Lifestyle
-
కత్రినా కైఫ్ పొడవాటి ఒత్తైన జుట్టు రహస్యం...!
బాలీవుడ్ నటి, కత్రినా కైఫ్ ఇటీవల తన పొడవైన, ఒత్తైన మెరిసే జుట్టుకి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేశారు. నటుడు విక్కీ కౌశల్ పుట్టిన రోజు వేడుకుల నిమిత్తం వెళ్లిన టూర్ ఫోటోలు. అందులో కొన్ని అందమైన కుటుంబ క్షణాల తోపాటు ఆమె ఆకర్షణీయమైన కురుల ఫోటోలు అందర్నీ మత్రముగ్ధుల్ని చేశాయి. కానీ ఆమె అభిమానుల్లో ఒకటే చర్చ మొదలైంది కత్రినాకు ఇంత ఒత్తైన మెరిసే జుట్టు ఉందా అని. ఈ కురులు ఎంత ఆకర్షణగా నిలిచాయంటే మా హెయిర్ కూడా ఇలా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరు అంటూ పోస్టులు వెల్లువెత్తేలా చర్చనీయాంశమైంది. అయితే తన పొడవైన జుట్టు రహస్యం ఖరీదైన సెలూన్ ట్రీట్మెంట్ లేదా విలాసవంతమైన హెయిర్ ప్రొడక్ట్ కాదని, తన అత్తగారు వీణా కౌశల్ ఇంట్లో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అని కత్రినానే స్వయంగా వెల్లడించారు. మరి ఆ ఆయిల్ ఏంటో దాని వివరాలు గురించి తెలుసుకుందామా..!.తన అత్తగారు ఉల్లిపాయ, ఉసిరి, అకవాడోతోపాటు మరికొన్ని పోషకపదార్థాలతో నూనెను తయారు చేస్తారని అన్నారు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసే ముందుకు చాలా గంటలపాటు మరిగిస్తారని అన్నారు. తాను వాడుతున్న నూనె అత్యద్భుతమైనదని అన్నారు. ఫ్యానీ ఫ్యాషన్ కంటే స్థిరమైన దినచర్యే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారామె.కత్రినా ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ప్రయోజనాలు ఇవే..ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలోపేతం చేయడానికి, తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాంప్రదాయ కేశ సంరక్షణ పద్ధతిగా చెప్పొచ్చు. ఉల్లిపాయ రసం జుట్టు చిన్న వయసులోనే నెరసిపోవడాన్ని తగ్గించి, చుండ్రును నివారిస్తుందిమరోవైపు, అవకాడోలో ఉండే సహజ నూనెలు, పాలీఅన్శాచురేటెడ్, మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా, ఇది జుట్టుకు లోతైన పోషణను అందించి, తేమను చేకూరుస్తుంది.ఈ పోషకాలు అన్ని రకాల జుట్టుకు మేలు చేసినప్పటికీ, ముఖ్యంగా పొడిబారిన, నిర్జలీకరణానికి గురైన జుట్టుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇవి జుట్టు మృదుత్వాన్ని, దువ్వుకునే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) (చదవండి: చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!) -
చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!
చిన్నపాటి స్టోర్ మాదిరి రెస్టారెంట్ నుంచి ఏకంగా లగ్జరీ రెస్టారెంట్ల రేంజ్కి చేరుకోవడం అంత ఈజీకాదు. పైగా ఆతిథ్య రంగంలో తనకంటూ గర్తింపు తెచ్చుకుని ప్రసిద్ధ బాండ్ రెస్టారెంట్లతో కోట్లలలో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడు ఈ సక్సెస్ని ఎలా అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటో తప్పక తెలుస్తుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. అతడే ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థకు వ్యవస్థాపకుడు రియాజ్ ఆమ్లానీ. అతడు చిన్నగా మొదలు పెట్టిన రెస్టారెంట్ వ్యాపారం అనతికాలంలోనే సోషల్, స్మోక్ హౌస్ డెలి, పృథ్వీ కేఫ్, స్లింక్ అండ్ బార్డోట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల రెస్టారెంట్లు రన్ చేసే రేంజ్కిచేరుకున్నాడు. అంతేగాదు భారతదేశ ఆహార, పానీయాల పరిశ్రమలో తన పేరుని నిలిచేలా చేసుకున్నాడు. తన బ్రాండ్ల వెనుకు ఉన్న తన ఫుడ్ బేవరేజ్ సంస్థ ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ సీఈవో రియాజ్ ఎలాంటి సక్సెస్ సూత్ర పాటించి ఈ రేంజ్కి వచ్చాడంటే..ప్రజల ఫీడ్బ్యాక్ని ఆధారంగా అని చెబుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లు ఇష్టపడే ప్రదేశాలు వంటి వాటిపై చర్చించి ఆ దిశగా తన రెస్టారెంట్లలో అవి ఉండేలా ఏర్పాట్లు చేశాడట. ముంబైకి చెందిన ఈ వ్యాపారవేత తన 35 ఏళ్ల వ్యాపార జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనని, అదే తన విజయ రహస్యమని అంటున్నారు. ప్రజలు ఆనందించగల ప్రదేశాలనే నిర్మిస్తా..అదే తన రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తుందని అంటున్నారు. ఆయన తన రెస్టారెంట్ల వ్యాపారం నుంచి దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తాడట. మన కళ్ల ముందే చాలా కంపెనీలు ఆతిథ్య రంగంలోకి వచ్చి ఇబ్బంది పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తను నిలదొక్కుకోవడానికి కీలకం కస్టమర్లే అంటాడు. మొదట కస్టమర్ల ప్రాధాన్యత, ఆ తర్వాత అవి అమలు చేయడంలో కలిగే సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తానని అంటున్నాడు. తన కుటుంబ వ్యాపారమైన బెర్రీస్ రెస్టారెంట్ నుంచి మొదలైందట. అక్కడ నుంచే మొరాకో-శైలి కేఫ్ అయిన 'మోచా' ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చినట్లు తెలిపారు. అలా తన కుటుంబ వ్యాపారం అంచలంచెలుగా విస్తరించి ఆతిథ్య సంస్థగా ఎదిగిందన్నారు. చివరగా ఆయన ఎదగడానికి రెండు మార్గాలున్నాయన్నారు. మొదటిది విశ్రాంతి తీసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స చేసి ఎదగొచ్చు , రెండు పూర్తిగా పనికే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్పై దృష్టి పెట్టొచ్చు. ఆ విధంగా నిబద్ధతతో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అటెన్షన్ పెడితే విజయం తథ్యం అని అన్నారు. (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్,స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తాజా సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపుతోంది. హోమియోపతి వైద్యాన్ని సమర్ధిస్తూ, ఒక వైద్యుడి వీడియోను ఆమె పంచుకున్నారు. తన జీవితంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించిందంటూ ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట అగ్గి రాజుకుంది. అనుష్కకు సపోర్ట్గా కొందరు, వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయారు.నమిత థాపర్తో డాక్టర్ రాజన్ శంకరన్ జరిపిన సంభాషణ క్లిప్ను అనుష్క ఇన్స్టాలో షేర్ చేశాడు. ఆరోగ్యం , హెల్దీ జీవనవిధానానికి తాను ప్రాధానత్య ఇస్తానని, డా. రాజన్ సూచనలు, సలహాలకు ఎంతో విలువ ఇస్తానని తెలిపింది. తన జీవితంలో హోమియోపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, అందులో డాక్టర్ రాజన్ శంకరన్ ఒక కీలకమైన భాగమని పేర్కొంది. దీంతో నెట్టింట సందడి మొదలైంది.Virat Kohli’s wife, Anushka Sharma is recommending homeopathy to Indians.Fraud babas are not enough, she is now promoting unscientific fraud medicine to IndiansGive them enough money and they might one day tell people, “Just visit Premanand Maharaj to cure all your diseases.” pic.twitter.com/5L6y8Wcxa6— Mohit Chauhan (@mohitlaws) June 2, 2026దుమ్మెత్తిపోసిన నెటిజన్లుఇక్కడ ఉన్న దొంగ బాబాలు చాలదన్నట్టు, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అశాస్త్రీయమైన నకిలీ వైద్య విధానాన్ని ప్రమోట్ చేస్తోందంటూ అనుష్క శర్మ వైఖరిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు డబ్బులిస్తే ఏదైనా చెబుతారంటూ మండిపడ్డారు. 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న నటి హోమియోపతిని ప్రమోట్ చేయడం మరికొందరు విమర్శలు గుప్పించారు. నమ్మకం పేరుతో సరైన అల్లోపతి వైద్యం తీసుకోకుండా, చనిపోయిన చాలా మందిని చూశాను. ఇకపై తాను అనుష్క ఫ్యాన్గా ఉండదలుచుకోలేదని ఒకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు అనుష్క స్టోరీ చూస్తే రక్తం మరుగుతోంది. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండి హోమియోపతిని ఎలా ప్రమోట్ చేస్తారు? వీరికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే హోమియోపతి లేదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారా? ఇలాంటి ప్రచారాల వల్లే ప్రజలు ప్రాణాంతక వ్యాధులు ముదిరిపోయే వరకు హోమియోపతి వాడుతూ, చివరి దశలో అల్లోపతి ఆసుపత్రులకు వస్తున్నారని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడిఅనుష్కకు మద్దతుగా మరికొందరు మరోవైపు, అనుష్క శర్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలంటూ . హోమియోపతి వల్ల తమకు జరిగిన మేలును వివరిస్తూ చాలా మంది ఆమెకు, హోమియో వైద్య విధానానికి మద్దతుగా నిలిచారు అందరూ ఆ డాక్టర్ లేదా బాబా దగ్గరికే వెళ్లాలని ఆమె ఎక్కడా చెప్పలేదు ఒకరు, కొన్నిసార్లు అల్లోపతి కూడా నయం చేయలేని వ్యాధులను హోమియోపతి నయం చేస్తుందని ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ అల్లోపతి వైద్యులే. కానీ నాకున్న దీర్ఘకాలిక చర్మ సమస్య కోసం రెండేళ్లు మోడరన్ మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు గత రెండున్నర నెలలుగా హోమియోపతి వాడుతున్నాను, నాలో చాలా మార్పు కనిపిస్తోంది" అని ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. నన్ను ట్రోల్ చేశారుదీనికి హోమియోపతి వైద్యులు కూడా స్పందించడం గమనార్హం. హోమియోపతి డాక్టర్ని అని చెప్తేనే ఎక్స్లో తనను చాలా ట్రోల్ చేశారంటూ ఒక హోమియోపతి వైద్యుడు కూడా అనుష్కకు మద్దతుగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం! -
వృద్ధులకు వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఎందుకు మంచిదంటే..!
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండేందుకు బల శిక్షణ(స్ట్రెంగ్త్ ట్రైనింగ్) ఎంతో మంచిదంటోంది హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీనా అరాగాన్. కండరాల క్షీణత, ఎముకలు, కీళ్లు బలహీనపడటం వంటి ఇతర కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ ప్రజలు బలహీనపడతారు. దీనికి విరుగుడు బరువులు మోయడ మేలని చెబుతోంది. అదెలాగో తన 87 ఏళ్ల తండ్రిని ఉదాహరణగా చూపిస్తూ..ఆయన జిమ్ వర్కౌట్లతో ఎలా మెరుగ్గా ఉన్నారో వివరించేలా వీడియోని షేర్ చేశారామె. ఆయన ప్రతి వారం ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేలా చూస్తుంటానని చెప్పారామె. అయితే తన తండ్రి కేవలం పైకి, కిందకు వెయిట్లిప్ట్ చేస్తూ..కండరాలకు మాత్రమే పనికల్పిస్తున్నాని అనుకుంటారు. కానీ అంతకు మించి ప్రభావవంతమైందని, మొత్తం బాడీలోని అన్నింటికి మంచిదని ఆయనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఆయన వయసు పైబడుతున్ను కొద్దీ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే వ్యాయం ఇదేనని, అందుకే ఆయన చురుకుగా, బలంగా ఉండేలా ఇలా కండరాలకు ఇలా బరువులు ఎత్తే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనను పదేపదే జిమ్కి వచ్చేలా చూడటమే తన పని అంటోంది. అయితే ఆయన ఈ జిమ్ సెషన్లో పాల్గొనెటప్పడూ..మంచి అనుభూతితో, తన కేర్ని అర్థం చేసుకునేలా చేస్తానంటోంది. ముఖ్యంగా ఆయన తన తదుపరి సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెయిట్లిఫ్ట్కి సంబంధించిన రెండు రకాల ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారని అన్నారామె. ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా తన తండ్రి బ్యాలెన్స్ చేసుకోగలరని, అలాగే 80 పౌండ్ల కంటే ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేగాదు వృద్ధులకు బరువులు ఎత్తడం వంటి వర్కౌట్లు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. View this post on Instagram A post shared by Jeana Aragon (김제나) (@jeana.aragon) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?
నేను బాగానే ఉన్నాను..అనేది సానుకూలమైన ధోరణి అనుకుంటాం. కానీ అది ఎంతలా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. నిజానికి ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నామని వైద్యుల, మానసిక నిపుణులు సైతం ముందుగా గుర్తించలేరట. మనకు ఎవరైనా మీరు ఎలా ఉన్నారు? అనగానే ఐమ్ ఫైన్, థాంక్యూ అని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. కానీ ఈ సమాధానమే పెద్దయ్యాక సర్దుబాటు పద్ధతిగా మారి మానసిక క్షోభగా పరిణామం చెందుతోందని గుర్తించమని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటని విస్తుపోకండి. అసలు ఏంటి సిండ్రోమ్..బాగున్నా అన్నా ధోరణి ఇంత ప్రమాదకరంగా ఎలా మారుతుందంటే..ఈ సిండ్రోమ్ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను విస్మరించి అంతా తన అధీనంలో ఉండాలనే ధోరణినే 'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్ అంటారట. మస్తత్వవేత్తలు ఇది ఒక రకమైన లక్షణాలను అంగీకరించకుండా.. భావోద్వేగాలను అణిచివేసే స్థితిగా చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమలోని ఆందోళన సంకేతాలను తక్కువగా అంచనా వేస్తారు లేదా విస్మరిస్తారని అంటున్నారు. అంతేగాదు ఈ 'నేను బాగానే ఉన్నాను' అనేది కేవలం మామూలుగా చెప్పే సమాధానం కాదు. అదొక సర్దబాటు విధానంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యే ఇదని అంటున్నారు. అంటే వృత్తిరీత్యా సమావేశాలు, టార్గెట్లు, అదనపు వర్క్ని పరమావధిగా చూస్తూ..భోజనం మానేయడం, నిద్రలేని రాత్రలు, నిరంతర అలసట, భావోద్వేగపరమైన నీరసం వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తూ..అంతా తమ అధీనంటో ఉందన్నట్లు పనులు చేస్తుంటారని చెబుతున్నారు మానసిక నిపుణుల. ఇక్కడ జీవించడం లేదు కేవలం పోటీ పడుతున్నాం. ఫలితంగా స్వీయం సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య సమస్యలు గురించి ఆలోచించ్చని అనుకుంటూ..తెలియకుండానే ఆ భయానక వలయంలో కూరుకుపోతారని అంటున్నారు. అంతేగాదు దీని కారణంగా అనారోగ్య అలవాట్ల బారిన పడతారని కూడా అంటున్నారు. ఈ సిండ్రోమ్ సంకేతాలు..నిద్రలేమిఏకాగ్రత లోపంజ్ఞాపకశక్తి సమస్యలువైద్యపరంగా వివరించలేని ఆకలి లేదా బరువులో మార్పులుపనిలో ఉత్పాదకత తగ్గడంసామాజిక ఒంటరితనంఅభిరుచులపై ఆసక్తి లేకపోవడంచిరాకుఆవేశపూరిత ప్రవర్తనతరచుగా వచ్చే తలనొప్పులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు,అలసట వంటి శారీరక అనారోగ్యాలుఈ లక్షణాలు ఒక్కోసారి ఆపీసు లేదా కార్యాలయాల్లో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పుడూ కూడా ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దీనివల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేని విధంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిరాకరణ నుంచి 'నేను బాగానే ఉన్నాను' అనే సిండ్రోమ్ వస్తుందట. మానసిక నిరాకరణ అనేది తరుచుగా భయం, సామాజిక కండిషనింగ్ నుంచి పుడుతుందని అంటున్నారు. చాలామంది తాము బలంగా ఉండాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని ఇతరులకు భారం కాకూడదని భావిస్తూ పెరుగుతారు. అది కాస్తా తమ బాధను అంగీకరించడానికి ఇబ్బందిపడే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ మనం బాధను అంగీకరిస్తే బలహీనంగా కనిపిస్తామని సిగ్గుపడి చివరకి నిరాకరణ ధోరణి మొదలవ్వుతుందని అంటున్నారు. అందుకే భావోద్వేగాలను అణిచివేయొద్దు, బాధ, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అంగీకరించి వాటి నుంచి బయటపడే మార్గం చూడండి తప్ప అణిచేసేలా బాగానే ఉన్నాను అనే మాటకు ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ బాగానే ఉన్నాను అను మాటకు కట్టుబడి ఉండేలా స్వీయ భద్రతపై దృష్టిపెట్టండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి..తర్వాత అనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. (చదవండి: ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..) -
సైనికులకు ‘పాదా’భివందనం
ఆమె కాళ్ల కింద తారు కరుగుతోంది. నెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయినా రాజస్థాన్ అజ్మీర్ బిడ్డ సూఫియా సూఫీ పరిగెడుతూనే ఉంది. ‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో భారత సాయుధ దళాల గౌరవార్థం కన్యాకుమారి నుంచి హిమాలయాల్లోని కారకోరం రేంజ్ వరకు 5,000 కిలోమీటర్ల పరుగును 88 రోజుల్లో పూర్తి చేయడానికి బయలుదేరింది. ఒంగోలు మీదుగా సాగుతున్న పరుగులో ఆమె ప్రతి అడుగు సైనికునికి శాల్యూట్ పలుకుతోంది.‘పరుగు నాకు ధ్యానం లాంటిది. నేను పరిగెత్తిన ప్రతి అడుగు నన్ను శక్తిమంతం చేసింది’ అంటుంది సూఫియా. భగభగలాడే ఎండల్లో, పొగలు కక్కే హైవే మీద ఆమె పరిగెడుతూ ఒంగోలు మీదుగా ముందుకు సాగుతూ కనిపించింది. సాధారణంగా అటువంటి వాతావరణంలో బయటకు రావడమే కష్టం. పరుగు తీయడం అసాధ్యం. ‘అయినా నేను ఆగను. సైనికులకు అంకితం ఇచ్చే వరకు నా పరుగు ఆపను’ అన్నారామె.‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో సూఫియా మే 12, 2026న కన్యాకుమారి వద్ద పరుగు మొదలుపెట్టింది. 88 రోజుల పాటు నిరవధికంగా పరిగెత్తి, పదకొండు రాష్ట్రాలు, యుద్ధ స్మారకాలు దాటి, 18,000 అడుగుల ఎత్తున కారకోరం పాస్ వద్ద ఆగస్టు 6న ఆ పరుగును ముగించనుంది. ఆ విధంగా సైనికులకు తన పరుగును అంకితం చేయనుంది. వారికి పాదాభివందనం చేయనుంది.ప్రశాంతత కోసం పరుగుసూఫియా సూఫీది రాజస్థాన్లోని అజ్మీర్. పదహారేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాగేజ్ హ్యాండ్లింగ్ ఆఫీసర్గా పదేళ్లు పనిచేసింది. ‘మరబొమ్మలాంటి ఆ జీవితం నా ఆరోగ్యాన్ని నాశనం చేసింది’ అంటుందామె. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రశాంతత కోసం పార్కులో రోజూ మూడు కి.మీ. పరుగు మొదలుపెట్టింది. అది కాస్తా అలవాటుగా, అలవాటు ఫ్యాషన్ గా,ఫ్యాషన్ జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఉద్యోగాన్ని వదిలేసి, 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 4,000 కి.మీ పరిగెత్తి మొదటి గిన్నెస్ రికార్డ్ కొట్టింది. ఆ తర్వాత ఆల్ట్రా మారథాన్ రన్నర్గా పరిగెడుతూనే ఉంది.ప్రజల తోడు‘నేను రోజుకు అరవై నుంచి అరవై అయిదు కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. మొదటి పది రోజులు ఎండల వల్ల చాలా కష్టంగా గడిచింది. తమిళనాడు, ఆంధ్రలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తెల్లవారుజాము నాలుగు నుంచి ఉదయం 9.30 వరకు.. సాయింత్రం నాలుగున్నర నుంచి రాత్రి 9 వరకు పరుగు పెడుతున్నాను. రోజురోజుకూ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. దారి మధ్యలో కొందరు రన్నర్లు నాపై అభిమానాన్ని చూ పారు. సంఘీభావంగా నాతో పరిగెత్తారు. చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు నాతో పరిగెత్తారు. ఇంతకు మించి ఏం కావాలి’ అంటుంది సూఫియా.శరీరానికి నచ్చ చెప్తూ...‘రోజుకు 15 గంటల పాటు పరిగెడుతుండటంతో నా శరీరం హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అయినా దానిని సముదాయిస్తూ ఓర్పుగా ముందుకు కదులుతున్నాను. నేను ఐదు గిన్నిస్ రికార్డులు సాధించడానికి నా భర్త వికాస్ సహకారం మరువలేనిది. అనుక్షణం నన్ను నా పరుగులో జాగ్రత్తగా గమనిస్తూ ఆహారంలో, పరుగులో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. మహిళలు ఏమీ చేయలేరు, వాళ్లందరూ శక్తిహీనులేనని చాలామంది అంటుంటారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించదలచుకున్నాను. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మహిళలకు అన్ని అవకాశాలు లభిస్తున్నాయి. స్త్రీలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అన్ని అడ్డంకులను పటాపంచలు చేయాలి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం’ అని హరిణిలా దూసుకుపోయారామె.సైనికుల అభిమానిసూఫియాకు పరుగు ఒక క్రీడ కాదు. దేశభక్తిని చాటే మార్గం. భారత సాయుధ దళాలు అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కా పాడుతున్నాయని చెప్పడానికి కఠినమైన దారుల్లో సూఫియా పరుగు నిర్వహిస్తూ ఉంటుంది. 2022లో సియాచిన్ నుంచి కార్గిల్ వరకు ఎముకలు గడ్డ కట్టే స్థితిలో పరిగెత్తిన మొట్టమొదటి మహిళగా నిలిచింది. 2023లో మనాలి–లేహ్ మధ్య 480 కి.మీ దూరాన్ని 98 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ‘రన్ ఫర్ డ్రీమ్స్’లో భాగంగా సముద్ర మట్టానికి 5,540 మీటర్లు ఎత్తున లేహ్కు ఉత్తరంగా భారత్–చైనా సరిహద్దులో ఉన్న కారకోరం వరకూ పరిగెత్తనుంది. ‘సైనికుల కష్టం ముందు నా పరుగు నొప్పి చాలా చిన్నది’ అంటుంది సూఫియా. – కె. గంగాధర్, సాక్షి, ఒంగోలు డెస్క్ -
చింతగింజలతో మైక్రోప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. ముఖ్యంగా నీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను తొలగించడం అంత సులభం కాదు. అదీగాక నీటి నుంచి మైక్రోప్లాస్టిక్ని వేరుచేయడం అంటే కచ్చితంగా రసాయనాలు కలపక తప్పని పరిస్థితి, ఖర్చు కూడా అధికమే. ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపి ఎర్త్ప్రైజ్ గెలుచుకున్నారు ఈ టీనేజర్లు.వాళ్లే వివాన్ ఛావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే భారతీయ విద్యార్థుల బృందం. ఈ విద్యార్థులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్లను వేరు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిని అభివృద్ధి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం చింత గింజల పొడిని ఉపయోగించి జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని రూపొందించారు. ఇది కలుషితమైన నీటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్ కణాలకు అంటుకుంటుంది. ప్లాస్-స్టిక్ అని పిలువబడే ఈ ఆవిష్కరణ రసాయనాలను జోడించకుండా, సాంప్రదాయ ఫిల్టర్లు తరచుగా వదిలివేసే మైక్రోప్లాస్టిక్లను ఎలా బంధించగలదో పరిశోధనలో వెల్లడైంది. అంతేందుకు ఇప్పుడు వాటర్ టిన్లు, బాటిల్స్ అన్ని ప్లాస్టిక్. అందువల్ల తాగు నీటిలో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు దాగి ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వాటిని పారేసి చింతగింజలతో తయారు చేసిన ప్రత్యేక పొడితో ఈ మైక్రోప్లాస్టిక్ చెక్పెట్టారు.ఈ చింతగింజల పొడి అయస్కాంతం మాదిరిగా ప్లాస్టిక్ని ఆకర్షించి వేరు చేస్తుందట. దీనివల్ల శుభ్రమైన నీటిని సులభంగా పొందొచ్చని చెబుతోంది ఆ విద్యార్థుల బృందం. సేకరించిన ప్లాస్టిక్ను టైల్స్ లేదా కోస్టర్స్ వంటి చిన్న, ఉపయోగకరమైన వస్తువులుగా మారుస్తారు. ఫలితంగా అది తిరిగి ప్రకృతిలోకి చేరదు. ఈ ఆవిష్కరణలో జంతువులు, మానవులు కనిపించన ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతామని చెబుతున్నారు. ఆ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలను సందర్శించనప్పుడే ఈ ఆలోచన తట్టిందని, అక్కడ చాలామంది ప్రజలు ప్లాస్టిక్ పాత్రలలోని నీటిని నిల్వ ఉంచడం చూశామని అన్నారు. వెనుబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగి ఈ మైక్రోప్లాస్టిక్ బారిన పడటం చూశాక ఈ ఆవిష్కరణకు పురికొల్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావవంతమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా స్థానికంగా లభించే వనరులతోనే దీన్ని ఆవిష్కరించడంతో ఈ టీనేజర్లపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అంతా. కలుషితమైన నీటి వనరులతో ఇబ్బంది పడుతున్న వర్గాలకు ఇది గొప్ప ఆచాణాత్మకమైనదని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ విద్యార్తి బృందం ‘ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ’ ఎంపికయ్యారు. ఇలా గుర్తింపు పొందిన బృందం మాదే కావడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ ముగ్గురు టీనేజర్లు. కాగా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రజా ఓటింగ్ ద్వారా ప్రపంచ విజేతను ఎంపిక చేశారు. అంతేగాదు ఈ ఆవిష్కరణ సంక్లిష్టమైన కాలుష్య సమస్యలను సరళమైన, ప్రకృతి ఆధారిత ఆలోచనలు ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. ఈ విజయం యువత నేతృత్వంలోని విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచవ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ తొలగింపు సాంకేతికతల కోసం పెరుగుతున్న కృషికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.(చదవండి: ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..! వైరల్గా టెకీ స్టోరీ) -
ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..!
చాలా సక్సెస్ స్టోరీలు మన కళ్ల ముందు..నుంచే వస్తుంటాయి. అప్పటి వరకు ఊహించం ఆ వ్యక్తి ఆ స్థాయి చేరుకుంటాడని. చాలా దయనీయ పరిస్థితిల్లో బతికి మనం చూస్తుండగానే ఆకాశమంత స్థాయికి ఎదిగి సక్సెస్ని ఒడిసిపట్టి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కథే ఈ టెకీ గాథ.ముంబైలో జన్మించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ యాదవ్ దాదాపు దాదాపు మూడు దశాబ్దాల పాటు మురికివాడలోనే నివశించాడు. అక్కడే అతడి చదువు, బాల్యం సాగింది. ఆ స్థాయి నుంచి జర్మనీలో కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్ స్థాయికి ఎలా చేరుకున్నాడో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆయన భార్యతో కలిసి ఉన్న సోషల్ మీడియా పోస్ట్ని షేర్ చేస్తూ..తన కథను పంచుకున్నారు. సంతోష్ యాదవ్ ప్రస్తుతం యాంగులర్ గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ (GDE), గిట్హబ్ స్టార్, ఓపెన్-సోర్స్ కంట్రిబ్యూటర్, అంతర్జాతీయ స్పీకర్గా పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన జీవితంలో ఎక్కువ భాగం ముంబై మురికివాడలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువులో చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. క్రికెట్ అంటే మహాఇష్టం అందువల్లే చదువులో అంతమాత్రంగా ఉండేవాడినని అన్నారు. ఆ కారణంగానే ఇంటర్లో సైన్సు కోరులో చేరలేకపోయానని అన్నారు. అయితే తండ్రి స్నేహితుల్లో ఒకరు యాదృచ్ఛికంగా ఇచ్చిన సలహా వల్ల కంప్యూటర్ డిప్లోమా కోర్సులో చేరినట్లు తెలిపారు. అయితే ఇంగ్లీష్ తన మాతృభాష కాకపోవడంతో పాఠాలతో పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదన్నారు. I lived in slum in Mumbai for 29 years, decided to move after my daughter was born, next week we will be moving to multi storied apartment on rent, pic.twitter.com/QIgX3igafc— Santosh Yadav (@SantoshYadavDev) August 21, 2020 తన యాస కారణంగా తాను ఎలా ఎగతాళికి గురయ్యానో కూడా చెప్పారు. ఇక చదవలేను అని ఏడ్డిన సంగతి కూడా ఇంకా గుర్తు ఉందన్నారు. మళ్లీ యథావిధిగా పెయిల్ అవుతానేమోనని తెగ భయపడేవాడినని అన్నారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ కూడా ఆడటం మానేసి, స్నేహితులకు దూరమై పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టానన్నారు. దాంతో తన గ్రేడ్లు మెరుగుపడటమే గాక సుమారు 60%కు పైగా మార్కులతో డిప్లోమాను పూర్తి చేశానని అన్నారు. అప్పుడు తెలిసిందే సాధించాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా.. సాధించగలరు, చేయగలరని, కేవంల పట్టుదలను వదులుకోకూడదని అన్నారు. తన క్లాస్మేట్ తన యాసను ఎగతాళి చేయడంతోనే సవాలుగా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఆకస్మికంగా తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టాయన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుదామంలే కాలేజ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి దాంతో ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్లు కరాఖండీగా చెప్పారని తెలిపారు. దాంతో రాత్రంతా ఏడుస్తూ ఉన్న నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అయితే తన పరిస్థితిని చూసిన తల్లి తండ్రితో మాట్లాడి చదువుకు కొనసాగించేలా చేసిందన్నారు. తన మేనమామ సాయంతోనే చదువు కొనసాగించగలిగానని అన్నారు. సరిగ్గా కంప్యూటర్ సైన్సుతో డిగ్రీ పూర్తి చేసేనాటికి 2008 ఆర్థిక సంక్షోభం సంభవించి ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. దాంతో ఎంతో కష్టపడి నెలకు రూ. 5000 జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించానని నఅ్నారు. కోడింగ్ అంటే ఇష్టంతో C#లో మంచి పట్టు సాధించానన్నారు. నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాభివృద్ధిని సంపాదించుకుని 2010 కల్లా నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆగస్టులో 2011లో ఒక స్టార్టప్లో చేరి ఐదేళ్లపాటు అక్కడే పనిచేశానని అన్నారు. జీతం బాగుండేది, పైగా తాను చేరినప్పుడు 50% కంటే ఎక్కువ జీతం పెరిగిందన్నారు. అలా చివరకు కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్, పీఎఫ్ కూడా లభించాయన్నారు. అలా సరిగ్గా 2016లో భార్యతో కలిసి పూణేకు మారారు. అక్కడ బహుళజాతి కంపెనీలలో పనిచేస్తూ..టెక్నికల్ బ్లాగులు రాయడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, డెవలపర్ కమ్యూనిటీకి తన వంతు సహకారం అందించడం ప్రారంభించానని అన్నారు. అయితే పనికోసం కుటుంబ జీవితాన్ని అస్సలు త్యాగం చేయొద్దని అన్నారు. ఎందుకంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసినా అదనంగా వేతనం మాత్రం లభించదన్నారు. తన కెరీర్ 2019లో అనూహ్యమైన మలుపు తిరిగిందన్నారు. ఆ సమయంలో యాదవ్ Angular, NgRx వంటి ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడం ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే కమ్యూనిటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అదే ఏడాది తన తొలి కాన్ఫెరెన్స్ ప్రసంగం ఇచ్చాడు. ఆ తర్వాత గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందింది. అలాగే నవంబర్ 13, 2019న తన పుట్టి రోజున యాంగులర్ కోసం గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్గా అధికారికంగా ప్రకటించబడ్డారు. ఆ తర్వాత 2020లో తన తోటి డెవలపర్లు నామినేట్ చేయడంతో భారతదేశపు తొలి గిట్హబ్ స్టార్ అయ్యాడు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫెల్ ప్రకారం..జనవరి 2026లో జర్మనీలోని కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్గా మారడానికి ముందు, అవోడాక్ ఏజీ సెలొనిస్ వంటి కంపెనీలతో పనిచేశారు. తన కెరీర్లో 17 ఏళ్లకు పైగా గడిచినా..యాదవ్ ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్లో ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. 50కి పైగా అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నారు.We celebrated our 17th wedding anniversary together in Hamburg, this is the first time we decided to spend it with Hiya, she will be 14 soon.This weekend was all about us 😅.Thank you for everything ❣️ and staying by my side, when we married I was not able to afford anything,… pic.twitter.com/EkmgWLKk7N— Santosh Yadav (@SantoshYadavDev) May 31, 2026 (చదవండి: రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..) -
రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..
ధ్యాన సాధన గురించి ప్రముఖ యోగా గురువుల వద్ద శిక్షణ తీసుకుని మరీ ప్రయత్నిస్తుంటాం. అయినప్పటికీ నిలకడ సాధ్యం గాక పట్టు సాధించలేకపోతుంటాం. అలాంటి ధ్యాన సాధనను గౌతమ్ వైష్ణవ్ అనే కళాకారుడు రాళ్లతో అలవోకగా నేర్పిస్తున్నాడు. అదెలాగో తెలిస్తే..విస్తుపోతారు.రాళ్లతో సాధన అంటే..సున్నితమైన ఆకృతుల్లో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చేలా సమతుల్యం చేయడం. అందుకోసం ఎలాంటి జిగురు ఉపయోగించరు. ఇది కేవలం మన ఏకాగ్రత, ఓపికలకు సంబంధించిన సామర్థ్యం. మరి ఇదెలా ధ్యాన సాధన అవుతుందంటే..ముంబైకి చెందిన కళాకారుడు గౌతమ్ వైష్ణవ్ ధ్యాన చేయడం ఎలా అనేది నేర్పించారు. కేవలం చేసేలా ఈ టెక్నిక్తో బలవంతం చేస్తారు. అంటే వివిధ రాళ్లను వాటిని ఒకదానిపై ఒకటి నిలబడేలా చేసే టెక్నిక్ని నేర్పిస్తారు. అంతే అదే వారిని లోతైన ధ్యాన సాధన చేసేలా చేస్తుంది. ఇక్కడ ఈ టెక్నిక్లో రాళ్లతో మమేకమవ్వుతారు. ఒకదానిపై ఒకటి పెట్టే క్రమంలో ఓపిక, పదే పదే ప్రయత్నాలు..ఏకాగ్రత, నిలకడని పెంపొందిస్తాయి. పైగా ఏ కేంద్రం వద్ద రాయి నిలబడగలదు అనే దానిపై పూర్తి అటెన్షన్ సామర్థ్యం పెంపొంది సులభంగా తనకు తెలియకుండానే ధ్యాన సాధన చేయగలుగుతారు. రాళ్లను సమతుల్యంచేసే కళాత్మక నైపుణ్యం ఏళ్లు గడిచే కొద్ది లోతైన ధ్యాన సాధనగా పరిణామం చెందుతుందట. ఇది ఏకాగ్రత, సహనం, భావోద్వేగ స్థిరత్వం, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ టెక్నిక్లో రాయి చేప్పేది వింటుంటారు. అదే అన్ని నేర్పిస్తుందని అంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో కావాల్సింది కూడా ఇదే. ఇదొక విభిన్నమైన ధ్యాన పద్ధతని గౌతమ్ నొక్కి చెబుతున్నారు. అందుకే తాను ఎవ్వరికి ధ్యానం గురించి భోధించనని, చేసేలా బలవంతం చేస్తానని నవ్వుతూ చెబుతున్నారు. ఆలోచనలను నిశబ్దం చేయడానికి సతమతమయ్యే వాళ్లకు ఈ టెక్నిక్ ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది పూర్తి మైండ్ఫుల్నెస్ ఆధారిత విధానం అని అంటున్నారు గౌతమ్. దాదాపు 90 నిమిషాల పాటు ఎవరైనా నిరంతరాయంగా రాళ్లను సమతుల్యం చేసేలా దృష్టిసారిస్తే..కచ్చితం మిగతా విషయాలన్నింటి గురించి ఆలోచించడం మానేస్తారని అంటున్నారు. తమకు తెలియకుండానే నిశ్చల స్థితిని అనుభవిస్తారని అంటున్నారు. ధ్యానం అంటేనే ఎలాంటి ఆలోచనలు లేని నిశ్చల స్థితి, శ్వాసపై ధ్యాస అది ఈ టెక్నిక్తో సులభంగా అలవడుతుందని గౌతమ్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..ధ్యాన సాధన సునాయాసంగా నేర్చుకోండి. View this post on Instagram A post shared by Gautam Vaishnav | A Balance Artist (@the.gautamvaishnav)(చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..) -
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..) -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...మతిమరపును ఇంగ్లిష్లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.చికిత్స...అల్జీమర్స్ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్’, ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందుల్ని ఎఫ్డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకోవాలి.పెరిగే బీఎమ్ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... యూనివర్జిటీ ఆఫ్ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎమ్ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్ ఎమోషన్స్), ప్లానింగ్ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన లీడ్ ప్రొఫెసర్ డాక్టర్ సుహాంగ్ సాంగ్ పేర్కొన్నారు.నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.ఆహారం... పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.మెదడుకు మేత కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.వ్యాయామం...దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.నిర్ధారణ అల్జీమర్స్ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్ అమైలాయిడ్ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్ పెట్ స్కాన్ ద్వారా అల్జీమర్స్ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే ముప్పూ తగ్గుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...డయాబెటిస్, హైబీపీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.మతి మరుపు, అల్జీమర్స్ కారణమయ్యే అంశాల్లో కొన్ని...మతిమరుపునకూ, అల్జీమర్స్కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...1. జన్యుపరమైనవి : అల్జీమర్స్తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి.2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). పైగా ఇది నిరోధించలేని అంశం.3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్నెస్ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్ కారణంగా అల్జీమర్స్ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.4. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంట అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ.5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్కు కారణమయ్యే అవకాశాలెక్కువ.6. వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్) పదార్థాలు కూడా అల్సైమర్స్ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.- డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ నిర్వహణ యాసీన్ -
65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!
