్కువసార్లు కారణం తేలికపాటిదే అయినా, కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి ఒకసారి అయినా గైనకాలజిస్ట్ను సంప్రదించి అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
ఉచిత పోషకాహార శిబిరం
నేషనల్ న్యూ ట్రిషన్ వీక్ సందర్భంగా ఆలివ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 10 వరకు ఉచిత పోషకాహార శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో పాల్గొనే వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిపుణుల సలహాలు, వ్యక్తిగత డైట్ ప్లాన్లు అందిచనున్నారు. సాధారణంగా నిర్లక్ష్యం చేస్తున్న విటమిన్ లోపాలు — అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, శక్తి లోపం వంటి సమస్యలపై వైద్యులు, పోషకాహార నిపుణులు దృష్టి సారించి సులభమైన ఆహార మార్పులపై మార్గదర్శనం ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ సుగ్రా ఫాతిమా, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ న్యూ ట్రిషనిస్ట్ మాట్లాడుతూ...“ఆహారం మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే అనేక జీవనశైలి సమస్యలను నివారించవచ్చు. ఈ న్యూట్రిషన్ వీక్ ద్వారా ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన పోషకాహార ప్రాధాన్యతను నగర వాసులకు తెలీయజేయడమే" అని అన్నా రు. ఈ శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, ఉచిత పరీక్షలు, సలహాలను పొంది ఆరోగ్యకరమైన జీవనానికి తొలి అడుగు వేయాలని ఆలివ్ హాస్పి టల్ యాజమాన్యం కోరింది.(చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
అరవైల్లోనూ యవ్వనంగా!
అరవై ఏళ్లు దాటిన కొందరు సెలబ్రిటీలను, వారి ఫిట్నెస్ చూసి చాలా మంది ‘వయసును ఆపేశారు’ అని మాట్లాడుకోవడం చూస్తుంటాం. వారు తీసుకునే పోషకాహారం, వ్యాయామం, చేసే పనుల నిర్వహణ ఇంకా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అరవై ఏళ్ల వయసు పై బడిన వారు ఇక జీవితం అయి΄ోయిందని అనుకోకుండా తమ రోజువారీ తీసుకునే ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంగానూ, పనుల నిర్వహణలోనూ ఉత్సాహంగా ఉంటారు.రోజువారీగా తీసుకోవాల్సిన...కేలరీలు: 1500–1700ప్రొటీన్లు: పురుషులు – రోజుకు 54 గ్రా‘‘ మహిళలు – రోజుకు 45గ్రా‘‘ నాణ్యమైన ప్రొటీన్ కోసం: ఉడికించిన గుడ్డు, పాలు, కోడి మాంసం, చేపలు, పప్పు దినుసులుకొవ్వులు: రోజుకు 25.గ్రా (ఆరోగ్యకరమైన కొవ్వులు – 1 టేబుల్ స్పూన్ నూనె, గింజలు, నువ్వులు)కార్బోహైడ్రేట్లు: మొత్తం కాలరీలలో 45–65% విటమిన్లు, ఖనిజాలువిటమిన్–ఎ: 840–1000 మైక్రోగ్రాములువిటమిన్– ఇ: రోజుకు 65 మి.గ్రా‘‘క్యాల్షియం: రోజుకు 1200 మి.గ్రా‘‘ఐరన్: రోజుకు 11–19 మి.గ్రా‘‘ఫుడ్ గ్రూఫ్స్ పండ్లు: రోజుకు 1–2 సర్వింగ్స్ (మీడియం సైజు ఉన్న పండు)కూరగాయలు: రోజుకు 3–4 సర్వింగ్స్ (వంట చేసినవి లేదా ఉడికించినవి)ధాన్యాలు: రోజుకు 6–8 సర్వింగ్స్ (1 కప్పు = 30గ్రా) అన్నం, సజ్జలు, లేదా గోధుమ నూకడైరీ ఉత్పత్తులు: రోజుకు 2–3 సర్వింగ్స్ (పాలు, పెరుగు, పనీర్)సాధారణంగా రోజూ ఈ కాంబినేషన్లో ఆహారం ఉండేలా చూసుకోవాలి.రోజువారీ భోజన ప్రణాళిక...బ్రేక్ఫాస్ట్ఇడ్లీ (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఉప్మా (60గ్రా.) + 1 కప్పు సాంబార్ లేదాఓట్స్ / కిచిడీ (60గ్రా.) + ఉడికించిన గుడ్డు తెల్లసొనమధ్యాహ్న భోజనం1 కప్పు బియ్యం / బ్రౌన్ రైస్1 జొన్న/రాగి ఫుల్కా (25గ్రా‘‘)1 కప్పు తోటకూర పప్పు1 కప్పు కాకర కాయ కూర / ఇతర కూరస్నాక్స్ఆపిల్ / కివి / కమలపండుకొద్దిగా నానబెట్టిన గింజలు కొబ్బరి నీళ్లుఈవెనింగ్ స్నాక్స్1 కప్పు చికెన్ సూప్ / వెజిటబుల్ సూప్ / మజ్జిగరాత్రి భోజనం1 కప్పు అన్నం / బ్రౌన్ రైస్ / కిచిడీ లేదా 1 ఫుల్కా1 కప్పు పాలక్ పనీర్ కూర / పలుచని పప్పు/ ఏదైనా ఒక కూర (చదవండి: మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!) -
మనపై ‘గాండ్రు’మన్న పులులే మెత్తని గ్రాండ్ పేరెంట్స్ అయ్యారే!
ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారే... వాళ్ల రెండు నాల్కల ధోరణే వేరు. వీళ్లు పేరెంట్స్గా ఉన్నప్పుడు తమ పిల్లలు అన్నం తినకపోయినా... సరిగా చదవక΄ోయినా... మాట వినక΄ోయినా విపరీతంగా తిట్టేవారు. కసితీరా కొట్టేవారు. వెరసి... చెడుగుడాడేవాళ్లూ... చెమడాలెక్కతీసేవాళ్లు. ఈ ధోరణితో వాళ్లు ప్రవర్తిస్తున్న కాలంలో పిల్లలుగా మనం బితుకూ బితుకూమంటూ బతికేవాళ్లం. ఎట్టకేలకు వాళ్లిప్పుడు గ్రాండ్స్పేరెంట్స్ అయ్యారు.కాలచక్రం గిర్రున తిరిగి మనకూ ఇప్పుడు పిల్లలు పుట్టారు. కాలేజీలో జూనియర్స్ సీనియర్స్ అయి ‘పేరేంట్య్రాగింగు’ పర్వదినాల కోసం మనమూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామా...? అదృష్టవశాత్తూ ఇప్పుడు మన వంతు రాగానే మన పిల్లలు అన్నం తిననప్పుడు మనం బెల్టు పట్టుకోబోయామా... వాళ్లెదురుగా వచ్చి పిల్లలముందు నిలబడిపోతారు. బెత్తం పట్టుకోబోయామా... అడ్డంగా వచ్చేసి కలబడిపోతారు. థూ మన బతుకుచెడా... మన బండపడా... అప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడూ బితుకూ బితుకే...ఇప్పుడూ అదే బతుకే! వాళ్లే మన పేరెంటూ... మన నాటి పేరెంట్సే... నేటి గ్రాండ్ పేరెంట్సు. మళ్లీ సదరు గ్రాండు పేరెంట్సు... గ్రాండుగా వాళ్లు చెప్పొచ్చేదేమిటంటే... ‘‘ఏం మాకు పిల్లలు పుట్టలేదా? మేం పెంచలేదా, పెంచడం మాకు తెలియదా’’ అంటూ దబాయింపు. అలా వాళ్లు తమ రెండు నాల్కల ధోరణితో మనల్ని నానామాటలు అంటూ ఉంటే... సదరు మన పేరెంట్సుకూ, మన పిల్లల గ్రాండుపేరెంట్సుకూ ఎదురుచెప్పకూడదంటూ మనలో మనం అనేసుకునే మాటేమిటంటే... ‘‘అయ్యో.... మీకు తెలియక΄ోవడమేమిటీ? అప్పుడు మీరు పెంచిందీ, గసిరిందీ, కొట్టిందీ మమ్మల్నే... ఇప్పుడు పిల్లల ఎదురుగా నిలబడి΄ోతూ, కలబడిపోతూ గసురుతున్నదీ, మాటలు విసురుతున్నదీ మమ్మల్నే!’’ అంటూ గుసగుసగా గునుస్తూ... నేటి మన గ్రాండ్ పేరెంట్స్ గాండ్రుగాండ్రుల పట్ల మురుస్తూ ఇలా బతికేస్తున్నాం... బతికేస్తుంటాం. (చదవండి: -
‘నేనింకా బ్రహ్మచారిని.. పెళ్లైయ్యాక మీతో వస్తా’
అనగనగా ఓ ఊరిలో రామయ్య అనే యువరైతు ఉండేవాడు. అతనికి ఆత్మానందం అంటే ఏమిటో తెలుసుకోవాలని, దాన్ని పొందాలని ఆశగా ఉండేది. తన ఊరికి ఎవరైనా స్వామీజీలు వస్తే ఆ విషయం అడిగేవాడు. అయితే ఎవరూ అతనికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అతని సందేహం తీరలేదు.ఒకసారి ఊరికి యోగీంద్రుడు అనే యువ సన్యాసి వచ్చాడు. అంత చిన్నవయసులో సన్యాసం తీసుకున్న అతణ్ని ఊరంతా గౌరవించి, ఆతిథ్యం ఇచ్చింది. రామయ్య ఆయన్ని కలిసి ఆత్మానందం అంటే ఏమిటని, అది పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి యోగీంద్రుడు ‘తప్పకుండా వివరిస్తాను. అయితే నేను ప్రస్తుతం కాశీకి ప్రయాణమవుతున్నాను. నా వెంట వస్తే మార్గమధ్యంలో వివరిస్తాను’ అన్నాడు. రామయ్య మొహమాటపడుతూ ‘అయ్యా! కాశీకి వెళ్తే తిరిగిరారని పెద్దలు అంటారు. నేనింకా బ్రహ్మచారిని. పెళ్లి చేసుకున్న తర్వాత తప్పకుండా మీ వెంట వస్తాను’ అన్నాడు. సరేనని ఆత్మానందుడు కాశీకి వెళ్లాడు.ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత యోగీంద్రుడు మరోసారి ఆ ఊరికి వచ్చాడు. అప్పటికి రామయ్యకు పెళ్లయ్యింది. ఈసారి కూడా రామయ్య ఆయన్ని కలిసి మరోసారి తన మనసులో సందేహాన్ని బయటపెట్టాడు. ‘రామయ్యా! రేపు నేను ప్రయాగ వెళ్తున్నాను. ఈసారి నువ్వు నా వెంటరా. దారిలో నీకు ఆత్మానందం (Atmanandam) అంటే ఏమిటో చెబుతాను’ అన్నాడు. దానికి రామయ్య ‘అయ్యా! నా భార్య ప్రస్తుతం కడుపుతో ఉంది. ఈ సమయంలో తనను వదిలేసి రాలేను. ఈసారి తప్పక వస్తాను’ అన్నాడు. సరేనన్నాడు యోగీంద్రుడు.మరికొన్నేళ్ల తర్వాత యోగీంద్రుడు మరోసారి ఊరికి వచ్చాడు. ఈసారి రామయ్య మరోసారి ఆయన్ని కలిశాడు. తాను రామేశ్వరం వెళ్తున్నానని, ఈసారైనా తన వెంట రమ్మని పిలిచాడు యోగీంద్రుడు. ‘స్వామీ! ఆడపిల్ల పెళ్లికి ఎదుగుతోంది. కొడుకులు చేతికొచ్చారు. ఈ సమయంలో నేను వారికి అండగా ఉండాలి. ఈసారి కూడా వదిలేయండి. వచ్చేసారి తప్పకుండా వస్తాను’ అన్నాడు. సరేనని యోగీంద్రుడు తలాడించాడు.ఆ తర్వాత చాలా ఏళ్లకు యోగీంద్రుడు ఆ ఊరికి వచ్చాడు. అప్పటికి యోగీంద్రుడు వృద్ధుడయ్యాడు. రామయ్యకు సైతం వృద్ధాప్యం మీదపడింది. కానీ మనసులో ‘ఆత్మానందం’ గురించిన సందేహం మాత్రం పోలేదు. యోగీంద్రుణ్ని కలిసి కుశలం అడిగాడు. అన్నీ వివరించాక ‘ఈసారి తీర్థయాత్రలకు వెళ్తున్నాను రామయ్యా! మళ్లీ తిరిగి వస్తానన్న నమ్మకం లేదు. కాబట్టి ఈసారైనా నా వెంట వస్తే ఆత్మానందం అంటే ఏమిటో చెబుతాను’ అన్నాడు ఆత్మానందుడు. దానికి రామయ్య ‘అయ్యా! నా పెద్ద కొడుక్కి మొన్నే రెండో కొడుకు పుట్టాడు. చిన్నకొడుక్కి పాప పుట్టి నెలైంది. వారి ముద్దూముచ్చట చూడకుండా నేను మీ వెంట తీర్థయాత్రలకు వస్తే ఎలా? క్షమించండి’ అన్నాడు.చదవండి: ఏం చేశావ్ పెద్దాయనా.. నీకు సెల్యూట్!దానికి యోగీంద్రుడు నవ్వి ‘రామయ్యా! ఆత్మానందం అంటే ఏమిటని ఇన్నేళ్ల నుంచి సందేహపడుతున్నావు కానీ, ఇదే ఆత్మానందం అని తెలుసుకోలేకపోతున్నావు. ఎవరి పని వారు సక్రమంగా చేసి, అందులో తృప్తి పొందడమే ఆత్మానందం. పెళ్లి చేసుకొని, భార్యను పోషించి, బిడ్డల్ని సరైన రీతిలో పెంచి, వారికి బతుకుదెరువు చూపించి, చివరకు వారి పిల్లల ముద్దుముచ్చట్లు కూడా చూస్తున్నావు. ఇన్నేళ్లపాటు నువ్వు పొందిందంతా ఆత్మానందమే’ అని వివరించాడు. ఆత్మానందం అంటే తన సంతోషమే, సంతృప్తి అని గ్రహించి సంతోషపడ్డాడు రామయ్య. -
కేబీసీ 17: కష్టం-కన్నీళ్లు మాటునే రూ. 25లక్షలు గెలుచుకున్నాడు..!
ఆసిఫ్ ఇమ్రాన్ ఖురేషి. ఇండోర్కు చెందిన వ్యక్తి. అతనొక కనస్ట్రక్షన్ లేబర్.. రాడ్లు, బీమ్లు కట్ చేసే పని. ఆ పనిలో కష్టం ఉంది. కానీ అతని జీవితంలో అంత కంటే కష్టం ఉంది. అయితేనేం.. 'కౌన్ బనేగా కరోడ్పతి-17 లో హాట్సీట్లో కూర్చునే అవకాశం వచ్చిన అతను.. రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు.కన్స్ట్రక్షన్ లేబర్గా చేస్తూ కేబీసీ హాట్ సీట్ వరకూ రావడమే ఒక ఎత్తైతే.. అక్కడ రూ. 25 లక్షలు గెలుచుకోవడం అతని పట్టుదలకు నిదర్శనం. కష్టాలు, కన్నీళ్లు అనేవి వస్తూ పోతూ ఉంటాయని, కష్టపడితే అదృష్టం మన వెంటే ఉంటుందని నిరూపించాడు. ఒకవైపు తన కూతుళ్లలో ఒక కుమార్తె వంశ పారం పర్యంగా వచ్చే రక్త హీనత సికిల్ సెల్ ఎనీమియా (Sickle Cell Anemia)తో బాధపడుతున్నా తాను నమ్ముకున్నా కష్టాన్ని ఎప్పుడూ వదల్లేదు. రోజుకి రూ. 2000 సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాంతో పని అధికం కావడం వల్ల ఒంటికి గాయాలు తరుచు అవుతూ ఉండేవి. కానీ అవేమీ అతన్ని ఆపలేదు. శారీరకంగా ఎంత గాయమైనా, మానసికంగా బలంగా ఉండటంతో తన పని పట్ల కచ్చితమైన నిబద్ధతో ఉండే వాడు. ఈ క్రమంలోనే కేబీసీ-17కి ఎంపికయ్యాడు. ఇక్కడ జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు అని కూడా రుజువు చేశాడు. తాను చేసేది లేబర్ వర్కే అయినా కనీసం లోకజ్ఞానం ఉందని చాటుకున్నాడు. ఇప్పుడు రూ. 25 లక్షలు గెలుచుకున్న అసిఫ్ కళ్లల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ షోకి వచ్చిన మిగతా ఇద్దరు కూతుళ్లు తండ్రి విజయాన్ని చూసి ఉప్పొంగిపోయారు. రక్తహీనతతో బాధపడే కూతురికి మంచి వైద్యం అందించడమే తదుపరి లక్ష్యమని, ఇక తన కూతుళ్లను డాక్టర్లుగా చూడాలని ఉందని అంటున్నాడు. వారిని డాక్టర్లు చేయడమే లక్ష్యంగా తన కార్యాచరణ ఉంటుందన్నాడు.ఇక కూతుళ్లు మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నాన్న ఏమీ తనకంటూ దాచుకోలేదని, ఎంత ఉంటే అంత తమకే ఖర్చు చేస్తున్నాడని ఒకవైపు ఆనందం, ఉద్వేగంతో కూడిన స్వరంతో వారు చెప్పుకొచ్చారు. -
మధ్యవయసు వారికి ఆహార ప్రణాళిక.. ఏమేం తినాలంటే..
మధ్యవయసు వారిలో శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అవసరం. ఈ సమయంలో గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే, ఈ వయసులో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు రావడం సాధారణం. సరైన ఆహారం తీసుకోవడం వల్ల గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. ఎముకల దృఢత్వం పెరుగుతుంది. మహిళలకు మెనోపాజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒత్తిడి, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ. పోషకాహారం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది, హార్మోన్ల సమతుల్యత కలుగుతుంది.వయసు పెరుగుతున్నకొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందువల్ల విటమిన్–ఎ, ఇ, జింక్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే, పనితీరు మెరుగ్గా ఉండాలంటే సమతుల ఆహారం తప్పనిసరి. సింపుల్గా చెప్పాలంటే, మధ్య వయసులో సరైన పోషకాహారం తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఆలస్యం అవుతాయి, జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. వారి పనితీరును బట్టి తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు.మధ్యవయసు వారి (40–59 సంవత్సరాలు)కి ఆహార ప్రణాళికకేలరీలు : పురుషులు : 2200–3000 కిలో కేలరీలుస్త్రీలు : 1800 – 2300ప్రొటీన్ : పురుషులు : సుమారు 41 గ్రాములు/రోజుమహిళలు : సుమారు 38 గ్రాములు/రోజుకొవ్వు : 20–40 గ్రాములు/రోజు (4.6–15.5%)కార్బోహైడ్రేట్స్ : 55–60%విటమిన్ – ఎ : పురుషులు : 1000 మైక్రో గ్రాములు/రోజుమహిళలు : 840 మైక్రో గ్రాములు/రోజువిటమిన్– ఇ : పురుషులు : 80 మి.గ్రా/రోజుమహిళలు : 65 మి.గ్రా/రోజుఐరన్ : పురుషులు : 17 మి.గ్రా/రోజుమహిళలు : 21 మి.గ్రా/రోజుకాల్షియం : పురుషులు : 1000 మి.గ్రా/రోజుమహిళలు : 1000 మి.గ్రా/రోజునీళ్లు : పురుషులు : 3.5 లీటర్లు / రోజుమహిళలు : 2.5 లీటర్లు / రోజుబ్రేక్ఫాస్ట్పండు: ఏదైనారోజుకు 1–2 సర్వింగ్స్ఇడ్లీ/ఉప్మా/దోశ – రోజుకు 2 సర్వింగ్స్సాంబార్ – (1–2) కప్పులుఉడికించిన గుడ్డు(గుడ్డు తెల్లసొన) – 1 సర్వింగ్మధ్యాహ్నం స్నాక్స్పండ్లు: ఆపిల్, అరటి, జామ, కమలా, పుచ్చకాయమొలకలు: 1 కప్పు / మఖానా (తామర గింజలు)బ్రౌన్ బ్రెడ్ టోస్ట్మధ్యాహ్న భోజనంఅన్నం (బ్రౌన్ రౌస్) 2 కప్పులు/ గోధుమ రొట్టె 1–2 జొన్న/సజ్జ రొట్టె (1–2 సర్వింగ్స్)ఉడికించిన కూరగాయలు + చికెన్ 100 గ్రాములులేదా ఉడికించిన వివిధ రకాల కూరగాయలు + గుడ్డు / పల్చని పప్పు / పనీర్ + పెరుగు 1 కప్పుసాయంత్రం స్నాక్స్పండ్లు 100 గ్రాములు / డ్రైఫ్రూట్స్మొలకలు / మజ్జిగ (1 గ్లాస్)రాత్రి భోజనంచపాతీ / బ్రౌన్ రైస్ – భోజనానికి సమానంగాఉడికించిన వివిధ రకాల కూరగాయలు+ఆకుకూరలు + చికెన్ / స్క్రాంబుల్ గుడ్డు / పనీర్ / పల్చని పప్పుచదవండి: యువత హెల్దీ డైట్ ప్లాన్.. ఈ పోషకాలు తప్పనిసరిమరికొన్ని... కూరగాయలు: రోజుకు 3– 4 సర్వింగ్స్ (కాల్చినవి / వండినవి)ధాన్యం: 6– 7 సర్వింగ్స్ (1 కప్పు = అన్నం/గోధుమ/ చిరు ధాన్యాలు)పాలు/పెరుగు: రోజుకు 2 సర్వింగ్స్ఆరోగ్యకరమైన కొవ్వులకు: 1 టేబుల్ స్పూన్ (నట్స్, గింజలు)ప్రొటీన్ ఆహారం: 1 సర్వింగ్.. మాంసం/చికెన్/గుడ్డుబీన్స్/పెసలు: రోజుకు 1–2 కప్పులు -
జస్ట్ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్.! ఆ సీక్రెట్ ఇదే..
చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించాలని, లక్షాధికారి కావాలనే అనుకుంటారు. అయితే ఎక్కడో ఒకచోట అంచనా తప్పడం, ఆ తర్వాత డబ్బులు చాలక ఇక్కట్లుపడటం జరుగుతుంటుంది. ఒక్కోసారి పక్కాప్లాన్తో ఆర్జించడమే ధ్యేయంగా ప్రయత్నించినా కూడా..అందిరికీ అంత ఈజీగా వర్కౌట్ కాదు. దాంతో సంపాదనలో వెనుకబడుతుంటారు. మధ్యతరగతి లేదా ఓ మోస్తారుగా ఇంటి అవసరాలకు సరిపోయే డబ్బును మాత్రమే కూడబెట్టగలుగుతుంటారు. అలా ఇబ్బందిపడుతున్న వాళ్లకి ఈ యూట్యూబర్ చెప్పే అమోఘమైన ఆర్థిక పాఠాలు ఉపయోగపడొచ్చు. అయితే ఆమె చెబుతున్న విషయాలు వింటే..ఇదేంటి ఈమె ఇలా అంటోందేంటీ అని విస్తుపోవడం మాత్రం ఖాయం. అయితే మనం తేలిగ్గా చూసేవి మన సంపాదనకు అత్యంత కీలమైనవని ఆమె ఆర్థిక చిట్కాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ అదేంటంటే..యూట్యూబ్లో మంచి ఆర్థిక విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న మాజీ వాల్స్ట్రీట్ వ్యాపారి రోజ్ హాన్ అద్భుతమైన ఫైనాన్షియల్ పాఠాలను చెబుతోంది. మనం అంతంగా పట్టించకోనివే..మన డబ్బు సంపాదనకు అత్యంత కీలకం అంటోందామె. మనం సాధారణంగా ఖర్చు చేసే వాటిపై దృష్టిపెట్టం. మనం గనుక ఆ బిల్లులపై ఫోకస్ పెట్టి చవకగా పొందే ప్రయత్నం చేస్తే..కోట్లాధికారి కావడం ఈజీ. ఇదేంటీ అనుకోకండి..మనం చేసే కొనుగోళ్లపై కాస్త జాగురకతతో వ్యవహరించమని అంటోంది. ఒక వేళ్ల మీరు కొనాలనుకున్న వస్తువు రేటు చూసి..కాస్త మంచిగా బేరమాడాలి. అతడు మన ప్రపోజల్ని అంగీకరించేలా మన వాక్ఛాతుర్యం ఉండాలట. ఇలాంటిదే తక్కువ ధరకు చూశానని ఒప్పించాలి. అలాగే ఒక వస్తువుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాననేది వివరించాలి. అలాగే ఈ ప్రొడక్ట్ పై ఉన్న అభిమానం గురించి చెప్పి ఇంప్రెస్ చేసి తక్కువ ధరకే వస్తువుని పొందే ప్రయత్నం చేస్తే..సగం వృధా ఖర్చులు ఆదా అవుతాయట. వాటిలోకి ఇంటర్నెట్, ఫోన్ ప్లాన్లు, బీమా, క్రెడిట్ కార్డ్ APRలు, స్ట్రీమింగ్ సేవలు, వైద్య బిల్లులు తదితరాలన్ని ఉంటాయి. అయితే ఇలాంటి వాటికి బ్రదర్ కాస్త తగ్గించి వేయమని అడగలేం కదా అని భావించకూడదని అంటోంది రోజ్హాన్. అధిక మొత్తంలో సేవింగ్స్ చేయాలనుకున్నా లేదా డబ్బుని ఆర్జించాలన్నా..ఈ మాత్రం జాగ్రత్త ఉండాలంటోంది. అలాగే సదరు ఓనర్ పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని, మాటలతో అతడి మనసుని గెలుచుకునే ప్రయత్నం చేస్తే..మనకు నచ్చిన వస్తువు తక్కువ ధరకే లభిస్తుందని చెబుతోందామె. ఒకవేళ మీ మాటలకు అతడు పడ్డట్లు కనిపించలేదంటే.అతడి సూపర్వైజర్ లేదా రిటెన్షన్ విభాగాన్ని అడగండి. తప్పక మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. అదే సమయంలో ఒక్కోసారి విభిన్నకరమైన ఫలితాలు కూడా రావొచ్చు. కానీ ఏదోరకంగా మనీ సేవింగ్ అనేదే వారి లక్ష్యం అయితే..కచ్చితంగా ఇలాంటి వాటిపై ఫోకస్ పెడితే మంచి ఫలితాలను సత్వారంగా అదుకుంటారని చెబుతోందామె. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరలేపాయి. కాగా, కొరియన్ అమెరికన్ రోజ్ హాన్ 32 ఏళ్లకే సుమారు రూ. 88 లక్షల విద్యార్థి రుణాన్ని చెల్లించి స్వీయ నిర్మిత కోటీశ్వరురాలు అయ్యిందామె. ఆమె ఇలాంటి ఆర్థిక పాఠాలతో యూట్యూబ్లో ఫేమస్ అవ్వడమే కాదు, ఆ నేపథ్యంలోనే ఆమె ఛానెల్కి మిలయన్కిపైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. (చదవండి: కైరాన్ అంటే మాటలు కాదు!) -
బంగారంలా మెరిసింది
మన దేశానికి చెందిన పన్నెండేళ్ల వాన్షీ మొదలియార్ జపాన్లోని టోక్యో ఒపెరా సిటీ కన్వర్ట్ హాల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో బంగారు పతకం గెలుచుకుంది. పాశ్చాత్య సంగీత పోటీలలో కనిపించే యూరప్, యూఎస్, రష్యా, జపాన్ కళాకారుల ఆధిపత్యాన్ని బ్రేక్ చేసింది వాన్షీ. ‘నా పేరు గోల్డ్ ఫస్ట్ ప్రైజ్కు ప్రకటించినప్పుడు సంతోషంగా అనిపించింది. టోక్యో వేదిక మీద నిలబడి భారత్కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది. ఇది నా ప్రయాణానికి ఆరంభం మాత్రమే’ అంటున్న వాన్షీ గత సంవత్సరం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్’లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అయిదు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పుణెలో ‘రహెల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్’లో సంగీత ప్రయాణం ప్రారంభించింది వాన్షీ. ‘లండన్, న్యూయార్క్లలో ప్రదర్శనలు ఇవ్వాలనేది నా కోరిక. సంగీతానికి సరిహద్దులు లేవు. కొత్త భాషలు, కొత్త సంగీత రీతులు నేర్చుకోవాలనుకుంటున్నాను’ అంటుంది వాన్షీ. (చదవండి: కైరాన్ అంటే మాటలు కాదు!) -
కైరాన్ అంటే మాటలు కాదు!
శాంట క్లారా యూనివర్శిటీలో యంగెస్ట్ గ్రాడ్యుయేట్గా అందరి దృష్టిని ఆకర్షించిన కైరాన్ క్వాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘స్పేస్ ఎక్స్’లో స్టార్లింక్ విభాగంలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక అప్పటి నుంచి కైరాన్కు ప్రసిద్ధ ఏఐ ల్యాబోరేటరీలు, టెక్నాలజీ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ప్రపంచ ప్రసిద్ధ ప్రీమియర్ మార్కెట్ మేకింగ్ ఫర్మ్ సిటడెల్ సెక్యూరిటీస్ను ఎంపిక చేసుకున్నాడు. ‘స్పేస్ ఎక్స్’లో సాఫ్ట్వేర్ డిజైనింగ్, ప్రొడక్షన్–క్రిటికల్ సిస్టమ్స్పై పనిచేసేవాడు కైరాన్. సమర్థతకు వయసు అడ్డు కాదని తన నియామకం ద్వారా తెలియజేసిన ‘సిటడెల్ సెక్యూరిటీస్’కు కైరాన్ కృతజ్ఞతలు చెప్పాడు.కైరాన్ క్వాజీ బంగ్లాదేశి–అమెరికన్. తొమ్మిది సంవత్సరాల వయసులోనే థర్డ్ గ్రేడ్ నుండి కాలేజీలో చేరాడు. పది సంవత్సరాల వయసులో ‘ఇంటెల్ ల్యాబ్స్’లో ఇంటర్న్షిప్ చేశాడు. మన్హట్టన్లో ఉంటున్న కైరాన్ రోజూ పది నిమిషాలు నడిచి ‘స్సేస్ ఎక్స్’ ఆఫీసుకు నడిచి వెళ్లేవాడు. ‘నడకలో గొప్ప ఆలోచనలు వస్తాయి’ అంటారు. అందుకే ఏమో! (చదవండి: సెల్ఫోన్తోనే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలు..) -
సెల్ఫోన్తోనే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలు..
‘ఎప్పుడు చూసినా సెల్ఫోన్లో మునిగిపోయి కనిపిస్తారు’ అనేది యూత్ గురించి వినిపించే మాట.అయితే ఆ సెల్ఫోన్ ద్వారానే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలూ కూడా చేపట్టవచ్చు అని నిరూపించారు వేములవాడ యువకులు...అన్నదానం మహాదానం అంటారు. ఈ మాటను నిజం చేస్తూ వేములవాడ యువకులు గత 1582 రోజులుగా ‘మై వేములవాడ ట్రస్ట్’ ద్వారా స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథా కాకుండా పేద భక్తులకు పంచిపెడుతున్నారు. మొదట ఫ్రెండ్స్ అందరూ కలసి వాట్సాప్ గ్రూప్గా ఏర్పడ్డారు. సమాజానికి తమవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. ‘మై వేములవాడ ట్రస్ట్’ ఏర్పాటు చేసి పేద భక్తులకు నిత్యాన్నదానాన్ని అందిస్తున్నారు. స్థానిక పేదలు ప్రతిరోజూ ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా కడుపు నింపుకుంటున్నారు. ట్రస్ట్గా ఏర్పడిన తరువాత భక్తులకు నిత్యాన్నదానాన్ని అందించడంతోపాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజన్న దర్శనానికి వచ్చే వందలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తున్నారు.‘మేము పుట్టి పెరిగిన పట్టణానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ట్రస్టుగా ఏర్పడ్డాం. అప్పటి నుంచి దాతల సహకారంతో నిత్యం అన్నదానం చేస్తున్నాం. అనాథలకు, పేదింటి ఆడపడచుల వివాహాలకు, అనారోగ్యంతో బాధపడే వారికి తోచినంత సహాయం చేస్తున్నాం’ అంటున్నాడు ‘మై వేములవాడ ట్రస్టు’ కార్యదర్శి మధు మహేశ్.‘ఫ్రెండ్స్ అంతా కలసి ట్రస్టుగా ఏర్పడి మాకు తోచిన స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలకు వచ్చిన స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతాం’ అంటున్నాడు ట్రస్టు ప్రతినిధి బెజ్జింకి రవీందర్.– సయ్యద్ తాహెర్పాషా, సాక్షి, వేములవాడకులమతాలకు అతీతంగా...కులమతాలకు అతీతంగా ‘మై వేములవాడ ట్రస్టు’ ద్వారా నిత్య సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నాం. మా పాప జన్మదినం సందర్భంగా ఇక్కడే పేదలకు అన్నదానం నిర్వహించాం. మా ప్రయత్నం చూసి మరికొందరు ముందుకు రావాలని, తమ వంతు సేవ అందించాలని కోరుకుంటున్నాం.– మహమ్మద్ రఫీక్, ట్రస్టు ప్రతినిధి, వేములవాడమహాభాగ్యంమై వేములవాడ ట్రస్ట్ సేవా యాత్రలో సేవ చేసే భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నిత్యం పేదలకు అన్నదానం చేస్తుంటే మనసెంతో ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజూ ఇక్కడకు వచ్చే వందలాది మంది భక్తులలో ఎవరూ ఆకలితో ఉండకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అన్నం వృథా కాకుండా అవసరమైన వారికి అందించడమే నిజమైన పుణ్యంగా భావిస్తున్నాం.– పాత సంతోష్, ట్రస్టు ప్రతినిధి, వేములవాడ -
సహజ శిశు సంరక్షణ.. 'బేబీ స్పా'..
బాడీ స్పా, హీలింగ్ థెరపీ స్పా వంటి సేవలు అందించేందుకు నగరంలో మొదటి సారి చిన్నారుల కోసం ‘బేబీ స్పా’ సేవలు అందుబాటులోకొచ్చాయి. పీడియాట్రిక్, ఫిజియోథెరపిస్టుల ఆధ్వర్యంలో అందించే ఈ బేబీ స్పా సేవలు చిన్నారుల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల, కండరాల సమృద్ధి, మోటార్ డెవలప్మెంట్ వంటి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బంజారాహిల్స్లోని ఫెర్నాండెజ్ స్టార్క్ హోమ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ బేబీ స్పా దేశంలోనే మొదటిది కాగా దీనిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన ప్రారంభించారు. ఈ ‘బేబీ స్పా’లో భాగంగా 6 వారాల నుంచి 9 నెలల వయసు శిశువులకు హైడ్రోథెరపీ, బేబీ మసాజ్తో పాటు ఇంద్రియాల ఉద్దీపనం, చిన్నారులు తల్లిదండ్రుల బంధాన్ని పెంపొందించే సేవలుంటాయి.సహజంగా.. సురక్షితంగా..!! ఈ బేబీ స్పాలో అందించే హైడ్రోథెరపీ, మసాజ్లు 3 వేల ఏళ్ల క్రితమే మన సంస్కృతిలో ఉండేవని, ఈ పద్దుతులను అధునాతనంగా ఈ తరానికి అందించమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్పర్సన్ డా.ఎవిటా ఫెర్నాండెజ్ తెలిపారు. బేబీ స్పా పద్దతులు తల్లి గర్భంలో ఉన్న చిన్నారికి కొనసాగింపుగా ఉంటాయి. యూవీ స్టెరిలైజ్డ్ ఆర్ఓ ఫిల్టర్ చేసిన వాటర్ టబ్స్లో చిన్నారులకు స్పా, గ్రేప్ సీడ్ ఆయిల్తో మసాజ్ వంటి సురక్షితమైన సేవలుంటాయి. ఇవి పసిపిల్లల్లో సెన్సారింగ్, మోటార్ డెవలఫె్మంట్కు తోడ్పడతాయి. సైన్స్ ఆధారిత ఫలితాలతో స్పా మేలు చేస్తుంది. చిన్నారుల నిద్ర, బరువులో సమతుల్యత, శరీర అవయవాల ఎదుగుదలలో సంరక్షణను అందిస్తుంది. ఒక సెషన్ 45 నిమిషాల పాటు ఉండగా.. ఇందులో 15 నిమిషాలు నీటిలోనే థెరపీ ఉంటుందుని డాక్టర్ సుష్మ తెలిపారు. చిన్నారుల పీహెచ్కు అనుగుణంగా 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్లో అందించే ఈ స్పా విధానాలు భారత్ మూలాలతో పాటు ఈజిప్ట్, మొసపటేమియా, చైనా వంటి సంస్కృతుల్లో భాగమేనని తెలిపారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన లారా ఈ బేబీ స్పాపై పరిశోధనలు చేసి అభివృద్ధి చేశారు.తల్లీబిడ్డల శ్రేయస్సు కోసం.. బేబీ స్పా వంటి అధునాతన సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం. దాదాపు తొమ్మిదేళ్లకు ముందే వాటర్ బర్త్ వంటి వినూత్న వైద్య సేవలను ఫెర్నాండేజ్ షౌండేషన్ నగరానికి పరిచయం చేశారు. సహజ ప్రసవాలకు ఇది కీలకంగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నర్సులకు మిడ్ వైవ్స్ పద్దతులపై అవగాహన, శిక్షణ కల్పించారు. మన మూలాల్లోని సంప్రదాయ పద్దతులను అధునాతనంగా అందించే ఈ చికిత్సలను స్వతహాగా నా పిల్లలకు సైతం అందించాను. అధిక మొత్తంలో మెడిసిన్ కన్నా సహజంగా మిడ్ వైవ్స్ సంరక్షణ పద్దతులతో ఇలాంటి సేవలు మహిళా శిశు సంరక్షణలో కీలకంగా నిలుస్తాయి. – హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్. -
ఆల్కహాల్ రహిత దేశీ రుచులకూ కేరాఫ్..
నగరంలో తొలి మైక్రో బ్రూవరీ ఏర్పాటై దాదాపు పదేళ్లవుతోంది. అప్పటి నుంచి కేవలం సరదాగా కాలక్షేపం చేసేవారికి తప్ప.. క్రాఫ్ట్ బీర్ అతి తక్కువ మందికి మాత్రమే చేరువైంది. ఈ నేపథ్యంలో మైక్రోబ్రూవరీలను విస్తృతంగా అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయించడం నగరంలో క్రాఫ్ట్ బీర్ రంగానికి కొత్త ఉత్సాహం అందించింది. మైక్రో బ్రూవరీ రంగం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ, పుణె తదితర నగరాలు కూడా క్రాఫ్ట్ బీర్ మార్కెట్లో గణనీయమైన వృద్ధిని చూపిస్తున్నాయి. స్థానిక ప్రత్యేకమైన రుచుల పట్ల వినియోగదారుల ఆసక్తి, డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా 2030 నాటికి ప్రస్తుత మార్కెట్ మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మైక్రో బ్రూవరీల సంఖ్య 300కి పైగా ఉంటే, 2030 నాటికి ఈ సంఖ్య 1,000 దాటవచ్చని విశ్లేషకుల అంచనా. క్లబ్లు, ఎలైట్ లిక్కర్ షాపులు, స్టార్ హోటళ్లు తమ సొంత ఇన్–హౌస్ మైక్రో బ్రూవరీలను నిర్వహించడానికి అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్న నేపథ్యంలో నగర పార్టీ కల్చర్ కూడా కొత్త రూపు సంతరించుకోనుంది. ముఖ్యంగా తరచుగా ఈవెంట్స్ నిర్వహించే వారు కూడా ఈ బ్రూవరీల లైసెన్స్లు పొందే అవకాశం ఉంది. తద్వారా ఈవెంట్ల వ్యాప్తంగా బీర్ వినియోగం ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయరుచులకు తోడు ఆరోగ్య స్పృహ బ్రూవరీలు దేశీయ రుచులకు పెద్దపీట వేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి మామిడి, మిరియాలు, చాయ్ వంటి స్థానిక పదార్థాలను తమ బ్రూలలో కలుపుతున్నారు. పెరుగుతున్న ఆరోగ్య స్పృహకు అనుగుణంగా తక్కువ ఆల్కహాల్తో పాటు ఆల్కహాల్ రహిత బీర్లకు సైతం వీటి ద్వారా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ మైక్రో బ్రూవరీలు కేవలం బీర్ డ్రింకింగ్కు మాత్రమే పరిమితం కావు. రుచికరమైన వంటకాలతో పాటు నగర సామాజిక కేంద్రాలుగా కూడా ఉంటున్నాయి. ఏమిటీ క్రాఫ్ట్ బీర్? తక్కువ ఆల్కహాల్ కలిగిన, స్థానిక తయారీదారులు తయారు చేసేవే క్రాఫ్ట్ బీర్లు. వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం లాగానే అప్పటికప్పుడు తాజాగా తయారుచేసిన బీర్ ఆర్డర్ చేసుకోవచ్చన్న మాట. ఫ్రెష్ బీర్ రుచిని నచ్చిన ఆహారంతో కలిపి ఆస్వాదించవచ్చు.బెంగళూరు.. క్యాపిటల్ ఆఫ్ బీర్.. భారతదేశ బీర్ క్యాపిటల్గా పేరున్న బెంగళూరులో దాదాపు 80కిపైగా మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. బీర్ ఇష్టపడే యువకుల సంఖ్య పెరుగుతండడంతో బెంగళూర్లో పేరున్న మైక్రో బ్రూవరీలు 10,000–15,000 చదరపు అడుగుల మధ్య ఏపటవుతున్నాయి. ఓ బ్రూవరీ కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ ‘బ్రూవరీలు స్థానిక, అంతర్జాతీయ పదార్థాల మేళవింపుతో బీర్లను పరిచయం చేయడం ద్వారా వినియోగాన్ని ఆసక్తికరంగా మారుస్తున్నాయి. వైన్ షాప్స్లో అందుబాటులో ఉండే నిల్వ పానీయాలకు బదులు తాజాగా తయారుచేసినవి ఇష్టపడే 25 నుంచి 55 సంవత్సరాల వయసు గలవారే బ్రూవరీలకు రెగ్యులర్ కస్టమర్స్’ అంటున్నారు. నగరం ఇంకా వెనుకంజే..నగరం బీర్ల వినియోగంలో ముందున్నప్పటికీ.. బెంగళూరు, పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో మాదిరిగా ఇక్కడ మైక్రో బ్రూవరీ సంస్కృతి ఇంకా పెద్దగా ఊపందుకోలేదు. ప్రస్తుతం, హైదరాబాద్, రంగారెడ్డిలలో కలిపి 18 మైక్రో బ్రూవరీలు ఉండగా, ఇవి సమిష్టిగా ఏటా దాదాపు 1.8 మిలియన్ బల్క్ లీటర్ల బీరును ఉత్పత్తి చేస్తాయి. 2016లో 50 కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే 18 కంపెనీలు లైసెన్స్ పొందాయి. ప్రస్తుతం రాష్ట్ర 2025–26లో ఎక్సైజ్ శాఖ రూ.27,623 కోట్ల ఆదాయ లక్ష్యంతో, రాష్ట్రం తన ప్రణాళికలను పునర్ప్రారంభిస్తోందని అంటున్నారు. దీని ఫలితంగా ఈ మైక్రోబ్రూవరీల సంఖ్య 50కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నగరంతో పాటు వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి నగరాల్లో బ్రూవరీలను ఏర్పాటు చేయడంపై గణనీయమైన ఆసక్తి ఉందని అధికారులు చెబుతున్నారు. (చదవండి: యువత హెల్దీ డైట్ ప్లాన్..! ఈ పోషకాలు తప్పనిసరి..) -
యువత హెల్దీ డైట్ ప్లాన్..!
ఈ రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా యువత ముఖ్యంగా అమ్మాయిలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఐరన్ లోపం. రుతుక్రమం కారణంగా రక్త నష్టం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా బలహీనత, తలనొప్పి, చదువుపై దృష్టి కేంద్రీకరించ లేక΄ోవడం జరుగుతున్నాయి. కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతాల బలం తగ్గిపోతుంది. దీని కారణంగా భవిష్యత్తులో ఆస్టియో΄ోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రోటీన్ లోపం వల్ల కండరాల అభివృద్ధి సరిగా జరగదు. శరీరంలో శక్తి తగ్గి, బలహీనమైపోతుంది. విటమిన్ –ఎ, ఇ లోపం వల్ల కంటి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. హార్మోన్ల అసమతుల్యత, సరైన పోషకాలు అందక పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. పోషకాల లోపం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడుతుంది. టెన్షన్, ఆందోళన, డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. చదువులు, ఉద్యోగం, దినసరి చర్యలలో ఇబ్బందులు కలుగుతాయి. అందుకని, యువత రోజువారీ ఆహారంలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, పాలు – పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి.బ్రేక్ఫాస్ట్గోధుమ రవ్వ ఉప్మా – 1 కప్పు / దోశ – 2/ కిచిడి – 1 కప్పు/ రాగి దోశ – 2 సర్వింగ్స్/ ఇడ్లీ – 3 + సాంబారు – 1 కప్పు/ ఉడకబెట్టిన గుడ్డు, సలాడ్ స్నాక్స్ ఆపిల్/ కమలా/ కివి/ పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, ఉడికించిన మొక్కజొన్న/పుదీనా టీమధ్యాహ్న భోజనంఅన్నం (బ్రౌన్ రైస్) – 2 కప్పులు / మిల్లెట్స్ / చపాతీ కూరగాయలతో కూర – 2 కప్పులుచికెన్ / గుడ్డు / పనీర్ / చేప – 100 గ్రాములుసాయంత్రం స్నాక్స్మొలకలు – 1 కప్పు/ చియా గింజలు/ సన్ఫ్లవర్ సీడ్స్/ ఫ్లాక్స్ సీడ్స్/ హెర్బల్ టీ – 1 కప్పుజొన్న/ సజ్జ రోటీ – 1–2 సర్వింగ్స్రాత్రి భోజనంమధ్యాహ్న భోజనం మాదిరిగానే: చికెన్ / చేప / పనీర్ / గుడ్డు + సలాడ్పోషక అవసరాలు కేలరీలు యువకులు: 2400–3000 కిలోకేలరీలు/రోజుయువతులు:1800–2400 కిలోకేలరీలు/రోజుప్రోటీన్యువకులు: 56 గ్రాములు/రోజుయువతులు: 46 గ్రాములు/రోజుకూరగాయలు: రోజూ 4–5 సర్వింగ్స్ఫ్యాట్స్ యువకులు – యువతులు:రోజువారీ బరువు ప్రకారం 20–25%అన్ని రకాల గిజ ధాన్యాలలో ఏవైనా.. రోజుకు 6–7 సర్వింగ్స్(1/2–1 కప్పు ఉడికించిన బియ్యం లేదా గోధుమ)కార్బోహైడ్రేట్లుయువకులు – యువతులు: రోజువారీ బరువు ప్రకారం 45–65%పాలు – పాల ఉత్పత్తులురోజుకు 1–2 సర్వింగ్స్ (పెరుగు లేదా టోన్డ్ మిల్క్ రూపంలో)విటమిన్ – ఎయువకులు: 1900 మి.గ్రా/రోజుయువతులు: 700 మి.గ్రా/రోజువిటమిన్ – ఇయువకులు: 90 మి.గ్రా/రోజుయువతులు: 75 మి.గ్రా/రోజుకాల్షియం: 1000 మి.గ్రా/రోజుఐరన్యువకులు: 10 మి.గ్రా/రోజుయువతులు: 18 మి.గ్రా/రోజుఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy fats):నట్స్, గింజలు – 1 టీ స్పూన్ప్రోటీన్ ఫుడ్స్చికెన్/మాంసం/చేప/గుడ్డు – 1 సర్వింగ్పప్పులు, బఠానీలు – 1/4 కప్పు(చదవండి: రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్ లిఫ్టింగ్లో విజయం) -
శాస్త్రీయ సాంకేతిక అవగాహనకు...
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పెన్పహడ్ జిల్లా పరిషత్తు స్కూల్లో బయాలజీ టీచర్గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు పవిత్ర. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకోబోతున్నారు. ఆట పాటలను మిళితం చేస్తూ బోధించే విధానానికి శ్రీకారం చుట్టారు పవిత్ర. పాఠ్యాంశాలకు అనుగుణంగా గేమ్స్ రూ΄÷ందించి విద్యార్థులకు బాగా అర్థం అయ్యేలా చేస్తున్నారు.ఆడుతూ హాయిగా నేర్చుకునేలా...బయాలజీ కాన్సెప్ట్స్ను తీసుకొని ఫైండ్ ద వర్డ్ సర్చ్, క్రాస్ వర్డ్ పజిల్స్ తదితర గేమ్స్ రూపొందించారు. పాఠం చెప్పిన తరువాత ఈ గేమ్స్ ఆడిస్తే విద్యార్థులకు కాన్సెప్ట్ను మరోసారి రిపీట్ చేసినట్లు అవుతుంది. ప్రతి దశను తెలుసుకుంటారు. ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి మరచి΄ోకుండా ఉంటారు.విద్యా వారధిఅమెరికా వంటి దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో విద్యార్థులకు అర్థమయ్యేలా చేసేందుకు ‘విద్యా వారధి’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. ‘విద్యా వారధి’లో స్కూల్ పిల్లలు అమెరికాలోని విద్యార్థులతో ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. అమెరికాలో విద్య. బోధన విధానం, పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి...మొదలైన విషయాలను అక్కడి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటారు.వ్యక్తిత్వ వికాస డైరీవిద్యార్థులు తమ డైరీలో సబ్జెక్ట్కు సంబధించిన అసైన్మెంట్స్ రాసుకుంటారు. కానీ ఈ స్కూల్ పిల్లల డైరీ ప్రత్యేకం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తమ దినచర్య రాయాలి. తప్పు చేసినా, మంచి పని చేసినా రాయాలి. వారం రోజుల తరువాత డైరీలో రాసుకున్న విషయాలను విద్యార్థులే చదువుకునేలా చేస్తారు. వారం రోజుల్లో చేసిన మంచి పనులు, తప్పులు ఏమిటి? ఎలా ఉండాలనేది విద్యార్థులు స్వయంగా తెలుసుకుంటారు. తద్వారా వారిలో క్రమంగా సత్ప్రవర్తన పెంపొందుతుంది.– చింతకింది గణేశ్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ (చదవండి: మానవ రక్తం కంటే అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా..!) -
మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన కరక్కాయ
హైదరాబాద్: దగ్గు వస్తోందని రాత్రి నిద్రపోయేటప్పుడు కరక్కాయ బుగ్గన పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన 57 ఏళ్ల విజేత అనే మహిళకు దగ్గు బాగా ఎక్కువగా వస్తుందని రాత్రి నిద్రకు దగ్గుతో ఇబ్బంది అవుతుందని, ఆమె కరక్కాయ బుగ్గన పెట్టుకుని పడుకున్నారు. నిద్రలో తెలియకుండానే దాన్ని మింగేశారు. అది కాస్తా శ్వాసనాళాల్లోకి వెళ్లిపోవడంతో ఆమెకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి, డాక్టర్ భరత్ జానపాటి తెలియచేసారు.విజేత అనే ఈ మహిళకు కొంతకాలంగా వాతావరణంలో మార్పుల కారణంగా దగ్గు వస్తోంది. కూర్చున్నప్పటి కంటే పడుకుని ఉండే స్థితిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుందని, దగ్గు తగ్గడానికి ఆమె ఒక కరక్కాయ బుగ్గన పెట్టుకున్నారు. నిద్రలో పొరపాటున దాన్ని మింగేశారు. దాంతో ఆమెకు విపరీతమైన దగ్గు, ఆయాసం, ఊపిరి అందకపోవడంతో బాధపడుతూ కామినేని ఆస్పత్రి ఎమర్జెన్సీకు వచ్చారు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాII రవీందర్ రెడ్డి చూసి, శ్వాస ఆడటంలో ఎక్కువగా ఇబ్బంది ఉంటడంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి, ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఆమెకు చెస్ట్ ఎక్స్-రే, హెచ్ఆర్ సీటీ స్కాన్ పరీక్షలు చేయగా ఎడమ శ్వాసనాళాలలో ఎదో అడ్డు పడినట్టు, దాని కారణంగా ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు. వెంటిలేటర్ పైన ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డాక కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాII భరత్ జానపాటి బ్రాంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాలను పరీక్షించారు. ఎడమ శ్వాసనాళం ఒక పదార్థంతో మూసుకుపోయినట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ చికిత్స చేయాలని నిర్ణయించారు. ఇదివరకే ఆమెకు అధిక రక్తపోటు, థైరాయిడ్, గుండె సమస్య ఉన్నాయి. గతంలో ఒకసారి యాంజియోప్లాస్టీ కూడా చేశారు. అందువల్ల ఈ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. అనస్తీషియా టీం సహకారంతో ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. బ్రాంకోస్కోపీ ద్వారా రాట్ టూత్ (Rat Tooth ) ఫోర్సెప్స్ అనే ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఎడమ శ్వాసనాళంలో రెండు ముక్కలుగా బలంగా ఇరుక్కుపోయిన కరక్కాయను పేషెంట్కు ఎటువంటి హాని కలగకుండా విజయవంతంగా తీశారు.బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకున్నాయి. రోగి పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. ఎడమ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తోందని నిర్ధారించుకున్న మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేసారు.ఈ సందర్బంగా డాII భరత్ జానపాటి మాట్లాడుతూ "ఈ రకంగా శ్వాసనాళాలోకి, ఉపిరితిత్తులలోకి బయట పదార్థాలు వెళ్లడం ముఖ్యంగా చిన్నపిల్లల్లో, లేదా న్యూరోలాజికల్ సమస్యలు ఉన్న వారిలో తరచూగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా పడుకునే సమయాల్లో కరక్కాయలు, లేదా వక్క పలుకులు లాంటివి బుగ్గన పెట్టుకొని పడుకునే అలవాటు ఉన్నవారికి ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బ్రాంకోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించటం సాధ్యం" అని ఆయన తెలియచేసారు. -
స్కూళ్లలో ‘షుగర్ బోర్డులు’.. ఎందుకో తెలుసా?
సీబీఎస్ఈ బోర్డు మే 14న విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొన్నట్లు ఇతర రాష్ట్రాలతో పాటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళన్నిటిలో ‘షుగర్ బోర్డులు’ పెడుతున్నారు. పంచదార అధిక మోతాదులో ఉన్న జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలలో ఊబకాయం, మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరి గిన రీత్యా ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటివరకు కొవ్వు ఆహారాల వల్లే జీవనశైలి (Life Style) వ్యాధులు వస్తున్నాయనీ, కొవ్వులు తగ్గించడమే సమస్యకు పరిష్కారమనీ తప్పుడు ప్రచారం తీవ్ర స్థాయిలో ఉంది. నిజానికి చక్కెర వాడకం అధికం కావడం వల్లే పిల్లలు రకరకాల రుగ్మతలకు గురవుతున్నారు. రోజువారీగా పిల్లలు తీసుకుంటున్న కేలరీలలో పంచదార (Sugar) నుండి వచ్చే కేలరీలు 5 శాతానికి మించకూడదు. మన పిల్లల ఆహారంలో 13 నుండి 15 శాతం (3 రెట్లు) కేలరీలు పంచదార నుండే వస్తున్నట్లు గుర్తించారు.2010లో ఢిల్లీ హైకోర్టులో ‘ఉదయ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి జంక్ ఫుడ్స్ను నిషేధించ మనడంతో ఈ చర్చ ప్రారంభమయ్యింది. 2015లో కోర్టు ఇందుకు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను రూపొందించమని వివిధ కేంద్ర పభుత్వ సంస్థలను ఆదేశించింది. 2013లోనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి జంక్ ఫుడ్స్ అమ్మకాలను స్కూళ్ళలో నిషేధించమని అదే కోర్టు కోరింది. 2019లో తమిళనాడు ప్రభుత్వం జంక్ఫుడ్స్ను, కూల్డ్రింక్స్ను స్కూళ్ళలో నిషేధించింది. పంచదార దట్టించిన ఆహారాలు పిల్లలలో ఊబకాయం, మధుమేహాలనే గాక దంత క్షీణత, గుండె జబ్బులు, బీపీ, మతి మరుపు, మెదడు (Brain) పనితనం దెబ్బతినడం, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్లు అనేక పరిశోధనల్లో నిర్ధారణ అయింది.ప్రభుత్వాలు ప్రమాదకరమైన ఈ ఆహారాల తయారీని కట్టడి చేయాలి/నిషేధించాలి. పోషకాహార అంశాల్ని స్కూల్ సిలబస్లో భాగం చేయాలి. ఆహారం వండే వర్కుషాపులు కనీసం వారానికొకటి పిల్లలచే చేయించాలి. మన శరీరాలకు బయో క్లాక్ వుంది. హార్మోన్లు విడుదలయ్యే క్రమానికి అనుగుణంగా ఆహార వేళలు, నిద్ర వేళలు (Sleeping Hours) ఉండాల్సిన అవసరాన్ని చెప్పడమే గాదు, అమలుపరచాలి. ప్రతిరోజూ ఆటలకు, వ్యాయామానికి తగిన సమయం స్కూల్ టైమ్ టేబుల్లో కేటాయించాలి.చదవండి: మీ తియ్యని ప్రేమ తగ్గించండి!ప్రజారోగ్య రంగంలో పనిచేస్తున్న వైద్యులుగా, పిల్లల సమగ్ర అభివృద్ధి పట్ల శ్రద్ధ ఉన్న వారిగా మేం ఈ విజ్ఞాపనను ముందు పెడుతున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్యకర పిల్లలతో కూడిన దేశ నిర్మాణం కోరే వారంతా మాతో గొంతు కలపాలని కోరుతున్నాం. – వైద్యులు, పిల్లల ప్రేమికులు -
మానవ రక్తం కంటే అత్యంత ఖరీదైనది ఏదో తెలుసా..!
ఎన్నో విలాసంవంతమైన వస్తువులు, భవనాలు గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత ఖరీదైన ద్రవాలు గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే ద్రవాలు ఉత్పత్తి చేయడం సాధ్యం కానివి. పైగా వాటి ఉపయోగాలు గురించి వింటే మాత్రం నోట మాట రాదు. ఇవి మనం చుట్టూ చూసే చిన్న చిన్న జీవుల్లోనే ఉన్నాయా..అని విస్తుపోతారు. అది కూడా మానవ రక్తం కంటే కూడా ఆ ద్రవాలే అంత విలువైనవా అని ఆశ్చర్యంకలుగక మానదు. మరి అవేంటో చూసేద్దామా.తేలు విషం (రూ. 343 కోట్లు)అన్నింటకంటే అత్యం ఖరీదైన ద్రవం తేలు విషం. వైద్య పరిశోధనలో ఎన్నో వ్యాధులకు అమూల్యమైన ఔషధం ఇది. ఇందులో మెడదడు కేన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ప్రోటీన్లు ఉంటాయట. దీన్ని అత్యంత జాగురకతతో చుక్కల వారీగా తీయాలట. అందువల్ల దీన్ని సేకరించడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న టాస్క్. అందువల్లే ఇంతల కోట్లలో ధరలో పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. కింగ్ కోబ్రా విషం (రూ. 13 కోట్లు)దీన్ని కూడా వైద్య పరంగా వినియోగిస్తారు. దీర్ఘకాలిక నొప్పిని నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలు విషం మాదిరిగానే సేకరిస్తారు. పైగా చుక్క కూడా అత్యంత ఖరీదైనది. ఇందులో ఓహానిన్ ప్రోటీన్ ఉంటుంది. నొప్పి నివారణ మందులలో ఉపయోగిస్తారు. గుర్రపుడెక్క పీత రక్తం(రూ. 52 లక్షలు)ఈ పీత రక్తాన్ని టీకాలు, IV ఔషధాలలో బ్యాక్టీరియా కాలుష్యాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారట. దీని నీలి రంగు రక్తం గడ్డకట్టే లక్షణాలు వైద్యానకి అత్యంత అమూల్యమైనదట. దీనికున్న డిమాండ్, పరిమిత సంఖ్యలో వీటి లభ్యత తదితర కారణాల రీత్యా దీని రక్తం అత్యంత ఖరీదని చెబుతున్నారు.ఇన్సులిన్:(రూ. 11లక్షలు)డయాబెటిస్ నిర్వహణకు అత్యంత కీలకమైన హార్మోనో ఇది. ఇది కూడా ఔషధ ధర రీత్యా అత్యంత ఖరీదైన ద్రవంగా నిలిచింది. ఇది లక్షలాది ప్రాణాలను కాపాడే దివ్యౌషధమైన ఈ ఇన్సులిన్ దాని ధర, లభ్యతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు పెంచుతోంది. చానెల్ నెంబర్ 5: (రూ. 22 లక్షలు)ఈ ఐకానిక్ ఫెర్ఫ్యూమ్ దాని సంక్లిష్ట ఫార్ములా, బ్రాండ్ కారణంగా అత్యంత ఖరీదైన ద్రవాలలో ఒకటిగా స్థానం దక్కించుకుంది. దీన్ని అత్యంత అరుదైన పూల నూనెల నుంచి తయారు చేస్తారట.ప్రింటర్ ఇంక్:(రూ. 10 లక్షలు)అనేక లగ్జరీ పెర్ఫ్యూమ్ల కంటే ఒక సాధారణ ప్రింటర్ ఇంక్ చాలా ఖరీదైనదట. రోజువారి జీవితాల్లో దీని పాత్ర ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ సిరా ధర కూడా అత్యంత ఖరీదైనదేనని చెబుతున్నారు నిపుణులు.మానవ రక్తం (రూ. 1లక్ష)అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి లేదా శస్త్ర చికిత్సలలో ఇది అత్యంత అవసరం. అయితే దీని ధర పరీక్ష, ప్రాసెసింగ్, సురక్షితమై నిల్వ కారణంగానే ఇది కూడా ఖరీదైన ద్రవాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని సేకరించగలమే గానీ ఉత్పత్తి చేయలేం. అలాగే దీన్ని స్వచ్ఛందంగా దానం చేస్తున్నప్పటికీ.... జాగ్రత్తగా పరిరక్షించడం అనేది గణనీయమైన ఖర్చులతో కూడుకున్నది కావడంతోనే ఇంతలా ధర పలుకుతోందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: కన్నీళ్లు పెట్టించే 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' డ్రామా..!) -
ప్రేమైక జీవితము: 'వివాహబంధం'
వివాహ వ్యవస్థలో కథోలిక సంఘాలలో ఏడు సంస్కారాలు పాటిస్తారు. ఒకటి– బాప్తిస్మము, రెండు– ప్రభు సంస్కారము, మూడు– నిర్ధారణ (కన్ఫర్మేషన్), నాలుగు – జ్ఞానస్నానం (రికన్ఫర్మేషన్), ఐదు – రోగుల పరామర్శ(ఎనాంటిగ్ ఆఫ్ సిక్), ఆరు – పరిశుద్ధ వివాహం, ఏడు – పరిశుద్ధ ఉత్తర్వులు (హోలీ ఆర్డర్స్). ఈ ఏడింటిలో ప్రాముఖ్యమైనది, ఘనమైనది, పవిత్రమైనది వివాహము. ఇది శాశ్వతమైన బంధం. వీటిని అన్ని సంఘాలవారు ఆచరించకపోయినా ప్రొటెస్టెంట్ క్రైస్తవులు ఒకటి –బాప్తిస్మము, రెండు– ప్రభు సంస్కారము పాటిస్తున్నారు. ప్రభువు గహాన్ని (యింటిని కట్టించక΄ోతే కట్టువాని ప్రయాస వ్యర్థమేనని, అలాగే గుణవతి అయిన భార్య లభించుట అరుదు. గుణవతి అయిన భార్య ముత్యం కంటే అమూల్యమైనది. (బైబుల్ గ్రంథంలో చూస్తాం). బైబిల్లోని ఆదికాండ గ్రంథంలో హవ్వను ఆదామును కలుగజేసి తొలి/ప్రధమ కుటుంబం వారిరువురిని, తర్వాత బైబిల్లోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో సంఘం (చర్చ్) వధువుగాను, ప్రభువును వరుడుగాను గుర్తించండి. అలాగే వివాహం ఒప్పందం కాదు, కొనసాగించుకోవటానికి రద్దు పరచుకోవటానికి ఇది శాశ్వత బంధం.రెక్కలు వచ్చి పిల్లలు స్థిరపడి వారు వేరే ్ర΄ాంతానికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు తోడూ నీడా ఈ రెండు పండుటాకులైన భార్యాభర్తలు, భార్య దేవుడిచ్చిన ‘వరం’, అనాది సంకల్పం చొప్పున ఏర్పడిన దాంపత్యం అనగా (మేడ్ ఫర్ ఈచ్ అదర్). దీనికి కావల్సింది సమాధానం. పెండ్లి అయిన తర్వాత మిగిలిన శేష జీవితంలో ఆనందంగా సుఖసంతోషంతో జీవించాలి. దీనికి ప్రదానం ప్రార్థన.దేవునియందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. అప్పుడు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలీయుల మీద సమాధాన ముండునుగాక (దావీదు కీర్తనలు 128:1–6). కావున ఈదీవెనలతో పిల్లా పాపలతో జీవించి, పెండ్లి అంటే నూరేళ్ళ పంటగావున, సమాధానంగా జీవించుదురు గాక.– కోట బిపిన్ చంద్రపాల్ (చదవండి: Chandra Grahan 2025: చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..) -
చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..
భాద్రపద పౌర్ణమి, ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం(Chandra Grahan) ఏర్పడనుంది. గతంలో ఒకటి రెండు గ్రహణాలు వచ్చినా అవి మన దేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం మన దేశంలో లేదు. ఈ ఆదివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది. గ్రహణ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే దానిపై పండితులు చెప్పిన వాటిలో ముఖ్యాంశాలు. ఆదివారం,7న రాత్రి 9:58 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు మూడున్నర గంటలు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం.సూతక కాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేయాలి?హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు కొంత సమయం నుంచి, గ్రహణ సమయంతో పాటు, గ్రహణం తరువాత కొంత సమయాన్ని కలిపి సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తరువాత తలుపులు తెరిచి యథావిధిగా పూజలు చేస్తారు. రాహుకేతు పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయిపాటించాల్సిన నియమాలు ఏంటంటే...గ్రహణం రోజున సూతక కాలం ఆరంభం అయినప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం సరిగా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేక΄ోతే ΄ాలు, పండ్ల రసం వంటివి తీసుకుంటారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ గడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం.గ్రహణం సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయరు. వీలైనంత వరకు భగవన్నామ స్మరణ, ధ్యానం మంచిది. .దానాలు శ్రేష్టంచంద్ర గ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శక్తిమేరకు బట్టలు, ఆహారం, ధాన్యం, డబ్బు దానం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ ఆదివారం రానున్న చంద్ర గ్రహణం రోజు మనం కూడా పెద్దలు, శాస్త్రాలు చెప్పిన పరిహారాలు పాటించడం శ్రేయస్కరం. దైవారాధన ఎలా?గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్యపూజ చేసుకోవాలి. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్ లిఫ్టింగ్లో విజయం
ఆమె బరువులు ఎత్తడం మాత్రమే కాదు..మన స్ఫూర్తిని కూడా పైకి ఎత్తుతోంది అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు గుప్పించారు. సాక్షాత్తూ మహీంద్రా గ్రూప్ అధినేతగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆయన లాంటి ప్రముఖుడి నుంచి ప్రశంసలు అందుకున్న ఆమె అత్యంత సాదా సీదా వ్యక్తి. మరీ ముఖ్యంగా 82 ఏళ్ల వయసున్న వృద్ధురాలు. ఆ వయసులో ఆమె బరువులు ఎత్తడమే విచిత్రం అనుకుంటే ఆ పని ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఉండడం గొప్ప విశేషం. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పరిధిలో ఉన్న పొల్లాచ్చి అనే చిన్న పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు ఆనంద్ మహీంద్రాకు ప్రేరణగా నిలిచింది. శారీరక సామర్ధ్యానికి వయస్సు అడ్డంకి కాదని ప్రపంచానికి నిరూపించడమే ఆ ప్రేరణకు కారణం. ఇటీవల పవర్ లిఫ్టింగ్ ఛాంపియషిప్లలో పోటీ పడి అందరినీ ఆశ్చర్యపరిచిన కిట్టమ్మాళ్ ధైర్యసాహసాలు శక్తి సామర్ధ్యాల కథ దానికి ఆనంద్ మహీంద్ర ప్రశంసలు ఇవన్నీ వైరల్గా మారాయి.80 వర్సెస్ 30...ఇటీవల కునియాముత్తూరులో జరిగిన ’స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో కిట్టమ్మాళ్ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది, అక్కడ ఆమె పోటీ పడింది తన వయసుకు కాస్త అటూ ఇటూగా ఉన్నవారితో కూడా కాదు ఏకంగా 30 ఏళ్లలోపు ఉన్న మహిళలతో పోటీపడింది. పోటీలో పాల్గొన్న మొత్తం 17 మంది ఇతర మహిళలతో పోటీ పడి ఆమె ఐదవ స్థానాన్ని దక్కించుకుంది, ఓపెన్ ఉమెన్స్ విభాగంలో 50 కిలోల బరువును డెడ్లిఫ్టింగ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.ఇంటి పనులే రాటు దేల్చాయి..తను ఇంటి రోజువారీ అవసరాల్లో భాగంగా చేసిన పనులే తనను వెయిట్ లిఫ్టర్గా మార్చాయి అంటున్నారు కిట్టమ్మాళ్. ప్రతిరోజూ 25 కిలోల బియ్యం సంచులను మోయడం డజన్ల కొద్దీ కుండల నీరు మోస్తూ తీసుకురావడం అలవాటు అయిందని అదే తనను రాటు దేల్చిందని వివరించారు. తద్వారా బలశిక్షణ తనకు సహజంగానే సాధ్యమైందని చెప్పారు. తన శక్తిని గుర్తించిన తన మనవళ్లు రోహిత్, రితిక్లచే మార్గదర్శకత్వంతో తాను ఇంటి బరువుల నుంచి జిమ్ శిక్షణకు మారానని తెలిపారు. గత నెల రోజులుగా డెడ్లిఫ్టింగ్ పద్ధతులను నేర్చుకుంంటూ వచ్చానన్నారు. దీనితో పాటే తన స్టామినాకు తన జీవితకాలపు ఆహారపు అలవాట్లు కూడా కారణమయ్యేయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యార్ధులైన ఆధునికులు అందరూ జపిస్తున్న మిల్లెట్ మంత్రాన్ని ఆమె ఎప్పటి నుంచో ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆమె (రాగులతో చేసిన జావ సజ్జలతో గంజి... గుడ్లు, మునక్కాయ సూప్, వంటివి తీసుకుంటూ అపరిమిత శక్తి సామర్ధ్యాలను స్వంతం చేసుకున్నారు.ఆమె గురించి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే...82ఏళ్ల వయసులో ఒక మహిళ బరువులు లిఫ్ట్ చేయడం మాత్రమే కాదు మనలోని స్పిరిట్ని లిఫ్ట్ చేస్తోంది. ఉత్సాహంగా జీవించడానికి, ధైర్యంగా కలలు కనడానికి మీ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ ఆలస్యం అనేది లేనే లేదని గుర్తు చేస్తుంది. వయస్సు లేదా సాంప్రదాయ జ్ఞానం పరిమితులను నిర్ణయించదు. మీ సంకల్ప శక్తి మాత్రమే నిర్ణయిస్తుంది.At 82, a woman is lifting not just weights but our spirits., winning powerlifting championships and defying every cliché about age.She’s a reminder that it’s never too late (or too early) to live with vigour, to dream boldly, and to pursue your goals.Age or conventional… pic.twitter.com/fCLQO1PoDJ— anand mahindra (@anandmahindra) September 1, 2025(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
ఆ డాక్యుమెంట్ డ్రామ చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగవు..!
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న భీకర దాడులు (Israel Hamas Conflict) చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. నిలువెల్లా గాయాలను మిగుల్చుతున్నాయి. 2023 అక్టోబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 21 వేలమంది గాజా చిన్నారులు దివ్యాంగులుగా మారినట్లు ‘దివ్యాంగుల హక్కులపై ఐరాస కమిటీ (CRPD)’ వెల్లడించింది. సరిగ్గా ఈ దాడుల్లో జనవరి 29, 2024న యువ రజబ్ అనే ఆరేళ్ల బాలిక కూడా బలైన దృశ్యం అందరిని శోకసంద్రంలోకి నెట్టింది. ఎందుకంటే ఆమె దాడుల్లో చిక్కుకున్న క్షణంలో రికార్డు అయిన ఆ స్వరం అందరి హృదయాలను కదలించి ఆ దాడిపై క్షణ్ణంగా దర్యాప్తు చేసేలా ప్రేరేపించింది. ఆ ఉదంతంపై తీసిన నాటకం..మరింతమందికి చేరువై ఇజ్రాయెల్ సైన్యానికి నోట మాట రాకుండా చేసింది. అంతేగాదు ఆర్ట్తో అలాంటి హృదయవిదారక ఘటనకు మరింతగా ప్రాణం పోసి మానవత్వానికి ఊపిరిపోయడమే కాదు కళ గొప్పదనాన్ని హైలెట్ చేసింది.ఆ నాటకమే గాజా అమ్మాయిపై తీసిన 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' అనే చిన్న డ్రామా. 29 నిమిషాల నిడివితో కూడిన డాక్యుమెంట్ డ్రామను వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ నాటకం ఇజ్రాయెల్ సైనిక కాల్పుల మధ్య ఆరేళ్ల గాజా బాలిక విషాద మరణంపై న్యాయం తోపాటు యుద్ద రక్కసి కోరల్లో పసి ప్రాణాలు ఎలా చిక్కుకుని అల్లాడుతున్నాయో అనే విషయాన్ని హైలెట్ చేసింది. అంతేగాదు ఈ 23 నిమిషా నిడివి గల నాటం స్టాండింగ్ ఒవేషన్ను అందుకుంది. ఫ్రాంకో-ట్యునీషియన్ కౌథర్ బెన్ హనియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇజ్రాయెల్ దళాల చేతిలో హత్యకు గురైన గాజాకు చెందిన ఆరేళ్ల బాలిక హింద్ రజబ్ హృదయ విదారకమైన చివరి క్షణాలు వివరిస్తుంది. ఈ నాటకం చూస్తున్న వాళ్లంతా "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అని నినాదాలు చేస్తూ, పాలస్తీనా జెండాలను ఊపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో ఈ చిత్రంలో పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ నుంచి వచ్చిన నిజమైన ఆడియో ఉంది. ఆ వీడియోలో ఆ చిన్నారి కారులో మంటల్లో చిక్కుకున్నప్పుడూ.. దయచేసి నా దగ్గరకు రండి, దయచేసి రండి. నాకు భయంగా ఉంది" అని తన చివరి క్షణాల్లో అభ్యర్థిస్తున్న స్వరం స్ఫష్టంగా వినిపిస్తోంది. రక్షణ కోసం ఆ చిన్నారి వేడుకున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదలించింది. కానీ రక్షణ చర్యలు ఆలస్యం కావడంతో తన కుటుంబసభ్యులతో కలిసి విగతజీవిగా కనిపించిందా చిన్నారి. అంతేగాదు దర్యాప్తులో ఇజ్రాయెల్ సైన్యం మొదట్లో సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోనివ్వకుండా దాదాపు మూడుగంటల పాటు నిరాకరించిందని తేలింది. అంతేగాదు ఆమెను రక్షించే ప్రయత్నంలో మరణించిన ఇద్దరు అంబెలెన్స్ కార్మికులు మృతదేహాలు కూడా ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించాయి కూడా. దాంతో మరింతగా దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అల్ జజీరాతో కలిసి ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్, ఇయర్షాట్ చేసిన దర్యాప్తులో..ఆ ఘటన జరిగినప్పుడూ రజబ్ కారు నుంచి దాదాపు 13 నుంచి 23 మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ ట్యాంకు ఉందని వెల్లడైంది. అలాగే జూలై 2024లో ఐక్యరాజ్యసమితి నివేదిక సైతం దీనిని ధృవీకరించింది. పైగా ఇజ్రాయెల్ దళాలు చాలా సమీపంలో కాల్పులు జరిగినట్లు నిర్థారించింది కూడా. దాంతో సంఘటన సమయంలో తమ దళాలు కాల్పుల పరిధిలో లేవంటూ అంతవరకు వాదించిన ఇజ్రాయెల్ సైన్యం సైతం మారుమాట్లాడకుండా సైలెంట్ అయ్యింది. సదరు బాలిక తల్లి విస్మామ్ హమదా కనీసం ఈ చిత్రం ద్వారా అయినా ఈ సంఘర్షణకు ముగింపు ఉంటుందేమోనని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మేము చనిపోయేలా, ఆకలితో ఉండేలా, భయంతో జీవించేలా ఫోర్స్ చేసిందంటూ కన్నీటి పర్యంతమైందామె. కాగా, దర్శకురాలు బెన్ హనియా మాట్లాడుతూ.. "ఇలాంటి యుద్ధ విదారకర సంఘటనలను ఇలా నాటకం రూపంలో చిత్రంచడం వల్ల..దాని వెనుకున్న బాధకరమైన లోతులు ప్రజలకు చేరువవ్వడమే గాక, మానవత్వపు విలువలను గురించి నొక్కి చెబుతుంది. అదే సమయంలో సినిమా ప్రాముఖ్యత ఏంటో తేటతెల్లమవుతుందని చెబుతోంది". దర్శకురాలు బెన్ హనియా. “#TheVoiceOfHindRajab cast hold up a picture of Hind Rajab during their record-breaking 23-minute-plus ovation this evening at the #VeniceFilmFestival.Rajab was killed by Israeli forces in Gaza last year. The film chronicles the 6-year-old's final hours.”via deadline pic.twitter.com/CkbumvkCn7— May ❤️🔥💊🪞 (@mayswiftiee) September 3, 2025 (చదవండి: అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!) -
తీవ్ర మనోవ్యాధికి సంజీవని!
మేము కోయంబత్తూరులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళము. మా అబ్బాయి బీటెక్ తర్వాత ఎం. ఎస్. కోసం సంవత్సరం క్రితం అమెరికాకు వెళ్ళాడు. మొదట 6 నెలలు బాగానే ఉన్నాడు. తర్వాత అతని ఆలోచనలు, ప్రవర్తనలు మారాయి. అమెరికాలో ఉన్న పోలీసులు, గూఢాచారులు తనని వెంబడిస్తున్నారని తన మెదడు మీద, ఎలాన్ మస్క్, ట్రంప్ ప్రయోగాలు చేస్తున్నారని అనుమానంతో భయపడుతూ– ఉండేవాడు. ఆ ప్రవర్తన ఎక్కువై బాగా చికాకు చేస్తే అక్కడే ఉండే మా చుట్టాలు 6 నెలల క్రింద ఇండియాకు పంపించారు. ఎయిర్పోర్టులో దిగాక నేరుగా చెన్నైలో ఒక ఆస్పత్రిలో అడ్మిట్ చేశాము. ’స్కిజోఫ్రినియా’ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బాగా అగ్రెసివ్గా, సూసైడల్ ఆలోచనలతో ఉన్నాడని అక్కడి డాక్టర్లు ఇ.సి.టి. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే ఆయన ఇ.సి.టి. వల్ల మెదడు దెబ్బతింటుంది, భవిషత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారని, మేము ఆ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లాము. పెద్దగా ఫలితం కనిపించకపోయేసరికి ఇంగ్లీష్ వైద్యం కాకుండా వేరేవైద్యానికి వెళ్ళాము. చాలా రోజులు ఆ మందులు వాడినా ఎలాంటి మార్పూ లేదు. దయచేసి మాకు ఏదైనా మంచి దారి చూపగలరు.– సోమలింగేశ్వరరావు, కోయంబత్తూరుచాలామందిలో అంతర్గతంగా ఉండే ఇలాంటి సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు మీకు నా అభినందనలు. మీ అబ్బాయికి వచ్చిన స్కిజోఫ్రీనియా వ్యాధి వలన ఎంతగా సంఘర్షణకి గురయ్యారో అర్థం అవుతోంది. ముందుగా మీరు అర్థం చేస్కోవాల్సింది, మెదడులో వచ్చే కొన్ని రసాయనిక మార్పుల వల్లనే ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయని, అవి తగ్గాలంటే ఆ రసాయనాలని సాధారణ స్థితికి తీసుకురావాలనీ మానసిక వైద్యులు మొదటిగా మందులు, కౌన్సెలింగ్ ద్వారా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు ఆ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు లేదా పేషెంటుకి ఆత్మహత్య ఆలోచనలు, జబ్బువల్ల ఇతరులకు హాని చేసేంత ఆవేశం, కోపం, ఉన్నప్పుడు, మందులు పని చేయడానికి చాలా సమయం పట్టొచ్చు: అలాంటప్పుడు పేషెంటుకి కుటుంబ సభ్యులకి జరిగే నష్టం ఎక్కువ. దీన్ని నివారించడం కోసం అత్యంత వేగంగా. ప్రభావ వంతంగా పనిచేసే ఒక సంజీవని లాంటి వైద్య విధానమే’ ఇ.సి.టి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. అంతమంచి చికిత్స విధానాన్ని వాడుక భాషలో ‘షాక్ ట్రీట్మెంట్‘ అంటారు. అదే అన్ని సమస్యలకి, అపోహలకి కారణం అయింది. దీనివల్ల మనిషికి ప్రాణహాని అని లేదా నరాలు చచ్చుబడి, సంసారానికి పనికి రారు అని అనేక అపోహలు, సాధారణ ప్రజలతోటు, కొంత మంది వైద్యుల్లో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఇతర జ్ఞానేంద్రియాలు, కండరాలు ఇతర వ్యవస్థలన్ని పనిచేయడానికి మెదడులో ఉత్పత్తి అయ్యే కరెంట్ చాలా ముఖ్యం. దాన్ని మార్చడం ద్వారా మొదడులోని రసాయనాల అసమతుల్యను కూడా సరి చేయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ లేదా కంప్యూటర్ కి వైరస్ వచ్చి పని చేయకపోతే రీసెట్ ‘ బటన్ నొక్కి దాన్ని పనిచేసే కండిషన్కి ఎలా తీసుకు వస్తామో ఇ.సి.టి. కూడా మెదడుని అలాగే రీసెట్ చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు వస్తాయని ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ పరిశోధనా తేల్చలేదు. ఒక పేషెంట్ అన్ని రకాలుగా శారీరకంగా ఫిట్గా ఉంటేనే ఇ.సి.టి. చికిత్స చేస్తారు. మీ అబ్బాయిని పరీక్షంచిన డాక్టరు అన్ని పరీక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే ఇ.సి.టి. ట్రీట్మెంట్ గురించి చెప్పి ఉంటారు. కాబట్టి ఎలాంటి అపోహలు, భయాలు లేకుండా చికిత్స ఇప్పించి, మీ వాడి జబ్బు లక్షణాలను తొందరగా తగ్గించుకోండి. మీ అలాగే వాళ్ళు చెప్పినన్ని రోజులు మందులు వాడితే జబ్బు మళ్ళి తిరిగబెట్ట కుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: -
ఫుడ్ ఫర్ టీన్స్
పిల్లల విషయంలో పెద్దవారికి ఒక రకమైన ఆందోళన ఉంటే... కాస్త పెద్ద పిల్లల విషయంలో ఇంకో రకమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే పదేళ్లు దాటి టీనేజ్లో ఉండే పిల్లల్లో మరికొన్ని సమస్యలు చూస్తుంటాం. ఈ రోజుల్లో అయితే టీనేజ్ పిల్లల్లో ఆందోళన, మానసిక ఒత్తిడి, అధికంగా కోపం, డిప్రెషన్ వంటివి తరచూ వింటున్నాం. వారు తినే ఆహారపు ప్రభావం మానసిక, శారీరక స్థితిపైన చూపుతుంది. అందుకని, టీనేజ్ పిల్లలున్న ఇంట్లో పోషకాహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 13–19 ఏళ్ల మధ్య ఫిజికల్, మెంటల్ గ్రోత్ వేగంగా మార్పు చెందుతుంటుంది. ఇలాంటప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎమ్ఆర్) కొన్ని సాధారణ సూచనలు చేసింది. వాటి ఆధారంగా పోషకాహారాన్ని ఈ వయసు పిల్లలకు సరైన మొత్తంలో ఇవ్వాలి. అలాగే, ఆ ఆహారం మనసుకు సంతృపినిచ్చేలా ఉండాలి.టీనేజ్ పిల్లల బరువు, ఎత్తు, చేసే పనులు.. ఇవన్నీ దృష్టిలో నిపుణుల సలహాతో సమతుల ఆహారాన్ని ΄్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కాకుండా రోజులో 5–6 సార్లు సమయాన్ని బట్టి పైన టేబుల్లో ఇచ్చిన హెల్తీ ప్లేట్ను తయారుచేసుకోవచ్చు.బ్రేక్ఫాస్ట్కప్పు గోధుమ ఉ΄్మా /దోసె – 2 / కిచిడీ – కప్పు / రాగి రొట్టె – 2 –3 / ఇడ్లీ – 2–3 + కప్పు సాంబార్ + ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లేట్ + కొద్దిపాటి గింజలు.ఉదయం స్నాక్స్పండు (ఆపిల్ లేదా అరటి లేదా నారింజ) + కొద్దిగా డ్రైఫ్రూట్స్ / పల్లీ చిక్కీ / వేపిన శనగలు / వేయించిన అవిసెగింజలు / డ్రై ఫ్రూట్ బార్ / ఉడికించిన వేరుశెనగమధ్యాహ్న భోజనం అన్నం – 1 కప్పు లేదా గోధుమ రొట్టె – 2–3 / తృణ ధాన్యాలు – 1 కప్పు + ఆకుకూరలు – 1 కప్పు + మిక్స్డ్ వెజిటబుల్స్ – 1 కప్పు + చికెన్ బ్రెస్ట్ – 100 గ్రా / గుడ్డు – 1 / పనీర్ – 100 గ్రా / చేప – 100–120 గ్రా. + పెరుగు – 1 కప్పురాత్రి భోజనం మధ్యాహ్న భోజనం మాదిరిగానే + గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ అన్నంతో లేదా రొట్టెతో + కూరగాయలు + ఉడికించిన బ్రొకోలీసాయంత్రం స్నాక్స్మొలకెత్తిన గింజలు, విత్తనాలు – 30 గ్రా + చియా సీడ్స్ + నిమ్మరసం/ పాలు/ పండు జ్యూస్ లేదా సూప్.ఫుడ్ గ్రూప్స్, పరిమాణంఏదైనా పండు – 1 రోజుకు 2–3 సర్వింగ్స్కూరగాయలు – రోజుకు 3–5 సర్వింగ్స్ (ఉడికించినవి లేదా వండినవి)ధాన్యంతో వండినవి – రోజుకు 6 – 8 సర్వింగ్స్ (1 సర్వింగ్ బీ కప్పు ఉడికిన అన్నం/సిరిధాన్యం/గోధుమ)డెయిరీ ఉత్పత్తులు – రోజుకు 2 – 3 కప్పులు (పాలు, పెరుగు, చీజ్ రూపంలో)ఆరోగ్యకరమైన కొవ్వులు – రోజుకు 1 టేబుల్ స్పూన్ (నూనె, గింజలు, విత్తనాలు మొదలైనవి)ప్రోటీన్ ఆహారం – మాంసం, గుడ్డు మొదలైనవి (1 సర్వింగ్) కిలో కేలరీలు : అబ్బాయిలకు 2200–3200 ; అమ్మాయిలకు 1800 – 2500ప్రోటీన్లు : అబ్బాయిలకు – 52 గ్రా. ; అమ్మాయిలకు – 46 గ్రా.కొవ్వులు (ఊ్చ్ట) : 25–35% కార్బోహైడ్రేట్స్ : 45–65%విటమిన్–ఎ : 600–900 మైక్రోగ్రాములువిటమిన్ – సి : 45–75 మి.గ్రాకాల్షియం : 1300 మి.గ్రా నీళ్లు – 8 నుంచి 12 గ్లాసులు -
అందమైన పెదవుల కోసం...
గులాబీ రేకుల్లాంటి సుకుమారమైన పెదాలంటే మగువలకు మహా ఇష్టం. అందుకోసం ఎన్నో రకాల లిప్బామ్లని, లోషన్లని రాస్తుంటారు. వాటన్నింటి కంటే వంటిల్లోనే దొరికే వాటితో సహసిద్ధమైన పండెరుపు పెదాలను సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో చూద్దామా..!.ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు బీట్రూట్ జ్యూస్ని అప్లై చేసి పడుకుంటే పెదవులు పగడాల్లా కాంతులీనుతాయి. పడుకునే గంట ముందు కొబ్బరి నూనెతో పెదవులను మసాజ్ చేస్తే మరింత నునుపుతేలతాయి.వెన్నతో పెదవులను సుతిమెత్తగా మసాజ్ చేస్తే అవి గులాబి రంగులోకి మారడమే కాకుండా మృదువుగా మారుతాయి.ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ నిమ్మరసం, కొన్ని చుక్కల గ్లిజరిన్ని కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే పెదవులు నునుపు తేలడమే కాకుండా వాటిపై సన్నని గీతలు మటుమాయమవుతాయి.కొత్తిమీర జ్యూస్తో పెదవులని నాజూగ్గా మసాజ్ చేస్తే గులాబీ పెదవులు మీ సొంతమవుతాయి.నేతిలో గులాబీ రేకులను మెదిపిన మిశ్రమంతో మసాజ్ చేస్తే పెదవులపై ఉండే గరుకుదనాన్ని తొలగించవచ్చు.నిమ్మ చెక్కలతో పెదవులపై మసాజ్ చేస్తే వాటిపై ఉండే నలుపు క్రమంగా మటుమాయమవుతుంది.డ్రైగా ఉన్న పెదవులపై, ల మీగడలో గులాబి రేకులను రంగరించి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.(చదవండి: అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?) -
పిల్లలకు జ్వరం రాగనే పారాసెటమాల్ ఇచ్చేస్తున్నారా..?
ఈ వర్షాకాలం అనంగానే వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులకు జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు తక్షణమే అటాక్ అవుతాయి. ఓ పట్టాన తగ్గవు. దాంతో సాధారణంగా తల్లిదండ్రులు సమీపంలో ఉన్న మెడికల్ షాఫుకో లేక ఇంట్లోనే ఎప్పటిదో పారాసెటమాల్ సిరప్ ఉంటే వెంటనే వేసేస్తాం. తగ్గిపోతే సరే లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. చాలామటుకు తల్లిదండ్రులు ఇలానే చేస్తారు. కానీ ఇలా పారాసెటమాల్ ఉపయోగించేటప్పుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.ప్రీడియాట్రిక్ నిపుణులు పిలల్లకు జ్వరం రాగానే పారాసెటమాల్ వేయడం వరకు కరెక్టే అయినా..అది వైద్యుల సిఫార్సు మేరకు వేయడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే..డాక్టర్లు కూడా పారాసెటమాలే సూచిస్తారు. కానీ ఎంత మోతాదు ఉపయోగించాలనేది బాటిల్పై ఉండే ఇన్ఫర్మేషన్ని అనుసరించి ఉంటుందని నొక్కి చెబుతున్నారు. నెలల పిల్లలకు సాధారణంగా చుక్కల మోతాదుని సూచించడం జరుగుతుంది. దాన్ని ఒక నిడిల్ సాయంతో డ్రాప్స్ మాదిరిగా ఇస్తాం అందులో గాఢత పరిమాణం ఎక్కువ. అలా కాకుండా 2 నుంచి 5 ఎంఎల్ మాదిరిగా అయితే మాత్రం కాస్త గాఢత తక్కువ ఉంటుంది. అది గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసుల వారిగా చిన్నారులకు ఇవ్వాల్సిన మోతాదులో వ్యత్సాసం కూడా చాలా వేరుగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఇంట్లో ఒకసారి సీల్ తీసిన పారాసెటమాల్ సీసాలను మరొసారి వినియోగించేటప్పుడూ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే..పారాసెటమాల్ని ఒక్కసారి వినియోగించిన బాటిల్ని మహా అయితే ఆ తర్వాత నెల వరకు వినియోగించ్చొచ్చట. అదే నెలల తరబడి వాడితే ఆ మందులోని గాఢత తగ్గిపోతుందట. అదీ సరిగా పనిచేయకపోవచ్చు లేదా ఒక్కోసారి దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తల్లిందండ్రులు పిల్లలకు జ్వరం అనంగానే పారాసెటమాల్ ఇవ్వొద్దనే అంటున్నారు. చిన్నారి పరిస్థితి అనుసరించి ముందుగా వైద్యులను సంప్రదించి, వాళ్ల సూచనల మేరకు వాడితేనే శ్రేయస్కరమని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రలూ..జ్వరం అనగానే పారాసెటమాల్ కాదు..ఎంత వరకు ఉపయోగించాలి, అవసరమా కాదా అన్నది బేరీజు వేసుకుని ఉపయోగించండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందువల్లే భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు శాలరీ చాలా..) -
నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..
‘మనలో చాలా మంది చిన్నప్పుడు కథలు వినడంలో అనుభవం పొంది ఉండము.. రాజులు, రాణులు, చెవులు రిక్కింపజేసే యుద్ధాలు, మంత్రముగ్ధులను చేసే మాయా ద్వీపాలు ఇవన్నీ కళ్లకు కట్టేలా విని ఉండము.. వింటూ వింటూనే మనం నిద్రలోకి జారుకున్న ఆనవాళ్లూ లేకపోవచ్చు.. ఒక రకంగా అంతకు ముందు తరం అనుభవించిన ఆనందాన్ని బాల్యంలో అనుభవించలేదేమో.. ఆ కథలు జోలపాట పాడుతూనే.. భవిష్యత్తు పాఠాలను కూడా నేర్వలేదు.. అందుకే ఆ కథలు ఇప్పుడు వినాల్సిందే. ఊ కొట్టాల్సిందే అంటున్నారు లక్ష్ మహేశ్వరి. కథల్లోకి అడుగు.. అయితే నచ్చే మార్గాన్ని కనుగొనడానికి నాకు మరో ఎనిమిది సంవత్సరాలు పట్టింది. నేను 2023లో కథ చెప్పడం అనే మార్గంలోకి అడుగుపెట్టాను. కథ చెప్పడం అంత తేలికైన కళ కాదు. దీనికి క్రమశిక్షణ, అభిరుచి, అంతర్ దృష్టి అవసరం. ‘కొన్ని కథల్లో నేను లోతుగా లీనమైపోతా. నాకు అది పూర్తిగా అర్థమయ్యేవరకూ పరిశోధన చేస్తా, మరిన్ని పుస్తకాలు చదువుతా, డాక్యుమెంటరీలు చూస్తా, నిపుణులతో మాట్లాడతా. కథ చెప్పడం అనేది ఇప్పటికీ కొనసాగుతున్న ప్రపంచంలోని పురాతన వృత్తి. సరిగా గమనిస్తే.. నేడు వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్మడం లేదు. కథలనే అమ్ముతున్నారని అర్థం అవుతుంది.ఆ హైదరాబాదీ.. ఓ గొప్ప జ్ఞాపకం.. నా అత్యంత మరపురాని జ్ఞాపకాలలో ఒకటి హైదరాబాద్లో నేను ఇష్క్ సుఫియానాను ప్రదర్శించిన తర్వాత ఒక యువతి నా దగ్గరకు వచ్చి, నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుంది. ‘నేను ఆత్మహత్యకు ప్రయత్నించాలనుకున్నా.. ప్రదర్శనకు వచ్చి చూశాక.. ఇప్పుడు ఆ ఆలోచన మారిపోయింది’ అని చెప్పారు. ‘ఒక కథకుడిగా నాకింకేం కావాలి? కొంతమంది అడుగుతుంటారు.. మంచి ఆదాయం ఇచ్చే మార్గం వదిలేశారు. ఏం సాధించారు? అని.. ‘నేను ఇప్పుడు మనశ్శాంతిగా.. ప్రతి రాత్రీ బాగా నిద్రపోతాను. నేటి బిజీ ప్రపంచంలో, అంతర్గత శాంతిని మించినలగ్జరీ ఏముంది?’ అనేదే నా సమాధానం. ‘ప్రతి ఒక్కరూ కథలు వినాలి.. ఎందుకంటే అవి మనల్ని మనలా తయారు చేస్తాయి’ అంటారు ల„Š మహేశ్వరి. మధ్యప్రదేశ్కు చెందిన ఈయన పాడ్కాస్టర్, రచయిత, పాపులర్ స్టోరీ టెల్లర్ కూడా. నగరానికి గత కొంత కాలంగా కథలను మోసుకొచ్చే నిత్య అతిథిగా మారారు. తన కథలు, కవితల ద్వారా నగరవాసులను రంజింప చేస్తూ సిటీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గత మే 24న భాస్కర ఆడిటోరియంలో సుఫియానా సమర్పించిన ల„Š మరోసారి గత ఆదివారం కొండాపూర్లోని హార్ట్ కప్ కాఫీలో ‘మై తేను ఫిర్ మిలేంగీ’ పేరిట మరో ప్రత్యేక స్టోరీ టెల్లింగ్ సెషన్ సమర్పించారు. ఈ సందర్భంగా పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. నాన్న చెప్పిన కథలే.. ఎడమ చేయి లేకుండా జని్మంచడంతో నా బాల్యం అంతా జీవన పోరాటాలతోనే సాగింది. సమాజపు హేళనలు, ఏదీ సాధించలేననే విమర్శలు, బెదిరింపులు ఇలా ఎన్నో ఎదుర్కొన్నా. కానీ తల్లిదండ్రులు నా పక్కన గట్టిగా నిలబడ్డారు. ‘నాన్న మా కుటుంబానికి కథకుడు. మా కోసం ఎప్పుడూ కథలు షేర్–ఏ–షాయరీలను చెప్పేవాడు. చదువు పూర్తయ్యాక గుర్గావ్లో పెట్టుబడి బ్యాంకర్గా ఐదేళ్లకు పైగా పనిచేశాను. ఆదాయం బాగుంది, కానీ నేను కోరుకునే మనశ్శాంతి, సంతృప్తి దొరకలేదు. అదే సమయంలో ‘తమాషా’ సినిమా చూశాను. అది నాకు ఏమి చేయాలో చెప్పకపోయినా, యే తో నహి కర్ణ (ఇది చేయకూడదు) అని మాత్రం గ్రహించాను. 200కి పైగా ప్రదర్శనలు.. మీ కథలతో జనాన్ని ఎలా ఆకట్టుకోగలుగుతున్నారు? అని కొందరు అడుగుతుంటారు.. నిజాయితీగా చెప్పాలంటే, అది ఒక ట్రాన్స్ లాగా ఉంటుంది. నాకు వేదికపైకి వెళ్లి దిగడం మాత్రమే గుర్తుంటుంది. నేను 200కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. కానీ వాటిలో చాలా వాటిలో ఏం జరిగిందో నాకు గుర్తులేదు. తెలిసినదల్లా వారం పాటు ప్రదర్శన ఇవ్వకపోతే, నాకు అశాంతిగా అనిపిస్తుంది. (చదవండి: ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?) -
ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?
మా మామగారు నామీద ఒక చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకుముందు నా భార్య నా మీద గృహ హింస కింద కూడా అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కౌన్సెలింగ్ పేరుతో చాలాసార్లు పిలిచి పోలీసు వారు వేధించారు. ఆఖరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్త చీటింగ్ కేసు నెపంతో తరచుగా పోలీస్ స్టేషన్కు పిలిచి సెటిల్మెంట్ చేయవలసిందిగా ఒత్తిడి చేస్తూ నా ఆస్తి ఒకటి రాసిమ్మని అలాగే నా వద్దనే ఉన్న నా కొడుకుని కూడా ఇచ్చేయాలి అంటూ బలవంతం చేస్తున్నారు. గంటలకొద్దీ కూర్చోబెడుతున్నారు. మా మామగారికి పోలీసులలో చాలామంది పరిచయస్తులు ఉన్నారు. వారి సహాయంతో ఇదంతా చేస్తున్నారు అని, నేను ఏమీ చేయలేను అని అందరికీ చెప్తున్నారు. ఇటీవలే స్త్రీ – శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా బాబు కస్టడీ ఇవ్వాలి అంటూ ఒక నోటీసు అందింది. ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?– గణేష్, మేడ్చల్ఫ్యామిలీ కేసు, సివిల్ కేసు అనే తారతమ్యం కూడా లేకుండా పోలీసు వారు నిందితులను తరచుగా పోలీస్ స్టేషన్కు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టడం, సెటిల్మెంట్ చేసుకోవాలి అని ఒత్తిడి చేయడం సరైనది కాదు – అది అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది అంటూ పలు హైకోర్టులు చాలాసార్లు వివిధ పోలీసు అధికారులను మందలించాయి. ఒకవేళ మీ కేసులో కూడా ఇలాంటి ఒత్తిళ్లకు గురి చేస్తుంటే మీరు ముందుగా పై అధికారులకు ఫిర్యాదు చేయండి. అప్పటికీ కూడా మీకు పరిష్కారం లభించకపోతే పోలీసువారి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ, మిమ్మల్ని వేధించడానికి వీలు లేదు అని, నోటీసులు లేకుండా పోలీస్స్టేషన్కు పిలిచి గంటలు తరబడి కూర్చోబెట్టడం అన్యాయం అని డిక్లేర్ చేయమని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయండి. హైకోర్టు మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది. మీ కొడుకు మీ వద్దనే ఉన్నారు అని చెప్తున్నారు కానీ అతని వయసు చెప్పలేదు. మీకు స్త్రీ – శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చిన నోటీసు కూడా బహుశా సరైనది కాకపోవచ్చు. చిన్న పిల్లల పోషణకు, శ్రేయస్సుకు – రక్షణకు భంగం కలుగుతుంది అని కచ్చితమైన సమాచారం ఉంటే తప్ప, పిల్లల కస్టడీ విషయాలలో కేవలం ఫ్యామిలీ కోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఏది ఏమైనా మీరు హైకోర్టులో ఆ నోటీసును కూడా ప్రత్యేకంగా రిట్ పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేయండి. సరైన పరిష్కారం దొరుకుతుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)(చదవండి: రచయితలుగా పోలీసు అధికారులు..!) -
పోలీసు రైటర్స్..!