బరువు తగ్గాలంటే వాకింగ్ కీలకం అనేది చాలామంది ఫిట్నెస్ నిపుణులు చెప్పేమాట. రోజుకు 5-10 వేల అడుగులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే బిజీ షెడ్యూల్స్, వర్షంవల్ల, మండే ఎండలు లాంటి వాతావరణ అననుకూలత వల్ల రోజుకు 10వేల అడుగులు వేయడం ఎలా? అనుకుంటున్నారా? అయితే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకుండానే కేవలం 65 నిమిషాల్లో 10వేల అడుగులు ఎలా పూర్తి చేయాలో ఫిట్నెస్ కోచ్ రీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఇండోర్ వర్కౌట్ ప్లాన్ వివరాలు చూద్దామా.వార్మ్-అప్, హై-నీ మార్చింగ్, స్టెప్-అప్స్, వాక్-అండ్-లంజ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాల కలయికతో ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేయవచ్చని రీత్ కూర్ తెలిపారు. ప్రతిరోజూ 10వేల అడుగులు నడవాలనే ఆలోచన మెరుగైన ఫిట్నెస్ , బరువు నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అయితే, తీరికలేని పనులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మరియు ఎక్కువ పని గంటల కారణంగా, చాలా మందికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా అనిపిస్తుంది.అందుకే తగినప్లాన్ అవసరం . ఎలా అంటే65 నిమిషాల్లో అంటే గంట 5 నిమిషాల్లో 10వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే., సగటున నిమిషానికి 167 అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 10వేల అడుగులు కాకుండా, ఫిట్ నెస్ను బట్టి నెమ్మదిగా ప్రారంభించాలి.వార్మ్-అప్ (5 నిమిషాలు)వర్కౌట్ ప్రారంభించే ముందు గాయాలు కాకుండా కండరాలను సిద్ధం చేయడానికి ఇది చాలా అవసరం. ఒకే చోట నిలబడి నడవడం (March in place), చేతులు తిప్పడం , పక్కలకు చిన్న అడుగులు వేయాలి. తద్వారా సుమారు 500 అడుగులు వస్తాయి.మెయిన్ ఇండోర్ వర్కౌట్ (50 నిమిషాలు)బోరింగ్గా అనిపించకుండా ఉండటానికి ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఒకసారి క్రింది వ్యాయామాలను మారుస్తూ చేయాలి.హై-knee మార్చింగ్ లేదా ఒకే చోట జాగింగ్ అంటే మోకాళ్లను పైకి లేపుతూ, చేతులను వేగంగా కదిలిస్తూ జాగింగ్ చేయాలి. దీనివల్ల దాదాపు 1,200–1,500 అడుగులు వస్తాయి.స్టెప్-అప్స్ (5 నిమిషాలు): ఇంట్లోని మెట్లు లేదా ఏదైనా బలమైన కుర్చీ సహాయంతో కాళ్లు మారుస్తూ పైకి, కిందికి అడుగులు వేయాలి. ఇది కాళ్లకు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల 600–800 అడుగులు వస్తాయి.ఫ్రీస్టైల్ డ్యాన్స్ లేదా జుంబా (10 నిమిషాలు): మీకు నచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ పెట్టుకుని హుషారుగా డ్యాన్స్ చేయాలి. దీని ద్వారా 1,500 కంటే ఎక్కువ అడుగులు సాధించవచ్చు.వాక్-అండ్-లంజ్ కాంబో (5 నిమిషాలు): గదిలో 10 అడుగులు నడిచిన తర్వాత ఐదు లంజెస్ (Lunges) వ్యాయామం చేయాలి. ఇది లోయర్ బాడీని బలోపేతం చేస్తుంది. దీనివల్ల 500 అడుగులు వస్తాయి.సైడ్ స్టెప్స్ & స్కేటర్ జంప్స్ (5 నిమిషాలు): పక్కలకు పెద్ద అడుగులు వేస్తూ చిన్నగా గెంతాలి. ఇది కాళ్లు మరియు కోర్ (Core) కండరాలకు మంచిది. దీనివల్ల 800 అడుగులు లభిస్తాయి.పవర్ మార్చింగ్ (10 నిమిషాలు): వేగంగా మెట్లు ఎక్కడం లేదా ఇంట్లోనే వేగంగా అడుగులు వేయడం చేయాలి. దీనివల్ల కేవలం 10 నిమిషాల్లోనే 2,000 అడుగుల వరకు వస్తాయి.స్ట్రెచింగ్ (5 నిమిషాలు)హై-ఇంటెన్సిటీ వర్కౌట్ పూర్తయిన తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.నెమ్మదిగా నడవడం, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, బాడీ స్ట్రెచింగ్ చేయడం లాంటి కూల్ డౌన్ ప్రక్రియ ద్వారా చివరిగా మిగిలిన 500 అడుగులు దీని ద్వారా పూర్తవుతాయి. ఈ విధంగా సరైన పద్ధతిలో సమయాన్ని కేటాయిస్తే, జిమ్కు లేదా పార్కుకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని మీ ఫిట్నెస్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. View this post on Instagram A post shared by Reet Kaur | Fat Loss Coach | Thyroid & Postpartum (@transformationwithtwins)నోట్ : సాధారణంగా వాకింగ్ చేయడం చాలా సులభం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా మెల్లగా సాధన చేసుకోవచ్చు. అయితే ఏదైనా సమస్య ఉంది అనిపించినపుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
ఈ నాలుగింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా..!
మన నిత్య జీవితంలో తరచుగా వాడే కొన్ని పదాల మధ్య అసలు తేడా చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో హోటల్, మోటెల్, రెస్టారెంట్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రిసార్ట్ పదాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రదేశాలు దాదాపు ఒకే విధంగా అనిపించినా, వాటి సేవలు, ఉద్దేశం, స్థానాల విషయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వీటిని ఒకే విధంగా వాడటం వల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు ఈ నాలుగు పదాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.హోటల్ అంటే..హోటల్ అనేది చాలా మందికి బాగా తెలిసిన, తరచుగా ఉపయోగించే ఒక వసతి కేంద్రం. ప్రయాణ సమయంలో బస చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతి పొందే ప్రదేశం. హోటల్స్లో సాధారణంగా భోజనం (రెస్టారెంట్), టీవీ, వైఫై వంటి అదనపు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. హోటళ్లు పట్టణాల మధ్యలో లేదా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో నిర్మించి ఉంటాయి.మోటెల్ అంటే..మోటెల్స్ అనేవి హోటల్స్కు భిన్నంగా, చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించబడ్డాయి. మోటెల్ అంటే కారు డ్రైవ్ చేస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి, ఆగి వెళ్లడానికి వీలుగా ఉండే ప్రదేశం. ఇవి ప్రధానంగా సుదూర హైవేల వెంబడి నిర్మించబడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.మోటెల్స్లో సాధారణంగా రాత్రి బస చేయడానికి గది దొరుకుతుంది, ఉచిత పార్కింగ్ తప్పనిసరి ఉంటుంది. అయితే, రెస్టారెంట్ లేదా పూర్తి భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. కొన్ని మోటెల్స్లో కేవలం కేఫ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది.రెస్టారెంట్..హోటల్, మోటెల్తో పోలిస్తే రెస్టారెంట్ ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది. రెస్టారెంట్ అనేది వసతి సౌకర్యం లేకుండా, కేవలం తినే సదుపాయం మాత్రమే ఉన్న ప్రదేశం. ఇక్కడ వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. చాలా పెద్ద హోటళ్లు తమ అతిథుల కోసం తమ సొంత రెస్టారెంట్లను కలిగి ఉంటాయి. కానీ, రెస్టారెంట్లలో రాత్రి బస చేసే సదుపాయం ఉండదు.రిసార్ట్ అంటే... రిసార్ట్ అనేది హోటల్ కంటే చాలా విస్తృతమైన సౌకర్యాలు, అనుభవాన్ని అందిస్తుంది. రిసార్ట్లు సాధారణంగా హోటళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇవి కేవలం బస కోసమే కాకుండా, కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి, వినోదం పొందడానికి ఉద్దేశించబడ్డాయి.రిసార్ట్లో వసతి, భోజనాలతో పాటు అదనపు వినోద సౌకర్యాలు ఉంటాయి. ఉదాహరణకు, స్విమ్మింగ్ పూల్, గేమ్ జోన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్పా, ఇతర ఆటల సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్తో సహా అనేక పర్యాటకప్రాంతాలలో ఈ రిసార్ట్ల సంఖ్య పెరుగుతోంది. -
సత్యమే శివం.... సుందరం
సనాతన ధర్మం కేవలం మతం కాదు; అనంత విశ్వాన్ని సుస్థిరంగా నిలిపేప్రాకృతిక నియమం. ధారణాత్ ధర్మమిత్యాహుః – ఏది సమస్తాన్ని ధరిస్తుందో, రక్షిస్తుందో అదే ధర్మం. మానవ ఉనికికి, ప్రకృతి సమతుల్యతకు ధర్మమే వెన్నెముక. వ్యక్తిగత స్వార్థం వీడి లోకకల్యాణం కోసం నడుచుకోవడమే అసలైన ధర్మశీలం. అస్థిరత నిండిన ఆధునిక జగత్తులో దిశానిర్దేశం చేసే అక్షయమైన ధ్రువతార ఈ ధర్మపథం.ధర్మానికి పునాది ధర్మానికి మొదటి మెట్టు సత్యం. సత్యం అంటే కేవలం నిజం మాట్లాడటం కాదు; మనసా, వాచా, కర్మణా ఏకరూపంలో ఉండటం. సత్యం ఒక మహా వృక్షానికి భూమిలో లోతుగా పాతుకుపోయిన వేరు వంటిది. వేరు బలంగా లేని వృక్షం గాలివానలకు కూలిపోయినట్లే, సత్యనిష్ఠ లేని వ్యక్తిత్వం కష్టకాలంలో నిలబడలేదు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తన వృత్తిలో నిజాయితీగా బాధ్యత నిర్వర్తించడం, ఒక వ్యాపారి తన వస్తువు నాణ్యత విషయంలో నిబద్ధత కలిగి ఉండటం అసలైన సత్య ధర్మ పరిపాలన. సత్యం కఠినంగా అనిపించినా, అది ఇచ్చే ఫలితం శాశ్వతం, నిర్భయం. నిప్పును మూటగట్టలేనట్లు, సత్యాన్ని ఎవరూ అణచివేయలేరు. సూర్యకాంతిని మేఘాలు తాత్కాలికంగా కప్పివేసినా, సత్యం స్వయంప్రకాశితమై విజయతీరాలకు చేరుస్తుంది.మంగళకరమైన జీవనం ధర్మం రెండవ రూపం శివం. శివం అంటే మంగళం, శుభప్రదం. మనం చేసే ప్రతి పని తోటివారికి మేలు చేసేదిగా ఉండాలి. పరహితమే పరమార్థంగా జీవించడం శివ తత్వం. ఇది వెలుగునిచ్చే దీపం వంటిది; దీపం తాను వెలుగుతూ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలినట్లే, మన జీవనం ఇతరుల కష్టాలను తొలగించేదిగా మారాలి. తన ఎదుగుదల కోరుకుంటూనే, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించేవాడే ధర్మాత్ముడు. దైనందిన జీవితంలో ఆకలితో ఉన్నప్రాణికి అన్నం పెట్టడం లేదా అవసరంలో ఉన్న మిత్రుడిని ఆదుకోవడం వంటి చిన్న కార్యాలూ శివత్వాన్ని పొందుతాయి. లోక కల్యాణార్థం సాగే నిస్వార్థ జీవన యానమే మానవ జన్మకు అసలైన సార్థకత చేకూరుస్తుంది. ప్రతి జీవిలో శివుడిని దర్శించడమే అత్యున్నత ఆధ్యాత్మిక సంస్కారం. స్వార్థం సంకెళ్ళను తెంచుకున్నప్పుడే జీవుడు శివుడు కాగలడు.సుందరం: ధర్మబద్ధమైన సౌందర్యం సత్యం, శివం మేళవించిన చోట అద్భుతమైన సౌందర్యం ఉట్టిపడుతుంది. ఇది బాహ్య రూపం కాదు; అంతర్గత క్రమశిక్షణ వల్ల కలిగే మానసిక ప్రశాంతత. ధర్మబద్ధమైన జీవితం గడిపే వ్యక్తి ముఖంలో దివ్యమైన తేజస్సు ఉంటుంది. దీనికి ఉపమానం పద్మం; బురదలో పుట్టినా తన పవిత్రతను కాపాడుకునే పద్మం వలె, మనిషి లౌకిక బంధాల మధ్య ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తే ఆ జీవితం సుందరమవుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఇంద్రియ నిగ్రహం, ప్రకృతి పట్ల గౌరవం జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయి. పర్యావరణాన్ని ప్రేమిస్తూ, సృష్టిలోని ప్రతి జీవిని దైవ స్వరూపంగా భావించడం ఈ సుందర ధర్మంలో అంతర్భాగం. కళాత్మకమైన హృదయం, ధార్మిక చింతన తోడైతే మానవ జీవితం ఒక అద్భుత కావ్యమవుతుంది. చిత్తశుద్ధి కలిగిన మనసే భగవంతుడు నివసించే అసలైన ఆలయం.బురదలో పుట్టినా తన పవిత్రతను కాపాడుకునే పద్మంలా, మనిషి లౌకిక బంధాల మధ్య ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తే ఆ జీవితం సుందరమవుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఇంద్రియ నిగ్రహం, ప్రకృతి పట్ల గౌరవం జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయి. – కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు. -
76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..
బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్ సెషన్లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్లాస్ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు, కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.స్టాండింగ్ జాక్స్తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.స్టాండింగ్ హై నీస్ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.పల్స్ స్క్వాట్స్ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.వాల్ క్లైంబర్పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
బ్రీజీ ఔట్ఫిట్... క్రేజీ స్టయిల్
చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్ లూజ్గా ఉన్నాయని ఫీల్ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్ ట్రెండీ ఫ్యాషన్స్లో ఇప్పుడు ఓవర్సైజ్డ్, రిలాక్స్డ్ ఫిట్ కూడా ఒక హాట్ స్టయిల్గా మారిపోయింది. అందుకే, లూజ్గా, లైట్గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్ఫిట్స్ సమ్మర్లో కంఫర్ట్తో పాటు స్టయిల్ కూడా ఇస్తున్నాయి.హీరో లినెన్ !సమ్మర్ అనగానే గుర్తొచ్చేది లినెన్ బట్టలే. వీటిల్లో రిసార్ట్ కాలర్ అంటే ఓపెన్ కాలర్ షర్ట్స్ వేసుకుంటే పక్కా బీచ్ వైబ్ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్ ఫిట్టెడ్ టీషర్ట్ వేసి, పైన షర్ట్ బటన్స్ తీసేసి ఓపెన్గా వదిలేయండి. లేయర్డ్ లుక్ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. నిట్టెడ్ పోలోస్కి క్లాస్రెగ్యులర్ కాలర్ టీషర్ట్స్ బోర్ కొడితే, ఈ నిట్టెడ్ అంటే అల్లిక డిజైన్ పోలోస్ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి.వైడ్ లెగ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ కింద లూజ్గా ఉంటూ, పైన ప్లీట్స్ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్ లుక్ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్ మీటింగ్స్ లేదా స్మార్ట్ క్యాజువల్ ఈవెంట్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ కలర్స్లో ప్లీటెడ్ ట్రౌజర్స్ వేసుకుని, లోఫర్స్ జోడిస్తే సమ్మర్ ఫ్యాషన్లో మీరే టాపర్!డ్రాస్ట్రింగ్ లినెన్ ప్యాంట్స్బెల్ట్ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్ ప్యాంట్లు బెస్ట్ చాయిస్. క్యాజువల్ అవుటింగ్స్, ఈవినింగ్ వాక్స్, ట్రావెల్స్ ఏదైనా సరే ఈజీగా సెట్ అయిపోతాయి.జాగ్రత్తలు!లూజ్ ఫిట్ అంటే చాలా పెద్ద సైజ్ కాదు. లేదంటే బెడ్షీట్లా కనిపించే చాన్స్ ఉంది.లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్ అయితే సమ్మర్లో భరించలేరు.ఒక ఔట్ఫిట్లో చాలా ప్రింట్స్ వద్దు. రిలాక్స్డ్ ఫిట్ అంటే క్లీన్, సింపుల్ లుక్ బెటర్.లైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్లో కూల్గా కనిపిస్తారు. బ్లాక్తో పూర్తి ఔట్ఫిట్ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్గా కనెక్ట్ అయిపోతాడు! కొండి దీపిక(చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..) -
ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..!
కొన్ని వస్తువులతో గొప్ప ఎమోషన్ ఉంటుంది. ఎన్ని సరికొత్త ట్రెండ్లు వచ్చినా..ఆ వస్తువులనే పదేపదే వాడతాం. అవి మనకు ఓదార్పు, ప్రియమైన లేదా ఇష్టమైన వ్యక్తులు మనతో ఉన్న అనుభూతిని అందిస్తూ సదా ధైర్యాన్ని ఇస్తుంటాయ్. ఆ విషయమైన చెబుతున్నాడు ఈ బాలీవుడ్ బుల్లితెర నటుడు. మనలో ఇలాంటి భావోద్వేగ కనెక్టివిటీ ఉన్నవాళ్లు ఉన్నారంటూ తన భావోద్వేగ కథను పంచుకున్నారు. బుల్లితెర నటుడు, హోస్ట్ రాజీవ్ ఖండేల్వాల్, ప్రతి ఉదయం 56 ఏళ్ల నాటి టీ కప్పులలో టీ తాగే తన దినచర్యకు సంబంధించిన ఒక భావోద్వేగ జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు. తన అమ్మ నాన్న చనిపోయినప్పుడు 70వ దశకంలో తను కొన్న కప్పులను మాత్రమే వాడాలని నిర్ణయించుకుని ఇప్పటికీ వాటిల్లోనే టీ తాగుతుంటానని అన్నారు. తన రోజు మొదలయ్యేది కూడా ఆ కప్పులోని టీ సిప్తోనే అని అన్నారు. అవే ఎందుకంటే..1970లో వాళ్ళ పెళ్లి సమయంలో... ఈశాన్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లారని, అక్కడే తన తండ్రికి పోస్టింగ్ ఉండేదని చెప్పుకొచ్చారు. 2019లో అమ్మ, 2022లో నాన్న చనిపోయినప్పుడూ..ఏమేమి తీసుకువెళ్లాలని చర్చిస్తుండగా..తాను ఈ కప్పులు కావాలని అడిగానని అన్నారు. తన తల్లి కొన్న ఆ ఐదు కప్పులు, సాసర్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయన్నారు. ప్రతి ఉదయం వీటిలోనే టీ తాగుతానని చెప్పారు. ఈ అలవాటు మన వాళ్లను కోల్పోయిన బాధకు ఉపశమనంగా, ఆ వస్తువులు వ్యామోహంతో కూడిన విలువను కలిగి ఉంటాయన్నారు. మానవువుల కేవలం మనుషులతోనే బంధాలు ఏర్పరుచుకోరని మనం ప్రేమించే వ్యక్తులతో ముడిపడి ఉన్న ఆచారాలను, వాసనలు, ప్రదేశాలు, దినచర్యలు, వస్తువులు, స్పర్శలు, వంటి వాటితో బంధాలను ఏర్పరుచుకుంటామని అన్నారు. చూడటానికి అవి వస్తువులే గానీ అంతకుమంచి.. అనుబంధాన్ని ఇచ్చేవి. ముఖ్యంగా దఃఖం నుంచి కోలుకుని ముందుకు సాగడానికి, భావోద్వేగపరంగా స్ట్రాంగ్గా మారడానికి హెల్ప్ అవుతాయని అంటున్నారు. భద్రత, అనుబంధాన్ని కొనసాగించడం..మానసిక నిపుణులు దుఃఖానికి మందు, భావోద్వేగ భద్రతను ఇస్తుందని ఇది సరైనదనే అంటున్నారు. ఒక తండ్రి తన దివంగత భార్య మొక్కలకు నీరు పోసినట్లుగానే తాను చేస్తుంటాడు. ఒక కుమార్తె తన తల్లి శాలువాను మడిచి దిండు పక్కన పెట్టుకుంటుంది. ఒక కుమారుడు ప్రతి ఉదయం తన తల్లిదండ్రులకు ఇష్టమైన కప్పులో టీ తయారుచేస్తూనే ఉంటాడు. ఇవన్నీ వాళ్లతో ఉన్న అనుబంధాలకు సజీవ సాక్ష్యాలు, కొనసాగింపు అంటున్నారు. ఇవి వారికి దుఃఖం నుంచి బయటపడేసి, కోల్పోయిన వ్యక్తులు తమతో ఉన్నారనే భావోద్వేగ భద్రత, మద్దతను ఇవ్వడమే గాక, ధైర్యంగా లైఫ్ని లీడ్ చేసేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఒక్కోసారి వారి జ్ఞాపకాలు మోయలేనంతగా మారినప్పుడూ..ఒంటరిగా ఉండకుండా..సాముహిక సేవ, ప్రార్థన, పని, వ్యాయామం వంటి పనులతో మమేకమవ్వాలంటున్నారు. అలానే పూర్తిగా ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆ వస్తువులే పరమావధిగా కాకుండా ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగండని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒక్కోసారి ఆయా వస్తువులు కూడా కాలక్రమేణ పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి అది మనల్ని కుంగదీయకముందే అంతరంగికంగా స్ట్రాంగ్గా ఉండేలా స్థిరంగా ఉండండని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Curly Tales | A Fork Media Group Co. (@curly.tales) (చదవండి: డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?) -
నిమ్మతో నిగనిగలాడే మెరిసే అందం..
సాధారణంగా చుండ్రు, బ్లాక్హెడ్స్, నిర్జీవమైన చర్మం వంటి సమస్యలకు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, వీటన్నింటికీ మన వంటింట్లో ఉండే నిమ్మకాయతోనే సులభంగా చెక్ పెట్టవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్–సి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు బ్లాక్హెడ్స్ ఉన్న ప్రాంతంలో కొద్దిగా నిమ్మరసం రాయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్లాక్హెడ్స్ పూర్తిగా తగ్గే వరకు ఈ చిట్కా పాటించవచ్చు. పొడి చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. నిర్జీవంగా మారిన జుట్టుకు మెరుపును తీసుకురావడానికి 3 చెంచాల నిమ్మరసం, అర కప్పు తేనె, ముప్పావు కప్పు ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు 3 చెంచాల నిమ్మరసంలో ఒక గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే చుండ్రు సమస్య మాయమవుతుంది.చర్మటానిక్కొరియాకు చెందిన జోసెయోన్ రాజవంశంలోని మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి పులియబెట్టిన బియ్యపు నీటిని చర్మ టానిక్గా ఉపయోగించేవారు. అమినో యాసిడ్లు, విటమిన్లు, పిండిపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ నీరు చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. దీనిని అప్పట్లో మిగ్వామ్ అని పిలిచేవారు. ఈ నీరు మురికిని, మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. బియ్యపు నీటిని పులియబెట్టడం వల్ల అందులో పిటెరా వంటి యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఇవి ముడతలను తగ్గించి, చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మానికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్హ్యాన్స్డ్ ప్రొడక్ట్ లైన్లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్హ్యాన్స్డ్ ప్రొడక్ట్ లైన్లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. -
డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?
నా వయసు ఇరవై ఐదేళ్లు. మొదటిసారి గర్భం దాల్చాను. రెండు నెలలు నిండాయి, పరీక్ష చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ నా బ్లడ్ గ్రూప్ ‘బి నెగటివ్’ అని తేలింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అసలు ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి ఈ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ సమస్య అసలు రాకుండా ఉండటానికి ఇంకా ఎలాంటి సమయాల్లో యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందో, డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్ గురించి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో దయచేసి వివరంగా చెప్పండి.– లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్.సాధారణంగా కాబోయే తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ (ఆర్హెచ్ నెగటివ్) ఉండి, భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మొదటగా భర్తకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆయనది కూడా నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ భర్తది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో యాంటీబాడీలు తయారై బిడ్డపై ప్రభావం పడకుండా ఉండటానికి ‘ఇండైరెక్ట్ కూంబ్స్ టెస్ట్’ (ఐసీటీ) అనే రక్త పరీక్షను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి చేస్తారు. ఒకవేళ ఈ పరీక్ష ఫలితం సాధారణంగా (నెగటివ్) వస్తే తల్లి శరీరం ఇంకా సెన్సిటైజ్ అవ్వలేదని అర్థం. కాబట్టి గర్భాధారణ ఇరవై ఎనిమిదవ వారంలో మళ్ళీ ఈ పరీక్ష చేసి, అప్పుడు కూడా నెగటివ్ వస్తే తల్లికి ’యాంటీ–డి’ నివారణ ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే కాన్పు అయిన తర్వాత పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని తేలితే డెలివరీ అయిన డెబ్బై రెండు గంటల లోపు తల్లికి మళ్ళీ యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆమెను, భవిష్యత్తులో వచ్చే గర్భాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే, ఒకవేళ ఈ ఐసీటీ పరీక్ష ఫలితం పాజిటివ్ వస్తే మాత్రం దానిని ‘ఇమ్యూనైజ్డ్ ప్రెగ్నెన్సీ’ అంటారు, అప్పుడు బిడ్డకు రక్తహీనత (ఎనీమియా) వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, స్కానింగ్ (మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ పరీక్ష) ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే కడుపులోనే బిడ్డకు రక్తం ఎక్కించే (ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్) అత్యాధునిక వసతులు, నియోనేటాలజీ విభాగాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలోనే (టెర్షియరీ సెంటర్) డెలివరీ చేయించుకోవడం చాలా సురక్షితం. ప్రెగ్నెన్సీ కొనసాగుతున్న సమయంలో మొదటి మూడు నెలల కాలంలో గర్భస్రావం అయినా, మహిళలు స్వచ్ఛందంగా గర్భాన్ని తీసివేయించుకున్నా, గర్భాశయాన్ని క్లీన్ చేసే ప్రక్రియ జరిగినా, గర్భాశయం వెలుపల పిండం పెరిగే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తున్నా, గర్భం చివరలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి పరీక్షించే ‘అమ్నియోసెంటసిస్’ లాంటి ప్రత్యేక పరీక్షలు చేసినా, లేదా నెలలు నిండకుండానే కాన్పు అయినా సరే తల్లి శరీరం సెన్సిటైజ్ అవ్వకుండా ఉండటానికి ఈ యాంటీ–డి ఇంజెక్షన్ కచ్చితంగా రక్షణగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెలివరీ సమయంలో రక్త లభ్యత (బ్లడ్ అరేంజ్మెంట్) విషయానికి వస్తే, ’నెగటివ్’ బ్లడ్ గ్రూపులు అనేవి చాలా అరుదైనవి కావడంతో అత్యవసర సమయంలో ఇవి బయట త్వరగా దొరకవు, కాబట్టి డెలివరీ సమయంలో ఒకవేళ తల్లికి అధిక రక్తస్రావం లాంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఒక బ్లడ్ డోనర్ను సిద్ధంగా ఉంచుకోవడం, ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకూ ఎంతో రక్షణ ఇస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ మరియు డెలివరీని సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు.డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!) -
పాడు పొగతో మూడింతల సెగ
సిగరెట్ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్... నష్టాలు..సిగరెట్ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. తలలోని అవయవాలూ, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇలా తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ – అనర్థాలు...నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్ స్మోకింగ్కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.థర్డ్ హ్యాండ్ స్మోకింగ్... దుష్ప్రభావాలు...నేరుగా సిగరెట్ కాల్చేవారిది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్ హ్యాండ్ స్మోకింగ్’ కిందకు వస్తాయి. ఈ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్పోజ్ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్ హ్యాండ్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్లో సెల్బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.క్యాన్సర్ను సిగరెట్ బాక్స్లో ప్యాక్ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?ప్రాణాంతకమైన క్యాన్సర్ను అందమైన సిగరెట్ పెట్టెలో ప్యాక్ చేసి తీసుకెళ్లి ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్ఏ దక్కడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్డ్) డీఎన్ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం. నిర్వహణ: యాసీన్ (చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
వయసు చిన్నదే..కానీ మనసు మాత్రం చల్లన
వేసవి సెలవలు అంటే....పిల్లలకు మహా సరదా. ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు...ఇంకేముందు ఫుల్ ఎంజాయ్. దాదాపుగా పిల్లలంతా ఇలానే ఉంటారు కదా. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలోని పిల్లలు ఈ వేసవిలో చేసిన పనిని చూస్తే పెద్దవాళ్లందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతేకాదు ఇది చూసి తమ పిల్లలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అసలింతకీ ఆ పిల్లలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి మరి.సమ్మర్ అంటే సూపర్ హాట్ కదూ...ఎండ వేడి, ఉక్కపోత విపరీతమైన దాహం. మరీ ముఖ్యంగా ఏదైనా పని మీద రోడ్డు మీదకు వెళినపుడు దాహమేస్తే ఇక నరకమే. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతాంలోని బాలాజీనగర్ రోడ్డు నెం.4 కి వెళితే మాత్రం మీకు ఓ జ్యూస్ స్టాల్ కనిపిస్తుంది. అందులో నుండి బుడి బుడి అడుగులతో పిల్లలు బయటకు వచ్చి మీకు చల్లని జ్యూస్ అందిస్తారు. అది కూడా మీకు ఏ జ్యూస్ కావాలో అడిగి మరీ ఇస్తారు. అంతేకాదు మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అలా దారిన పోయే ప్రతి ఒక్కరికి వారం నుండి దాహం తీరుస్తున్నారు ఈ పిల్లలు. పుప్పాలగూడ లోని త్రిపుర రెసిడెన్సీ, టెంపుల్ వ్యూ రెసిడెన్సీ వాసుల పిల్లలు సంయుక్తంగా చేప్పట్టిన ఈ సోషల్ ఇనిషియేటివ్ పలువురిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ఈ పిల్లల ఆలోచన మాత్రం నిజంగా సూపర్ కదూ, ఇంకెందుకాలస్యం పేరెంట్స్ మీ పిల్లలతో మీ ప్రాంతంలో ఓ సారి ట్రై చేయండి.ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా? -
‘నేను అచ్చం ఏఐ బొమ్మలా కనిపించాలి’ అంటున్నారు!
అందానికి సంబంధించి ఏ.ఐ జనరేటెడ్ చిత్రాలు ఆహా అనిపించినా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాయి. న్యూయార్క్కు చెందిన డెర్మటాలజిస్ట్ డేచర్ వెబ్స్టే దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏఐ జనరేటెడ్ చిత్రాన్ని చూపించి ‘ఈ ఇమేజ్లో ఉన్న అమ్మాయిలాగే కనిపించాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఆ మాటకు వెబ్స్టే షాక్ అయ్యారు.‘ఈ ఇమేజ్లోలాంటి పెద్ద పెదవులు, పెద్ద కళ్లు, చెక్కినట్లు ఉండే దవడతో నేను కనిపించాలి’ అని అడిగిన ఆ అమ్మాయి వెబ్స్టేను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా ఫిల్టర్లు సౌందర్య ప్రమాణాలను మార్చిన తీరుకు ఈ సంఘటన అద్దం పడుతుంది. ఏఐ సృష్టించిన సౌందర్య చిత్రాలు నిజజీవితంలో సాధ్యపడతాయని కొంతమంది నమ్ముతున్నారు.ఒక అధ్యయనం ప్రకారం... తమ ఫొటోలను ఎడిట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ను ఉపయోగించే వారిలో కొంతమందికి, అందాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ఎన్నో అద్భుతాలు చేస్తుందనే విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ మాన్హాటన్లోని ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఏఐ జనరేట్ చేసిన తన ఫొటోతో వచ్చింది. సర్జికల్ టైమ్ మిషన్ కావాలని, తాను తన మనవరాలిలా కనిపించాలని అడిగి ఆ సర్జన్ షాక్ అయ్యేలా చేసింది.‘అలా కుదరదు’ అని నచ్చచెప్పినా ఆ బామ్మ వినలేదు. ‘అలా కనిపించేలా చేయండి’ అని పట్టుబట్టింది. ఫైనల్గా చెప్పొచ్చేదేమిటంటే... ఏ.ఐ ఇమేజ్లతో హాస్పిటల్స్కు వస్తున్న వారిని చూసినప్పుడు వైద్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి! -
బేర్ ఫేస్ ఛాలెంజ్! నో మేకప్... ఓన్లీ కాన్ఫిడెన్స్!!
అందాల పోటీలు అంటేనే మేకప్... ఇంకా చెప్పాలంటే భా...రీ మేకప్! అయితే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఆల్స్టార్స్లో పాల్గొన్న మహిళలు (పోటీదారులు) వేదికపైనే మేకప్ తొలగించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆకర్షణీయమైన గౌన్లు ధరించిన ఈ అందాల రాణులు మేకప్ను తుడిచి వేసి ఎలాంటి మేకప్ లేకుండానే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై నడిచారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది.సౌందర్య సాధనాలకు అతీతంగా సహజ సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పేందుకు తొలిసారిగా ఈ పోటీలో ‘బేర్ ఫేస్ ఛాలెంజ్’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఛాలెంజ్ థాయ్లాండ్లో జరుగుతున్న అందాల పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ రౌండ్లో పోటీదారులు పూర్తి మేకప్తో వెలుగులు వెదజల్లుతున్న వేదికపైకి అడుగు పెడతారు. వేదిక మధ్యలో వేసిన కుర్చీలలో కూర్చుని ప్రేక్షకులు చూస్తుండగా బోల్డ్ లిప్స్టిక్ నుంచి ఐ మేకప్ వరకు మేకప్ మొత్తం తుడుచుకుంటారు. ‘అందాల పోటీలు సాధారణంగా ఆడంబరమైన మేకప్, స్టైలింగ్ తో నిండి ఉంటాయి.ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఇంటర్నేషనల్ ఆల్స్టార్స్ పోటీ ఒక సాహసోపేతమైన అడుగువేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే... ‘సహజమైన సౌందర్యమే అసలు సిసలు సౌందర్యం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజనులు. పోటీకి సంబంధించి గ్రాండ్ ఫినాలే ఈరోజు థాయ్లాండ్లో జరుగుతుంది. అక్కడ పోటీదారులు ‘ఆల్స్టార్స్’ కిరీటం కోసం పోటీపడతారు. -
ఫిట్నెస్... ఫర్ స్ట్రెస్!
గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్ సోమన్ ఒకరు. చాలామందికి రిటైర్ మెంట్ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.‘యూరప్ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు మిళింద్ సోమన్. బాడీ ఫిట్నెస్తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్నెస్ ఐకాన్గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.సూపర్ మోడల్ టూ సూపర్ రన్నర్...ఆయన ప్రయాణం 1990లలో సూపర్ మోడల్గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్ ట్రాక్ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్నెస్కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్.పింక్థాన్.. మహిళలకు ఇన్స్పిరేషన్ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్లు, ఫిట్నెస్ ఈవెంట్స్కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి ప్రారంభించిన పింక్థాన్ ఈవెంట్ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్ ఈవెంట్ గా అవతరించింది.హిట్... ఫిట్... ఫీట్స్ ఎన్నో...50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో జరిగిన ఐర¯Œ మ్యాన్ ట్రయాథ్లాన్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.సిక్స్ ΄్యాక్ కాదు... స్ట్రెస్ బ్యాక్ ముఖ్యంకండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్నెస్ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్లకు వెళ్లడానికి బదులు పుష్–అప్స్ పుల్–అప్స్ వంటి సహజమైన బాడీ వెయిట్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మోహం క్షణికం శిక్ష జీవితాంతం
ఒక ఊరిలో భర్త హతమయ్యాడు. మరో నగరంలో భార్య కడతేరిపోయింది. రెంటిలోనూ జీవిత భాగస్వాములే నిందితులు. తెలుగు రాష్ట్రాల్లో వైవాహిక బంధం వివాహేతర ఆకర్షణల వల్ల వార్తలకెక్కుతోంది. దంపతులు నేరస్తులుగా మారుతున్నారు. జీవన భాగస్వామి నచ్చకపోతే చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింస ఎందుకు? నిపుణుల అభిప్రాయాలతో కథనం...ఆ ఫోను పాము అని ఆమె తెలుసుకోలేదు. ఆ ఫోన్ ఆమెకు ఎవరినో పరిచయం చేసింది. మరెవరికో దగ్గర చేసింది. ఆ ఫోన్ ఆమెను గంటలు గంటలు తనను తానే మర్చిపోయేలా చేసింది. ఇది శాశ్వతం చేసుకోవాలనుకుందామె. భర్త ఇందుకు ముల్లులా కనిపించడం మొదలు పెట్టాడు. నిజానికి వాళ్లిద్దరికీ గొడవలు లేవు. కాని కొత్త ఆకర్షణ వల్ల పాత బంధం విసుగు పుట్టిస్తోంది. ఆమె ఎవరినీ సలహా అడగలేదు. పర్యవసానాలు ఆలోచించలేదు. ప్రత్యామ్నాయాలు వెతకలేదు. చివరకిప్పుడు నిందితురాలిగా మిగిలింది.అతను ఆమెకు భార్యగా ఏ లోటూ రానివ్వలేదు. కాని అతనికి భార్యతోపాటు మరో బంధం కావాలనిపించింది. అయితే కొత్త బంధంలో ఉన్న ఆమెకు పాత బంధం తెంపుకుంటేగాని అభద్రత పోదు. భర్తకు పాత బంధాన్ని ఎలా తెంపుకోవాలో తెలియదు. ఆమెతో విడిపోవడంలో రిస్కు ఉందని ఆమెనే లేకుండా చేసి మరింత పెద్దరిస్కు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మూడుముళ్ల బంధం మూడు మూరల తాడుగా మారి ప్రాణాలు తీస్తోంది. పోలీసు గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో వైవాహికేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలు పెరిగాయి. అయితే... చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింసను ఆశ్రయించే దుస్థితి ఎందుకొస్తోంది?వివాహేతర సంబంధం నేరమా?సుప్రీంకోర్టు 2018లోనే ఐ.పి.సి. 497 సెక్షన్ ను కొట్టేసింది. అంటే వివాహేతర సంబంధం ఇప్పుడు ‘నేరం’ కాదు. ‘సివిల్ తప్పిదం’ మాత్రమే. భార్య, భర్త విడాకులకు దీన్ని కారణంగా చూపొచ్చు, కానీ శిక్ష ఉండదు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ‘చట్టం నన్నేమీ చేయదు’ అనే ధీమా ఒకవైపు, ‘నా పరువు పోయింది’ అనే కక్ష మరోవైపు ఈ రెండూ వివాహబంధాన్ని అడకత్తెరలో పెట్టాయి. విడిపోవాలనుకుంటే విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ వీటన్నింటికీ ఫ్యామిలీ కోర్టులున్నాయి. కానీ కోపం, పరువు, పగ ముందు బుర్ర ఇంకా చిన్నదై నేరాన్ని ప్రేరేపిస్తోంది.మూడో వ్యక్తి మాత్రమే కారణమా?వైవాహిక బంధాల్లో హత్యలకు ‘మూడో వ్యక్తి’ మాత్రమే కారణమై ఉండదు. వెతికి చూడాలే కాని, మూలాలు కనిపిస్తాయి.ఎ) సంభాషణ కరువు: మొబైల్ లో ఆరు గంటలు మాట్లాడే భార్యాభర్తలు ముఖాముఖి ఆరు నిమిషాలు మాట్లాడరు. దాంతో అపార్థాలు పేరుకుపోయి అగాధంగా మారుతున్నాయి. ఆ) ఆర్థిక అసమానతలు భార్య ఎక్కువ సంపాదిస్తున్నా, భర్త నిరుద్యోగిగా ఉన్నా ‘ఈగో’ దెబ్బ తిని బయట వ్యక్తి వైపు ఆకర్షణ పెరుగుతోంది. ఇ) సోషల్ మీడియా వల: రీల్స్లో కనిపించే ‘పర్ఫెక్ట్ కపుల్’ని చూసి, తమ బంధా న్ని చిన్నచూపు చూస్తున్నారు. కొత్త పరిచయాలు ఒక్క క్లిక్ దూరంలో దొరుకుతున్నాయి. ఈ) పరువు భయం: ‘విడాకులు తీసుకుంటే ఊరేమంటుందో’ అనే భయం, ‘చంపేస్తే పోలీసులే కదా’ అనే తెగింపుగా మారుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన.నేరమే శరణ్యమా? కానే కాదు. కోపంలో, ఆవేశంలో, కళ్లు కానరాని మోహంలో తీసుకునే నిర్ణయం జీవితాంతం జైలుగోడల మధ్య కుళ్లబెడుతుంది. దానికి బదులుగా మ్యూచువల్ కన్సెంట్తో ఆరునెలల్లో విడిపోవచ్చు. మోసం చేసిన భాగస్వామి నుంచి భరణం, పిల్లల బాధ్యత, ఆస్తిలో వాటా కోరే హక్కు చట్టం కల్పించింది. మానసిక, శారీరక హింస ఉంటే వెంటనే ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ప్రతి జిల్లా కోర్టులో ఉచిత కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒకసారి మాట్లాడితే 70 శాతం కేసులు కోర్టు దాకా రావు.సమాజం ఏం చేయాలి?ఇది కేవలం పోలీసు, కోర్టుల సమస్య కాదు. మనందరి సమస్య. అందువల్ల సమాజం మొత్తం కొన్ని మెరుగుదలలను చేసుకోవాలి. ∙పెళ్లికి ముందు కౌన్సెలింగ్ను తప్పనిసరి చేయాలి. పెళ్లి తర్వాత ‘సర్దుకుపో’ అని కాకుండా ‘మాట్లాడుకోండి’ అని నేర్పాలి ∙9వ తరగతి నుంచే ‘రిలేషన్ షిప్ ఎథిక్స్’, ‘లీగల్ లెసన్స్’ పాఠ్యాంశంగా పెట్టాలి ∙మీడియా సంచలనం కోసం ఇలాంటి హత్య వివరాలు రాయడం కంటే ‘హెల్ప్లైన్ నంబర్లు’, ‘ఉచిత న్యాయ సలహా’ నంబర్లు ప్రమోట్ చేయాలి ∙ప్రభుత్వం ప్రతి మండలంలో ‘కుటుంబ పరిష్కార కేంద్రం’ పెట్టి లాయర్, సైకాలజిస్ట్, పోలీస్ ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలి.బంధం నచ్చకపోతే. .. దంపతులు నేరస్తులుగా మారితే రేపు పిల్లలు జైల్లో ఉన్న తల్లిదండ్రులను సిగ్గుతో తలుచుకోవాలి. విడిపోవడానికి చట్టపరమైన దారి ఉందనీ, చంపితే కోర్టు ఉరిశిక్ష వేస్తుందనీ మర్చిపోవద్దు. బంధం నచ్చకపోతే తెంచుకోవాలి. హింసను ఆశ్రయించరాదు. ఎందుకంటే మోహం క్షణికం, శిక్ష జీవితకాలం. కుటుంబ న్యాయవ్యవస్థ ఉండాలివివాహేతర సంబంధాలలో జరిగే నేరాలకు ప్రధాన కారణాలు ఆవేశం, సామాజిక అపకీర్తి భయం, ఆర్థిక వివాదాలు... మన దేశంలో విడాకుల కేసులలో జరిగే ఆలస్యం, భావోద్వేగ నియంత్రణ లోపం, వివాహంపై ఉన్న సామాజిక ఒత్తిడి... ఇవన్నీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. నివారణకు వేగవంతమైన కుటుంబ న్యాయవ్యవస్థ, కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక స్థైర్యం కలిగించటం ఎంత అవసరమో ముందస్తు ప్రణాళికతో చేసే హత్యలకు త్వరితగతిన కఠిన శిక్షలు అంతే అవసరం. విఫలమైన వివాహాన్ని అవమానంగా కాకుండా చట్టబద్ధంగా విడిపోవడాన్ని సమాజం సహజం గా అంగీకరించాలి. అలా చేస్తే చంపడం కంటే చట్టపరంగా విడిపోవటం సులభమని గ్రహిస్తారు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఆలోచనల్లో వైపరీత్యం వస్తుందివైవాహిక బంధాలలో పరస్పర గౌరవం, కమ్యూనికేషన్ లోపించినప్పుడు వ్యక్తులు ఎమోషనల్ సపోర్ట్ కోసం బయట వెతుకుతుంటారు. బంధంలోకి వెళతారు. అయితే ఆ వైవాహికేతర బంధం బయటపడుతుందనే తీవ్రమైన భయం, పరువు పోతుందనే ఆందోళన వారిలో తీవ్ర ఒత్తిడిని, క్యాట్ అండ్ మౌస్ మానసిక స్థితిని కలగజేస్తాయి. ముఖ్యంగా ఆలోచనా వైకల్యం చోటు చేసుకుంటుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగిస్తేనే తాము ప్రశాంతంగా జీవించగలమనే ఒక భ్రమ లేదా విపరీతమైన ఆలోచన మెదడులో స్థిరపడిపోతుంది. నేరం చేసిన తర్వాత దొరకకుండా తప్పించుకోవచ్చనే అతి నమ్మకం కూడా ఇందుకు కారణం. ఇవి తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభానికి సంకేతాలు. కుటుంబ వ్యవస్థలో కౌన్సిలింగ్, ఎమోషనల్ కంట్రోల్పై అవగాహన పెంచడం తక్షణ అవసరం. – విశేష్, సైకాలజిస్ట్పంచుకునేవారు లేకపోవడం వల్లే...వివాహేతర సంబంధాలను వయసుల వారీగా చూద్దాం... 25 నుంచి 35 సంవత్సరాల వయసువారు నచ్చకపోతే విడాకులకు వెళ్లిపోతున్నారు. అదే 35–45 మధ్యలో ఉన్నవారిలో పిల్లల బాధ్యతలు, ఖర్చులు ఎక్కువ కావడం వల్ల భర్త సంపాదనలో కూరుకుపోయి భార్యకు టైమ్ ఇవ్వలేడు. దాంతో గృహిణి మనసులో శూన్యం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి ఎవరైనా బయటి వ్యక్తి పరిచయం అవడం, పొగడటం, మానసికంగా దగ్గరవడంతో అటువైపు అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి కేసుల్లో కలిసి బతకాలనే ఆలోచనతో అడ్డుగా ఉన్నవారిని తొలగించుకోవాలనుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆనందించాల్సిన విషయాలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తే వివాహేతర సంబంధాలు అనే సమస్య ఉండదు. – డా.సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – కె. -
పాల ఉత్పత్తిని మరింత పెంచాలంటే..
జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం పురస్కరించుకుని భారత్ సాధించిన విజయాలతో పాటు మన ముందున్న ఒక పెద్ద సవాలును కూడా గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పాల కొరతతో ఇబ్బంది పడిన మన దేశం.. శ్వేత విప్లవం (వైట్ రెవల్యూషన్) సాధించిన అద్భుత విజయంతో ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా ఎదిగింది. అయితే ఇప్పుడు పాలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఆ డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోతే.. రాబోయే రోజుల్లో దేశ అవసరాలకు పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే మనం పశువుల సంఖ్యను పెంచడం కాదు, ప్రస్తుతం మన దగ్గర ఉన్న పశువుల నుండి పాల ఉత్పాదకతను (దిగుబడిని) పెంచడమే ఏకైక మార్గం. భారత్లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పశువులు ఉన్నాయి. కానీ ఒక్కో పశువు ఇచ్చే పాల దిగుబడి మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో పశువు నుండి సగటున రోజుకు 7.18 కిలోల పాలు లభిస్తుంటే, మన దేశంలో అది కేవలం 4.87 కిలోలుగా మాత్రమే ఉంది. ఈ పాల దిగుబడిని పెంచడానికి 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి.ఒకటి పశువులు పాలు ఇచ్చే దశలు, వాటి జాతి లక్షణాలు మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో మేత అందించడం (సైంటిఫిక్ ఫీడింగ్ ప్రాక్టీసెస్) చాలా అవసరం. ఇలా చేయడం వల్ల పాల దిగుబడి పెరగడమే కాకుండా పశువుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, రెండో మార్గం భారతదేశంలోని మొత్తం పశువులలో 73.5 శాతం ఇప్పటికీ మన దేశవాళీ రకాలే ఉన్నాయి. అయితే ఈ పశువుల జాతుల శాతాన్ని మార్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2012, 2019 సంవత్సరాల మధ్య కాలంలో విదేశీ, సంకరజాతి పశువుల సంఖ్య 25 శాతానికి పైగా పెరిగింది. దేశంలోని 56 మిలియన్ల రైతులకు చెందిన 92 మిలియన్ల పశువులకు లబ్ధి చేకూరుస్తున్న 'రాష్ట్రీయ గోకుల్ మిషన్' ఇప్పటివరకు 12.2 కోట్ల కృత్రిమ గర్భధారణలు చేసిన 'నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్' వంటి ప్రభుత్వ పథకాలు ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి.మూడోది, పశువుల ఆరోగ్య నియమాలను పాటించడం, పాలు పితికేటప్పుడు పరిశుభ్రతను పాటించడం, గాలి వెలుతురు బాగా వచ్చేలా పాకలను నిర్మించడం. డిజిటల్ సేవల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇవి పశువుల అసలు సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో పాల దిగుబడిని సాధించడంలో ఎంతగానో తోడ్పడతాయి.300 మిలియన్ టన్నుల మార్కును దాటడంస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశం సాధించిన డైరీ రంగాభివృద్ధిని ఒక గొప్ప విజయగాథగా అభివర్ణించవచ్చు. ప్రభుత్వ విధానాల మద్దతుతో జాతీయ సంకల్పం ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ విజయాన్ని మనం గతంలో ఒకసారి సాధించి చూపించాం. ఇప్పుడు మరోసారి సాధించలేకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఈసారి మన దేశ పాల ఉత్పత్తిని 300 మిలియన్ టన్నుల సరిహద్దు దాటించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం.క్యాప్టెన్ (డాక్టర్) ఎ.వై. రాజేంద్ర, సీఈఓ – యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్, గోద్రెజ్ ఆగ్రోవెట్(చదవండి: వరల్డ్లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్) -
వరల్డ్లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్
"ఏ చాయ్ చమక్కునే చూడరా భాయ్" అంటూ పొద్దుపొద్దున పొట్టలో టీ చుక్క పడాల్సింది చాలామందికి. అదీగాక కాసేపు చాయ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ..ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అంత ఘన చరిత్ర ఉంది భారత్లో చాయ్కి. అలాంటి టేస్టీ టేస్టీ టీల్లో మన భారతీయ మసాలాటీనే అత్యుత్తమ చాయ్గా అగ్రస్థానంలో దక్కించుకుంది. ప్రసిద్ధ అంతర్జాతీయ ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన వంద అత్యుత్తమ మసాలా చాయ్ జాబితాలో మన భారతీయ మసాలా టీనే తొలి స్థానం దక్కించుకుంది. భారత్లో టీ ఒక పానీయం మాత్రమే కాదు. అది ఒక ఆచారం, సంభాషణను ప్రారంభించేది, పనిమధ్యలో తీసుకునే విరామంలాంటిది, రైల్వేఫ్లాట్ఫామ్లపై తప్పనిసరిగా ఉండేది, కొన్నిసార్లు ఉచిత చికిత్సలా పనిచేస్తుంది. మన దేశంలో అంత ప్రాముఖ్యత సంతరించుకున్న మన చాయ్కే అత్యుత్తమైనదిగా ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ పట్టం గట్టడం విశేషం. అంతేగాదు భారతదేశం అద్భుతమైన టీని అందిస్తుందని కితాబు కూడా ఇచ్చేసింది. దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ టీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అవేంటంటే..మసాలా చాయ్ — 1వ స్థానండార్జిలింగ్ టీ — 6వ స్థానంఅస్సాం చాయ్ — 13వ స్థానంసులేమానీ చాయ్, కేరళ — 39వ స్థానంకాంగ్రా టీ, హిమాచల్ ప్రదేశ్ — 41వ స్థానంనూన్ చాయ్, జమ్మూ కాశ్మీర్ — 43వ స్థానంప్రపంచ టీ జాబితాలో కేవలం భారతీయ టీలదే ఆధిపత్యం కాదు. హోజిచా టీ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జపాన్కు చెందిన వేయించిన గ్రీన్ టీ. దీని వెనుకే శ్రీలంకకు చెందిన సిలోన్ బ్లాక్ టీ ఉంది. ఇది మృదువైన, అదే సమయంలో ఘాటైన బ్లాక్ టీ రకాలకు ప్రసిద్ధి చెందింది. తర్వాతి స్థానంలో సెంచా ఉంది, ఇది జపాన్కు చెందిన ఎంతో ఇష్టపడే గ్రీన్ టీ.ఐదవ స్థానంలో చైనాకు చెందిన పు ఎర్ ఉంది, దీనిని ఏజ్డ్ లేదా వింటేజ్ టీ అని కూడా పిలుస్తారు.(చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!) -
'ఒకే ఒక్కడు' సాధించిన ఘనత!
ఒక్క రోజుల్లో ఎంత పనిచేయగలం అంటే..సాధ్యమైనంత ఇంత మేరకు అని చెప్పగలం. అంతేగాని ఏళ్ల తరబడి కష్టపడితేగానీ..సాధ్యం కానీ పనిని ఒక్కరోజుల్లో చేయడం అంటే నో ఛాన్స్ అనేస్తాం. కానీ సుసాధ్యమే అంటున్నాడు ఈ వ్యక్తి. ఏకంగా ఒక్కరోజులో వేలకొద్ది మడ చెట్లను నాటి యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. అతడెవరంటే..ఆ అనితర సాధ్యమైన ఘనతను సాధించిన 'ఒకే ఒక్కడు' కెన్యాకు చెందిన పర్యావరణ కార్యకర్త ఆంటోయిన్ మోసెస్. ఆయన కేవలం 24 గంటల్లో 47,460 మడ చెట్లను నాటి అరుదైన ఘనత సృష్టించాడు. కెన్యాలో ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న అడవుల పునరుద్ధరణ ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఆయన కెన్యా తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున మడ చెట్లను నాటినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఇంత వేగవంతంగా ఇంత కచ్చితత్వంతో చేయడం నిజంగా ప్రశంసనీయం.ఎవరీ ఆంటోయిన్ మోసెస్?ఈ అరుదైన ఘనత కారణంగా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రపంచంలో ఆయన పేరు హాట్టాపిక్గా మారింది. ఆయన ఒక ప్రొఫెషనల్ ట్రీ ప్లాంటర్ కమ్ అల్ట్రా-మారథాన్ రన్నర్. భూతాపాన్ని తగ్గించేలా పచ్చదనంతో కళకళలాడేలా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఆంటోయిన్. అంతేగాదు ఆయన రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అయితే ఇది కేవలం వ్యక్తిగత శ్రమను మాత్రమే కాకుండా, జట్టుకృషి, నాయకత్వం, వ్యవస్థీకరణను ప్రతిబింబిస్తోంది. నాటిన ఈ చెట్ల సంఖ్య కంటే అవి పెరగడం వల్ల అంతకుమించిన ప్రభావం ఉంటుందంటున్నారు ఆంటోయిన్. అంతేగాదు కొత్తగా పెరిగిన ఈ మడ అడవులు తీరప్రాంతాల స్థితిస్థాపకతను పెంచడం తోపాటు సముద్ర జీవ ఆవాసాలను, జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు ఆంటోయిన్.మడ చెట్లు ఎందుకంటే..మడ అడవులు కీలకమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి. అవి తుఫానుల వల్ల తీర కోతను మరియు తీరప్రాంత ఆస్తులకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్ను కూడా అధికంగా గ్రహిస్తాయి.వాటిని అత్యుత్తమ సహజ కార్బన్ సింక్లలో ఒకటిగా పరిగణిస్తారు. కెన్యా వంటి ప్రాంతాలలో మత్స్య సంపదకు, జీవవైవిధ్యానికి మడ అడవులు చాలా ముఖ్యమైనవి. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యానికి,తీరప్రాంత సంరక్షణకు ఇవి అత్యంత కీలకమైనవి.Most mangrove trees planted by an individual in 24 hours 🌳 47,460 by Antoine Moses 🇨🇦 in Mombasa, Kenya, on 30 April 2026 @antomosplant pic.twitter.com/7fJeIosE7H— Guinness World Records (@GWR) May 27, 2026(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టంట్స్’ కొత్త ఫీచర్ మీకోసం!
ఫొటో–షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టంట్స్’ అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ‘ఆ క్షణంలో తీసిన ఫొటోలను, ఫిల్టర్ చేయని, సహజమైన ఫొటోల రూపంలో స్నేహితులతో షేర్ చేసుకోవడానికి కొత్త మార్గం’ అని ‘ఇన్స్టంట్స్’ గురించి అభివర్ణించింది ఇన్స్టాగ్రామ్. యాప్ ఇన్బాక్స్ ద్వారా నేరుగా తాత్కాలిక ఫొటోలను పంపడానికి యూజర్లను ఈ ఫీచర్ అనుమతిస్తుంది.సాధారణ, రోజువారీ ఫొటోలు మీ స్నేహితులు చూడడానికి ఇది ఒక కొత్త మార్గం. వారు చూసిన తరువాత ఫొటోలు మాయమైపోతాయి. ఇన్స్టంట్స్ మీ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ బాటమ్ రైట్ కార్నర్లో ఉంటుంది. కెమెరాపై టాప్ చేయడం ద్వారా ఫ్రెండ్స్, మ్యూచువల్స్ (మీరు ఫాలో అయ్యే ఫాలోవర్స్) ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. ‘ఇన్స్టంట్స్’ని నచ్చిన వారితో పాటు నచ్చనివారు కూడా ఉన్నారు.నచ్చకపోతే... ‘ఇన్స్టంట్స్’ను టర్న్ ఆఫ్ చేయడానికి...ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్స్లోకి వెళ్లాలి.టాప్ రైట్ కార్నర్లోని 3 లైన్స్పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ ఓపెన్ చేయాలి.కంటెంట్ ప్రిఫరెన్సెస్–స్క్రోల్ డౌన్‘హైడ్ ఇన్స్టంట్స్ ఇన్ ఇన్బాక్స్’ ఆప్షన్ కనిపిస్తుంది.‘హైడ్ ఇన్స్టంట్స్ ఇన్ బాక్స్’ టర్న్ ఆఫ్ చేయడం ద్వారా ఇన్బాక్స్ నుంచి ఇన్స్టంట్స్ తొలగించవచ్చు.ఇన్స్టాగ్రామ్ క్యారెసెల్..ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ని తీసుకువచ్చింది. దీని ద్వారా క్యారెసెల్స్ క్రియేట్ చేయవచ్చు. వాటికి మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ఇమేజ్ ఎడిట్ చేయవచ్చు. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఈ కొత్త ఫీచర్ ‘ఫీడ్’ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది.ఎలా చేయాలంటే...ఇన్స్టాగ్రామ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లోని ‘ప్లస్’ ఐకాన్ క్లిక్ చేయాలి.‘పోస్ట్’పై క్లిక్ చేయాలి.మినిమమ్ రెండు పిక్చర్లను సెలెక్ట్ చేసుకోవాలి.క్లిక్ నెక్స్›్టమల్టిపుల్ ఎడిటింగ్ టూల్స్ కనిపిస్తాయి.మీ చిత్రాలు నిలువుగా (పోర్ట్రెయిట్) చతురస్రాకారంలో ఉండడానికి అవసరమైన టూల్స్ ఎంచుకోవచ్చు. ఫొటోలను ఓవర్లే చేయవచ్చు. టెక్ట్స్, మ్యూజిక్ జోడించవచ్చు. ఎడిటింగ్ పూర్తయ్యాక... ‘నెక్ట్స్’పై క్లిక్ చేసి ఫొటోలను పోస్ట్ చేయడానికి ‘షేర్’పై క్లిక్ చేయాలి. -
కాలేయం ఆరోగ్యం కోసం..!
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య అధికమైంది. ఆల్కహాల్ తాగకపోయినా ఈ సమస్య బారినపడుతున్నారు చాలామంది. అసలు కాలేయం అనారోగ్యం బారిన పడకూడదంటే జీవనశైలిలో ఈ మార్పలు చోటుచేసుకుంటే చాలు అని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. సమతుల్య ఆహారం, రోజూవారీ వ్యాయామంతో ఈ సమస్యకు చెక్కుపెట్టొచ్చని అంటున్నారు. జస్ట్ ఒక అరగంట వ్యాయామాలు, మంచి ఆహారంతోనే కాలేయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చిన చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.ముందుగా కాలేయంపై భారాన్ని తగ్గించడని విజ్ఞప్తి చేస్తున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనవసరమైన పెయిన్ కిల్లర్ మందులు అతిగా వాడటం, దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోవకపోవడం వంటి వాటితో కాలేయంపై అతిగా భారాన్ని మోపొద్దు అంటున్నారు. అంటే సమయానికి భోజనం, నిద్ర ఉండేలా కేర్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన పోషకవంతమైన ఆహారాలను తినమని సూచిస్తున్నారు. తీసుకోవాల్సినవి..కాలేయం ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందించి హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది.మిల్క్ థిస్టిల్: అనేది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్న ఒక పురాతన మూలిక. దీనిలో ఉండే 'సిలిమరిన్' అనే క్రియాశీలక సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి (Liver health) అత్యంత మేలు. ఇది లివర్ వాపును తగ్గించి, విషతుల్య పదార్థాలను బయటకు పంపి కణాలను పునరుద్ధరిస్తుంది. హెపటైటిస్, కామెర్లు వంటి సమస్యల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుందినిమ్మకాయ పరోక్షంగా డిటాక్స్కు మద్దతు ఇస్తుంది. ఇది విటమిన్ సిని అందిస్తుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రక్షణకు సహాయపడుతుంది మరియు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వ్యర్థాల విసర్జన అనేది పైత్యరస ప్రవాహం, మూత్ర విసర్జన మరియు జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది.క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం: దీనిలో గ్లూకోసినోలేట్లు ఉంటాయి, ఇవి సల్ఫోరాఫేన్ సంబంధిత సమ్మేళనాలుగా మారగలవు. ఇవి ఫేజ్ 2 డిటాక్స్ ఎంజైమ్ చర్యకు, యాంటీఆక్సిడెంట్ ప్రతిస్పందన మార్గాలకు మద్దతు ఇస్తాయి.క్రూసిఫెరస్ కూరగాలు అంటే..బ్రోకలీక్యాబేజీకాలీఫ్లవర్ముల్లంగిపాలకూర (కాలే)బోక్ చోయ్ఔషధాల పరంగా: గ్లూటాథయాన్ అండ్ బి విటమిన్లు ఫ్యాటీ లివర్ ఫేజ్ 2కు కీలకమైన సాధనాలు. గ్లూటాథయాన్ రియాక్టివ్ సమ్మేళనాలను బంధించి, తటస్థీకరించడంలో సహాయపడుతుంది. బి విటమిన్లు మిథైలేషన్, శక్తి జీవక్రియ డిటాక్స్ మార్గాలకు మద్దతు ఇస్తాయి.వీటితోపాటు ప్రోటీన్, గ్లైసిన్, సిస్టీన్, ఫోలేట్, బి12, బి6, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృఫ్టి పెట్టాలి.వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలను అందిస్తుంది, ఇవి డిటాక్స్ కెమిస్ట్రీకి, యాంటీఆక్సిడెంట్ రక్షణకు మద్దతు ఇస్తాయి. ఇది హృదయ సంబంధ, రోగనిరోధక మార్గాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో మార్పులు చేర్పులు చేసుకుంటే..మంచి ఆరోగ్యం సులభంగా సొంతం చేసుకోవచ్చిన అంటున్నారు. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
పూజా సక్సేనా: జ్ఞాపకాల దారుల్లో...!
నగరాల్లోని వీధుల్లో నడవడం అనేది కళాత్మక ప్రయాణం కూడా! షాపులపై రంగు రంగుల అందమైన బోర్డులు కనిపిస్తాయి. రంగు వెలిసిన బోర్డులు కూడా కొత్త అందంతో వెలిగిపోతుంటాయి. ఈ అందాలకు పుస్తక రూపం ఇచ్చింది పూజా సక్సేనా.దిల్లీ, బెంగళూరు, కోల్కతాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల్లోని మూడు వందల సైన్బోర్డ్లపై ఫొటోబుక్ తీసుకువచ్చింది పూజ.దిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల నుంచి పూజకు సైన్బోర్డ్లపై ఉన్న అందమైన అక్షరాలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను డిజైన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టేలా చేసింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్లో టైప్ఫేస్ డిజైన్ను స్టడీ చేసింది.ఈ ఫొటోబుక్లో దిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. మండీ హౌజ్లోని శ్రీరామ్ సెంటర్ నుండి పహర్గంజ్లోని ఇంపీరియల్ సినిమా థియేటర్ వరకు సైన్బోర్డ్లపై ఎన్నో భాషలలో అందమైన, అద్భుతమైన అక్షర శైలులు!దురదృష్టమేమిటంటే... దిల్లీలో కనువిందు చేసే అలనాటి సైన్బోర్డ్లు క్రమంగా మాయమవుతున్నాయి.సైన్బోర్ట్ల కోసం వీధులు చుట్టి రావడమే కాదు పాత ఆర్కైవ్స్ నుంచి ఫొటోలను సేకరించడం ప్రారంభించింది పూజ. ఆ ఫొటోలలో అలనాటి అందమైన సైన్బోర్ట్లు ఎన్నో కనిపిస్తాయి.ఫ్యూచర్ డాక్యుమెంటేషన్లో భాగంగా భువనేశ్వర్, సౌత్ గోవా, కోయంబత్తూరు, మీరట్... లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటోంది పూజా సక్సెనా. -
ఆకాశంలో ఒక పెద్ద కుటుంబం!
సూర్యుడు... సౌరకుటుంబంలో ఇంటికి పెద్దవాడు సూర్యుడు. మన ఇంటికి నాన్న ఎలాగో అలా. సూర్యుడి చుట్టూ తిరిగే పిల్లల్లాంటి గ్రహాలే మన ప్లానెట్స్. సూర్యుడు వెలుగు, వేడి ఇస్తాడు. ‘టైమ్కు లేవండి!’ అని చెప్పే నాన్నలా ఉంటాడు. అందరూ అతని చుట్టూ తిరుగుతుంటారు.బుధుడు...ఇంటి చిన్న తమ్ముడు ఎలా వేగంగా పరుగెడతాడో బుధుడు కూడా అలానే!. సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు. ‘నేనే ఫస్ట్!’ అనేలా ఉంటాడు. పగలు వేడిగా... రాత్రిళ్లు చల్లగా చిన్నపిల్లల మూడ్స్ మార్చుకున్నట్టే ఉంటాడన్నమాట.శుక్రుడు...స్టైల్ క్వీన్గా పిలిచే ఈ గ్రహం ఆకాశంలో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ‘నేను చాలా అందంగా ఉంటాను!’ అనుకునే అక్కలా ఉంటుందన్నమాట. మబ్బులతో ఫుల్ మేకప్ వేసుకున్నట్టుంటుంది. బయటకి వైబ్రెంట్గా కనిపిస్తూ, లోపల హాట్ హాట్గా ఉంటుంది. భూమి...అమ్మ ప్రేమలా ఉంటుంది. మనందరం ఉండేది భూమిపైనే కదా! గిరగిరా తిరుగుతుంది ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి పెట్టే అమ్మలా. కానీ, మనల్ని ఎక్కడా పడేయదు. జాగ్రత్తగా అందరికీ నీళ్లు, గాలి, ఆహారం ఇస్తుంది. చెట్లు, పక్షులు, మనుషులు.. అందరికీ ఇల్లు భూమే. అందుకే భూమి అంటే ప్రేమతో నిండిన ఇల్లు అన్నమాట.అంగారకుడు...ఎర్రగా కనిపించే గ్రహం. నా జోలికి ఎవరైనా వచ్చారా.. అంతే! అన్నట్టుగా ఉంటాడు. లోపల అంతా ఎడారిలా ΄÷డిగా ఉంటుంది. భవిష్యత్తులో మనుషులు అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రఫ్గా కనిపించినా ఇంట్రెస్టింగ్ గ్రహం.గురుడు...ఇంటిలో పెద్దన్న అమ్మకు, నాన్నకు, తమ్ముడు, చెల్లెలికి సపోర్ట్గా ఎలా ఉంటాడో అలా ఉంటాడు. సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం. పెద్ద అన్నలా అందరినీ కా΄ాడుతాడు. ‘నేను బిగ్ బాస్!’ అన్నట్టుంటాడు. చాలా పెద్దవాడు కానీ గ్యాస్ నింపిన పెద్ద బెలూన్లా కనిపిస్తాడు.శని...శాటర్న్గా పిలిచే ఈ గ్రహం చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫ్యాషన్ అంటే ఇష్టం ఉన్న తాతయ్యలా ఉంటాడు. శని చుట్టూ ఉన్న రింగ్స్ చూసారా? ఐస్, రాళ్లతో ఆ రింగ్స్ ఏర్పడ్డాయట. ఆకాశంలో ఫ్యాషన్ స్టార్ అంటే శనిగ్రహమే.ఇంకా యూరేనస్, నెఫ్ట్యూన్ వంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ, అవి దూరపు బంధువుల్లాంటివి. ఎప్పుడో వాళ్ల వాళ్ల గురించి ఇంట్లోవాళ్లు చెబుతుంటే వింటుంటాం. ఆకాశంలో మనలాగే ఒకరు కోపంగా, ఒకరు వేగంగా, ఒకరు ప్రేమగా, ఒకరు బ్రైట్గా, ఒక పెద్దగా, ఒకరు చాలా చిన్నగా... ఇలా విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఎవరికి వాళ్లే అత్యంత ప్రత్యేకం. కానీ, అందరూ కలిసి ఉండటం వల్ల ఒక కుటుంబంగా స్పెషల్గా నిలిచిపోయారు అని చెప్పవచ్చు. ఈ విధానం వల్ల పిల్లలు రిలేషన్స్ గురించి, మనలోని భావోద్వేగాల గురించి, విభిన్న వ్యక్తుల గురించి అర్థం చేసుకుంటారు. వారి సృజనాత్మకతకు పని చెబుతారు. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
‘ఓపెన్’గా మాట్లాడితే!
ఆ బ్యాంక్ పేరు... భద్రం బీకేర్ఫుల్ బ్రదర్. ఒకరోజు ఆ బ్యాంకులో సేఫ్టీలాకర్ ఎంతకీ ఓపెన్ కావడం లేదు. నగరంలో పేరున్న మెకానిక్లను పిలిపించారు. నో... ఫలితమ్. ‘సేఫ్టీ లాకర్ను సేఫ్గా ఓపెన్ చేయడం ఎలా?’ అని యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసి ట్రై చేశారు. నో.... ఫలితమ్. ‘ఇలా కాదుగానీ అతడిని పిలిపించాల్సిందే’ అన్నాడు బ్యాంకులో సీనియర్ ఉద్యోగి శీనయ్య పటేల్. ‘ఎవరు అతడు?’ అని అడిగాడు కొత్త మేనేజర్.‘అతడి పేరు... ఓపెనర్ కుమార్ (ఓ.కె) అసలు పేరేమిటో తెలియదు కానీ అందరూ ఓ.కే అని పిలుస్తారు’ అని చెప్పాడు శీనయ్య. మారుమూల పల్లెటూరులో ఉండే ఓ.కే.ను పిలిపించారు. సేఫ్ లాకర్ను ఓ.కె. అవలీలగా ఓపెన్ చేశాడు. ఆనందం తట్టుకోలేక అందరూ చప్పట్లు కొట్టారు. ‘నీది మామూలు టాలెంట్ కాదు తమ్ముడూ! ఇదిగో పదివేలు...గిఫ్ట్గా ఇస్తున్నాను’ అని ఆప్యాయంగా ఓ.కె భుజం తట్టాడు మేనేజర్. అంతే...ఓ.కే.లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతడి కళ్లలో అగ్నిపర్వతాలు ఢమాల్, ఢమాల్ అని రెండుసార్లు పేలాయి. వీరావేశంతో బ్యాంక్ మేనేజర్ను మ«ధ్యయుగాల నాటి కిరాతకమైన తిట్లు తిట్టడం ప్రారంభించాడు.ఆ తరువాత ఇలా అన్నాడు: ‘................ ....... ......... .............. ......... ............ ........’ ‘విక్రమార్కా.... ఆ బ్యాంక్ మేనేజర్ ఓ.కే.ను పల్లెత్తు మాట అనలేదు. పైగా ప్రశంసించాడు. అంతేకాదు, గిఫ్ట్క్యాష్ ఇవ్వబోయాడు. మరి అతడిని పట్టుకొని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడమేమిటి? ఇంతకీ ఓ.కె. కోపానికి కారణం ఏమిటి? పనిలో పనిగా పై ఖాళీని పూరించు. ఓ..కె ఏమన్నాడో చెప్పు. చెప్పకపోయావో...’ అని ఎప్పటిలాగే హెచ్చరించాడు భేతాళుడు. ‘పై ఖాళీలో ఓ.కె. చెప్పిన డైలాగ్ చెబుతాను. అందులోనే నీకు సమాధానం దొరుకుతుంది’‘అలాగే చెప్పు’ అన్నాడు భేతాళుడు.సీన్ రీకన్స్ట్రక్షన్‘ఏమయ్యా బ్యాంకు మేనేజర్, నేను ఇంట్లో సుఖంగా ఉండడం, హాయిగా ఇంటి భోజనం చేయడం నీకు నచ్చడం లేదా! మళ్లీ ఆ జైల్లో చిప్పకూడు తినాలా? ఈ డబ్బులకు ఆశపడే కదయ్యా చిప్పకూడు తిన్నాను. గతంలో ఒకసారి సేఫ్ లాకర్ ఓపెన్ చేసినందుకే చా...లా సంవత్సరాలు జైల్లో ఉండి చచ్చాను’ ఆవేశంగా, ఆవేదనగా, ఆందోళనగా అన్నాడు ఓ.కె.‘మరి అప్పుడు నిన్ను ఏ బ్యాంక్ వాళ్లు పిలిచారు?’ అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి. ‘ఎవరూ పిలవలేదు. ఒక అర్ధరాత్రి నేనే సరదాగా వచ్చాను. పోలీసులకు దొరికిపోయాను’ అసలు విషయం చెప్పాడు ఓ.కె. ఎలియాస్ ఓపెనర్ కుమార్.–యాకుబ్ పాషా -
పరుగు ఆపితే... మెరుగైన లైఫ్!