ప్రతి పోలీసుస్టేషన్లోనూ ఓ రైటర్ ఉంటారు. ఆయన ఆ ఠాణాతోపాటు కేసులకు సంబంధించిన రికార్డుల్ని నిర్వహిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే కొందరు పోలీసుల్లోనూ రైటర్ ఉంటున్నాడు. ఇలా రచయితలుగా మారిన అధికారులు ఎందరో ఉండగా... అతి తక్కువ మంది మాత్రమే తమ వృత్తికి భిన్నమైన అంశాలను ఎంచుకున్నారు... కుంటున్నారు. పోలీసు విభాగంలో తమకు ఎదురైన అనుభవాలు, పోలీసింగ్లో ఉన్న లోపాలు, చట్టాలు తదితరాలపై పోలీసులు, మాజీ పోలీసులు పుస్తకాలు రాయడం కామనే. అయితే దీనికి భిన్నంగా భాష, సాహిత్యాలపై రాస్తున్న వాళ్లు అరుదు. అలాంటి వారి జాబితాలో దివంగత బయ్యారపు ప్రసాదరావు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ ఉదాహరణలు మాత్రమే.స్వగతం సహా ‘ఎ’న్నో కథలుఆంగ్లంలో లిటరేచర్తో పాటు లా కూడా పూర్తి చేసిన చిలుకూరి రామ ఉమా మహేశ్వర శర్మ ఎస్పీ హోదాలో పదవీ విరమణ చేసిన తర్వాత తెలుగు రచయితగా మారారు. అప్పట్లో ఖమ్మం, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సత్యనారాయణపురానికి చెందిన శర్మ 1985లో ఎస్సైగా ΄ోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. 2019 లో ఉద్యోగ విమరణ చేసిన ఆయన తన తొలి పుస్తకం ‘నేను శాంత కూడా – ఓ జీవన కథ’ను 2021లో విడుదల చేశారు. ఇందులో కేవలం తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అంశాలు, ఆద్యంతం తన భార్య శాంత ఇచ్చిన సహకారం తదితరాలను ప్రస్తావించారు. ఈ ఏడాది ఏప్రిల్లో శర్మ రెండోపుస్తకం ‘ఎ’ ఆవిష్కృతమైంది. ఇందులో సమకాలీన అంశాలను స్ఫృశించిన ఆయన మహిళలు, ట్రాన్స్జెండర్ల జీవితం, స్త్రీ, పురుష సంబంధాలు, సమాజం నిర్మించిన నైతికచట్రపు విలువలు తదితరాలను నిశితంగా ప్రశ్నిస్తూ షార్ట్ స్టోరీలు ఉంటాయి. ఒకే మూసలోకి ఒదగని ఈ కథలు చెప్పేతీరు కూడా కథ, కథకి మారుతూ మనుషుల ప్రవర్తనలను, ఆలోచనలను వాటి వెనక ఉద్దేశాన్ని చూపిస్తుంటుంది. వైవిధ్యత, వాస్తవికత, మానవీయ దృక్పథం, చక్కటి చమత్కారాలతో సాగే కథల్ని రాసిన శర్మ తనలోని మరో కోణాన్ని చూపించారు. ఫిజిక్సే కాదు..ఆంగ్లంలోనూ...విజయవాడలో ఓ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆఖరి డీజీపీగా, రాష్ట్రవిభజన తర్వాత ఏపీకి మొదటి హోమ్ సెక్రటరీగా పని చేసిన డాక్టర్ బయ్యారపు ప్రసాదరావులోనూ ఓ రచయిత ఉన్నారు. తన ఇంట్లోనే ఓ పెద్ద ఫిజిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్న ఆయన ‘థీరీ ఆఫ్ లైట్’లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ‘న్యూ లైట్ ఆన్ లైట్’ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి డాక్టరేట్ పొందారు. 1977లో మద్రాస్ ఐఐటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, 1979లో ఐపీఎస్గా ఎంపికైనా ఆయనకు ఆంగ్లం నేర్చుకోవాలన్న తపన పోలేదు. దీనికోసం అనేక ప్రయత్నాలు చేసిన ఆయన తానే సొంతంగా ఓ విధానం రూపొందించాలని అనుకున్నారు. 1984లో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఉండగా ఓరోజు కాకినాడ నుంచి అమలాపురం ప్రయాణించారు. అప్పుడు ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. ఆంగ్లపదాలను అలాగే చదివితే అవి అంతగా గుర్తుండటం లేదు. ఈ నేపథ్యంలో వీటిని వాక్యాలుగా, వ్యాసాలుగా మార్చాలని భావించారు. ఇలా తన ఇష్టమైన సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్లోని సూత్రాలు, కొన్ని కల్పిత ఉదంతాలతో కథనాలుగా అల్లి ప్రాక్టీసు చేశారు. తొలిసారిగా 20 కొత్త పదాలతో ప్రయత్నించగా... అమలాపురం చేసేసరికి 17 తేలిగ్గా గుర్తుపెట్టుకోవడం సాధ్యమైంది. అలా ఆ మార్గం పట్టిన ప్రసాదరావు దాదాపు పదేళ్లపాటు ప్రాక్టీసు కొనసాగించారు. 11 వేల పదాలు... 500 కథనాలు... అదనపు ఎస్పీ నుంచి ఆయన హోదాలు మారుతున్నప్పటికీ ఆయన ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఇలాంటి అంశాలతో ఆయన రాసిన పుస్తకం ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ 2012 సెప్టెంబర్ 12న నాటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. 2014లో రిటైర్ అయిన ప్రసాదరావు 2021 మేలో అమెరికాలో కన్నుమూశారు.నవరసాలు నిండిన ‘పుంజుతోక’విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ విభాగంలో డైరెక్టర్ జనరల్గా పని చేసి, తాజాగా ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ముక్కుసూటి అధికారిగా పేరున్న శ్రీనివాస్రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట. బషీర్బాగ్లోని ఉస్మానియా యూనివర్శిటీ పీజీ కాలేజీ నుంచి ఎంకాం, ఆపై ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ కోర్స్, హంగేరీలో యాంటీ టెర్రరిజం అసిస్టెన్స్ కోర్స్ చేశారు. 1994లో ఐపీఎస్ అధికారిగా లీసు విభాగంలో అడుగుపెట్టి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. 30 ఏళ్ల తన సర్వీసులో ఎదురైన అనుభవాలన్నింటినీ రంగరిస్తూ ఆయన 120 కవితలుగా అక్షరీకరించారు. మొదట్లో దీనికి ‘కాక్టెయిల్ పద్యాలు’ అంటూ ఇంగ్లీషులో టైటిల్ పెట్టాలని భావించిన ఆయన చివరకు ‘పుంజుతోక’ అంటూ తెలుగీకరించారు. ‘అందరిలా కాదు నేను నాలాగే’ అనే కవితతో సంకలనం ప్రారంభించారు. ‘చాలామందికి కేవలం ఓ ఐపీఎస్ అధికారిగానే సుపరిచితుడిని. పదవీ విరమణ రోజు రచయితగా పరిచయం చేసుకున్నా. ఈ పుస్తకంలో నా ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. ఇన్నేళ్ల నాజీవితంలో నాకు ఎదురైన అనుభవాలకు నిజాయితీతో కూడిన అక్షర రూపమే ఈ కవితా సంపుటి. సామాజిక స్పృహ, సంఘ సంక్షేమం, ప్రకృతిపై ఉన్న ప్రేమ ప్రధానాంశాలుగా ఉంటాయి. సామాజిక, మానవతా విలువలు అంతఃసూత్రంగా సాగే కవితలివి. ఈ ‘పుంజుతోక’ పాఠకులకు నచ్చుతుందని నా విశ్వాసం’ అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: దేశంలోనే తొలి మహిళా మావటి..!) -
బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. తెలిస్తే అసలు వదిలిపెట్టలేరు..
మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం.ఈ సంవత్సరం పోషకాహార మాసం యొక్క ఇతివృత్తం, “ఆహారం మనల్ని కలుపుతుంది,” బంధాలను నిర్మించడంలో ఆహారం యొక్క పాత్రను నొక్కి చెబుతుంది. బాదం, పండ్లు, తృణధాన్యాలు వంటి పోషకాలు-నిండిన ఆహారాలతో రోజును ప్రారంభించడం శక్తి శ్రేయస్సు రెండింటినీ పెంపొందిస్తుంది. జింక్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఇతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో సుసంపన్నమైన కాలిఫోర్నియా బాదం, ఉదయం వేళ శక్తిని నింపడానికి మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఒక సులభమైన మార్గం.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN) కూడా భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇది మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినవలసిన నట్స్లో బాదంను ఒకటిగా గుర్తించింది. ప్రతిరోజూ బాదం తినడం బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు.ఫిట్నెస్ పట్ల తన అంకితభావానికి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, ఇలా అన్నారు, “నేను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడానికి ప్రాధాన్యత ఇస్తాను నా కుటుంబంలో కూడా దానిని ప్రోత్సహిస్తాను. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన రోజువారీ పోషణ పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం, కాబట్టి మేము ఏమి తీసుకుంటున్నామో నేను స్పృహతో గమనిస్తాను. గంటల తరబడి నాకు శక్తిని, సంతృప్తిని ఇచ్చే కాలిఫోర్నియా బాదం వంటి తేలికైన ఇంకా పోషకమైన వాటితో నా రోజును ప్రారంభించడానికి ఇష్టపడతాను. నేను ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా, చిరుతిండి కోసం ఒక చిన్న డబ్బాలో కాలిఫోర్నియా బాదంను తీసుకువెళ్తాను. అవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, నా రోజువారీ పోషక అవసరాలకు కూడా దోహదం చేస్తాయి. ఈ జాతీయ పోషకాహార మాసంలో, ప్రతిఒక్కరూ బాదం వంటి పోషకమైన ఆహారాలతో తమ రోజును ప్రారంభించాలని, మీ ప్రియమైనవారి ఆహారంలో కూడా వాటిని చేర్చాలని నేను ప్రోత్సహిస్తున్నాను”.జాతీయ పోషకాహార మాసంపై వ్యాఖ్యానిస్తూ, మాక్స్ హెల్త్కేర్, ఢిల్లీ, రీజనల్ హెడ్ ఆఫ్ డైటెటిక్స్, రితికా సమద్దార్, ఇలా అన్నారు, “ప్రజలు తమ ఆరోగ్యాన్ని సీరియస్గా తీసుకుని, స్పృహతో కూడిన ఆహార ఎంపికలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో, అన్ని వయసుల వారిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో బాదం వంటి పోషకమైన ఆహారాలను చేర్చుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అవి బరువు, కొలెస్ట్రాల్, మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి, తద్వారా మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. విటమిన్ B2, విటమిన్ E, మెగ్నీషియం, మరియు ఫాస్పరస్తో సమృద్ధిగా ఉండటం వల్ల, బాదం రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది”.న్యూట్రిషన్ మరియు వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి ఇలా అన్నారు, “మన జీవనశైలి మరియు ఆహార ఎంపికలు మధుమేహం, అధిక రక్తపోటు, మరియు ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఒక సులభమైన ఇంకా తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అడుగు, మనం మన రోజును ఎలా ప్రారంభిస్తామనేది, ఎందుకంటే అది మన శక్తి మరియు ఏకాగ్రతకు పునాది వేస్తుంది. 15 ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న బాదం వంటి పోషక-సమృద్ధి ఆహారాలను జోడించడం నిజమైన మార్పును తీసుకురాగలదు. ICMR–NIN క్రమం తప్పకుండా నట్స్ తినాలని సిఫార్సు చేస్తుంది, ఎందుకంటే ఇది గుండె మరియు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు మధుమేహం, ప్రీడయాబెటిస్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదంతో రోజును ప్రారంభించడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా, శరీరం యొక్క రోజువారీ పోషక అవసరాలను తీర్చడంలో కూడా సహాయపడుతుంది”.ఆయుర్వేద నిపుణురాలు మధుమిత కృష్ణన్ ఇలా అన్నారు, “ఆయుర్వేదం ప్రకారం, ధ్యానం రోజును ప్రారంభించడానికి ఒక ముఖ్యమైన మార్గం, కానీ ఆహారం కూడా అంతే ముఖ్యం, ఎందుకంటే అది మన శరీరం, చర్మం, మొత్తం ఆరోగ్యంపై ప్రతిబింబిస్తుంది. బాదం ఒక సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది, ఇది విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషించడంలో సహాయపడతాయి. సిద్ధ వైద్యం కూడా, మధుమేహం వంటి దీర్ఘకాలిక, జీవనశైలి-సంబంధిత పరిస్థితుల నుండి వచ్చే బలహీనతను పరిష్కరించడంలో బాదం పాత్రను గుర్తిస్తుంది”.జాతీయ పోషకాహార మాసం ప్రతి ముద్దా ముఖ్యమేనని గుర్తు చేస్తుంది. ఈ సంవత్సరం, మొత్తం శ్రేయస్సులో పోషణ యొక్క కీలక పాత్రను గుర్తించడానికి కట్టుబడి ఉందాం. స్పృహతో కూడిన ఆహార ఎంపికలు చేసుకోవడం.. మన రోజువారీ ఆహారంలో బాదం వంటి పోషకమైన ఎంపికలను చేర్చుకోవడం ద్వారా, మనం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండగలము. జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోగలము. -
దేశంలోనే తొలి మహిళా మావటి..!
సాధారణంగా గజరాజులను మచ్చిక చేసుకునేది మగవారే. ఆ వృత్తిలో కొనసాగేది కూడా పురుషులే. కానీ అలాంటి వృతిలో ఓ మహిళ కొనసాగడమే గాక, ఎన్నో ఏగులను సంరక్షించి ఎన్నో అవార్డులే కాదు, రాష్ట్రపతిచే సత్కారం కూడా పొందారామె. అంతేగాదు ఆమెను హస్తి కన్య లేదా ఏనుగుల కుమార్తె అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె దేశంలోనే తొలి మహిళా మావటి. ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో ఆమెకు సాటిలేరెవ్వరూ. ఆమెనే అస్సాంకు చెందని పర్బతి బారువా. ఐదు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి, సంరక్షించడానికి అంకితం చేసింది. చారిత్రాత్మకంగా పురుషులే కొనసాగుతున్న వృత్తిలోకి వచ్చి సత్తా చాటడమే గాక ఏళ్లనాటి మూసధోరణిని చేధించారామె. మహిళ మావాటిగా ఆమె ప్రస్థానం కేవలం అసామాన్య ధైర్యసాహాసాలకు సంబంధించినదే కాదు, ఏనుగుల పట్ల భారతదేశానికి ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాన్ని ఆధ్యాత్మిక గౌరవానికి, జ్ఞానానికి చిహ్నం కూడా.ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..మార్చి 14, 1953న అస్సాంలోని గౌరీపూర్ రాజకుటుంబంలో జన్మించిన పర్బతి. గౌరీపూర్ చివరి పాలకుడు దివంగత ప్రకృతిష్ చంద్ర బారువా కుమార్తె. ఆమె తండ్రి వేటగాడు, ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో మంచి నిపుణుడు కూడా. అలా ఆమెకు ఏనుగులను మచ్చిక చేసుకోవడం వంశపారంపర్యంగా అబ్బిన విద్యగా పేర్కొనవచ్చు. ఆమె గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్లో గ్రాడ్యుయేట్ కూడా. అయినా ఆమె అటు విద్యారంగం, ఇటు ప్రజాసేవను కాకుండా వంశపారంపర్య అభిరుచి వైపుకే మగ్గడం విశేషం.14 ఏళ్లకే ఆ నైపుణ్యం..ఇక పర్బతి 14 ఏళ్ల ప్రాయంలోనే అస్సాంలోని కొచుగావ్ అడవి ఏనుగును మంచిక చేసుకుని దాని బాగోగులు చూసుకునేది. అలా 1975 నుంచి 1978 వరకు సంప్రదాయ అస్సామీ టెక్నిక్ షికార్ని ఉపయోగించి ఏకంగా 14 అడవి ఏనుగులను విజయవంతంగా మచ్చిక చేసుకుందామె. ఇక్కడ ఏనుగులను ట్రాంక్విలైజర్లతో అపస్మారక స్థితికి తీసుకువచ్చి మచ్చిక చేసుకోరు. లాస్సో పద్ధతిలో ఒక విధమైన తాడుతో బంధించి మచ్చిక చేసుకుంటారు.మచ్చిక చేయడం, కేర్టేకర్గా..అలా ఆమె అస్సాం, పశ్చిమ ెబెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో పనిచేసింది. అక్కడ మవాటిగా ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ామానవులు-ఏనుగుల సంఘర్షణకు అడ్డుకట్ట వేయడం, గాయపడిన ఏనుగులు లేదా అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు ఔషధ మూలికలతో చికిత్స అందించడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఏనుగులు మానవులకంటే మంచివా అని ప్రశ్నించగా..నూటికి నూరు శాతం ఏనుగులే మంచివని నిర్మొహమాటంగా చెప్పేశారామె. అవి కూడా మానవుల మాదిరిగానే ప్రత్యేక మనస్తత్వంతో ఉంటాయట. కొన్ని అత్యంత సహనంగా, మరికొన్ని తెలివిగా, లీడర్లుగా ఉంటాయట. వాటి సహనం హద్దు దాటిపోతేనే విజృంభిస్తాయట. అవి తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ హాని చేయదని అన్నారామె.అంతర్జాతీయంగా ఆమె సేవలు..ఆమె నైపుణ్యాలు, సేవలు అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఆమె 2001లో బ్యాంకాక్ నుంచి తమిళనాడు, జల్దపారా, ఉత్తర బెంగాల్లోని వర్క్షాప్ల వరకు ఏనుగులపై ప్రపంచ సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే ఆసియాటిక్ ఏనుగుల స్థితిపై పరిశోధనకుగానూ సహాయసహకారాలు అందించింది. ఆమె ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆసియన్ ఎలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్లో సభ్యురాలిగా కూడా పనిచేశారు.సత్కారాలు, అవార్డులు..ఆమె అవిశ్రాంత కృషికి, పర్బతి బారువాను అనేక అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నుంచి గ్లోబల్ 500 రోల్ ఆఫ్ ఆనర్ (1989).అస్సాం ప్రభుత్వం ప్రదానం చేసే గౌరవ చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ ఆఫ్ అస్సాం (2003).అస్సాం అత్యున్నత పౌర గౌరవం అసోం గౌరవ్ అవార్డు (2023) నేచర్స్ వారియర్ జ్యూరీ అవార్డు (2023)తో సహా వన్యప్రాణులు, పరిరక్షణ సమూహాలకు సంబంధించిన జీవితకాల సాధన గుర్తింపులు.2024లో పర్బతి ఏనుగుల సంక్షేమానికి ఆమె చేసిన కృషికి గాను భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.(చదవండి: Weight loss story: మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!) -
మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!
అధికి బరువు సమస్యకు చెక్పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్కట్లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్ని కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..తాను ఎలాంటి షార్ట్ కర్ట్లు అనుకరించలేదని అన్నారు. మైండ్ఫుల్నెస్గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు. దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్ఫుల్నెస్గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..) -
డబుల్ ఇన్కమ్..నో కిడ్స్..!
పెళ్లికి ఓకే.. కానీ పిల్లలే వద్దు..!! నగరంలో ప్రస్తుతం విస్తరిస్తున్న కొత్త కల్చర్ ఇది.. దీనినే డబుల్ ఇన్కమ్.. నో కిడ్స్ (డింక్) అని పిలుస్తున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న ఈ ట్రెండ్.. ప్రస్తుతం హైదరాబాద్లోనూ కనిపిస్తోంది. పలు అధ్యయనాల ప్రకారం ఈ కల్చర్ ఏటా 30 శాతం పెరుగుదలను నమోదు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణమని పలువురు యువత చెబుతుండగా.. తమ జీవితంలో ఉద్యోగం, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో తమకు నచ్చినట్లుగా బతికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఓ వైపు పిల్లల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న జంటలు పెరుగుతోంటే.. మరోవైపు ఈ తరహా కల్చర్ వేళ్లూనుకుంటోంది.. కేస్ స్టడీస్.. ‘‘వరుణ్ వయసు 33 ఏళ్లు.. ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. ఏడాదికి రూ.40 లక్షలకు పైగా జీతం వస్తోంది.. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు.. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లేమీ లేవు.. పెళ్లి ప్రస్తావన తెచి్చన ప్రతిసారీ దాటేస్తూ వచ్చాడు.. తాజాగా అతను చెప్పిన సమాధానంతో వరుణ్ తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది.. తనను చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలో చెబుతూనే భవిష్యత్తులో పిల్లలు వద్దు అనుకునే అమ్మాయి కావాలని చెప్పాడు!!’’‘‘తిరుమలరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. ఈయనకు ఇద్దరు సంతానం.. వీరిలో కుమారుడు తేజ, కుమార్తె తనూజ.. మాస్టర్స్ పూర్తిచేసిన వీరికి కొన్నేళ్ల క్రితమే ఘనంగా వివాహం జరిపించారు.. కుమార్తెకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు తేజకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. పిల్లల గురించి అడగ్గా.. మాకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నామని చెప్పేశాడు. వారసుల కోసం కలలుగంటున్న తిరుమలరావు.. కొడుకు చెప్పిన సమాధానంతో హతాశుడయ్యాడు. దగ్గరి మిత్రులతో ఈ వింత పోకడ గురించి చెప్పుకుంటూ రెండేళ్లుగా సతమతం అవుతున్నాడు.. తన కొడుకు–కోడలు ‘డింక్’ కపుల్గా మిగిలిపోవాలని అనుకుంటున్నట్లు సన్నిహితులకు చెబుతూ వాపోతున్నాడు.’’‘విక్రాంత్.. నగరంలోని పేరెన్నిక కలిగిన ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తిచేశాడు.. అక్కడే ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. పదేళ్లలో మరో కంపెనీలోకి మారి కెరీర్ పరంగా ఎంతగానో ఎదిగాడు.. 35 ఏళ్ల వయసులోనూ పెళ్లి ఆలోచనే చేయడం లేదు.. తల్లిదండ్రులు ఎంతగా అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు.. కెరీర్ పరంగా, సామాజిక బంధాలు కొనసాగించడంలో ఎంతో పరిపక్వతతో ఉండే తమ కుమారుడు పెళ్లి విషయాన్ని ఎందుకు దాటవేస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇటీవలే డింక్ కల్చర్ గురించి తెలుసుకుని మరింత ఆందోళన చెందుతున్నారు.. పిల్లలు లేకపోయినా కనీసం పెళ్లయినా చేసుకుంటే అదే పదివేలంటూ విక్రాంత్ను బతిమిలాడుతున్నారు..’’ తరచి చూస్తే.. నగరంలో ఇలాంటి పరిస్థితులు అనేకం.. ఓ వైపు వారసుల కోసం ఆస్తులు కూడబెట్టే సంస్కృతి కలిగిన మన దేశంలో నెమ్మదిగా వారసులే వద్దు అనుకునే కొత్త సంస్కృతి తెరతీస్తోంది. ‘డబుల్ ఇన్కమ్ నో కిడ్స్’ (డింక్) పేరిట నేటి తరం పిల్లలకు దూరంగా ఉంటోంది. పాశ్చాత్య దేశాల్లో డింక్ ప్రభావం వల్ల జనాభా రేటు గణనీయంగా పడిపోతోంది. ఈ సంస్కృతి తాజాగా దేశంలోనూ, నగరంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. యేటా 30 శాతం డింక్ సంస్కృతి పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఓ వైపు పిల్లల కోసం పరితపిస్తూ పలు జంటలు ఫెర్టిలిటీ సెంటర్ల బాటపడుతోంటే.. అదే సమయంలో పిల్లలే వద్దు అనుకునే పరస్పర విరుద్ధ ఆలోచనా ధోరణి కలిగిన జంటలూ పెరుగుతుండడం గమనార్హం. ఈ ధోరణికీ పలు కారణాలు లేకపోలేదు.. ఇందుకు పెరుగుతున్న ఖర్చులే ప్రధాన కారణమని కొందరు, కెరీర్లో ఎదుగుదలకు కొందరు, ఆర్థిక స్వేచ్ఛ, బాంధవ్యాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రభావితం చేసే కారణాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను పెంచడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పనిగా భావిస్తున్నారు. పెరిగిన జీవన ప్రమాణం, ఖరీదైన విద్య, కళాశాలల ఫీజులు.. తమకు ఆర్థిక కష్టాలు తెచ్చిపెడతాయని ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం అనేక రకాలుగా కాంప్రమైజ్ కావాల్సి వస్తుందని భావిస్తున్నారు. నచ్చిన లైఫ్స్టైల్ అనుభవించాలంటే పిల్లలు అడ్డంకిగా మారతారనే ఆందోళన. నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తూ, టూర్లకు వెళ్లేందుకు తగిన సమయం దొరకదనే కారణాలు చెప్పే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో? ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ విధుల్లో ఏమాత్రం ఏమరపాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పిల్లలను కని, పెంచడం వంటి కుటుంబ బాధ్యతలతో తమ కెరీర్ కాపాడుకోవడం, ఎదుగుదలకు ప్రతిబంధకంగా భావిస్తున్నారు. సమాజంలో పెరిగిపోతున్న విపరీత ధోరణులతో కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వార్థపూరిత ఆలోచనా విధానం తప్పు కాదనే భావనలూ బలపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను చూసి, భవిష్యత్తులో తమ పరిస్థితి కూడా ఇంతే కదా అనే ఆలోచనలో పలువురు ఉన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కలుషిత, కల్తీ ఆహారం, అవినీతి తదితర అంశాలు సైతం వీరిపై ప్రభావం చూపిస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అలాంటి క్లిష్టమైన పరిస్థితులను తమ పిల్లలు ఎదుర్కోలేరని, అందుకే పిల్లలు వద్దు అనుకుంటున్నామని చెప్పేవారూ లేకపోలేదు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న ‘కొలీగ్స్’ కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్యలు వీరిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమ టీమ్లో పది జంటల్లో ఆరుగురు ఐదేళ్లలోనే విడాకుల వరకూ వెళ్లారని ‘డింక్ కపుల్’ ఆలోచనా ధోరణి కలిగిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన అనుభవాన్ని చెప్పడం గమనార్హం. ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల చాలామందికి నలభై ఏళ్ల వరకూ పిల్లలు కలగడం లేదు. మరింత వయసు పెరిగాక పిల్లలు కలిగితే ఇబ్బందులు తప్పవని భావిస్తూ, మరికొంత కాలం ఇలాగే గడిపేద్దాం అనుకునే వారు కూడా ఉన్నారు.ఏమిటీ డింక్? డబుల్ ఇన్కమ్, నో కిడ్స్.. ఉద్యోగరీత్యా లేదా ఇతర మార్గాల ద్వారా భార్యా, భర్తలిద్దరూ సంపాదిస్తూ, పిల్లలు వద్దు అనుకునే జంటలనే ‘డింక్ కపుల్’గా వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు ఓ కారణం కాగా, తమకు నచి్చనట్లుగా బతికేందుకు పిల్లలు అడ్డుగా ఉంటారని భావిస్తూ పలు జంటలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. 90వ దశకంలో జని్మంచిన వారిలోనే ఇలాంటి ధోరణి పెరుగుతోందని, జనరేషన్ జెడ్ హయాంలో పరిస్థితులు ఎంతగా మారిపోతాయో ఊహించడం కష్టమే!పరిష్కారాలేంటి? ఇద్దరూ ఉద్యోగం చేసుకునే జంటలు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. తమ ఆదాయానికి సరిపడే జీవన శైలిని మార్చుకుంటూ అవసరమైతే ఎవరో ఒకరు ఉద్యోగాన్ని వదిలేసి, పిల్లలు, కుటుంబంపై దృష్టిపెట్టాలంటున్నారు విశ్లేషకులు.. ప్రతికూల ప్రభావాలు..డింక్ కపుల్ కల్చర్ పెరగడం వల్ల జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోతుంది. తదుపరి తరంలో వృద్ధుల సంఖ్య పెరిగి, యువత సంఖ్య భారీగా పడిపోయే ప్రమాదముంది. వృద్ధాప్యంలో డింక్ కపుల్ బాగోగులు చూసుకునే వారు కరువవుతారు. వృద్ధాశ్రమాలకు డిమాండ్ పెరుగుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నైపుణ్యం కలిగిన యువత శాతం గణనీయంగా తగ్గితే సమాజంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోయి ఉత్పత్తి రంగం క్షీణిస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదముంది. -
మిస్–మిసెస్ బెలెజా
అందం, తెలివితేటల కలబోతగా సాగిన మిస్–మిసెస్ బెలెజా గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో జరిగిన తుది పోటీలో మిస్ కేటగిరీ విజేతగా డీ.కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్గా వీ.జానకీ దేవి నిలిచారు. మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్గా డా.పీ.నిఖిలా రెడ్డి, సెకండ్ రన్నరప్గా అవుల రేవతి గెలుపొందారు. కార్యక్రమానికి వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్న్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్ట్లు పోటీపడ్డారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నెరళ్ల మల్యాద్రితో పాటు బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, సోషలైట్ సుధాజైన్ పాల్గొన్నారు. (చదవండి: సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..) -
ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..
ఎవరికైనా శరీరంలోని ఏ భాగంలోనైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మంట వస్తుంది. ఇలా జరగడాన్నే ఇంగ్లిష్లో ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది చర్మం పై వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు దేహభాగాల్లో లోపలి దెబ్బలకూ, గాయాలకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇలా కేవలం దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే కాకుండా... సాధారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్ దేహంలోని ఆ భాగంలోనైనా వస్తే అక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కీళ్ల వద్ద, కీళ్ల మధ్య కూడా ఇన్ఫ్లమేషన్ రావడం జరగవచ్చు. దెబ్బలూ, గాయాలూ, ఇన్ఫెక్షన్లు, ఆర్థరైటిస్ వంటి కేసుల్లో గాయాలూ, కీళ్లలోనే కాకుండా అనేక సందర్భాల్లో అనేక అవయవాల్లోనూ ఇన్ఫ్లమేషన్లు రావచ్చు. ఉదాహరణకు... గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్ఫ్లమేషన్ కనిపించవచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, గాయాలూ, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మందుల్ని వాడినప్పటికీ... కొన్ని రకాల ఆహారాలు సైతం ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆ ఆహారాలేమిటో చూద్దాం...సాధారణంగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది వేగంగా తగ్గడానికి, గాయంగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ నయం కావడానికి కొన్ని మందులు ఇస్తారు. వీటినే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ మందులుగా చెబుతారు. అయితే యాంటీఇన్ఫ్లమేటరీ మందులు, ఎన్ఎస్ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వంటి ఔషధాలతోపాటు... దేహంలో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్తో ప్రభావితమైన చోట అది తగ్గడానికీ, అలాగే అక్కడ వచ్చే నొప్పి తగ్గడానికి ఇచ్చే నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్స్) మందులు... వీటన్నింటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఉదాహరణకు సుదీర్ఘకాలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరగవచ్చు. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులను సైతం సుదీర్ఘకాలం పాటు వాడటమూ అంత మంచిది కాదు. అలా ఆ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల దేహంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, దేహం ఆ మందుల పట్ల నిరోధకత (రెసిస్టెన్స్) పెంచుకోవడం లాంటి పరిణామాలు జరగవచ్చు.చేపలు : చేపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మరీముఖ్యంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ స్వాభావికమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉండి, మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కెల్ప్ : ఇది ఆల్గే ప్రజాతికి చెందిన ఒక రకం ఆహారం. ప్రస్తుతం మన దగ్గర (మనదేశంలో) అంత విస్తృతంగా దొరకదు. అయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాల్లో ఇది చేపల తర్వాత అంత సమర్థమైనది. పైగా ఇది కేవలం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా... కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ను తగ్గించే నేచురల్ యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలున్న ఆహారం కావడంతో దీన్ని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆలివ్ ఆయిల్ : మధ్యధరా (మెడిటెరేనియన్ సీ) ప్రాంతపు వాసులు చాలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించడానికి వాళ్ల వంటకాల్లో ఆలివ్ ఆయిల్ను విస్తృతంగా వాడటం అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఇక వాళ్ల సంస్కృతిలో తాజా పండ్లతోపాటు ఆలివ్ నూనెను వారి సంప్రదాయ వంటకాల్లో వాడటం వల్ల ఆ ప్రాంత వాసులు మరింత ఆరోగ్యంగా జీవిస్తున్నారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందుకు కారణమేమిటంటే... ఈ ఆలివ్ నూనెలో కొవ్వులు ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉంటాయి. దాంతో పాటు ఆలివ్ ఆయిల్లో కేవలం ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణం మాత్రమే కాకుండా... ఆస్థమానూ, ఆర్థరైటిస్నూ తగ్గించే గుణమూ ఉంది. గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేసే స్వభావం కూడా ఈ ఆలివ్ ఆయిల్లో ఉండటం విశేషం. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ : కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకలీలను క్రూసిఫెరల్ వెజిటబుల్స్గా పేర్కొంటారు. మొదట్లో మన దగ్గర కేవలం కాలీఫ్లవర్, క్యాబేజీ మాత్రమే లభ్యమవుతూ ఉండగా... ఇటీవల బ్రాకలీ లభ్యత కూడా బాగా పెరిగింది. ఈ క్రూసిఫెరస్ వెజిటిబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు... మన శరీరంలోని విషాలను (టాక్సిన్స్ను) స్వాభావికంగానే హరించే శక్తి ఉంది. ఇలా శరీరం నుంచి స్వాభావికంగా విషాలను తొలగించే శక్తి కారణంగానే ఇవి ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారంగా గణుతికెక్కాయి. బ్లూ బెర్రీస్ : ఇవి ఇన్ఫ్లమేషన్ను స్వాభావికంగానే పూర్తిగా ప్రభావవంతంతో తగ్గించడమే కాదు... వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుతోపాటు దేహంలోని అన్ని అవయవాల్లో కలిగే నష్టాలూ / అనర్థాలను తగ్గించే గుణాలూ ఉన్నాయి. వయసు పెరిగాక వచ్చే మతిమరపు (డిమెన్షియా)ను ఇవి సమర్థంగా అరికడతాయి. ఇక బ్లూబెర్రీస్లో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఎక్కువే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎరువులు వాడి పండించిన బ్లూ బెర్రీస్తో ΄ోలిస్తే... స్వాభావికంగా పండించిన బ్లూ బెర్రీస్ మంచివి. పసుపు : పసుపుకు ఔషధ గుణాలు (మెడిసినల్ ప్రోపర్టీస్) ఉన్నాయన్న విషయం మనకు చాలా కాలం కిందటి నుంచే తెలుసు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పోషకం / పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే ఆహారంలో పసుపు వాడినప్పుడు అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలతోపాటు సమర్థమైన నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది. మనం మెడికల్ షాపుకు వెళ్లి ఆన్ కౌంటర్ మెడిసిన్గా కొనుగోలు చేసే కొన్ని మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపవచ్చు. కానీ పసుపు వేసి వండిన ఆహారాలు ఎలాంటి దుష్ప్రభావాలూ చూపకుండానే మంచి ప్రయోజనాన్ని ఇస్తూ మెడిసిన్ ఇచ్చే ప్రభావాన్ని చూపుతాయి. అల్లం : అల్లానికి కూడా ఔషధ గుణాలూ, వైద్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం కూడా ఒకటి. ఒక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా అల్లానికి... రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించే గుణం కూడా ఉంది. వెల్లుల్లి : వెల్లుల్లిలో ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ, దీనితో కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ఇది సమర్థమైన నొప్పి నివారిణి మాత్రమే కాదు... ఇది చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. అంతేకాదు... శరీరంలో ఇన్ఫెక్షన్లతోనూ ΄ోరాడుతుంది. రక్తంలోని చక్కెరనూ సమర్థంగా నియంత్రిస్తుంది. చిలగడదుంప : తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోరంగడ్డ, గెణుసుగడ్డ అని పిలిచే ఈ దుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు, బీటా కెరోటిన్, మాంగనీసు, విటమిన్ బి6, విటమిన్– సి వంటి అనేక కీలకమైన పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా చిలగడదుంపకు ఇన్ఫ్లమేషన్ను త్వరగా మానేలా చేసే గుణం ఉంది. గ్రీన్ టీ : గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గ్రీన్–టీ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను ఇస్తాయి. చాలా రకాల క్యాన్సర్లకు గ్రీన్–టీ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు ఉపయోగపడే ఆహారాలు కాగా... కొన్ని రకాల ఆహారాలు ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి కూడా.ఇన్ఫ్లమేషన్ తగ్గించే పని ఆహారమే చేస్తే...ఒకవేళ మందుల్ని కేవలం పరిమితంగానే తీసుకుంటూ ఇన్ఫ్లమేషన్ను తగ్గించే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల సదరు ఆహారాలలోని పోషకాల వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు అది సాధ్యపడుతుందనే అంటున్నారు డాక్టర్లు, ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలతో ప్రయోజనాలివి...ఒకవేళ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి ఆహారాల మీదే ఆధారపడటం వల్ల నొప్పి నివారణ మందుల తాలూకు దుష్ప్రభావాన్ని తగ్గించడమే కాదు... వాటి వల్ల కోల్పోయే రోగనిరోధక శక్తినీ పెంపొందించుకోవచ్చు. అనవసరంగా వాడే మందుల మోతాదులు తగ్గించడంతోపాటు... వ్యాధినిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేలా దేహానికి అవసరమైన స్వాభావికమైన పోషకాలనే తీసుకోవడంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు సమకూరతాయి. దాంతో నేచురల్ పదార్థాల వల్ల స్వాభావికంగానే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రిఫైన్డ్ ధాన్యాలు : ధాన్యంపై ఉండే పొట్టును తొలగించి తీసుకునే ఆహారాలు ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. కొన్ని రకాల ఆహారంపై పెంచే జంతువుల మాంసం: ఆహారంగా ఉపయోగపడే జంతువులను పెంచే క్రమంలో కొన్నిచోట్ల వాటికి సోయా, కార్న్ వంటివి తినిపిస్తుంటారు. ఇలా సోయా, కార్న్ వంటివి తింటూ పెరిగిన ఆ జంతువుల మాంసం తిన్నప్పుడు దేహంలోని ఇన్ఫ్లమేషన్ ఒక పట్టాన తగ్గదు. అలాగే... ఇంకొన్ని జంతువులు త్వరగా లావెక్కి, వేగంగా కొవ్వు పట్టడానికి హార్మోన్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇలాంటి జంతువుల మాంసం కూడా ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. రెడ్మీట్, ప్రాసెస్డ్ మీట్ : కొవ్వు ఎక్కువగా ఉండే గొడ్డు మాంసంలో ఎన్ఈయూ5జీసీ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే ఇన్ఫ్లమేటరీ గుణానికి పెం΄÷ందిస్తుంది. అందుకే ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు రెడ్మీట్ను తీసుకోవాల్సి వస్తే దాన్ని చాలా పరిమిత మోతాదుల్లో మాత్రమే తినాలి. ఒకవేళ రెడ్మీట్కు బదులు కోడిమాంసం, చేపలు తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ను పెంచుకోకుండా... తగ్గించుకునే అవకాశాలూ పెరుగుతాయి. చక్కెరలు : చక్కెరతోపాటు చక్కెరను వాడి తయారు చేసే అన్నిరకాల తీపి పదార్థాలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి.వంటనూనెలు : ఒక్క ఆలివ్ నూనె మినహాయించి... కుసుమ, సోయా, పొద్దుతిరుగుడు, కార్న్ నూనెలతోపాటు, పత్తినూనె సహా అన్ని రకాల వంట నూనెలూ ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. ట్రాన్స్ఫ్యాట్స్ (కొవ్వులు): స్వాభావికంగా పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా... కృత్రిమంగా తయారు చేసే నెయ్యి లాంటి డాల్డా వంటి వాటిని ట్రాన్స్ఫ్యాట్స్గా పేర్కొంటారు. ఇక కొన్ని ఆహారాల్లో నూనెలు, నెయ్యి వంటివి వాడితే త్వరగా పాడవుతాయనీ, అలా పాడు కాకుండా ఉంచేందుకు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకూ (షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు) మార్జరిన్ వంటి నూనెలు వాడతారు. ఈ ట్రాన్స్ఫ్యాట్స్ అన్నీ దేహంలొ చెడు కొవ్వులనూ, చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాంతో అన్ని రకాల కొవ్వులూ, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ మాత్రమే కాకుండా మార్జరిన్ వంటి నూనెను ఉపయోగించిన అన్ని ఆహారాలూ దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచేందుకు కారణమవుతాయి. పాలలో అలర్జీని తెచ్చిపెట్టే కారకాలు / పోషకాలు : పాలలోని అలర్జీ కలిగించే పదార్థాలు దేహంలో ఇన్ఫ్లమేషన్ను పెంచతారు. ఉదాహరణకు పాలు సరిపడని కొందరిలో వాటిని తాగినప్పుడు వాళ్ల ఒంటిపై ర్యాష్ వస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. (అయితే పాల అలర్జీ కారణంగా అవి సరిపడనివారికి మినహా మిగతా వారందరికీ పాలు మంచి ఆహారం). ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు : కొన్ని రకాల ఆహారాలకు ఆస్పార్టమ్, ఎమ్ఎస్జీ అనే అడెటివ్స్ కలుపుతారు. ఇవి కలిపిన ఆహారం ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. మనకు సరిపడని అన్ని రకాల ఆహారాలు : కొందరిలో కొన్ని రకాల ఆహారాలు అలర్జీని కలిగిస్తాయి. ఇలా సరిపడని ఆహారాల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆల్కహాల్ : ఆల్కహాల్ దేహంలోని చాలా భాగాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ను మరింత పెరిగేలా చేస్తుంది. దేహంలో ఇన్ఫ్లమేషన్ ఉండి, క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆ ఇన్ఫ్లమేషన్నే కాలక్రమంలో కేన్సర్గా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఆ మాటకొస్తే ఇన్ఫ్లమేషన్ లేనప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోకపోవడమే మంచిది. డాక్టర్ రాజీబ్ పాల్, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్నిర్వహణ: యాసిన్(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..) -
బాధ్యతయుతమైన పేరెంటింగ్కి అర్థం ఇదే..!
మంచి తల్లిదండ్రులుగా ఉండటం అంటే అలాంటి ఇలాంటి టాస్క్ కాదు ఇది. జీవిత విలువల్ని, పాఠాలను నేర్పే గొప్ప గురు స్థానం దాన్ని సక్రమంగా నిర్వహించడంపైనే పిల్లల ఎదుగుదల, ఉన్నతి ఆధారపడి ఉంటుంది. అది మొగ్గగా ఉన్నప్పటి నుంచి నేర్పాలి అనేందుకు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోనే ఉదాహారణఆ వీడియోలో మైఫండ్బాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అనుజ్పాల్ తన కొడుతో సంభాషిస్తున్నట్లు కనిపిస్తుంది. నీస్కూల్ నుంచి ఫిర్యాదు వచ్చిందని అడగగా, అందుకు కొడుకు అద్విక్ ఒకరిని కొట్టానని సమాధానమిస్తాడు. అలా ఎలా ఒక వ్యక్తిపై చెయ్యి ఎత్తడం కరెక్టేనా అని అడుగుతాడు. ఆ పని రౌడీలే చేస్తారు. నువ్వు రౌడీ లేదా హీరోలా ఉండాలనుకుంటున్నావా అని అడగగా..హీరోలానే ఉండాలనుకున్నట్లు సమాధానమిస్తాడు. అలాంటప్పుడు ఎంతో హుందాగా ఉండాలని, పక్కవారి వస్తువులను తీసుకోకూడదని ఆ సీఈవో తండ్రి కుమారుడికి హితవు చెబుతాడు. మరి హీరోలా ఉండాలనుకున్నప్పుడూ తప్పు చేసిన దానికి వెంటనే క్షమాపణలు చెప్పాలి కదా అని తండ్రి అడగగా, అందుకు కొడుకు చెబుతానని అంగీకరిస్తాడు. అంతేగాదు వీడియో చివరలో కొడుకు అద్విక్ తన క్లాస్మేట్కి క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పిల్లలు ఇలాంటి పనులు చేసినప్పుడూ..కోపంతో కాకుండా ఆలోచనాత్మకంగా చేసిన తప్పుని వివరించి మంచిగా ప్రవర్తించేలా చేయాలి. ఒక్కోసారి కోపంతో కాకుండా విమర్శనాత్మక ధోరణితో తీర్చిదిద్దడమే ఉత్తమం. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్ పాఠం అంటూ సదరు సీఈవో స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Adwik Paul (@adwikpaul) (చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..) -
'అంకుల్ అలా చేయడం అనవసరం అనిపించింది'
మనకెవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ చెబుతాం. అది మినిమం కర్టసీ. అయితే ఇకముందు తాను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాల్సివస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని చెబుతోంది ఢిల్లీకి చెందిన యువతి. ఆమె ఎందుకలా అంటోంది? ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణంలో తనకు ఎదురైన భయంకర అనుభవాన్ని 22 ఏళ్ల కాలేజీ విద్యార్థిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'రెడిట్' ద్వారా పంచుకుంది.'నిన్న నేను మెట్రోలో కాలేజీ నుండి తిరిగి వస్తుండగా, రైళ్లు మారాల్సి ఉడడంతో నేను ఎంట్రీ దగ్గర నిలబడి ఉన్నాను. ఒక స్టేషన్లో, పొడవైన వ్యక్తులు (అందరూ 6 అడుగుల కంటే ఎక్కువ) లోపలికి వచ్చారు. దీంతో బోగీలో రద్దీ మరింత పెరిగింది. నా హైట్ కేవలం 5.2 మాత్రమే. దాదాపు 40 ఏళ్ల వయసున్న ఒక అంకుల్ నా పక్కనే నిలబడి ఉన్నాడు. నా ముందు నిలబడి ఉన్న వ్యక్తి వీపు దాదాపు నా ముక్కును తాకుతోంది. అయితే రద్దీలో ఇది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. నాకు అసౌకర్యంగా కూడా లేదు. కానీ నా పక్కన నిలబడి ఉన్న అంకుల్ (Uncle) నన్ను కాపాడుతున్నట్టుగా అత్యుత్సాహం ప్రదర్శించి నా ముందున్న వ్యక్తిని తోసేశాడు. అంకుల్ అంతగా రియాక్ట్ అవాల్సిన అవసరం లేదనిపించింది. అతడికి థ్యాంక్స్ చెప్పాలా, వద్దా ఆలోచించాను. చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పకపోతే అమ్మాయిలంతా కృతజ్ఞత లేనివారని అనుకుంటాడని, నిజంగా వారికి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ముందుకు రాడన్న భావనతో అతడికి ధన్యవాదాలు తెలిపాను.నేను థాంక్స్ చెప్పి రైలు (Train) దిగిపోయాను. అతడు కూడా దిగి నాతో పాటు నడవడం మొదలుపెట్టాడు. నేను వేగంగా నడిచాను. తర్వాత అతడు తన ఐడీ కార్డును కూడా చూపించాడు కానీ నేను చూడలేదు. నేను చాలా భయపడ్డాను. అక్కడితో ఆగకుండా నువ్వు ఎక్కడ ఉంటావు? మీరు కాలేజీ స్టూడెంటా? రోజూ ఇదే టైమ్లో వస్తూపోతూ ఉంటారా? మీ నంబర్ ఇవ్వండి, ఫోన్లో మాట్లాడుకుందాం అన్నాడు.ఎవరి ఫోన్ నంబర్ (Phone Number) అయినా అడగడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ 40 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల అమ్మాయితో అలా చేయడం తప్పు. సహాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులను నేను నిజంగా అభినందిస్తున్నాను. కాబట్టి నేను చెప్పినది ఏదైనా బాధ కలిగించేది/ అభ్యంతరకరంగా ఉంటే నన్ను క్షమించండి' అంటూ రెడిట్లో పోస్ట్ పెట్టింది.చదవండి: కేబీసీలో హైదరాబాద్ మహిళ.. ఎంత గెలిచారో తెలుసా?నెటిజనులు ఏమన్నారంటే..సోషల్ మీడియా ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజనులు (Netizens) ఆ యువతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. వ్యక్తిగత వివరాలు కోసం ఎవరిని బలవంతపెట్టకూడదని అభిప్రాయపడ్డారు. తమకెదురైన అనుభవాలను కూడా పంచుకున్నారు. తనకు 17 ఏళ్ల వయసులో రైలు ప్రయాణంలో ఇలాంటి అనుభవమే ఎదురైందని ఒక నెటిజన్ వెల్లడించారు. ముక్కుమొహం తెలియని వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం కరెక్ట్ కాదని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.Why I'll think twice before saying thank you againbyu/gurlpolice indelhi -
హ్యక్ హా.. అప్డేట్ హా..?!
నా ఫోన్ హ్యాక్ అయిందా? అంటూ పలువురు మొబైల్ వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం కొన్ని ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్లో వినియోగదారుల అనుమతి లేకుండానే ఆటోమెటిక్గా సెట్టింగ్స్ మారిపోవడమే. ఇదే అనేకమందిలో ‘మన ఫోన్లు హ్యాక్ అయ్యాయా?’ అనే ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అంతకు ముందు మనం మాట్లాడిన విషయాలు యాడ్స్, పోస్టుల రూపంలో కనిపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఈ రకమైన మార్పులు మరింత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి సెట్టింగ్స్ మార్పులు హ్యాకింగ్ వల్ల మాత్రమే కాదని, సాఫ్ట్వేర్ అప్డేట్స్, కంపెనీ బగ్ ఫిక్స్లు లేదా డిఫాల్ట్ సిస్టమ్ సింక్ అయిన కారణంగా కూడా జరుగుతాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అవగాహన తోనే.. ఈ ఆటోమెటిక్ మొబైల్ సెట్టింగ్స్ మార్పు చూడడానికి చిన్నదిగా కనిపిస్తున్నా.. నగరవాసుల్లో ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనతో పాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెరగడానికి దోహదం చేసింది. మన ప్రైవసీ, మన భద్రత, మన భవిష్యత్తును రక్షించుకోవడమేనని మరోసారి హెచ్చరించింది. కొన్ని సార్లు బ్రాండ్లు కొత్త ఫీచర్లను యూజర్లకు అందించడానికి ఆటోమెటిక్గా కొన్ని సెట్టింగ్స్ మార్చేస్తాయి. అయితే.. తమకు ముందస్తు నోటిఫికేషన్ రాకపోవడం వల్లే ఇది హ్యాకింగ్లా అనిపిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ మార్పులు.. నగరాల్లో జీవనశైలిలో ఉదయం అలారం మొదలు రాత్రి నిద్రపోయే వరకు.. చదువు, ఉద్యోగం, వినోదం, షాపింగ్ అన్నీ మొబైల్ ఆధారంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ సెట్టింగ్స్ ఇలా అనుకోకుండా మారిపోవడం నేరుగా వారి మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రాజెక్ట్ వర్క్పై ఆధారపడిన మొబైల్ వినియోగదారులు ఈ సెట్టింగ్స్ మారడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఫియర్ ఆఫ్ హ్యాకింగ్ (ఫోన్ సురక్షితమా? అనే అనుమానం) వల్ల యువతలో ఆందోళన పెరుగుతుంది. డిజిటల్ చర్యలపై నమ్మకం తగ్గిపోవడం వల్ల సోషల్ మీడియా, ఆన్లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్త పెరుగుతుంది. టెక్నాలజీపై ఆధారపడే జీవనశైలి మరింత సెక్యూరిటీ–సెంట్రిక్గా మారే అవకాశం ఉంది. ఇలాంటివి కాకుండా ఉండాలంటే? మొబైల్లోని సాఫ్ట్వేర్ అప్డేట్స్ను మ్యాన్యువల్గా కంట్రోల్ చేయండి. ఆటోమేటిక్ అప్డేట్ ఆప్షన్ను ఆఫ్చేసి, అవసరం అనిపించినప్పుడు మాత్రమే అప్డేట్ చేయడం మంచిది. ఎప్పటికప్పుడు యాప్లకు ఇచ్చే అనుమతులను జాగ్రత్తగా పరిశీలించండి. మైక్రోఫోన్, కెమెరా, లొకేషన్ యాక్సెస్ అవసరమైనప్పుడే ఆన్ చేయాలి, లేని పక్షంలో ఆఫ్లోనే ఉంచాలి. టూ–ఫాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించడం ద్వారా అకౌంట్లు మరింత సురక్షితంగా ఉంటాయి. అనవసర యాప్లను తొలగించడం కూడా సెక్యూరిటీకి చాలా కీలకం. సెక్యూరిటీ సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి తప్పనిసరిగా ఉపయోగించాలి. బ్యాకప్ సెట్టింగ్స్ తప్పనిసరి.. ఇలాంటి మార్పులు మళ్లీ జరగకుండా ఉండేందుకు మొబైల్లో సిస్టమ్ సెట్టింగ్స్ బ్యాకప్ తీసుకోవడం మంచిదని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సెట్టింగ్స్ మారితే తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే వై–ఫై లేదా డేటా నెట్వర్క్ ద్వారా జరిగే రిమోట్ మార్పులు నివారించడానికి ప్రైవసీ సెట్టింగ్స్ కఠినంగా ఉంచాలి. (చదవండి: సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..) -
సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..
ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయనచెప్పే ఆర్థిక సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు గొప్పపాఠాలే కాదు శ్రీమంతులుగా మార్చే గొప్ప సూత్రాలు కూడా. ఆయన సంపదర పరంగానే కాదండోయ్ ఆరోగ్యపరంగానే బిలియనీరే. ఆయనేమి ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లోపెట్టుబడులు పెట్టలేదు గానీ వెల్నెస్ పరంగా ఆయన అలవాట్లు చూస్తే విస్తుపోతారు. అలాంటి ఆహారపు అలవాట్లు ఆయన దీర్ఘాయువు రహస్యమా అని విస్తుపోతారు. వైద్యులు, పరిశోధకులు నో అంటూ..మొత్తుకుని హెచ్చిరించి మరి చెప్పే వాటినే ఆయన ఇష్టంగా తింటాడట. అందరికీ అనారోగ్యకారకమైనవి మరి ఆయనకు ఎలా ఆరోగ్యకరంగా మారాయ్ అంటే..తొంభైఐదు వసంతాలకు చేరువైన బఫెట్ 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరేళ్ల పిల్లవాడిలా తింటానని ఎందుకంటే వాళ్లల్లో అత్యల్ప మరణ రేటు ఉంటుంది కాబట్టి అని చెప్పారు. ఈ డైలాగ్ నెట్టింట వైరల్గా మరి చాలామందిని ఆలోచింప చేసేలా చేసింది. అంతేగాదు ఆయన కేలరీలను లెక్కించడట. తాను అచ్చం చిన్నపిల్లవాడి మాదిరిగా తింటాను, నిద్రపోతానని అన్నారు. కోకాకోలా అంటే బఫేట్కి మహాప్రీతి. ప్రతిరోజూ ఐదు నుంచి 12 ఔన్స్ డబ్బాలు అయిపోవాల్సిందేనట. తాను రోజుకి సుమారు 2,700 కేలరీలు తింటే..దానిలో పావువంతు కోకాకోలా ఉంటుందని ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అలాగే ఉదయం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ డ్రింక్లు, సూపర్ ఫుడ్లు వంటివి ఏమి తీసుకోరు. ఆయన ప్రతిరోజూ మెక్డొనాల్డ్స్ మీల్స్ తింటాడు. ఫాస్ట్ఫుడ్నే అత్యంత ఇష్టంగా తింటారట. అంటే ఆయన తీసుకునే ఆహారంలో దాదాపు జంక్ ఫుడ్ అధికం. నిజానికి వెల్నెస్ ప్రియులు దూరంగా ఉండే ఫుడ్నే ఆయన అత్యంత ఇష్టంగా తినడం విశేషం. తప్పనిసరిగా ఒక ఆదివారం ఐస్క్రీం తినాల్సిందేనట. అయితే బఫెట్ ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యకరమైనవి కాకపోయినా..ఎంతటి బిజీ లైప్లో కూడా ఆయన ఎనిమిదింటికే నిద్రించడం, తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లడం, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇన్నేళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు బఫెట్ తరుచుగా తనకు గాఢంగా నిద్రపోవడం అంటే అత్యంత ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కూడా ఇలాంటి మంచి నిద్ర అలవాటు అనేది దీర్గాయువు సీక్రెట్కి సంబంధించిన వాటిల్లో ఒకటని పేర్కొంది. అంతేగాదు వయసు పెరుగుతున్న..అంతరంగంలో పసిబిడ్డలాంటి ఉత్సుకత కలిగిన మనసుని మర్చిపోవద్దని చెబుతుంటారు. అంటే మనకు ఇష్టమైన వాటిని వెంటనే ఆస్వాదించే చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదులుకోవద్దని చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన తన స్నేహితులతో బ్రిడ్జ్ వంటి ఆటలను ఆస్వాదిస్తారట. అది తన మెదడుకు మేధోపరమైన వ్యాయామం అని చెబుతున్నారాయన. అలాగే తన షెడ్యూల్లో ఖాళీ అనే పదానికి అస్సలు అవకాశం ఉండదట. అలా తన సమయాన్ని వృద్ధా చేయకుండా సద్వినియోగం చేసుకోగలనని అన్నారు. ఇక తనకు రోజులో కనీసం ఐదు నుంచి ఆరుగంటలు చదవడం, ఆలోచించడం వంటి వాటితో గుడుపుతాడట. ముఖ్యంగా వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం వంటి వాటిపట్ల మిక్కిలి ఆనందదాయకంగా ఉంటుందట. అంటే మనం చేస్తున్న పనిని ప్రేమించడం, ఇష్టపూర్వకంగా పనిచేయంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తే..భారం అనే పదకు ఆస్కారం ఉండదంటారు బఫేట్. అలాగే వారంలో మూడు రోజులు వ్యాయమాలు చేస్తానని చెప్పారు. ఇక ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి అస్సలు పోనని చెబుతున్నారు. అంతేగాదు బఫేట్ ఎలాంటి కఠినమైన డైట్లు అనుసరించనని..నచ్చిన ఫుడ్ని సంతోషభరితంగా ఆస్వాదించడం..తన శరీరం ఇష్టపడే వాటిని మితంగా ఆస్వాదించేలా నియంత్రించుకోగల సామర్థ్యం వంటివే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతున్నారు బఫెట్. పోషకాహార నిపుణులు చెప్పే చెడు ఆహారపు అలవాట్లే బఫేట్వి అయినా..ఆయన మంచి నిద్రకు, శారీరక శ్రమకు మద్దతిస్తూ..చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడిందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!) -
మర్రి.. డోంట్ వర్రీ.. !
సరిగ్గా 23 యేళ్ల కిందట ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తలపెట్టిన ఓ సరికొత్త ప్రయోగం ఫలించింది.. ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో రెండు మర్రి చెట్లను నాటి పునరుజ్జీవం పోశారు. సెపె్టంబర్ 2, 2002న ట్రాన్స్లొకేట్ చేసిన ఈ జంట మర్రి చెట్లకు ‘జాగృతి’, ‘నవజీవన్’ అనే పేర్లతో నామకరణం చేశారు. ప్రస్తుతం ఇవి గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో రెండువేలకు పైగా చెట్ల నడుమ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నగర విస్తరణలో భాగంగా ప్రస్తుతం పలు చోట్ల చెట్లను కొట్టేయడం లేదంటే వాటిని ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో వేరే ప్రాంతాల్లో నాటడం తెలిసిందే.. కానీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్లో 23 ఏళ్ల క్రితమమే ఈ పద్ధతిని అమలుచేశారు. అప్పట్లో క్యాంపస్ విస్తరణలో భాగంగా ఈ మర్రి చెట్లను తొలగించాలని నిర్ణయించారు. దీనిపై అప్పటి ప్రొఫెసర్లు, అధికారులు కలిసి వీటిని ఎలాగైనా క్యాంపస్లో మరో ప్రదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో ఒకచెట్టును పరిపాలనా భవనం పక్కన(జాగృతి), మరో చెట్టును నీలగిరి భవన్ వద్ద (నవజీవన్) ఏర్పాటు చేశారు పేర్లతో నామకరణం చేశారు. రెండో సారి ట్రాన్స్లొకేషన్.. ఇదిలావుండగా నీలగిరి భవన విస్తరణలో దాన్ని మళ్లీ ట్రాన్స్లొకేషన్ పద్ధతి ద్వారానే క్యాంపస్లోని పలాష్ నివాస్ సర్కిల్ వద్దకు నవజీవన్ను తరలించారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని 66 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం దాదాపు 2వేల చెట్లు కొలువుదీరాయి. యేటా వనమహోత్సవం పేరిట మొక్కలు నాటుతుంటారు. అదేవిధంగా కొన్ని చెట్లను విద్యార్థులే తమ గుర్తు కోసం నాటి వాటికి పేర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. సస్టైనబుల్ గ్రీన్ ఇనిషియేటివ్.. వనమహోత్సవంలో భాగంగా సస్టైనబుల్ గ్రీన్ ఇనిíÙయేటివ్ ప్రోగ్రాం కింద క్యాంపస్లో ఇటీవల 1,200 మొక్కలను నాటారు. వన్ ట్రీ ప్లాంటెడ్ యూఎస్ఏ, ఫెడెక్స్ కార్పొరేషన్ యూఎస్ఏ సంస్థల సహకారంతో క్యాంపస్లో ఇటీవలే వీటిని నాటడం విశేషం క్యాంపస్లో రేయిన్ వాటర్ హర్వెస్టింగ్ సిస్టమ్స్, వైసన్ స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, ఇంటిలిజెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, వాటర్, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. (చదవండి: నవరాత్రుల వేళ..సాంస్కృతిక సందడి..) -
సాంఘీక నృత్యం కోలాటం..
కోల అంటే కర్రపుల్ల.. ఆట అంటే నృత్యం.. ఈ రెంటినీ కిలిపేదే కోలాటం.. పల్లె, పట్టణంలో చిన్నా పెద్దా భేదం లేకుండా పండుగవేళ సరదాగా ఆడే సాంఘిక నృత్యమే కోలాటం. ఈ నృత్య సంప్రదాయం నేడు ఆధునిక పద్ధతులతో మరింత అబ్బురపరుస్తుంది. నవరాత్రుల్లో అందరినీ ఆకట్టుకునే నృత్యంగా గుర్తింపు తెచ్చుకుంది. మహిళలంతా ఒకే రంగు దుస్తుల్లో గుండ్రంగా తిరుగుతూ కోలాటం ఆడుతుంటే ఆ జోష్ మాటల్లో చెప్పలేం..నగరంలో గణనాథుని ఉత్సవాల నేపథ్యంలో ఇప్పటికే కోలాటాల సందడి షురూ అయ్యింది. సందర్భాన్నిబట్టి బాణీలు కట్టే ఈ సంప్రదాయ కళ.. నేడు ఆధ్యాత్మికతకు సంస్కృతిని జోడించి మరింత ఆకర్షణీయంగా అలరిస్తుంది. డ్రెస్ కోడ్తో మరింత శోభ..కోర్ సిటీ, శివారు ప్రాంతం అని తేడా లేకుండా కోలలు మార్మోగుతున్నాయి. గణేశుని శోభాయాత్రలో ముందువరుసలో మహిళలు కోలాటం ఆడుతూ ఊరేగింపుకు ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇందుకోసం మహిళలందరూ డ్రెస్కోడ్ పాటిస్తున్నారు. అప్పుడే ఆ కళకు మరింత వన్నె తీసుకురావచ్చని భావిస్తున్నారు. దీని కోసం ఆయా గ్రూపుల వారు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ఆకర్షణీయమైన వ్రస్తాలను ఎంచుకుంటున్నారు. వనితలు తాండవం ఆడుతూ తమ చేతుల్లోని రెండు కర్రలు కలుపుతూ చేసే ధ్వనులు వీక్షకులకు వీనుల విందు మాత్రమే కాదు.. ఆ కళారూపం నయనానందకరం. గణేశ నవరాత్రులు వచ్చాయంటే గల్లీగల్లీలోనూ సందడే.. మండపం తీర్చిదిద్దే దగ్గర నుంచి నిమజ్జన ఊరేగింపు వరకూ ఎందులోనూ రాజీపడకుండా ఉత్సవ నిర్వాహకుల మధ్య ఆధ్యాతి్మక పోటీ నెలకొనడం సహజమే. పాడ్బ్యాండ్, తీన్మార్ స్టెప్పులు, కళాకారుల వేషధారణలతో గణపయ్యను సాగనంపుతారు. అయితే గత కొన్నేళ్లుగా సంప్రదాయ కోలాట సందడి నగరంలో జోరుగా కనిపిస్తోంది. దీనికి ఆధ్యాతి్మకతను మిళితం చేసి మానసికోల్లాసాన్ని అందించే కోలాటం కళలో శిక్షణకు ఎంతైనా ఖర్చు చేసేందుకు మహిళలు వెనుకాడడం లేదు. కాలనీల్లో బృందాలుగా.. గతంలో ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి నృత్యాలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో నగరంలోని గేటెడ్ కమ్యూనిటీల్లో, కాలనీల్లో అక్కడి మహిళలే బృందాలుగా ఏర్పడి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ పొందుతున్నారు. తమ వినాయకుడి వద్ద తామే కోలాటం ప్రదర్శించేందుకు చిన్నారులు, మహిళలు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇందుకోసం నేర్పే గురువుల టైమ్స్లాట్స్ దొరకడంలేదంటే అతిశయోక్తి కాదు. నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ గురువు ఉదయం 5.30 గంటలకు కోలాట శిక్షణ తరగతులు ప్రారంభిస్తే అర్ధరాత్రి 12 గంటల వరకు 12 మండపాల వరకూ మహిళలకు శిక్షణ ఇస్తూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. టైమ్ స్లాట్స్ కుదరక కొన్నిచోట్లకు అసిస్టెంట్స్ను పంపిస్తున్నారు. నిమజ్జన శోభాయాత్ర కోసం వేల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పలువురికి హాబీగా.. కేవలం ఉత్సవ వేళ మాత్రమే నేర్చుకుని వదిలేయడం కాకుండా.. దీనిని ఓ హాబీగా మార్చుకుని కోలాటం వేస్తున్నారు. తద్వారా కాలనీలో జరిగే దసరా, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఉగాది, న్యూయర్.. ఇలా ప్రతి ఈవెంట్లో కోలాటానికి షెడ్యూల్ ఉండాల్సిందే. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు కోలాట సంస్కృతికి ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. దీనికి తోడు కోలాటంలో ఆధ్యాత్మికత, మానసిక దృఢత్వం, ఫిట్నెస్ అంశాలు మిళితమై ఉన్నాయి. దీంతో మహిళల చేతుల్లోని కర్రలను లయబద్దంగా ఆడించడానికి ఎంతో ఏకాగ్రత అవసరం. తద్వారా చిన్నారులకు ఏకాగ్రత కూడా పెరుగుతుందని పలువురు భావిస్తుండడం విశేషం. అంతేకాకుండా పొరుగువారితో స్నేహం కూడా పెంపొందుతుందని వీరు నమ్ముతున్నారు. కోలాటం నేర్చుకోవాలనే తాపత్రయం పెరిగిందినేను సిటీకి వచ్చి ఏడేళ్లు. అప్పటి నుంచి కోలాటం నేర్పుతున్నాను. అప్పట్లో ఆదరణ అంతంతమాత్రంగా ఉండేది. రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా అడపా దడపా వినాయక మండపాల వద్ద నేర్చుకునేందుకు ముందుకువచ్చేవారు. కానీ ఇప్పుడు కోలాటం నేర్చుకోవాలనే తాపత్రయం పెరిగింది. ఇప్పుడు తాను ఉదయం 5.30 గంటలకు శిక్షణ మొదలుపెడితే అర్ధరాత్రి 12 గంటల వరకు నేర్పుతున్నాను. నాకు సమయం లేక మరికొంతమంది వద్దకు నా అసిస్టెంట్ను పంపిస్తూ నేర్పిస్తున్నాను. ఫిట్నెస్ కూడా కోలాటం ఎంతగానో దోహదం చేస్తుంది. – సాయిగణేశ్ కోలాటం మాస్టర్ఐక్యత పెరిగేందుకు.. మాది కొత్తగా ఏర్పడిన గేటెడ్ కమ్యూనిటీ. సభ్యుల మధ్య పరిచయాలు, ఐక్యత పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. కొందరు ప్రత్యేకంగా గ్రూప్ క్రియేట్ చేసుకుని కోలాటం నేర్చుకుంటున్నారు. మా ప్రయత్నం ఫలించింది. దీనిని కమ్యూనిటీలోని ప్రతి కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నాం. – రావూరి శ్రీవాణి, గోథిక్ పెంటగాన్ క్లౌడ్స్ (గేటెడ్ కమ్యూనిటీ) ఫిట్నెస్పరంగానూ ఉపయోగం.. కోలాటం కేవలం ఒక వినోదాత్మక కళ మాత్రమే కాదు.. శారీరక, మానసిక దృఢత్వానికి కీలకం. 1300 ఫ్లాట్లు కలిగిన మా కమ్యూనిటీలో శ్రీరామనవమి, కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులు ఇలా ఏ పండుగ వచ్చినా కోలాట ప్రదర్శన తప్పనిసరి. మాస్టర్స్ వద్ద మా సభ్యులు మెళకువలు నేర్చుకుంటున్నారు. మహిళల మధ్య బంధం బలపడుతోంది. – దీప్తి, బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్ అపార్ట్మెంట్ చిన్నారుల ఉత్సాహం..కాలనీలో ఎప్పటి నుంచో చిన్నారులు ఉత్సాహంగా కోలాటం నేర్చుకుంటున్నారు. గణపతి నిమజ్జన ఊరేగింపులో అందరూ ఒకేరకమైన డ్రెస్ ధరించడం శోభాయాత్రకే ప్రత్యేక ఆకర్షణ. కోలాటం శిక్షణను ఇక మీదట కూడా కొనసాగిస్తాం. దీని ద్వారా పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. – బుచ్చిబాబు, మోడల్కాలనీ ప్రధాన కార్యదర్శి (చదవండి: ల్యాబ్ మేడ్ ఫిష్) -
రాజస్థాన్ రాయల్ టూర్..!
ఇది రాజకోట రహస్యం చిత్రం కాదు. అచ్చంగా రాజపుత్రులు ఏలిన కోటలు. దుర్బేధ్యమైన కోటలు... చక్కని ప్యాలెస్లు. ఉదయ్ సింగ్ కట్టించిన సిటీ ప్యాలెస్. సజ్జన్సింగ్ మాన్సూన్ ప్యాలెస్. మహారాణా పోరుగడ్డ హల్దీఘాటీ. రాథోడ్ జోధా కట్టిన మెహరాన్గఢ్. యూరోపియన్ స్టైల్ ఉమేద్భవన్. బ్రహ్మకు ఆలయం కట్టిన పుష్కర్. జయ్పూర్ పాలకుల అమేర్ ఫోర్ట్. సిటీ ప్యాలెస్... హవామహల్... ఇవన్నీ రాజస్థాన్లో సాగే రాయల్ టూర్లో.1వ రోజు: హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్కి ప్రయాణం. టూర్ నిర్వహకులు ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుంటారు. హోటల్ గదికి వెళ్లి చెక్ ఇన్ కావడం, హోటల్లో లంచ్ తర్వాత సిటీ ΄్యాలెస్ సందర్శనం, పిచోలా లేక్లో విహారం, రాత్రి డిన్నర్, బస ఉదయ్పూర్లోనే.ఉదయ్పూర్ రాజమందిరంసిటీ ప్యాలెస్గా వ్యవహారంలో ఉన్న ఈ భవనం ఉదయ్పూర్ రాజుల పాలన, నివాస మందిరం. సిసోడియా రాజవంశం రాజులు అనేక మంది ఈ భవనం నుంచే పాలన సాగించారు. ప్రస్తుతం ప్యాలెస్లో కొంత భాగంలో సిసోడియా రాజకుటుంబ వారసుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ నివసిస్తున్నాడు. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. రాణి వంటగది, రాజు యుద్ధ సామగ్రి, యుద్ధం సమయంలో రాజు ధరించే కవచాన్ని పరిశీలనగా చూడాలి. రాజు కవచం సైజును బట్టి రాజు ఎత్తు అంచనాకు వస్తుంది. అలాగే రాణాప్రతాప్ గుర్రం చేతక్ యుద్ధం సమయంలో ధరించే కవచం కూడా ఉంది. చేతక్ నమూనా గుర్రాన్ని తయారు చేయించి ఆ కవచాన్ని ధరింపచేశారు. ఆ గుర్రం తెల్లగా ఎత్తుగా, పొడవుగా ఉంటుంది. ఇక రాణి మందిరం విషయానికి వస్తే మందిరం ముందు రాజు వేచి ఉండే పాలరాతి బల్లను చూడాలి. రాజు ఒక వేళ రాణి అలంకరణ పూర్తయ్యే లోపే వస్తే అలంకరణ పూర్తయ్యే వరకు ఆ పాలరాతి బల్ల మీద కూర్చుని ఎదురు చూసేవాడని చమత్కారంగా చెబుతారు గైడ్లు. ఏనుగుల బలప్రదర్శన గోడను చూడాలి. గోడకు అవతల ఒక ఏనుగు, ఇవతల ఒక ఏనుగు ఉంటాయి. తొండాలను మెలి వేసి వెనక్కు లాగుతాయి. తనను తాను ఆపుకోలేక ముందుకు వచ్చి గోడను తాకిన ఏనుగు ఓడిపోయినట్లు. పిచోలా సరస్సు ఒడ్డున ఉంది సిటీప్యాలెస్. సరస్సు మధ్యలో లేక్ ప్యాలెస్, ఒక వైపుగా జగ్మందిర్, జగ్మోహన్ ప్యాలెస్లను పడవలో విహరిస్తూ చుట్టిరావచ్చు. లేక్కు మరొక ఒడ్డున దర్బార్హాల్ ఉంటాయి. దర్బార్హాల్లో నాటి రాజకొలువు బొమ్మలతో కొలువు దీరి ఉంటుంది.2వ రోజు: బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ నుంచి బయలుదేరి సజ్జన్గఢ్ ప్యాలెస్కు ప్రయాణం. ప్యాలెస్ సందర్శనం తర్వాత ప్రయాణం హల్దీఘాటికి. హల్దీఘాటిలో మహారాణా ప్రతాప్ మ్యూజియం చూసిన తర్వాత సాయంత్రం నథ్ద్వారా కోట సందర్శనం. రాత్రి బస ఉదయ్పూర్లోనే.ఎడారి మేఘంసజ్జన్గఢ్ ప్యాలెస్ నిర్మాణాన్ని మహారాణా సజ్జన్ సింగ్ ఓ గొప్ప ఆలోచనతో మొదలుపెట్టాడు. జయ్పూర్లో జంతర్మంతర్లాగా ఖగోళ పరిశోధన, అధ్యయన కేంద్రం నిర్మించాలనుకున్నాడు. అలాగే మేవార్ రాజధాని నగరం ఉదయ్పూర్ మొత్తం కనిపించే విధంగా ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన కొండ మీద నిర్మించాడు. ఐదంతస్థుల ఈ ప్యాలెస్ పైనుంచి చూస్తే ఉదయ్పూర్లోని సరస్సులు కనిపిస్తాయి. వర్షాకాలంలో రాజు ఇక్కడ కొద్దిరోజులు విడిది చేసి రాజ్యంలో నీటి నిల్వలను గమనించేవాడని చెబుతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేవార్ పాలకులు ఉదయ్పూర్ని రాజధాని చేసుకోక ముందు చిత్తోర్గఢ్ నుంచి పాలన సాగించేవారు. సజ్జన్ గఢ్ ప్యాలెస్ నుంచి చిత్తోర్గఢ్ కోట కూడా కనిపించే విధంగా డిజైన్ చేసుకున్నారు. కానీ సజ్జన్సింగ్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన పాలకులు ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు కానీ ఖగోళ అధ్యయనం దిశగా పనులు సాగలేదు. మూడు ప్రధాన ఉద్దేశాల్లో రెండు ఉద్దేశాలు మాత్రమే నెరవేరాయి. ఈ ప్యాలెస్లోకి పర్యాటకులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాహనాల్లో వెళ్లాలి. సజ్జన్గఢ్ను సూర్యాస్తమయం సమయంలో చూడగలిగితే బంగారు రంగులో మెరుస్తూ అందంగా ఉంటుంది.ఆత్మాభిమాన పోరుహల్దీఘాటీ అనే ప్రదేశం పేరుకు తగ్గట్లే పసుపు రంగులో ఉంటుంది. మట్టి, రాయి, రప్ప అంతా నేలకు పలుచగా పసుపు అద్దినట్లు, పసుపు నీటితో కళ్లాపి చల్లినట్లు ఉంటుంది. ఉదయ్పూర్ జిల్లా నుంచి రాజ్సమంద్ జిల్లా కేంద్రానికి వెళ్లే దారిలో వస్తుంది. ప్రధాన రహదారి నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత దాదాపు 30 కిలోమీటర్ల దూరం అటవీ ప్రదేశంలో ప్రయాణించాలి. హల్దీఘాటీలో యుద్ధభూమిని చేరేలోపు చేతక్ స్మారకం కనిపిస్తుంది. రాణాప్రతాప్కు ఇష్టమైన గుర్రం చేతక్. యుద్ధంలో రాణా ప్రతాప్ గాయపడడంతో ఆ సంగతి తెలుసుకున్న చేతక్ యజమానిని కాపాడుకోవడానికి యుద్ధరంగం నుంచి పరుగులంఘించుకుంది. మధ్యలో ప్రహిస్తున్న బాణాస్ నదిని దాటడానికి ఒక్క ఉదుటున దుమికింది. అప్పుడది గాయపడి ఆ తర్వాత కొద్ది దూరం ప్రయాణించి నేలకొరిగింది. చేతక్ జ్ఞాపకార్థం రాణా ప్రతాప్ నిర్మించిన స్మారకం అది. ఇది కాకుండా ఉదయ్పూర్ నగరంలో తెల్లటి చేతక్ విగ్రహంతో చేతక్ సర్కిల్ కూడా ఉంది. ఇక హల్దీఘాటీలో మ్యూజియాన్ని చూస్తే రాణాప్రతాప్ జీవితం మొత్తం కళ్లకు కడుతుంది. ఈ యుద్ధంలో మొఘల్ ప్రతినిధిగా మాన్సింగ్, మేవార్ పాలకుడిగా మహారాణా ప్రతాప్ తలపడ్డారు. భీకర యుద్ధం జరిగింది కానీ రాణాప్రతాప్ తన మేవార్ రాజ్యాన్ని మొఘలుల ఆధీనంలోకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు.3వ రోజు: ఉదయ్పూర్ నుంచి జోద్పూర్కి ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి జోద్పూర్ వైపు సాగిపోవాలి. జద్పూర్లో మెహరాన్గఢ్ కోట వీక్షణం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస జో«ద్పూర్లో.సూర్యుడి కోటమెహరాన్గఢ్ అంత పెద్దది ఇంత విశాలమైనది అని చెప్పడం కంటే... పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించిన నిర్మాణాల సముదాయం అని ఒక్క మాటలో చెప్పాలి. ఇంగ్లిష్ రచయిత రడ్యార్డ్ క్లిప్పింగ్ ఈ కోటను వర్ణిస్తూ ‘దిగ్గజ భవన నిర్మాత నిర్మించిన కోటకు ఉదయించే సూర్యుడు రంగులద్దినట్లు ఉంది’ అన్నాడు. ఈ భవనం పేరు కూడా సూర్యుడి పేరుతోనే వచ్చింది. మిహిర్ఘర్ అంటే సూర్యుని కోట అని, అదే పదాన్ని రాజస్థానీ భాషలో మెహరాన్గఢ్ అంటారు. రాథోర్ రాజవంశం నిర్మించిన కోట ఇది. రాథోర్లు సూర్యుడి ఆరాధకులు. దాంతో కోటను ఉదయించే సూర్యుని కిరణాలతో ప్రభవించేటట్లు డిజైన్ చేశారు. ఈ కోటను రావు జోధా అనే రాజు నిర్మించాడు. అతడి పేరుతోనే ఈ రాజ్యానికి జో«ద్పూర్ అనే పేరు వచ్చింది. ఇందులోని బంగారు పల్లకి దగ్గర ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.4వ రోజు: జోద్పూర్ నుంచి పుష్కర్కు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ఉమేద్ భవన్ ΄్యాలెస్ సందర్శనం తర్వాత పుష్కర్కు ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్, రాత్రి బస పుష్కర్లో.ఇండో–యూరోపియన్ ప్యాలెస్రాజస్థాన్ రాష్ట్రం కోట తెలుగు వారికి సుపచిరితమైన ప్రదేశం. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు మహారావ్ రెండవ ఉమేద్ సింగ్ నిర్మాణం మొదలుపెట్టాడు. అతడి పేరుతోనే ఉమేద్ భవన్ ప్యాలెస్గా వాడుకలోకి వచ్చింది. ఇతర రాజస్థాన్ నిర్మాణాలతో పోల్చి చూసినప్పుడు ఇందులో కొంత వైవిధ్యంగా యూరోపియన్ నిర్మాణశైలి కనిపిస్తుంది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సామ్యూల్ స్విన్టన్ చేత దీనిని డిజైన్ చేయించాడు ఉమేద్ సింగ్. నిర్మాణం ఇరవయ్యవ శతాబ్దం వరకు సాగింది. ఇందులో కోట రాజవంశం నివసిస్తోంది. కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. ఇది ఇప్పుడు హెరిటేజ్ హోటల్.ఆలయాల నిలయం పుష్కర్పుష్కర్ అనగానే పుష్కర్ సరస్సు గుర్తొస్తుంది. ఈ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం ఇది. ఈ సరస్సులో స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఆలయాలను లెక్క చెప్పడం సాధ్యం అయ్యే పని కాదు. నాలుగు వందల వరకు ఉంటాయని అంచనా. సిక్కులకు కూడా ఇది పవిత్రస్థలం. పుష్కర్ యాత్రికులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఇక్కడ ధూమపానం, మద్యపానం, మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం. ఇక్కడ ఏటా కార్తీక మాసంలో జరిగే కామెల్ ఫెయిర్ ప్రసిద్ధి. ఈ వేడుక కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, విదేశీయులు కూడా వస్తారు.5వ రోజు: పుష్కర్ నుంచి జయ్పూర్కు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్, బ్రహ్మ మందిర దర్శనం తర్వాత జయ్పూర్కి ప్రయాణం. జయ్పూర్లో సిటీ ప్యాలెస్ వీక్షణం, హవామహల్ మీదుగా హోటల్కు ప్రయాణం. గదిలో చెక్ ఇన్, రాత్రి బస జయ్పూర్లో.బ్రహ్మ మందిరంభూమ్మీద బ్రహ్మకు ఆలయం లేని లోటును తీరుస్తోంది పుష్కర్. ఇక్కడి బ్రహ్మమందిరాన్ని విశ్వామిత్రుడు నిర్మించాడని చెబుతారు. విశ్రామిత్రుడు బ్రహ్మ కోసం యజ్ఞం చేసిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించాడనేది స్థల పురాణం. ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు పునరుద్ధరించాడు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆలయ రూపం 14వ శతాబ్దంలో మహారాజా జవత్రాజ్ నిర్మాణం.జయ్పూర్ సిటీ ప్యాలెస్మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించిన ప్యాలెస్ ఇది. అమేర్ నుంచి రాజధానిని జయ్పూర్కు మారుస్తూ ఈ ప్యాలెస్ను నిర్మించారు. అప్పటి నుంచి రాజకుటుంబం సిటీ ప్యాలెస్లో నివసించేది. రాజకుటుంబ పరివారం ఐదు వందల కుటుంబాలు ప్యాలెస్ కాంప్లెక్స్లో ఉన్న ఇతర భవనాల్లో నివసించేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజాస్థానాలు దేశంలో విలీనమయ్యే వరకు జయ్పూర్ అధికారిక రాజభవనం ఈ సిటీ ప్యాలెస్. ఇప్పుడిది గొప్ప పర్యాటక ప్రదేశం. ఇందులో సవాయ్ రెండవ మాన్సింగ్ మ్యూజియం ఉంది. రాణి పద్మిని ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాజా సవాయ్ మాన్సింగ్ మ్యూజియం ట్రస్ట్ ను ప్రస్తుతం యువరాణి దియాకుమారి నిర్వహిస్తోంది. శోభానివాస్లో గ్లాస్ వర్క్, ఛావీ నివాస్లో నీలిరంగు గదిలో ఉన్న కళాత్మకతకు నాటి ఆర్కిటెక్ట్ల నైపుణ్యానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హవామహల్ మీదుగానే ప్రయాణం సాగుతుంది. శ్రీకృష్ణుడి కిరీటం ఆకారంలో ఉన్న హవామహల్ సౌందర్యాన్ని ఆస్వాదించాలి.6వ రోజు: జయ్పూర్ నుంచి హైదరాబాద్కు ప్రయాణం. బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసిన తర్వాత బిర్లా టెంపుల్ వీక్షణం, ఆమేర్ ఫోర్ట్సందర్శనం తర్వాత టూర్ నిర్వహకులు సాయంత్రం జయ్పూర్ ఎయిర్΄ోర్ట్లో డ్రాప్ చేస్తారు. విమానం రాత్రి 8.50 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతుంది.అమేర్... మాన్సింగ్ మందిరంజయ్పూర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరాన ఉంది అమేర్ ఫోర్ట్. ఇది కొండ మీద ఉంది. ఆరావళి పర్వతశ్రేణుల్లో విస్తరించిన రాజపుత్రుల రాజ్యంలో కోటలు, ప్యాలెస్లన్నీ నిర్మాణ అద్భుతాలే. రాజధానిని సిటీ ప్యాలెస్కు మార్చకముందు ఈ కోట నుంచే పాలన సాగింది. సామాన్య ప్రజలు రాజును కలవడానికి దివానీ ఆమ్, మంత్రివర్గంతోపాటు ఇతర ప్రముఖులు రాజుతో సమావేశమయ్యే దివానీ ఖాస్లు నాటి పరిపాలనను చాటి చెప్పే నిదర్శనాలు. రాజా మాన్సింగ్ ఇందులోనే నివసించాడు. ఈ నిర్మాణంలో పై అంతస్తులో మాన్సింగ్ బెడ్రూమ్, అతడి గది నుంచి కింది అంతస్థులో పన్నెండు మంది రాణుల బెడ్రూమ్లకు వెళ్లే మెట్ల నిర్మాణాన్ని పరిశీలించడం మరిచిపోవద్దు.‘రాయల్ రాజస్థాన్’ టూర్ ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఏ12. ఈ ఆరు రోజుల పర్యటన హైదరాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి 14.9.2025న మొదలవుతుంది. ఈ టూర్లో ఉదయ్పూర్, జోద్పూర్, పుష్కర్, జయ్పూర్ కవర్ అవుతాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం 7.40 గంటలకు ‘6 ఈ 6323’ విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 9.25 గంటలకు ఉదయ్పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణం 19వ తేదీ రాత్రి 8.50 గంటలకు ‘6ఈ 816’ విమానం జయ్పూర్ నుంచి బయలుదేరి 10 .55 గంటలకు హైదరాబాద్కి చేరుతుంది.ప్యాకేజ్ ధరలిలాగ: కంఫర్ట్ కేటగిరీ సింగిల్ ఆక్యుపెన్సీలో 42, 450 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,900, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 32,450 రూపాయలు.తెలుసుకోవాల్సిన మరికొన్ని సంగతులు:విమాన ప్రయాణ సమయాల్లో అవసరాన్ని బట్టి కొద్ది మార్పులు జరిగే అవకాశం ఉంది. టూర్ ఐటెనరీ ΄్లానింగ్లో ఆలయ దర్శనానికి తగిన సమయం మాత్రమే కేటాయించడం జరుగుతుంది. పూజాదికాలు నిర్వహించాలంటే సదరు పర్యాటకులు పూజ తర్వాత తమకు తాముగా హోటల్ గదికి చేరాల్సి ఉంటుంది. టూరిస్ట్ ప్యాకేజ్ బస్ పూజ పూర్తయ్యే వరకు ఎదురు చూడడం సాధ్యం కాదు. ఆలయాలకు కొన్ని చోట్ల పెద్ద బస్సు వెళ్లే అవకాశం ఉండదు, అలాంటి చోట్ల పర్యాటకులు కొంత మేర నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వాళ్లు స్థానికంగా ఆటోలు తమకు తాముగానే పెట్టుకోవాలి.చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!పర్యాటకులు తమ ఆరోగ్య కారణాల రీత్యా పార్సిల్ ఫుడ్ వెంట పెట్టుకోవాలి. ఎనర్జీనిచ్చే చాక్లెట్లు, బిస్కట్, డ్రైఫ్రూట్స్, వేరుశనగ పప్పు వంటివైనా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఈ టూర్ ఐటెనరీలో జయ్పూర్లో జంతర్మంతర్, హవామహల్ లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి.ప్యాకేజ్లో ఇవన్నీ ఉంటాయి:హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్కి, జయ్పూర్ నుంచి హైదరాబాద్కి విమానం టిక్కెట్లు. ఉదయ్పూర్లో 2 రాత్రులు, జో«ద్పూర్లో ఒక రాత్రి, పుష్కర్లో ఒక రాత్రి, జయ్పూర్లో ఒక రాత్రి హోటల్ బస. 5 రోజులు బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్, 5 రోజులు రాత్రి భోజనం. సైట్ సీయింగ్కి ఏసీ 35 సీటర్ బస్ ప్రయాణం. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్. – వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
పరోపకారం.. మానవత్వపు మధుర గీతం
నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది? తరచుగా అది మన కోసం కాకుండా, ఇతరుల కోసం మనం చేసిన చిన్న ప్రయత్నాల్లోనే దాగి ఉంటుంది. పరోపకారం అనేది కేవలం ఒక సహాయం కాదు, అది మన ఆత్మను ఉద్దీపన చేసే, సంతోషాన్ని అనంతంగా విస్తరించే ఒక అద్భుతమైన మార్గం. ఇతరుల ముఖాలపై చిరునవ్వులు చూడటం ద్వారా లభించే తృప్తికి ఏదీ సాటి రాదు.పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థమిదం శరీరమ్వృక్షాలు పరోపకారం కోసమే ఫలాలనిస్తాయి. ఆవులు పరోపకారం కోసమే పాలిస్తాయి. నదులు పరోపకారం కోసమే ప్రవహిస్తాయి. ఈ శరీరం కూడా పరోపకారం కోసమే ఉద్దేశించబడింది. ఈ శ్లోకం పరోపకార సార్వత్రిక స్వభావాన్ని, మానవ జీవితపు అంతిమ లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది.పరోపకారం అంటే నిస్వార్థంగా ఇతరులకు సాయం చేయడం, వారి శ్రేయస్సును కోరడం. సనాతన ధర్మంలో దీనికి అత్యంత ఉన్నత స్థానం ఉంది. ‘పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనమ్‘ అంటే పరోపకారమే పుణ్యం, ఇతరులను బాధించడం పాపం అనే సూక్తి దీని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలలో పరోపకారం దైవత్వానికి దగ్గరైన లక్షణంగా వర్ణించబడింది. మహాభారతంలోని కర్ణుడు తన దాన గుణంతో, పరోపకారంతో చిరస్మరణీయుడిగా నిలిచాడు. తన ప్రాణాలకు ముప్పు అని తెలిసినా కవచకుండలాలను ఇంద్రుడికి దానం చేసి, త్యాగానికి, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచాడు. అలాగే, మహారాజు శిబి తన ఆశ్రయం కోరిన పావురాన్ని రక్షించడానికి తన శరీర మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధపడి, పరోపకారం పరాకాష్టను చాటాడు.అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్ ‘ఇది నాది, అది పరాయిది‘ అని సంకుచిత మనస్తత్వం కలవారు ఆలోచిస్తారు. గొప్ప మనసున్న వారికి ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం లాంటిది. ఈ శ్లోకం పరోపకారి విశాల దృక్పథాన్ని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని తెలియజేస్తుంది.యథా కనకమాలిన్యం హితం హి వినివృత్తయే తథైవ చేతసో మాలిన్యం పరోపకృతి నిర్మలమ్ బంగారం మాలిన్యాన్ని తొలగించడానికి అగ్ని ఎలా ఉపకరిస్తుందో, మనసులోని మాలిన్యాన్ని తొలగించడానికి పరోపకారం అలా నిర్మలం చేస్తుంది. ఈ శ్లోకం పరోపకారం ఆత్మశుద్ధికి, అంతర్గత పవిత్రతకు మార్గమని స్పష్టం చేస్తుంది.పరోపకారం కేవలం ఇతరులకు చేసే సాయం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసి, జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే ఒక దివ్యమైన అనుభవం. మనమందించే ప్రతి చిన్న సహాయం ఒక అలలా విస్తరించి, సమాజంలో సానుకూల మార్పునకు నాంది పలుకుతుంది. ఈ నిస్వార్థ సేవ ద్వారా మనం వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ అద్భుతమైన సంతృప్తిని ΄÷ందగలం. పరోపకారాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే, ప్రతి అడుగులోనూ ఆనందాన్ని పంచుకుంటూ, ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలం.నేటి ఆధునిక సమాజంలో కూడా పరోపకార విలువ అపారం. నిస్వార్థ సేవకు అనేక రూపాలున్నాయి: ఒక యువతకు సరైన మార్గదర్శనం చేయడం, సాంకేతిక నైపుణ్యాలను ఉచితంగా పంచుకోవడం, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవడం, లేదా కష్టాల్లో ఉన్న వారికి నైతికంగా, ఆర్థికంగా అండగా నిలబడటం. ఇటువంటి నిస్వార్థ సేవ ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతాయి. పరోపకారం చేసేవారిలో సానుకూల దృక్పథం, అపారమైన మానసిక సంతృప్తి పెరుగుతాయి. – కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!
ప్రేమ విఫలం లేదా మనం ఎంతగానో ఆరాధించే వ్యక్తి దూరమవ్వడం, లేదా నమ్మకద్రోహం వంటి వాటి వల్ల హృదయం ముక్కలైపోతుంది. అది సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే కొందరు గుండెను రాయి చేసుకుని ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తే..మరికొందరు అంత తేలిగ్గా ఆ సమస్య నుంచి బయటపడరు. పైగా గుండె బలహీనమైపోయి..తాత్కాలికి గుండె సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీన్ని వైద్య పరిభాషలో టాకోట్సుబో కార్డియోమయోపతి లేదా "బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్"గా వ్యవహరిస్తారు. అయితే అలా ముక్కలైన హృదయాన్ని బాగు చేసుకుని, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చట. పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అసలేం జరిగిందంటే..ప్రపంచంలో లక్షలాది మంది ఈ టాకోట్సుబో కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా అకస్మాత్తుగా గుండె కండరాలు బహీనపడిపోయి గుండెపోటు లక్షణాలు తలెత్తుతాయట. చెప్పాలంటే మరణ ప్రమాదానికి చేరవయ్యే ప్రమాదం ఎక్కువ అవ్వుతుందట. ఇలాంటి తాత్కాలిక గుండెపోటు ప్రమాదాల నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నారు మాడ్రిడ్ పరిశోధకులు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇలాంటి గుండెపోటు సిండ్రోమ్ని నివారించే దిశగా అధ్యయనాలు చేయగా, వ్యాయామమే చక్కటి నివారణ అని తేలిందన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే వ్యాయామలు, థెరపీలు ఆయా రోగులకు అందివ్వగా మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 76 మంది రోగులపై అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. వారిలో 66 ఏళ్లు పైబడ్డ మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. వారందరిని రెండు సముహాలుగా విభజించారు. ఒక సముహం సాధారణ వ్యాయామాలు, వాకింగ్ చేయగా, మరొక సముహానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చారు. ఈ థెరపీలో భాగంగా ఆయా వ్యక్తులకు 12 టు 1 సెషన్లో జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలాహ్యాండిల్ చేయాలి, అవన్నీ జీవితంలో ఏ విధంగాభాగం తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఇలా మొత్తం 12 వారాలు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇక వ్యాయామాల్లో భాగంగా, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏరోబిక్స్తో కూడిన వ్యాయామాలను 12 వారాలు తర్ఫీదుని మిగతా సగంమందికి ఇచ్చామని చెప్పారు. ఫలితంగా వారందరీ గుండె పనితీరు మెరుగ్గా ఉండటమే గాక గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గినట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు వారందరిలోనూ ఆక్సిజన్ వినియోగించే సామర్థ్యాన్ని మెరుగుపరచారని చెప్పారు. ఇలాంటి తాత్కాలిక గుండె సంబంధిత సమస్యలను కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా వ్యాయామాలతో నయం చేయగలవని అన్నారు. లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొద్దిపాటి జీవన శైలి మార్పులు, శారీరక శ్రమతో కామన్ మ్యాన్ కూడా ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడగలరని అన్నారు. ఈ పరిశోధన మరిన్ని వ్యాధులకు సంబంధించిన అధ్యయనంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్డియాలజీ పరిశోధకులు.(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!) -
త్రినేత్రుడు రెడీ..!
భూమి పైనుంచి భారీ టెలిస్కోప్ ఒకటి ఈ విశ్వాంతరాళంలో కలియదిరిగేందుకు సిద్ధమౌతోంది! కొత్త గెలాక్సీలను, ప్రమాదకరమైన గ్రహ శకలాలను, ఆఖరికి గ్రహాంతర జీవుల ఉనికిని సైతం అది కనిపెట్టనుంది! ఈ ఏడాదిలో పని ప్రారంభించనున్న ఆ టెలిస్కోప్, వచ్చే పదేళ్లలో 2 వేల కోట్ల గెలాక్సీల ఆచూకీని కనిపెట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే – ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ ప్రాజెక్టులో భాగం చిలీలోని రూబిన్ అబ్జర్వేటరీ తన ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’లో అమర్చిన అతి శక్తిమంతమైన మూడు కళ్ల కెమెరా... చుక్కల్లో చెడుగుడు ఆడబోతోంది. దిక్కుల దాగుడు మూతల్ని తెరవబోతోంది! చిలీలోని ‘వీరా సి రూబిన్’ అంతరిక్ష పరిశోధన శాల (అబ్జర్వేటరీ) తన చరిత్రాత్మకమైన ఖగోళ పరిశోధనకు చేసుకుంటున్న ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రహస్య నక్షత్ర మండలాలు, భూమిని ఢీకొట్టగల గ్రహ శకలాలు, అంతుచిక్కని గ్రహాంతర జీవుల ఉనికిని నైతం కనిపెట్టేందుకు రూబిన్ అబ్జర్వేటరీ ఈ అండ పిండ బ్రహ్మాండమైన ప్రాజెక్టును చేపట్టింది. అందుకోసం అత్యంత శక్తిమంతమైన మూడు కళ్ల ‘ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా’ను తన టెలిస్కోప్లో అమర్చుకుంది. తొలి ప్రయోగం సక్సెస్ఈ ఏడాది జూన్ 23 న, ప్రయోగాత్మకంగా రూబిన్ కెమెరా (ఇదే ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా) ఖగోళ శాస్త్రవేత్తలనే అబ్బురపరచే ఫొటోలను తీసింది. ఆ అపూర్వమైన ఛాయా చిత్రాలలో గెలాక్సీ సమూహాలు, సుదూర నక్షత్రాలు, నెబ్యులా (ప్రకాశవంతమైన అంతరిక్ష మేఘం) ఉన్నాయి. ఒక కారు సైజులో 3.2 గిగాపిక్సెల్తో ఉండే ఆ కెమెరా తీసిన ఒక ఫొటోలో 4,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నెబ్యూలా కనిపించింది! అబ్జర్వేటరీకి ఉండే టెలిస్కోప్ వేగంగా వెంటవెంటనే చిత్రాలను తీస్తుంది కాబట్టి, అందులోని కెమెరా అంతరిక్ష మండలానికి ఆవల ఉన్న నక్షత్రాల గుంపు నుండి కూడా కదిలే వస్తువులను పట్టుకోగలదు. ఒక అంతరిక్ష శిల భూమి వైపు వస్తుంటే కనిపెట్టేయనూగలదు. హబుల్, జేమ్స్ల కన్నా పవర్ఫుల్ మానవాళిని అప్రమత్తం చేసే విషయమై ఇప్పటికే ఇతర శక్తిమంతమైన టెలిస్కోప్లు పనిలో ఉన్నాయి. ఉదాహరణకు, ‘జేమ్స్ వెబ్’ టెలిస్కోప్ భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో స్థిరంగా ఒక చోట ఉంటుంది. అంతరిక్షంలోని నిర్దిష్ట లక్ష్యాలను దగ్గరగా చూడటమే ఈ టెలిస్కోప్ ప్రధాన విధి. జేమ్స్ వెబ్ కన్నా ముందున్న ‘హబుల్ టెలిస్కోప్’ ప్రస్తుతం భూమికి 500 కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంది. 1995లో హబుల్ దాదాపు ఒక వారం పాటు ఛాయా చిత్రాల్ని ఒడిసిపట్టి ‘హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్గా’ ప్రస్తుతం ప్రసిద్ధిలో ఉన్న ఫొటోను తీసింది. విశ్వాంతరాళాల్లోని 3,000 కు పైగా గెలాక్సీలు ఆ ఫొటోలో పడ్డాయి. దానికి మించిందే తాజా రూబిన్ ప్రాజెక్ట్ కెమెరా. 40 చంద్రుళ్లు పట్టేస్తారురూబిన్ అబ్జర్వేటరీ, ఏప్రిల్లో తన మొదటి టెస్ట్ రన్ సమయంలో, కొన్ని గంటల్లోనే కోటి గెలాక్సీలను ఫొటో తీసింది. రూబిన్కు ఉన్న ప్రత్యేకత వల్లనే ఆ స్థాయిలో ఫొటో తీయటానికి సాధ్యమైంది. జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోపులు మాదిరిగా కాకుండా, ఆకాశంలోని చిన్న భాగాలను చూడగల రూబిన్ సిమోన్యీ ఒక సర్వే టెలిస్కోప్. అంటే ఇది నిర్దిష్ట వస్తువులను కాకుండా మొత్తం పెద్ద చిత్రాన్ని చూపిస్తుంది. ఇది తీసే చిత్రం 40 నిండు పున్నమిలకు సమానమైన ఆకాశం మొత్తాన్ని చుట్టేస్తుంది. అదే జేమ్స్ వెబ్కు ఉన్న కెమెరాలు పౌర్ణమి కంటే తక్కువ విస్తృతి కలిగిన ఆకాశ క్షేత్రానికి పరిమితం అవుతాయి. రూబిన్ నుండి తీసిన ఒక ఫొటో చాలా పెద్దదిగా ఉంటుంది. దానిని పూర్తి స్థాయిలో చూడటానికి 400 అల్ట్రా హెచ్.డి. టీవీ స్క్రీన్లు అవసరం అవుతాయి. ‘టైమ్–లాప్స్’ సాంకేతికతఆకాశంలోని అసాధారణ విశేషాలను కనిపెట్టేందుకు 10 ఏళ్ల కాలపరిమితి గల ‘లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్’ (ఎల్.ఎస్.ఎస్.టి.) అనే ఈ ప్రాజెక్టు రూబిన్ రూపొందించింది. ఇందులోని టెలిస్కోప్ 300 టన్నులకు పైగా బరువైన ఉక్కు, గాజుతో తయారైంది. కార్బన్ డైఆకైడ్తో ఒక తీరుగా శుభ్రం అవుతుంటుంది. రాబోయే దశాబ్ద కాలంలో ఈ టెలిస్కోప్, అందులోని భారీ ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా ప్రతి 3–4 రాత్రులకు దక్షిణార్ధ గోళ ఆకాశాన్ని ఫొటోలు తీస్తుంది. ఇది ఈ మహా విశ్వాన్ని మునుపెన్నడూ లేని విధంగా నిర్ణీత వ్యవధిల్లో ఫ్రేమ్ల క్రమాన్ని తీసుకునే ‘టైమ్–లాప్స్’ సాంకేతికతతో ఫొటో తీస్తుంది. ‘‘మేము ప్రతి 30 సెకన్లకు రాత్రిపూట ఆకాశాన్ని గమనిస్తుంటాము కాబట్టి ఒక్కొక్కటి 15 సెకన్ల రెండు వరుస చిత్రాలలో, దాని స్థానం లేదా ప్రకాశాన్ని మార్చుకున్న ఏ వస్తువునైనా మేము పట్టుకోగలం’’ అని రూబిన్ ఏడాది పాటు పని చేసిన క్షితిజ కేల్కర్ తెలిపారు. చిలీలోని సెర్రో పాచోన్ పర్వతంపై రూబిన్ అబ్జర్వేటరీ ఉంటుంది. దీని వల్ల– స్థానికంగా వాతావరణ పొరలోని వెచ్చని గాలుల్లో, పై నుంచి వచ్చే శీతల పవనాలు కలిసిపోయి, తద్వారా ఏర్పడే కల్లోల వాయువుల ప్రభావం అబ్జర్వేటరీ వరకు రాదు. దాంతో నత్రాలను స్పష్టంగా చూడొచ్చు. 800 మిలియన్ డాలర్ల ఖర్చుతో, 20 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న రూబిన్కు ప్రస్తుతం తుది తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా రూబిన్ పని అధికారికంగా ఆరంభం కావచ్చు. భూమిపై అతి పెద్ద కెమెరా అయిన ఎల్.ఎస్.ఎస్.టి మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని అణువణువున పట్టి బంధించబోతోంది.4 వేల కోట్లువచ్చే 10 ఏళ్ల నిర్దిష్ట కాలానికి రూబిన్ అబ్జర్వేటరీ కనిపెట్టనున్న అంతరిక్ష విశేషాలు. ఇంత భారీగా ఖగోళ సమాచారాన్ని ఇప్పటి వరకు రాబట్టింది లేదు రూబిన్ అబ్జర్వేటరీలో ‘సిమోన్యీ సర్వే టెలిస్కోప్’ లోపలి ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా5 అ. 5 అం.: ఎల్.ఎస్.ఎస్.టి. ఎత్తు3 : ఎల్.ఎస్.ఎస్.టి. కెమెరా లోపల ఉన్న లెన్సులు;5 అడుగులు : మూడు లెన్సులలో పెద్ద లెన్సు వ్యాసం40 కెమెరా దృష్టి క్షేత్రంలో పట్టే పూర్ణ చంద్రుళ్లు 3,200 రూబిన్ కెమెరా మెగా పిక్సెల్స్ 12–50 మామూలు కెమెరాల మెగా పిక్సెల్స్ రూబిన్ అబ్జర్వేటరీ ఒక రౌండుకు 20 లక్షలకు పైగా చిత్రాలను తీస్తుంది. ప్రతి రాత్రి 20 టెరాబైట్ల సమాచారాన్ని సంగ్రహిస్తుంది. అది 50 ఏళ్ల మొత్తం డిజిటల్ మ్యూజిక్కి, ఒక లక్ష హై రిజల్యూషన ఆర్ట్ వర్క్లకు, లేదా 70 లక్షల 70 వేల ఇ–బుక్లకు సమానం. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు) -
స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు
హైదరాబాద్కు చెందిన సునీత తన పన్నెండేళ్ల కొడుకుని కౌన్సెలింగ్ కోసం తీసుకువచ్చింది. కారణం స్మార్ట్ ఫోన్ అడిక్షన్. రోజుకు ఏడెనిమిది గంటలు ఫోన్లోనే గడిపేస్తున్నాడు. వద్దని ఫోన్ లాగేసుకుంటే తల్లిపైనే దాడి చేశాడు. పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించిన ఆమె కొడుకును కౌన్సెలింగ్కు తీసుకువచ్చింది. ఆరు వారాల కౌన్సెలింగ్ తర్వాత స్క్రీన్ టైమ్ ఏడు గంటల నుండి గంటన్నరకు తగ్గింది. ఇది సునీత ఒక్కరి సమస్య కాదు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే సమస్య. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, వీడియో గేమ్స్ పిల్లల జీవితంలో ఒక భాగమయ్యాయి. అవి లేకుండా గడపలేని పరిస్థితికి వచ్చారు. ఈ తరం విద్యార్థులు రోజుకు 6–8 గంటలు స్మార్ట్ఫోన్లోనే గడిపేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఇది ప్రమాదకర స్థాయి. దీనిపై స్పందించకపోతే మీ బిడ్డ జీవితాన్ని స్మార్ట్ఫోన్ లాగేసుకుంటుంది. అందుకే తల్లిదండ్రులు తక్షణమే స్పందించి స్క్రీన్ టైమ్ కంట్రోల్ చేయాలి, బౌండరీస్ ఏర్పాటు చేయాలి. హద్దులు ఏర్పరచడమెలా? 1. పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీరు టీవీ, ఫోన్ చూస్తూ కూర్చుంటే, వాళ్లు కూడా అదే చేస్తారు. అందుకే మీరో రోల్ మోడల్ అవ్వండి. ఫ్యామిలీ స్క్రీన్–ఫ్రీ టైమ్ డిక్లేర్ చేయండి. ఉదాహరణకు, డిన్నర్ టైమ్లో అన్ని డివైసెస్ ఆఫ్ చేయాలనేది అమలు చేయండి. 2. పిల్లల బ్రెయిన్ కంట్రోల్కు లొంగదు. కాని, వాళ్లను చర్చలో భాగం చేస్తే కంట్రోల్ చేసుకుంటారు. అందుకే వాళ్లతో కూర్చొని స్క్రీన్ టైమ్ కాంట్రాక్ట్ చేసుకోండి. ఉదాహరణకు, హోంవర్క్ పూర్తయ్యాక మాత్రమే 45 నిమిషాల ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వాడాలని అగ్రిమెంట్ చేసుకోవడం. 3. ఫోన్ తీసేసి ఖాళీగా వదిలేస్తే, ఆ ఖాళీ సమయం మళ్లీ మొబైల్ వైపు లాగేస్తుంది. అందుకే ఆ సమయాన్ని మ్యూజిక్, బోర్డ్ గేమ్స్, క్రాఫ్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్తో భర్తీ చేయాలి. ఇవి ‘న్యూరల్ రివార్డ్’ ఇస్తాయి.4. ఇంట్లో కొన్ని జీరో–స్క్రీన్ జోన్స్ క్రియేట్ చేయండి. ఉదాహరణకు, బెడ్రూమ్, డైనింగ్ హాల్, ఫ్యామిలీ హాల్లో ఫోన్ వాడకపోవడం. అలాగే ఫోన్ చార్జింగ్ బెడ్ రూమ్లో పెట్టవద్దు.5. ఫోన్ వాడొద్దని పిల్లలకు నేరుగా చెప్పినా, బలవంతంగా లాక్కున్నా రెబెల్ అవుతారు. దానికి బదులుగా ‘‘స్క్రీన్ వల్ల నీ ఫోకస్ తగ్గుతుంది, ఐక్యూ తగ్గుతుంది, నిద్ర దెబ్బతింటుంది’’ అని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పండి. కారణం అర్థం చేసుకున్న పిల్లలు కోఆపరేట్ చేస్తారు.సైన్స్ ఏమంటోంది?ప్రస్తుత ఏఐ యుగంలో మార్కుల కన్నా ఫోకస్, ఇమేజినేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గెలిపిస్తాయి. కాని, వీటిని స్క్రీన్ అడిక్షన్ దెబ్బతీస్తుంది. ఫోన్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ మెదడులో ఆనందాన్నిచ్చే డోపమైన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఆ తర్వాత సాధారణ పాఠాలు, ఫ్యామిలీ టైమ్ బోరింగ్గా అనిపిస్తాయి. రోజుకు ఆరు గంటలు మొబైల్ గేమ్స్ ఆడిన టీనేజర్ మెదడులో నిర్ణయాలు, ఫోకస్కు అవసరమైన గ్రే మేటర్ తగ్గినట్లు ఎంఆర్ఐ స్కాన్లు చూపించాయి. స్క్రీన్ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. దీనివల్ల నిద్ర దెబ్బతింటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.ఎంత సమయం చూడొచ్చు?రెండేళ్ల లోపు పిల్లలకు అస్సలు స్మార్ట్ఫోన్ ఇవ్వకూడదు. రెండు నుంచి ఐదేళ్ల వయసు పిల్లలకు రోజుకు గంట మించకూడదు. 6–12 ఏళ్ల పిల్లలకు రోజుకు రెండు గంటలు మించకూడదు. 13 ఏళ్లు పైబడిన వారు రెండు గంటలకు పైబడి వాడవచ్చు.స్క్రీన్ టైమ్ అతిగా ఉంటే... నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, సామాజిక భయం వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చు.కంటి సమస్యలు, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఏకాగ్రతలో ఇబ్బందులు, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టం కావడం వంటి అభివృద్ధిపరమైన సమస్యలు.తల్లిదండ్రులు చేసే తప్పులుపిల్లల ఫోన్ రహస్యంగా చెక్ చేయడం వల్ల పిల్లలు వారిపై నమ్మకం కోల్పోతారు. ఏడాదంతా మౌనంగా ఉండి పరీక్షల కాలంలో మాత్రమే నిబంధనలు పెట్టడం వల్ల ప్యాటర్న్ సెట్ కాదు.తల్లిదండ్రులు రోజంతా స్మార్ట్ ఫోన్ చూస్తూ పిల్లలను కంట్రోల్ చేయడం హిపోక్రసీ, దీనివల్ల పిల్లలు ఎదురు తిరుగుతారు. సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!) -
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
డయాబెటిస్ స్త్రీ పురుషుల మధ్యన తేడా ఇది!
యాభై ఏళ్లలోపు పురుషుల్లో టైప్–2 డయాబెటిస్ అనేది టైప్–1 కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. అదే మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్ అనేదే ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుందని తేలింది. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా పేషెంట్లపై స్వీడన్కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... కాస్తంత చిన్నవయసు పురుషుల్లో అంటే 50 ఏళ్లలోపు పురుషుల్లో టైప్–1 డయాబెటిస్ కంటే టైప్–2 డయాబెటిస్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది. ఉదాహరణకు టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న పురుషుల్లో 51 శాతానికి పైగా వ్యక్తుల్లో గుండెజబ్బుల (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ముప్పు ఉంటుంది. దాంతోపాటుగా హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె΄ోటు రిస్క్ కూడా వాళ్లలో రెట్టింపు ఉంటుంది. దీనికి కారణాలు ఆ వయసులో పురుషుల్లో ఊబకాయం, హైబీపీ జబ్బులతోపాటు వారి జీవనశైలి కాస్త అస్తవ్యవస్తంగా ఉండటంతో అది టైప్–2 డయాబెటిస్ తాలూకు దుష్ప్రభావాలను మరింతగా ప్రేరేపిస్తుంది. అయితే పురుషుల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పు క్రమంగా కాస్త తగ్గుతూ పోతుంది. అంటే వాళ్ల వయసు 60కి చేరేనాటికి వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో వచ్చే ముప్పు కంటే టైప్–2 డయాబెటిస్తో వచ్చే ముప్పులు కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక వాళ్ల వయసు 70కి చేరేనాటికి టైప్–1 డయాబెటిస్తో ఉన్నవారిలో వచ్చే గుండెపోట్ల కంటే టైప్–2 డయాబెటిస్తో ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు 26 శాతం తక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో ముప్పు ఎక్కువ. అందునా అది ఏ వయసువారిలోనైనా ఎక్కువే. ఇలా టైప్–1 డయాబెటిస్తో బాధపడే యువతులూ, మహిళల్లో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు టైప్–2 డయాబెటిస్తో బాధపడే మహిళల కంటే ఎక్కువే. అదే మహిళల వయసు 50 దాటాక... టైప్–1 డయాబెటిస్ బాధపడేవాళ్లతో పోలిస్తే టైప్ – 2 డయాబెటిస్తో బాధపడేవారిలో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు 25 నుంచి 47 శాతం తక్కువ. ఇక అన్ని రకాల గుండెజబ్బుల ముప్పులనూ పరిగణనలోకి తీసుకుంటే టైప్ –2 డయాబెటిస్తో బాధపడే మహిళల్లో గుండెజబ్బులతో మృతిచెందడానికి ఉన్న అవకాశాలు టైప్ – 1 మహిళల కంటే 19 శాతం తక్కువ. దీన్ని బట్టి తేలిసేదేమిటంటే... టైప్ –1 అలాగే టైప్ –2 డయాబెటిస్ల ముప్పులు ఇటు మహిళలూ, అటు పురుషుల్లో వేర్వేరు దుష్ప్రభావాలను చూపుతుంటాయని ఈ స్వీడిష్ అధ్యయనంలో వెల్లడైంది. (చదవండి: ఈ జబ్బులకు లింగ వివక్ష?) -
ఆశల బల్లకట్టు
ఓడించడానికి వరద వస్తుంది. మనిషిని ఓడగొట్టి చూద్దామని వరద వస్తుంది. వేయి చేతులతో లక్ష కాళ్లతో రాత్రికి రాత్రి... చీకటి దారిలో... దొంగదెబ్బ తీద్దామని వరద వస్తుంది. పగటి వేళ బందిపోటులా నీటితూటాల తుపాకీ పేలుస్తూ వరద వస్తుంది. అది ఇంటి పాదాల కిందుగా వస్తుంది. ఇంటి యజమాని తల మీదుగా వస్తుంది. చావిట్లోని ఎడ్ల కొమ్ముల మీద నుంచి, బరెగొడ్ల పొదుగుల మీద నుంచి, చంటి పిల్లల బెదురు ఏడుపుల మీద నుంచి, అమ్మ వెలిగించాల్సిన పొయ్యి మీద నుంచి, నాన్న జేబు మీద నుంచి భీతావహం చేస్తూ బీభత్సం సృష్టిస్తూ వస్తుంది. నేనెక్కువ అని ప్రకటించడానికి వస్తుంది. నెట్టుకుంటూ, తోసుకుంటూ, కూలగొడుతూ, పెళ్లగిస్తూ, కుళ్లగిస్తూ ప్రతాపం చూపించడానికి వస్తుంది.ఈ దెబ్బతో మనిషి సఫా– అనుకుంటుంది అది. విర్రవీగుతుంది అది. ఉధృతంగా నవ్వుతుంది అది. అప్పటికి మనిషి సిద్ధమైపోయి ఉంటాడు. సరే... కొన్నాళ్లు అని నిర్ణయం తీసుకుని ఉంటాడు. భార్యాబిడ్డలను ఒడ్డుకు బయల్దేరదీస్తూ ఉంటాడు. మిగిలిన నూకలను మూటగట్టుకుంటూ ఉంటాడు. గొడ్డూ గోదాను తీసుకెళ్లేందుకు బల్లకట్టును వెతుకుతూ ఉంటాడు. మధ్య మధ్య భార్యను కేకేసి ‘ఇంటి ముందుకు నీళ్ల పిశాచి వచ్చింది... దానిక్కాస్త చీపురు చూపించు’ అని పురమాయిస్తుంటాడు. ఎన్ని చూసి ఉంటాడతడు? తుఫాన్లు కొత్తా? కుంభవృష్టి కొత్తా? వడగండ్లు కొత్తా? వడగాడ్పులు కొత్తా? కరువు కొత్తా? బతుకు నెత్తిన పడేసే బరువు కొత్తా? రోగాలు.. రొష్టులు.. మహమ్మారులు.... పాలకుల నమ్మకద్రోహాలు... వ్యాపారుల నిలువు దోపిడీలు... డబ్బు రాజేసే పెను మంటలు... వరదకు భయపడతాడా? మనిషి ఆగడు. జీవితాన్ని ఆగనివ్వడు. ఆశను చావనివ్వడు. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. నాలుగు రోజులు ఉండి వెళ్లే అతిథికి తగిన మర్యాదలు చేసి పంపడం అతనికి వచ్చు. కష్టాలను మెల్లగా సాగనంపడం వచ్చు. వాటిని వదిలిపెట్టడం వదుల్చుకోవడం వచ్చు. అందుకు సాటి మనిషిని తోడు చేసుకోవడమూ వచ్చు. ఇది తెలియని వరద అతడిని జయించాలని చూసినప్పుడల్లా ఓడిపోయింది. మళ్లీ మళ్లీ ఓడిపోతూనే ఉంది. మహా అయితే సాధించగలిగేది కాసింత బురద జల్లి పోవడమే. మనిషి సాగించే అనంత జీవన ప్రయాణంలో వరదది లిప్తపాటు కలకలం. అతడు రేపో మర్నాడో మళ్లీ తన ఇల్లు చేరుతాడు. ఆరబెట్టిన వస్తువులు లోపల పెట్టుకుంటాడు. తల స్నానం చేసి, పొడి బట్టలు కట్టుకుని, భార్య వండిన వేడి వేడి భోజనాన్ని పిల్లలతో పాటు భుజిస్తూ ఆశను ఊత చేసి సాగిపోతూనే ఉంటాడు. -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు తగ్గింది..! అమూల్యమైన ఆ ఏడు పాఠాలివే..
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్స్టా పోస్ట్లో తెలిపింది. నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది. నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది. ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి. వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది. అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమాక. కాగా, నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!
పారాగ్లైడింగ్ చేయడమే ఓ సాహస కృత్యం అనుకుంటే..అలా గాల్లో తేలుతూ..మ్యూజిక్ ప్లే చేయాలనుకోవడం అలాంటి ఇలాంటి డేరింగ్ కాదనే చెప్పాలి. అస్సలు ఆ ఆలోచనే వెన్నులో వణుకుపుట్టించేస్తుంది. పారాగ్లైడింగ్తో ఒక్కసారిగా గాల్లోకి రాగానే ఎంతటి ధైర్యవంతులైనా..ఒక క్షణం పాటు భయకంపితులు అవ్వడం సాధారణం. అలాంటిది అలా చేస్తూ..లైవ్ మ్యూజిక్ ఇవ్వాలనే కోరిక అంటే..ఇదేం డేరింగ్ ఫీట్ రా బాబు అనిపిస్తుంది కదా..అలాంటి సాహసానికే తెరతేసింది ఇక్కడొక మహిళ..!. ఆమె ఎవరంటే..డీజే టీఆర్వైపీఎస్గా పిలిచే ఒక భారతీయ డీజే పారాగ్లైడింగ్ చేస్తూ..సంగీతం ప్లే చేసింది. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మ్యూజిక్ సరంజామా అంతా సురక్షితంగా ప్యాకే చేసుకుని ఎనిమిది వేల అడుగుల ఎత్తుకి వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. అక్కడ ఆమె లైవ్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తూ చూడొచ్చు. నైపుణ్యం కలిగిన పారాగ్లైడింగ్ ట్రైనర్ సైతం ఈ కొత్త అనుభవాన్ని ఉత్సాహంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. నిజం చెప్పాలంటే ఈ సాహస కృత్యంతో ప్రపంచంలోనే తొలి పారాగ్లైడింగ్ డీజే మహిళగా నిలిచింది. పారాగ్లైడింగ్ డీజే సెట్ను ఎలా రూపొందించారో కూడా వివరిస్తూ..అక్కడ అంత తీవ్రమైన గాలులు లేవని వెల్లడించిందామె. అయితే పరికరాలు కొంతసేపటికీ పనిచేయకపోవడంతో ఆ ప్రయత్నాన్ని వెంటనే నిలిపేయాల్సి వచ్చిందని వివరించారామె. ఈ వీడియోని చూసిన నెటిజన్లు..అంతర్జాతీయ అంతరిక్షంలో ప్లే చేసిన డీజేగా పేర్కొన్నారు. అంతేగాదు మహిళలు అనుమతి కోసం వేచి ఉండరు. చరిత్ర సృష్టించడమే వారి ధ్యేయం అని వ్యాఖ్యానిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by TRYPS (@tryps.music) (చదవండి: వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే..?) -
వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే..?
వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడడం సహజం. అయితే అందరికీ ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఒంటరి వృద్ధులు ఇతరుల మీద అంతగా ఆధారపడనవసరం లేకుండా 66 సంవత్సరాల మీనాక్షి మీనన్ టెక్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది.‘జెన్స్ లైఫ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లాట్ఫామ్ లాబ్ టెస్ట్ సర్వీసులు, ట్రావెల్, టాక్స్ ఫైలింగ్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ, సైబర్ సేఫ్టీ.. మొదలైన విషయాలలో వృద్ధులకు ఉపకరిస్తుంది. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా కన్సల్టింగ్లలో మీనాక్షికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అయిదు స్టార్టప్లకు యజమాని.‘పిల్లలను ఎలా పెంచాలి? అనే అంశంపై వందలాది పుస్తకాలు వచ్చాయి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే అంశంపై రాలేదు. ఈ నేపథ్యంలోనే వృద్ధులైన తల్లిదండ్రులకు సహాయపడే యాప్ రూపొందించాలనుకున్నాను’ అంటుంది మీనాక్షి మీనన్.(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
సెల్ఫ్ డిఫెన్స్ రూట్..! వింగ్ చున్ ఫైట్..
నగరంలో మహిళలపై వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. శక్తినంతా కూడదీసుకుని ప్రతిఘటించే యత్నాలు, అరుపులు.. వంటివి కొంత మేరే ఫలితాన్నిస్తాయి. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారినప్పుడు కొన్ని స్వీయరక్షణ మెళకువలు తప్పనిసరి. దీనిలో భాగమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం. అయితే కొన్ని మార్షల్ ఆర్ట్స్ మహిళలు సాధన చేయడం కూడా కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నా మహిళల చేత.. మహిళల కోసం పుట్టిన ఒకే యుద్ధకళ వింగ్ చున్ కుంగ్ ఫూ.. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన యుద్ధ కళ ‘వింగ్ చున్ కుంగ్ ఫూ’. ఈ యుద్ధ కళను ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్, నన్, మఠాధిపతి హోదాలో ఓ చైనీస్ మహిళ ప్రపంచంలో మొట్టమొదటి సారి సృష్టించారు. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి దీన్ని రూపుదిద్దారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే అందమైన భక్తురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఈ అమ్మాయి తనను వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. ఈ యుద్ధ కళే వింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాతి క్రమంలో యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ.. బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపీ మ్యాన్ దీన్ని తొలిసారి జనాల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వింగ్ చున్ను సాధన చేస్తున్నారు.ప్రస్తుతం దీనిని అత్యంత జనసామరథ్యం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. ఎక్కువ సమయం తీసుకునే ఇతర మార్షల్ ఆర్ట్స్తో పోలిస్తే దీనిని చాలా తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే పూర్తి పట్టు సాధించేందుకు రెండేళ్లు సరిపోతుంది. సింపుల్, డైరెక్ట్, ఎఫిషియంట్ ఆర్ట్ అయిన వింగ్ చున్ శక్తి కన్నా స్ట్రక్చర్ని, వేగం కన్నా టైమింగ్ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించనక్కర్లేదు. తద్వారా అసాధారణ ఫ్లెక్సిబిలిటీ గానీ క్రీడా నైపుణ్యంగానీ సాధకులకు అవసరం ఉండదు. స్వీయరక్షణ సామర్థ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జీఓ స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ (ఐడబ్ల్యూసీఏ)సూ్కల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్కి, ఎన్జీఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణెలలో నిర్వహిస్తున్నామని, త్వరలో నగరంలో కూడా తమ శిక్షణా కేంద్రం ప్రారంభించనున్నామని, తమ విద్యార్థులే నగరంలో దీనిని నిర్వహించనున్నారని అకాడమీ నిర్వాహకులు శివ్ తెలిపారు. కొంగలా.. సర్పంలా..ఇది ఒక సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకునేది కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికితీస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రతతో దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో ఉంటాయి. దీనికి ఎటువంటి ప్రత్యేకమైన దుస్తులు గాని, వస్త్రధారణగాని అవసరం లేదు. దీనిని మగవాళ్లు/ మహిళలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్.. వంటి ఇరుకైన ప్రదేశాల్లో సైతం సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా దీని ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. (చదవండి: 11 ఏళ్ల రైతు... పండిస్తోంది చూడు...) -
11 ఏళ్ల రైతు... పండిస్తోంది చూడు...
11 ఏళ్ల పాప ఏం చేస్తుంది? స్కూల్కెళ్లి, ఇంటికొచ్చి, హోం వర్క్ చేసుకుని, తోటి పిల్లలతో ఆడుకుంటుంది. లేదంటే టీవీ ముందు కూర్చుని రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తుంది. అయితే కేరళ రాష్ట్రం కన్నూర్కు చెందిన వైఘశ్రీ మాత్రం మొక్కలతో దోస్తీ కడుతోంది. రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా శెభాష్ అనిపించుకుంటోంది. అసలీ ఇష్టం ఎలా మొదలైంది? వైఘశ్రీ తండ్రి ఓ హోటల్ యజమాని. 2019లో ఆయనకు ఓ ప్రమాదం జరిగింది. ఆ నొప్పి నుంచి నుంచి కోలుకునే క్రమంలో మొక్కలను పెంచడం మేలు చేస్తుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చారు. దీంతో ఆయన తన ఇంటి పెరట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. ఆ సమయంలో వైఘశ్రీకి ఐదేళ్లు. తండ్రి చేసే శ్రద్ధగా గమనిస్తూ ఉండేది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేవరకు తండ్రికి తోటపనిలో సాయం చేస్తూ గడిపేది. ఆ తర్వాత తండ్రి సాయం లేకుండా తనే అన్నీ స్వయంగా చేయడం ప్రారంభించింది. తన ఆసక్తిని గమనించి తండ్రి ఆమెను మరింత ప్రోత్సహించాడు.మొక్కలు నాటడం, నీళ్లు నోయడంతోనే వైఘశ్రీ ఆగి΄ోలేదు. మొక్కల సంరక్షణ, విత్తనశుద్ధి, మేలు రకాలు పండించడం, సేంద్రియ ఎరువులు వంటి అంశాలు తెలుసుకునేందుకు అనేక యూట్యూబ్ వీడియోలను చూస్తుంది. ఆ నేలలో ఎలాంటి విత్తనాలు పనిచేస్తాయి, తెగుళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుంటుంది. తమకున్న 8 సెంట్ల స్థలంలో ప్రస్తుతం వైఘశ్రీ అన్ని రకాల కూరగాయలనూ పండిస్తోంది. వాటిని ఎక్కడా అమ్మదు. ఇంట్లోకి వాడగా మిగిలినవి తోటివారికి, అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేస్తుంది. తన పాఠశాలలో నడిచే మధ్యాహ్న భోజనానికి సైతం కూరగాయలను అందిస్తుంది. వైఘశ్రీ కృషికి గుర్తింపు పంచాయతీ అధికారులు రెండుసార్లు ‘కుట్టి కర్షక’ (చిన్నారి రైతు) పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. (చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!
మల్బరీ పండ్లు శాస్త్రీయంగా మోరస్ జాతికి చెందినవి, తీపి, పులుపు రుచుకలను కలిగి ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్, జామ్, వైన్ ఇతర ఆహార పదార్థాలలో కలిపి ఉపయోగించవచ్చు. మల్బరీ పండ్లను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మల్బరీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో మంటలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మల్బరీలోని రెస్వెరాట్రాల్ అనే ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది రక్త నాళాలను సడలించి రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తుంది, తద్వారా స్ట్రోక్స్, గుండె΄ోటు వంటి సమస్యలను నివారిస్తుంది.మల్బరీలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రక్షణను అందిస్తుంది.మల్బరీలోని విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం.మల్బరీ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది కంటి చూపును బలపరుస్తుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మల్బరీ జ్యూస్ శస్త్రచికిత్స తర్వాత రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. -
ఓ తాతా మనవరాలి కథ..!
ఆ అమ్మాయి వయస్సప్పుడు 13 ఏళ్లు. ప్రపంచమంటే ఎంతో ఇష్టం. గుస్తాద్ బోర్జర్జీ అహ్మదాబాద్లో నివసిస్తున్న ఓ వృద్ధుడు. టాటా ఇండస్ట్రీస్ ఒకప్పటి ఉద్యోగి. నా అనేవారు ఎవరూ లేని గుస్తాద్తో ఎందుకింత బంధం ఏర్పడిందో తెలీదు. ఇప్పుడు అమీషాకు గుస్తాద్ తాత. ఆమె అతని మనవరాలు. తల్లిదండ్రుల కన్నా మిన్నగా ప్రేమించి, లాలించిన గుస్తాద్ తాత ఇప్పుడు లేడు. కానీ ఆయన ప్రేమ మాత్రం అమీషా ఇంకా అనుభూతి చెందుతూనే ఉంది. అహ్మదాబాద్ కోర్టు నిర్ణయంతో ఇప్పుడా తాతా మనవరాలి కథ వెలుగులోకి వచ్చింది. గుస్తాద్ టాటా ఇండస్ట్రీస్లో పనిచేశాడు. ఆయనకు సంతానం లేదు. భార్య కూడా మరణించింది. వృద్ధాప్యాన్ని భారంగా, ఒంటరిగా గడుపుతున్న కాలంలో ఆయన దగ్గర ఎంతోకాలంగా పనిచేస్తున్న వంటతని మనవరాలు అమీషా ఒక వెలుగురేఖలా ప్రసరించి అంతులేని కాంతులను వెంట తీసుకొచ్చింది. ‘తాయి’ అని పిలుస్తూ ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ ఆయనకు దగ్గరైంది. క్రమంగా ఆయన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగమయ్యింది. ఇద్దరూ గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపేవారు. ఒకానొక సమయంలో ఆమెను దత్తత తీసుకోవాలని కూడా ఆనుకున్నాడు గుస్తాద్. కానీ అది ఆమెను తల్లిదండ్రులనుంచి దూరం చేస్తుందని, ఆమె గుర్తింపును మార్చేస్తుందని అనిపించి ఆ ఆలోచనను మానుకున్నాడు. కానీ అమీషా కోసం ఏదైనా చేయాలి. ఆమె తనకెంత ముఖ్యమో, ఆమె కోసం తానేం చేయగలడో ప్రేమపూర్వకంగా అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఆ ప్రకారమే తాను లేకున్నా తన ప్రేమ, అనురాగం ఆమెను జాగ్రత్తగా కాపాడాలని అమీషాతో బంగారు జ్ఞాపకాలకు నిలయమైన అహ్మదాబాద్, షాహిబాగ్లోని తన ఫ్లాట్ను ఆమె పేరున రాశాడు. ఆ సమయంలో అమీషా మైనర్ కాబట్టి తన మేనల్లుడికి ఇంటి బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు అమీషా ఒక ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. తాత గుస్తాద్ చివరి కోరికను అధికారికంగా నెరవేర్చేందుకు కోర్టును ఆశ్రయించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయాల్సిందిగా కోరింది. అయితే అదృష్టవశాత్తూ అలాంటివేమీ తలెత్తలేదు. గుస్తాద్ స్వంత సోదరుడు కూడా అమీషాకు ఆ ఇంటిని అప్పగించడానికి మనస్పూర్తి గా అంగీకరించారు. దీంతో ఈ నెల 2న కోర్టు అధికారికంగా ఫ్లాట్ను ఆమె పేర బదిలీ చేసింది. ఈ సందర్భంగా అమీషా గుస్తాద్తాతతో తన అనుబంధాన్ని మీడియాతో ఆనందంగా నెమరు వేసుకుంది. (చదవండి: మ్యారేజ్ గ్రాడ్యుయేషన్..! విడిపోయి కలిసి ఉండటం..) -
మ్యారేజ్ గ్రాడ్యుయేషన్.. ! విడిపోయి కలిసి ఉండటం..
సాంకేతికత నుంచి జీవనతత్వం దాకా ఎందులోనైనా ట్రెండ్ను క్రియేట్ చేయడంలో పేటెంట్ జపాన్దే! ఆ ధోరణి పెళ్లి బంధంలోనూ కనిపిస్తోంది. దాన్ని మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు. అదే జాపనీస్లో ‘సోసుకోన్’. సోసుగ్యోయు అంటే గ్రాడ్యుయేషన్.. కేకోన్ అంటే పెళ్లి.. ఈ రెండు పదాల కలయికే సోసుకోన్. మనసున మనసై బతుకున బతుకైన జీవన తోడు దొరకడం నిజంగానే భాగ్యం. ఆ భాగ్యం లేక΄ోతే సర్దుబాట్లతోనే సంసారం సాగుతుంది. ఆ సర్దుబాటూ కరవైతే విడాకులే! ఆ విడాకులూ ఊరికే మంజూరు కావు కదా.. ఆలుమగల గోల వినాలి.. సాక్ష్యాలు పరీక్షించాలి.. వాయిదాలు భరించాలి.. మానసిక క్షోభను అనుభవించాలి! ఇదంతా లేకుండా విడి΄ోయి కలిసి బతికే దారి ఉంటే బాగుండు అనిపిస్తుంది! అచ్చంగా అలాంటి పరిష్కార మార్గమే సోసుకోన్ ఆకా (ఏకేఏ ఆల్సో నోన్ యాజ్) మ్యారేజ్ గ్రాడ్యుయేషన్. కలహాల కాపురానికి చక్కటి సొల్యుషన్ అంటున్నాయి జపాన్ జంటలు.ఆ సొల్యుషన్ ఏంటంటే.. పెళ్లిని పునర్నిర్వచిస్తున్న ఈ ట్రెండ్ స్పర్ధలున్న భార్యాభర్తలు ఏ గొడవలేకుండా, విడాకుల ఊసెత్తకుండా పరస్పర గౌరవంతో ఎవరికివారే నచ్చినట్లు జీవించే వెసులుబాటును కల్పిస్తోంది. ఆ జంట ఇష్టపడితే విడి΄ోయి కూడా ఎవరిమానాన వారు ఒకే చూరు కింద కలిసి ఉండొచ్చు. ఇంటి పనుల దగ్గర్నుంచి వంట దాకా సపరేట్గా చేసుకుంటూ హౌజ్మేట్స్లా గడపొచ్చు లేదంటే వేరువేరుగా వేరు వేరు ఇళ్లల్లో ఉండొచ్చు.. నచ్చినప్పుడు, సమయం కుదిరినప్పుడు కాఫీ, లంచ్, డిన్నర్, మూవీ డేట్స్కి కలుసుకుంటూ! ఫ్రెండ్స్లా ఫోన్లో మాట్లాడుకోవచ్చు.. కెరీర్ నుంచి ఆస్తుల వ్యవహారాల దాకా ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. డబ్బు, సమయం వృథాకాని.. మానసిక బాధలేని ఈ పద్ధతి జపాన్లోని చాలా జంటలకు నచ్చి.. కలహాలతో కాపురం డిస్టర్బ్ అవుతుందనే అంచనాకు రాగానే వెంటనే మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ను అమలు చేస్తున్నారట. ఎప్పుడు మొదలైందంటే.. జపనీస్ ప్రఖ్యాత రచయిత యుమికో సుగియామా 2000 సంవత్సరంలో పెళ్లయిన జంటల మీద ఒక సర్వే నిర్వహించింది. విడాకులకు వెళ్లకుండా వైవాహిక జీవితంలోని కలతలను ఎలా పరిష్కరించుకుంటారని అడిగింది. అందులో సగానికి పైగా జంటలు అలాంటి అవకాశమే వస్తే.. సొసుకోన్ మెథడ్ను ఎంచుకుంటామని చెప్పారు. ఒకే ఇంట్లో ఉంటూ తమకు నచ్చినట్టు బతుకుతామని కొందరు, వేరువేరుగా ఉంటూ వీకెండ్ డేట్స్లో మీట్ అవుతామని మరికొందరు, ఫ్రెండ్స్లా కలిసి ఉండటానికి ఇష్టపడతామని ఇంకొందరు చెప్పారట. అలా రెండువేల సంవత్సరంలో ఆ సర్వే ద్వారా మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ ప్రచారంలోకి వచ్చి.. విడాకులకు ప్రత్యామ్నాయమైన ట్రెండ్గా స్థిరపడిపోయింది. హింస, వ్యథ లేని ఆ రిలేషన్షిప్ను నలభైల్లో ఉన్న జంటలు ఎక్కువగా ఇష్టపడతున్నాయని తర్వాత జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
పోషకాల బ్రేక్ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
‘వెర్టికల్ డ్రామా’ ట్రెండ్..!
మొబైల్ స్క్రీన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన షార్ట్–ఫామ్ వీడియో సిరీస్ వెర్టికల్ డ్రామా లేదా మైక్రోడ్రామా. ఆసియా దేశాలలో ‘వెర్టికల్ డ్రామా’ ట్రెండ్ ఊపందుకుంటోంది. వెర్టికల్ స్క్రీన్స్ కోసం డిజైన్ చేసిన స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ ఇది. వెర్టికల్ డ్రామా అనేది సంప్రదాయ సినిమా, టీవీ ఫార్మాట్ల కోసం డిజైన్ చేసింది కాదు. స్మార్ట్ఫోన్ల కోసం డిజైన్ చేసిన షార్ట్–ఫామ్, మొబైల్–ఫస్ట్ నేరేటివ్ కంటెంట్. ‘వెర్టికల్ డ్రామా’ మైక్రో–ఎపిసోడ్లు 1 నుంచి 5 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. క్షణాల వ్యవధిలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. వుయ్ టీవి, కుౖయెషూలాంటి ఫ్లాట్ఫామ్స్ వెరిక్టల్ స్టోరీ టెల్లింగ్కు సంబంధించి అధిక పెట్టుబడులు పెడుతున్నాయి.ప్రేక్షకులు వెర్టికల్ డ్రామాలను ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయానికి వస్తే... కన్వీనియెన్స్ అనేది మొదటిది. కాఫీ కోసం ఎదురు చూస్తూనో, కాఫీ తాగడం పూర్తయ్యేలోపు వెర్టికల్ డ్రామాలను చూడవచ్చు. చాలా తక్కువ నిడివి ఉండడం వల్ల ఒకేసారి ఎన్నో వీడియోలు చూడవచ్చు. వెరిక్టల్ డ్రామాలలోని క్యారెక్టర్లు రకరకాల భావోద్వేగాలతో ఉండడం వల్ల ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవుతారు.కొన్ని సర్వేల ప్రకారం ప్రేక్షకులు మొబైల్లో షార్ట్–ఫామ్ కంటెంట్ను చూడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌత్ కొరియాలో ‘ఏ–టీన్’ అనే వెర్టికల్ డ్రామా నెల వ్యవధిలో 6 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘వెర్టికల్ డ్రామా’ అనేది కేవలం సృజనాత్మకతకు సంబంధించినదే కాదు మంచి ఆదాయ వనరుగానూ మారింది. (చదవండి: బ్యాట్ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...) -
బ్యాట్ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...
ఈ వరుడు పల్లకీలో రాలేదు. పూలతో అలకరించిన కారులో రాలేదు. ఏకంగా... సూపర్ హీరో బ్యాట్మన్ వాహనం బ్యాట్మొబైల్పై వచ్చాడు. థాయ్లాండ్లో షూట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో వరుడు ఫెనిల్ బ్యాట్మొబైల్పై, వాహనానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు.వరుడి ఉత్సాహం మాట ఎలా ఉన్నా చాలామంది నెటిజనులు ‘వృథా ఖర్చు’ అని, ‘ఇలా డబ్బు వృథా చేసే బదులు మంచి పనులకు ఉపయోగించవచ్చు కదా’ అంటూ విమర్శలు కురిపించారు.కొందరు మాత్రం... ‘భారతీయ వరుడిని కూడా ఇలాంటి బ్యాట్మొబైల్పై చూడాలనుకుంటాం’ అని స్పందించారు.(చదవండి: టీనేజర్లకు థైరోకేర్ వ్యవస్థాపకుడి అమూల్యమైన సలహా..! అదే నిజమైన పేరెంటింగ్) -
టీనేజర్లకు థైరోకేర్ వ్యవస్థాపకుడి అమూల్యమైన సలహా..!
టీనేజ్ వయసులో అందరూ సుఖం వెంబడి పరుగులు తీస్తుంటారు. కానీ అవేమి మనకు లైవ్లో మంచిగా సెటిల్ అవ్వడానికి ఉపకరించవట. ఓ వ్యక్తి ఎదుగదలలో కీలక పాత్ర వహించేది పేదరికం, అసౌకర్యం. ఇవే ఎదుగుదలకు సోపానాలుగా మారతాయట. లేమి అనేది ప్రతి క్షణం తలంపుకు వచ్చి సంపాదన అనే ఆలోచన వైపుకి మళ్లీ,, లక్ష్యంపై ఫోకస్పెట్టేలా చేస్తుందట. అంతేగాదు సవాళ్లను స్వీకరించగలిగే సత్తాని అందిస్తుందట. అసౌకర్యం అన్నింటిని అలవోకగా నేర్పించినంతంగా విలాసవంతమైన జీవితం ఏమి నేర్పించలేదట. అందువల్లే పిల్లలను అతిగా ప్రేమించొద్దని సదా హెచ్చరిస్తుంటారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ వేలుమణి. ఇక్కడ యువత ప్రతి కష్టాన్ని ఎదిగేందుకు అవకాశంగా చూసే దృక్పథం అలవర్చుకుంటే..కష్టానికి భయపడటం అన్న మాటే ఉండదని అంటున్నారాయన. అదే తనకు పనిచేసిందని కూడా చెబుతున్నారు. తాను ఇవాళ రూ. 3 వేల కోట్ల సామ్రజ్యాన్ని సృష్టించగలిగానంటే ఆ పేదరికం, అసౌకర్యాలే వల్లనేనని అంటున్నారు వేలుమణి. అతిగారాబం, అతిప్రేమ ఎప్పటికీ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు తోడ్పడదని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు పేదరికంలోని లేమి అనే లోటు ఓర్పుని, ఒప్పించే నైపుణ్యాలను, పొదుపుని, క్రమశిక్షణ, స్పష్టత, ధైర్యం, వంటి ఆయుధాలను అందిస్తుందట. దాంతో ప్రతికూలతలు దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయట. అసౌకర్యాన్ని అసహనంగా చూడొద్దు..అది మన మనస్సుని అత్యంత దృడంగా మారుస్తుందనే విషయాన్ని గ్రహించండి. కటిక దారిద్ర్యం, ఎటువంటి సౌకర్యాలు లేకపోవడమే ఉన్నతికి, అభ్యున్నతికి పెట్టుబడులనే విషయం గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ వేలుమణి. చివరగా ఆయన నిజమైన పేరెంటింగ్ అంటే ప్రతి సవాలు నుంచి పిల్లలను రక్షించడం కాదని వక్కాణించారు. స్థితిస్థాపకత, క్రమశిక్షణ, స్వతంత్రంగా ఉండటం నేర్పించాలని చెబుతున్నారు. అలాగే తన తల్లి తనకు స్వేచ్ఛ తప్ప ఇంకేమి ఇవ్వలేదని కూడా చెప్పారు. నిజానికి వేలుమణి బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు వెయ్యి కోట్లకు పైనే అవుట్లెట్లను కలిగి ఉంది.Differentiate. You too can. Unlike the vast majority, if you enjoy poverty, challenges hardships and sufferings in teens it is an investment. At 20 you would have the power to enjoy every discomfort which brings in the essentials for sure success and prosperity. Essentials… pic.twitter.com/IJUJM2aP28— Dr. A. Velumani.PhD. (@velumania) August 12, 2025 (చదవండి: అమ్మను గౌరవించే తీరు ఇదే..! హ్యాట్సాప్ బ్రదర్) -
ఆరుపదులు దాటినా ఫిట్గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్లో కూడా యంగ్గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!) -
తొలి తెలుగు కాలిగ్రఫీ కళాకారుడు..!
అందమైన అక్షరాలకు.. పొందికైన రూపాన్నిచ్చే కళ కాలిగ్రఫీ.. సిరాకు సృజనాత్మకతను జోడించి అక్షరాలకు ప్రాణం పోసే అరుదైన కళ ఇది.. ఇది కేవలం చేతిరాత మాత్రమే కాదు.. తెలుగువాడి నాడిగా పరిగణించేది.. భావాన్ని, భావోద్వేగాన్ని కలగలిపి అక్షరరూపాన్నిచ్చే అందమైన.. అద్భుతమైన కళ. ఇదే కళను ఒంటబట్టించుకున్నాడు నగరానికి చెందిన నవకాంత్ కరిడే. ఒకటి కాదు.. రెండు కాదు.. తాను ఎంచుకున్న కళలో విశ్వ వేదికలపై సత్తా చాటుతూ.. తెలుగు భాష ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేస్తున్నాడు. కాలిగ్రఫీ కళ ఒకటుందని కూడా తెలియని వయసు. కానీ అతనికి ఆ కళ స్వతహాగా అబ్బింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో అతని రాత శైలి మిగతా వారి కంటే భిన్నంగా ఉండేది. అక్షరాకృతుల్లో ఏదో భావోద్వేగం కొట్టొచ్చినట్లు కనిపించేది. దీనిని చూసి తరగతి గదిలో సహచర విద్యార్థులు సైతం తమ పుస్తకాలపై నవకాంత్తో పేర్లు రాయించుకునేందుకు పోటీ పడేవారు. ఈ క్రమంలోనే ముంబయికి చెందిన ప్రముఖ కాలీగ్రాఫర్ అచ్యుత్ పలావ్ రాసిన ‘అక్షరాకృతి’ అనే పుస్తకం అతనికి తారసపడింది. అచ్చం అందులో తన రాత శైలినే పోలిన విషయాలు ఉండడం ఆశ్చర్యపరిచింది. అప్పుడతనికి అర్థమైంది.. తాను రాసేది కాలిగ్రఫీ అని. ఇంకేం.. దీని గురించి లోతుగా తెలుసుకోవాలని ఆ పుస్తకం రాసిన అచ్యుత పలావ్ను వెతుక్కుంటూ ముంబయి రైలు ఎక్కాడు. ఎట్టకేలకు ఆయనను కలుసుకోవడమే కాదు.. ఆ కళలో శిక్షణ పొంది మరింత మెరుగులు దిద్దుకున్నాడు. అక్కడి నుంచి ఆ కళనే ఊపిరిగా చేసుకున్నాడు. తెలుగు భాషలో మొట్టమొదటి కాలిగ్రఫీ కళాకారుడిగా నిలిచాడు. కంప్యూటర్ యుగంలోనూ.. సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కినా.. మనిషి మస్తిష్కపు ఆలోచనల ముందు దిగదుడుపేనని ఆయన కళా నైపుణ్యం చూస్తే అవగతమవుతుంది. కంప్యూటర్ యుగంలో ఎన్ని తెలుగు లిపిలో ఎన్ని శైలి రకాలు ఉన్నా.. ఆయన శైలి వేరు. అందుకే సినిమా వాళ్లు ఏరికోరి నవకాంత్తో అక్షరాలను డిజైన్ చేయించుకుంటారు. అలా అనేక సినిమాలకు టైటిల్స్ డిజైన్స్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయి, కేరళ, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన కళను ప్రదర్శించి తెలుగు అక్షరాల వైభవాన్ని చాటారు. అనేక వర్క్షాపులను నిర్వహించారు. కాలిగ్రఫీ కళకు కాదేదీ అనర్హం.. పలువురు ఔత్సాహికుల కోసం.. అక్షరాలతో కూడిన గిఫ్ట్స్ రూపొందించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తన స్వహస్తాలతో కాలిగ్రఫీ చేసిన పాకెట్ నోట్ బుక్స్, బ్యాడ్జ్, కీ చైన్స్, కప్పు, సాసర్.. పలు రకాల వస్తువులపై తెలుగు కీర్తిని ఇనుమడింపజేస్తూ.. తెలుగుకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. మాతృభాషాభివృద్ధికి కృషి.. ఈ కళ ద్వారా దేశ, విదేశాల్లో మాతృ భాషకు తగిన గుర్తింపు తీసుకురావడం, ఈ కళను నలుగురికీ పరిచయం చేయడమే నా లక్ష్యం. ఇప్పటికే పలువురు ఈ కళను నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. అయితే పూర్తి ధ్యాస లేకపోవడంతో రాణించలేకపోతున్నారు. ఈ కళను నలుగురికీ పంచి మాతృభాషాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. – నవకాంత్, కాలిగ్రఫీ కళాకారుడు (చదవండి: అద్భుతం అధ్యాపక 'చిత్రం'..!) -
అద్భుతం అధ్యాపక 'చిత్రం'..!
వారంతా అధ్యాపక వృత్తిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు.. అందరిలా కేవలం ఉద్యోగానికే పరిమితమైపోవాలని అనుకోలేదు.. ఎప్పుడూ విధులతో, కుటుంబ బాధ్యతలతో తలమునకలై పోకుండా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. తమలోని ప్రత్యేకతను సమాజానికి చాటి చెప్పాలనుకున్నారు.. అదే తలంపుతో తమలో దాగివున్న నైపుణ్యానికి పదును పెట్టారు.. కఠోరమైన దీక్షతో, అంకితభావంతో కళకు పదునుపెట్టి క్రియేటివిటీతో వివిధ పద్ధతుల్లో చిత్రాలను రూపొందించారు. వీటిని మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ‘మేనేజ్ చేద్దాం’ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. 10 మంది చిత్రకళాకారులు వివిధ ఆర్ట్ కళాశాలల్లో విద్యను పూర్తి చేసుకుని, ఇంటర్నేషనల్ పాఠశాలలో, కళాశాలల్లో ఆర్ట్ అధ్యాపకులుగా విధలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉద్యోగానికి, కుటుంబానికే పరిమితం కాకుండా ఒక్కొక్కరూ ఒక్కో శైలిలో చిత్రాలను, స్కల్ప్చర్స్ తయారుచేసి ప్రదర్శిస్తున్నారు. ఆర్ట్ రంగంపై ఉద్యోగాల్లో స్థిరపడినవారు పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నారు. సమయం లేకపోవడం, ఉద్యోగ రిత్యా తమలోని సృజనాత్మకతను వెలికితీయలేకపోతున్నారని ఆరిస్ట్ సంతోష్ కొటగిరి తెలిపారు. ఆర్ట్ రంగంలో రాణించగలిగితే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రకృతితో మమేకమై చిత్రాలను వేయాలన్నారు. చిత్ర రంగంలో రాణించాలంటే ఆసక్తి, పట్టుదల, వేసే ప్రతి చిత్రంలో సృజనాత్మకత ఉండాలన్నారు. కళాకారులు గౌతమ్ వావిలాల, హరితరన్ షిండే, జయప్రకాశ్ వావిలాల, ఎంజీ పాషా, బెల్లం రాజారావు, రామకృష్ణ కొంగల, సంతోష్ కోటగిరి, శేఖర్పాండే, శ్రీనివాస్ టింగిర్కర్, వాసుదేవరావు నడిమింటి వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్, ఇన్స్టాలేషన్స్ ప్రదర్శిస్తున్నారు. చిన్నారులను ప్రోత్సహించాలి.. ఉద్యోగానికే ఎందుకు పరిమితం కావాలి. మనం నేర్చుకున్న, ఎంచుకున్న రంగంలో మరింత సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఉద్యోగం చేస్తూ కొంత సమయాన్ని కేటాయించి అనుకున్న విధంగా చిత్రాలను గీసి ప్రదర్శించాలనుకున్నాము. అంతర్జాతీయ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ రంగంలో రాణించాలంటే ఆసక్తి, పట్టుదల ఉండాలి. – శ్రీనివాస్ టింగిర్కర్, ఆరి్టస్ట్–అధ్యాపకుడు ట్రావెల్ షో చేయాలని ఉంది.. ఆర్ట్ రంగాన్ని తాత్కాలికంగా నేర్చుకుంటే ప్రయోజనం లేదు. సరదాగా నేర్చుకోవడం వేరు. ఆసక్తి ఉండడం వేరు. ఇందులో గుర్తింపు పొందాలంటే పూర్తి స్థాయిలో నేర్చుకుని సందేశాత్మక చిత్రాలను వేయాలి. నేను ఆయిల్ పెయింటింగ్ చేస్తాను. వేసే ప్రతి చిత్రంలోనూ ఎదో ఒక సందేశం ఉండాలి. కళాకారుడికి మధిలోని భావాలను ప్రదర్శించే శక్తి ఉంటుంది. పూర్వకాలంలో వేసిన చిత్రాల ఆధారంగా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. గ్రుప్ షోలో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబయి తదితర ప్రాంతాల్లో ట్రావెలింగ్ షో చేద్దామనుకుంటున్నా. – సంతోష్ కోటగిరి, ఆర్టిస్ట్–అధ్యాపకుడు. -
కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!