బ్రష్... ఫోన్... టిఫిన్.. ట్రాఫిక్... మీటింగ్... జొమాటో... నెట్ఫ్లిక్స్... నిద్ర...మధ్యలో మనిషి ఎక్కడ? ప్రఖ్యాత పర్యావరణవేత్త వందన శివ అదే అడుగుతున్నారు...‘ఈ స్పీడ్లో పడి బతకడాన్నిమర్చిపోతున్నారా?’ వందనా శివ తాజా పుస్తకం ‘స్లో లివింగ్’ నవీన జీవన సూత్రాన్ని బోధిస్తోంది.పరుగు తగ్గించమని, భూమికి మేలు చేయమని హితవు చెప్తోంది.‘ఆగండి. ఊపిరి పీల్చుకోండి. మీరు మిషన్ కాదు, మనిషి’ అంటున్నారు వందనా శివ. పర్యావరణ యోధురాలుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వందనా శివ తన స్నేహితురాలు, పీస్ ఎడ్యుకేటర్ శ్రేయ జానీతో కలిసి రాసిన పుస్తకం ‘స్లో లివింగ్: వాట్ యూ కెన్ డూ అబౌట్ క్లయిమేట్ ఛేంజ్’ తాజాగా విడుదలై ఆలోచనలు రేకెత్తిస్తోంది. ‘నేటి మనిషి నిరంతర పరుగులో జీవన ఆనందాన్ని కోల్పోతున్నాడు. భూమిని ప్రమాదంలో నెడుతున్నాడు. నేటి మనిషి అన్నీ తొందరగా జరిగిపోవాలనుకుంటున్నాడు. అందుకే ఫాస్ట్ఫుడ్ తిని పొట్ట పాడు చేసుకుంటున్నారు. ఫాస్ట్ లైఫ్తో మనసు పాడు చేసుకుంటున్నారు. నిద్ర లేదు, నవ్వులేదు, నాన్నతో మాట్లాడే టైమ్ లేదు, అమ్మ చేతి ముద్ద రుచి తెలియదు, చివరికి సంపాదించింది హాస్పిటల్ బిల్లులకి సరిపోతుంది. అందుకే నెమ్మదిగా బతకండి. దాని వల్ల భూమి కూడా ప్రాణం పోసుకుంటుంది’.... అనే సారం అందజేస్తోంది ‘స్లో లివింగ్’ పుస్తకం. 73 ఏళ్ల వందనా శివ మనిషినీ, భూమినీ కాపాడుకోవడానికి ‘స్లో లివింగ్’ను ప్రతిపాదిస్తున్నారు.మనిషి స్పీడ్ వల్ల ఏమైంది?ఐ.ఎం.డి.లెక్కల ప్రకారం 2026లో హీట్ వేవ్స్కి వందల మంది చనిపోయారు. వానలు రావడం లేదు. కారణం? మన ఫాస్ట్ లైఫ్. ఎక్కువ కొనడం, ఎక్కువ పడేయడం, ఎక్కువ కాలుష్యం సృష్టించడం. ఫ్యాక్టరీలు నీళ్లని పాడు చేస్తున్నాయి. పండించే తిండిలో ముప్పై శాతం వేస్ట్ చేస్తున్నాం. అది ఎనిమిది శాతం గ్లోబల్ ఎమిషన్స్ కి కారణమవుతోంది. ప్రతి దానికీ ప్లాస్టిక్ వాడటం వల్ల 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. వన్యమృగాల ఆవాసాలను నాశనం చేయడం వల్ల గత యాభై ఏళ్లలో 300 కొత్త వ్యాధికారక క్రిములు వచ్చాయి. రెడీమేడ్ దుమారంలో ఉత్పత్తిదారులు బట్టలను వాడి పారేసేవిగా తయారు చేస్తూ రీసైక్లింగ్ వీలుగాని దిబ్బలను రాసి పోస్తున్నారు. అందుకే వందన శివ ‘ఆగు’ అంటున్నారు. ‘నెమ్మదించడం అంటే వెనక్కి వెళ్లడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం’ అంటున్నారు. ‘ఫాస్ట్ లివింగ్ ఎంత చేయగలవు అని నిలదీస్తుంది. స్లో లివింగ్ మరింతకాలం నిలబడేలా సాయం చేస్తుంది’ అంటారామె.ఇది శ్రీమంతులకే పాఠమా?మధ్యతరగతికి సవాలక్ష బాదరబందీలు. రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తే తప్ప నాలుగువేళ్లు నోట్లోకెళ్లవు. ఇలాంటప్పుడు ‘స్లో లివింగ్’ సాధ్యమా? ఇది శ్రీమంతులకైతే సరేగాని అనుకోవచ్చు. కాని వందన శివ ‘స్లో లివింగ్’ అందరికీ అంటున్నారు. మధ్యతరగతికి స్లో లివింగ్ అంటే ఏమిటో చెప్తున్నారు.→ ఇంట్లో కూరగాయల తొక్కు చెత్తలో వేయకుండా మొక్కకి వేయడం → వారానికి ఒకసారి కారు కాకుండా సైకిల్ తొక్కడం → ప్లాస్టిక్ కవర్ బదులు గుడ్డ సంచి పట్టుకెళ్లడం → యాప్ తిండి మాని అమ్మ చేతి వంట తినడం → పండగలకి, ఫంక్షన్లకి మాత్రమే కొత్త బట్టలు కొనడం. మిగతా టైం ఉన్నవి ఆల్టర్ చేయించుకోవడం... ‘మిక్స్ అండ్ మ్యాచ్’ అంటే అమ్మచీరకి కొత్త బ్లౌజ్ కుట్టించుకోవడం. ఇవి చేయడానికి కోటీశ్వరుడు అవ్వక్కర్లేదు. కావాల్సింది ఒక్కటే – ఓపిక.మాల్స్, మార్ట్ల నుంచి బయటపడండివీధి చివర పచారి కొట్టుకు వెళితే ‘పద్దు’ ఇచ్చి ‘ఇవి చాలు’ అంటాం. అదే మార్ట్కు వెళితే కనపడినవి అన్నీ బుట్టలో వేస్తాం. దీనిని ‘స్లో లివింగ్’ పుస్తకం కోరైటర్ శ్రేయ జానీ ‘కలోనియల్ జాయ్’ అంటారు. వలస పాలనలో మనం కొనడంలో ఆనందం వెతుక్కున్నాం. అదే అలవాటైంది. అది ‘కలోనియల్ జాయ్’. ఆ కృత్రిమ ఆనందం నుంచి అసలైన ఆనందంలోకి రావాలి. ‘డీకలోనియల్ జాయ్’ పొందాలి. స్థానిక ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, స్థానిక మనుషుల అనుబంధాలు... వీటిలోనే ఆనందం ఉందని తెలుసుకోవాలి. ఏసీ రూంలో కూర్చుని నెట్ఫ్లిక్స్ చూసినా రాని హాయి మొదటి వాన చినుకు అరచేతిలో పడితే వస్తుందని తెలుసుకోగలగాలి. అదే స్లో లివింగ్.పెద్దలు చెప్పినా పుస్తకం చెప్పినా హెచ్చరిక ఒకటే... ‘అతి వేగం చంపుతుంది. నెమ్మది బతికిస్తుంది’.... మనల్నే కాదు. భూమిని కూడా. స్లో లివింగ్ అంటే?స్లో లివింగ్ను వందనా శివ ఇలా నిర్వచిస్తున్నారు. → తినే తిండి ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవాలి. ΄్యాకెట్ చూసి కొనడం కాదు, పొలం చూసి కొనాలి. రైతు దగ్గర కొనాలి. → అనవసరంగా ఏదీ కావాలనుకోకూడదు. కొనే ప్రతి వస్తువు అవసరమా కాదా అని 10 సెకన్లు ఆలోచించాలి. → ‘ఫాస్ట్ ఫ్యాషన్ ’ అంటే నాలుగుసార్లు వాడి పడేసే బట్టలు కొనకూడదు. ‘స్లో ఫ్యాషన్ ’ ఫాలో కావాలి. అంటే అమ్మమ్మలా ఒక నాణ్యమైన చీరను 20 ఏళ్లు కట్టుకోవడం. → భూమిని గౌరవించాలి. చెట్టు నరకడం కాదు, చెట్టు నాటాలి. నీళ్లని వృథా చేయడం కాదు, ఒడిసి పట్టాలి. → మనతో మనం గడపాలి. ఫోన్ లేకుండా రోజైనా ఒక గంటైనా మనతో మనం గడపడం. కుటుంబంతో మాట్లాడాలి. ఆకాశం ఒకటుందని గుర్తు చేసుకుని దాని వైపు చూడాలి. – కె. -
ఆవకాయ పచ్చడిని వేరుశెనగ నూనెతో పెట్టడానికి రీజన్ ఇదే!
భారతదేశంలో వేసవికాలం అంటేనే నోరూరించే ఆవకాయ పట్టే కాలం. పచ్చి మామిడికాయల ఘాటైన పుల్లదనం, తాజాగా దంచిన మసాలాల సహజమైన తీక్షణత, ఆ మిశ్రమంపై పోసే వేడి నూనె స్పష్టమైన, గాఢమైన సువాసన మనందరి పాకశాస్త్ర జ్ఞాపకాలను నిర్వచిస్తాయి. తరతరాలుగా, సాంప్రదాయ రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఊరగాయ రహస్యం పూర్తిగా నూనె ఎంపికలోనే ఉందని అమ్మమ్మలు చెబుతుంటారు. సున్నితమైన గింజల రుచితో కూడిన వేరుశెనగ నూనె ఒక వైవిధ్యమైన పాకశాస్త్ర విజేత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శక్తివంతమైనది. పైగా వంటకాలకు మరింత రుచిని అందించేది. ఇక్కడ వేరుశెనగ నూనె సహజ నిల్వకారిగా, రుచిని పెంచేదిగా పనిచేస్తుంది. ఇది తేలికపాటి సువాసనను, సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగివుంటుంది. దాంతో ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. దీన్ని గాలి చొరబడని విధంగా మూత వేసి ఉంచితే..బూజు పట్టకుండా, పాడవకుండా నివారిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో మామిడి కాలంలో, సాంప్రదాయ ‘అమ్మమ్మ’ వంటకాలతో ఊరగాయ తయారు చేయడం ఒక ఆచారం. ఇది కుటుంబాలను ఒకచోట చేర్చి, ఆ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేసి, పాత జ్ఞాపకాలలో మునిగిపోయేలా చేస్తుంది. సాంప్రదాయ తెలుగు/కన్నడ కుటుంబాలలో ఊరగాయ తయారీ అనుభవం గురించి జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్పి. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఫ్రీడమ్ డబుల్ ఫిల్టర్డ్ వేరుశెనగ నూనెను జాగ్రత్తగా ఎంపిక చేసిన వేరుశెనగల నుంచి తీసి, రెండుసార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక నాణ్యత గల, శుద్ధి చేసిన నూనెను ఎంచుకోవడం ద్వారా, భారతీయ నిల్వ పద్ధతుల ప్రాచీన జ్ఞానాన్ని గౌరవిస్తూనే, మీ కుటుంబానికి స్వచ్ఛమైన, పోషకాలు అధికంగా ఉన్న, గాఢమైన సువాసనతో కూడిన వేసవి మధుర జ్ఞాపకాలను అందివ్వగలరని అంటున్నారు. (చదవండి: 60 ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..) -
60 ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..
పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్ తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్లాస్ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్ తల్లి సైతం జిమ్కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. అలాగే కంటెంట్ క్రియేటర్ హరీష్ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేశారు. ఆమె ఫిట్నెస్ చర్యలో భాగంగా డెడ్లిఫ్ట్లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.పెద్దలకు మంచిదేనా..?60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by HotFix | Harish Thakur (@itshotfix) (చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్) -
కుమార్తెలకు గ్రాండ్గా పెళ్లి చేయడం 'గిప్ట్' కాదు..!
మధ్యప్రదేశ్లోని భోపాల్లోట్విషా శర్మ ఉదంతం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసు రోజుకో మలుపుతిగరుతూ చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసు వాదోపవాదనలు విచారిస్తూ..అసలు వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకుని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతి తల్లిదండ్రుల తీరుకు చెంపెట్టులా ఉండటం విశేషం. అలాగే మానసిక నిపుణులు సైతం కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాలని హితవు పలుకుతున్నారు. కష్టపడి చదివించి పాతికేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి అనే రెండక్షరాలకు బలి అవ్వకాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి వంటి వాటి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ప్రతి పేరెంట్ తమ కుమార్తెలకు అంగరంగ వైభవంగా పెళ్లిచేయడం గొప్ప బహుమతి కాదని అంటున్నారు. వివాహం తనను ఊపిరాడనివ్వని పరిస్థితుల్లోకి నెట్టేస్తే..ధైర్యంగా బయటకొచ్చి నిలబడేలా ఉండాలి, అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని అంటున్నారు. వరకట్నం మరణాలను నివారించాలంటే పేరెంట్స్ని తమ కుమార్తెలను జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులకు ఆమెను సిద్ధం చేసేలా ట్రైన్ చేయాలి. సాంప్రదాయకంగా పెళ్లి చేయడం కంటే..ఆమెకు ఈ వైవాహిక బంధం రక్షణ, స్వేచ్ఛను ఇవ్వగలదా చూడాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలకు ముందుకు మానసిక ధైర్యం, ఆర్ధిక స్వేచ్ఛ వంటివి నేర్పించాలి. ఇక వివాహానికి పునాది త్యాగం కాదు, భద్రతే ముఖ్యం అని గ్రహించాలి. అలాగే ఆడపిల్లలకు అత్తంటిలో సమస్యలు, హింసను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే ప్రతి తల్లిదండ్రులు సద్దుకోమని చెప్పడం కాదు. ధైర్యంగా బయటకు వచ్చేలా స్వేచ్ఛను ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి తల్లిదండ్రల్లో పెళ్లితో తమ అమ్మాయి పరాయిది అనే భావాన్ని తొలగించాలి.ఆ వైవాహిక జీవితం నరకప్రాయంగా మారినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకోవాలి, భద్రత అందించాలి. చిన్నప్పటి నుంచి అత్తారింటికి వెళ్లే అమ్మాయి ఇలా ఉండాలి అని స్టోపాయిజన్లా కుమార్తెలకు ఎక్కించడం మానాలి. అంతేగాదు ఆడపిల్లలు కూడా అత్తంట్లో సమస్య వస్తే..పుట్టింటికి వెళ్లడాన్ని అపరాధ భావంలా కాకుండా తన హక్కుగా ధైర్యంగా వచ్చేలా చేయాలి. అలాగే శ్రద్ధ అన్న పేరుతో కుమార్తెలను ప్రతి నిమిషం పర్యవేక్షించడం, కట్టుబాట్లు విధించడం వంటివి చేయకూడదని అంటున్నారు. వాళ్లను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల్లా తీర్చిదిద్దాలన్నారు. ఆడిపిల్లకు ఇచ్చే బంగారం, డబ్బు అత్యవసర నిధుల్లోకి మళ్లించాలి. అది ఆమెకు పెళ్లి తర్వాత భరోసానిచ్చే నిధిలా ఉంటుంది. సమస్య ఎదురైతే ధైర్యంగా బయటకకు వచ్చి బతకగలను అన్న ధైర్యం అందిస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేస్తే..కేవలం నాలుగు రోజులే గుర్తుంటుంది. అదే డబ్బు మిగిల్చి ఆమె స్త్రీ ధనంగా ఇస్తే..ఆమెకు భరోసానిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకవేళ కూతురు పుట్టింట్లో ఉంటే చుట్టూ జనాలు ఏం అనుకుంటారో అన్న భయంతో ముందే తలుపులు వేసుకుని కూర్చొవద్దని పిలుపునిస్తున్నారు. మన అమ్మాయికి అత్తంట్లో కష్టం వస్తే భయపడొద్దు..ఎప్పటికీ పుట్టింటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయన్న నమ్మకం ఇవ్వండని సూచిస్తున్నారు. అలాగే బాధను సాధరణీకరించొద్దు, తొలగించి, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికేలా ధైర్యం ఇవ్వండని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!) -
పిల్లల డ్రీమ్ హౌజ్..!
పిల్లలతో ఊహాశక్తి, బాధ్యత, అలంకరణ పట్ల అభిరుచిని పెంచేది వారి డ్రీమ్ హౌస్. అందులో గోడలు, ఫర్నిచర్, వాతావరణం.. ప్రతిదీ పరిచయం చేయవచ్చు. పిల్లల్లో వచ్చే సృజనాత్మక ఆలోచనలకు మీరే ఆశ్చర్యపోతారు.వెల్కమ్ చెప్పే డోర్..మన ఇంటి తలుపు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆహ్వానించేలా ఉండాలి. దాంతోపాటు మెయిన్ డోర్ ఎలా ఉండాలో చూపమనండి.లివింగ్ – డైనింగ్..కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆనందించే ప్రదేశం, అందరూ కలిసి భోజనం చేసే చోటు ఎలా ఉంటే వారికి నచ్చుతుందో చెప్పమనవచ్చు. గది గోడల రంగు, లైటింగ్, వాల్ పేపర్స్ .. ఇలా ప్రతిదీ క్రియేటివ్గా వారి మైండ్లో నుంచి వచ్చినదై ఉండాలి. రంగులు మన మూడ్ను ఏ విధంగా మార్చుతాయి... ఎక్కువ వస్తువులు కాకుండా ఇంటిని నీటుగా ఎలా సర్దుకోవడం, ప్రతి వస్తువు ఉపయోగం.. ఇలా ప్రతిదీ పాఠమే అవుతుంది.‘పిల్లలను ఇంటి బొమ్మ డ్రా చేయమని సాధారణంగా అడుగుతుంటాం. వాళ్లు ఒక ఇంటి రూపాన్ని డ్రాయింగ్ చేసి చూపుతారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వారి డ్రీమ్ హౌజ్.. దానితో పాటు కిచెన్, బెడ్రూమ్, లివింగ్, స్టడీ రూమ్, రంగులు, ఆర్కిటెక్చర్, అలంకరణ, ఇండోర్– ఔట్డోర్ మొక్కలు... ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా ఉండాలో చెప్పమనవచ్చు. డ్రా చేసి చూపమనవచ్చు. ఇల్లు.. పిల్లల్లో ఎన్నో క్రియేటివ్ ఐడియాలకు రూపకల్పన ఇస్తుంది. వారి క్రియేటివ్ ఐడియాలను మాకు పంపించండి. మెయిల్ ఐడి : sakshisummerkids@gmail.com- గీతాభాస్కర్, నటి, ఆర్ట్ టీచర్బెడ్రూమ్ – చదువుకునే ప్లేస్పిల్లల గది ఆలోచనల పుట్టకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ల చెప్పిన విధానం, డ్రాయింగ్లో చూపిన విధానం.. వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. దీని వల్ల గదులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. కాంతి ఎక్కువగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే దగ్గర, ఒకే సమయంలో చదువుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతాయి. రీడింగ్ ప్లేస్ను ఎలా ఉంచుకోవాలో బాధ్యత పెరుగుతుంది.మొక్కలు – అలంకరణ..ఇండోర్ ΄్లాంట్స్ అమర్చితే ఇల్లు జీవకళతో ఆకట్టుకుంటుంది. ప్రకృతిపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటి లోపల పెంచే మొక్కలు ఎన్ని రకాలు, వాటికి గాలి, వెలుతురు, నీరు .. ఎంతవరకు అవసరమో తెలుసుకుంటారు. మన జీవనానికి ఉపయోగపడే వాటి గురించి కొత్తగా ఆలోచించగలుగుతారు.‘నీ గది ఎలా ఉండాలని అనుకుంటావు? ఏ రంగు అయితే బాగుంటుంది?’, ‘‘పుస్తకాలను ఎలా సెట్ చేద్దాం?,’ ‘చిన్నమొక్కలు ఎక్కడ పెడతావు..’ ఇలా అడిగితే వాళ్లు తమ చిన్న చేతులతోనే చేసి చూపుతారు. ప్రేమ, పరిశుభ్రత, ప్రశాంతత ఉన్న ఇల్లు నిజమైన డ్రీమ్ హౌస్ అంటూ ఒక వ్యాసం రాసి చూపమనవచ్చు.నిర్వహణ : నిర్మలా రెడ్డి -
మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!
ప్రతి వ్యక్తి కెరీర్లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏదీ అంత ఈజీగా దొరికేయదు కూడా. అలానే ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా చదువు అవ్వంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ కొట్టేశాడు. కానీ అది వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తా అంటూ సివిల్స్ వైపుకి వచ్చాడు. అందులో వరుసపెట్టి వైఫల్యాలే, మధ్యలో వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ ఇలా.. వరుసపెట్టి ఎదురుదెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉన్నాయి అతడిని. కానీ చివరికి వాటన్నింటిని ఓర్చుకుంటూనే సక్సెస్ అందుకున్నాడు. చేతులెత్తేయకుండా చివరి వరకు పోరాడటం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ఫూర్తిదాయక కథ వింటుంటే. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికాస్ అల్విస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తన ఫాట్మేట్ గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో వికాస్..తన ఫ్లాట్మేట్ 2012లో ఐఐటి మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్లో బీ.టెక్ పూర్తి చేసి, రూ. 10 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తొందరగానే సెటిల్ అయిపోయాడు. కానీ అతడు దాన్ని వద్దనుకుని మరీ యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాడు. రెండో సారి మెయిన్స్లో తప్పింది. ఇక ఈ రెండు వైఫల్యాలు కారణంగా కాస్త విరామం తీసుకుని తనకిష్టమైన బ్యాడ్మింటన్పై దృష్టిసారించాడు. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఆడటం ప్రారంభించాడు. అయితే మైదానంలో చాలా రాజకీయాలు ఉండేవి వాటిని చూసి విసుగొచ్చి బ్యాడ్మింటన్ వదిలేసి మరో ఏడాది వృధా చేసుకున్నాడు. మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. ఆ టైంలోనే ప్రేమలో పడ్డాడు. దాంతో మూడోసారి ప్రయత్నంపై ఎఫెక్ట్ పడి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక నాల్గో ప్రయత్నంలో లవ్ బ్రేకప్ అతడిని మరింత కుంగదీసింది. ఇక ఐదు, ఆరో ప్రయత్నాల్లో అంత సీరియస్నెస్తో ప్రిపేర్ కాలేక ఓటమిని చవిచూశాడు. అలా మొత్తం 12 ఏళ్లు చేజేతులారా వృధా చేసుకున్నాడు. అప్పటికీ అతనికి 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కూడా లేదు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అతడు జీవితంలో పదే పదే ఎడతెగని వైఫల్యాలను చవిచూసినప్పటికీ..చివరికి అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. అతడు ఆన్లైన్ సాయంతో ట్రేడింగ్ నేర్చుకుని..ఏకంగా సెబీ సలహాదారుడుగా మారాడు. పైగా ట్రేడింగ్ ద్వారా నెలకు ఏకంగా రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు టెకీ వికాస్. నిజం చెప్పాలంటే అతడు ఈ స్థాయికి చేరకుంటాడని ఊహించలేదు కానీ చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్ని ముగించాడు టెకీ. ఈ కథ ఓటములు పలకరిస్తూనే ఉన్నా..గివ్ అప్ ఇవ్వకూడదని చెబుతోంది కదూ..!.There is a guy in my flat who completed his https://t.co/Ws1j7hoGgc in Chemical Engineering from IIT Madras in 2012. After graduation, he got a campus placement offer of 10 LPA, but he rejected it and started preparing for UPSC. He belongs to the general category.In the first…— Vikas Alwys (@VikasAlwys) May 27, 2026 (చదవండి: ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..) -
30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్
అందరికీ స్మార్ట్గా, స్లిమ్గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్ స్పీడ్గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. అందుకోసం ప్లాన్ ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్. అందుకోసం స్ట్రిక్ట్గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్లాస్ ప్లాన్ ఏంటంటే..కేలరీల లోటుతో తినండినిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గరోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండిశరీర బరువులో ప్రతి పౌండ్కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండిప్రోటీన్కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలివారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండివారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడంఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.రాత్రికి 7-9 గంటలు నిద్రపోండినిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండిప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండినీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండిమిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దుప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండిమొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్ . View this post on Instagram A post shared by Takai Raashid | MacroMaster® (@takai.raashid)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్రైస్ కంటే బ్రౌన్రైస్ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్ రైస్ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్రైస్ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్ రైస్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్ రైస్ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..తెల్లబియ్యం..తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.బ్రౌన్రైస్ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.పోలిస్తే..సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయిఆరోగ్య పరంగా..ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం. బ్రౌన్ రైస్ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.ఎలా తీసుకుంటే మంచిదంటే..చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. అందువల్ల బ్రౌన్ రైస్, వైట్రైస్ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
అతి ఖర్చులూ... అప్పులూ ఎప్పుడూ చేటే!
‘ధనమూలం ఇదం జగత్’ అని అనిపించారు వాల్మీకి లక్ష్మణుడి చేత.. ఆది కావ్యంగా ఆదరింపబడి అనునిత్యం మన బతుకుల్లో అల్లుకు పోయిన రామాయణంలోని మాట... నేటికీ అన్వయింపబడే మాట..యుగాలు మారినా, కాలాలు మారినా శిలాశాసనంగా ఉన్న మాట.. ధనమే రాజ్యాలు ఏలుతోంది.. మూలంగా మారి బలంగా తయారై చంచలమైన డబ్బు నిశ్చలంగా నిలిచిపోయింది.భర్తృహరి తన శతకంలో ‘అన్ని గుణాలు ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి’ అని అంటారు... ఇది లోకం పోకడ అని అనుకున్నప్పటికి ధనానికి నల్గురు దాయాదులు.. ధర్మం, అగ్ని, రాజు, దొంగలని భర్తృహరి సెలవిచ్చారు.. ధర్మం అంటే మనం స్వయంగా సక్రమంగా ఖర్చు పెట్టేది, అగ్ని అంటే ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యం ద్వారా పోయేది, రాజు అంటే మనం చెల్లించే పన్నులు, దొంగలు అంటే దొంగలు ఎత్తుకొని పోయేది.. ఈ మధ్య తరచు జరిగే నేరాల వలన పోతోంది...ధర్మం, అర్థం, కామం, మోక్షం... ఈ నాల్గు పురుషార్థాలుగా చెప్తారు...అర్ధం పురుష లక్షణం అంటారు.. కాలానుగుణంగా ‘ముదితల్ నేర్వగ రాని విద్య లేదన్నట్లు పరిగణనలో తీసుకొని అర్థం మానవ లక్షణం అని అనొచ్చు.. అయితే ఏదైనా ధర్మబద్ధంగా వుండాలి, చట్టబద్ధంగా, న్యాయపరంగా ఉండాలి..దశరథుడి పరిపాలన ధర్మంగా సాగింది.. రామరాజ్యం గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. రమణి వ్యామోహంతో లంకేశుడు రాజ్యం, ప్రాణం పోగొట్టుకుంటే, రాజ్యలక్ష్మి కోసం రారాజు దుర్యోధనుడు ఆధోగతి పాలయినాడు.. ఇతరుల ఆస్తి కోసం, డబ్బు కోసం దురాశ పడ్డ వాళ్ళు నిలువలేక పోయారు..సాధనమున సమకూరు పనులు ధరలోన అని వేమన సెలవిచ్చినప్పటికీ, సా‘ధన’ము వలన అన్నీ సమకూరతాయి అన్నది సత్యం...పైసా మే పరమాత్మ హై అని మన ఎదురుగా లక్ష్మీదేవిని ఆవిష్కరణ చేసిన వాళ్ళున్నారు, కొండమీద కోతి అయినా దిగి రావాల్సిందే అనే అహంకార పూరితులూ ఉన్నారు... అప్పుచేసి పప్పు కూడు వద్దన్నారు.. అప్పులేని వాడు అధిక సంపన్నుడని వేమనగారు గౌరవించినా.. అప్పుల అప్పారావులు ఎక్కువైపోయారు.. ఆడంబరాలకి వెళ్లి అప్పు చేసి, తిప్పలు తప్పక కటకటాలలో చిప్పకూడు తిన్నవాళ్లు ఉన్నారు..పంచతంత్రంలో చెప్పిన అష్టకష్టాల్లో ‘అప్పు’ ఒక కష్టం.. అయినా జనాలు మారటం లేదు..‘అప్పిచ్చు వాడున్న’ ఊరిలో నివసించమన్న సలహా సుమతీ శతకంలో ఉంది.. కాని అప్పులు చేయమని కాదు.. అదే సుమతీ శతకంలో అప్పు చేసి వ్యయం చేస్తే కీడు చేస్తుందన్నాడు...కాలాంతకుడు కాలం చెల్లాక వస్తాడు, అప్పులవాడు ఎప్పుడైనా వస్తాడన్నది ఒక నిజం..దాశరథి శతకంలో భక్తరామదాసు ప్రస్తావించిన ఏడు వ్యసనాలలో అర్థదూషణం ఒకటి..మహాభారతం ఉద్యోగ పర్వం విదురనీతిలో వ్యసనాల జాబితాలో వృథావ్యయం ఒకటి...ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, సినీదర్శకులు వారి సామాజిక బాధ్యతలో భాగంగా అర్థం గూర్చి చెప్తూ సక్రమంగా సంపాదించమని, అప్పులు వద్దని, పొదుపు మంత్రం పాటించండి అనీ సెలవిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖర్చు తగ్గించే చర్యలు పాటించండి అని పిలుపు ఇచ్చారు.ఇం‘ధనం’ వాడకం తగ్గించడం, ఖర్చులు వాయిదాలో భాగంగా బంగారం కొనుగోలు, విదేశీ ప్రయాణం ఏడాదిపాటు వద్దని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించమని చెప్పారు.మీ పొదుపే మీ భద్రత అన్నారు అబ్దుల్ కలాం.. చాణుక్యనీతిలో తెలివి గా ఖర్చుపెట్టమని ఉంది.చివరిగా..సంచయాత్ వర్థతే విత్తం అన్నారు.. పొదుపు వలన సంపద పెరుగుతుంది..అర్థమనర్థం భావయ నిత్యం అన్నారు ఆది శంకరాచార్యులు వారు.. అర్థం అనర్థం కాని... సంతుష్టం: కో పీ శ్రీ మాన్... ఎవడు సంతుష్టుడో వాడే శ్రీమంతుడు...మరీ వేదాంతానికి పోకపోయినా సక్రమ మార్గంలో నడుచుకుంటూ వెళదాం. – డాక్టర్ కందాల సత్యనారాయణ మూర్తి -
నా భర్త నేను పడుకున్నాక వస్తాడు.. లేచేలోపే వెళ్లిపోతాడు!
డాక్టర్గారూ, నాకు పెళ్లై ఇరవై ఏళ్లు. మా ఇద్దరు అబ్బాయిలూ కాలేజీలో చదువుతున్నారు. మొదట్లో నా భర్త కొన్ని వ్యాపారాలు చేసి బాగా నష్టపోయారు. అయితే అప్పుడు సంపాదన లేకపోయినా, ఉన్నదానిలోనే అందరం సంతోషంగా ఉండేవాళ్లం. ఇటీవల ఆయన కొత్తవ్యాపారం ఒకటి మొదలు పెట్టి అందులో బాగా క్లిక్ అయ్యాడు. ఇప్పుడాయన పూర్తిగా ఆ వ్యాపారానికి అంకితమైపోయాడు. మేము పడుకున్నాక వస్తాడు. నిద్రలేవక ముందే వెళ్తాడు. పిల్లలు కాలేజీకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. నాకు పిల్లలు, భర్తే నా ప్రపంచం. ఈ ఒంటరితనాన్ని నేను భరించలేక పోతున్నానని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో నేను ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఆయన మనసు కరగకపోగా నన్ను పుట్టింటిలో దించారు. దాదాపు ఆరునెలల వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. తర్వాత నేనే ఆయనను బతిమిలాడుకొని మళ్లీ మా ఇంటికి వచ్చాను. ‘‘నేను ఇలాగే ఉంటాను. నీకు నచ్చితే నాతో ఉండు, లేకపోతే విడాకులు తీసుకుని వెళ్లిపో’’ అంటాడు. నేను ఆయనను వదిలి ఉండలేను. అలాగని ఆయనతో కూడా ఉండలేను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి నాకు సహాయం చేయగలరు. – తేజస్వి, హైదరాబాద్‘కనుల ముందే లోకమున్నా... కానరాని చీకటాయే, గుండె నిండా ఆశలున్నా... పంచుకునే తోడులేదే!’ అనే పాట మీ ప్రస్తుత మానసిక వేదన కు, ఒంటరితనానికీ అద్దం పడుతుంది. ఒకవైపు భర్తపై మీకున్న అమితమైన ప్రేమ, మరోవైపు ఆయననుంచి మీకు కావాల్సిన సమయం, ఆప్యాయత దొరకక పోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణలో ఇలాంటి నిరాశ, నిస్సహాయత కలగడం సహజమే. అయితే మీ బాధను వ్యక్తపరచడానికి లేదా ఆయన దృష్టిని ఆకర్షించడానికి మీరు చేసిన ఆత్మహత్యాయత్నాలు పరిష్కారం కావు. మీ భర్త కోణం నుంచి చూస్తే, మీకు, మీ కుటుంబానికి ఒక మంచి భవిష్యత్తును అందించడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారే తప్ప మిమ్మల్ని ద్వేషించడం లేదు, కానీ ఆ శ్రమలో భాగంగా ఆయన మిమ్మల్ని మానసికంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని గ్రహించే ఓపిక, సమయం ఆయనకు లేవు. మీ వైపు నుంచి చూస్తే, భర్తతో సమయం గడపడం, మాట్లాడుకోవడం, భావోద్వేగంగా దగ్గరగా ఉండడం కూడాౖ వెవాహిక జీవితంలో సహజమైన, కనీస అవసరమే కాబట్టి ఇక్కడ ఎవరి కోరికా తప్పుకాదు, కానీ ఇద్దరి అవసరాలు, ప్రాధాన్యతలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి.మీ భర్తకు మ్యారిటల్ లేదా ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు. కౌన్సెలింగ్ లక్ష్యం ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునేలా చేయడం; అందుకోసం ‘నువ్వు మారాలి’ అనికాకుండా ‘మన బంధం కోసం కలిసి వెళ్దాం’ అని ఆయనకు నచ్చజెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన జీవితంలో కుటుంబం ఎంతో ముఖ్యమైనదే అయినప్పటికీ, మనకంటూ కూడా కొన్ని అభిరుచులు, స్నేహాలు, ఆసక్తులు, వ్యక్తిగత లక్ష్యాలు ఉండాలి. అవి కుటుంబానికి ప్రత్యామ్నాయం కావు కానీ, మీ సంతోషం పూర్తిగా ఎదుటివారిపైనే ఆధారపడే స్థితిని మార్చి మీ భావోద్వేగ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. మీలో వచ్చే ఈ సానుకూల మార్పును, స్థిరత్వాన్ని అర్థం చేసుకుని, మీ భర్త కూడా తన కఠినమైన ఆలోచనా విధానాన్ని పునఃపరిశీలించి, మీతో కలిసి ఫ్యామిలీ కౌన్సెలింగ్కు రావడానికి ఒప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ప్రస్తుతానికి రాకపోయినా, మీ అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఒక్కరైనా సరే ఒక మంచి సైకియాట్రిస్టును లేదా ఫ్యామిలీ కౌన్సెలర్ను కలవడం ఉత్తమం. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
బక్రీద్ అహంకార త్యాగం... స్నేహోత్సవం
బక్రీద్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘ఖుర్బానీ’ లేదా త్యాగం. కానీ ఆ త్యాగం కేవలం జంతువు వరకే పరిమితమై ఉండదు. నిజమైన త్యాగం అంటే మనలోని అహంకారాన్ని వదిలేయడం, స్వార్థాన్ని త్యజించడం. మనకు ఉన్నదాంట్లో కొంత అవసరమైన వారికి పంచడం. మన ఇష్టాల కంటే దేవుని ఆజ్ఞకు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం. బక్రీద్ మనిషికి నేర్పే అసలు పాఠం ఇదే.సాధారణంగా పండుగ అంటేనే ఆనందం, కొత్తబట్టలు, పిండివంటలు అనుకుంటాం. కానీ, బక్రీద్ పర్వదినం వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది. దైవాజ్ఞను శిరసావహిస్తూ ప్రాణసమానమైన కుమారుడిని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, సమాజం కోసం స్వార్థాన్ని వదులుకోవాలనే గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.పంపిణీలో సమానత్వంపండుగ రోజున చేసే ఖుర్బానీ, దానధర్మాల వెనుక ఉన్న అసలైన పరమార్థం సామాజిక సమానత్వమే. ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి... ఒక భాగం పేదలకు, ఒక భాగం బంధుమిత్రులకు, మరొక భాగం తమ కుటుంబానికి కేటాయించే సాంప్రదాయం ఇందులో ఉంది. సంపాదన ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ పండుగ ఆనందం అందాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. ఇందులో ఎక్కడా కులాల, మతాల ప్రస్తావన ఉండదు, కేవలం మానవత్వం మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటుంది.మన భారతదేశం ఎప్పుడూ గంగా – జమున తహజీబ్కు, అంటే భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దంగా ఉంది. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావడం ఇక్కడి సంస్కృతి. హిందూ ముస్లింసోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ప్రేమాభిమానాలను పంచుకోవడం మన సమాజానికి ఉన్న అసలైన బలం.అపోహలు వీడాలి – సామరస్యం పెరగాలిప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత పండుగల సందర్భాలలో అనవసరమైన విమర్శలు, అపోహలు ప్రచారంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో విజ్ఞత గల సమాజంగా మనం మరింత బాధ్యతగా వ్యవహరించాలి. పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక కోణాలను అర్థం చేసుకోకుండా కేవలం బాహ్య ఆచారాలను మాత్రమే విమర్శించడం సరికాదు. ప్రతి మతంలోనూ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించే సంప్రదాయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, గౌరవించినప్పుడే పరమత సహనం అనే పునాదిపై మన సమాజం మరింత బలంగా నిలబడుతుంది. ముఖ్యంగా యువత ఇరువర్గాల సంస్కృతులను అర్థం చేసుకుంటూ, డిజిటల్ ప్రపంచంలో సైతం శాంతిని, సామరస్యాన్ని పెంపొందించేలా సానుకూల సందేశాలను వ్యాప్తి చేయాలి.కులమతాల పట్టింపులను పక్కన పెట్టి, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించి, ద్వేషాలను వీడి స్నేహ హస్తాలను చాచుకుంటూ ముందుకు సాగడమే ఈ బక్రీద్ పర్వదినం మనకు అందించే అసలైన సందేశం. ఈ పర్వదినం అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపి, సమాజంలో సరికొత్త సామరస్యానికి బాటలు వేయాలని ఆకాంక్షిద్దాం.పండుగ జరుపుకోవడంలో సామాజిక బాధ్యతమారుతున్న కాలంతోపాటు పండుగలు జరుపుకునే విధానంలో సామాజిక బాధ్యత కూడా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ, ఇరుగు΄÷రుగు వారి భావోద్వేగాలను గౌరవిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా ఒకరకమైన సామాజిక త్యాగమే అవుతుంది. ఒకరికొకరు ఇబ్బంది కలగకుండా శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకున్నప్పుడే ఆ పండుగకు పరిపూర్ణత లభిస్తుంది. – మదీహా అర్జుమంద్ -
పిల్ ఇలా వేయాలి!
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ – పిల్) కేసు వేయాలి అంటే ఎలాంటి సందర్భాలలో వేయొచ్చు?– చంద్రహాస్, విజయవాడసమాజంలో జరిగే వివిధ అన్యాయాలపై, అక్రమాలపై, ప్రభుత్వానికి – ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి, పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి అంశాలపై ప్రతి ఒక్క పౌరుడూ హైకోర్టును అలాగే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగలిగే హక్కు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా కల్పించింది అత్యున్నత న్యాయస్థానం. ఐతే ఏ విషయాన్ని పిల్ వేయాలి అనే అవగాహన ఉండాలి. లేకపోతే కోర్టు జరిమానా వేసే ఆస్కారం కూడా ఉంటుంది. సాధారణ కేసులలో అయితే మీకు, మీరు వేసిన వ్యాజ్యానికి సంబంధం ఏమిటో కోర్టుకు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పని పక్షంలో మీ కేసును కోర్టు పరిగణించవలసిన అవసరం లేదు. కానీ మీకు నేరుగా వ్యక్తిగత సంబంధం – లబ్ధి లేని అంశాలపై – సమాజానికి/ప్రజా ప్రయోజనం ఉన్నది అని చూపించగలిగిన అంశాలపై పిల్ దాఖలు చేయవచ్చు. మీకు నేరుగా ఎటువంటి లబ్ధి లేదు అని కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించవలసి ఉంటుంది. అంతేకాక కేసు దాఖలు చేసే ముందు మీరు పూర్తిగా అధ్యయనం చేశారు అని, ఎలాంటి పరిణామాల మధ్య మీరు ఆ కేసు వేయవలసిన అవసరం వచ్చిందో వివరించాలి. అలాగే కేసుకు అయ్యే ఖర్చు మీరు భరిస్తున్నట్లు చెప్తూ మీ పాన్ కార్డు కూడా సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటి వెనుక గల ఉద్దేశం: వ్యక్తిగత కారణాలవల్ల కాకుండా నిజమైన ప్రజాప్రయోజనం కోసం మాత్రమే మీరు కోర్టును ఆశ్రయించారు అని కోర్టు పరిశీలిస్తుంది.పనిచేసే ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 రావడానికి కారణమైన ‘విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’, రోడ్డు ప్రమాదాలు / ప్రాణాపాయం వంటి అత్యవసర సమయాలలో ΄ోలీసు వారికోసం వేచి చూడకుండా హాస్పిటల్ వారు చికిత్స అందించాలి అని చెప్పిన ‘పరమానంద కట్టారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ వంటి ఎన్నో కేసులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వచ్చినవే! ఇది మనకు రాజ్యాంగం – సుప్రీం కోర్టు కల్పించిన ఒక బలమైన హక్కు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (మీ కున్న సమస్యల కోసం sakshifamily3@gmail.com మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం కు మెయిల్ చేయవచ్చు. ) -
ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..
ఓ వ్యక్తి అధిక మొత్తంలో సంపాదిస్తే..అతడి ఖర్చులు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పక్కా ప్లాన్ ఆ డబ్బుని పెట్టుబడులుగా మార్చి ఆదాయాన్ని ఆర్జించడమే కాదు..రిటెర్మెంట్ ప్లాన్ పక్కాగా వేస్తున్నాడు. పైగా 30 ఏళ్లకే పదవీవిరణమ తీసుకుంటాడట. అంతేగాదు మనోడు ఆ తర్వాత కూర్చొని తిన్నా..డబ్బు వస్తూనే ఉండేలా ప్లాన్ చేశాడు. మరి అదెలాగో చూసేద్దామా..!.రేమండ్ జెంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెటాలో పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 3 కోట్లుదాక ఆర్జిస్తున్నాడు. ఈ 24 ఏళ్ల జెంగ్ రెండేళ్లపాటు డల్లాస్లో నివశించి సుమారు ఎనిమిది నెలల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారాడు. ఆయన తన సంపాదనలో అధిక భాగాన్ని పొదుపు చేస్తూ..పెట్టుబడుల్లో పెట్టాడు. ఆయన నెల సంపాదన సుమారు రూ. 7.6 లక్షలు కాగా, బోనస్లు, స్టాక్లలో మొత్తం 60% వాటా పెట్టుబడులు కలిగి ఉన్నాడు. అంటే పన్నులు, పదవీ విరమణ చెల్లింపులు పోగా మొత్తం అతడి చేతికి రూ. 4 లక్షలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అతడి పొదపు వచ్చేసి..స్టాక్ వెస్టింగ్, బోనస్లను అనుసరించి నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందట. ఇక అతడి జీవన విధానం ఎంత సింపుల్గా ఉంటుందంటే ఊహకే అందని విధంగా ఉంటుంది. అతడి ఇంట్లో సోఫా వంటి ఫర్నీచర్ గానీ, టీవీ, కారు, సొంతంగా ఇల్లు వంటివి ఏమీ లేవు. అయితే జెంగ్ మాత్రం జీవనశైలి అనది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప అవేమి తప్పనరి కాదని కొట్టిపారేస్తున్నాడు. ప్రతినెల ఆయనే బడ్జెట్ స్పెడ్షీట్ని మెయింటైన్ చేసి మరి తన పొదుపు , ఖర్చుల వివరాలను స్వయంగా ట్రాక్ చేసుకుంటాడట. అంటే జాంగ్ అనుకున్న ప్రకారం.. ప్లాన్ సాగితే మాత్రం అతడికి 30 ఏళ్ల వచ్చేటప్పటికీ రూ. రూ. 19 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. అలాగే జాంగ్ అనుకున్నట్లు 30 ఏళ్లకు ధీమాగా పదవీ విరమణ చెసేయొచ్చు కూడా. బాగుంది కదూ ఈ రిటైర్మెంట్ స్ట్రాటజీ.(చదవండి: టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!) -
టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!
ఒక వ్యక్తి ఒకానొక టైంలో చదువుని మధ్యలోనే ఆపేసినా..పరిస్థితులు, కష్టాలు, అసామాన్య ప్రతిభను వెలికితీస్తాయి అనేందుకు ఈ కథే ఉదాహరణ. ఆర్థిక కష్టాలు పదోతరగతికి మించి ఉన్నత చదువుని అందుకునే పరిస్థితి కల్పించికపోతేనేం..అచంచలమైన దృఢ సంకల్పంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ.. వ్యవస్థాపకుడిగా మారాడు. అక్కడ నుంచి దేశమే గర్వించేలా రక్షణవ్యవస్థ సామర్ధ్యాన్ని బలోపతేం చేసే పేలుడు పదార్థాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీని రన్ చేసే స్థాయికి చేరుకున్నాడు.అతడే రాజస్థాన్కి చెందిన సత్యనారాయణ్ నువాల్. రాజస్థాన్లోని భిల్వారా గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి పదవీ విరమణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పదితోనే చదువు ఆపేయాల్సిన వచ్చింది. దాంతో 1970వ దశకంలో నువాల్ జీవనోపాధి కోసం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న బల్హర్షాకు వెళ్లారు. కనీస వసతి లేక ఆయన రాత్రుళ్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలు ప్రయత్నించారు. 18 ఏళ్ల వయసులో ప్రారంభించిన ఫౌంటెన్-పెన్ ఇంక్ తయారీలో నష్టం రావడం వంటి పలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గక.. గెలుపు పిలుపు వినిపించ్చేదాక ఏదో ఒక చిన్న వ్యాపార ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఆ క్రమంలోనే పేలుడు పదార్థాల వ్యాపారి అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ని కలిశారు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. వెయ్యితో మొదలై..కోట్లకు విస్తరించేలా..ఆ వ్యాపారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఆయన వద్ద నుంచి లైసెన్సు, నిల్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి నెలకు రూ. 1,000 చెల్లిస్తూ వ్యాపారం మెదలుపెట్టాడు. ఆయన రూ. 250లకు పేలుడు పదార్థాలు కొని వాటిని రూ. 800లకు అమ్మే వ్యాపార చతురత నువాల్లని ఎంతగానో ఆకర్షించింది. అలా ఆయన బ్రిటిష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ICI)లో పంపిణీదారుడిగా నియామకం పొంది కీలకమైన పరిశ్రమ అనుభవాన్ని సంపాదించుకుని ఆర్థిక స్థిరత్వాన్ని పొందాడు. ఆ విధంగా 1995లో రూ. 60 లక్షల రుణంతో నువాల్ నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు. ఈ సంస్థ 1996లో ప్యాకేజ్డ్ పేలుడు పదార్థాలు, బల్క్ పేలుడు పదార్థాలు, డిటోనేటర్ల తయారీతో కార్యకలాపాలను ప్రారంభించింది. మొదట చిన్న తరహా సంస్థగా ప్రారంభమైన..కొద్ది కాలంలోనే విస్తరించి భారతదేశంలోనే అతి పెద్ద పేలుడు పదార్థాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఈ సంస్థ ఎదిగింది. రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం..నాగస్త్రకు అనుబంధంగా భార్గవస్త్ర అనే ఒక అధునాతన కౌంటర్-డ్రోన్ (C-UAS) వ్యవస్థ ఉంది. ఈ మైక్రో-క్షిపణి ఒకేసారి 60 లక్ష్యాల వరకు ఛేదించగలదు. ఈ సామర్థ్యం ఇతర దేశాలు మోహరించిన వ్యవస్థలను మించిపోయింది. మాములుగా ఇవి సాధారణంగా ఒకేసారి నాలుగు ప్రయోగాలను మాత్రమే నిర్వహించగలుగుతాయి. దీంతో 2010 నాటికి సోలార్ ఇండస్ట్రీస్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలా రక్షణ దళాల కోసం పేలుడు పదార్థాలను తయారు చేయడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తొలి ప్రైవేట్ భారతీయ సంస్థగా ఇది నిలిచింది. ఆ లైసెన్స్ కాస్తా పేలుడు పదార్థాల నుంచి అత్యాధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థల వైపు మళ్లడానికి నాంది పలికింది. ఆ విధంగా నువాల్ నాయకత్వంలో సంస్థ అనూహ్యంగా వృద్ధి చెంది ఇప్పుడు భారతదేశం అంతటా 27 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. అంతేగాదు ఎనిమిది దేశాల్లో ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉండటమే గాక సుమారు 75 నుంచి 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. 2023 నాటికి, సోలార్ ఇండస్ట్రీస్ ఏకంగా రూ. 8వే కోట్లు ఆదాయంతో ప్రపంచంలోనే ఐదు అగ్ర పేలుడు పదార్థాల తయారీలో ఒకటిగా నిలిచింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లను దాటి, దాదాపు రూ. 1.54 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందులో నువాల్ సుమారు 70 శాతం ఈక్విటీని కలిగి ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సదుపాయాలను సందర్శించి, కంపెనీ సాంకేతిక పురోగతిని ప్రశంసించారు. అలా నువాల్ కంపెనీ రక్షణ వ్యవస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాదు ఆపరేషన్ సింధూర్లో సైతం నాగాస్త్రంతో ఒక నిర్ణయాత్మక పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం జనవరి 26, 2026న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. ఒకప్పుడు చదువు మధ్యలో ఆపేసిన వ్యక్తి భారతదేశ రక్షణ ఉత్పాదక విప్లవంలో అగ్రగామిగా ఉన కంపెనీకి సారథ్యం వహించే స్థాయికి చేరడం నిజంగా స్ఫూర్తిదాయకం కదూ..!.(చదవండి: మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..! పేదింటి అమ్మాయి విజయగాథ) -
మురికి వాడ నుంచి ఏఐ ఎక్స్పర్ట్ రేంజ్కి..!
జీవితం ఎలాంటిదంటే... ‘ఏమీ లేదు’ అని నిరాశతో అనుకుంటే... ఏమీ ఉండదు! ‘చాలా ఉంది’ అని ఆశాభావంతో అనుకుంటే... చాలా ఉంటుంది!! పగవాడికి కూడా ఇలాంటి పేదరికం వద్దు అనుకునే కటిక పేదరికంలో పుట్టిన షహీనా అత్తర్వాలా ఎప్పుడూ ఆశాభావంతో ఉండేది. ఆ ఆశాభావమే ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. మురికివాడ నుంచి ప్రసిద్ధ కంపెనీలలో ఏఐ ఎక్స్పర్ట్గా పనిచేసే స్థాయికి తీసుకెళ్లింది. పేదింటి అమ్మాయిల చదువు కోసం వివిధ రూపాల్లో తన వంతుగా కృషి చేస్తోంది.ఉత్తర్ప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించింది షహీనా అత్తర్వాలా. ఆమె కుటుంబం బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చింది. షహీనా తండ్రి చదువుకోలేదు. చిన్నాచితకా పనులు చేస్తూ బతుకుబండిని నడిపేవాడు. షహీన కుటుంబం ముంబైలోని దర్గా గల్లీ మురికి వాడలోని ఒక గుడిసెలో నివసించేది. దురదృష్టవశాత్తు ఆ గుడిసె కొన్నిరోజులకు అగ్ని ప్రమాదానికి గురైంది. సామాన్లు, ఉన్న కాస్తో కూస్తో డబ్బూ బూడిదయ్యాయి. ఆ తరువాత షన కుటుంబం ఒకచోటు నుంచి మరోచోటుకు మారుతూ ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతికేది.ఒక కల అలా మొదలైంది...పేదరికం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కుమార్తె చదువు విషయంలో తండ్రి నిర్లక్ష్యం వహించేవాడు కాదు. షహీనాను సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చేర్పించాడు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకుంది. తన ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది మహిళలు నిస్సహాయంగా పురుషులపై ఆధారపడడాన్ని షన గమనించేది. ఆమె దృష్టిలో వారు బతుకుతున్నారు. అంతే! వారిలా తాను ఇతరులపై ఆధారపడకుండా స్వంత కాళ్లపై నిలబడాలంటే బాగా చదువుకోవాలనుకుంది.అప్పు చేసి కంప్యూటర్ కోర్స్లో...సెయింట్ జోసెఫ్లో నీడిల్ వర్క్ లేదా కంప్యూటర్ ఆప్షన్ ఉండేది. షహీనాకు కంప్యూటర్లపై ఆసక్తి. అయితే తగిన మార్కులు లేకపోవడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ నిరాశలో... ‘ఇంటర్మీడియెట్ తరువాత కంప్యూటర్ కోర్స్లో చేరవచ్చా?’ అని ఎవరినో అడిగితే... ‘చేరవచ్చు’ అన్నారు. ‘అప్పటి వరకు ఓపిక పట్టాలి. తప్పదు’ అని తనకు తాను చెప్పుకుంది.షహీనాను కంప్యూటర్ కోర్సులో చేర్పించడానికి తండ్రి అప్పు చేశాడు. కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసిన తరువాత ఆ ఇన్స్టిట్యూట్లోనే ఇన్స్ట్రక్టర్గా పనిచేసింది షన. ఆ తరువాత... బుక్మై షో, షాదీ.కామ్, విగ్జో, జూమ్కార్లలో పనిచేసింది. 2020 సంవత్సరం షన ఉద్యోగ జీవితంలో కీలక మలుపు. ఆ సంవత్సరం మైక్రోసాఫ్ట్ డిజైన్ టీమ్లో చేరింది. డిజైన్ మేనేజర్ స్థాయికి చేరింది. డిజైన్ మేనేజర్గా ఎమర్జింగ్ మార్కెట్ టీమ్ కోసం డిజైన్ అండ్ రీసెర్చ్కు నాయకత్వం వహించింది. కొంత కాలం తరువాత ‘సేల్స్ఫోర్స్’లో ప్రిన్సిపల్ డిజైనర్గా చేరింది. సేల్స్ క్లౌడ్ కోసం జెన్–ఏఐప్రాజెక్ట్లకు నాయకత్వం వహించింది. అలా పని చేస్తూనే కామర్స్లో డిగ్రీ చేసింది. ఆ తరువాత లా చేసింది.మురికివాడ వదిలి...2021లో ముంబైలో తాను ఉంటున్న మురికివాడను వదిలి సొంత అపార్ట్మెంట్లోకి మారింది షన. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా’లో తాను చాలాకాలం పాటు నివసించిన దర్గా గల్లీ మురికి వాడను చూసింది. ఆ సిరీస్లో చూపించిన ఇళ్లలో ఒకటి తనదేనని సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేసింది. తాము అక్కడ నివసించే రోజుల్లో పబ్లిక్ టాయిలెట్లు అత్యంత మురికిగా ఉండేవని, ఆ అపరిశుభ్రమైన టాయిలెట్లకు వెళ్లకుండా ఉండేందుకు చెత్తకుప్పలను బహిరంగ మలవిసర్జన కోసం ఉపయోగించేవారని, ఈ మురికివాడ నుంచి సౌకర్యవంతమైన జీవితంలోకి రావడానికి తన కఠిన శ్రమ, పట్టుదల కారణం అయ్యా యంటూ తన ΄ోస్ట్లో తెలియజేసింది. తన గెలుపు పాఠమే... వారికి పాఠం‘కష్టపడ్డాను. జీవితంలో పైకి వచ్చాను. ఇక చాలు’ అనుకోలేదు షన. పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారికి నా వంతుగా ఏదైనా చేయాలనుకుంది. నిరుపేద బాలికలకు చదువుప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తన గెలుపు పాఠాన్నే వారికి పాఠంలా చెబుతోంది. సాంకేతిక విషయాలపై వారికి శిక్షణ ఇస్తోంది. బాలికల విద్యకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక బాలిక చదువు కోసం క్రౌడ్ఫండింగ్ ద్వారా సహాయం చేసింది. ఆమె సహాయం చేసిన బాలిక ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్సెస్ చదువుతోంది.ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది!ముంబై మురికివాడలో మేము నివసించిన పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ భయంగా, బాధగా ఉంటుంది. అది అత్యంత కఠినమైన జీవితం. లింగ వివక్ష నుంచి లైంగిక వేధింపుల వరకు ఎన్నో చూశాను. ఈ నేపథ్యంలో నేను ఒక కొత్తజీవితం కోసం కల కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి కష్టపడ్డాను. అడుగడుగునా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడం నా అదృష్టం. – షహీనా అత్తర్వాలా -
రోడ్డు పక్కన మైలురాళ్లు..ఇన్ని విషయాలను వివరిస్తాయా!?
ప్రయాణం అంటేనే కొత్త అనుభూతి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణంలో మనకు తరచూ రోడ్డు పక్కన మైలురాళ్లు కనిపిస్తుంటాయి. 'ఫలానా ఊరు ఇంకెన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది?' అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ రాళ్లను చూస్తుంటాం. కానీ, మైలురాళ్లపై ఉండే రంగులు మనం ఏ తరహా రహదారిపై ప్రయాణిస్తున్నామో, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో ఇట్టే చెప్పేస్తాయి. మరి ఆ రంగుల వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందామా..!పసుపు రంగు: జాతీయ రహదారి (National Highway)మీరు వెళ్లే మార్గంలో మైలురాయి పైభాగం పసుపు రంగులో ఉండి, కింద తెలుపు రంగు ఉంటే.. మీరు జాతీయ రహదారి (National Highway - NH) పై ప్రయాణిస్తున్నారని అర్థం.ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) నిర్మించి, నిర్వహిస్తుంది. ఇవి ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో, అలాగే దేశంలోని ప్రధాన నగరాలు, నౌకాశ్రయాలను అనుసంధానిస్తాయి.ఆకుపచ్చ రంగు..రాష్ట్ర రహదారి (State Highway)..ఒకవేళ మైలురాయి పైభాగం ఆకుపచ్చ రంగులో ఉంటే.. మీరు రాష్ట్ర రహదారి (State Highway - SH) పై ఉన్నట్లు లెక్క. ఈ రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. ఇవి రాష్ట్రంలోని వివిధ జిల్లాలను, ప్రధాన నగరాలను రాష్ట్ర రాజధానితో లేదా జాతీయ రహదారులతో కలుపుతాయి.నలుపు లేదా నీలం రంగు: జిల్లా రహదారి (District Road)..మైలురాయి పైభాగంలో నలుపు, ముదురు నీలం (డార్క్ బ్లూ) లేదా పూర్తిగా తెలుపు రంగు ఉండి, దానిపై నగరాల పేర్లు రాసి ఉంటే.. అది జిల్లా రహదారి అని అర్థం. వీటి నిర్వహణను జిల్లా పరిపాలనా యంత్రాంగం లేదా కార్పొరేషన్, మున్సిపాలిటీలు చూసుకుంటాయి.మీరు ఒక పెద్ద నగరానికి లేదా జిల్లా కేంద్రానికి సమీపిస్తున్నారని ఈ రంగు సూచిస్తుంది.నారింజ రంగు: గ్రామీణ రహదారి (Rural Road)..మైలురాయి పైభాగం నారింజ (ఆరెంజ్) రంగులో కనిపిస్తే.. మీరు ఏదైనా గ్రామీణ ప్రాంతానికి వెళ్తున్నారని అర్థం. ఈ రహదారులను 'ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన' (PMGSY) కింద నిర్మిస్తారు. కుగ్రామాలను సైతం ప్రధాన రహదారులతో అనుసంధానించేందుకు ఈ రోడ్లు ఉపయోగపడతాయి.మైలురాళ్లపై ఏ రంగు ఉన్నా, వాటి కింది భాగం మాత్రం ఎప్పుడూ తెలుపు రంగులోనే ఉంటుంది. రాత్రి వేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పడినప్పుడు ఈ తెలుపు రంగు స్పష్టంగా కనిపించి, డ్రైవర్లకు మైలురాయిని దూరం నుంచే గుర్తుపట్టేలా చేస్తుంది. ఇకపై మీరు ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, కేవలం కిలోమీటర్లనే కాకుండా మైలురాయి రంగును కూడా గమనించండి. మీ ప్రయాణం ఎంత సురక్షితమైన మార్గంలో సాగుతుందో మీకే అర్థమైపోతుంది. - పసుపులేటి. వెంకటేశ్వరరావు -
మృగశిర కార్తెకు-చేపలకు ఉన్న సంబంధం? ఆ రోజే చేపప్రసాదం ఎందుకుంటే..
ప్రతీ ఏడాది మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొన్ని రోజుల్ల చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారంటే..అప్పుడే ఎందుకు?మృగశిర కార్తె ప్రవేశించిన సమయంలో ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభమవుతాయి. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండటంతో తగినంత వేడి కోసం చేపలను ఎక్కువగా తింటుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. వాతావరణం మారటంతో.. ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో.. జనాల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. ఉబ్బసం సమస్యతో బాధపడేవారికి ఈ కార్తె ప్రారంభమైన 2 రోజులపాటు హైదరాబాద్లో చేప ప్రసాదం ఇవ్వడం తెలిసిందే. మరోవైపు ఈ కార్తెకు రెండు మూడు రోజుల ముందు నుంచే చేపల మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. అయితే మృగశిర కార్తె ప్రారంభమైన రోజునే.. చేప ప్రసాదం ఇస్తే బాధితులకు సరిగ్గా పని చేస్తుందని నమ్మకం.చేపలకు మృగశిరకు ఉన్న సంబంధం..రోళ్లను సైతం పగులగొట్టే భగమండే ఎండలు తగ్గిపోతాయి. తొలకరి జల్లులతో వర్షాలు మొదలవుతాయి. అదీగాక 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్లోచాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే.చేప మందు చరిత్ర..ఈ మందును మొదట 1847లో తయారు చేశారు. అప్పట్లో ఓ సాధువు దేశపర్యటన చేస్తూ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా బత్తిని వీరన్నగౌడ్ ఆయనకు ఆశ్రయం కల్పించారు. ఆ సమయంలోనే చేప మందు తయారు చేశారు. ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తే నీకు అన్ని విధాలా మంచి జరుగుతుందని చెప్పి తయారు చేసే విధానం ఆయనకు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ మందును పంపిణీ చేస్తున్నారు.ఇందులో ఏం ఉంటాయంటే..ఈ చేపప్రసాదం కోసం చిన్న చిన్న కొరమీను చేపలనే వాడతారు. ఈ మందులో పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు, ఇతర వనమూలికలు ఉంటాయి.చేప ప్రసాదం (ఫిష్ ప్రసాదం) అనేది ఉబ్బసం (ఆస్తమా) ఇతర శ్వాసకోశ వ్యాధుల నివారణకు హైదరాబాద్లోని బత్తిని కుటుంబం సుమారు 170 ఏళ్లుగా పంపిణీ చేస్తున్న ఒక ప్రసిద్ధ సాంప్రదాయ మందు. ఈ ప్రసాదాన్ని ప్రతి ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం రుతుపవనాల ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తి రోజున నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 8 నుంచి హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (హైదరాబాద్)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బత్తిని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా సుమారు 2 అంగుళాల పరిమాణంలో ఉన్న చిన్న 'కొరమీను' చేప నోటిలో ప్రత్యేకమైన పసుపు పసరు (మందు) పెట్టి, దానిని రోగి గొంతులోకి జొప్పిస్తారు. శాకాహారులకు, చేపలు తినలేని వారికి ఈ మందును బెల్లంతో కలిపి ఇస్తారు. ఈ మందు పూర్తిగా ఉచితం, కానీ రోగులు బయట స్టాళ్లలో దొరికే చిన్న చేపలను సొంతంగా కొనుగోలు చేసి తీసుకురావాలి. మందు తీసుకున్న తర్వాత 30 నిమిషాల వరకు నీరు త్రాగరాదు. ఈ మందు ప్రభావం చూపడానికి బత్తిని కుటుంబం సూచించిన 45 రోజుల కఠినమైన ఆహార నియమాలు (డైట్) ఖచ్చితంగా పాటించాలి.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వరుడు కుటుంబం రిటర్న్ గిఫ్ట్ అదుర్స్..! మొత్తం గ్రామానికి రూ. 34.6 కోట్ల..
వివాహం అనగానే ఓ పండుగ వాతావరణంలో ఉంటుంది. మా ఊర్లో ఫలాన వాళ్లది పెళ్లి అని అంతా సంతోషంగా చెప్పుకుంటారు కూడా. ఆ ఆనందం పెళ్లిని నిర్వహిస్తున్న కుటుంబాలకే చెందినదైనా..ఆ ఊరు లేదా ఆ గ్రామంలోని అందరి కళ్లలో సంతోషం వెల్లివెరిస్తుంది. అయితే ఇక్కడ ఈ వివాహ వేడుక ఈ సంతోషం తమకు మాత్రమే గాక ప్రజలందరూ సంబరపడే ఉండాలని ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి యావత్తు గ్రామం ఫిదా అవ్వడమే కాదు.. కళ్లు చెమర్చాయ్. ఆహా..! మీ వివాహ వేడుక మా ఆర్థిక భద్రతగా మారిందా అని అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బహదర్పురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంచి సంగీతం, విందు భోజనంతో పాటు ఈ వేడుక సంతోషం అందరికి చేరువవ్వాలిని అపురూపమైన రిటర్న్ గిఫ్ట్లు అందించింది వరుడి కుటుంబం. వివాహ తంతులో సాంప్రదాయ జ్ఞాపికలు లేదా బహుమతులకు బదులుగా వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ అతని కుటుంబం గ్రామంలోని 3,465 మంది నివాసితులందరికీ రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా కవరేజీని బహుమతిగా ఇచ్చింది.అర్హులైన ప్రతి గ్రామస్తునికి భీమా సౌకర్యం..పేఠ్కర్ కుటుంబం స్థానిక గ్రామ పంచాయతీ పేరు మీద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవ్వరూ మినహాయించబడకుండా ఉండేలా గ్రామ ఓటర్ల జాబితానే నేరుగా బీమా కంపెనీకి సమర్పించింది. దాంతో అర్హులైన ప్రతి నివాసికి స్వయంచాలకంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా లభించేందుకు మార్గం సులభమైంది. ఈ బీమా పాలసీ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే భవిష్యత్తు పునరుద్ధరణపై చర్చలు కూడా జరగనున్నాయి. అయితే, పాలసీ కోసం చెల్లించిన మొత్తం ప్రీమియంను వెల్లడించకూడదని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ మేరకు వరుడు కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. "మన సంస్కృతిలో దానధర్మాల గురించి అందరికీ చాటింపు వేయం. అందుకే ఎవ్వరికీ ఆ మొత్తం సొమ్ము గురించి చెప్పాలనుకోవడం లేదు. మాకు కేవలం ఆశీర్వాదం చాలు. చప్పట్లు పొగడ్లతో పనిలేదు. ఆకస్మిక ప్రమాదాలు గ్రామీణ కుటుంబాలను ఆర్థికంగా ఎలా నాశనం చేస్తాయో ప్రత్యక్షంగా చూడటం వల్ల తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలలో పాముకాట్లు, పిడుగుపాటు, వ్యవసాయ సంబంధిత ప్రమాదాలు సర్వసాధారణం, పైగా బీమా సౌకర్యం చాలా అరుదుగా ఉంటుంది. మా ఆనందం మా ఇంటికే పరిమితం కాకూడదనే ఇలా చేశాం. ఈ పెళ్లి కేవలం జ్ఞాపకంగా మాత్రమే కాకుండా రక్షణగా మారాలని ఆశించే ఇలా చేశామని అన్నారు" వరుడు సిద్ధేశ్వర్ కుటుంబీకులు. అక్కడి గ్రామస్తులు సైతం ఇప్పటివరకు ఇలాంటి పెళ్లి కానుకను చూడలేదని.. మొత్తం గ్రామానికే సాముహిక సంరక్షణను అందించే ఆర్థిక భద్రతను అందించిందంటూ సదరు వరుడి కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య.. -
బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..!
నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందులోనూ బాదం పప్పులు మరింత ఆరోగ్యప్రదం కూడా. వీటిని ఎవ్వరైనా ధీమాగా తినొచ్చు. బాలింతలు, దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికి మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టి తింటే మరింత ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . అధ్యయనాలు సైతం ఆ మాట నొక్కి చెబుతున్నాయి. నీటిలో నానబెట్టకుండా గట్టిగా ఉన్న బాదం పప్పులనే తింటే జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎలా ఇబ్బంది పడుతుందో కూడా వివరించారు.బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కీలక ఖనిజాలు ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి కూడా. అందువల్ల వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి లేదా కనీసం ఓ 12 గంటలైన నానబెట్టి తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఆదర్శగౌడ. ఎందుకంటే..పచ్చిగా ఉండే బాదం పప్పుల్లో ఫైటిక్ ఆమ్లం ఉంటుందట. ఇది బాదంలో సహజంగా లభించే సమ్మేళనం. ఇది బాదంలోని జింక్, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో బంధం ఏర్పరచుకుని కరగని సమ్మేళనాలను ఏర్పరస్తుంది. ఎప్పుడైతే నానబెట్టకుండా తింటామో..ఫలితంగా జీర్ణవ్యవస్థ గుండా శోషించబడకుండానే ప్రయాణిస్తుందట. ఎప్పుడైతే మనం బాదం పప్పులను 12 గంటల పాటు నానాబెడితే..ఫైటిక్ ఆమ్లం పరిమాణం 50 శాతం వరకు గణనీయంగా తగ్గుతుందట. తద్వారా బంధింపబడే ఉండే ఖనిజాల లభ్యత సులభం అవుతుందట. అంటే నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లంలో గట్టిగా బంధిపబడి ఉన్న కీలకమైన ఖనిజాలన్ని శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇలా నానబెట్టడం శరీరానికి కావాల్సిన ఇనుము సులభంగా అందుతుందని పరిశోధనల్లో తేలింది. నానబెట్టడం వల్ల దానిలోని పోషకాలు, ఖనిజాలను సులభంగా శోషించుకునే శాతం మెరుగ్గా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాదు నానబెట్టడం వల్ల గింజలు ఉత్తేజితమై..మెలకెత్తే ప్రక్రియను ప్రారంభించే ఎంజైములు సైతం యాక్టివ్ అవుతాయట. దీని వల్ల బి విటమిన్ పరిమాణం పెరుగుతుందట. అంటే ఇలా అన్ని గంటల పాటు నానడం వల్ల బాదం పప్పులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు నేరుగా అందేలా సులభంగా జీర్ణం అవుతుంది. పైగా మన శరీరానికి అన్ని పోషకాలు అందుతాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. అదే అలానే బాదం పప్పులు గట్టిగానే తినేస్తే..శరీరం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బందిపడటమే కాకుండా..దానిలో ఉన్న ప్రోటీన్లు మన శరీరానికి అందవని, పైగా ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. సుమారు 12 నుంచి 24 గంటల వరకు నానబెట్టే సమయం పెరిగే కొద్ది ఎంజైమ్ క్రియాశీలత, పోషకాల లభ్యత క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత పూర్తిగా కడగడం వల్ల ఎంజైమ్ల నిరోధకం అయిన ఫైటిక్ అమ్లం పూర్తిగా తొలిగిపోతుందని చెబుతున్నారు. కాబట్టి నానబెట్టే బాదం గింజలు తినడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.(చదవండి: ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?) -
'పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ అంటే..?