వర్షాకాలంలో మనసు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. వెచ్చని నీడతో పాటు వేడి వేడి పానీయాలను కూడా ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఈ సీజన్కు అనుగుణంగా నగరవాసులను ఆకట్టుకునే క్రమంలో.. మాన్సూన్ కోసం నగర కేఫ్స్లో కొత్త అందాలను.. వాటి మెనూతో సరికొత్త రుచులను సంతరించుకుంటాయి. ముసురు పట్టిన వాతావరణంలో ముచ్చటైన వేడి వేడి రుచులను ఆస్వాదించే సిటిజనుల్లో ఎవరి రూటు వారికే సపరేట్.. అలా వెచ్చదనాన్ని అందించే పానీయాల్లో కొన్నింటి గురించి.. వర్షాకాలంలో మరీ ముఖ్యంగా ఆస్వాదించే ఒక ముఖ్యమైన పానీయం చాయ్/ కాఫీ. ముసురు పట్టిందంటే చాలు ఈ దుకాణాలు జనంతో కిటకిటలాడిపోతాయి. వీటిని బంకమట్టితో తయారైన సంప్రదాయ పాత్రలైన కప్పులో అందిస్తారు. అలాగే అల్లం టీ (అద్రాక్ చాయ్) కూడా రుతుపవనాల సీజన్కు రుచికరమైన ఎంపిక. చాయ్తో మరిగించిన తురిమిన తాజా అల్లం అలరిస్తుంది. బంజారాహిల్స్లోని రోస్టరీ కాఫీ హౌస్ వీటికి పేరొందింది. అలాగే బంజారాహిల్స్లోనే ఉన్న రోస్ట్ సీసీఎక్స్లో అమెరికానో కూడా చాలా మంది ఫేవరెట్. జూబ్లీ హిల్స్ కేఫ్ వంటి కేఫ్స్లో డార్క్ చాక్లెట్తో తయారు చేసిన ఇటాలియన్ హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్లో పలువురి ఎంపిక. దీనిని కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు.. ఒక ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు దీని అభిమానులు. ఫిలింనగర్లోని ఆరోమలె కేరళ థీమ్తో రూపొందిన కేఫ్. మాన్సూన్లో అతిథుల కోసం తడవకుండా చినుకుల్ని ఆస్వాదించే స్పెషల్ సీటింగ్ దీని ప్రత్యేకత. ఈ కేఫ్ అందించే క్యాన్ బెర్రీ బ్రూ టీనీ, బ్రౌనీ హాట్ చాక్లెట్ వంటి పానీయాలు కూడా హాట్ లవర్స్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో ఉన్న టైగర్ లిల్లీ కేఫ్ అండ్ బిస్ట్రోలో మిక్స్డ్ బెర్రీ మచ్చా పలువురి ప్రత్యేక ఎంపిక. బంజారాహిల్స్, కార్ఖానాల్లో ఉన్న మనం చాక్లెట్.. బ్రౌనీ హాట్ చాక్లెట్ రుచులకు నగరవాసులు, మరీ ముఖ్యంగా యువత ఫిదా అవుతున్నారు. సూప్లు, సుగంధ ద్రవ్యాలు.. ఇదే విధంగా సూప్లు, టీలతో సహా వేడి లేదా గోరువెచ్చని ద్రవ పదార్థాలు వర్షాకాలంలో ఊరటనిస్తాయి. వెచ్చగా ఉండటానికి మాత్రమే కాక జీర్ణక్రియకు సైతం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సీజన్లో పానీయాల్లో అల్లం, పసుపు, తులసి వంటి సుగంధ ద్రవ్యాలను జోడించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందనీ, రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన పానీయాలను కోరుకునే వారు కథా లాంటి హెర్బల్ ‘టీ’ల ను ఎంచుకుంటున్నారు. ఈ కథా అనేది ఒక సంప్రదాయ భారతీయ పానీయం. దీనిని చాయ్ లేదా ‘టీ’గా తీసుకుంటారు. దగ్గు, జలుబు సీజనల్ ఫ్లూ వైరస్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ కథా.. సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, గొంతు నొప్పికి ఉత్తమ నివారణగా ఎంచుకుంటారు. ఇది పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. పలు రకాల రుచులు, థీమ్లు..జూబ్లీహిల్స్లోని కేఫ్ ఉకుసా పెప్పర్ మింట్ హాట్ టాడీ పేరిట అందించే మాన్సూన్ స్పెషల్స్కు సైతం అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. బేగంపేట్లో ఉన్న ఫన్నెల్ హిల్లో హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్లో నగర యువతను ఆకట్టుకుంటోంది. నీలోఫర్, పిస్తా హౌజ్లతో పాటు ఓల్డ్ సిటీలోని ఘాన్సీ బజార్లో ఉన్న నిమ్రా కేఫ్ వంటి ప్రదేశాలు, ఇరానీ చాయ్కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. జూబ్లీ హిల్స్లోని చాయ్ పానీ వేడి పానీయాలు స్నాక్స్ కాంబోకు ప్రసిద్ధి చెందింది. క్రిస్పీ సమోసాలు, పకోడాలు, వడా పావ్లతో పాటు వెరైటీ రుచుల టీలతో ఇక్కడ గెస్ట్స్ మాన్సూన్ను ఆస్వాదిస్తారు. బంజారాహిల్స్లో చాలా మందికి కల్చరల్ స్పేస్గానే పరిచయమున్న లామకాన్.. సమోసా వంటి స్నాక్స్కు మాత్రమే కాదు కడక్ చాయ్ వంటి ప్రత్యేక వెరై‘టీ’లకు పేరొందింది. చాయ్ పకోడాకు బదులు హాట్ చాక్లెట్ క్రోయిసెంట్లను ఎంచుకునే వారు జూబ్లీహిల్స్లోని ఫోన్స్ చాక్లెట్ను సందర్శిస్తున్నారు. ఇటాలియన్ క్లాసిక్ హాట్ చాక్లెట్తో ఈ సీజన్కు ఫేమస్ అయ్యింది. (చదవండి: అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!) -
టైమ్లెస్ క్లాసిక్
నిరాడంబరతను చాటుకోవాలన్నా ... విలాసవంతంగా కనిపించాలన్నా క్లాసీ లుక్తో ఆకట్టుకోవాలన్నా... ఎలాగైనా... ఏ వయసు అయినా ప్రతి సందర్భానికి అతికినట్టుగా ఆహార్యాన్ని అద్భుతంగా చూపుతుంది ఐవరీ కలర్. ఇటీవల భారతీయ ఫ్యాషన్ రంగంలో పేస్టల్ కలర్స్ అగ్రస్థానంలో ఉండగా వాటిలో ఐవరీ ఎప్పుడూ ఒక విలక్షణమైన స్థానంలోనే ఉండి ప్రతి మదిలోనూ రాయల్ లుక్గా కొలువుదీరుతోంది.ఐవరీకి లేస్ అల్లికలు తోడైతే విరిసిన కలువ పూల అందం గుర్తుకు వస్తుంది. ప్రింట్లు తోడైతే ఆధునిక హస్తకళల అద్భుతం కళ్లముందు నిలుస్తుంది. వెల్వెట్, కాటన్లోనే కాదు కంచిపట్టులోనూ ఐవరీ కలర్ రిచ్నెస్ను కళ్లకు కడుతుంది. ఐవరీ కాటన్ డ్రెస్కి లేయర్లు జత కలిసిన ఫ్రాక్ లేదా లెహంగా డిజైన్స్ ఎప్పటికీ ట్రెండ్లో ఉంటాయి.రాయల్ లుక్ తో అట్రాక్ట్ చేయడమే ఐవరీ సహజ లక్షణం. అందుకే, వివాహ వేడుకలలో ఐవరీ కలర్ డ్రెస్సులు ఆహూతుల మదిలో చెరిగి΄ోని ముద్రను వేస్తాయి. రన్ వే నుంచి రెడ్ కార్పెట్ సందడి వరకు, వివాహాల నుంచి పండగ కార్యక్రమాల వరకు, సామాన్యుల నుంచి సెలిబ్రిటీల వరకు ఐవరీని అందంగా ధరించడం చూస్తుంటాం. లేత రంగుతో ఉండే ఈ ఔట్ఫిట్స్ను ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. అయితే, ఈ రంగుపై ఏదీ అతిగా ఉండకూడదు. అది హెవీ ఎంబ్రాయిడరీ లేదా డిజిటల్ ప్రింట్లు, లేయర్లు, ఇతర ఫ్యాబ్రిక్స్.. కాంట్రాస్ట్ అయినా సరే...స్టైలిష్ గౌన్లు, ఇండో వెస్ట్రన్ గౌన్లు, లెహెంగాలు, చీరలు, అనార్కలీలు.. ఏ డ్రెస్ అయినా ఐవరీ కలర్ చాలా అందంగా కనిపిస్తుంది.క్లాసిక్ ఐవరీలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. స్కిన్టోన్ ఆధారంగా తగిన షేడ్ను ఎంచుకోవడం ముఖ్యం. సరైన షేడ్తోపాటు ఐవరీ షేడెడ్ దుస్తులలో సరైన స్టైల్ను ప్రదర్శించడం కూడా ముఖ్యం. ఆధునికతనూ, చక్కదనాన్ని తెలియజేసే సామర్థ్యం ఐవరీకి ఉండటం వల్ల ఫ్యాషన్లో ట్రెండింగ్ రంగుగా కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్లలో మోనోక్రోమ్ దుస్తులు, టైలర్డ్ ట్రౌజర్లు, సిల్క్ సెపరేట్లు, రిఫైన్డ్ ఔటర్వేర్, రకరకాల థీమ్లతో సహా వివిధ రూపాల్లో ఐవరీ ఉంది.ఐవరీని ఎలా ధరించాలంటే...వైడ్–లెగ్ ఐవరీ ప్యాంటు, రిబ్డ్ టర్టిల్ నెక్తో ట్రెంచ్ కోట్ వంటి ఐవరీ పీసెస్ జత చేయడం ద్వారా మోడర్న్ రూపాన్ని సృష్టించవచ్చు.రిచ్ లుక్ కోసం లేస్–ట్రిమ్డ్ స్లిప్ స్కర్ట్తో జత చేసిన ఐవరీ సిల్క్టాప్తో డ్రెస్ను ఎలివేట్ చేయచ్చు.జీన్స్లేదా ట్రౌజర్లకు ఐవరీ టాప్స్ను ధరించవచ్చు. క్లాసిక్, చిక్ లుక్ కోసం బ్లాక్ ΄్లాట్స్ని ధరించవచ్చు. ఫార్మల్, ఈవెనింగ్ వేర్గా ఐవరీ–రంగు గౌన్లు, అనార్కలీ సూట్లను ఎంచుకోవచ్చు.వెడ్డింగ్ కలర్వధూవరుల దుస్తులకు ఐవరీ సరైన ఎంపికగా ఎప్పుడూ ముందుంటుంది. వధువు లెహంగా లేదా చీర, వరుడి ధోతి– కుర్తా ... వంటి దుస్తులు వివాహ వేడుకలో వారి బంధంలోని స్వచ్ఛతను సూచిస్తుంది. -
కష్టాలనూ ఆడేసుకున్నారు
‘మాది పేదకుటుంబం అయినా, నా దగ్గర విలువైన సంపద ఉంది’ అంటూ ఉండేది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఓపీ జైషా. ‘ఆ సంపద ఏమిటి?’ అని అవతలి వ్యక్తి అడిగే లోపే... ‘కష్టం, పట్టుదల’ అని చెప్పేది జైషా. జైషా మాత్రమే కాదు...పేదరికంలో పుట్టి పెరిగిన ఎంతోమంది అమ్మాయిలు ‘కష్టం, పట్టుదల’ అనే విలువైన సంపదతో పేదరిక కష్టాలను అధిగమించారు. హాకీ నుంచి ఆర్చరీ వరకు ఎన్నో క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు పతాకాలు ఎగరేశారు.ఆకలి తట్టుకోలేక మట్టితిన్న అమ్మాయిఓపీ జైషా అయిదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చని పోయాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆకలి తట్టుకోలేక జైషా మట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయి. పొద్దుటే లేచి కిలోమీటర్ల కొద్దీ దూరాలు నడిచిపాలు అమ్మేది. ‘రేపు భోజనం ఎలా?’ అనేది జైషా కుటుంబం ముందు ఉన్న ప్రధాన సవాలు. అయినప్పటికీ ఆటలపై తన ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. కేరళకు చెందిన జైషా ప్రఖ్యాత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. మారథాన్లో నేషనల్ రికార్డ్ హోల్డర్. ‘అవకాశాలు, అదృష్టాలు అనేవి ఎక్కడి నుంచో రావు. మన కష్టంలో నుంచే వస్తాయి’ అంటుంది జైషా.గురి తప్పని లక్ష్యంరాంచీలో పుట్టి పెరిగిన దీపిక కుమారి తండ్రి ఆటోడ్రైవర్. చిన్నప్పుడు చెట్టు పైనున్న మామిడి కాయలను గురి తప్పకుండా కొట్టేది. గురితప్పని ఆ ఉత్సాహమే దీపికను ఆర్చరీ వైపు అడుగులు వేసేలా చేసింది. ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన దీపిక కుమారికి రోజుకు మూడు పూటలా భోజనం దొరికేది. పేదరికం నేపథ్యం నుంచి వచ్చిన దీపికకు అదే లగ్జరీగా అనిపించేది.కష్టాల్లో సైతం వెరవని ధైర్యం, అంకితభావంతో ఎన్నో విజయాలు సాధించింది దీపిక. కామన్వెల్త్ గేమ్స్ (2010)లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ‘కొన్ని సంవత్సరాల క్రితం చాలామందికి ఆర్చరీ అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా ఆర్చరీ గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆర్చరీపై ఆసక్తి కలగడానికి మీరే స్ఫూర్తి అని పిల్లలు చెబుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది’ అంటుంది దీపిక కుమారి.పరుగు ఆపొద్దు‘ఐ బికమ్ ఏ రన్నర్’ పేరుతో పుస్తకం రాసింది సొహినీ ఛటో పాధ్యాయ. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది మంది ప్రసిద్ధ ఉమెన్ రన్నర్ల స్ఫూర్తిదాయక జీవిత కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 1952 ఒలింపిక్స్లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన మేరీ డిసౌజా, బ్యాంకాక్ అసియన్ గేమ్స్(1970)లో బంగారు పతకం గెలుచుకున్న కమల్జిత్ సందు, పీటి ఉషా, శాంతి సౌందర్యరాజన్, పింకీ ప్రమానిక్, దూతీ చంద్లాంటి క్రీడకారుల జీవితవిశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.ఈ విజేతలకు క్రీడా ప్రయాణం అనేది నల్లేరు మీద నడక కాలేదు. ‘ఆర్థిక కష్టాలు’ కొందరికీ, ‘అమ్మాయిలకు ఆటలెందుకు!’ అనే ఈసడింపులు మరికొందరికీ... ఇలా రకరకాల సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వారు పరుగు ఆపలేదు. ఆటలకు పేదరికాన్ని దూరం చేసే శక్తి ఉందనే విషయాన్ని కూడా ఈ పుస్తకం ద్వారా చాటిచెప్పింది సోహిని. ‘పేదరికం నుంచి బయటపడడానికి ఆటలు నాకు ఉపకరించాయి’ అంటుంది ఒలింపియన్ లలిత బాబర్.మైదాన ఆటలే మేలుపిల్లల ప్రపంచానికి ఆన్లైన్ ఆటలు దగ్గరయ్యాయి. మైదాన ఆటలు దూరం అయ్యాయి. ఆన్లైన్ ఆటలతో పోల్చితే మైదానాల్లో ఆడే ఆటల వల్ల పిల్లలకు అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. మైదాన క్రీడలు పిల్లలకు వ్యాయామంలా పనిచేస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. నలుగురిలో త్వరగా కలిసి పోయే స్వభావాన్ని పెంచుతాయి. కుంగుబాటును దూరం పెట్టి చురుగ్గా ఉండేలా చేస్తాయి. శరీరంపై నియంత్రణ ఉండేలా చేస్తాయి.ఆకలి రోజుల నుంచి టోక్యో వరకురోజుకు రెండు పూటలా కడుపు నిండా తింటే, ఆ కుటుంబానికి ఆరోజు ఘనమైన రోజులా ఉండేది. అలాంటి కడు పేద కుటుంబంలో పుట్టిన భావనా జాట్ ఆర్థిక కష్టాలను అధిగమించి ‘రేస్ వాకర్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. టోక్యో 2020 ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా రేస్ వాకర్గా చరిత్ర సృష్టించింది. రాజస్థాన్లోని కబ్రా అనే చిన్న గ్రామానికి చెందిన భావనా జాట్ పేదరికపు సమస్యలకు ఎప్పుడూ భయపడలేదు. కలలకు తెరవేయలేదు.విరిగి పోయిన హాకీ స్టిక్తో...ఆసియన్ గేమ్స్ (2018) మహిళల హాకీ జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వహించిన రాణి రాం పాల్ పేదింటి బిడ్డ. హరియాణకు చెందిన రాణి ఇల్లు ఎండొచ్చినా, వానొచ్చినా సమస్యే అన్నట్లుగా ఉండేది. విద్యుత్ సదు పాయం ఉండేది కాదు. దోమలు వీరవిహారం చేసేవి. రాణికి హాకీపై ఆసక్తి చిన్నప్పటి నుంచే మొదలైంది. తన ఇంటికి సమీపంలోని హాకీ అకాడమీలో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గంటల తరబడి చూస్తుండేది. ఎక్కడో దొరికిన విరిగి పోయిన హాకీ స్టిక్తో వారిని అనుకరిస్తూ ఉండేది.‘నాకు హాకీలో శిక్షణ ఇవ్వండి’ అని హాకీ అకాడమీ వారిని అడిగితే తిరస్కరించారు. ‘ఆ సమయంలోనే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను’ అంటున్న రాణి తన కలను నిజం చేసుకుంది. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది.వెక్కిరింపులు ఎదురైనా...మణిపుర్లోని పేద కుటుంబంలో పుట్టిన బింద్యారాణిదేవికి చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం. ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వెయిట్లిఫ్టింగ్ను ఎంపిక చేసుకుంది. అంతకుముందు తైక్వాండో సాధన చేసేది. ‘ఎందుకు తల్లీ ఈ కష్టాలు, బరువులు ఎత్తడాలు....’ అనేవాళ్లు చుట్టుపక్కల వాళ్లు. ఎవరి మాట ఎలా ఉన్నా తనకు మాత్రం పెద్ద కలలు ఉండేవి.‘మహా అంటే జిల్లా స్థాయి వరకు వెళ్లగలవు’ అనే వెక్కిరింపుల మాట ఎలా ఉన్నా జిల్లా స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది రాణిదేవి. థాయ్లాండ్లో జరిగిన ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్(2024)లో కాంస్య పతకం గెలుచుకుంది. ఐడబ్ల్యూఎఫ్ వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ కప్లో మహిళల 55 కేజీ ఈవెంట్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ‘ప్రతికూల మాటలు ఎన్ని వినబడినా లక్ష్యసాధనలో దృఢంగా ఉండాలి’ అంటుంది బింద్యారాణి దేవి. -
స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్నెస్పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..ఫిట్నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారిపోతుందని తానే ఆమెను జిమ్కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.అద్భుతమైన పరివర్తన..దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె. అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా. ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట. View this post on Instagram A post shared by Kulwinder Singh (@freebird.sodhi)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్కి..) -
అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!
పారిశ్రామిక దిగ్గజం అనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిని కలిగించే వీడియోలు, పోస్టులను నెట్టింట్ షేర్ చేస్తుంటారు. అలానే ఈసారి శక్తిమంతమైన వైరల్ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఉత్సాహం ఉరకలు వేసేలా కథన రంగంలోకి దిగడానికి.. ఆమెనే ప్రేరణ అంటూ నెట్టింట ఆమెకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. గతంలో ఆమెకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. తాజాగా ఆమె ప్రస్థానం మరింతకు ముందుకు సాగిన వైనాన్ని తెలుపుతూ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు జీవితాన్ని ఆస్వాదించడం పట్ల ఆమెకున్న ఆసక్తిని, తపనని ప్రశంసించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..72 ఏళ్ల భారతీయ మహిళ మణి అమ్మ సాంప్రదాయ చీరలో దుబాయ్లో విలాసవంతమైన రోల్స్ రాయిస్ నడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈమె ఆత్మవిశ్వాసం, ప్రశాంతతకు నిలువెత్తు దర్శనం. "డ్రైవర్ అమ్మ"గా పిలిచే ఈ మణి అమ్మ సుమారు 11 రకాల వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్లను కలిగి ఉంది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ని నడుపుతోంది. ఆమె కార్లు, ట్రక్కులు, ఫోర్క్లిఫ్ట్లు, క్రేన్లతో సహా వివిధ వాహానాలను నడపటంలో ప్రావీణ్యం సంపాదించడమే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. ఆమె స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆకర్షించింది, కదలించింది కూడా. అక్కడితో ఆమె ప్రస్థానం ఆగిపోలేదు. మహర్షి సినిమాలో మహేశ్ బాబు చెప్పినట్లు సక్సెస్ ఈజ్ జర్నీ దానికి పుల్స్టాప్లు ఉండవు అన్నట్లుగా ఈ మణి అమ్మ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ను కూడా సంపాదించారు. ఆ లైసెన్స్తో ఆ దుబాయ్ నగర వీధుల్లో సగర్వంగా తిరుగుతూ..అత్యంత ప్రశాంత వదనంతో ఉన్న ఆమె ఆహార్యం నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. ఆనంద్ మహింద్రా సైతం ఈ రోజు ఆమె నాకు స్ఫూర్తి అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం ఎలా అనే విషయంలో ఆ మణి అమ్మ అందరికీ స్ఫూర్తి. అంతేగాదు బహుశా ఈ మణి అమ్మే..అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అత్యంత వృద్ధమహిళ కావోచ్చు అంటూ నెటిజన్లు ఆమె పై ప్రసంశల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Maniamma - The DRIVER AMMA (@maniamma_official) (చదవండి: నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!) -
ప్రియుడితో పాప్ సింగర్ ఎంగేజ్మెంట్ : రూ. 5 కోట్ల డైమండ్ రింగ్
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన చిరకాల ప్రియుడు ప్రముఖ అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ప్రకటిస్తూ పోస్ట్ చేయడంతో ‘స్వెల్స్’ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారింది. దీనికి తోడు టేలర్ స్విఫ్ట్ భారీ డైమండ్ ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 7-20 క్యారెట్లు, 18 కేరట్ల బంగారం టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం ధర ఎంత? అనే చర్చ నడుస్తోంది.'నేను కాగితపు ఉంగరాలతో నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని ఒకప్పుడు పాడిన టేలర్ స్విఫ్ట్, భారీ విలువైన ఉంగరంతో ఆగస్టు 26న, తన డ్రీమ్ బోయ్ ట్రావిస్ కెల్స్తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించడం విశేషంగా నిలిచింది. డిజైన్, టేలర్ స్విఫ్ట్ అభిరుచికి తగినట్టుగా ఎంతో ప్రత్యేకంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ రింగ్లో పురాతన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వ జ్రాన్ని పొదిగారు. దీని విలువ సుమారు రూ. 4.8 కోట్లు.చదవండి: లైవ్ ఈవెంట్లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్పై చికిత్సప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఈ ఉంగరాన్ని న్యూయార్క్కు చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీతో కలిసి స్వయంగా డిజైన్ చేయించారటట్రావిస్ కెల్సీ . ఇందులో 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో చేశారు. దీనిపై నిపుణులు అంచనా వేస్తున్న విలువ అక్షరాలా 5,50,000 డాలర్లు.ప్రముఖ ఆభరణాల వ్యాపారి జార్జ్ ఖలీఫ్, అలియాస్ జార్జ్ ది జ్యువెలర్ అంచనా వజ్రం దాదాపు 20 క్యారెట్ల బరువు ఉంటుంది. ఈ ఉంగరం ఖచ్చితంగా విక్టోరియన్ యుగానికి చెందినదై ఉంటుందని మరో నిపుణుడి అంచనా. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఊహలు మరింత జోరుగా వ్యాపిస్తున్నాయి. -
శుక్లాంబరధరం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే...వినాయక చవితి వస్తే అందరి నోటా ఈ ప్రార్థనా శ్లోకం వినిపిస్తుంది. దీని అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియాల్సిన పద్ధతిలో తెలిసి ఉండకపోవచ్చు. తెలుగువారి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ తనే స్వయంగా ఒక సందర్భంలో ఆ శ్లోకానికి అర్థం విడమర్చారు. అదేమిటో ఈ వినాయక చవితి సందర్భంగా తెలుసుకుందాం...ఈ విఘ్నేశ్వర స్తోత్రం మహా వేదాంతార్థం కలిగిన శ్లోకం. దీని అర్థం సర్వము నందు అభివ్యాప్తమైయున్న మహాచైతన్యం ప్రథమావతారాన్ని బోధిస్తుంది. పురాణదశకు వచ్చేసరికి దీని అర్థం వేరు. విఘ్నేశ్వరుడు పార్వతీదేవి కుమారుడు. తెల్లని వస్త్రములు ధరించెడివాడు. విష్ణుమూర్తితో సమానుడు. శశియనగా చంద్రుడు. చంద్రవర్ణము కలవాడు. అనగా తెల్లనివాడు. చతుర్భుజుడు నాలుగు భుజములు కలవాడు. ఆయన ప్రసన్నవదనుడు. మొగము ప్రసన్నమై ఉండునని అర్థం. సర్వ విఘ్నములు ఉపశమించుట కొరకు ధ్యానించవలెను. ఇది శ్లోకార్థం.పురాణ విఘ్నేశ్వరుడు ఉన్నట్టే తత్త్వభూతుడైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు. తత్త్వమైన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం ఉండదు. తత్వమైన భగవంతుణ్ణి ప్రార్థించుట ఉండదు. సాధ్యం కాదు. అది మనసున ఏకాగ్రస్థితి వచ్చినప్పుడు అంటే సర్వమైన ఇతర భావాలు తొలగించుకొన్నప్పడు సాధ్యం కావచ్చు బహుశా. భగవంతునకు మూర్తి లేదు. మరి నీవు ఎవరిని ధ్యానించుచున్నావు? ఒక భావమును ధ్యానించు చున్నావా? భావమనగా ఊహ. ఆ ఊహæ నిలుచునా? ఎట్లు నిలుచును? అందుకే సృష్టి అంటే నామరూపాలు కాబట్టి భగవంతుని గుణాలకు రూపనామాలు ఇచ్చి ధ్యానించడం మనిషి బుద్ధికి సాధ్యం అయ్యింది. అందుచేత విఘ్నములు పరిహరించు దేవునికి రూపకల్పన చేసి దానిని ధ్యానిస్తున్నాము. శుక్లాంబరధరుడని, చతుర్భుజుడని, శశివర్ణుడని చె΄్తామే కాని వెనుక వున్న అర్థం వేరు. ఆ అర్థం తెలిసి ధ్యానిస్తే ఫలం అధికం.శుక్లాంబరము అంటే తెల్లని ఆకాశము. దానిని ధరించినవాడు. ఆకాశానికి వర్ణం లేదు. కానీ విఘ్నేశ్వరుడు శుక్లాంబరధరుడు అంటే తెల్లని ఆకాశమును ధరించినవాడు అయ్యాడు. ఇదో సంకేతం. భాషలో సంకేతాలుంటాయి. మన శాస్త్రములలో సత్త్వ, రజో, తమో అని త్రిగుణములని మూడున్నవి. సత్త్వగుణం తెలుపు. రజోగుణం ఎఱుపు. తమోగుణం నలుపు. ఆకాశమనగా ‘నవకాశము’. ఇది పంచభూతములలో ఒకటి. ఇది లేకుండా ఏ రెండు భూతములకు సంయోగం లేదు. ఒక భూతములో వున్న రెండణువుల మధ్య కూడ ఆకాశముండును. ఈ ఆకాశమునందు భగవచ్ఛక్తి అభివ్యాప్తమై యుండును. సత్త్వగుణముచేత అభివ్యాప్తమైయున్న ఆకాశమును ధరించినవాడు విఘ్నేశ్వరుడు అని అర్థం. శశివరుడు– శశియనగా చంద్రుడు కదా! శశమును ధరించినవాడు. శశమనగా కుందేలు. చంద్రునిలోనున్న మచ్చ కుందేలని అల్లిబుల్లి కథ. శశమనగా ‘దాట్లు పెట్టుచు దూకునది’ అని అర్థం. అందుచేతనే చంద్రుని శశియన్నారు. అతడు శుక్ల, కృష్ణపక్షములను చేయును. సూర్యునివలె నిత్య జ్యోతిస్సు కాదు. అందుచేత అతడు శశి. ఈ విఘ్నేశ్వరుడు ఆ జాతి కలవాడు. అనగా కాల స్వరూపుడు.కాలము రెండు విధములు. ఖండ కాలము, అఖండ కాలము. ఖండకాలమనగా దిన, పక్ష, మాస, సంవత్సరాత్మకమైనది. అఖండ కాలమనగా సూర్యచంద్ర గ్రహచారములు లేని చోట వుండునది. ఈ విఘ్నేశ్వరుడు ఖండకాల స్వరూపుడని అర్థం. అనగా లోకమును పాలించెడివాడని అర్థం. ఈ కాలంలో బతుకుతూ, ఈ కాలానికి అధీనమైవున్న మనం ఖండకాలమును పాలించెడి ఒక తత్త్వమును నిర్మించుకొని దానికి విఘ్నేశ్వర రూపం ఇచ్చినాము.చతుర్భుజం– చతుర్భుజుడు– నాలుగు భుజములు కలవాడు. భుజమనగా ఒక అర్థం భోజనము చేయునది. రెండవ అర్థం పాలించునది. నాల్గు భుజములతో విఘ్నేశ్వరుడు భుజించును. దేనిని? కాలమును అనగా ఖండకాలమును అఖండకాలముగా మార్చునన్న మాట. ధర్మార్థ కామ మోక్షములు నాలుగు. ఈ నాల్గింటిని పాలించుచున్నాడు. మనం ఒక కార్య ప్రారంభంలో పూజిస్తే మన ధర్మార్థ కామములను పాలించుచున్నాడు. అందుకనే మనం విఘ్నేశ్వరుని నిత్యం ధ్యానిస్తున్నాం. విఘ్నేశ్వరుడినే పరమేశ్వరుడుగా ధ్యానించినచో మోక్షమును గూడ నొసంగగలడు. కాలమును నాలుగు చేతులతో భుజించుచున్నాడు కదా! నాలుగు యుగములుగా తనలో లయింపచేసి కొనుచున్నాడని అర్థం.ఇంత పూజ దేనికి? సర్వవిఘ్నోప శాంతి కొరకు, విఘ్నములు ఉపశమించుట కొరకు, ఉపశమించునేగాని నశించవు. కాని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించినచో ఉపశమించును. విఘ్నమనగా కార్యమును చంపునట్టి లక్షణం. ఇది సృష్టిలో ఉన్నది. సృష్టిలక్షణం అన్నా తప్పు లేదు. ఆ సృష్టి లక్షణాన్ని ఉపశమింప చేయడానికి విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నాము.(‘సాహిత్య సురభి’ అనే పుస్తకంలో విశ్వనాథ ఈ వ్యాఖ్య చేశారు) గణమైనఔషధాలుగణేష్ చతుర్థి పూజకి ఉపయోగించే 21 రకాల పత్రులు సాధారణమైనవి కావు. శక్తిమంతమైన దివ్య ఔషధాలు. ఈ మొక్కలు ఏ అడవుల్లోనో ఉండేవి కావు. అన్నీ మన చుట్టూ పెరుగుతున్న మొక్కలే. ఈ 21 రకాల పత్రాల గురించి వివిధ రకాల గ్రంథాల్లో ప్రస్తావించారు.సిద్ది వినాయక పూజ పత్రాలు1. మాచిపత్రి: (శాస్త్రీయనామం – ఆర్టిమిజీయ పాలెన్స్. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది) ఇది మంచి సువాసన గల పత్రి. దీన్ని దద్దుర్లు, తలనొప్పి, వాతనొప్పులు, మధుమేహం, ఉబ్బసం, మూర్ఛ వ్యాధుల నివారణకు వాడతారు.2. బృహతీపత్రం అంటే వాకుడు: శాస్త్రీయనామం పసౌ– సోలానం సూరత్రేన్స్. ఇది సొలనెసీ కుటుంబానికి చెందినది. దీన్ని దగ్గు, జలుబు, జ్వరం, మూత్రవ్యాధులు, నేత్రవ్యాధుల నివారణకు వాడతారు.3.బిల్వపత్రం (మారేడు): శాస్త్రీయనామం – ఈగల్ మార్మిలస్. ఇది రూటేసి కుటుంబానికి చెందినది. దీన్ని జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్రవ్యాధులు, రక్తహీనత, పగుళ్ళు, గాయాలు మానడానికి వాడతారు.4.దుర్వయుగ్మము (గరిక ): శాస్త్రీయనామం – సైనోడాన్ డాక్టైలాన్. ఇది పోయేసి కుటుంబానికి చెందినది.ఇది గాయాలు మానడానికి, చర్మవ్యాధుల నివారణకు, ఉదర, మొలల నివారణకు వాడతారు.5.దత్తూరపత్రం (ఉమ్మెత్త ): శాస్త్రీయనామం – దత్తూర ఇనోక్సీయా. ఇది సొలనేసీ కుటుంబానికి చెందినది. దీన్ని ఉబ్బసం, దగ్గు, శ్వాసకోస సమస్యలు, చర్మవ్యాధులు, కుక్కకాటు చికిత్సకి వాడతారు.6. అపామార్గ పత్రం (ఉత్తరేణి): శాస్త్రీయనామం – అఖిరాంన్థస్ ఆస్పెరా. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. దీనిని దగ్గు, ఆస్తమా సమస్యలు తగ్గించడంలో, దంతాలు శుభ్రపరచడానికి వాడతారు.7.బదరీ పత్రం (రేగు): శాస్త్రీయనామం – జిజిఫస్ మారిటియాన. ఇది రామినెసీ కుటుంబానికి చెందినది. చర్మ సమస్యలు, మలబద్ధకం,వీరేచనాల నివారణకు వాడతారు.8.చూతపత్రం (మామిడి): శాస్త్రీయనామం – మాంగీఫెరా ఇండికా. ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందినది.నోటి దూర్వసన, చిగుళ్ల వాపు సమస్యలను మామిడి ఆకు బాగా తగ్గిస్తుంది. మామిడి పండ్లలో బీటా కెరొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది.9. కరవీర పత్రం (గన్నేరు): శాస్త్రీయనామం – నీరియం ఓడోరం. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందినది. గడ్డలు, పుండ్లు, గాయాలు తగ్గేందుకు ఈ మొక్క వేరు, బెరడును ఉపయోగిస్తారు.10.మరువక పత్రం (మరువం): శాస్త్రీయనామం – ఒరిగానం మజోరాన. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. ఈ ఆకులు సువాసనను వెదజల్లుతాయి. వీటి వాసన చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గుతుంది.11.శమి పత్రం (జమ్మి): శాస్త్రీయనామం –్ర΄÷సోఫిస్ సినరేరియా. ఇది మైమోసేసీ కుటుంబానికి చెందినది. నోటి సంబంధ వ్యాధులు తగ్గించడంలో జమ్మి ఆకులు బాగా పనిచేస్తాయి.12.విష్ణుక్రాంత పత్రం (నీలపుష్పి) శాస్త్రీయనామం : ఇవాల్వులస్ అల్సినాయిడిస్. ఇది కన్వాల్వలేసీ కుటుంబానికి చెందినది. దీన్ని నిద్రలేమి, దగ్గు, జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, గాయాలు మానడంలో బాగా సహాయపడుతుంది.13.సింధువార పత్రం (వావిలాకు) శాస్త్రీయనామం – వైటెక్స్ నిగుండో. ఇది వెర్బినెసీ కుటుంబానికి చెందినది. కీళ్ల నొప్పుల సమస్యలు వున్న వారు ఈ ఆకును వాడితే మంచి ఫలితం వస్తుంది.14.అశ్వత్థ పత్రం (రావి): ఈ మొక్క శాస్త్రీయ నామం –ఫైకస్ రెలిజియోస. ఇది మొరేసీ కుటుంబానికి చెందినది. చర్మ సమస్యలకు రావి ఆకు బాగా పనిచేస్తుంది.15. దాడిమీ పత్రం (దానిమ్మ ): శాస్త్రీయనామం – ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసీ కుటుంబానికి చెందినది. వాంతులు, విరేచనాలు అరికట్టడంలో దానిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి.16. జాజి పత్రం (జాజి మల్లి ): శాస్త్రీయనామం –జాస్మినం ఆరిక్యూలేటం. ఇది ఓలియేసీ కుటుంబానికి చెందినది. చర్మ సమస్యలు వున్న వారు, స్త్రీ సంబంధ వ్యాధులకు ఈ ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.17. అర్జున పత్రం (తెల్ల మద్ది): శాస్త్రీయనామం టెర్మినేలియా అర్జున. ఇది కాంబ్రిటేసి కుటుంబానికి చెందినది. గుండెకు రక్తం బాగా సరఫరా అవడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. అంతేగాక అల్సర్లు, మధుమేహం, దగ్గు, ఉబ్బసం, చర్మ వ్యాధుల నివారణకు దీని ఆకులు దోహదపడతాయి.18.దేవదారు పత్రం(దేవదారు): శాస్త్రీయనామం –సిడ్రస్ దియోధర. ఇది పైనేసి కుటుంబానికి చెందినది. ఇది చల్లని ప్రదేశాలు అనగా హిమాలయాలల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఆకులను ఆరబెట్టి తర్వాత నూనె లో వేసి కాచి చల్లార్చిన తర్వాత నూనె తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. దేవదారు మాను నుండి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాస సంబంధ సమస్యలు తొలగుతాయి.19. తులసీపత్రం (తులసి): శాస్త్రీయనామం –ఆసిమం శాంక్టమ్. ఇది లామియేసీ కుటుంబానికి చెందినది.ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేగాక జలుబు, దగ్గును నివారిస్తుంది.20. గణికా పత్రం (కామంచి):ఈ మొక్క శాస్త్రీయనామం – సోలానం వర్జినియానం. ఇది సొలనెసీ కుటుంబానికి చెందినది. దగ్గు, జ్వరం, తలనొప్పి, అస్తమా, అతి మూత్ర వ్యాధికి ఈ ఆకులు బాగా పనిచేస్తాయి.21.అర్కపత్రం (జిల్లేడు):ఈ మొక్క శాస్త్రీయనామం – కెలాట్రోపీస్ జైగాన్షియా. ఈ మొక్క ఆకులను నరాల బలహీనతకి, చర్మ వ్యాధుల నివారణకు వాడతారు. -
దేశంలో తొలి ఏఐ స్కిన్ కేర్ వెండింగ్ మిషన్ ఆవిష్కరణ!
‘స్కిన్ టెక్ ఏఐ–2025’ భారత బ్యూటీ ఇండస్ట్రీకి సరికొత్త నాందిగా నిలుస్తుందని మిస్ ఇండియా ఎర్త్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్ వేదికగా దేశంలో తొలిసారిగా వార్షిక స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ఏఐ/టెక్ సదస్సు–స్కిన్ టెక్ ఏఐ–2025 పేరిట నిర్వహించారు. సదస్సు థీమ్ అనేది స్కిన్ కేర్ రంగంలో భవిష్యత్తుకు మలుపుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది నూతన ఆవిష్కరణ, డేటా, వినియోగదారుల ఆధారంగా భవిష్యత్తును నిర్మిస్తుందన్నారు. ఈ తొలి కార్యక్రమంలో హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం, తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్కిన్ కేర్, బ్యూటీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై చర్చించారు. అనంతరం దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ స్కిన్ స్కేర్ వెండింగ్ మిషన్ ఆవిష్కరించారు. ఎంపీఎఫ్ సీఈఓ సుశిల్ కుమార్, స్కిన్ కేర్ రంగంలో ప్రముఖులు నిజామ్ మహ్మద్, స్టార్టప్ల మెంటర్ డాక్టర్ లక్ష్మీ దివ్య, రామ్ చింతలపూడి, శశిమూర్తి పాల్గొన్నారు. (చదవండి: అబ్బురం అపురూపం..! అరుదైన గణపతి ప్రతిమలు..ఏకంగా 39 దేశాలు) -
అబ్బురం అపురూపం..! అరుదైన గణపతి ప్రతిమలు..
ఆ ఇంట్లో ఏమూల చూసినా గణనాధుల ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. విభిన్న రకాల వినాయక విగ్రహాలతో ఆ ఇల్లే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆధ్యాతి్మక సౌరభంతో విరాజిల్లుతుంటాయి. ఆయన తన 12వ ఏట నుంచే అరుదైన సేకరణపై దృష్టిపెట్టారు. అదే వినాయక విగ్రహాలు, ప్రతిమలు, పుస్తకాలు, ఫొటోలు సేకరించడం. ఈ హాబీ ఆయనకు చిన్ననాటి నుంచే అబ్బగా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రత్యేకత కలిగిన విగ్రహాలు కనిపిస్తే చాలు.. అది ఏ దేశంలో ఉన్నా తన గణపతి మ్యూజియంలోకి చేరాల్సిందే. అంతేకాదు.. విశ్వవినాయక్ పేరుతో వినాయక ఆలయాలపై పుస్తకం కూడా రాస్తున్నారు. ఆయనే వెస్ట్ మారేడ్పల్లికి చెందిన పబ్శెట్టి శేఖర్. ఎస్బీఐలో పనిచేసిన ఆయన ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన హాబీని కొనసాగిస్తున్నారు. అమెరికా, చైనా, నేపాల్, జపాన్, అఫ్గానిస్థాన్, ఈజిప్ట్, శ్రీలంక, బాలి, జర్మనీ, టిబెట్, కంబోడియా, థాయ్లాండ్, యూకే ఇలా సుమారు 39 దేశాల నుంచి పలు ప్రత్యేకతలు కలిగిన గణేశ విగ్రహాలను సేకరించారు. బంగారం, వెండి, ఇత్తడి, రాగి, అల్యూమినియం, మార్బుల్, క్రిస్టల్, చెక్క, రాతి, పంచలోహం, మట్టితో తయారుచేసిన విగ్రహాలతో ఏకంగా ఓ మ్యూజియాన్ని తలపించే సేకరణ ఇక్కడ కొలువుదీరింది. వీటి 32 రూపాల గణేశుడి నుంచి 12 రాశుల గణపతి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక గణపతి విగ్రహాలు సేకరించిన వ్యక్తిగా పబ్శెట్టి శేఖర్ గిన్నిస్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నారు. 21,708 గణేశ విగ్రహాలు.. పబ్శెట్టి శేఖర్ ఇప్పటివరకూ తన హాబీలో భాగంగా 21,708 గణేశుడి విగ్రహాలను సేకరించి రికార్డు సృష్టించారు. అంతేకాదు, 19,708 గణేశ పోస్ట్కార్డులు తయారు చేశారు. 15,582 గణేశ ఫొటోలూ ఉన్నాయి. 1,105 గణేశ పోస్టర్లు, 260 గణేశ పురాణాలు, పుస్తకాలు సేకరించారు. 250 గణేశ కీచైన్లు అబ్బురపరుస్తున్నాయి. అరుదైన 205 ఆడియో, వీడియో క్యాసెట్లు సేకరించారు. ఇప్పటి వరకూ ఆయన సేకరించినవన్నీ కలుపుకుని 58,498. ఈ ఒక్క ఏడాదిలోనే 2,060 గణేశ విగ్రహాలను సేకరించి తన హాబీకి మరింత వన్నె తెచ్చాడు. 1973లో ప్రారంభమైన ఈ హాబీ రోజురోజుకూ ముందుకెళ్లడమే కానీ, వెనక్కి తగ్గడం లేదు. లక్ష సేకరించడమే లక్ష్యం.. బొజ్జ గణపయ్యకు సంబంధించి వివిధ రూపాల్లో ఇప్పటివరకూ 50వేలకు పైగా సేకరించారు. మొత్తం లక్ష సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్శెట్టి శేఖర్ చెబుతున్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ముందుగా చూసేది వినాయక విగ్రహాలేనని, తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటానని, ఇప్పటివరకూ 15 వరల్డ్ రికార్డులు రాగా, 2014, 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించానని తెలిపారు. నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్, మిరాకిల్ వరల్డ్ రికార్డు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డు, కింగ్స్ వరల్డ్ రికార్డు ఇలా ఎన్నో రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ హాబీ తన ప్రాణం ఉన్నంత వరకూ కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు గణపతి దేవాలయాలపై రీసెర్చ్ చేస్తున్నట్లు వివరించారు. (చదవండి: చవితి రుచులు చవిచూడాల్సిందే!) -
సీనియర్ సిటిజెమ్స్..! అరవైలోనూ ఇరవైని తలపించేలా
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహా కవి శ్రీశ్రీ.. దీనికి భిన్నంగా ఈ వృద్ధులు ఎప్పటికీ యువకులే.. అన్నట్లు కొందరు నగరవాసులు వయసును లెక్కజేయకుండా అన్నింటా మేము సైతం అన్నట్లు నేటి యువతకు చాలెంజ్ విసురుతున్నారు. అరవైల్లోనూ ఇరవైని తలపించే రీతిలో విభిన్న పోటీల్లో భాగస్వాములవుతూ ఉత్సాహంగా ఆటల నుంచి అందాల పోటీల వరకూ పాలుపంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు నాటి తరం సీనియర్ సిటి‘జెమ్స్’. రిటైర్మెంట్ అనంతరం కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోక.. ఎంచక్కా టూర్లు, ట్రెక్కింగ్స్ అంటూ తమకు నచి్చన రంగంలో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొండాపూర్లో నివసించే బాబూ రాజేంద్రప్రసాద్ రెడ్డికి 70 ఏళ్లు.. అనితరసాధ్యమైన రీతిలో 12వేల అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్ చేశారు. 72 ఏళ్ల వయసులోనూ ఎన్ఎమ్డీసీ ఫుల్ మారథాన్ అంటే 42.2 కి.మీ పరుగును పూర్తిచేశారు మరో నగరవాసి నాగభూషణరావు. ఇంకా మరిన్ని మారథాన్లలో భాగస్వామ్యం అవుతానంటున్నారు. పోరాట కళల్లో రాణిస్తూ మార్షల్ ఆర్ట్స్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మరో నగరవాసి కిరణ్ ఉనియాల్ (53).. ఇలా వయసుతో ప్రమేయం లేని విజయాలతో ఓల్డేజ్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ.. తమ రొటీన్ లైఫ్ని కొత్తగా మార్చేస్తున్నారు. అలాంటి సీనియర్ల హుషారు సరికొత్త యువ తరాన్ని ఆవిష్కరిస్తూ.. కొత్త కొత్త పోటీలకు ఊపునిస్తోంది. అప్పుడే అసలైన జీవితం.. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతోంది అంటే ఊళ్లు తిరుగుతూ తీర్ధయాత్రలతోనో, ఒళ్లు నలగని పార్ట్ టైమ్ ఉద్యోగాలతోనో, మనవళ్లతోనో.. పార్కుల్లో స్నేహితులతో ముచ్చట్లతోనో కాలం వెళ్లదీసే రోజులు కావివి అంటున్నారు నేటి తరం సీనియర్ సిటిజన్స్. ఓ వైపు ఉద్యోగమో, వ్యాపారమో.. కెరీర్ ముగుస్తుండగానే.. మరోవైపు కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా మనకేం కావాలి.. మనమేం చేయగలం.. అనే ఆలోచనలతో అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన సాహిల్ గులాటి(65). టాలెంట్, ఆసక్తి ఉండాలేగానీ.. ఇటీవల ఖ్యాల్స్ (కేహెచ్వైఏఏఎల్స్) అనే ఏజ్టెక్ స్టార్టప్, ‘50 ఎబవ్’ అనే పేరుతో టాలెంట్ హంట్ పోటీలు ప్రారంభించింది. ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకించింది. గానం, ఫొటోగ్రఫీ, వంటలో ప్రావీణ్యం, కవితలు రాయడం, నటన.. ఇలా అదీ ఇదీ అని లేకుండా దాదాపు అన్ని విభాగాలనూ కలుపుకుని ఏకంగా 50 విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తుండడం విశేషం. కళా ప్రతిభ, ట్రావెల్, లైఫ్స్టైల్ వంటి విభాగాల్లో సత్తా ప్రదర్శించే అవకాశం కలి్పస్తోంది.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ కోసం 20 నగరాల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత స్టీరియో టైప్ పోటీలకు భిన్నంగా వయోజనుల్లో పోటీ తత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అందం వయసెరగదు అంటున్నారు మిస్టర్ అండ్ మిసెస్ సీనియర్ ఫ్యాషన్ పేజెంట్ ఇండియా నిర్వాహకులు రేఖా దేశాయ్. గత మే నెల్లో 55 ఏళ్లు దాటిన వారి కోసం ఓ పోటీని కొత్తగా ప్రారంభించారామె. స్వయంగా ఆరు పదుల వయసులో ఉన్న రేఖా దేశాయ్.. ‘కలలకు ఎక్స్పైరీ డేట్ లేదు. సీనియర్స్ కళ్లలో మెరుపులు చూడడమే నా కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు. వీరి సంస్థ నిర్వహించే పీచ్ ఈవెంట్స్ తమ మొదటి సీజన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆటలకు, పాటలకు సై..సీనియర్స్ కోసం నిర్వహించే ఆటల పోటీలకూ కొదవలేదు. ఈత, గోల్ఫ్ నడక వంటి వాటిలోనూ పోటీలు జరుగుతున్నాయి. అలాగే బోస్, కార్న్హోల్, క్రికెట్ వంటి ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సోంకు చెందిన 70ఏళ్ల ఖిరాదా సైకియా కలిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ గత జూన్లో ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకోవడం ఎందరికో స్ఫూర్తిని అందించింది. అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారి కోసం నిర్వహించే మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్స్, ఏవీటీ చాంపియన్ టూర్స్, పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ వంటి ఆటల పోటీల్లోనూ నగరవాసులు చురుకుగా పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ( చదవండి: -
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్వార్.. పెద్దమ్మ ఫుల్ హ్యాపీ
తన జీవితంలో ముఖ్యమైన శుభవార్తను ప్రకటించింది నటి పరిణీతి చోప్రా. త్వరలోనే తామెతొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో తన అభిమానుల అభినందనలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు కాబోయే పరిణీతి, రాఘవ్ చద్దాకు అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ,ఇండస్ట్రీ మొత్తం అభినందించింది. ఈ జంట ఆగస్టు 25 న ఇన్స్టాగ్రామ్లో “1 + 1 = 3”, కేక్ , చిన్న పాదముద్రలను కలిగి ఉన్న ఒక అందమైన పోస్ట్ను పంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో పరిణీతి చోప్రా గర్భవతి అని తెలియగానే నటు కియారా అద్వానీ , నేహా ధూపియా, సోనమ్ కపూర్, భూమి పెడ్నేకర్, హుమా ఖురేషి రకుల్ ప్రీత్ సింగ్ ఇలా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో పరిణీతి సోదరి 'మిమి దీదీ' ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెగ సంతోషడిపోయింది. పరిణీతి పోస్ట్ను ప్రియాంక కూడా తిరిగి షేర్ చేసి, త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న వారిని అభినందించింది. దీంతో ప్రియాంక, పరిణీతి వివాహాన్ని మిస్ అయిన తర్వాత, ఇద్దరు సోదరీమణుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని పుకార్లను తోసి పుచ్చింది.ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025 : ప్రపంచంలో కొలువైన ఈ గణపయ్యల గురించి తెలుసా?పరిణీతి చోప్రా రాఘవ్ చద్దాల ప్రేమకథ మే 13, 2023న న్యూఢిల్లీలో వారి నిశ్చితార్థం తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ జంట సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్లోని విలాసవంతమైన లీలా ప్యాలెస్లో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు -
పల్లె జీవనం అంత వీజీ కాదమ్మా
జిమ్కు వెళ్లడం .. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం.. పుషప్స్ తీయడం.. డంబుల్స్ లేపడం.. ఇవన్నీ కష్టమే కావచ్చు.. కానీ పల్లె జీవనం ఇంకా కష్టం.. రోజూ నీళ్ళబిందెలు మోయాలి. పాడి పశువులకు గడ్డి కోసి తీసుకురావాలి.. ధాన్యం బస్తాలు.. నెత్తిన పెట్టుకుని మోయాలి.. ఇంటి పని .. వ్యవసాయపనులు చేయాలి.. ఇదంతా అంత వీజీ కాదు.. జిమ్ములో కోచ్ సారధ్యంలో ఆయన సలహాల మేరకు బరువులు ఎత్తాలి .. కానీ గ్రామీణులు ఎలాంటి శిక్షణ.. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే పెద్దపెద్ద బరువులు ఎత్తుతూ జీవనాన్ని భారంగా సాగిస్తుంటారు. వారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ ఒక మహిళకు పాదాభివందనం చేసారు.. పల్లె ప్రజల జీవన విధానం ఎంత కష్టమో తెలుసుకుని ఓ మహిళను అభినందించారు. వాస్తవానికి "పల్లెకు పోదాం" అనే ఒక రియాలిటీ షోలో భాగంగా 11 మంది బాలీవుడ్ మహిళా సెలబ్రిటీలు ఒక కుగ్రామంలో రెండు నెలలు ఉండాలి.. ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా కేవలం కనీస ప్రాథమిక సౌకర్యాల నడుమ రెండు నెలలు ఉండాలి. అందులో భాగంగా వారు గ్రామీణులతో మమేకమై వారు ఎలా జీవిస్తున్నారు.. వారి కష్ట నష్టాలూ ఏమిటి.. వారు జీవనం కోసం ఎలాంటి అవస్థలు.. ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడమే కాకుండా ఈ సెలబ్రిటీలు కూడా వాటిలో పూర్తిగా పాలుపంచుకోవాలి. ఈ కార్యక్రమానికి రణ్ విజయ్ సింఘా హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ కార్యక్రమం జీ టీవీలో ప్రసారం అవుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా జాకీష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ కూడా మధ్యప్రదేశ్ లోని భములీయ గ్రామానికి వెళ్లారు. పల్లెవాసులతో కలగలిసి వ్యవసాయం.. పశుపోషణ ఇంకా పలురకాల పనుల్లో ఈ సెలబ్రిటీలు పాలుపంచుకోవడమే కాకుండా అక్కడ ఏదో ఒక పని చేయడం ద్వారా జీవన భృతిని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అయితే కృష్ణ ష్రాఫ్ మాత్రం తనకోసం సెలూన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పల్లెలో నడుస్తూ ఒక గ్రామీణ మహిళా నెత్తిన గడ్డిమోపు తీసుకువెళ్లడాన్ని చూసారు..Jackie Shroff’s daughterFunny as hell😂pic.twitter.com/YkwTCbcfe9— Kreately.in (@KreatelyMedia) August 24, 2025 తాను కూడా గడ్డిమోపును మోస్తానని చెబుతూ దాన్ని తన నెత్తిన పెట్టాలని కోరారు.. ఆ మహిళ ఆ మోపును కృష్ణ ష్రాఫ్ నెత్తిన పెడుతుంది. అయినా ఆ గడ్డిమోపు కృష్ణ ష్రాఫ్ నెత్తిన నిలవడం లేదు.. జారిపోతుంది.. రెండుసార్లు మళ్ళీ పెట్టినా అది జారిపోతూనే ఉంటుంది.. వెంటనే ఆ గడ్డిమోపును ఆ మహిళా అందుకుని తలపై పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.. ఆ క్షణంలో కృష్ణ ష్రాఫ్ ఆ మహిళకు ఎదురెళ్లి.. ఆమె కష్టానికి, గడ్డి మోపు జారిపోకుండా ఉండేలా మోసుకెళ్తున్న తీరుకు అబ్బురపడుతూ ఆమెకు అభివందనం చేస్తుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐంది... నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతూ కృష్ణ ను, ఆమె సంస్కారాన్ని అభినందిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్గా తీసుకునే డైట్నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..