అది కీలకమైన మెదడు కణమైనా.... లేదా కాళ్లూ చేతుల్లో ఉండే మామూలు కణమైనా... అది ఏదైనా సరే... దేహంలోని ప్రతి జీవకణానికీఆహారం, ఆక్సిజన్ అందడం అవసరం. ఒకవేళ అలా అందకపోతే... కీలకమైన మెదడూ, గుండె లాంటి వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో... మనం అంత ప్రధానం అనుకోని మిగతా కణజాలానికీ అలాంటి ప్రమాదమే జరుగుతుంది. అంటే... కాళ్లూ, చేతుల విషయంలోనూ జరుగుతుంది. అలా కణజాలానికి తగినంత ఆక్సిజన్, ఆహారం అందనందువల్ల వచ్చే అనారోగ్యం... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’. ఈ సమస్య ఏమిటో, దానితో వాటిల్లో అనర్థాలేమిటో చూద్దాం...మన కాళ్లూ, చేతుల్లోని ప్రతి కణానికీ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడే అవి సమర్థంగా తమ విధులు నిర్వహించగలుగుతాయి. ఏదైనా కారణాల వల్ల మన కాళ్లూ, చేతులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటంగానీ లేదా వాటిల్లో కొవ్వు పేరుకోవడంగానీ జరిగితే... నిరంతరమూ కొనసాగాల్సిన రక్తసరఫరా సాఫీగా జరగకపోవచ్చు. అలా రక్తసరఫరా జరగనందువల్ల వచ్చే ఆరోగ్య సమస్యను ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ (ప్యాడ్) అంటారు. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే ఈ వ్యాధి స్త్రీలూ, పురుషులూ అనే తేడాలేకుండా అందరిలో కనిపించే అవకాశముంది. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ ఉన్నవారిలో కాళ్లలోని పిక్కలు, నడుం కింది భాగం (హిప్)లో తరచూ తీవ్రమైన నొప్పితో కూడిన తిమ్మిర్లు (క్రాంప్స్) వస్తాయి. చాలా సందర్భాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లక్షణం... అంటే పిక్కలు పట్టేయడం ఎక్కువగా కనిపింవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అంటే ఆ సమయంలో కాలూ, చేతిలోని సదరు భాగానికి తగినంత రక్తసరఫరా అందకపోవడం వల్లనే ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశాముంది. ఇలాంటప్పుడు ఆ భాగానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వగానే ఆ నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. కొందరిలో తాత్కాలికంగా స్పర్శ తెలియకుండా పోవడం (నంబ్నెస్) లేదా సూదులతో పొట్లుగా అనిపించడం (టింజ్లింగ్). మరికొందరిలో ఒక్కోసారి ఆ కాలు లేదా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపించవచ్చు. ఇంకొందరిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాలకింద మంటగా ఉన్నట్లుగా లేదా పాదాలు, కాలివేళ్ల కింది భాగంలో నొప్పిగానూ, మంటగానూ ఉన్నట్లు అనిపించడం. ఇక కొందరిలో పాదాలకు లేదా కాలి కింది భాగంలో ఏదైనా పుండు వంటిది వస్తే అది ఒక పట్టాన మానకపోచ్చు.పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీస్ తర్వాతి దశలో కాలు/చేయి తాలూకు రంగు మారడం, అది చల్లబారినట్లుగా ఉండటం మామూలే. ఈ దశలో కొంతమందిలో కాలు /చేతి పైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపో ఇక రక్తసరఫరాకు పూర్తిగా ఆటంకం ఏర్పడి గ్యాంగ్రీన్లా పరిణమించిన కొందరిలో... కాలు / చేయి తొలగించాల్సిన (యాంప్యుటేషన్కు వెళ్లాల్సినంత) తీవ్రమైన పరిస్థితి కూడా రావచ్చు.గుండె జబ్బులకూ/ స్ట్రోక్కూ అవకాశం:పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే అది కేవలం కాలూ, చేతికే పరిమితం అవుతుందనేందుకు వీల్లేదు. అంటే... ఎవరిలోనైనా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందంటే ఆ వ్యక్తిలో రక్తం సాఫీగా ప్రవహించేలాంటి తత్వం (టెండెన్సీ) లేదని అర్థం. ఇది కాళ్లూ, చేతుల్లోనే ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కీలకమైన అవయవాలైన గుండె లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అదెంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్నవారికి గుండెపో పక్షవాతం ముప్పుండే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. నిర్థారణ: ఫిజికల్గా బయటకు కనిపించే లక్షణాలతోపాటు... ‘పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్’ను నిర్ధారణ చేయడానికి ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ (ఏబీఐ) అనే పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ఎంతమాత్రమూ నొప్పి ఉండదు. ఈ పరీక్షలో అల్ట్రా సౌండ్ తరంగాల సహాయంతో భుజాలు / పాదాలు ఉండాల్సిన రక్తపోటునుకొలుస్తారు. ఈ ఏబీఐ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలనూ, వ్యాధి ఉందని అనుమానిస్తున్న వ్యక్తిలోని రిస్క్ ఫ్యాక్టర్లనూ సరిపోల్చి చూస్తారు. ఈ పరిశీలన తర్వాత... వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని ఫిజీషియన్ నిర్ణయిస్తారు. ఏబీఐ టెస్ట్లో... మొదట భుజం లేదా చేతిలోని రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)ను... మామూలు బీపీ యంత్రంలో కొలవడంతోపాటు, డాప్లర్ అని పిలిచే ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ స్టెతస్కోపు సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ వ్యాధినిర్థారణ కోసం శరీరంపై గాటు పెట్టకుండా కూడా నిర్ధారణ చేసే (నాన్ ఇన్వేజివ్) పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమేజింగ్ టెక్నిక్స్ సహాయంతో ఈ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు... మాగ్నెటిక్ రిజోనెన్స్ యాంజియోగ్రఫీ (ఎమ్మార్ఏ), సీటీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్ టెక్నిక్స్ వంటి పరీక్షలు ఈ వ్యాధినిర్ధారణకు తోడ్పడతాయి.ఈ వ్యాధి ఎవరెవరిలోనంటే.. వయసు యాభై ఏళ్లు పైబడ్డ ఏ వ్యక్తిలోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పెరిగే వయసు(ఏజింగ్)తోపాటు మరికొన్ని అంశాలూ ఈ వ్యాధికి కారణమవుతుంటాయి. అవి... పొగతాగే అలవాటు ఉండటం ∙వ్యాయామం చేయకపోవడం స్థూలకాయం ∙డయాబెటిస్ ∙నియంత్రణలో లేని రక్తపోటు / రక్తపోటు పెరగడం రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండటం ఈ లక్షణాలతో పాటు కుటుంబ సభ్యుల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉండటం అనేది ఆ ముప్పును మరింత పెంచే అంశం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకూ ‘ప్యాడ్’ రిస్క్ ఉందనే అంశాన్ని గుర్తెరిగి... దగ్గరి కుటుంబ సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.కారణాలు...పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది... రక్తనాళాల్లోపల రక్తం ప్రవహించే పైప్ లోపలి పొర గట్టిబారడం. ఈ కండిషన్ను అథెరోస్కీఫ్లోరోసిస్ అంటారు. నునుపుగా ఉండే తలం మీద ద్రవం ఎలాంటి అంతరాయమూ లేకుండా సాఫీగా జారిపోతుంటుంది. ఒకవేళ ఆ తలం గరుగ్గానూ, గట్టిబారినట్లుగా మారడం వల్ల రక్తసరఫరా సాఫీగా జరగదు. దాంతో రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలా రక్తనాళంలోని లోపలి తలం గరుగ్గా, గట్టిబారినట్లుగా మారడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి రక్తప్రవాహం సాఫీగా వెళ్లే ఆ పైప్లోపలి తలంపై అంటుకుని అక్కడ గారలా ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి అంతరాయాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. దాంతో ఒకచోట క్రమంగా రక్తానికి ఏదైనా తట్టుకుంటూ తట్టుకుంటూ ఉండటం వల్ల క్రమంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లుగా ఓ ఉండలాగా (క్లాట్స్) ఏర్పడవచ్చు. ఇది ఒక్కోసారి రక్తనాళాన్ని బ్లాక్ చేసి రక్తసరఫరాను అపేయవచ్చు.చికిత్సపెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కు చికిత్స చేసే ముందర బాధితుల ఫిట్నెస్, వ్యాధి తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కేవలం బాధితుడి జీవనశైలిలో మార్పులు చేయడంతోనే వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశముంది.ఉదాహరణకు బాధితుడికి పొగతాగే అలవాటు ఉంటే, పూర్తిగా మానేయడం ద్వారా మున్ముందు కాలూ / చేయి కోల్పోయే పరిస్థితి తప్పిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులతో పాటు, వ్యాధి మరింత ముదరకుండా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు మూసుకుపోయిన చోట వాటిని తెరచేందుకు అవసరమైన చికిత్స ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.వాడాల్సిన మందులురక్తనాళాలు మూసుకుపోవడం అన్నది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల జరుగుతుంటే దేహంలో కొలెస్ట్రాల్ మోతాదులను నియంత్రించడానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో కాలు /చేయి తిమ్మిర్లు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా మందులు వాడాల్సి రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ (క్లాట్)ను కరిగించే మందులూ ఉపయోగించాల్సి రావచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు బాధితులకు రక్తపోటును నియంత్రించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.ఒకవేళ జీవనశైలి మార్పులూ... మందులూ సరిపోకపోతే?కొందరిలో కేవలం జీవనశైలి మార్పులతోనూ లేదా మందులు వాడటం వల్ల గాని ఈ జబ్బు అదుపులోకి రాకపోతే అప్పుడు కూడా రక్తనాళాల్లో రక్తసరఫరాను సాఫీగా జరిగేలా చూడటానికి అనేక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... ఎక్కడైతే రక్తసరఫరాకు అడ్డంకి ఏర్పడి... తట్టుకుంటూ రక్తసరఫరా జరుగుతుంటుందో ఆ ప్రాంతాన్ని అక్కడికక్కడే తెరచి సాధారణ రక్తసరఫరాను పునరుద్ధరించవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియను గతంలోలా సంప్రదాయిక సర్జరీ రూపంలోగాక ఎలాంటి గాటూ లేకుండానే కొన్ని ప్రక్రియల ద్వారా చేయడమిప్పుడు సాధ్యమవుతుంది.గాటు పెట్టకుండా రక్తప్రవాహాన్ని సరిచేయడం ఇలా...రక్తప్రవాహానికి అడ్డుపడ్డ క్లాట్ను తొలగించి, రక్తసరఫరాను పునరుద్ధరించడానికి ఈ కింది పద్ధతులను అవలంబిస్తారు. యాంజియోప్లాస్టీ : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు చేసినట్లుగానే కాళ్లూ/ చేతుల తాలూకు రక్తనాళంలోనూ... అడ్డు పడ్డ ప్రాంతానికి ఒక బెలూన్ లాంటి దాన్ని పంపి... ఆ బెలూన్ను రక్తం ఆగిన చోట ఉబ్బేలా చేస్తారు. దాంతో రక్తనాళంలోని ఆ ప్రదేశంలో అడ్డు తొలగిపోయి, రక్తసరఫరా మామూలుగా అవుతుంది.అథెరెక్టమీ: ఈ ప్రక్రియలో రక్తనాళం (ధమని)లోకి ఒక క్యాథెటర్ను పంపుతారు. రక్తనాళంలోకి వెళ్లే ఒక నునుపైన పైప్ లాంటి దాన్ని క్యాథెటర్ అంటారు. దీని ద్వారా రక్తనాళం లోపలి ఉన్న గారను తొలగిస్తారు. గట్టిగా మారి ఉన్న ప్రాంతాన్ని నున్నగా అయ్యేలా చేయడం, లేదా షేవ్ చేసినట్లుగా నునుపుగా మార్చడం జరుగుతుంది.స్టెంట్ వేయడం: గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళం సన్నబడ్డప్పుడు ఆ సన్నటి ప్రాంతాన్ని మళ్లీ మామూలుగానే తెరుచుకుని ఉంచేలా చేస్తారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి పైప్ లాంటి దాన్ని వేసి తెరచి ఉండేలా చేసినట్లే (స్టెంట్ వేసినట్లే)... అచ్చం అదే తరహాలో కాలు / చేతిలోని రక్తనాళాల్లోని మూసుకుపోయి ఉన్నభాగానికి ఒక స్టెంట్ వేస్తారు. దాంతో మూసుకుపోయిన భాగం తెరచుకుంటుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం లేకుండా రక్తసరఫరా సాఫీగా జరిగిపోతుంది. స్టెంట్ గ్రాఫ్ట్స్: కొన్ని సందర్భాల్లో ఈ స్టెంట్లలో సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటిదాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కేవలం ఇలాంటి మార్గాలే కాకుండా కొన్నిసార్లు సాంప్రదాయికంగా చేసే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళంలో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తనాళం అంతా మూసుకుపోతే బైపాస్ కూడా చేయాల్సి రావచ్చు. వ్యాయామం లేకుండా ఉండటం వంటి బద్ధకంగా ఉండే జీవనశైలి, పొగతాగడం వంటి దురలవాట్ల కంటే మన దేహంలోని అవయవాలు విలువైనవి కాబట్టి... అలాంటి దురలవాట్లను వదులుకొని, చురుకైన జీవితం గడపడం అవసరం. దాంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగించవచ్చు.డాక్టర్ రాజా వి కొప్పాల సీనియర్ ఇంటర్వెన్షనల్ , రేడియాలజిస్ట్నిర్వహణ: యాసీన్చదవండి: అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..! నో ఐస్ బాత్, నో క్రేజీ డిటాక్స్.. -
రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య..
కొన్ని కథలు డేరింగ్ నిర్ణయాలు ఎలా తెసుకోవాలో తెలియజేస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి రిస్క్ తీసుకోవడానికి చాలా కంగారుపడిపోతాం. కానీ మనలాంటి వారెందరో అదే బాటలో పయనించి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కథలు వింటే ధైర్యంగా అడుగు వేసే ప్రయత్నం చేయడమే కాదు..ఏనాటికైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంతో తనతో ఎలా ప్రవర్తించిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అశ్వనీ కుమార్ అనే పారిశ్రామిక వేత్త 40 ఏళ్ల వయసులో ఏకంగా రూ. 300 కోట్ల కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేసున్నాడు. అధికజీతం, విదేశీ పర్యటను, ఏసీ క్యాబిన్లతో బిందాస్గా సాగిపోతోంది లైఫ్. ఏ చీకు చింత లేదు అయినా సరే మనోడు మానసిక ప్రశాంతతే ప్రధానం అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తత్ క్షణమే తన తల్లి తనతో మాట్లాడటే మానేసిందని, భార్య తనకు పిచ్చి పట్టిందేమో అన్నట్లుగా చూసిన చూపుని ఇప్పటికీ మర్చిపోలేనంటున్నాడు. ఆయన సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికాడు. అనుకున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడిగా మారి విజయవంతంగా సొంతంగా బ్రాండ్ని నిర్మించే రేంజ్కు చేరుకున్నాడు. సొంతంగా వ్యాపారం లేదా ఇంకేదైనా ప్రారంభించాలనుకునేవారికి తన కథ స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నా అంటూ తన వ్యక్తిగత సాహసోపేతమైన జర్నీ గురించి వివరించాడు. నెటిజన్లు ఇది నిజంగా ప్రేరణకు పరాకాష్ట అని కొందరు, మరికొంతమంది మీ కథ అసలైన స్ఫూర్తి అంటూ అశ్విని కుమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashwani kumar (@thedhandhaguru) (చదవండి: వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..) -
వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే కోర్టు మెట్లు ఎక్కి విడిపోతున్న జంటలు కోకొల్లలు. తీవ్రంగా పరిగణించాల్సిన సమస్యలేవి లేకపోయినా..విడాకులు కోరుతుండటం బాధకరం. ఇక్కడ ఈ కేసులో కూడా అలాంటి వింతే చోటు చేసుకుంది. కేవలం భార్యకు వంట రాదని విడాకులు ఇవ్వమంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు భర్త. అతడికి ధర్మాసనం దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి చివాట్లు పెట్టింది. అసలేం జరిగిందంటే..ఈ జంటలకు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే వివాదాలు మొదలయ్యాయి. అదే సంవత్సంరలో అతడు "మానసిక క్రూరత్వం" అనే కారణంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు వంట చేయడం రాదని, ఆమె మొరటుగా, మాట వినకుండా ఉంటుందని, ఇంటి పనులను సరిగ్గా చేయలేదని, దీనివల్ల తనకు మానసిక ఒత్తిడి కలిగిందని ఆరోపణలు చేశాడు. పైగా వైవాహిక చట్టం ప్రకారం ఈ చర్యలు క్రూరత్వం కిందకు వస్తాయని కూడా అతను వాదించాడు.అయితే భార్య ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. వాస్తవానికి, పాత్రలు కడగడం, శుభ్రం చేయడం, వంట చేయడం వంటి అన్ని ఇంటి పనులను తనతోనే చేయించారని, మిగిలిపోయిన ఆహారాన్ని కూడా తినమని బలవంతం చేశారని ఆమె పేర్కొంది.ధర్మాసనం ఏం చెప్పిందంటే..జస్టిస్ భారతి డాంగ్రే మరియు జస్టిస్ మంజుషా దేశ్పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాహం అనేది సమానుల భాగస్వామ్యం, అంతేగాని సేవా ఒప్పందం కాదు. భార్యను పనిమనిషిగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. వంట చేయడం లేదా శుభ్రపరచడం వంటి పనులు చేయడంలో విఫలమైనంత మాత్రాన అది మానసిక క్రూరత్వంగా పరగణించలేమని పేర్కొంది. వివాహం జరిగిన తొలినాళ్లలో జరిగిన అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసుకునే ధోరణిలో చూడాలి తప్ప క్రూరత్వ ఆరోపణల కిందకు రాదంటూ మండిపడింది. పైగా ఫ్యామిలీ కోర్టు 2010లో భార్య ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతుల కోసం ఇచ్చిన ప్రకటన ఆధారంగా స్వతంత్రంగా సంపాదించుకోగలదని నిర్థారించి, ఆమెకు భరణం నిరాకరిస్తూ.. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సవాలు చేస్తూ భార్య ముంబై హైకోర్టుని ఆశ్రియంచింది. ఆ నేపథ్యంలోనే ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు తీర్పుని కొట్టివేస్తూ..చిన్న తరహా కార్యకలాపాలను ఆదాయానికి రుజువుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాగే విడాకుల కేసులలో చట్టపరంగా మానసిక క్రూరత్వం అంటే ఏమిటో కూడా ధర్మాసనం వివరించింది. క్రూరత్వంలో అవమానం, భావోద్వేగ బాధ కలిగించే లేదా వివాహాన్ని కొనసాగించడం అసాధ్యం చేసే తీవ్రమైన ప్రవర్తన ఉండాలని పేర్కొంటూ విడాకులను రద్దు చేసింది. అలాగే భర్తను నెలకు రూ. 20,000 చెల్లించాలని అదేశించింది. (చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ) -
ప్రపంచంలో ఎన్ని రకాల కోకిలలు ఉన్నాయో తెలుసా?
వసంతకాలం వచ్చిందంటే లేతచివుళ్లు ఆరగించి "కుహూ.. కుహూ.. రాగాలతో మనల్ని ఆదరించే పక్షి కోకిల. దాని గాత్రం అంత మధురం కాబట్టే, గాన కోకిల అంటారు. ముఖ్యంగా వసంత కాలంలో మగ కోకిలలు పాడే రాగాలు ప్రకృతికి ప్రాణం పోస్తాయి. కోకిలలు తమ సొంత గూళ్ళను నిర్మించుకోవు. ఆడ కోకిలలు కాకులు లేదా ఇతర చిన్న పక్షుల గూళ్ళను కనిపెట్టి, వాటి గూటిలో తమ గుడ్లను పెడతాయి. వీటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చూద్దామా.ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి. వీటి ప్రధాన ఆహారం...గొంగళి పురుగులు. ఆకులు, పండ్లు కూడా తింటాయి కానీ, గొంగళి పురుగులను చాలా ఇష్టంగా తింటాయి! కాకికీ కోకిలకీ తేడా కనిపెట్టాలంటే వాటి ఈకలు చూడాలి. మగ కోకిల మెడ నుంచి తల వరకూ నలుపు కాకుండా నీలం, బూడిదరంగు కలిసినట్టుగా ఉంటుంది. కొన్ని ఆడవి కూడా ఇలానే ఉంటాయి కానీ... వాటికి ఛాతీమీద ఈకల రంగు ముదురుగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ఎరుపు, బ్రౌన్ కలర్స్లో కూడా ఉంటాయి. కాకపోతే... అత్యంత దగ్గర్నుంచి చూస్తే తప్ప ఈ తేడాలను మనం గమనించలేం! వీటి రెక్కలు పొడవుగా, సూదిగా ఉంటాయి. ముక్కు కూడా సూదిగా ఉంటుంది. ఎగిరినప్పుడు కాస్త గద్దల మాదిరిగా కనిపిస్తాయివి! వేసవికాలం కోకిలలకు సంతానోత్పత్తి కాలం. మగ కోకిల ప్రధానంగా ఆడ కోకిలను ఆకర్షించడానికి పాడుతుంది. దాని పాట ఆడ కోకిలలకు సంభోగ సంకేతంగా పనిచేస్తుంది. ఇవి గూళ్లు కట్టుకోవు. పిల్లల్ని పొదగవు. వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. పట్టుకు పది నుంచి 22 గుడ్లు పెడతాయి. అయితే అన్నీ ఒక గూటిలో పెట్టవు. వేర్వేరు చోట్ల పెడతాయి. ఆయా పక్షులన్నీ తమ గుడ్లతో పాటు తన గుడ్లను పొదుదుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉంటాయి. -
అక్కడ గంగానదిలో పిల్లలు గాజు ముక్కతో ఎందుకలా వెతుకుతారో తెలుసా..!
భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు గంగానది ఒడ్డున పిల్లలు గాజుముక్కతో ఏదో వెదుకుతూ, ఆడుతుండటం చూస్తుంటారు. ఈ దృశ్యం చూడడానికి ఎంతో ఉల్లాసంగానూ, ముచ్చటగా కనిపించినా.. దాని వెనక ఎంతో సహనం, ఓర్పు, శ్రమ కూడుకుని ఉంటుందని తెలుసా? నిజానికి పిల్లలు ఎందుకలా చూస్తుంటారు? ఇంతకీ ఏం వెతుకుతుంటారనేది తెలుసుకుందాం!గంగానది మన దేశ విశ్వాసానికి, సంస్కృతికి గొప్ప ప్రతీక. ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలతో పుణ్యక్షేత్రాలు కిటకిటలాడటం, వేలాదిమంది తరలి రావటంవంటి దృశ్యం ఒకవంతు అయితే, గంగానది తీరంలో నివసిస్తున్న కొంతమంది పిల్లల జీవితాలు మరోవంతు. ఆ తీరంతో వారి జీవితాలే ముడిపడి ఉన్నాయి. ప్రజలు పూజ చేసేటప్పుడు, తరచుగా నాణెములు, విలువైన వస్తువులను, ఆభరణాలను వారి మొక్కుబడిగా నదిలో విసిరేస్తారు. కాలక్రమేణా.. ఇవి నీటి అడుగున పూడుకుపోతాయి. అలా నీటి అడుగున స్పష్టంగా చూడడానికి ఈ గాజుముక్క వారికి ఎంతగానో సహాయపడుతుంది. దాంతో పిల్లలు నీటిలో పడిపోయిన పాత నాణేలు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల కోసం వెతుకుతుంటారు. కొన్నిసార్లు గంటల తరబడి చూస్తున్నాగానీ వారికి ఏమీ దొరకదు.నిజానికి ఈ గాజుముక్క వారికి ఎలా ఉపయోగపడుతుందంటే? నీటి ఉపరితలంపై పడే సూర్యకాంతి కింద ఉన్న దృశ్యాన్ని అస్పష్టంగా మారుస్తుంది. ఆ పరిస్థితులలో పిల్లలు గాజును ఒక ప్రత్యేక పద్ధతిగా.. నీటిలో ముంచడంతో సూర్యకాంతి తగ్గి, నది అడుగున ఉన్న వస్తువులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా వెతకడం చూడడానికి చాలా సులభంగా అనిపించినా, గంటల తరబడి కష్టపడినా పిల్లలకు ఏమీ దొరకదు. కానీ అదృష్టం కలిసొచ్చి పాత వెండి ఆభరణాలు, విలువైన నాణాలు, ఏదైనా లోహ వస్తువు దొరికితే లాభం పొందవచ్చనేది వారి ఆశ.కొందరు దీనిని అదృష్టంతో కూడిన ఆటగా భావిస్తే, మరికొందరు ఇది కఠోర శ్రమ, నైపుణ్యానికి సంబంధించిన విషయమని అంటారు. నిజం ఏమిటంటే? ఈ నది తీరాన నివసిస్తున్న పిల్లలు తమ ఇంటి ఖర్చులు తీర్చడానికో? కుటుంబ కష్టాలను తగ్గించడానికో ఉపయోగపడే ఏదైనా వస్తువు గంగానదిలో దొరుకుతుందని ఇలా వెతుకుతుంటారు. వీటిని పురాతన వస్తువుల సేకర్తలు అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. ఆ ఆశతో పిల్లలు ప్రతిరోజూ గంగా నది ఒడ్డుకు తరలివస్తుంటారు.చూడటానికి ఇదొక ఆటలా అనిపించినా, ఈ పని చాలా ప్రమాదకరమైనది. నదిలోని బలమైన ప్రవాహాలు, లోతైన నీటిస్థలాలు, జారే నేల తరచుగా ప్రమాదాలకు దారితీస్తాయి. స్థానికంగా నివసిస్తున్న పిల్లలు నదిలోకి దిగి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కొన్నిసార్లు గాయపడతారు కూడా. గాజు ముక్కతో గంగానదిలోకి తొంగిచూస్తున్న ఈ పిల్లలు కేవలం వస్తువుల కోసం వెతకడమే కాదు, తమ అదృష్టాన్ని కూడా పరీక్షిస్తుంటారు. -
అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా 47 ఏళ్ల మామ్..!
40 ప్లస్ అనగానే వృద్ధాప్య ఛాయలు ప్రారంభమవుతుంటాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అటాక్ అయ్యే సమయం కూడా. ఈ వయసులోనే అత్యంత కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఇక్కడొ తల్లి 47 ఏళ్ల వయసులో కూడా పదహారణాల అమ్మాయిలా అందర్నీ ఆకర్షిస్తుంది. అచ్చం సంతూర్ యాడ్ మాదిరిగా ఆ పిల్లల తల్లి యంగ్లుక్లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా యవ్వనంగా కాంతింగా కనిపించేందుకు ఆమె ఏమి ఐస్బాత్లు, విపరీతమైన డిటాక్స్లు ఫాలో అవ్వనని చెబుతోందామె. కేవలం సాధారణ దినచర్యతోనే ఇలాంటి యవ్వనపు లుక్ని సొంతం చేసుకోవచ్చని అంటోంది. అవేంటంటే..చెఫ్ కమ్ డైటీషియన్ రాఖీ గనేరివాల్ ఇద్దరు పిల్లల తల్లి 47 ఏళ్ల వయసులోనే ఎంతో అందంగా ఆకర్షణీయమైన లుక్లో ఉంటారామె. అందుకోసం కేవలం పది సాధారణ పనులనే చేస్తానని అంటోంది. తీవ్రమైన వెల్నెస్ ట్రెండ్ల కంటే..నిలకడకే ప్రాధాన్యత ఇస్తానంటోంది.చురుగ్గా ఉండటం..ప్రతిరోజూ పదివేలకు పైగా అడుగులు వేస్తానని చెబుతుంది. ఇంటి పనులు దగ్గర నుంచి ఉద్యోగ విధుల వరకు అన్నీ చురుగ్గా చేస్తానని చెబుతుంది. అయితే ఒక వ్యూహంలా చేసుకుంటూ పోతానంటోంది. అయితే ఎంత తీరిక లేకపోయినా..ఒక గంట పాటు వర్కౌట్లు చేసేందుకు కట్టుబడి ఉంటానంటోంది. రోజంతా బాడీ వెయిట్, స్క్వాట్స్, క్యాల్ఫ్ రైజర్ వంటి వ్యాయామాలు చేస్తానని చెబుతోంది. అయితే సాధారణ చిన్న చిన్న వ్యాయామాలే చాలా ప్రభావవంతంగా ఉంటాయని అంటోంది.డిజిటల్ డిటాక్స్..అలాగే రాత్రినిద్రపోయే ముందు, రోజులో మొదటి మూడు గంటలు ఫోన్కి దూరంగా ఉంటానని అంటున్నారు. దీనివల్ల నాడివ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. పైగా ఒత్తిడిని నియంత్రించి మంచిగా నిద్రపోగలుగుతామని అంటున్నారామె.మంచి ఆహారం..ప్రతి ఉదయం నిమ్మరసం,కొబ్బరి నూనె డ్రింక్తో రోజుని ప్రారంభిస్తుందట. ఇది రోజంత శక్తిమంతంగా ఉండేలా చేసి ఆకలి కోరికలను నియంత్రిస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయట. కడుపు నిండిన భావన కోసం రోజూ 110–120 గ్రాముల ప్రోటీన్ని తీసుకునేలా కేర్ తీసుకుంటారట. సాధారణంగా నిద్రలేచిన గంటలోపు ప్రోటీన్ పౌడర్ను తీసుకుని, ఆ తర్వాత గుడ్లు, పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, వంటి ఇతర ఆహారాలను తీసుకుంటుందట. అయితే అన్నింట్లకంటే ముఖ్యం మూడు లీటర్ల నీళ్లు తాగడం అనేది కీలకం అంటోంది. రోజూ రెండు పండ్లు తప్పనిసరి అని చెబుతోంది. అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలనే సాధారణ చిన్న చిన్న పనులతోనే ఇదంతా సాధ్యమని అంటోందామె. పరిపూర్ణత కంటే నిలకడక పాటించేందుకు ప్రాధాన్యత ఇవ్వమని కోరుతోంది. View this post on Instagram A post shared by Chef-Dietitian Raakhi Ganerriwal (@raakhiganerriwal)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!: డేటింగ్ యాప్ సీఈఓ) -
విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!?
భారతదేశంలో విడాకులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. పైగా చాలా జంటలు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా..సమాజం కోసం లేదా మరే ఇతర కారణాల వల్లనో కొనసాగతుంటారు. ఆ బంధం ఊపిరాడనంతగా చేస్తున్నా బలవంతంగా కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే అలాంటి వివాహ బంధాన్నే భారత కుటుంబ వ్యవస్థ విజయవంతమైన వివాహ బంధంగా పేర్కొనడం విచిత్రం. ఇది నిజంగా ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీశారు నాట్ డేటింగ్ యాప్ సీఈవో. అసలు విజయవంతమైన వివాహ బంధం అంటే అసలే ఏంటి అంటూ సోషల్మీడియా వేదికగా చర్చ లేవదీస్తూ..తన అభిప్రాయన్ని పంచుకున్నారు.ఆయన ఏమన్నారంటే..ఇటీవల కాలంలో అసంతృప్తికరమైన వివాహాలు, భావోద్వేగ అనుకూలత గురించిన సంభాషణలు ఆన్లైన్లో సర్వసాధారణంగా మారాయి. ఆ నేపథ్యంలో నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు సీఈవో జస్వీర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న వివాహంలో కొనసాగడాన్ని విజయవంతమైన వైవాహికి బంధంగా పరగణించాలా అనే ప్రశ్నను లెవనెత్తారు. చాలామంది తమ ఆనందం కోసం కాకుండా సామాజిక అంచనాల కారణంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని వాదించారు. ఈ మేరకు జస్వీర్సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో ఇలా రాశారు. భారత దేశానికి తక్కువ విడాకులు రేట్లు అవసరం లేదు. ఊపిరాడకుండే చేసే వివాహాలు తక్కువగా కావాలన్నారు. భారత్లో విడాకులు రేట్లు తక్కువగా ఉన్నాయనేది గొప్పగా విజయం సాధించనట్లుగా గర్వంగా చెబుతుంటారు. కానీ లక్షలాదిమంది తమ వివాహ బంధంలో మానసికంగా చచ్చిపోయి, బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. వాళ్లంతా ప్రతిరోజూ తమ లోపల చనిపోతున్నారు. అందుకు ఉదాహరణ ట్విషా శర్మ ఉదంతమే. 30 ఏళ్ల వివాహం దాని విజయానికి తప్పనిసరిగా హామీ ఇవ్వదని, ఎందుకంటే కొంతమంది భాగస్వాములు నిజంగా కలిసి జీవించకుండా కేవలం ఒకరినొకరు భరిస్తారని పేర్కొన్నారు. సంతోషంగా లేని ఇద్దరు వ్యక్తులను దశాబ్దాల పాటు కలిసి ఉండమని బలవంతం చేయడం, విడాకుల కన్నా చాలా బాధాకరమైనది. మీరు ప్రతిరోజూ చిక్కుకుపోయినట్లుగా, మానసికంగా అలసిపోయినట్లుగా, ఒంటరిగా, ఊపిరాడనట్లుగా భావిస్తూ నిద్రలేస్తే, వాళ్లు ఒక వివాహాన్ని కాపాడటం లేదు. సమాజ పరువును కాపాడుతున్నారు, అని ఆ సీఈఓ పోస్ట్లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే భారతీయ కుటుంబాలు వివాహం అంటే సర్దుబాటు అని చెప్పి..కొనసాగించాడమే పరవు అని నొక్కి చెబుతుంది. ఆమె లేదా అతడు మానసికంగా లోలోపల కుంగిపోయినా అలా కాపురం చేస్తే..దాన్ని విజయవంతమైన వివాహం అనే చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా భావోద్వేగ బంధనం. ఇక్కడ విడాకులు నిషిద్ధంగా చూడకూడదు. జీవితాంతం దుఃఖంలో మునిగిపోవడమే నిషిద్ధం కావాలి అంటూ పోస్టుని ముగించారు. నెటిజన్లు ఆయన మాటలకు ఏకీభవిస్తూ భారతదేశంలో విడాకులను సాధారణీకరించాలి. మనకు విఫలమైన వ్యాపారాలు ఉన్నట్లే, విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయని అంగీకరించాలి, సాధారణ విషయంగా పరిగణించాలి. అయితే భారతదేశం సంతోషంగా కలిసి జీవించడాని కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుందని అదే అసలైన సమస్య అని పోస్టులు పెట్టారు. కాగా, ఈ చర్య మానసిక ఆరోగ్యం, విడాకులపై మారుతున్న అభిప్రాయాలను హైలెట్ చేసింది.(చదవండి: నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!) -
బియ్యం, మినప్పుతో పనిలేకుండా క్షణాల్లో దోసె చేసేయండిలా..!
మీరు ఇప్పటివరవకు ప్లెయిన్ దోసె నుంచి చీజ్, పనీర్ దోసల వరకు రుచి చూసి ఉంటారు. కానీ ఉన్నఫలంగా దోసె తినాలనిపించినప్పుడు.. తగిన పిండి, పులియబెట్టడంవంటి ప్రక్రియ ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితిలో దోసను మార్కెట్కు వెళ్లి లేదా ఆర్డర్ చేసి మాత్రమే తినగలం. కానీ పిండి అవసరం లేని ఈ దోస వంటకాన్ని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ మనతో పంచుకున్నారు.ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే? ఈ దోసె తయారీకి బియ్యం, పప్పులు, పిండి పదార్థాలు అవసరం లేదు. దీనికోసం కేవలం పాపడ్, నీళ్లు, నెయ్యి ఉంటే చాలు. పులియబెట్టే ప్రక్రియ లేకుండానే.. నిమిషాల్లో సూపర్ క్రిస్పీ 'పాపడ్ దోసె'ను తయారు చేసుకోవచ్చు. వైరల్ అవుతున్న ఈ రెసిపీతో కమ్మని రుచిని ఆశ్వాదించవచ్చు. క్షణాల్లో మీ ముందుండే ఈ పాపడ్ దోసెను ఎలా తయారు చేయాలో చూద్దాం!కావలసినవి:- పాపడ్- నీరు- నెయ్యితయారుచేసే విధానం:1. ముందుగా పాపడ్ను కత్తెరతో గానీ, చేతితో రెండు భాగాలుగా విరవండి.2. వాటిని నీటిలో వేసి కాసేపు నానబెట్టాలి. దీంతో పాపడ్ పూర్తిగా మెత్తగా అవడంతోపాటు కొద్దిగా జిగురుగా మారుతుంది.3. నానబెట్టిన పాపడ్ను మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయాలి. ఇదే మీ తక్షణ దోసె పిండి.4. ఒక బాణలిని వేడి చేసి, దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి, గరిటెతో పిండిని పోసి దోసెలాగా పలుచగా పరచాలి.5. అవసరమైతే కారం, ఉల్లిపాయలు కలిపి, పైన కొద్దిగా నెయ్యి వేసి దోసెను బాగా కాల్చండి. దీంతో.. కరకరలాడే పాపడ్ దోసె రెడీ. దీనిని చట్నీలో, సాంబార్తో కూడా వేడివేడిగా తినవచ్చు.ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..! -
ఎర్ర జామ వర్సెస్ తెల్ల జామ ఏది ఆరోగ్యానికి మంచిది?
సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే ఫ్రూట్.. జామ (Guava). ఇందులో విటమిన్ సీ తోపాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, సాధారణంగా మార్కెట్లలో మనకు తరచుగా రెండు రకాల జామకాయలు కనిపిస్తుంటాయి. ఒక రకానికి చెందినవి తెల్లగా ఉంటే, మరొకటి ఎర్రగా ఉంటుంది. ఈ తెల్ల జామ, ఎర్ర జామలు రెండూ పోషకాలతో నిండి ఉన్నప్పటికీ టేస్ట్, న్యూట్రిషన్ వాల్యూ, హెల్త్ బెనిఫిట్స్లో కాస్త విభిన్నంగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ మాటల్లో తెలుసుకుందామా.!.ఎర్ర జామ, తెల్ల జామ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. అయితే ఎర్ర జామలో నీటి శాతం ఎక్కువ, చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. తెల్ల జామలో విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. మధుమేహం (షుగర్) ఉన్నవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర జామ కొంత మేలు చేస్తుంది. రెండింటిని పోల్చి చూస్తే..తెల్ల జామకాయతెల్ల జామ ఎక్కువ తియ్యగా, రుచిగా ఉంటుంది. దీంట్లో షుగర్, స్టార్చ్, గింజల పరిమాణం అధికంగా ఉంటుంది. ఈ తెల్ల జామలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తెల్ల జామను తింటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైజేషన్ మెరుగై బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. బ్లడ్లో షుగర్ లెవల్స్ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మహిళలకు తెల్ల జామతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ కణాలకు హైడ్రేషన్ని పెంచి తాజాగా ఉండేలా చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి ఈ వ్యాధి ముప్పుని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్త పరంగా తెల్లజామకాయ బెస్ట్ అని చెబుతున్నారు ఆదర్శ గౌడ. డయాబెటిస్ పేషెంట్లకు ఎర్రజామ మేలు..ఎర్ర జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తెల్ల జామతో పోలిస్తే షుగర్, స్టార్చ్, విటమిన్ C కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ ఎర్రజామలో గింజలు అంత ఎక్కువగా ఉండవు. లైకోపీన్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, కెరోటినాయిడ్ల కారణంగా దీనిలోని గుజ్జుకి ఎరుపు రంగు వస్తుంది. ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉండటంతో గుండెకు రక్షణగా నిలుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ A, ఒమేగా-3, ఒమేగా- 6 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్తో నిండి ఉండటంతో డైజేషన్ మెరుగై వెయిట్ మేనేజ్మెంట్కు తోడ్పడుతుంది. ఇందులో చక్కెర కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది.అయితే రక్తంలో చక్కెరను తగ్గించే మందులు తీసుకుంటుంటే జామకాయను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత వెంటనే జామ పండ్లు తినకూడదు. ఎందుకంటే జామ తినడం వల్ల రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు ఆదర్శ గౌడ .(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?) -
శ్రమశక్తికి ‘సలాం’...
‘కష్టం వస్తే కాడిపట్టగల.. అవసరమైతే గన్నీ సంచులూ మోయగలం. ఇల్లు అలకడం వంట చెయ్యడమే కాదు.. సమాజం కష్టాల్లో ఉంటే ఆదుకోవడమూ మాకు తెలుసు’ అంటూ మగవారికే పరిమితం అనుకున్న హమాలీ పనిలోనూ తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మహిళలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పెద్దంపేట్, ధర్మారం మండలం కమ్మర్ఖాన్ పేట గ్రామాల్లో ఒక అద్భుతం జరిగింది. మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసి ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనన్న రైతుల ఆందోళనను చూస్తూ ఆ గ్రామ మహిళలు చేతులు ముడుచుకుని కూర్చోలేక పోయారు. ‘మగవారే చేయాలి అనే పని ఏదీ లేదు.. రైతు కష్టం మా కళ్లముందే వృథా కాకూడదు’ అంటూ ఇంటి పనులకే పరిమితమయ్యే ఆ చేతులు.. ఒక్కసారిగా గన్నీ సంచులను అందుకున్నాయి. శ్రమను నమ్ముకున్న ఆ భుజాలు.. క్వింటాళ్ల కొద్దీ ధాన్యం బస్తాలను మోసేందుకు సిద్ధమయ్యాయి. మండుటెండను, అకాల వర్షపు ముప్పును లెక్కచేయకుండా, ఒకరు గన్నీసంచుల్లో ధాన్యం నింపుతుంటే.. వాటిని మోసి తూకం వద్దకు తీసుకెళ్లడం, వరుసగా పేర్చడం వంటి పనులు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నారు. పనికి ఫలితంగా క్వింటాకు రూ.25 చొప్పున వేతనం అందుకుంటున్నారు. సాధారణంగా మగవారే చేయగలరని భావించే అత్యంత కష్టమైన హమలీ పనిని, ఆ మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఐకమత్యంతో చేసి చూపించారు. మండుటెండైనా చెమటలు కారుతున్నా అలసట ముంచుకొస్తున్నా వారి అడుగులు ఆగలేదు. అన్నదాత ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో వారు హమాలీలుగా మారిపోయారు. సమాజం తరచూ మహిళలను ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసే భావనను ఆ మహిళలు చెదరగొట్టారు. వారు కేవలం గన్నీ సంచులు మాత్రమే మోయలేదు. మహిళలపై ఉన్న అపోహలను కూడా తమ భుజాలపై మోసి దూరంగా విసిరేశారు. వారి ఐకమత్యం చూసి రైతులు ‘‘మా ధాన్యం కాపాడారు మా కష్టం వృథా కాకుండా చేశారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.హమాలీల కొరతతో...మా ఊర్లోని కొనుగోలు కేంద్రంలో హమాలీ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు చూడలేక కొంతమంది మహిళలం రెండు గ్రూప్లుగా మారి ధాన్యాన్ని బస్తాల్లో నింపడం, నింపిన బస్తాలను కాంటా వేయటం, కాంటా వేసిన బస్తాలను ఒక క్రమపద్ధతి లో అమర్చటం చేస్తున్నాం. ఇందుకు రైతులు క్వింటాకు రూ.25 రూపాయలు ఇస్తున్నారు. దీంతో మాకు ఉపాధి దొరుకుతుంది. రైతులకు మేలు జరుగుతుంది.– బోయిని లక్ష్మి, పెద్దంపేటరైతన్నలకు ఆసరాగా...బెంగాల్ ఎన్నికలకు హమాలీలు పోవడంతో, వడ్లు, మొక్కజొన్న పంట కాటా వేయటంలో జాప్యం జరుగుతోంది. దీంతో మావాడ కట్టు వాళ్లం అందరం కలిసి గ్రూప్గా ఏర్పడి కాంటా వేయడం లాంటి పనులు చేస్తున్నాం. మేము జోకిన బస్తాలను మగ హమాలీలు లారీల్లో లోడ్ చేస్తారు. దీంతో సమయం కలిసి వచ్చి రైతన్నలకు ఆసరా అవుతుంది. – దబ్బెట స్వప్న, పెద్దంపేటఎండ రాకముందే...అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో హమాలీల సేవలు సరిపోక, ధాన్యం కాంటా వేయటానికి జాప్యం జరుగుతోంది. దీంతో మేమే హమాలీలుగా అవతారమెత్తాం. ఎండరాకముందే ఉదయం 11 లోపు తూకం వేసి కాంటాలు పెడుతున్నాం. పురుషుల ప్రొత్సాహంతోనే రైతులకు ఆసరాగా నిలుస్తున్నాం.– మానుక భీమక్క, పెద్దపేట – గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లిఫోటోలు: మర్రి సతీష్ రెడ్డి -
సమ్మర్ టూర్స్లో కార్సేఫ్టీకి టిప్స్..!
సమ్మర్ హాలిడేస్ అంటే రోడ్ ట్రిప్స్ గుర్తొస్తాయి. హైవేస్, ప్లే లిస్టులు, టీ స్టాప్స్, సన్సెట్ డ్రైవ్స్ ఇవన్నీ ప్రయాణంలో భాగం అవుతాయి. కానీ ఎండాకాలంలో కార్ కేర్ చేయకపోతే జర్నీ మధ్యలో టైర్ పేలిపోవడం లేదా ఇంజిన్ వేడెక్కడం లాంటి సమస్యలు కూడా రెడీగా ఉంటాయి. రోడ్ ట్రిప్ అనే ఒక ఎగ్జైట్మెంట్ను బోనెట్ నుంచి వచ్చే పొగ తగ్గించే అవకాశం ఉంది.ఇంజిన్ హీట్తో జాగ్రత్తఎండాకాలంలో లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ఎక్కువ హీట్ అవ్వడం సాధారణం. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రత మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ట్రిప్ ముందు కూలెంట్ లెవల్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. రేడియేటర్ వాటర్ సరిగ్గా ఉందా లేదా అని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ పాతది అయితే వేడి ఎక్కువగా జనరేట్ అవుతుంది. అందుకే సర్వీసింగ్ను టైమ్కు చేయించడం మరవకండి. ట్రాఫిక్లో కంటిన్యూగా ఏసీ ఫుల్ బ్లాస్ట్లో వినియోగిస్తే చేస్తే కూడా ఇంజిన్ ప్రెషర్ పెరిగి΄ోతుంది. కొంచెం బ్రేక్స్ ఇస్తూ లాంగ్ డ్రైవ్ చేస్తే కార్కి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది.టైర్ పేలిపోకుండా ఉండాలి అంటే ..ఎండాకాలంలో స్పీడుగా వెళ్లడం అనేది కారుకు బల పెట్టడం పరీక్షలాంటిదే. ఎందుకంటే ఈ సమయంలో టైర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణానికి ముందు పీఎస్ఐ లెవల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. చాలా మంది అదనపు భద్రత కోసం టైర్లలో గాలిని ఎక్కువగా నింపుతారు. కానీ ఎండ వేడి కారణంగా ఆ గాలి విస్తరించి టైర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.అలాగే పాత టైర్లతో దూర ప్రయాణాలు ప్లాన్ చేయడం కూడా ప్రమాదకరం. టైర్ ఉపరితలంపై పగుళ్లు లేదా ఎక్కువగా అరిగిపోయిన గుర్తులు కనిపిస్తే వెంటనే మార్చించడం మంచిది. స్టెప్నీ పరిస్థితిని కూడా తప్పకుండా పరిశీలించాలి. సరైన కండిషన్లో ఉన్న టైర్ను మాత్రమే అదనపు టైర్గా వెంట తీసుకెళ్లడం సురక్షితం.స్మార్ట్ డ్రైవర్స్ బ్రేక్స్ తీసుకుంటారులాంగ్ జర్నీలో ఆగకుండా డ్రైవ్ చేయడం కన్నా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి చిన్న చిన్నబ్రేక్స్ తీసుకోవడం బెటర్. కార్ ఇంజిన్ కూల్ అవుతుంది. టైర్స్కి కూడా రెస్ట్ దొరుకుతుంది. మీకు కూడా కాస్త బాడీని స్ట్రెచ్ చేసుకుని టీ బ్రేక్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.రోడ్ ట్రిప్ మెమోరీస్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే డెస్టినేషన్ కన్నా ముందు బండి కండిషన్ చాలా ఇం΄ార్టెంట్. బండి భద్రం.. ప్రయాణం సురక్షితం. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. -
ప్రపంచ ఐస్క్రీమ్కే రాజధాని
ఎండాకాలం అంటే మన మైండ్లో ముందుగా ఫ్లాష్ అయ్యే ఇమేజ్ ఏంటి? వేడెక్కిన రోడ్లు, వడగాలుల మధ్య చేతిలో చల్లని ఐస్క్రీమ్. అయితే ప్రపంచంలో ఐస్క్రీమ్కు కూడా ఒక రాజధాని ఉంది అని దానిని ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారని తెలుసా?అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ‘లే మార్స్’ అనే స్మాల్ టౌన్ ఈ స్పెషల్ టైటిల్తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఈ పట్టణం చిన్నది అయినా అక్కడి ఐస్క్రీమ్ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. అక్కడ వీధుల్లో నడుస్తుంటే కూడా స్వీట్ వెనీల్లా సువాసన వస్తుంది అని టూరిస్టులు చెబుతారు.బ్లూ బన్నీ స్టోరీతో ఫేమస్ అయిన స్టోర్లే మార్స్ ΄పాపులారిటీ వెనక అతిపెద్ద కారణం వచ్చేసి వెల్స్ ఎంటర్ప్రైసెస్ అనే కంపెనీ. ఈ సంస్థ నడిపించే బ్లూ బన్నీ అనే ఐస్క్రీమ్ బ్రాండ్ చాలా పాపులర్ అయింది. కొన్ని దశాబ్దాల నుంచి ఐస్క్రీమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఈ చిన్న పట్టణాన్ని అంతర్జాతీయ డెసెర్ట్ మ్యాపులో పెట్టింది ఈ సంస్థే.ప్రతీ రోజు ఇక్కడ భారీ పరిమాణంలో ఐస్క్రీమ్ ప్రిపేర్ చేస్తారు. వెనీల్లా, స్ట్రాబెర్రీ, చాకొలేట్, కేరామెల్ం సింపుల్ ఫ్లేవర్స్ నుంచి కలర్ఫుల్ క్రేజీ కాంబినేషన్స్ వరకు ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఐస్క్రీమ్ అనేది జస్ట్ ఫుడ్ మాత్రమే కాదుం లోకల్ కల్చర్లో ఒక పార్ట్లా ఫీల్ అవుతుంది.ఫ్రోజెన్ కార్నివాల్ వైబ్లే మార్స్ వీధుల్లో ఐస్క్రీమ్ థీమ్ అనేది ప్రతీ చోట కనిపిస్తుంది. క్యూట్ ΄ార్లర్స్, డెజర్ట్ కేఫ్స్, జయంట్ స్కూప్ స్టాట్యూలు, కలర్ఫుల్ బోర్డులుం సిటీ మొత్తం ఒక ఫ్రోజెన్ కార్నివాల్లా ఉంటుంది. విజిటర్స్ కోసం స్పెషల్గా ఐస్ క్రీమ్ మ్యూజియం, ఫ్యాక్టరీ టూర్స్, టేస్టింగ్ ఎక్స్పీరియెన్స్ కూడా అరేంజ్ చేస్తారు. ట్రావెల్ లవర్స్కి లే మార్స్ అనేది నార్మల్ ఫుడ్ డెస్టినేషన్ కాదు. చైల్డ్హుడ్ సమ్మర్ మెమోరీస్ని ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేసినట్టు అనిపించే స్వీట్ ఎక్స్పీరియెన్స్. మన దగ్గర మ్యాంగో సీజన్ కోసం వెయిట్ చేస్తాము. కానీ అక్కడ ప్రతీ రోజు ఒక ఐస్క్రీమ్ సీజన్లాగే ఉంటుంది. -
తెలంగాణ ఇక్కత్ చీరలో రాధికరాజే గైక్వాడ్ ! ఏకంగా నాలుగేళ్లు..
పూర్వపు బరోడా (వడోదర) రాచరిక రాష్ట్ర మహారాణి సాంప్రదాయ భారతీయ నేత కళల పునరుద్ధరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారామె. అంతేగాదు ఒకప్పుడు కేవలం మరాఠా రాజ కుటుంబాల కోసం మాత్రమే నేయబడి..ఇప్పుడు కనుమరుగైన చారిత్రాత్మక బరోడా శాలు పునరుద్ధరణ కోసం, రాజమాత శుభాంగిని రాజేతో కలిసి నాయకత్వం వహించారు కూడా. ఆమె వద్ద 100 ఏళ్లకు ముందు ఉండే పురాతనమైన వారసత్వపు చీరలతో సహా, అబ్బురపరిచే చీరల సేకరణ కూడా ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రసిద్ధ నేత చీరలను ధరించి, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ పురాతన చీరలకు నిధిలా ఉంటుంది. అవి మనకు రకరకాల నేతలు, వాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. అలానే తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ చీరకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే విస్తుపోతారు. మరి అవేంటో సవివరంగా తెలుసుకుందామా.!.మహారాణి రాధికరాజే గైక్వాడ్ తాజా ఇన్స్టాగ్రామ్లో సికింద్రాబాద్కు చెందిన వరశ్రీ వారు రూపొందించిన తెలంగాణ సుప్రసిద్ధ ఇక్కత్ చేనేత చీరలో కనిపించారు. ఆ చీరపై డబుల్ ఇక్కత్, కంబైన్డ్ ఇక్కత్ పద్ధతులు అరుదైన సమ్మేళ్లనంతో 30 రంగులలో నేసిన 108 అసలైన తేలియా రుమాల్ జ్యామితీయ నమూనాలు ఉన్నాయి. ఆమె ఆ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ఇక్కత్లలో ఒక అద్భుతమైన కొత్త భాష ఉంటుంది. ఇది సాంప్రదాయ నైపుణ్యం, గణితం, సహనం, సృజనాత్మకత, ఆవిష్కరణల కలయిక. ఈ కళ సంక్లిష్టత మాత్రమే తనని ఆకట్టుకోలేదని, దాని వెనుకున్న అంకితభావం, నెలల తరబడి పరిశోధన, మరచిపోయిన నమునాల సంగ్రహాలు, అంతులేని గ్రాఫ్ పేపర్లు, 60 రంగులద్దే సెషన్లు, నిపుణులైన సమిష్ట స్ఫూర్తి తదితరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారామె. అందువల్ల తనకు ఆ చీర అత్యంత గొప్పదిగా కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ రాధికారాజే ధరించిన చీర ఏకంగా నాలుగు నెలలపాటు నేశారట. ఇంద్రధనుష్గా పిలిచే ఈ చీరలో మోటీఫ్ల మధ్య ఇంద్రధనుస్సుని తలపించే రంగులు, డబుల్ ఇక్కత్ మోటిఫ్లలో చదరంగం గళ్ల వంటి నిర్మాణాలు, తెలంగాణ ఇక్కత్ కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చీరలు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ చీర అరుదైన కలెక్షన్స్కి చెందిన శారీగా పేర్కొనవచ్చు అని రాధికారాజే అంటున్నారు.తెలియా రుమాల్ చరిత్రతెలియా రుమాల్ అనేది తెలంగాణలోని నల్గొండ జిల్లా పుట్టపాక, ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ చేనేత వస్త్ర కళ. ఈ కళలో నూలును నువ్వుల నూనె, ఆముదం తదితర మూలికలతో శుద్ధి చేసి, డబుల్ ఇక్కత్ పద్ధతిలో జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇది 19వ శతాబ్దానికి చెందిన కళ. దీనికుండే జిడ్డు స్పర్శ, వాసన వాటన్నింటిని సూచిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫ్యాబ్రిక్ని తల లేదా మెడ, నడుము కట్టుకునే వస్త్రాలుగా ఉపయోగించేవారు. దీన్ని 'ఆసియా రుమాల్' గా వాణిజ్య ఎగుమతి చేసేవారు. గుజరాత్కు చెందిన పటోలా లాగా, చేనేత మగ్గంపై నేయడానికి ముందు వార్ప్, వెఫ్ట్ దారాలు రెండింటికీ రెసిస్ట్-డైయింగ్ చేసే డబుల్ ఇకాట్ పద్ధతిలో నేయబడిన కొన్ని దక్షిణాసియా వస్త్రాలలో ఇది ఒకటి. ఈ తేలియా రుమాల్లోని నూనె దుమ్మును దూరంగా ఉంచడం తోపాటు వాష్బుల్ కానీ విధంగా ధరించేవారట.ఇక డబుల్ ఇక్కత్ అనేది ఒక సంక్లిష్టమైన నేత పద్ధతి, దాని ఫలితంగా, తేలియా రుమాల్ వస్త్రంలో ఉపయోగించే మూలాంశాలు మొదట్లో "వజ్రాలు, నక్షత్రాలు, చతురస్రాలు, చుక్కలు, చారలు, గడులు వంటి సరళమైన జ్యామితీయ ఆకారాలుగా ఉండేవి, ఇవి తరచుగా మొజాయిక్ పనిని పోలిన కలయికలలో అమర్చబడేవి. అయితే, 1920, 1930ల మధ్య, అవి మార్పులు చోటు చేసుకోవడంతో మనుషుల నమూనాలను, విమానాలు, గ్రామఫోన్లు, గడియారాలు వంటి కొన్ని సమకాలీన మూలాంశాలను కూడా చేర్చడం మొదలైంది. అంతేగాదు 2020లో తెలంగాణకు చెందిన తేలియా రుమాల్కు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) కూడా లభించింది. View this post on Instagram A post shared by Radhikaraje Gaekwad (@radhikaraje) (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?) -
వామ్మో.. థైరాయిడ్! కీళ్ల నొప్పులు, డిప్రెషన్..
కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్ థైరాయిడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్ నోడ్యూల్స్, గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు), థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోౖథెరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్ లేదా నోడ్యూల్స్ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్ అవసరం లేదు. క్యాన్సర్గా మారితేనే ఆపరేషన్ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది. కారణాలు.. థైరాయిడ్ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్ వ్యాధి వస్తుంది. హైపోౖథెరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్ రుగ్మతలు, అయోడిన్ లోపం, థైరాయిడ్ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్, థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణం. అయోడిన్ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు. నివారణ ఇలా.. థైరాయిడ్ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోౖథెరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, హైపర్ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్ గానీ అవసరం కావచ్చు మహిళల్లోనే అధికం.. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోౖథెరాయిడిజం, హైపర్ౖథెరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్సీలో థైరాయిడ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.త్వరగా గుర్తిస్తే మేలు సమాజంలో 11 శాతం మందిలో హైపోౖథెరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్ థైరాయిడ్ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ దల్లి సురేష్రెడ్డి, ఎండీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురంగర్భిణులు జాగ్రత్త.. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. – డాక్టర్ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం మరిన్ని వివరాలకు ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి -
‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తాయ్ చి వాకింగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ప్రజలు కూడా ఈ వాకింగ్ చేసేందుకు అమితమైన ఆసక్తికనబరుస్తుండటం విశేషం. ఈ వాకింగ్ పొట్లలోని కొవ్వుని అమాంతం కరిగించేస్తుందని, బరువు తగ్గిపోతారంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. ముఖ్యంగా పెద్దలకు, వృద్ధులకు చాలామంచిదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి తాయ్ చి వాకింగ్..?, దీని వల్ల నిజంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.ఈ తాయ్ చి వాకింగ్ గురించి ముంబైకి చెందిన తాయ్ చి గురువు సెన్సాయి సందీప్ దేశాయ్ ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. ఇది ఎలా చేస్తారు. దీని వల్ల కలిగే లాభలు ఏంటి వంటి వాటి గురించి తెలిపారు. తాయ్ చి వాకింగ్ అంటే..తాయ్ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక విధమైన నడక పద్ధతి. దీనిలో సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయం, కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై ఫోకస్ పెడతూ చేసే వాకింగ్ అని చెప్పుకొచ్చారు సందీప్ దేశాయ్. తాయ్గా ఈ పిలిచే ఈ వర్కౌట్ యుద్ధ కళల సాధనలో ఒక భాగం అని అన్నారు. ఇది పూర్తిగా కదలికపై దృష్టి సారించే ఒక వ్యాయామం అని చెప్పారు. ఇటీవల కాలంలో దీనికి అమిత ఆదరణ పెరిగిందన్నారు. అయితే ఈ తాయ్ చి అనేది వేల సంవత్సరాల చైనా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంతర్గత యుద్ధ కళ, ఆరోగ్య వ్యాయామం కూడా. భారత్కి యోగా ఎలాగో అక్కడ చైనాలో ఈ తాయ్ చి అలా అని సందీప్ దేశాయ్ అన్నారు.ఎలా చేస్తారంటే..సరైన విధంగా నేర్చుకోవడం అనేది అత్యంత కీలకం. ఇది శరీర బరువుని మారుస్తూ జాగ్రత్తగా చేసే వ్యాయామం. ఒక కాలుపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరోక కాలు ఎత్తాలి. ఆ తర్వాత మెల్లగా గాల్లో ఉన్న ఆ పాదాన్ని మడంపై ఆనించి నెమ్మదిగా భూమిపై పూర్తిగా ఆనాలి. ఆ తర్వాత మరో కాలుని నెమ్మదిగా ఎత్తి ఈ పాదంపై శరీర బరువుని మోపాతూ.. కంటిన్యూ చేయాలి.వృద్ధులకు ఇది ఎందుకు మంచిదంటే..ఈ వాకింగ్ కాళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. సాధారణంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పి, బిగువు లేదా నడుమునొప్పితో బాధపడేవారికి చాలా ముఖ్యం. శరీర బరువుని ఒక కాలు నుంచి మారుస్తూ తనను తాను మెరుగ్గా స్థిరపరుచుకునే ట్రైన్ చేస్తుంది. అలాగే స్లిప్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని నిటారుగా వంచడంలో ఉపకరిస్తుంది. పైగా ఇది మనస్సు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన వర్కౌట్కావడంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..హృదయ సంబంధ వ్యాధుల పరంగా చూస్తే, ఇది రక్త ప్రసరణ, శ్వాస, ఊపిరితిత్తుల పనితీరు తోడ్పడే తేలికపాటి ఏరోబిక్ కదలికలా పనిచేస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు, నాడీ సంబంధిత సమస్యలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇది సమతుల్యమైన నడకను ప్రోత్సహిస్తుంది. అలాగే శరీరం-మనస్సు సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్ పటేల్ నొక్కి చెప్పారు.ఇది అనారోగ్యం లేదా గాయం నుంచి కోలుకోవడాన్ని కూడా వేగవంతం చేస్తుంది. చాలా మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యోగా సాధకులు, మార్షల్ ఆర్టిస్టులు మెరుగ్గా ఉండేలా, గాయాల బారి నుంచి రక్షించుకోవడానికి ఈ తాయ్ చి వాకింగ్ని చేస్తారని సెన్సాయి సందీప్ అన్నారు. అంతేగాదు శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి ఫిట్నెస్లోకి తిరిగి రావడానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది.బరువు తగ్గిస్తుందా అంటే..కేవలం ఏడు నిమిషాల తాయ్ చి మాత్రమే పొట్టలోని కొవ్వును అద్భుతంగా కరిగించకపోవచ్చు. పరుగు లేదా తీవ్రమైన కార్డియో వ్యాయామం లాగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని బరువు తగ్గడానికి ఒక షార్ట్కట్గా భావించడం సరైనది కాదని అంటున్నారు. కానీ పొట్టలోని కొవ్వును తగ్గించడానికి, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, అధిక తీవ్రతతో కూడిన వర్కౌట్లు, నియంత్రిత కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల్యత, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కలయికతోనే బరువు తగ్గడం సాధ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.తప్పక తెలుసుకోవాల్సినవి..తాయ్ చి వాకింగ్ని సరైన మార్గదర్శకత్వంలోనే చేయాలి లేదంటే కీళ అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే కీళ్లవాతం లేదా వెన్నుముక సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. View this post on Instagram A post shared by Sensei Sandeep Desai (@taichiyogiindia)(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
ఇలా చేస్తే 5 నెలల్లో 30 కిలోలు తగ్గవచ్చు !
బరువు తగ్గాలి..తగ్గాలి..అని ఊరికే జపం చేసినంత మాత్రాన సరిపోదు. దానికి నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి. ఒక్కోసారి ఈ ప్రయత్నాన్ని సుదీర్ఘం కాలం చేయాల్సి ఉంటుంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. నాలుగు రోజు చేసి, సరైన ఫలితం రాలేదు అని నిరాశ పడి ఆ ప్రయత్నాన్ని వదిలేస్తే మరింత నిరాశ, ఒత్తిడి తప్పదు. ఇదే విషయాన్ని ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ ఆచరించి చూపించారు. పక్కా ప్లాన్తో క్రమశిక్షణతో, ఓపిగ్గా ప్రయత్నించి 30 కిలోల బరువు తగ్గారు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే చాలా మంది విఫలం కావడానికి కారణం క్రమశిక్షణ లేకపోవడం కాదు; మొదలుపెట్టడమే చాలా కఠినంగా, అతి వేగంగా మొదలుపెట్టి, శరీరం మారే లోపే అలసిపోయి ఆపేయడమే అంటారు అంచని సచన్. అంతేకాదు క్రమశిక్షణ లేకపోవడం వల్ల విఫలం కారు ప్లాన్ లేకుండా తొందర పాటుతో ఫశ్రీయిల్ అవతారు అంటారామె. చాలా కఠినంగా, వేగంగా ప్రారంభించడం వల్ల, వారి శరీరంలో మార్పు రావడానికి అవకాశం కూడా రాకముందే అలసిపోతారని వివరించారు.ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ స్వయంగా 30 కిలోల అధికబరువును తగ్గించుకుంది. ఇందుకోసం ఆమె అందరిలా కఠినమైనది కాదు. ఎలాంటి నరకం చూపించే పరుగు పందాలు, గంటల కొద్దీ జిమ్ వర్కవుట్లు ఇందులో లేవు.ఆమె 84 కేజీల నుండి 54 కేజీల దాకా, అంటే 30 కిలోగ్రాములు తగ్గింది. అంజలిబరువును ఆ స్థాయికి చేర్చిన దినచర్య సాధారణమైనది కాదు. మీరి ముఖ్యంగా వెయట్ లాస్ జర్నీలో కఠినమైన స్ప్రింట్లు లేవు. రెండు గంటల జిమ్ సెషన్లు లేవు.ఒకే ఒక సూత్రాన్ని నమ్ముకుంది. ప్రస్తుతం ఉన్న స్థితిని గౌరవిస్తూనే, పక్కా ప్లాన్, క్రమబద్ధమైన కార్డియోతో ఫలితం సాధించింది. ఇందుకోసం తాను పాటించిన ప్లాన్తో తన అభిమానులతో పంచుకున్నారు.చాలా చిన్నగా ప్రారంభించండి: అంజలి మొదటి దశలో రోజుకు కేవలం 4,000 అడుగులతో ప్రారంభించాలని చెబుతారు. ప్రతిరోజూ "కనీసం 10,000 అడుగులు నడవాలి" అనే మాటలు వినేవారికి ఇది చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ ఆమె లాజిక్ ఏంటంటే—శరీరంపై ఎక్కువ బరువు ఉన్నప్పుడు, మీ కీళ్లు , నరాలు ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాయి. కాబట్టి మొదట్లోనే ఎక్కువ భారం వేయకూడదు. క్రమంగా ఈ అడుగుల సంఖ్యను పెంచుకుంటూ పోవాలని ఆమె చెబుతారు.వేగం పెంచే ముందు బలాన్ని పెంచుకోండిఫేజ్ 2 (రెండవ దశ): రోజుకు 8,000 అడుగులు + వారానికి ఒక 'జోన్ 2 కార్డియో' సెషన్ ( ఆయాసపడకుండా, హాయిగా మాట్లాడుతూ).ఫేజ్ 3: 10,000–12,000 అడుగులు + వారానికి రెండు జోన్ 2 సెషన్లు.ఫేజ్ 4: 15,000 అడుగులు.ఫేజ్ 5 : 20,000 అడుగులు + వారానికి రెండు నుండి మూడు సెషన్లు.ఈ పద్ధతి ఎందుకు పనిచేస్తుందంటే, ఒక దశ పూర్తయ్యాకే తర్వాతి దశకు వెళ్తాం. అప్పటికే కీళ్లు బలంగా మారతాయి, అలసట నుండి శరీరం త్వరగా కోలుకుంటుంది. అంటే శరీరానికి కొన్ని రోజుల సమయం కాకుండా, కొన్ని నెలల సమయం ఇవ్వడం వల్ల అది ఎక్కువ శ్రమను తట్టుకోగలుగుతుంది.అందరూ మర్చిపోయే ముఖ్యమైన విషయంఫిట్నెస్ ప్రపంచంలో చాలా మంది దాచేసే ఒక నిజాన్ని అంజలి స్పష్టం చేశారు. "కేవలం కార్డియో చేయడం వల్లే బరువు తగ్గరు. క్యాలరీల లోటు (Calorie Deficit) వల్ల మాత్రమే బరువు తగ్గుతారు." కార్డియో అనేది ఖర్చు చేసే శక్తిని పెంచి, ఆ క్యాలరీల లోటును బ్యాలెన్స్ చేయడానికి సహాయపడే ఒక సాధనం (Tool) మాత్రమే, అదే పూర్తి పరిష్కారం కాదు అంటూ తన అనుభవాలను షేర్ చేశారు.నోట్ : కార్డియోనే సర్వస్వం అనుకునేవారు బరువు తగ్గకపోగా త్వరగా అలసిపోయి నిరాశకు గురవుతారు. కానీ ఆహారం, నిద్ర, కోలుకునే సమయంతో పాటు కార్డియోను కూడా ఒక భాగంగా చూసేవారే ఆరు నెలల తర్వాత కూడా ఆరోగ్యంగా మనగలుగుతారు. 30 కిలోల బరువు అనేది ఒకే రాత్రిలో తగ్గింది కాదు; ఓపికగా, క్రమంగా, స్థిరమైన అడుగులతో సాధించిన విజయం అనేది గుర్తించాలి. -
సంజీవనిగా పిలిచే మల్టీవిటమిన్ మొక్క గురించి తెలుసా..!
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఒకే మొక్కలో లభిస్తే.. దానిని సంజీవని అనవచ్చేమో. ‘చక్రముని ఆకు’ మొక్క అలాంటిదే అంటున్నారు ఔషధ, సుగంధ మొక్కల పరిశోధన కేంద్రం (సిమ్యాప్) శాస్త్రవేత్తలు. దీని శాస్త్రీయనామం ‘సారోపస్ ఆండ్రోజినస్’ కాగా.. మల్టీవిటమిన్ మొక్క అని కూడా పిలుస్తారు. ఇటీవల మన భాగ్యనగరం హబ్సిగూడలోని ఎన్జీఆర్ఐలో జరిగిన ప్రదర్శనలో ఈ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మొక్క వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఈ మొక్క ఆకుల్లో ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఇనుము, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పరిమితంగా, ఉడికించిన తర్వాతే తినాలి. కరివేపాకు మాదిరిగా ఆకులను వంటల్లో వేసుకోవచ్చు’’ అని పరిశోధకులు చెబుతున్నారు.ఆయుర్వేదంలో దీని ప్రత్యేకత..చక్రముని శాస్త్రీయ నామం నామసురోపస్ ఆండ్రోజినస్. ఆయుర్వేదం ప్రకారం.. ఇది ఇతర మొక్కల కంటే ఎంతో భిన్నమైనది. దీని ఆకులు స్వల్ప తీపి, వెచ్చని గుణాన్ని కలిగి ఉండి, శరీరంలోని వాత, కఫాలను సమతుల్యం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీన్ని సులభంగా చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెప్పారు.ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..విటమిన్ ఏ, బీ, సీ, కాల్షియం, ఐరన్లకు దీన్ని సహజ వనరుగా చెబుతారు నిపుణులుదీని ఆకులను తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, జీర్ణ ఎంజైమ్లు వేగంగా విడుదలయ్యి జీర్ణక్రియ బలపడుతుందన్నారు.రక్తహీనతతో బాధపడేవారికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.ఇది శరీరంలో విటమిన్ లోపాలను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ఊపిరితిత్తుల సమస్యలను, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.ఇందులో కొవ్వు, కేలరీలు చాలా తక్కువ. ఇది ఆకలిని నియంత్రించడమే కాకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తుందన్నారు.మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు.అంతేగాదండోయ్ ఈ మొక్కను హైదరాబాద్, బోడుప్పల్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) కేంద్రంలో రూ.20కే విక్రయిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యంగా తక్కువ ధరకు వెచ్చింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుదామా..!.(చదవండి: Health Benefits of Cucumber : పరగడుపునే కీరా తినొచ్చా..!?) -
నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!
ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్ ఎగ్జామ్స్ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్ క్రియేటర్ తన సక్సెస్ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మన జీవితాన్ని, సక్సెస్ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకునేలా చేసిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. సైన్స్ చదివే విద్యార్థులు నీట్ పరీక్షని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్ అయ్యే సంప్రదాయ నీట్ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్ని నిర్మించుకుంది. ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్ కెరీర్ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు సైన్స్, హెల్త్కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. View this post on Instagram A post shared by Pragya Gupta (@pragya.gupta) (చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
పరగడుపునే కీరా తినొచ్చా..!?