అంతర్జాతీయ నటి తనిష్ట ఛటర్జీ దర్శకురాలు, మంచి యాక్టర్ కూడా. ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని..విమర్శకుల ప్రశంసలందుకున్న ప్రముఖ నటి. ఆమె ఇటీవల స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ మహమ్మారితోనే తన తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు అదే ప్రాణాంతక వ్యాధిబారిన పడి పోరాడుతోంది. తాను ప్రస్తుతం చికిత్స తీసుకునే కష్టతరమైన జర్నీలో ఉన్నానని వెల్లడించింది. ఇంతకీ అసలు ఏంటి ఈ కేన్సర్..? ఎందువల్ల వస్తుందంటే..ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..ఒలిగోమెటాస్టాటిక్ స్థితి అనేది కేన్సర్ వ్యాప్తి పరిమితంగా ఉన్న దశ. కేన్సర్ ఈ దశలో కొన్నిప్రాంతాలకు మాత్రమే వ్యాపించి ఉంటుంది. చెప్పాలంటే ఒకటి నుంచి ఐదు ప్రాంతాలకే వ్యాపింస్తుంది. అంటే ఇది పూర్తిగా ముందుగా కేన్సర్ని గుర్తించే పరిస్థితిగా పేర్కొనవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ స్థితిలో చికిత్సకు మంచి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. శస్త్రచికిత్స, రేడియేషన్, థెరపీ వంటి వాటితో నయం చేసే అవకాశం ఉంటుంది. చాలామటుకు బతికే ఛాన్స్లు ఉంటాయి. ఈ మెటాస్టాసిస్ అనే పదం గ్రీకు నుంచి ఉద్భవించింది. ఒలిగో అంటే మెటాస్టాసిస్. దీని అర్థం వలస. సాంప్రదాయకంగా మూడు కంటే తక్కువ సుదూర అవయవాలలో ఐదు కంటే తక్కువ కణితి గాయాలుగా పేర్కొంటారు వైద్యులు. సాంకేతిక సాయంతో త్వరితగతిని నయం చేయగల కేన్సర్గా పరిగణిస్తారు. ఎలా గుర్తిస్తారంటే..శరీరం పూర్తిగా స్కాన్ చేస్తారు, కాలి నుంచి తల వరకు ప్రతి చోట క్షుణ్ణంగా స్కాన్ చేసి..ఎక్కడైన కణితి గాయాలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. ఒక వేళ FDG PET స్కాన్లో ఈ కణుతులు గుర్తించలేకపోతే పెట్ స్కాన్, కాంట్రాస్ట్ సీటీ స్కాన్ల సాయంతో గుర్తిస్తారు.మనుగడ రేటు అనేది స్కాన్లో మెటాస్టేజ్ల సంఖ్య, ఒలిగోమెటాస్టాసిస్ ప్రదేశం, స్థానిక చికిత్సలకు ప్రతిస్పందన, కణితి జీవశాస్త్రం, ఇమ్యునోథెరపీ, రోగి స్థితి ఆధారంగా నిర్ణయిస్తారని వైద్యులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో ఈ కణితి వచ్చే ప్రమాదం ఎంత ఉందనేది కూడా అంచనా వేయడం వంటివి కూడా ఉంటాయన్నారు. అయితే ఈ దశలో రోగి భయాందోళనలకు గురవ్వకుండా త్వరితగతిన నయం అయి బయటపడగలరని చెబుతున్నారు. ఎలా చికిత్స చేస్తారంటే..కణితి వ్యాపించిన పరిస్థితి ఆధారంగా శస్త్రచికిత్స, రేడియేషన్, ఎంబోలైజేషన్ వంటి చికిత్సలు అందిస్తారని చెబుతున్నారు. ఈ స్టేజ్ 4 ఒలిగోమెటాస్టాటిక్ దశ అనేది విజయవంతంగా వ్యాధికి చికిత్స అందించగల స్టేజ్ అని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Tannishtha Chatterjee (@tannishtha_c) (చదవండి: -
స్మార్ట్గా సమయాన్ని, సామర్థ్యాన్ని మింగేస్తోంది..!
నగర అధునాతన సాంకేతిక జీవనశైలిలో వేగం పెరిగిన కొద్దీ యువత ‘స్క్రీన్ టైమ్–సెంట్రిక్’ దినచర్యగా, బానిసత్వంగా మారుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజా సర్వేలు చెబుతున్న ఆందోళనకర విషయం ఏంటంటే.. నగరంతో పాటు రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో 92 శాతం మందికి స్మార్ట్ఫోన్ వినియోగ పరిచయం ఉండటం. ఇందులో చదువుకోసం వాడుతున్నవారు 61 శాతం కాగా సోషల్ మీడియా బ్రౌజింగ్కి వెళ్తున్నవి 82.5 శాతం కావడం విశేషం. ఇది విద్యార్థుల చదువుపైనే కాకుండా దుష్పభావాలపై ఆందోళనల్ని పెంచుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో మొబైల్తో పాటు వివిధ సాంకేతిక మాధ్యమాల స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిందని సూచిస్తున్నాయి. నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ర్యాంక్..ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోవడం ఒక్క చదువుకు మాత్రమే కాదు నిద్రపట్టలేని లక్షణాన్ని కూడా గందరగోళపరుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆనందంపై ‘స్టూడెంట్ వెల్బీయింగ్ పల్స్’ నివేదిక చెబుతున్న తాజా వివరాల ప్రకారం.. రాత్రివేళల సోషల్ మీడియా వాడకం నిద్రను తగ్గించి, జీవన సంతృప్తిని–ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 12వ తరగతి విద్యార్థుల్లో దాదాపు 75 శాతం మందికి స్కూల్ డేస్లో 7 గంటల కన్నా తక్కువ నిద్రే వస్తోందట. ఇది ఆందోళనను పెంచుతూ మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్టైమ్లో ల్యాప్టైమ్, మొబైల్, ట్యాబ్స్ తదితర మాధ్యమాల్లో ‘పది నిమిషాలే’ అని మొదలయ్యే రీల్స్–బింజ్, నిద్రపోయే బెడ్ టైంకు ముందు ఆ స్క్రీన్లకు కళ్లు పెనవేసుకుని ఉండటం వల్ల నిద్రను చెడగొట్టి, మరుసటి రోజు ఫోకస్, శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 30 నిమిషాలకంటే ఎక్కువ స్క్రీన్ చూశాక నిద్ర నాణ్యత తక్కువగా ఉందని ఈ డేటా చెబుతోంది. అలాగే 41 వేల మందిపై నిర్వహించిన ఒక సర్వేలో ‘సోషల్ స్క్రోల్’ వల్ల నిద్ర ఆలస్యమవుతుందనే విషయం కూడా బయటపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యువతలో హెల్తీ ఆన్లైన్ అలవాట్ల అవసరాన్ని స్పష్టంగా తెలిపే నివేదికను విడుదల చేసింది. పరిష్కారం ఏంటి?ఈ స్క్రీన్ టైం బానిసత్వానికి గేమింగ్ మరో పెద్ద టైమ్సింక్. మల్టీప్లేయర్/ఈ–స్పోర్ట్స్ మోడ్లో ‘నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ ర్యాంక్’ లూప్ యువతను ముంచేస్తుంది. భారతీయ పరిశోధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో గేమింగ్ అలవాట్లు.. ఫంక్షనాలిటీ, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. అదే సమయంలో కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనాల్లో ‘నలుగురిలో ఒక్కడికి’ స్మార్ట్ఫోన్ అడిక్షన్ లక్షణాలు కనిపించాయని నివేదికలు వెల్లడించాయి. స్క్రీన్పై గడిపే సమయం పెరిగేకొద్దీ మార్కులపై వస్తున్న ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే మువతలో వచ్చిన ఈ మార్పులతో పాటు డోపమైన్ హిట్స్ కోసం వేపింగ్/సబ్స్టెన్స్ ట్రయల్స్ వైపు అడుగులు కూడా ఆందోళనకరంగా మారాయి. తెలంగాణ యాంటీ–నార్కోటిక్స్ బ్యూరో ప్రణాళికలే ఈ విషయాలను చెబుతున్నాయి. హైదరాబాదు పరిసరాల్లో కుర్రాళ్లలో వీటి సరఫరా సులభంగా లభించడం వంటి కారణాలు అటు వైపు నెడుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పరిష్కార మార్గాలపై నిపుణులు, సామాజికవేత్తలు దృష్టి సారించారు. పాఠశాలలు–కాలేజీలు ‘డిజిటల్ హైజీన్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్’ను కాంబోగా ఇవ్వాలి సూచిస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్ సలహాలకంటే ఇలాంటి అంశాలపై అవగాహన కలి్పంచడం ప్రాథమిక బాధ్యత అని విన్నవిస్తున్నారు. ఇంట్లో కూడా ‘స్క్రీన్ కర్ఫ్యూ’ (బెడ్టైమ్కు 60–90 నిమిషాల ముందు స్క్రీన్ ఆఫ్), నప్లిమిట్ (మధ్యాహ్నం 20–30 నిమిషాలకే), ‘నో ఫోన్ ఇన్ డైనింగ్ టేబుల్’, ‘రీల్స్కు రూల్ ఆఫ్ 15’ (రోజు 15 నిమిషాలకే) వంటి మైక్రో రూల్స్ అమలు చేస్తే ఫోకస్, నిద్ర, మూడ్ మెరుగుపడతాయని, నిద్ర–మానసిక అంశాలకు చెందిన ఆరోగ్య డేటా సూచిస్తోంది. నగర జీవనశైలిలో యువతను నిరీ్వర్యం చేస్తున్న ‘మూడు ఎస్’లు.. స్క్రీన్, స్క్రోల్, సబ్స్టాన్స్. చదువు/కెరీర్ లక్ష్యాలకు ‘డీప్ వర్క్ విండోలు’, ఆఫ్లైన్ హాబీలు, క్రీడలు, కమ్యూనిటీ వాలంటీరింగ్ వంటి ‘డోపమైన్ ఆల్టర్నేటివ్లు’ అవసరం. లేదంటే రాత్రి స్క్రోలు ఉదయాన్ని అలసటగా మార్చడమే కాకుండా ‘డెడ్లైన్ డిజాస్టర్’గా తిరిగి వస్తూనే ఉంటుంది. (చదవండి: బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!) -
బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!
‘మనం బొజ్జలనే కాదు.. అందమైన ఆకృతితో కూడిన కండలను పెంచగలం.. అయితే దీనికి సరైన సమయంలో సరైన మార్గనిర్దేశం అవసరం. అప్పుడే సాధన ఫలితాలనిస్తుంది.. కండలు పెంచేందుకు జెనిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు. బాడీ బిల్డింగ్పై ఉన్న అపోహలు, తెరలు తొలగిపోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో మనం సత్తా చూపించగలం’ అని సినీనటుడు అల్లు శిరీష్ అన అభిప్రాయాన్ని వెల్లడించారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్లో ‘డెక్కన్ అప్రైజింగ్–2025 పేరిట ఐసీఎన్ (ఐ కాంపీట్ నేచురల్) సంస్థ నిర్వహించిన సహజసిద్ధ శరీర దృఢత్వ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను, నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం ఫిట్నెస్పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుర్తింపు అవసరం.. ప్రపంచస్థాయిలో బాడీ బిల్డింగ్కి మంచి గుర్తింపు ఉంది. ఇందులో రాణించిన అథ్లెట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మన దేశంలో మాత్రం బాడీ బిల్డర్లు కోచ్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు. క్రికెట్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు మన దేశంలో ఇచ్చిన ప్రాధాన్యత బాడీబిల్డింగ్కు కూడా దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనేక అపోహలు.. శరీర దారుఢ్యానికి మందులు, స్టిరాయిడ్లు వాడతారనే అపోహల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. అవేవీ అవసరం లేకుండా కూడా సరైన సమయంలో సరైన కోచ్ ద్వారా శిక్షణ తీసుకుని సాధన చేస్తే అంతర్జాతీయ అథ్లెట్లను తయారు చేసుకోవచ్చు.. ఐసీఎన్ లాంటి సంస్థలు ఆ దిశగానే కృషి చేస్తున్నాయి.. అందుకే ఎంతో ఇష్టంతో గత రెండేళ్లుగా ఇక్కడికి వచ్చి అథ్లెట్లను ప్రొత్సహిస్తున్నాను. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు వందల మంది యువత ఈ పోటీల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మన వద్ద కూడా ఫిట్నెస్పై అవగాహన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నాకు తగ్గ కథ వస్తే..కండలు పెంచేందుకు జన్యుపరమైన సంబంధాలేవీ లేవు. ఫిట్నెస్కు రాంగ్రూట్, షార్ట్కట్స్ ఎంత మాత్రం సరైంది కాదు. శరీర తత్వం బట్టి బొజ్జలు వస్తాయనే ప్రచారం సరికాదు. సహజంగానే ఫిట్నెస్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా ఎత్తు, బరువు, ఆకృతికి అనువైన మంచి స్పోర్ట్స్ కథ వస్తే అలాంటి సినీమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పటి వరకూ వచ్చిన క్రికెట్, రన్నింగ్, ఫుట్బాల్ వంటి కథలు కాకుండా కొత్తగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!) -
ఊపందుకుంటున్న సోలో డేట్ కల్చర్..!
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నే లేని మైమరపున.. ఏమో అన్నానేమో..నువ్వు విన్నావేమో..విన్న మాటేదో నిన్నడగనా.. అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన.. అవును కాదు తడబాటుని.. అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడిపోని పరదాని.. పలుకై రాని ప్రాణాన్ని.. అని బాణం చిత్రంలో రామజోగ్య శాస్తి రాసిన పాట మనందరికీ సుపరిచితమే.. ఇదే పాటను అనుకరిస్తూ.. పలువురు నగర వాసులు సోలో డేట్కు సై అంటున్నారు. కొందరు పర్సనల్ స్పేస్ వెతుక్కుంటూ.. లాంగ్ డ్రైవ్స్, టూర్స్కు వెళ్తున్నారు.. మరికొందరు తమకు నచి్చన ఆహారంతో.. ఇంకొందరు పుస్తకాలు, మ్యూజిక్తో సావాసం చేస్తున్నారు.. నేనూ నా నీడ.. ఇద్దరమే చాలంటూ పలువురు నగరవాసులు పాశ్చాత్య దేశాల నుంచి విస్తరిస్తున్న ట్రెండ్కు ఊతమిస్తున్నారు. ‘డేట్కి వెళదామా? అని ప్రశ్నిస్తే.. ఏ ఆన్సర్ వస్తుందో అనే ఆందోళన ఉండదు. ‘డేటింగ్’ కోసం మరొకరిని మెప్పించాలనే తాపత్రయమూ ఉండదు. నచ్చని పనులు చేయాల్సిన అవసరమూ ఉండదు.. నచి్చన పనులు మానాల్సిన అవసరం అస్సలే ఉండదు. అంత అద్భుతమైన అనుభవమా? అదెక్కడ? అది ఎలా? అనే ప్రశ్నలకు నగర యువత ఇప్పుడు కనుగొన్న సమాధానమే సోలో డేటింగ్. ‘సారీ రేపు ఎవరినీ కలవదలచుకోలేదు. ఏకాంతంగా రోజంతా గడపదలచుకున్నాను...’ ఇలాంటి మాటలు ఇప్పుడు నగరంలో తరచూ వినబడుతున్నాయి. ‘సోలో డేటింగ్’ అనే అనుభవం పట్ల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్న ఆసక్తే దీనికి కారణం. అలా పుట్టింది.. పొద్దున్న లేస్తే.. ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని కలవాలి? ఎవరితో చర్చించాలి.. ఏ మీటింగ్కి అటెండవ్వాలి? ఎవరికి పనులు అప్పజెప్పాలి.. ఎవరు చెప్పిన పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని మెప్పించాలి?.. బయటకు వెళ్లడం మాత్రమే కాదు కమ్యూనికేషన్ పుణ్యమాని ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి.. రోజువారీ షెడ్యూల్ మొత్తం ఇలాగే మరొకరితో ముడిపడిపోతున్న నగర వాసంలో.. తనను తాను కోల్పోతున్నామనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనల నుంచి పుట్టిందే సోలో డేటింగ్ సంస్కృతి. ఇలా విస్తరించింది.. తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో అంకురించిన సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. మీ టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్లో అయితే ‘ఒంటరి డైనింగ్’ (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘సోలో ట్రావెల్ – డేటింగ్’ ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా యువత, ముఖ్యంగా హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో, వీకెండ్ సోలో డేట్స్ని ట్రెండ్గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో ‘సెల్ఫ్ కేర్’ అనే భావనకు కొత్త రూపంగా దీన్ని పేర్కొంటున్నారు. సోలో డేటింగ్.. ఇలా! ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. సోలోగా గడపడం అంటే ఏదో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఒక రొమాంటిక్ పార్ట్నర్తో కలిసి వెళ్లినట్టు అలా వెళ్లినప్పుడు వారి ఆనందం కోసం మనం ఏవైతే చేస్తామో, చేద్దాం అనుకుంటామో.. అలా మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు మొత్తం మనకు నచ్చిన పనులు చేస్తూ గడిపేయడం. మనకు నచి్చన టైమ్కి నిద్ర లేవడం మొదలుకుని ఏదైనా కాఫీ షాప్లోనో కల్చరల్ స్పేస్ లోనో కాసేపు గడపడం, సినిమానో, నాటకమో, స్టాండప్ కామెడీయో.. ఏది చూడాలనుకుంటే అది చూడటం, పార్కులో వాకింగ్ లేదా పర్వతాల్లో ట్రెక్కింగ్ ఇలా ఏదైనా సరే.. రోజంతా మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నవి చేస్తూ గడిపేయడం.. కొన్ని సూచనలు.. దీని వల్ల ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. దీంతో ఆనందం కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రోజూ తప్పక చేసే పనులకు ఒక్కరోజు పూర్తిగా వీడ్కోలు పలకాలి. సోలో డేటింగ్ అంటే ఏదో ఒంటరిగా స్తబ్ధుగా గడిపేయడం కాదు. ప్రణాళికా బద్దంగా, రాజీ పడకుండా మనం కోరుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం. ఒత్తిడి నుంచి సామాజిక బాధ్యతల నుంచి కూడా విరామం లభిస్తుంది. ఆ డేట్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు.. ఎవరు చెప్పిందీ ఫాలో అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం మనసు మాట మాత్రమే వినాలి. నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చింది ఏంటో తెలుసుకునే సెల్ఫ్ అవేర్నెస్ కలుగుతుంది.(చదవండి: వాన వెలిసినా... ముసిరే వ్యాధులు) -
వాన వెలిసినా... ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. వర్షాల అనంతరం నిమోనియా, ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే... వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ. ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్పై చేరుకున్న వైరస్లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్నాబ్స్పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్మిషన్’ అని కూడా అంటారు. రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో కొత్త వైరస్లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ల తాలూకు కొత్త స్టెయిన్లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్లు చాలా చురుగ్గా (విరులెంట్గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే... వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ. ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా? ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం. నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడంతక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం. ∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం. హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.చికిత్స...వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం. పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం. పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు. డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది? డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా? డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా? డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ (చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!) -
గణేశుడే అలంకరణ
ప్రకృతిని కొలువు తీర్చి, పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయేలా చేసే ఉత్సవం గణేశ్ చతుర్థి. ఇంట్లోనూ.. వీథుల్లోనూ గణేశ్ మూర్తుల నుంచి అలంకరణ వరకు ప్రతిదీ గ్రాండ్ గా తీర్చిదిద్దుతారు. అయితే, గణేశుడు అంటేనే ప్రకృతి కాబట్టి పండగలోని ఆంతర్యం తెలుసుకొని, పర్యావరణానికి ప్రాముఖ్యం ఇచ్చేలా అలంకరణ చేద్దాం.ఆకర్షణీయమైన మండపం అవసరమైనవిపాలవెల్లి తయారీకి వెదురు బద్దలు, బ్యాక్డ్రాప్ కోసం జ్యూట్ ఫాబ్రిక్ లేదా పువ్వుల ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్, మామిడి, అరటి ఆకులు, స్టేజ్ చుట్టూ వెలిగించడానికి మట్టి ప్రమిదలు, తాజా పువ్వులు ప్రధానంగా కావాల్సినవి. ఇంట్లో కూడా వేదిక అవసరం కాబట్టి వెదురు బద్దలతో మండపాన్ని ఏర్పాటు చేయవచ్చు. సెంటర్ టేబుల్ లేదా టేబుల్ లేదా పీట వంటిది ఒకటి తీసుకొని, నాలుగు వైపుల వెదురు బద్దలను ఏర్పాటు చేసి, వేదిక సిద్ధం చేసుకోవాలి. బ్యాక్డ్రాప్గా జ్యూట్ లేదా పెయింట్ చేసిన ఫాబ్రిక్ కట్టి, ఇరువైపులా పూలమాలలను, మామిడాకులను వేలాడదీయాలి. వేదిక చుట్టూ మట్టి ప్రమిదలు వెలిగించి, లోపల మట్టి గణేశుని ఉంచాలి.ఫెయిరీ లైట్స్ తోరణాన్ని వెదురు బద్దలకు అమర్చాలి. రాత్రిళ్ళు ఈ దీపాలు వెలిగితే చాలా క్లాసీగా, కలర్ ఫుల్గా కనిపిస్తుంది.ఇల్లంతా వెలుగుఇంటి ప్రవేశ ద్వారం, ద్వారాలు, గోడలతో పాటు గణేశుడి ప్రధాన మండపాన్ని అందమైన పూలు, తీగలతో అలంకరింవచ్చు. ఎరుపు, పసుపు, పచ్చ రంగు కాంబినేషన్లో ఫ్యాబ్రిక్ తోరణాలు మరింత ప్రత్యేకతను ఇస్తాయి. రంగోలీలో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూల రేకలు, వివిధ మోడల్స్లో ఉన్న ప్రమిదలను వెలిగించవచ్చు. పేపర్ లాంతర్లను ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. వీటికి అందమైన మోటిఫ్లను అతికించి, తమదైన సృజనాత్మకతను జోడించవచ్చు. (చదవండి: గణపయ్యకు టెక్నో హారం!) -
మేని కాంతికి మెరుగైన చికిత్స..!
చాలామంది ఆడవారు తన చర్మానికి లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ మచ్చలు లేని మృదువైన చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే వయసు పెరిగే కొద్ది ట్రెండ్కి తగ్గట్టుగా ఎన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అందుబాటులోకి వచ్చినా, ఎన్ని తాత్కాలిక చిట్కాలు పాటించినా కాంతిమంతమైన, మృదువైన చర్మం కావాలంటే టెక్నాలజీని నమ్ముకోవాల్సిందే! అందులో భాగమే ఈ గాడ్జెట్! దీని పేరు ‘ఆర్ అండ్ ఎఫ్ స్కిన్ టైటెనింగ్ రిజువనేషన్ మెషిన్!’ ఈ చిత్రంలోని రింకిల్ రిమూవల్ మెషిన్తో ముడతలను తొలగించుకోవడంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు. డబుల్ చిన్, ఐ బ్యాగ్స్ వంటి వయసుతో వచ్చే ఎన్నో సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ స్కిన్ కేర్ డివైస్తో ట్రీట్మెంట్ పొందితే వయసును దాచేయవచ్చు. యవ్వనంగా కనిపించొచ్చు.స్మూత్ రింకిల్స్, లిఫ్ట్ ఐ కాంటౌర్, కాంపాక్ట్ పోర్స్, వి–షేప్డ్ ఫేస్, సబ్ట్రాక్టివ్ డబుల్ చిన్, గో ఐ బ్యాగ్స్ అండ్ డార్క్ సర్కిల్స్, రోజీ ఫేస్ కలర్ వంటి 11 ఆప్షన్స్ ఈ డివైస్లో ఉంటాయి. అందుకు తగ్గ హెడ్స్ కూడా లభిస్తాయి. వాటిని వినియోగించుకుని చర్మాన్ని నిగనిగలాడేలా మార్చుకోవచ్చు. దీని ధర సుమారుగా 110 డాలర్లు. అంటే 9,634 రూపాయలన్న మాట! ఇందులో అదనపు టెక్నాలజీని బట్టి ఆప్షన్స్ని బట్టి ధరల్లో మార్పు ఉంటుంది.సౌందర్య చికిత్స..మెరుగైన చర్మ సౌందర్యానికి ఎక్స్ఫోలియేషన్ చికిత్స చక్కని మార్గం. ఈ చికిత్స ముఖ్యమైన ప్రక్రియ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడమే! ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను, మురికిని తొలగించి, కొత్త చర్మ కణాలు పునరుజ్జీవం పొందేందుకు దోహదపడుతుంది. ఈ ట్రీట్మెంట్తో చర్మం మరింత కాంతిమంతంగా, మృదువుగా మారుతుంది. అయితే ఈ ట్రీట్మెంట్లో రెండు రకాలున్నాయి. ఒకటి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్! ఇందులో స్క్రబ్లు, బ్రష్లు లేదా గ్లోవ్స్ వంటి వాటిని ఉపయోగించి చర్మాన్ని బాగా రుద్దుతారు. ఈ పద్ధతి సాధారణంగా ఇంట్లోనే చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఓట్ మీల్ లేదా షుగర్ స్క్రబ్లను ఉపయోగించవచ్చు. ఇక రెండవ రకం కెమికల్ ఎక్స్ఫోలియేషన్! ఈ పద్ధతిలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ వంటి రసాయన పీలింగ్లను ఉపయోగిస్తారు. వీటివల్ల మృతకణాలు, జిడ్డు వంటి సమస్యలు సులభంగా తొలగిపోయి, ప్రత్యేకమైన కాంతి వస్తుంది. ఈ ట్రీట్మెంట్లను సాధారణంగా నిపుణుల పర్యవేక్షణలో పొందడమే ఉత్తమం. (చదవండి: అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!) -
అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!
స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్ కాంచీపురం నుంచి మోనోటోన్ బనారసీ, ఫ్లోరల్ నుంచి బ్రోకేడ్ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.ఆభరణాల పండుగ! పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్. ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్ మోటిఫ్స్తో వచ్చే టెంపుల్ హారాలకు బాగా డిమాండ్ ఉంది.చీర బ్రాండ్: స్నేహాలయ సిల్క్స్, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్ : ఇతిహాస జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
అరటి పండు చిప్స్.. వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా హాట్ చిప్స్ అనే ఒక పూర్తి స్థాయి చిరుతిళ్ల దుకాణాలు అన్ని నగరాల్లో పాగా వేయడానికి కూడా ఈ బనానా చిప్స్ పై జనంలో పెరిగిన క్రేజ్ బాటలు వేసిందని చెప్పొచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ నుంచి రాత్రి వేళల్లో ఛీర్స్ దాకా కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎంచుకునే చిరు తిండి అదే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే చాలా మంది పర్యాటకులు తప్పకుండా చేసే పనులలో ఒకటి అక్కడ నుంచి తాజా తాజా బనానా చిప్స్ను కొనుగోలు చేసి తమ స్వస్థలాలకు తీసుకురావడం.. ఎవరైనా సన్నిహితులు కేరళ వెళుతుంటే కూడా వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకురా అంటూ అభ్యర్ధించే తెలుగువారికీ కొదవలేదు.ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్ధాలలో కల్తీపై తనిఖీలు నిర్వహించింది. ఆ సందర్భంగా సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షలలో, విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ లో రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే ఆహారాలలో నిషేధిత రంగులు, నిల్వకారక రసాయనాలు, పురుగుమందుల మిశ్రమాలు బయటపడ్డాయి. అవి అనుమతించదగిన పరిమితి కంటే దాదాపు 3,500% వరకూ ఎక్కువగా ఉండడం అందర్నీ షాక్కి గురి చేసింది.అధికారులు తమ నివేదికను సిద్ధం చేయడానికి రాష్ట్రంలో విక్రయించే 650 పైగా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించారు. వారి పరిశోధన ఫలితాల ప్రకారం... స్వల్ప స్థాయిలో కూడా ఏదైనా ఆహారాన్ని విషపూరితంగా మార్చే పారిశ్రామిక రంగు అయిన రోడమైన్ బి, పామ్ షుగర్ బెల్లంలలో కనపడింది. క్యాన్సర్ కారక రసాయనమైన అమరాంత్, రోజ్బెర్రీ, బీఫ్ చిల్లి, డ్రైడ్ ప్లమ్లలో, మరొక హానికరమైన రసాయనం, ఆరెంజ్ 2, రెడ్ గ్రామ్ నిమ్మకాయ ఊరగాయలలో లభ్యమైంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన బ్రాండెడ్ మిరపకాయ పొడులలో సుడాన్ 1, 2, 3, 4 అనే పేరు కలిగిన క్యాన్సర్–సంబంధిత పదార్థాల జాడ దొరికింది.ఈ తరహా హానికారక ఉత్పత్తులు మేళవించిన వివిధ రకాల మిశ్రమాలు, ప్లం కేక్తో పాటు బనానా చిప్స్లో కూడా బయటపడడం అరటి పండు చిప్స్ ని ఇష్టంగా తినేవారిని భయాందోళనలకు గురి చేసింది. ఈ మిశ్రమం..అరటి పండు చిప్స్ తినేవారిలో కలిగించే అనారోగ్యాలు సాధారణ అజీర్ణం నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకూ ఉండవచ్చునని వెల్లడి కావడం మింగుడు పడని విషయంగా మారింది. ఈ నేపధ్యంలో కేరళ నుంచి తరలివచ్చే వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న బనానా చిప్స్ ను వినియోగించే విషయంలో సైతం ఆరోగ్యార్ధులు ఆచితూచి వ్యవహరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రంలో అధికారులు చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు తినుబండారాలపై తనిఖీలు చేపట్టాలని, వారు విడుదల చేసినట్టుగానే హానికారక పదార్ధాలను కొలతలతో సహా జాబితాగా విడుదల చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
విలక్షణ వినాయకుడు..!
ఆదిపూజలు అందుకునే వినాయకుడికి దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పురాతన ఆలయాల్లో విలక్షణమైన వినాయక విగ్రహాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అత్యంత అరుదైన ఆలయాలు, విలక్షణమైన విగ్రహాలు ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాలు, విగ్రహాల విశేషాలు మీ కోసం...వినాయకుడిని భక్తులు గజాననుడిగానే ఆరాధిస్తారు. వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉంది. పార్వతీదేవి నలుగుపిండితో రూపొందించిన వినాయకుడు లక్షణంగా మానవముఖంతోనే ఉండేవాడు. తనను అడ్డగించినందుకు శివుడు కోపగించి, అతడి తలను నరికేసి, ఆ తర్వాత జరిగిన పొరపాటుకు చింతించి గజముఖాన్ని అతికించిన పురాణ కథ అందరికీ తెలిసినదే! గజాననుడిగా మారక ముందు బాలవినాయకుడి రూపంలో కొలువుతీరిన ఆలయం ఇది. వినాయకుడి తొలి రూపం ఇదే గనుక దీనికి ఆదివినాయక ఆలయంగా పేరు వచ్చింది. ఈ ఆలయం తిలతర్పణపురిలోని ముక్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఇది క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శ్రీరాముడు ఇదేచోట తన తండ్రి దశరథుడికి పితృశ్రాద్ధం నిర్వహించి, తిల తర్పణాలు సమర్పించాడనే కథనం కూడా ఉంది. అందువల్ల ఇది కాశీ, రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. ఐశ్వర్య గణపతికలువా వినాయకుడుఅత్యంత భారీ ఏకశిలా విగ్రహం ఇది. ఆరుబయట పంట పొలాల మధ్య ఉన్న ఈ విగ్రహానికి ఆలయమేదీ లేదు. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ ఏకశిలా విగ్రహం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 7.62 మీటర్లు. పీఠంతో కలుపుకొంటే, దీని ఎత్తు 9.14 మీటర్లు. ఈ విగ్రహం పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. సుమారు క్రీస్తుశకం పన్నెండో శతాబ్దిలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని అంచనా.అడవీయ గణపతిపురాతనమైన ఈ ఏకశిలా గణపతి విగ్రహం శ్రీలంకలోని ఉడుదుంబరలో ఉంది. అడవులకు రక్షణగా ఉంటాడని భావించి, ఈ విగ్రహాన్ని నెలకొల్పడం వల్ల ఈ గణపతికి ‘అడవీయ గణపతి’ అనే పేరు వచ్చింది. ఇది సుమారు పన్నెండో శతాబ్ది నాటిదని అంచనా.స్థానిక గిరిజన తెగ నాయకుడికి వినాయకుడు కలలో కనిపించడంతో ఆయన ఈ విగ్రహాన్ని నెలకొల్పాడని స్థానికుల కథనం. దీని ఎత్తు 6 మీటర్లు. ఇది ప్రపంచంలోని అతి ఎత్తయిన వినాయక విగ్రహాలలో మూడవ స్థానంలో నిలుస్తుంది. శ్రీలంకలోని హిందువులే కాకుండా, విదేశీ పర్యాటకులు కూడా ఈ విగ్రహాన్ని సందర్శించుకుంటూ ఉంటారు.త్రినేత్ర గణపతివినాయకుడి తండ్రి పరమశివుడు ముక్కంటి అని అందరికీ తెలుసు. మూడు కన్నులతో వినాయకుడు కొలువుదీరిన అరుదైన ఆలయం రాజస్థాన్లో ఉంది. రణథాంబోర్ కోట ప్రాంగణంలో ఉన్న ఈ త్రినేత్ర గణపతి ఆలయం క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నాటిది. రణథాంబోర్ కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన రాజు హమీర్ వినాయకుడికి వీరభక్తుడు. ఆయన యుద్ధాలకు వెళ్లేటప్పుడల్లా ముందుగా ఈ త్రినేత్ర గణపతికి ప్రత్యేక పూజలు జరిపించి మరీ బయలుదేరేవాడట! ఈ ఆలయానికి చేరుకోవాలంటే, కోటలో నిర్మించిన రెండువందల యాభై మెట్ల మీదుగా మెట్ల మార్గం ఉంది. కోట లోపలి వైపునే అర కిలోమీటరు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయంలో ఇక్కడి త్రినేత్ర గణపతి తన భార్యలు సిద్ధి, వృద్ధి; కొడుకులు శుభ లాభాలతో కలసి కొలువుదీరడం విశేషం. వినాయకుడు ఇలా సకుటుంబంగా కొలువుదీరిన ఏకైక ఆలయం ఇదొక్కటే!కలువా వినాయకుడుఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వినాయక ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో రూప్కుండ్– నందాదేవి పర్వతారోహక యాత్రకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ‘కలువా’ వినాయక ఆలయం లేదా ‘కేల్వా’ వినాయక ఆలయంగా పేరుపొందిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తున ఉంది. మంచుకొండల్లో ఒక కొండ మీద ఉన్న ఈ ఆలయం చాలా చిన్నది. దీని ఎత్తు కేవలం అరడుగులు. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిక కోరికలు ఈడేరుతాయని భక్తులు నమ్ముతారు. పర్వతారోహకులు తప్ప సామాన్యులు ఈ ఆలయాన్ని సందర్శించడం దుస్సాధ్యం.(చదవండి: గిన్నిస్లో గణపయ్య..) బ్రొమో గణపతిపురాతనమైన ఈ గణపతి విగ్రహం ఇండోనేసియాలో ఉంది. తూర్పు జావాలోని టెంగెర్ పర్వతాలకు చెందిన ‘బొమో’ అగ్నిపర్వత శిఖరంపై కొలువైన ఈ విగ్రహం ఏడు శతాబ్దాల నాటిది. ‘బ్రహ్మ’ను జావా హిందువులు స్థానిక భాషలో ‘బ్రొమో’ అంటారు. బ్రహ్మదేవుడి పేరిట ఈ అగ్నిపర్వతాన్ని ‘బ్రొమో’ అని పిలుచుకుంటారు. జావాలోని టెంగెరీ తెగకు చెందిన వారు ఇక్కడ వినాయక విగ్రహాన్ని నెలకొల్పినట్లు చెబుతుంటారు. సముద్ర మట్టానికి ఏడువేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి పూజలు చేసేందుకు జావా ప్రజలు పర్వతారోహణ చేస్తుంటారు. ఈ వినాయకుడు తమను అగ్నిపర్వతాల పేలుడు నుంచి, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడతాడని జావా ప్రజల నమ్మకం. (చదవండి: గిన్నిస్లో గణపయ్య..!) -
అవును.. దయ్యాలు ఉన్నాయి... ఇవిగో...
దయ్యం కనపడినా భయపడతారు. దయ్యం ఎవరి ఒంటి మీదకు వచ్చినా భయపడతారు. అసలు దయ్యం మాటెత్తితేనే భయం. ఉన్నాయేమోనని భయం. ఉండే ఉంటాయని భయం. దయ్యాన్ని ఎవరైనా చూశారా? చూసినవారు లేరు. అయినా భయమే. అన్నట్టు దెయ్యాలు ఉన్నాయా? ఏమో... చూద్దాం...పల్లెటూళ్లలో దెయ్యాల పుకార్లు మామూలే. కర్నాటకలోని ఆ పల్లెలో కూడా హఠాత్తుగా దయ్యాల గోల మొదలయ్యింది. నేను చూశానని ఒకరంటే అటు పోయింది అని మరొకరంటారు. దెయ్యాలు లేవు.. కాని ఒంటరి స్త్రీ కనిపిస్తే చాలు ఆమెను వేధించే మగాళ్లు దెయ్యాలు కాకపోతే మరెవరు అని ప్రశ్నిస్తూ తీసిన చిన్న సినిమా ‘సు ఫ్రమ్ సో’ కన్నడ నాట సూపర్హిట్ అయ్యింది. 5 కోట్లతో తీస్తే 125 కోట్లు సంపాదించింది. స్త్రీలను గౌరవించమని చెప్పిన మెసేజే కారణం.కర్నాటక తీరప్రాంతంలో మంగళూరుకు దగ్గరగా ఉన్న చిన్న పల్లె ‘మర్లూరు’. ఈ ఊళ్లో అందరూ చిన్న చిన్న పనులు చేసుకు బతికేవారే. పెళ్ళిళ్లు, దినకర్మలు ఆర్భాటంగా చేస్తూ డాబుసరికి తగ్గని మనుషులే అందరూ. సరే... ఊరన్నాక వయసొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉండకుండా ఉంటారా. పెయింట్ పని చేసుకు బతికే ఒక కుర్రాడికి ఆ ఊళ్లో ఒకమ్మాయి తో మనసవుతుంది. ఇద్దరూ ప్రేమలో ఉండగా ఒక అర్ధరాత్రి ఆ అమ్మాయి ఇంటి గోడ దూకి దొరికిపోయే ప్రమాదానికి చేసుకుంటాడు పెయింటర్. దొరికితే తోలు వొలిచేస్తారు. పైగా పరువు పోతుంది. అందుకే అతడు తప్పించుకోవడానికి ఒంటి మీదకు దెయ్యం వచ్చినట్టుగా నటిస్తాడు. ఒంటి మీదకు దెయ్యం రావడం వల్లే అర్ధరాత్రి ఊళ్లో తిరుగుతున్నాడని అనుకునేలా చేస్తాడు. ఇంకేముంది. ఊళ్లోకి దయ్యం వచ్చేసినట్టే.మనుషులకు రకరకాల నమ్మకాలు. బొట్టు పెడితే దయ్యాలు పోతాయని, కొరివి చూపిస్తే పోతాయని,... మామూలు దయ్యాలైతే పారిపోవచ్చు గాని నటించే దయ్యాలు ఎక్కడికి పోతాయి?పెయింటర్కు దయ్యం పట్టిన సంగతి ఊరంతా తెలుస్తుంది. అతణ్ణి చూస్తే చాలు ఊరంతా పరుగే. పాపం ఆ పెయింటర్ తల్లిదండ్రులు ఇంట్లో ఉండలేక బయటకు పోలేక నానా బాధలు పడుతుంటారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు అప్పడం కర్ర్మన్నా, టైరు తుస్సుమన్నా దయ్యమేమోనని దడుచుకోవడమే. ఊళ్లోకి దయ్యం వస్తే దయ్యాన్ని వదలగొట్టే మంత్రగాడు రావడం ఆనవాయితీ. వచ్చి ‘నువ్వెవరు?’ అని అడుగుతాడు పెయింటర్ వొంటి మీదున్న దయ్యాన్ని. పెయింటర్కు ఏం చెప్పాలో అర్థం కాదు. ‘కాంచన’ సినిమా పోస్టర్ కనిపిస్తే ‘కాంచన’ అంటాడు. తలుపు బయట ఉన్నవారికి ‘సులోచన’ అని వినిపిస్తుంది. ‘ఎక్కణ్ణుంచి వచ్చావు’ అని అడుగుతాడు మంత్రగాడు. పెయింటర్ ఏమీ చెప్పకముందే ‘సోమేశ్వరం నుంచి అట’ అని జనమే అనుకుంటారు. ఊళ్లోకి వచ్చిన దెయ్యం ‘సోమేశ్వరం సులోచన... సు ఫ్రం సో’... అదే సినిమా టైటిల్ ‘సు ఫ్రమ్ సో’...ఇక ఊళ్లో వాళ్లంతా ‘సోమేశ్వరం నుంచి వచ్చిన సులోచన’ ఏం చేస్తే పెయింటర్ను వదిలి వెళుతుందో అనే అన్వేషణ సాగిస్తారు. ఆ ఊరికి దాపునే ఉన్న సోమేశ్వరంలో సులోచన అనే పేరున్న ఆమె ఎవరైనా మరణించిందేమోనని కనుక్కుంటారు. ఇటీవల ఆ పేరుతో ఉన్న ఒక పెద్దామె మరణించిందని తెలుస్తుంది. ఆ ఇంటికి వెళితే ఆమె ఒక్కగానొక్క కూతురు కటిక పేదరికంలో ఉంటుంది. వయసొచ్చిన అమ్మాయి. ఇంకా పెళ్లి కాలేదు. ఒక్కత్తే నివసిస్తోంది. ఈ కూతురి ద్వారా తల్లి ఆత్మకి ఏం కావాలో తెలుసుకుందామని ఊరివాళ్లు ప్రయత్నిస్తారు. తల్లి ఆత్మను ఎలా శాంతింపచేయాలో ఆ అమ్మాయినే కనుక్కుని చెప్పమంటారు. కాని ఈప్రాసెస్లో ఆ అమ్మాయి కష్టాలు తెలిసేకొద్దీ అసలు దయ్యాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుస్తుంది. ఆ అమ్మాయిని ఆమె బాబాయి చెరబట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తల్లి చనిపోయాక అతని ఆగడాలు మరీ శ్రుతి మించితే తలుపుకు అడ్డాలు పెట్టి రాత్రిళ్లు నిద్ర కాస్తూ ఉంటుంది. ఆ బాధ ఒకటైతే ఊళ్లోని పోరంబోకు కుర్రాళ్లు రాత్రిళ్లు గోడ దూకి తలుపు కొడుతుంటారు. ఒంటరి స్త్రీ మర్యాదగా బతుకుదామంటే దయ్యాల్లా మగాళ్లు పీక్కుతింటున్నారని ఆ అమ్మాయి కష్టాలు వింటే తెలుస్తుంది. పెయింటర్కు పట్టిన దయ్యం కంటే ఈ అమ్మాయి చుట్టూ ఉన్న దయ్యాలను ఒదిలించడమే ముఖ్యమని భావించిన ఊరు ఆ దుర్మార్గులకు దేహశుద్ధి చేయడంతో ‘సు ఫ్రం సో’ సినిమా ముగుస్తుంది. దుర్మార్గులకు బుద్ధి చెప్పడం వల్ల పెయింటర్కు పట్టిన సోమేశ్వరం సుశీల అనే అబద్ధపు దయ్యం కూడా నిష్క్రమిస్తుంది. ఊరంతా హాయిగా ఊపిరి పీల్చుకోడమే కాదు ఆ ఒంటరి అమ్మాయిని తమ ఊరికి కోడలి గా తెచ్చుకుంటుంది. రాజ్ బి.శెట్టి నిర్మాతగా కొత్త దర్శకుడు జె.పి.తుమినాడ్ తీసిన కన్నడ చిత్రం ‘సు ఫ్రమ్ సో’ బలమైన సందేశాన్ని విపరీతమైన హాస్యంతో, జనం సెంటిమెంట్లతో, మూఢత్వాన్ని తెలివినీ మానవత్వాన్ని జోడించి చెప్పడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. జూలై 25న విడుదలై ఇప్పటికి 125 కోట్లు సంపాదించింది. ఖర్చు పెట్టింది 5 కోట్లే! ఒంటరిగా ఉన్న స్త్రీ అంటే మగాడికి ఎందుకు లోకువ. వితంతువు, పెళ్లి కాని స్త్రీ, విడాకులు పొందిన స్త్రీ, పెళ్లి వద్దనుకున్న స్త్రీ... ఈమె తన మానాన తాను బతుకుదామనుకుంటే ఆమెను వేధించడానికి దయ్యాల్లా ఎందుకు వెంటపడతారు. ఆమె లోబరుచుకోవడానికి ఎంత పాశవికంగానైనా ఎందుకు ప్రయత్నిస్తారు? మానవత్వం లేని ఇలాంటి మగాళ్లు దయ్యాల కంటే భయానకమైన వాళ్లు అని దర్శకుడు చెప్పడం జనానికి బాగా నచ్చింది. మగాళ్లు దయ్యాలుగా మారవద్దని, సంస్కారమనే రక్షను వాళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుందాం. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ తెలుగులో కూడా ఉంది. ఒంటరి స్త్రీ మర్యాదగా బతుకుదామంటే దయ్యాల్లా మగాళ్లు పీక్కుతింటున్నారని ఆ అమ్మాయి కష్టాలు వింటే తెలుస్తుంది. పెయింటర్కు పట్టిన దయ్యం కంటే ఈ అమ్మాయి చుట్టూ ఉన్న దయ్యాలను ఒదిలించడమే ముఖ్యమని భావించింది ఆ ఊరు. -
కూకట్పల్లిలో దారుణం.. ఈ పాపం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల చదువు కూడా ఇంకా పూర్తి కాని ఓ బాలుడు.. పక్కింట్లో ఉన్న ఓ అమాయక బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తనకు కావాల్సిన ఓ చిన్న క్రికెట్ బ్యాట్ (Cricket Bat) దొంగతనం చేయాలనుకునే క్రమంలో అభమూ శుభమూ తెలియని చిన్నారిని బలిగొన్నాడు. హైదరాబాద్ రాజధాని నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ అమానుష ఘటనలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. పదో తరగతి చదువుతున్న బాలుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడమేంటి? అదీ నడిబొడ్డున జరగడం ఏమిటి? రేపటి పౌరులను రేపటి నేరగాళ్లుగా మారుస్తున్న ఈ పాపం ఎవరిది? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ తలెత్తుతున్నాయి.దొంగతనానికి వెళ్లే ముందు తాను పక్కాగా ప్లాన్ చేసుకున్నానని.. అవసరమైతే హత్య ఎలా చేయాలి? అనేది కూడా ముందే ఆలోచించానని కూకట్పల్లిలో (Kukatpally) బాలిక హత్య కేసు నిందితుడైన బాలుడు చెబుతున్నాడు. ఆ బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు కూడా ఉందనీ వెల్లడైంది. దీంతో ఈ తరహా క్రైమ్ నేపథ్య సినిమా/సిరీస్ల ప్రభావంపై చర్చ మొదలైంది. మోగుతున్నాయ్.. డేంజర్ బెల్స్ కోవిడ్ 19, లాక్ డౌన్ ప్రభావంతో పిల్లలతో సహా ప్రతి ఒక్కరికీ స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు.. ఇలా ఇంటర్నెట్కు అనుసంధానిత పరికరాల వాడకం పెరిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా సులభంగా యాక్సెస్ చేయడం వల్ల వెబ్ సిరీస్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవి చాలా మందికి ఒక రకమైన వ్యసనంలా మారిపోయాయి. వెబ్సిరీస్తో సమస్య ఏమిటంటే.. సిరీస్ నచ్చితే వీక్షకులు ఒక ఎపిసోడ్ చూసి ఆపడం సాధ్యం కాక మొత్తం సిరీస్ను చూస్తున్నారు. పరిశోధనలు చెబుతోందదే.. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్కు చెందిన క్రిమినాలజీ రిసెర్చర్స్ చేసిన పరిశోధనలో కేవలం వెబ్ సిరీస్ చూడడం వల్ల 34 శాతం మంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని, భయాందోళనలకు రాత్రివేళ పీడ కలలకు గురవుతున్నారని తేల్చారు. క్రైమ్ కంటెంట్ చూసిన ప్రతీ నలుగురు టీనేజర్లలో ఒకరు అభద్రతకు లోనవుతున్నారని, క్రిమినల్స్ను హీరోలుగా అపోహపడే ప్రమాదం పెరుగుతోందని స్పష్టం చేసింది. ఈ తరహా క్రైమ్ కంటెంట్ పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికలతో వస్తున్నప్పటికీ చిన్నారులు (Kids) మాత్రం సులభంగానే చూడగలుగుతున్నారని వెల్లడించింది. చదవండి: కూకట్పల్లి కేసు.. పోలీసులు ఏం చెప్పారంటే..? పర్యవేక్షణే శరణ్యం.. ఈ నేపథ్యంలో కొందరు పిల్లల్లో అభద్రతా భావం పెరుగుతుంటే.. మరికొందరిలో నేర పూరిత మనస్తత్వం విజృంభిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. వారిని స్క్రీన్ వీక్షణ నుంచి మళ్లించి ఆరోగ్యకరమైన ఆటలు, హాబీల వైపు దృష్టి నిలిపేలా చేయడం, అలాగే క్రైమ్ కంటెంట్ను చిన్నారులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అదీ ఒక కారణమే.. కాని అదే కారణం కాదు... హింసాత్మక ప్రవృత్తికి కేవలం సోషల్ మీడియా (Social Media) మాత్రమే కారణం అని చెప్పలేం. అయితే.. అదీ ఒక కారణమే. సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలకు ఇవి ప్రేరకంగా పనిచేస్తాయని అనొచ్చు. అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు కూడా అగ్రెసివ్ నెస్ను పెంచుతాయి. ఏదేమైనా ఈ స్వభావాన్ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. – డా.చరణ్ తేజ్, న్యూరో సైక్రియాట్రిస్ట్ -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..
ఐఏఎస్ అయ్యేందుకు యువత ఎంతగా పరితపిస్తుందో తెలియనిది కాదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. ఏళ్లుగా ప్రిపేర్ అవ్వతూ ఐఏఎస్ అవ్వాలని తపిస్తుంటారు. అలాంటి కలను ఇక్కడొక వ్యక్తి ఎలా సాకారం చేసుకున్నాడో వింటే విస్తుపోతారు. ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ వింటే..నిజాయితీగా లభించిన ఉద్యోగం మంచిగా చేసుకుంటూ..అధికారుల మన్ననలను పొందుతూ ఊహించని విధంగా తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సక్సెస్ స్టోరీ ఇది.ఈయన్ని మరో అబ్దుల్ కలాం అనొచ్చు. అతడే కేరళకు చెందిన అబ్దుల్ నాజర్. అతడి బాల్యం కష్టాలతో ప్రారంభమైంది. ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని దూరం చేసింది. పాపం తల్లి కుటుంబాన్ని పోషించుకునేందుకు పనిమనిషిగా మారి జీవనం సాగించాల్సి వచ్చింది. రాను రాను పరిస్థితి కడు దయనీయంగా మారడంతో నాసర్ అతని తోబుట్టువులు అనాథశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అంతేగాదు పదేళ్ల వయసులో కుటుంబాన్ని పోషించుకునేందుకు డెలివరీ బాయ్గా..ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్గా ఇలా చిన్నాచితక పనులు చేసుకుంటూ చదువుని సాగించేవాడు. ఇన్ని కష్టాల మధ్యలో ఎక్కడ చదువుని మాత్రం వదిలేయలేదు నాజర్. అలా రాష్ట్ర ఆరోగ్య శాఖలో క్లర్క్ ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఇష్టమైన డ్రీమ్. అయితే అదరిలా నాసర్కి కూడా యూపీఎస్సీకి ప్రిపరై, సివిల్స్ రాయాలని ఉండేది. కానీ తనకున్న బాధ్యత రీత్యా అది సాధ్యపడదు. అదీగాక అంత డబ్బు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోవడం అనేది సాధ్యమై పని కాదు. అందుకని అతడు ఎంచుకున్న మార్గం వింటే వావ్..అని మెచ్చకోకుండా ఉండలేరు. ఎందుకుంటే తనకు లభించిన ఉద్యోగాన్నే అధికారుల మన్ననలను పొందేలా వర్క్ చేయాలని భావించాడు. అతడి కష్టానికి తగ్గా ప్రతిఫలం ప్రమోషన్ల రూపంలో వస్తూనే ఉండేది. అలా మొత్తం 20 ఏళ్ల అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. అతని అత్యుత్తమ ట్రాక్ రికార్డు కారణంగా 2017లో సివిల్స్ ఎగ్జామ్ రాయకుండానే ఐఏఎస్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. చెప్పాలంటే తన అచంచలమైన కృషితో అత్యున్నత అధికారి అయ్యాడు. ఈ కథ ఆలోచింప చేసేలా ఉన్నా..బహుశా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ నాసర్ ఈ అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు దశాబ్దాల ఓపిక, అచంచలమైన కృషి, కష్టపడేతత్వం వంటివి ఆయుధాలుగా మలుచుకున్నాడనేది గుర్తురెగాలి. ఈ స్టోరీ కలను సాకారం చేసుకోలేకపోయామని కృశించి పోకూడదు..శక్తివంతమైన ఆలోచనా దృక్పథంతో సాధ్యమయ్యేలా చేసుకోవచ్చని తెలుపుతోంది. ఓపికతో నిశబ్ధంగా తన పని తాను చేసుకుంటూపోతే..ఏదో ఒకనాటికి లక్ష్యానికి చేరకుంటాం అనేది జగమెరిగిన సత్యం. అంతేగాదు పట్టుదలతో అడియాశగా మిగిలిన కలను సైతం ఆశాకిరణంగా మార్చుకోవచ్చని అబ్దుల్ నాసర్ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?
ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. బ్రెడ్, ఎనర్జీ బార్లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) (చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..) -
పర్యాటక ప్రాంతాలకు 'పరుగో పరుగు'
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్గా నిర్వహించే ఏదో ఒక మారథాన్లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది.. పలువురు ఔత్సాహికులు వెకేషన్తో పాటు మారథాన్ కూడా చేస్తున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మారథాన్లలోనూ పాలుపంచుకుంటున్నారు. మరికొందరు ఏకంగా రికార్డులవైపు పరుగు పెడుతున్నారు.. ఈ క్రమంలోనే రన్కేషన్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మారథాన్ పరుగునే క్రమంగా వెకేషన్తో కలగలిపి రన్కేషన్ అని పిలుస్తున్నారు.. ఈ ట్రెండ్ టూరిజానికి కూడా భారీగా ఊపునిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నమాట. అనుభవజ్ఞులైన రన్నర్లకు, అంతర్జాతీయ రేసులు అంటే కేవలం ఒక ప్రధాన మారథాన్కు అర్హత సాధించడం లేదా మరో వ్యక్తిగత పరుగు పందెం వేయడం మాత్రమే కాదు.. అవి కొత్త పర్యాటక గమ్యస్థానాలను అన్వేషించడానికి ఒక అవకాశం కూడా. ‘సెలవులు ఇప్పుడు రన్ కేషన్లుగా మారాయి’ అని ప్రముఖ మారథాన్ రన్నర్లు ఈ ట్రెండ్ను నిర్వచిస్తున్నారుఈవెంట్ల కోసమే..‘మారథాన్ టూర్లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది పేరున్న అథ్లెట్లు కాదు, ఈవెంట్ల కోసం మాత్రమే శిక్షణ పొందే అమెచ్యూర్ రన్నర్లు. అందుకే మారథాన్ టూరిజం ఊపందుకుంటోంది’ అని మారథాన్ టూర్లను నిర్వహించే గౌరీ జయరామ్ అంటున్నారు. నగరం నుంచి పర్యాటక పరుగుల కోసం ఎంచుకుంటున్న వాటిలో దేశీయంగా ముంబైలో జరిగే టాటా ముంబై మారథాన్, అలాగే న్యూఢిల్లీ, చెన్నైలలో జరిగే రన్స్, అదే విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ మారథాన్, రియో మారథాన్, అంటార్కిటికా మారథాన్, లండన్, టొరంటో, న్యూయార్క్.. వంటివెన్నో ఉన్నాయి. మారథాన్ టూరిజం అంటే..మారథాన్ అంటే అత్యంత సుదీర్ఘ దూరంలో పాల్గొనే పరుగు పందెం పోటీలు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ మారథాన్ ఈవెంట్స్ దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక అలంకారంగా మారాయి. అంతర్జాతీయంగానూ అనేక నగరాల్లో విందు, వినోదాల సమ్మేళనంగా సాగే ఈ మోడ‘రన్’ ఫెస్టివల్స్.. రాను రానూ పర్యాటక ఆకర్షణగా కూడా స్థిరపడుతున్నాయి. ఒకసారి స్థానికంగా జరిగే పరుగు పోటీలో పాల్గొని మారథాన్ రన్నర్గా మారిన తర్వాత కాలక్రమంలో.. ఇతర నగరాల్లోని మారథాన్స్లో పాల్గొనడంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే మారథాన్ టూరిజంకు ఊపునిస్తోంది. ఏటా మారథాన్ టూరిజంలో పాల్గొనే భారతీయ రన్నర్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్న మాట. నిపుణుల సూచనలు.. మారథాన్ పర్యాటకులకు నగరానికి చెందిన నిపుణులు పలు సూచలను చేస్తున్నారు.. అవగాన లేకుండా, శిక్షణ లేకుండా మారథాన్లలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ప్రయాణించే ముందు తగినంత శిక్షణ పొందాలి. మారథాన్ పర్యటనలలో పేరొందిన మారథాన్ ప్రయాణ సంస్థలను ఎంచుకోవాలి. స్థానిక వాతావరణ పరిస్థితులకుసంపూర్ణంగా సిద్ధం అవ్వాలి. హ్యాండ్ లగేజీలో రేస్ డే పరికరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆతిథ్య దేశంలో అత్యవసర కాంటాక్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. మారథాన్ టూరిజం కోసం ప్రణాళిక సాధారణంగా ఆరు నెలల ముందుగానే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సకుటుంబ సమేతంగా ‘రన్’డి.. రన్నర్లు క్రీడ పట్ల తమ మక్కువను పెంచుకుంటూనే కొత్త నగరాలు సంస్కృతీ, సంప్రదాయాలను అన్వేషించేందుకు ఈ ట్రెండ్ వీలు కలి్పస్తోంది. స్థానిక సంప్రదాయాలు హృదయపూర్వక ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీదుగా పరుగు తీసే అవకాశాన్ని మారథాన్ టూరిజం అందిస్తోంది. ‘పని ఒత్తిడి కారణంగా, నేను నా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మారథాన్ల కోసం ప్రయాణించే సమయాన్ని పాఠశాల సెలవులతో మేళవింపు చేయడం ద్వారా రన్కేషన్లో ఆ లోటు పూడ్చగలుగుతున్నా’ అని కొన్ని సంవత్సరాలుగా మారథాన్ రన్నర్గా ఉన్న నగరవాసి డాక్టర్ కునాల్ అంటున్నారు. తాము పాల్గొనే మారథాన్ ఈవెంట్స్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లడం అనేది కుటుంబంతో ఒక వెకేషన్ను గడపడం వంటి ప్రయోజనాలతో పాటు స్ఫూర్తిని నింపుతోంది. ‘ఇది నా భార్యను మారథాన్ రన్నర్గా మార్చింది. ఇప్పుడు నా 14 ఏళ్ల కొడుకు 5 కె రన్నర్గా శిక్షణ పొందుతున్నాడు.’ అని కునాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా రన్కేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక ఈవెంట్ ప్లానర్లు కూడా పుట్టుకొచ్చేశారు. (చదవండి: నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్) -
నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట మిసెస్ ఇండియా–2025 టైటిల్ దక్కించుకున్నారు. ఈ మేరకు బేగంపేటలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నమిత కుల్ శ్రేష్ట కుటుంబ సభ్యులు పోటీల వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు మిసెస్ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్స్కు 56 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో కఠినమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జ్లు అడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో సమాధానాలు చెప్పిన నమితకు మిసెస్ సౌత్ జోన్ టైటిల్తో పాటు వయోవర్గంలో మిసెస్ ఇండియా–2025 టైటిల్ అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మిసెస్ ఇండియా ఎలిగెన్స్, మిసెస్ ఇండియా గ్రేస్ఫుల్ సోల్, మిసెస్ ఇండియా చారిటీ క్వీన్ టైటిళ్లు కూడా దక్కాయని తెలిపారు. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!
పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్ మెటల్తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్ డిజైన్స్ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది. ట్రైబల్ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్ ఆభరణాలు డ్రెస్ స్టైల్ను మార్చేసే ‘హైలైట్ యాక్ససరీస్’గా నిలుస్తున్నాయి. ఇయర్ హ్యాంగింగ్స్హూప్స్, జుమ్కీలు, డ్రాప్ ఇయర్ రింగ్స్, షెల్స్ లేదా జియోమెట్రిక్ షేప్స్.వన్ పీస్ డ్రెస్ లేదా సింపుల్ కుర్తీకి బాగా సెట్ అవుతాయి.నెక్లస్, గాజులుమొత్తం మెడ కవర్ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్తో తయారు చేస్తారు. ప్లెయిన్ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్ వర్క్ ఉన్నవి. వెస్ట్రన్ – ట్రెడిషనల్ రెండింటికీ సెట్ అవుతాయి.క్యాజువల్ లుక్ డైలీ వేర్ / ఫ్రెండ్స్ అవుటింగ్షర్ట్ స్టైల్స్కి ఓవర్సైజ్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్పీస్ + పెద్ద హూప్ ఇయర్ రింగ్స్. బోహో మ్యాక్సీ డ్రెస్ పైకి కలర్ఫుల్ బీడ్స్, షెల్ జ్యువెలరీ, బ్రాడ్ బ్యాంగిల్స్. కుర్తీ లెగ్గింగ్స్ పైకి ఆక్సిడైజ్డ్ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్ చేసే లాంగ్ ఇయరింగ్స్.ఆఫీస్ లేదా ఫార్మల్ లుక్ఆఫీస్ వేర్ పైకి సింపుల్ ఓవర్సైజ్డ్ రింగ్ + చిన్న హూప్స్ బాగుంటాయి. ఒకే రింగ్ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్ ఉంటుంది. కాక్టెయిల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్. బ్లేజర్, ట్రౌజర్స్ పైకి పెద్ద చెయిన్ లేదా మందపాటి నెక్ పీస్ సెట్ అవుతుంది. కాటన్ లేదా లినెన్ శారీస్ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్ లేదా ఆక్సిడైజ్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్.పార్టీ ఈవెనింగ్ లుక్ బ్లాక్ డ్రెస్పైకి గోల్డెన్ చంకీ నెక్పీస్, పెద్ద స్టేట్మెంట్ రింగ్ బాగా నప్పుతుంది. గౌన్ పైకి షైనీ స్టోన్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ సరి΄ోతాయి. నెక్లెస్ అవసరం లేదు.కాక్టెయిల్ పార్టీమినిమలిస్టిక్ గౌన్కి ఓవర్సైజ్డ్ బ్రేస్లెట్ హైలెట్ అవుతుంది. సింపుల్ డ్రెస్కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్ లుక్. వెస్ట్రన్ అవుట్ఫిట్కి బోల్డ్ మెటల్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్ లుక్కి – చిన్న ఓవర్సైజ్డ్ రింగ్స్ లేదా లైట్ కలర్ హూప్స్. పార్టీ లుక్కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్ నెక్పీసులు అందంగా ఉంటాయి. సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు పట్టు చీరల మీదకు ఓవర్సైజ్డ్ కుందన్ లేదా టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్లెస్ లేకుండా హెవీగా ఉండే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్ మీదకు లేయర్డ్ పెరల్ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్ అందంగా కనిపిస్తాయి.మోడర్న్ ఫ్యూజన్ లుక్క్రాప్ టాప్, స్కర్ట్ మీదకు ఓవర్సైజ్డ్ నెక్లెస్, లాంగ్ ఫెదర్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్ ఔట్ఫిట్స్కి ఆక్సిడైజ్జ్ సిల్వర్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ప్లెయిన్ జంప్సూట్ మీదకు బోల్డ్ జియోమెట్రిక్ నెక్లెస్ చుంకీ బ్రేస్లెట్ బాగా నప్పుతుంది.ప్రకృతి నుంచి స్ఫూర్తిజీన్స్, కుర్తీస్ కి పెర్ఫెక్ట్ లుక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బోహో లుక్ కోసం కలర్ఫుల్ బీడెడ్ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్ పార్టీ లుక్స్ కోసం యంగ్ జనరేషనల్లో బాగా పాపులర్గా ఉన్నది లేయర్డ్ నెక్పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్ షేప్ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ. జాగ్రత్తలుఔట్ఫిట్ కలర్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్ లేదా ఇయర్ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓవర్సైజ్డ్ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్గా వేసుకోకూడదు. హెవీ ఇయర్ రింగ్స్ ధరించినప్పుడు హెవీ నెక్లెస్ వాడద్దు. సింపుల్ డ్రెస్ ధరించినప్పుడు ఓవర్ సైజ్డ్ జ్యువెలరీ అట్రాక్టివ్గా ఉంటుంది. క్లచ్ లేదా హ్యాండ్ బ్యాగ్ కూడా జ్యువెలరీ షైన్ కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. (చదవండి: ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్) -
మనసును ‘స్కాన్’ చేసి వైద్యం నడిపిద్దాం
ఓ టీనేజీ అమ్మాయి అప్పటివరకూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. కానీ అకస్మాత్తుగా కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. ఏమాత్రం కదల్లేకపోవడంతో వీల్చైర్కు పరిమితమైంది. కారణం తెలుసుకోడానికి చేయని పరీక్ష లేదూ... తీయని స్కాన్ లేదు. కానీ ఎందులోనూ ఏమీ కనిపించలేదు. ఎట్టకేలకు తెలిసిన విషయం డాక్టర్లనే అబ్బురపరచింది. ఆ మెడికల్ సీక్రెట్ ఏమిటో చూద్దాం. ఈ కథ ఓ మెడికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎంతకూ క్లూయే దొరకని పరిశోధనాత్మకమైన సస్పెన్స్ స్టోరీని గుర్తుచేస్తుంది. రియా (పేరు మార్చాం) అనే ఓ పదిహేనేళ్ల చురుకైన అమ్మాయికి అకస్మాత్తుగా ఓ క్షణాన రెండు కాళ్లూ పడిపోయాయి. ఎంతకీ చలనం కలగలేదు. దాంతో అమ్మాయి వీల్ చైర్కే పరిమితం కావాల్సివచ్చింది. రియాను హాస్పిటల్కు తరలించారు. అపరాధ పరిశోధనల్లో నేరస్తుని జాడల కోసం వెతికినట్టుగా డాక్టర్లు ఓ అమ్మాయి జబ్బుకు కారణమైన ఆ అంశం కోసం పరిశోధనలు చేశారు... చేస్తూ పోయారు. రక్తపరీక్షలు చేశారు, ఎమ్మారైలు తీశారు. వాటి ద్వారా కండరాలను పరీక్షించారు. నరాలల్లోకి పరికించి చూశారు. ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ పరీక్షలతో మెదడూ, వెన్నుముల్లోకి తరచి చూశారు. ఊహూ... కారణమెంతకూ దొరకలేదు. రియా చదువుల్లో సరస్వతి. స్కూలు వక్తృత్వపు పోటీల్లో మంచి వక్త. అంతేకాదు... మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేసేది. అలాంటి అమ్మాయిని పేరు తెలియని జబ్బు హైజాక్ చేసేసింది. కాళ్లనొప్పితో ఎలాగో కుంటుతూ స్కూలు దాకా వెళ్లిన ఆ అమ్మాయి స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. రక్త పరీక్షలు చేశారు. ఏమీలేదు. ఇలా ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు ఆచూకీ అంతు చిక్కలేదు. విటమిన్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇలా ఎన్ని చికిత్సలు చేసినా ఫలితమూ దక్కలేదు. అప్పటివరకూ అక్షరాలా ‘తన కాళ్ల మీద తాను నిలబడ్డ’ ఆ అమ్మాయి తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లంబార్ పంక్చర్ అనే వెన్నుముక గాటు పెట్టి అందులో నీరు తీసి చూసే చిట్టచివరి పరీక్షకు డాక్టర్లు సిఫార్సు చేశారు.రెండో ఒపీనియన్ కోసం... దేహానికి గాటు పెట్టి చేసి మరింత తీవ్రమైన పరీక్షలతో ఆమెను బాధించడానికి పూనుకునే ముందర ఎందుకోగానీ... రియా తల్లిదండ్రులు రెండో ఓపీనియన్ కోసం హైదరాబాద్లోని సుధీర్కుమార్ అనే న్యూరాలజిస్టును సంప్రదించారు. ఇతరత్రా పరీక్షలతో పాటు రిపోర్టుల్లో విటమిన్–బి12, విటమిన్ డీతోపాటు మెదడూ, వెన్నెముకా, నర్వ్ కండక్షన్ స్టడీస్... ఇలాంటివన్నీ పరిశీలిస్తున్న డాక్టర్గారికి ఎందుకో అనుమానం వచ్చి ‘హూవర్స్ సైన్’ అనే ఓ సునిశిత పరిశీలన చేశారు.ఏమిటీ హూవర్స్ సైన్ ? బాధితులను పడుకోబెట్టాక రెండు కాళ్ల మడమల కింద రెండు చేతులూ పెట్టి, బలహీనంగా ఉన్న ఓ కాలిని ప్రయత్నపూర్వకంగా ఎంతోకొంత పైకెత్తమని డాక్టర్లు అడుగుతారు. వాస్తవంగా కాళ్లలో పూర్తిగా చచ్చుబడిపోయిన వ్యక్తుల్లో ఓ కాలు కాస్త ఎత్తడానికి ప్రయత్నించినా రెండోకాలిలో ఎలాంటి చలనమూ ఉండదు. కానీ అది వాస్తవంగా చచ్చుబడిన కేసు కానప్పుడు బాధితులు ఓ కాలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో కాలిమీద బరువు/ఒత్తిడి పెరుగుతుంది. అంటే... కాలిని ఎత్తే ప్రయత్నంలో మరోకాలు వెనక్కెళ్తుండటంతో ఇలా జరుగుతుంది. (ఈ హూవర్స్ సైన్ (గుర్తు) అన్నది కాలు చచ్చుబడిపోయిన సందర్భంలో నిర్ధారణ కోసం చేసేది. ఇలాంటి హూవర్స్ సైన్స్ (గుర్తులు) ఊపిరితిత్తుల విషయంలో మరో రకంగా ఉంటాయి). దాంతో ఇది వాస్తవంగా కాళ్లు చచ్చుబడిపోయిన కేసు కాదనీ, ఆ కండిషన్ను అనుకరిస్తున్న (మిమిక్ చేస్తున్న కేసు) అని డాక్టర్కు అర్థమైంది. అంతా బాగున్నప్పటికీ ఆమె కాళ్లను కదలించలేకపోతోందంటే ఏదో మతలబు ఉంది.అది నటన కాదు... బాధితురాలు నటించడం లేదు... అయితే ఇక్కడ బాధితురాలు రియా నటిస్తోందని అనుకోడానికి వీల్లేదు. కాళ్లు పడిపోవడం జరగనప్పటికీ... మానసిక కారణాలతో కాళ్లను కదలించలేకపోతోంది. తన మానసిక సమస్య కారణంగా నిజంగానే ఆమె కాళ్లు కదిలించలేకపోతోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫంక్షనల్ న్యూరలాజికల్ డిజార్డర్ – ఎఫ్ఎన్డీ’ అంటారు. దీనికి కౌన్సెలింగ్ అవసరమని గ్రహించిన డాక్టర్ సుధీర్కుమార్ ఆమెతో ఏకాంతంగా మాట్లాడారు.అసలు కారణమిది... రియా కాస్త బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను వెక్కిరిస్తుండేవాళ్లు. ఆమె బరువును చూసి గేలి చేస్తుండేవాళ్లు. దాంతో తీవ్రమైన వ్యాకులతకూ, మనఃక్లేశానికీ లోనైన ఆమె తనకు తెలియకుండానే ఇలాంటి కండిషన్కు గురైంది. అన్నీ నార్మల్గా ఉన్నా అనారోగ్యానికి గురయ్యే మానసిక సమస్య అని తేల్చారు డాక్టర్ సుధీర్కుమార్. ఇందులో నరాలకు సంబంధించిన అంశంతో పాటు మానసిక నిపుణులతో మల్టీ డిసిప్లినరీగా ప్రయత్నించాల్సిన సంక్లిష్టమైన కేసు. ఇది అర్థమయ్యాక ఆమెలో మానసిక స్థైర్యం నింపేలా అనేక స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లు సంయుక్తంగా చికిత్స మొదలుపెట్టారు.ఆర్నెల్ల తర్వాత... అన్ని చికిత్సలూ ఫలించడంతో రియా మామూలుగా మారింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను మళ్లీ నిలబడటంతో పాటు తన చేతుల్లోని కుంచెను కదిలించి అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె టీనేజ్ లైఫ్ తాను వేస్తున్న పెయింటింగ్స్ అందంగా అందులోని కలర్సంతగా రంగులమయంగా మళ్లీ మారిపోయింది. చివరగా... అందించాల్సిన ట్రీట్మెంట్ ఒక్కటే డాక్టర్ల బాధ్యత కాదు... సంక్లిష్ట సమయాల్లో అందించాల్సినవి... చికిత్సా, మందులతో పాటు అక్కడ నిజంగా అందాల్సినదీ, అవసరమైనదేమిటంటే... చక్కటి సానుభూతీ, చిక్కటి సహానుభూతి. – యాసీన్డాక్టర్లూ... ఇది వినండిఈ కేసు ద్వారా డాక్టర్లకూ ఓ సందేశమిస్తున్నారు డాక్టర్ సుధీర్కుమార్. అదేమిటంటే... కేవలం రిపోర్టులు చూసే ఓ నిర్ధారణకు రాకండి. బాధితులు చెప్పేది పూర్తిగా సానుభూతితో, సహానుభూతితో వినండి. అప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.ఫంక్షనల్ డిజార్డర్లలో పేషెంట్స్ చేసేది నటించడం కానే కాదు. వాళ్ల బాధలు పూర్తిగా జెన్యూన్. వాళ్లు చెప్పేది పచ్చి వాస్తవం. క్లినికల్ పరీక్షల తర్వాత కూడా ఏ కారణాలూ తెలియకపోతే... వారిని కోసి చేసే పరీక్షలకూ, పొడిచి నిర్వహించాల్సిన ప్రోసీజర్లకు వెంటనే గురిచేయకండి. కాస్త చురుగ్గా, నిశితంగా ఆలోచించి ‘హూవర్స్ సైన్స్’ లాంటి వాటి గురించి మీ పరిధి దాటి (ఔట్ ఆఫ్ ద బాక్స్) ఆలోచించేలా ప్రయత్నించండి. దాంతో పేషెంట్స్ను బాధించి చేసే ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్కు ముందే జబ్బు నిర్ధారణకు అవకాశం దొరుకుతుంది. ఒక వ్యక్తికి స్వస్థత చేకూర్చడం మీ ఒక్కరివల్లనే కుదరనప్పుడు టీమ్తో కలిసి... అంటే సైకాలజిస్టులూ, ఫిజీషియన్లూ, ఫిజియోథెరపిస్టుల తోపాటు అవసరమైతే టీచర్లూ, కుటుంబ సభ్యులందరూ బృందంగా టీమ్వర్క్తో తగిన చికిత్స అందించి, బాధితులు హాయిగా కోలుకునేలా చేయండి. డాక్టర్ సుధీర్కుమార్, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: 'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్తో 4 బ్రెడ్, మిల్క్షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్. లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్లో వివరించాడు. మెరుగైన ఫలితాల కోసం..భోజనం పరిమాణం పెంచుకోవడంహైడ్రేట్గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండిఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రవ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి. View this post on Instagram A post shared by Sujeet Chaurasia l Content Creator (@fearlesshimm)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి
శంఖం (Conch) అనేది భారతీయ సంస్కృతిలో పవిత్రత, శుభం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఇది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి శంఖాన్ని ఊదితే ఆ వ్యాధి నయమైపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో ఇది వెల్లడైందని తెలిపారు. ఈ శంఖరావం ప్రయోజనాన్ని హైలెట్ చేసేలా పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చాలామంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. అందుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అని చెబతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దాంతో మధ్యలో మెలుకవ వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాసాగిపోయి గురకపెడుతుంటారు. దీని కారణంగా మధుమేహం, గుండుపోటు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బుల బారినపడతారని చెబుతున్నారు వెద్యులు. ఈ స్లీప్ ఆప్నియా కారణంగా చాలామంది కంటిపై కునుకనేది సరిగా ఉండదు. అందువల్ల ఉదయం చాలా అలసట, ఒక విధమైన నిద్ర ఆవరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈసమస్యకు మందుల కంటే శంఖం చక్కగా చెక్పెడుతుందంట. శంఖారావంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గాలి వాయిద్యాలను వాయించడం మెరుగైన శ్వాసకు ఎలా సహాయపడుతుంది అనే దిశగా అధ్యయనం చేయగా..ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అందుకోసం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న సుమారు 30 వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సముహం శఖం ఊదే సాంప్రదాయ భారతీయ శ్వాస వ్యాయమాన్ని అభ్యసించింది. అంటే శంఖం పూరించడం లాంటిది. మరొక సముహం లోతైన శ్వాస వాయామాలు చేశారు. అందులో శంఖం ఊదిన బృదం నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగదల కనిపించిడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవాళ్లకి నిరంతర సానుకూల వాయుమార్గ పీడన యంత్రం లేదా CPAP వంటి ప్రామాణిక చికిత్సను అందిస్తారు. ఇందులో ఫేస్మాస్క్ ద్వారా గాలిని ఊదుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా వాయుమార్గం తెరచుకుని ఈ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని చాలామంది రోగులు అసౌకర్యంగా భావించడమే కాకుండా ఇలా నిరంతరం చేయడంలో ఇబ్బంది పడుతున్నారట. అలాగాక ఈ శంఖ ఊదడం అనే సాంప్రదాయ యోగ శ్వాస వ్యాయామం ప్రకారం.. ఉచ్ఛ్వాసాన్ని వదులుతూ..సాధన చేస్తారు కాబట్టి చక్కటి విశ్రాంతితో కూడిన నిద్రపడుతుందట. ఈ పురాతన అభ్యాసం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వెల్లడించారు. అంతేగాదు శంఖ ఊదడం అనే వ్యాయామాలు శ్వాసకోశ కండరాలను బలోపేతం చేయగలవని, నిద్రలో వాయుమార్గాలను స్పష్టంగా తెరుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. స్లీప్ అప్నియా లక్షణాలను నిర్వహించడానికి ఈ శంఖారావం అనేది చక్కటి నివారిణి అని పేర్కొన్నారు పరిశోధకులు. ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని జైపూర్లోని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది.(చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే..! శ్రుతి హాసన్
సినీ సెలబ్రిటీలు గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే..అందం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కోసారి కాస్మెటిక్ సర్జరీలు తప్పవు కూడా. అది అందరికీ తెలిసిందే. చాలామంది ప్రముఖులు తాము చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు గురించి బయటకు గమ్మున చెప్పరు. కానీ కొందరు ధైర్యంగా చెబుతారు. పాపం అదే వారిని ఇక్కట్లు పాలు చేస్తుంది.నిజాయితీగా మాట్లాడారని మెచ్చుకోకపోయినా పర్లేదు..ఏకంగా తీసిపడేసినట్లుగా కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్తో మానసికంగా చంపేస్తుంటారు. అలాంటి పరిస్థితినే తాను ఎదుర్కొన్నానంటూ టాలీవుడ్ నటి శ్రుతి హాసన్ తన గోడును వెళ్లబోసుకున్నారు.ఏం జరిగిందంటే..గాయని, ప్రముఖ నటి శ్రుతిహాసన్(Shruti Haasan) తన మనసులోని మాటను మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పేస్తారామె. అలానే తాను చేయించుకున్న కాస్మెటిక్ విధానాల గురించి చాలా ఓపెన్గా చెప్పింది. అలా చెప్పడంతో ఒక్కసారిగా అంతా ఆశ్యర్యపోయారు, ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు కూడా. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి మొదలైన కష్టాలు అంతా ఇంత కాదు. ఓహో ప్లాస్టిక్ సర్జరీ బేబీ అని మాట. ఆమె శరీరం అంతా ప్లాస్టిక్నే అంటు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజాయితికి లభించిన మూల్యం అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇతర నటి నటులు కూడా తాను చేయించుకున్న వాటికంటే ఎక్కువ చేయించుకుని ఉండొచ్చు. అయినా అది వారి వ్యక్తిగత విషయం. అందం, దాని ప్రామాణికత పరంగా ఒక్కొక్కరిది ఒక్కో విధానంలో ప్రాముఖ్యత ఇస్తారు. అలా అని దాన్ని అందరూ అనుసరించాలని తామేమి సందేశం ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనవి, వారి వారి ఇష్టాలకు సంబంధించినవి. అయినా ఒకరి ఇష్టాన్ని ఎవ్వరూ జడ్జ్ చేయలేం అనేది నర్మగర్భంగా అంగీకరించాల్సిన విషయం. అలాగే తాను చేస్తున్న పని, జీవితం, ప్రేమ వంటి వాటికి సంబంధించిన వాటి గురించి చాలా ఓపెన్గా మాట్లాడేస్తుంటాని అన్నారామె. కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ నిజాయితీ అస్సలు పనికి రాదని, అలా చెప్పిన తత్క్షణమే వేళ్లన్నీ నా వైపు చూపించడం మొదలవుతుందని అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. నిపుణులు ఏమంటున్నారంటే..ఇది అందరికి వర్తిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకప్పుడూ చాలా ఓపెన్గా మన మనసులో విషయాలను స్వచ్ఛంగా మాట్లాడేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని ట్రోలింగ్ రాయుళ్లను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి మాట్లాడాల్సిందే. ఇక్కడ అందరూ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా సొంత విషయాలు లేదా వ్యక్తిగత విషయాల ప్రస్తావించక పోవటమే మేలు అనే సూత్రాన్ని అవలంభించాలి అదే నేటి కాలంలో శ్రీరామ రక్ష అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: 'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..) -
పెళ్లి రోజు: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్
మాజీ మంత్రి, వైసీపీనేత ఆర్కే రోజా (R K Roja) తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. భర్త రోజా ఆర్కే సెల్వమణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా తన వివాహ బంధంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. రోజా ఇన్స్టా పోస్ట్ ❝మణి ఎదలో…రోజా పూదోట…అదే నింగి, అదే నేల…అదే దివి, అదే భువి…అదే నీరు, అదే గాలి…నింగిలో మార్పు, నేలలో మార్పు జరిగినా...పంచభూతాల సాక్షిగా,మనువాడిన మణి నీఎదమది తోటలో ప్రతీ రోజూవికసించే రోజానైనీ వెంట…నీ జంటగానిలిచాను...!!మన 34 ఏళ్ళ ప్రయాణంనా జీవితానికి అందమైన కానుక...ప్రతీ క్షణం తోడుగా, బలంగా,ప్రేమగా నన్ను నిలిపినమీకెప్పటికీ రుణపడిఉంటాను..❜దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఆగస్టు 21న రోజా, దర్శకుడు సెల్వమణి వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్ను తయారు చేశాడు. జీవాను ఎఫ్డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!) -
నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!
హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ పండగ సందడి మొదలైంది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా గణేష్ మండపాలను నిర్మిస్తున్నారు. మరోవైపు నిర్వాహకులు భారీ గణనాథులను ఆగమనం పేరుతో గ్రాండ్గా మండపాలకు తీసుకొస్తున్నారు. వినాయక నిమజ్జనానికి భారీ ఉత్సాహంతో బ్యాండ్ బాజాతో వెళ్లడం విధితమే. అయితే ఈసారి నగరంలో మండపాలకు వినాయకులకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు. ఈ కొత్త సంస్కృతి నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూసారాంబాగ్ జేజీవైఏ అసోసియేషన్ నిర్వాహకులు 22 ఫీట్ల భారీ గణేష్ విగ్రహాన్ని గ్రాండ్ సెలబ్రేషన్స్తో మండపానికి తరలించారు. గణేశుడి రాక, గణేశోత్సవ వేడుకలలో మహారాష్ట్ర బ్యాండ్ ఆట పాటలు, కలర్ఫుల్ ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఆగమన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జనం కాకుండా, ఆగమనం కార్యక్రమాలను భారీ సెటప్స్తో మండపాలకు తీసుకొస్తున్న ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంది.(చదవండి: Fake Wedding: పెళ్లి థీమ్..పార్టీ జూమ్..! ఇది పెళ్లిళ్లకు పేరడి..) -
పెళ్లి థీమ్..పార్టీ జూమ్..
మిరుమిట్లు గొలిపే లైట్లు, మెరిసే డిజైనర్ దుస్తులు, చెవుల్లో హోరెత్తించే మ్యూజిక్, నోరూరించే ఆహారం.. ఉత్సాహభరిత వాతావరణం.. ప్రతిదీ విలాసమే, విశేషమే.. వేదికను చూడగానే చెప్పేయవచ్చు అది ఖరీదైన వివాహ వేడుక అని. అవును నిజమే.. అక్కడ పెళ్లి జరుగుతున్న ఆనవాళ్లన్నీ ఉన్నాయి కానీ.. అగ్నిగుండాలు, వధూవరులు మాత్రం లేరు. బంధువులు లేరు, కన్నీటి వీడ్కోలు లేవు. అదేమిటి? అంటే అదే ఫేక్ వెడ్డింగ్ థీమ్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ పార్టీలను సరికొత్తగా మారుస్తున్న ట్రెండ్. హోటళ్లు, క్లబ్బులు ఈవెంట్ కంపెనీలు వరుసగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఈ ఈవెంట్లు పూర్తిగా వినోదం కోసం రూపుదిద్దుతున్నారు. ఎటువంటి ఒత్తిడి, ఆచారాలు లేదా బాధ్యతలు లేకుండా వివాహ విందుకు సంబంధించిన పూర్తి అనుభవాన్ని అందిస్తాయివి. సింపుల్గా చెప్పాలంటే, ఇది వివాహ నేపథ్య నైట్ పార్టీ. వెస్ట్రన్ నుంచి వెల్కమ్.. కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మోడల్ పెళ్లిళ్లు సందడి చేస్తున్నాయి. నగరంలో మాత్రం ఇటీవలే ప్రవేశించాయి. ఈ పార్టీలకు స్నేహితులతో కలిసి హాజరైన వారు, సంప్రదాయ భారతీయ వివాహ వేడుకల్లోని అనేక భాగాలను నాటకీయతతో మేళవించి విందు వినోదం ఆస్వాదిస్తారు. ‘సిటీలో ఫేక్ వెడ్డింగ్లో భాగంగా ఒక ఖరీదైన క్లబ్లో సంగీత్ నిర్వహించారు. అక్కడ వాతావరణం ఉల్లాసంగా ఉంది. సీక్విన్డ్ చీరలు లెహంగాలు (పొడవాటి స్కర్టులు బ్లౌజులు) ధరించిన మహిళలు, టైలర్డ్ కుర్తాలు జాకెట్లలో పురుషులు కనిపించారు. ఒక సంప్రదాయ ధోల్ డ్రమ్మర్ జనాన్ని డ్యాన్స్ ఫ్లోర్కు నడిపించాడు..’ అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన శివాంగి దీనిని ఓ ఆసక్తికర పార్టీగా అభివర్ణించారు. ‘సంప్రదాయ వివాహాలలో ఒత్తిడి ఉంటుంది. దుస్తులు ధరించడం చుట్టూ నియమాలు, బంధువుల ఆక్షేపణలు, కానీ ఇక్కడ అవేవీ ఉండవు.. సో సరదాగా ఉంటుంది.’ అని ఆమె చెప్పారు.రూ.1500తో పెళ్లిలోకి ఎంట్రీ.. ఈ పార్టీ టిక్కెట్ ధరలు సాధారణంగా దాదాపు రూ.1,500 నుంచి ప్రారంభమవుతాయి. సౌకర్యాలను బట్టి రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. శివాంగి ఆమె స్నేహితులు హాజరు కావడానికి ప్రతి జంటకు రూ.10 వేలు చెల్లించారు. ‘నెలకు ఒకసారి ఆ మాత్రం ఖర్చు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే.. ఈ అనుభవం అంతకు మించి విలువైనది.‘ అంటున్నారామె. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెస్టారెంట్ యజమాని శరద్ మాట్లాడుతూ.. కొత్త కొత్త అనుభవాలను అతిథులకు అందివ్వడం ఆతిథ్య రంగంలో కీలకమన్నారు. విదేశాల్లో మనోళ్లే.. క్లాప్ కొట్టారుగత నెలలో బెంగళూరులో 2,000 మంది హాజరైన ఫేక్ వివాహ విందుకు ఆతిథ్యం ఇచ్చిన 8 క్లబ్ ఈవెంట్స్ సహ వ్యవస్థాపకుడు కౌశల్ చనాని, నకిలీ వివాహ వేడుకలకు ప్రేరణ విదేశాలలో నివసిస్తున్న యువ భారతీయుల నుంచి వచ్చిందని చెప్పారు. వారు అక్కడ ఉండి మన పెళ్లిళ్లు మిస్ అవుతున్నారు. అదే వీటిని డిజైన్ చేయించింది అన్నారాయన. ‘అన్ని పారీ్టల్లాగే ఇక్కడా జన సమూహం ఉంటుంది. వారంతా బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేస్తారు.. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.. సరికొత్త సాయంత్రాన్ని ఆనందిస్తారు’అని ఆయన అన్నారు. ట్రెండీగా మారింది.. ఫేక్ వెడ్డింగ్ పార్టీస్ ఇప్పుడు సిటీలో ఫ్రెష్గా ట్రెండీగా మారాయి. కార్పొరేట్ ఉద్యోగులు, స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పబ్స్, క్లబ్స్లో కూడా ఈ తరహా పార్టీస్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో భాగమైన సంగీత్ను పార్టీ పీపుల్ బాగా కోరుకుంటున్నారు. ఒక డీజెగా ఇది నాకు కూడా భిన్నమైన ఎంజాయ్మెంట్ను అందిస్తోంది. – డీజె పీయూష్ పెళ్లి సందడిని రుచి చూపిస్తున్నాం..ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా ఆఫ్లైన్ ఈవెంట్స్ డిజైన్ చేసే సంస్థగా అండర్ గ్రౌండ్ ఫెరారి, పూల్ పారీ్ట.. వంటివి నిర్వహిస్తున్నాం. ఈ ఫేక్ వెడ్డింగ్ పారీ్టలు పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తరచూ పెళ్లి వేడుకల్ని మిస్ అవుతున్నవారి కోసం వీటిని డిజైన్ చేశారు. ప్రస్తుతం మన దేశంలో కూడా కార్పొరేట్ వర్క్ కల్చర్ వల్ల దగ్గరి బంధువులు, సొంత ఊర్లో పెళ్లిళ్లకు కూడా హాజరు కాలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫేక్ షాదీ కాన్సెప్ట్ను మేం తొలుత బెంగళూర్కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలకు తీసుకెళ్లాం. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది సంప్రదిస్తున్నారు. త్వరలోనే నగరంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. – మాథుర్, సహ వ్యవస్థాపకులు, 8 క్లబ్ ఈవెంట్, బెంగళూర్ (చదవండి: 'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
వీల్ఛైర్కే పరిమితం చేసే అరుదైన రుగ్మత..! కానీ ఇవాళ గిన్నిస్ రికార్డు..
ఆస్తిపాస్తిల్లా కొన్ని వ్యాధులు వంశాపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మందులతో నయం కానీ ఆ జబ్బులతో సహవాసం నరకం అనే చెప్పాలి. అలాంటి రుగ్మతతో బతకడమే గాక..తనలా బాధుపడుతున్న వారిలో స్థ్యెర్యాన్ని నింపేలా రికార్డు సృష్టించే పనిలో ఉన్నాడు ఈ 31 ఏళ్ల వ్యక్తి.అహ్మదాబాద్లోని వదోదరకు చెందిన సాగర్ బ్రహ్మభట్ మార్షల్ ఆర్ట్స్ అభిమాని. అతడు పట్టుదలతో వీల్ఛైర్కే పరిమితం చేసే వంశాపారంపర్య వ్యాధిపై గెలిచి, సమర్థవంతంగా నిర్వహించి బతకొచ్చని నిరూపించాడు. బ్రహ్మభట్ స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA) అనే కండరాలను నాశనం చేసే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి అతని తాత, నాన్నను వీల్ఛైర్కే పరిమితం చేసింది. ఇది అతడి కుటుంబంలో వారసత్వంగా వస్తున్న రుగ్మత. అదృష్టవశాత్తు తాను ఆ వ్యాధి బారినపడలేదని సంతోషించేలోపే అటాక్ అయ్యి భయపెట్టింది. అచ్చం తన తండ్రి అనారోగ్యం లాంటి లక్షణాలు సరిగ్గా కోవిడ్ టైంలో మొదలయ్యాయి. అయితే అతడుదాన్ని కొట్టిపరేసి మూడేళ్లు మొండిగా బతికేవాడు. అయితే సరిగ్గా 2023కి సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం వంటి సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా..స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA)నిర్థారణ అయ్యింది. స్పినోసెరెబెల్లార్ అటాక్సియా అంటే..ఇది జన్యు పరివర్తన వల్ల కలిగే రుగ్మత. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి నాడీ కణాలు, ఫైబర్లను బలహీనపరిచి సెరెబెల్లమ్ క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా శరీర విధులపై ప్రభావం చూపి..తనంతట తాను పనులు చేసుకోని పరిస్థితి ఎదురవ్వుతుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న మెదడును ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్.ఇక బ్రహ్మభట్ని న్యూరాలిజిస్ట్లు వీట్ఛైర్కే పరిమితం కాకతప్పదని..అందుకు మానసికంగా సిద్ధం అవ్వమని సూచించారు. అతడి తండ్రి ఇటీవలే మరణించడంతో ఇప్పుడు ఆ వ్యాధి తాను భారినపడ్డానంటే అమ్మ, చెల్లి తల్లడిల్లతారని ఆ వ్యాధిని కుటుంబసభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అమెరికాలో ఉండే దూరపు బంధువుతో మాట్లాడి ఈ వ్యాధిని విదేశాల్లో నయం చేయగలరే లేదా అనే విషయం గురించి చర్చించి తెలుసుకుంటుండేవాడు. అయితే అక్కడ కూడా ఈ వ్యాధికి నివారణ లేదని, మందులతో నిర్వహించాల్సిందేనని తెలుసుకుంటాడు. దాంతో ఫిజియోథెరపీస్టుతో మాట్లాడుతూ తన వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీన్ని తగ్గించుకునేలే ఏం చేయొచ్చు అనేదాని గురించి శాస్త్రీయ పరిశోధనలు కూడా చేశాడు. అయితే తండ్రి లేకపోవడంతో తన పరిస్థితిని మెరుగుపురుచుకునేందుకు ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేలా వ్యాపారంపై దృష్టి సారిస్తూ..అటాక్సియా రోగులు గురించి తెలుసుకుంటుండేవాడు. యూఎస్లో కొందరు ఈ వ్యాధి కోసం తాయ్చి శిక్షణ తీసుకుంటున్నారని తెలుసుకుంటాడు. తాను ఎలాగైనా వీల్చైర్కి పరిమితం కాకుండా బయటపడేలా ఏదైనా చేయాలని భావించి అస్సాంకి చెందిన తాయ్ చి మాస్టర్ బబ్లూ సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటాడు. తాయ్ చి (Tai Chi) అంటే..చైనాలో పుట్టిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్. మనస్సు-శరీరాన్ని సమన్వయం చేసే ఒక అభ్యాసం(సాధన) ఇది శ్వాస నియంత్రణ, మైండ్ఫుల్నెస్, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే బ్రహ్మభట్కి ఈ వ్యాయామాలు శరీర కదలికలకు మంచి హెల్ప్ అయ్యాయి. అయితే నేరుగా నడవడం మాత్రం కష్టమయ్యేది. కానీ కారు నడపగలడు, వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. దీని సాయంతోనే బుద్ధిపూర్వకంగా కదలికలు, అవయవాల సమన్వయాన్ని తిరిగి క్రమాంకనం చేయగలిగాడు. ఇది ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మన శరీరాన్నే గాక, అంతర్గత అంశాలపై దృష్టి పెట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సుపై నియంత్రణను సాదించగలుగడమే గాక ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతాయి. ప్రస్తుతం బ్రహ్మ భట్ ఈ తాయ్చి సాయంతో స్పెషల్ పర్సన్స్ విభాగంలో 35 పుష్ అప్లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తనలాంటి వారిలో ఆశావాహ దృక్పథాన్ని అందించి ఈ వ్యాధితో జీవించడం ఎలాగో తెలియజేయాలనేది బ్రహ్మభట్ ఆకాంక్ష. అనారోగ్యంతో భయపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా పోరాడి జయించే మార్గం వెతకాలి అనే సందేశాన్ని ఇస్తోంది కదూ ఇతడి కథ..!.(చదవండి: ChatGPT Weight Loss: ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!) -
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్లో తనతో మాటలు కలుపుతుంది. అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది. ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Tamanna Tanweer | Your Online Bestie (@tamannapasha_official) (చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే మన ప్రాణ సమానమైన వ్యక్తిని రక్షించిన వస్తువు లేదా మనిషి మనకు ఆప్తమిత్రుడు లేదా అత్యంత ఆత్మీయులు. అందుకు అర్థం పట్టేదే ఈ వెడ్డింగ్ గౌను. దీని వెనుకున్న కథ వింటే కళ్లు చెమరుస్తాయి. 'ప్రేమకు అర్థం ఏదంటే'.. అన్న పాట గుర్తొచ్చేలా ఉంటుంది ఈ జంట కథ. చరిత్రలో దాగున్న ఈ అందమైన స్టోరీ ఏంటో చదివేద్దామా..!ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐకానిక్ వెడ్డింగ్ గౌను ఒక జంట ప్రేమకు గుర్తుగా మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదే ఇవాళ స్టైలిష్ వెడ్డింగ్ గౌనుగా బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి నవ వధువు ఇష్టపడే ఆ వివాహ గౌను వెనుక కథ చూస్తే ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. దీని గురించి సంస్కృతి, చరిత్రపై అమితాసక్తి కలిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మే షరీఫ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేశారు. దాంతో ఈ వెడ్డింగ్ గౌను వెనుకున్న లవ్స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. అంతేగాదు 'ప్రేమకు అర్థం ఎవరంటే?'..అన్న పాటను గుర్తుకుతెస్తోంది. ఆ వీడియోలో షరీఫి ప్రముఖులు ధరించిన ఎన్నో వెడ్డింగ్ గౌనులు చూసుంటారు గానీ ఈ పారాచూట్ వెడ్డింగ్ గౌను(parachute wedding dress) గురించి విన్నారా అంటూ ఆ స్టోరీ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. This wedding dress was made from a parachute that saved Maj. Claude Hensinger during WWII. In our @amhistorymuseum: https://t.co/0lf4659Pu0 pic.twitter.com/dSvRHwnvl7— Smithsonian (@smithsonian) June 16, 2017 వెడ్డింగ్ గౌను వెనుకున్న కథ..1947లో, ఒక మహిళ రెండవ ప్రపంచ యుద్ధం(World War II)లో తన భర్త ప్రాణాలను కాపాడిన పారాచూట్నే వెడ్డింగ్ గౌనుగా డిజైన్ చేసిందట. నైలాన్ ఫ్రాబ్రిక్ క్లాత్తో ఉండే పారాచూట్ని చాలా అందమైన వివాహ దుస్తులుగా మార్చిందామె. ఆ జంటే మేజర్ క్లాడ్ హెన్సింగర్, రూత్లు. 1947 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికన్ బీ 29 పైలట్ అయిన మేజర్ క్లాడ్ హెన్సింగర్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. వెంటనే పారాచూట్ సాయంతో తన సిబ్బందిని, తనను రక్షించుకున్నారు. అంతేగాదు వారు ఆగిన నిర్మానుష్య ప్రదేశానికి అధికారులు వచ్చేంతవరకు వారికి ఆ పారాచూట్ రక్షణ కవచంలా వెచ్చదనాన్ని అందించింది. అతను సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయపడిన వెంటనే తన స్నేహితురాలు రూత్ని నేరుగా కలసి జరిగినదంతా వివరించి ఆ పారాచూట్ని ఆమెకు ఇచ్చాడు. తన భర్త ప్రాణాలను కాపాడిన ఈ పారాచూట్ తనకెంతో అపురూపం అంటూ దాంతోనే వెడ్డింగ్ గౌనుని స్వయంగా రూపొందించుకుంది. అంతేగాదు దాన్ని ఆ దంపతులు ఎంత భద్రంగా ఉంచుకున్నారంటే..తన కూతురు, కోడలు కూడా వారి వివాహంలో ఆ గౌనునే ధరించారు. ఆ తర్వాత స్మిత్సోనియన్ మ్యూజియంలో ఆ గౌను నేటికి పదిలంగా ఉంది. View this post on Instagram A post shared by Mae Sharifi (@history_mae) (చదవండి: Smartphone Photography: కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ) -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ
ఒక్క ఫొటో అనేక భావాలను, అర్థాలను ప్రతిబింబిస్తుంది. చరిత్రలోని అనే సంఘటనలను, మధురానుభూతులకు కళ్లకు కట్టేది ఈ చిత్రమే.. అయితే ఒకప్పుడు ఇది సామాన్యునికి బహుదూరం.. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేడు ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మధురమైన జ్ఞాపకాలను పదిలపరుస్తోంది.. మరికొందరికి ప్రకృతిలోని ప్రతిదీ చిత్రీకరించే సాధనంగా మారుతోంది. మొబైల్ రాకతో ఇది మరింత చేరువయ్యింది.. ఈ నేపథ్యంలో మొబైల్ ఫొటోగ్రఫీ అనే హాబీ ట్రెండింగ్ అవుతోంది.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఔత్సాహికులు వారు తీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో రీల్, సినిమాలు, జోకులు, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. దీనికి భిన్నంగా గత కొంతకాలంగా యువతకు సంబంధించిన క్రియేటివ్ వర్క్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్లో ఫొటోలు తీయడం హాబీగా మారిన కొందరి ఫొటోలు ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టులుగా తెగ వైరల్ అయ్యాయి. వీటికి షేర్లు, లైకులు కొడుతూ పలువురు కామెంట్లు చేశారు. ఫొటో గ్రఫీపట్ల తమకున్న ప్యాషన్ని, తమలోని క్రియేటివిటీని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు. ఒక్కో ఫొటోకూ.. ఒక్కో కథ.. ఈ ఏడాది ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలు విభిన్న, వినూత్న ఫొటోలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరు తమ కెమెరాలో బంధించిన ప్రత్యేక క్షణాలను షేర్ చేస్తూ ‘ఇదే నా స్టైల్, ఇదే నా ప్రత్యేకత’ అని తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు యువత ప్రకృతిని తమ కెమెరాలో బంధించగా, మరికొందరు నగర జీవన శైలిని, మరి కొందరు ట్రావెలింగ్, సంస్కృతి, ఆర్ట్, చరిత్ర, ఫుడ్ ఫొటోగ్రఫీ వంటి అంశాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకునే ఓ వేదిక. ప్రతి ఫొటో ఒక కొత్త కథ చెబుతోంది. అందుకే ఈ ఫొటోగ్రఫీ దినోత్సవం కేవలం ఫొటోల పండుగ మాత్రమే కాదు.. ఒక లైఫ్ స్టైల్ ఫెస్టివల్ అని చెప్పకనే చెబుతోంది. సోషల్ మీడియా పాత్ర.. ఫొటోగ్రఫీకి సోషల్ మీడియా ఒక ప్రధాన వేదికగా మారింది. ఒకప్పుడు ఔత్సాహికులు తీసిన ఫొటోలను ఇంట్లో, ఆల్బమ్స్లో చూసేవాళ్లు. ఇప్పుడు అదే ఫొటోలు నిమిషాల్లోనే ప్రపంచానికి చేరుతున్నాయి. ఇన్స్టా ‘ఫోటోగ్రఫీ డే హాష్ట్యాగ్’తో పోస్ట్ చేస్తే, అది వేల మందికి చేరుతుంది. ఫేస్బుక్లో షేర్ చేస్తే స్నేహితులు, బంధువులు లైక్స్తో ప్రోత్సహిస్తారు. ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మన స్నేహితుల సర్కిల్లో హైలైట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్నపాటి ప్రచార సాధనం ఉన్నట్లు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభను చూపించడానికే కాకుండా, నెట్వర్కింగ్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క ఫొటో ఆధారంగా అనేక మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ఫొటోలు పోస్టు చేయడం ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల దృష్టికి చేరుతున్నారు. మోడలింగ్, ఫొటో ఎగ్జిబిషన్, బ్రాండ్ ప్రమోషన్స్ వంటి అవకాశాలు పొందుతు న్నారు. జన్–జీ స్టైల్ అండ్ క్రియేటివిటీ.. ఫొటోగ్రఫీ డే నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ ఫొటోలను కేవలం షేర్ చేయడమే కాదు.. వాటికి ప్రత్యేక ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, క్రియేటివ్ క్యాప్షన్స్ జోడించడం ద్వారా కొత్త ట్రెండ్ సృష్టించారు. లైఫ్ స్టైల్ యాప్స్ ఫొటోగ్రఫీని కేవలం హాబీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక మంచి ఫొటోతీసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అది స్ఫూర్తిగా మారుతుంది. నగరంలోని యువత తమ ఫొటోగ్రాఫిక్ స్కిల్స్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చారి్మనార్, హుస్సేన్ సాగర్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు కొత్త కోణంలో కెమెరా కంట పడగా, నగర ఆధునిక లైఫ్ స్టైల్ కూడా ఫ్రేమ్లో బంధీ అయ్యాయి. (చదవండి: లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు..)