చవకగా దొరికేది అన్ని వేళలా లభించే కీరా దోసకాయతో కలిగే లాభాలు అన్ని ఇన్ని కావని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. అందరికి దొరికే కీరాను పరగడుపున తింటే చాలామంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్ ఉష్ణోగ్రతలకు ఇది ఎంతో పోషకవంతమైనదని అన్నారు. దీన్ని ఉదయమే అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఏంతో మేలని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే పోషక విలులు, ఉపయోగాలు గురించి సవివరంగా వెల్లండించారు.ప్రతిరోజు ఉదయం పరగడుపునే కీరా దోసకాయ లేదా కీరా జ్యూస్ తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుందని అన్నారు. అధిక బరువుతో బాధపడే వాళ్లకు ఎంతో మేలని అంటున్నారు. ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అలాగే మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగ్గుఉంటుందని అన్నారు. కీరలక్ష అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని అన్నారు. దీనిలో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీని పెంచి వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని చెబుతున్నారు.ఎలాగంటే..శరీరానికి తేమ: కీరాలో సుమారు 95% నీరు ఉండటం వల్ల ఉదయాన్నే శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.బరువు నియంత్రణ: కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం.రోగనిరోధక శక్తి: దీనిలోని విటమిన్ సీ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయిఅలాగే ఫైబ్రాయిడ్లు లేదా ఈస్ట్రోజెన్ ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్న మహిళలకు, ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు తేలికపాటి యాంటీ-ఈస్ట్రోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే..రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు.చర్మం, కళ్ళు, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటుని తగ్గిస్తుంది, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా.ఎవరు తీసుకోకూడదంటే..దోసకాయ చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలో కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ సమస్యలు, ఉబ్బసం లేదా కఫంతో బాధపడేవారు కీరాను పూర్తిగా నివారించాలి.ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ (IBS), జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది కాదుకీళ్ల నొప్పులు ఉంటే తినకపోవడమే మేలుమూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించే తీసుకుంటే మంచిది. గ్లూకోజ్ని తగ్గించే మందలు ఉపయోగించే వాళ్లు కూడా వైద్యులను సంప్రదించే తీసుకోవాలని చెబుతున్నారు.(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
అహంకారంతో అసువులు బాసిన శిశుపాలుడు
మహాభారతంలో శిశుపాలుడిది ఒక ప్రత్యేక పాత్ర... నాలుగు చేతులు, మూడు కళ్ళతో చూసేందుకు భీతిగొల్పేలా పుట్టిన శిశుపాలుని ఎవరు ఎత్తుకొంటే సాధారణ రూపానికి చేరుకుంటాడో అతని చేతిలోనే మృత్యువు రాసి పెట్టి ఉందని ఆకాశవాణి పలుకుతుంది.శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుడు, సాత్వతిల కుమారుడు. సాత్వతి స్వయానా కృష్ణుని తండ్రి వసుదేవునికి సోదరి. అంటే కృష్ణుడికి మేనత్త. శిశుపాలుడు మేనత్త కొడుకు. ఇదిలావుండగా అంగవైకల్యంతో, చూసేందుకు భీతి గొలుపుతున్న శిశుపాలుని ఎత్తుకోమని, సాత్వతి అందరినీ కోరసాగింది.ఒకరోజు బలరామకృష్ణులు మేనత్తని చూడాలని ఛేది రాజ్యానికి వచ్చారు. అప్పుడే శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నాడు. దీంతో అతడి వికృత రూపం పోయింది. తన కుమారుడు శిశుపాలునికి సాధారణ రూపం వచ్చినందుకు కలిగిన ఆనందం కంటే, మేనల్లుడి చేతిలో తన కొడుకు మరణిస్తాడనే ఆందోళన తో తనకు పుత్రభిక్ష పెట్టమని జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుని వేడుకుంది సాత్వతి. అర్హమైన వంద తప్పుల వరకు మన్నిస్తానని, ఆపై తప్పులు మీరితే సంహరిస్తానని తన మేనత్త అయిన సాత్వతి కి మాట ఇచ్చాడు. అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసేవరకు కృష్ణుడు ఎంతో సంయమనంతో ఉన్నాడు. దీనిని అలుసుగా తీసుకొని అహంకారం తో విర్రవీగిన శిశుపాలుడు తనకు తిరుగులేదని తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయాడు. వసుదేవుని యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాదు, దాన్ని సంహరించాడు. కృష్ణుడు లేని సమయంలో ద్వారకకు నిప్పంటించడమే కాదు, రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూశాడు. బభ్రువాహనుడి భార్యని అపహరించి తనదాన్ని చేసుకున్నాడు. ఇన్ని తప్పులు, ఘోరాలు శిశుపాలుడు చేసినా ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు ఓపిక పట్టాడు. ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగంలో భాగంగా ఛేది దేశానికి వచ్చిన భీముడిని, శిశుపాలుడు ఆదరించాడు. యాగం కోసం ధనం కూడా అందించాడు. ధర్మరాజు ఆహ్వానం మేరకు సభకు వచ్చాడు. తొలి అర్ఘ్యానికి శ్రీ కృష్ణుడే అర్హుడని భీష్ముడు చెప్పడంతో శిశుపాలుడు ఆగ్రహించాడు.ఒక యాదవుడు పూజ్యుడెలా అవుతాడని నోటికి వచ్చినట్లు మాట్లాడి శ్రీ కృష్ణుని అవమానించాడు శిశుపాలుడు. భీష్మపితామహుని తప్పుబట్టి ధర్మరాజుని దుయ్యబట్టాడు. దీంతో భీముడు, సహదేవుడు ఆవేశపడితే భీష్ముడు వారిని వారించాడు. కృష్ణుడు సభనుద్దేశించి ‘‘శిశుపాలుడి తల్లికిచ్చిన మాట ప్రకారం అతడి వంద అపరాధాలను మన్నించాను... నేటితో వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ మూర్ఖుని ఇప్పుడే సంహరిస్తాను’’ అని పలికి సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు.శిశుపాలుడు ఎవరు?బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందాదులు విష్ణు మూర్తిని దర్శించుకోవాలని వైకుంఠానికి వెళ్ళినపుడు అక్కడ ఉన్న ద్వార పాలకులైన జయ, విజయులు, ఈ సమయంలో విష్ణుమూర్తి ఏకాంత సమయంలో ఉన్నారని, దర్శనానికి తగిన సమయం కాదని వారించడంతో పాటు, వారిని లోనికి పంపకపోవడంతో, ఆగ్రహించిన సనక, సనందాదులు, జయ, విజయులను వైకుంఠ లోకంలో ఉండేందుకు అర్హత లేకుండా శపిస్తారు. అనంతరం తమ తప్పును తెలుసుకున్న జయ, విజయులు శాప విమోచనం కోరగా విష్ణుమూర్తితో 7 జన్మల మిత్రుత్వం కానీ 3జన్మల శత్రుత్వం అనంతరం మరలా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని సూచిస్తారు. దీనితో జయ విజయులు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి మూడు జన్మల శత్రుత్వం నెరపి విష్ణుమూర్తి చేతిలో హతులై, మరలా విష్ణుమూర్తి ద్వారపాలకులయ్యారు జయవిజయలు...– సి.ఎన్.మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ముత్యంలాంటి మెరిసే ముఖం కోసం
ప్రముఖ బ్యూటీ అప్లయన్స్ బ్రాండ్ ‘షార్క్ బ్యూటీ’ హెయిర్ కేర్ విభాగంలో సరికొత్త పరికరాన్ని ప్రవేశపెట్టింది. జుట్టును వేగంగా, సురక్షితంగా స్ట్రెయిటనింగ్ చేసేలా రూపొందించిన ‘సిల్కీప్రో స్ట్రెయిట్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. సిల్కీప్రో స్ట్రెయిట్ అత్యాధునిక ‘ఎయిర్ పవర్డ్’ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది వేడికి బదులుగా గాలి ప్రవాహం ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేస్తుంది. దీనివల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. ఈ పరికరం అందరికీ అనుకూలంగా ఉంటుంది. కర్లీ, కాయిల్డ్, టెక్స్చర్డ్ హెయిర్ ఉన్నవారు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే మృదువైన, పిన్–షార్ప్ స్ట్రెయిటనింగ్ పొందవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన ఇంటర్చేంజబుల్ కోంబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ హీట్ సెన్సర్ ఉంటుంది. అంటే ఇది సెకనుకు వెయ్యిసార్లు టెంపరేచర్ని పర్యవేక్షిస్తూ, జుట్టుకు నష్టం కలగకుండా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. స్నానం చేసిన వెంటనే తడి జుట్టుపై కూడా దీనిని నేరుగా ఉపయోగించవచ్చు. ఇది జుట్టును ఆరబెట్టడంతో పాటు స్ట్రెయిటెనింగ్ కూడా చేస్తుంది.కొద్దిపాటి జాగ్రత్తలతోనే ..ఖరీదైన క్రీములు మేనిని మెరిపిస్తాయని అనుకుంటుంటారు. కాని, మేని మెరుపు కేవలం మార్కెట్లో దొరికే ఉత్పత్తులతోనే సాధ్యం కాదు. మనం పాటించే జాగ్రత్తలతోనే మేని మెరుపును కాపాడుకోవచ్చు. చాలామంది ఇంటి నుంచి బయలుదేరే ముందు సన్స్క్రీన్ రాసుకుని వదిలేస్తారు. చెమట వల్ల అది త్వరగా పోతుంది. అందుకే ప్రతి మూడు గంటలకోసారి సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది గంటల తరబడి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటారు. దీని వల్ల వేడి పెరిగి చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు హెడ్సెట్ వాడటం మేలు. తాత్కాలిక మెరుపు కోసం వాడే ఉత్పత్తులు దీర్ఘకాలంలో మీ చర్మానికి హాని చేయవచ్చు. ముఖం పదేపదే కడగడం వల్ల చర్మంపై ఉండే రక్షణ పొర దెబ్బతిని, చర్మం త్వరగా కమిలిపోతుంది. అలసట పోవడానికి వేడి నీళ్ల స్నానం హాయిగానే ఉన్నా, అది మీ చర్మంలోని తేమను హరిస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా పొడిబారిపోయి ముడతలు వస్తాయి.ముఖాన్ని మెరిపించే ముత్యాలుముత్యాలు అలంకారానికే కాదు, మేనిని మెరిపించడానికీ ఉపయోగపడతాయని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన చైనా మహారాణి వు జెషియన్ అందం కోసం ముత్యాల పొడిని వాడేది. రసాయనాలతో కాకుండా సహజసిద్ధంగా తయారుచేసే ఈ పొడిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఒకప్పుడు కేవలం రాజకుటుంబీకులకే పరిమితమైన ఈ ప్రాచీన పద్ధతి, ప్రస్తుతం ఆధునిక చర్మ సంరక్షణ పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతోంది. నేడు అనేక ప్రముఖ బ్యూటీ బ్రాండ్లు తమ ఉత్పత్తులలో ఈ ముత్యాల పొడిని ఉపయోగిస్తూ, పురాతన చైనా అందాల రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. (చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్) -
ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్కట్, నో స్ట్రిక్ట్ డైట్
బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట డైట్నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్లు, రెండు గంటల జిమ్ సెషన్లు వంటివి చేయలేదన్నారామె. తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్లాస్ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_) (చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్గా..! ఆ ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా) -
40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్గా..!
బయట ఉష్ణోగ్రతలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఉదయం 10 గంటలకే భానుడు భగభగ మంటున్నాడు. అత్యవసరం ఉంటేనేగానీ బయటకు రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు మాత్రం ఏసీలతో పనిలేకుండా ఇళ్లను కూల్గా మార్చే పద్ధతి అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఈ పద్ధతిని దాదాపు నాలుగు వేలకు పైగా కుటుంబాలు అనుసరిస్తూ..విద్యుత్ను ఆదా చేస్తూ, పర్యావరణహితంగా జీవనం సాగిస్తుండటం విశేషం. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా సైతం ఆ టెక్నిక్కు ఫిదా అవ్వతూ ఆ విషయాన్ని సోష్ల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.జైపూర్లో వేసవి ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ మాములుగానే వేసవిలో ఉష్ణోగ్రతలు 40°C దాటే ఉంటుంది. ఫలితంగా ఇంటి పైకప్పులు అధిక వేడిని గ్రహించి ఇళ్లు భరించలేనంత వేడిగా ఉంటాయి. ఎయిర్ కండిషనర్ లేనిదే ఉండలేం అన్నంత దారుణంగా ఉంటుందక్కడ పరిస్థితి. జైపూర్కి చెందిన ఒక స్థార్టప్ ఆ సమస్యకు రూఫ్టాప్ ఫార్మింగ్ సిస్టమ్స్తో చక్కటి పరిష్కారం అందించింది. ప్రస్తుతం జైపూర్లో అంతకంతకు పెరుగుతున్న ఈ రూఫ్టాప్ ఫార్మింగ్ ఉద్యమాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఇది తమ ఇళ్లను చల్లగా ఉంచుకుంటూనే సొంత ఆహారాన్ని పండించుకోవాడానికి సహాయపడుతుంది. నివాసితులు సాధారణ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుంటూనే తమ రూఫ్టాఫ్లను పచ్చని ప్రదేశాలుగా మార్చడం ద్వారా రోజురోజుకు తీవ్రమవుతున్న వేసవికాలానికి ఎలా అలవాటు పడుతున్నారో మహీంద్రా వివరించారు. రాబోయే సంవత్సరాలలో ఎండలు అంతకంతకు అధికమవుతాయన్నది జగమెరిగిన సత్యం. అలాంటి వాతవరణ పరిస్థితులకు ఈ ఆలోచన విధానమే సరైన మార్గదర్శకం అని పోస్టులో పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు ఆ స్టార్టప్ కంపెనీ ఈ పద్ధతిని సులభంగా ఇన్స్టాల్ చేసేలా పోర్టబుల్ రూఫ్టాప్ గార్డెనింగ్ సెటప్లను అందిస్తుంది. అలాగే లీక్-ప్రూఫ్ కంటైనర్లు, డ్రిప్ ఇరిగేషన్ డ్రేనేజీ వంటివి ఉంటాయి. పెద్ద నిర్మాణ మార్పులు అవసరం లేకుండా సులభంగా మొక్కలను పెంచుకునే వీలు కల్పిస్తోంది. ఫలితంగా పైకప్పులపై ఉన్న అధికవేడిని తగ్గించడంలో ఈ పచ్చదనం సహాయపడుతుంది. తద్వారా గదులు సులభంగా ఏసీలు అవసరం లేకుండానే చల్లగా ఉంటాయి. ఈ విధానాన్ని అక్కడ చాలా కుటుంబాలు అనుసరించడం విశేషం. పైగా ఈ విధానం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడం తోపాటు అధిక ప్రయోజనాలు పొందగలం అని చెబుతున్నారు సదరు స్టార్టప్ వ్యవస్థాపకులు. కాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఈ విధానం పర్యావరణ ప్రయోజనాల తోపాటు రోజువారి పొదుపుని కూడా అందిస్తుందని అటున్నారు నెటిజన్లు.We still don’t know enough about the full consequences of climate change.But we do know this: intense heat waves in India are no longer exceptions. They’re becoming a way of life.These homeowners have responded by changing THEIR way of life. By changing the way they live,… pic.twitter.com/9pr5yIktJv— anand mahindra (@anandmahindra) May 22, 2026 (చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు) -
హంటా రాలేదు.. ఆందోళన వద్దు!
ఇటీవల హంటా వైరస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ అది విదేశాల్లోనే ఉందనీ, మన దేశంలోకి ప్రవేశించలేదని అన్నప్పటికీ... క్రమంగా అది విదేశాల నుంచి వచ్చిన ఒకరిద్దరితో మొదలై క్రమంగా దేశాన్నంతా చుట్టుముట్టింది. అదేలాంటి ఆందోళనే ఇప్పుడు దేశంలోని కొంతమందిలో మొదలైంది. అయితే ఇప్పటివరకు హాంటా వైరస్మనదేశంలోకి ప్రవేశించలేదు. భారతీయులిద్దరికి వచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ విదేశాల్లో ఒక డచ్ క్రుయిజ్ షిప్ మీద ఉన్న ఇద్దరు క్రూ మెంబర్లలో కనిపిందన్నది మాత్రమే న్యూస్. ఈ వైరస్కు సంబంధించినంత వరకు ప్రస్తుతానికి దేశమంతా సురక్షితమే. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హాంటా వైరస్ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ గురించి ప్రాథమిక సమాచారం కోసం ఈ కథనం.హంటావైరస్ కారణంగా వచ్చే వ్యాధులు చాలా తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొంతవరకు మరణాలకూ కారణమవుతుంది. ఈ వైరస్ కుటుంబంలోని వైరస్లు ప్రధానంగా రెండు రకాల వ్యాధులకు కారణమవుతాయన్నది వైద్యుల మాట. వ్యాప్తికి కారకాలు: ఈ వైరస్ ప్రధానంగా ఎలుకలు. ఈ (ఎలుక / రోడెంట్) జాతికి చెందిన కొన్ని రకాల మూషిక జాతుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ దానివల్ల కలిగే వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎలుకల మూత్రం, విసర్జనలతో పాటు వాటి లాలాజలంతో మనుషులకు కాంటాక్ట్ సంభవించినప్పుడు మానవుల్లో ఈ వైరస్ సోకుతుంది. అరుదుగా ఎలుక కరవడం లేదా గీరడం వల్ల కూడా వ్యాపించవచ్చు. ఇక మనుషులకు సోకాక... ఇది వ్యక్తి నుంచి వ్యక్తి (పర్సన్ టు పర్సన్) వ్యాప్తి చెందే అవకాశముంది. బాధితులతో బాగా సన్నిహితంగా ఉన్నవారిలో ఇలా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ.హాంటా వైరస్తో వచ్చే వ్యాధులు... హాంటావైరస్లు రెండు ప్రధాన సిండ్రోమ్లకు కారణమవుతాయి. అవి... 1. హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్పీఎస్) 2. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) అనేది ప్రధానంగా యూరప్తో ΄ాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది.లక్షణాలు... హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్పీఎస్) : ఈ వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ఎలుక నుంచి వైరస్ వ్యాప్తి చెందిన ఒకటి నుంచి ఎనిమిది వారాల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలువుతాయి. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) : ఇది మూత్రపిండా(కిడ్నీ)లను ప్రభావితం చేసే వ్యాధి. వైరస్ సోకిన ఒకటి నుంచి రెండు వారాల్లో లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. అయితే అరుదుగా లక్షణాలు కనిపించడానికి కొందరిలో ఎనిమిది వారాలూ పట్టవచ్చు.ప్రారంభ లక్షణాలు: జ్వరం / వణుకు తీవ్రమైన తలనొప్పి వెన్నునొప్పి కడుపు నొప్పి వికారంచూపు మసకబారడం కొంతమందిలో ముఖం ఎర్రబారడం ∙కళ్లు వాచడం లేదా ఎర్రబారడంచర్మంపై దద్దుర్ల వంటివి కనిపించవచ్చు. మలి లక్షణాలు: ప్రారంభ లక్షణాలు కనిపించిన కొద్దిరోజుల్లో ఈ కింద పేర్కొన్న లక్షణాలూ కనిపిస్తాయి. బీపీ తగ్గడం / పడిపోవడం రక్తప్రసరణ తగ్గడం షాక్కు గురికావడం అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ హేమరేజ్) మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్... ఈ కారణంగా దేహంలో నీరు చేరి మనిషి ఉబ్బినట్లుగా కనిపించవచ్చు). నిర్ధారణ : ఆ ప్రాంతంలో హాంటా వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు లక్షణాలను బట్టి అవి హాంటా వైరస్ కారణంగా కావచ్చని అనుమానిస్తారు. వైరస్ సోకిన 72 గంటల లోపల హాంటావైరస్ను గుర్తించడం కష్టం. తొలి పరీక్షలో వైరస్ ఆనవాళ్లు కనిపించకపోతే, లక్షణాలు మొదలైన 72 గంటల తర్వాత మళ్లీ పరీక్ష చేస్తారు. బాధితులు పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాలు మొదలుకొని కొన్ని నెలలు పట్టవచ్చు. అయితే ప్రస్తుతానికి హాంటా వైరస్ అనేది దేశంలో లేనేలేదు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డాక్టర్ కె. శివరాజుసీనియర్ ఫిజీషియన్చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..? -
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి పిల్లల పెంపకంలో ‘ఒత్తిడి, పోటీ, అతిగా పట్టుకోవడం అనే సమస్యను నేటి తరం ఎదుర్కొంటోంది’ అని చెబుతున్నారు. అధ్యాపకురాలిగా తన జీవితపు తొలినాళ్లలో ముగ్గురు కూతుళ్ల పెంపకం ఎలా సాగించారో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నేడు పిల్లల పెంపకం కష్టంగా మారలేదు. కష్టం అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తమ సుఖానికి, సంతోషానికి పిల్లలు అడ్డు వస్తారని కొందరు భావిస్తే, తాము ఎక్కువ డబ్బు కట్టి చదువులు చెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు. నిజానికి ర్యాంకుల ఒత్తిడిలో తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు. సర్దుబాట్లు లేవుమా అమ్మనాన్నలు మమ్మల్ని, మేం మా పిల్లల్ని పెంచినప్పుడు కష్టం అనిపించలేదు. ఈ రోజుల్లో ‘అతి గారాబం’ చూస్తున్నాం. పెంచడం కష్టం అని ఒక్కరిని కనడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆ ఒక్కరికి అన్నీ అమర్చాలనే ఆదుర్దాలో ఎలా పెంచాలో మర్చిపోతున్నారు. దీంతో ఆ పిల్లలు కొద్దిగా కూడా సర్దుకుపోవడం లేదు. ఒకప్పుడు పిల్లలతో సమాజంలోని నలుగురితో ఎలా కలిసిమెలిసి ఉండాలో చెప్పేవాళ్లం. ఇప్పుడవి బాగా తగ్గిపోయాయి.సమాన బాధ్యతరైల్వే డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేదాన్ని. టైమ్ ప్రకారం ఉద్యోగం కాబట్టి పెద్ద సమస్య లేదు. మాది ఉమ్మడి కుటుంబం. అందరూ అందరి బాధ్యతే అన్నట్టుగా ఉండేవారు. అయినా ముగ్గురు కూతుళ్లు పుట్టాక ‘ఉద్యోగం చేయను. పిల్లలను చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటాను’ అని చెప్పాను. కానీ, మా అత్తగారు ‘పిల్లల్ని నేను చూసుకుంటానులే నువ్వు ఉద్యోగానికి వెళ్లమ్మా’ అనేది. అలాగని నా ఆదాయంతో కుటుంబం గడుస్తుందని కాదు. మావారు కూడా గవర్నమెంట్ ఉద్యోగి. కానీ, చదువుకున్న చదువుకు న్యాయం చేయమని చెప్పేవారు. కుటుంబం విషయంలో నేనూ, మావారు ఇద్దరం సమానంగా బాధ్యత తీసుకున్నాం. నా డ్యూటీ పూర్తయ్యేవరకు సాయంత్రం 5 అయ్యేది. పిల్లలు మూడు గంటలకు స్కూల్ అయిపోయేది. ఇలాంటప్పుడు మా వారు పిల్లలను తీసుకొచ్చి, వారికి స్నాక్స్ పెట్టి, నన్ను పికప్ చేసుకోవడానికి కాలేజీ దగ్గరకు వచ్చేవారు. లంచ్ బ్రేక్ తను అలా సెట్ చేసుకున్నారు. పొదుపుగా జీవనంమా చిన్నతనంలో పిల్లలకు డబ్బులు చేతికి ఇవ్వడం అనేది లేదు. ఏడాదికోసారి పుస్తకాలు కొనుక్కోమని పది రూపాయలు ఇస్తే అణాపైసలతో లెక్కరాసి చూపేవాళ్లం. మా పిల్లల విషయంలోనూ అదే నియమం పాటించాను. చదువులోనూ పెద్ద భారం అనిపించలేదు. ముగ్గురివీ గవర్నమెంట్ బడి చదువులే. ప్రొఫెషనల్ కోర్సులు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చేశారు. పిల్లలు ఎవరైనా ‘మెడిసిన్ చేయాలనుంది, కానీ, మా అమ్మనాన్నలు డొనేషన్ కట్టలేక చదవలేకపోయాం’ అనుకోకూడదని జాగ్రత్తపడ్డాం. అందుకు తగినట్టు డబ్బు పొదుపు చేసేవాళ్లం. పిల్లల ఇష్టప్రకారం ఏది చదువుతారో దాని వరకు మా పొదుపు మొత్తాలు ఉండేలా జాగ్రత్తపడ్డాం. అయితే, ఆ డబ్బును వాడే అవసరం రాలేదు. బంధాలు పదిలం ‘మమ్మల్ని ఎలా భరించావు అమ్మా’ అని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అడుగు తుంటారు నా కూతుళ్లు. ‘ఎలా భరించాం అనేది తర్వాత విషయం. మీరు హ్యాపీగా ఉన్నారా..’ అని అడుగుతాను. ‘నువ్వు సూపర్విజన్ చేసి, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చావు. చాలా హ్యాపీగా ఉన్నాం’ అంటారు. మానవ సంబంధాలలో ఎన్నో చికాకులు వస్తుంటాయి. కానీ, అందరితో కలుపుగోలుగా ఎలా ఉండాలో పిల్లలకు చెబుతుండాలి. తల్లిని కాబట్టి నేను ఎలా ఉన్నా మీరు నా దగ్గరకు వస్తారు. కానీ, మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్లతోనూ రిలేషన్స్ను పదిలపరచుకోవాలి అని చెబుతాను. బంధాలను ముందుగానే కాపాడుకోవాలి. పెద్దలు బంధాల గురించి బాధ్యతగా ఉంటే పిల్లలూ నేర్చుకుంటారు. పిల్లల చిన్నప్పుడు మా మాట వినేలాగా పెంచాలనుకున్నాం. కానీ, పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి ఆలోచనలూ పంచుకుంటూ ముందుకు వెళ్లాం’’ అని వివరించారు ఈ ఆధ్యాత్మికవేత్త.పిల్లలతో కలిసి చదువుపిల్లలతో పాటు చదువుకుంటూ నేనూ పీహెచ్డీ చేశాను. సాహిత్యం గురించి చర్చించుకునేవాళ్లం. మావారు ఇంగ్లిష్ లిటరేచర్ చదివేవారు. అలా పిల్లలు కూడా సాహిత్యాభిలాషులు అయ్యారు. కాలేజీ టీమ్స్లో పాటలు పాడేవాళ్లు. థియేటర్ ఆర్ట్లో నంది అవార్డ్స్ తెచ్చుకున్నారు. ముగ్గురూ మంచి చదువులు చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తూనే, కుటుంబ జీవనాన్ని గడుపుతున్నారు. మా పెద్దమ్మాయి మైత్రేయి, రెండో అమ్మాయి రాధాకృష్ణవేణి, మూడో అమ్మాయి గార్గి కనకదుర్గ. రెండో అమ్మాయి స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మూడో అమ్మాయి వరంగల్ ఎన్ఐటీలో చదువుకుంది. కాలేజీలో ఎన్సీసీ తరపున ఢిల్లీ పెరేడ్లో పాల్గొంది. ఆర్మీలో రిక్రూట్మెంట్కు వెళ్లి, మేజర్ స్థాయికి చేరుకుంది. నిర్మలారెడ్డి(చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
స్విగ్గీ టైమ్లో... పిగ్గీ బ్యాంక్!
‘డబ్బు చెట్లకు కాయదు నాన్నా’ ఈ డైలాగ్ ప్రతి మిడిల్ క్లాస్ నాన్న నోట్లోంచి వచ్చేదే. కానీ ఆ మాట పిల్లల బుర్రకి ఎక్కాలంటే చేతికి చిల్లర ఇవ్వాలి. ఇవాళ 10 రూపాయలు దాచడం నేర్చుకుంటే... రేపు 10 లక్షలు దాచడం తెలుసుకుంటారు. పొదుపు అనేది లెక్కల పాఠం కాదు, జీవిత పాఠం. స్కూల్లో టీచర్ చెప్పరు, మనమే చెప్పాలి. మరి ఐదేళ్ల పిల్లాడి నుంచి 15 ఏళ్ల టీనేజర్ వరకు పొదుపు ఎలా నేర్పాలి? ఇదిగో పాఠాలు. ఈ సెలవుల్లో కాసుల క్లాసు తీసుకోండి.పిగ్గీ బ్యాంక్ లాభంనాలుగైదేళ్లు వచ్చే సరికి పిల్లలకు డబ్బులు తెలుస్తాయి. అర్థమవుతాయి. వారికి డబ్బును దాచడం అప్పటి నుంచే నేర్పవచ్చు. ఎలా? ఒక హుండీ కొనివ్వండి. ‘ఇది నీ బ్యాంక్రా కన్నా’ అని చెప్పండి. రోజూ బయటికి వెళ్లొచ్చినప్పుడు రూపాయి, రెండు రూపాయల కాయిన్స్ చేతికిచ్చి డబ్బాలో వేయించండి. నెల తర్వాత డబ్బా ఓపెన్ చేసి వాడి ముందే లెక్క పెట్టండి. ఆ డబ్బుతో నచ్చిన చిన్న బొమ్మ కొనిపెట్టండి. ‘నువ్వు దాచుకుంటే నీకు కావాల్సింది కొనుక్కోగలవు’ అనే నమ్మకం వాడి బుర్రలో పడాలి. ఆటలో నేర్పిన పాఠం ఆఖరు వరకూ గుర్తుంటుంది.మూడు హుండీల విధానంఏడు నుంచి పదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ విధానం చెప్పాలి. వాళ్లకు మూడు హుండీలు ఇవ్వాలి. 1. దాచుకునేది.. భవిష్యత్తు కోసం. 2.ఖర్చుపెట్టేది... చాక్లెట్, బొమ్మల కోసం. 3. దానం చేసేది.. పేదవాళ్లకు ఇవ్వడానికి. పిల్లలకు వారానికి యాభై రూపాయలు పాకెట్ మనీ ఇస్తే, ‘20 రూపాయలు దాచు, 20 రూపాయలు ఖర్చుపెట్టు, 10 రూపాయలు దానం చెయ్’ అని రూల్ పెట్టండి. డబ్బు అంటే కేవలం ఖర్చుపెట్టడం కాదు. దాచుకోవడం, పంచుకోవడం కూడా. మూడు హుండీలు అంటే సంపూర్ణ మనిషి.కోరికలు అవసరాలుమీ ఇంట్లో 11 ఏళ్ల నుంచి 13 ఏళ్ల పిల్లలు ఉంటే వారికి చెప్పాల్సిన పాఠం ఇది. కోరికలు ఏమిటి... అవసరాలు ఏమిటి... ? ఈ పాఠం ఎలా చెప్పాలి? పిల్లలకు ఒక పేపర్ ఇవ్వండి. ‘నీకు కావాల్సినవి రాయి’ అనండి. తర్వాత కూర్చోబెట్టి అడగండి – ‘నువ్వు రాసిన వాటిలో నీ స్కూల్ బ్యాగ్ చిరిగిపోయింది. అది అవసరం. కాని క్రికెట్ బ్యాట్ నీ దగ్గర లేకపోయినా గ్రౌండ్లో వేరే పిల్లల బ్యాట్తో ఆడుకుంటున్నావు. ముందు ఏది?’ అని అడగండి. ‘పాకెట్ మనీ సరిగా దాచుకుంటే ముందు అవసరాలకు తర్వాత కోరికలకు ఖర్చు చేయవచ్చు’ అని చెప్పండి. ‘అమ్మ వద్దంది‘ అంటే ఏడ్చే పిల్లాడు ‘నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు’ అని వాడే అంటాడు. అదే పొదుపులో మొదటి గెలుపు.నీ బ్యాంక్ నీ బాధ్యతమీ ఇంట్లో పద్నాలుగేళ్ల నుంచి పదహారేళ్ల వాళ్లు ఉంటే ఈ పాఠం మీ కోసమే. ఈ వయసు పిల్లలకు నెలకు పాకెట్ మనీ 500 రూపాయలు ఇవ్వండి. ‘ఇది నీ నెల బడ్జెట్. సినిమా, ఫ్రెండ్స్తో పానీపూరి, నెట్ రీఛార్జ్, స్టేషనరీ అన్నీ ఇందులోనే. నెలాఖరుకి 100 రూపాయలు మిగిల్చి చూపించు’ అని టార్గెట్ పెట్టండి. ఒక చిన్న డైరీ ఇవ్వండి. ఖర్చు రాసుకోమనండి. వాడు రెండుసార్లు డబ్బులు అయిపోయాయని మీ దగ్గరకు వస్తాడు. జాలిపడి ఇవ్వకండి. ‘నెక్స్›్ట మంత్ ΄్లాన్ చేసుకో‘ అని చెప్పండి. అప్పుడే డబ్బు, పొదుపు విలువ తెలుస్తుంది.బడ్జెట్ షురూపదహారు నుంచి పద్దెనిమిదేళ్లకు చేరుకున్నాక పిల్లలకు బ్యాంక్ అకౌంట్ తీయండి. ఏ.టి.ఎం. కార్డ్ ఇప్పించండి. పిల్లల పాకెట్ మనీ నేరుగా అందులో వేయండి. ‘ఆన్ లైన్ లో ఏదైనా కొనాలంటే నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి’ అని రూల్ పెట్టండి. వడ్డీ అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అని చిన్న చిన్న మాటల్లో చెప్పండి. వాడు దాచిన 5000 రూపాయలకు మీరు 500 రూపాయలు కలిపి ‘వడ్డీ’ అని ఇవ్వండి. రెక్కలు రాకముందే ఎగరడం నేర్పాలి. దాని వల్ల రేపు పిల్లలు కాలేజీకి వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డు మాయలో పడకుండా ఉంటాడు. గుర్తుంచుకోండి. పొదుపు సరిగా నేర్చుకుంటే రేపటి కోటీశ్వరుడు ఇవాళ మీ ఇంట్లోనే ఉన్నాడు. -
1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!
కాన్స్ క్వీన్, మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ దివా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరోసారి ఫ్రెంచ్ రివేరా రెడ్ కార్పెట్పై తన అద్భుతమైన లుక్తో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ప్రతిష్టాత్మక 79వ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి దశలో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అభిమానుల ఆశలను ఐష్ ఏమాత్రం వమ్ము చేయలేదు. లారియల్ (L'Oreal) బ్రాండ్ అంబాసిడర్గా హాజరైన ఆమె, ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కస్టమ్ స్కల్ప్చరల్ గౌన్లో మెరిసి అందర్నీ మెస్మరైజ్ చేశారు.డిజైనర్ అమిత్ అగర్వాల్ ఐశ్వర్య కోసం ప్రత్యేకంగా రూపొందించిన అబిస్-బ్లూ గౌన్ హాట్ టాపిక్గా నిలిచింది. ఈ అబిస్-బ్లూ (Abyss-Blue) గౌను "లుమినారా" (Luminara) కేవలం ఒక గౌను మాత్రమే కాదు. అందాల ఐశ్వర్యం చుట్టూ ఒక కాంతి వలయం (Energy field) ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ చేయడం దీని స్పెషల్. అంతరిక్షంలో కాంతి ప్రయాణించే అనంతమైన తీరును ప్రతిబింబించేలా రెడ్ కార్పెట్ పై ఉన్న కాంతికి, కెమెరా ఫ్లాష్ లైట్కి గౌన్ లోపల ఏదో లిక్విడ్ (ద్రవం) కదులుతున్నట్లుగా ఒక విజువల్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కేన్స్ వేదికపై అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుతమైన శాఫైర్-బ్లూ గౌన్కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్యారాయ్ మెడలో డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్ ధరించారు. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో ఆమె రెడ్ కార్పెట్పై ఒక దేవకన్యలా మెరిసిపోయారు. దీన్ని రూపొందించేందుకు 1500 (62 రోజుల 12 గంటలు) గంటలు పట్టిందట.1500 గంటల కష్టంఈ గౌను తయారీ వెనుక అమిత్ అగర్వాల్కి చెందిన సిగ్నేచర్ 'క్రిస్టల్ వీన్' ఎంబ్రాయిడరీ టెక్నిక్ ఉంది. దీనికోసం కళాకారులు ఏకంగా 1500 గంటలకు పైగా శ్రమించి, వేలాది క్రిస్టల్స్ చేత్తో అమర్చడం విశేషం. ఇంకా ఐశ్వర్య భుజాల భాగంలో వింగ్స్ (రెక్కలు) తరహాలో డిజైన్ చేసిన నిర్మాణం ఈ గౌనుకు ఒక ప్రత్యేకమైన, ఫ్యూచరిస్టిక్ (భవిష్యత్ కాలపు) లుక్ను తీసుకొచ్చింది. మొదటి లుక్తోనే ఇంతలా అదరగొట్టిన 'కాన్స్ క్వీన్', ముగింపు వేడుకలో (Closing Ceremony) ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఐకానిక్ లుక్ వెనుక డిజైనర్ అమిత్ అగర్వాల్తో పాటు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్పై ప్రశంసలు కురుస్తున్నాయి.ఫ్యాషన్ ఇన్నోవేషన్ను సమపాళ్లలో మిక్స్ చేస్తూ ఈ లుక్ను ప్లాన్ చేశారంటూ అభినందిస్తున్నారు. రెండో లుక్కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో తన రెండోలుక్లో తనదైన ఫ్యాషన్ స్టైల్న చాటుకున్నారు. ఈసారి, ఈ నటి లేత గులాబీ రంగు దుస్తులతో రొమాన్స్ , పురాతన గ్లామర్ను ప్రదర్శిస్తూ, ఈ ఉత్సవానికి మరింత గ్లామర్ జోడించారు. వర్ధమాన మహిళా చిత్రనిర్మాతలను గౌరవించడానికి లోరియల్ పారిస్ నిర్వహించే వార్షిక కార్యక్రమం 'లైట్స్ ఆన్ ఉమెన్స్ వర్త్'కు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఆమె రూబీ-ఎరుపు రంగు గౌను, దానికి సరిపోయే కేప్తో చాలా అందంగా కనిపించారు. -
ఆకాశాన్ని దించుదాం!
స్పేస్కు సంబంధించి పిల్లల క్రియేటివిటీ చూస్తే ఇన్ని అద్భుతాలు వీరి మైండ్లో ఉన్నాయా అని మనకే ఆశ్చర్యమేస్తుంది.వేసవి రాత్రులువేసవి సెలవుల్లో అమ్మమ్మతాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు, రాత్రిళ్లు ఆరు బయట పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉండటం.. బోలెడన్ని కబుర్లు చెప్పుకోవడం.. ఇప్పటి పెద్దవారికి కూడా అందమైనæమధుర జ్ఞాపకాలు. నక్షత్రాలు మెరుస్తుండగా ఆకాశాన్ని చూస్తుంటే పిల్లల్లో ఆశ్చర్యాన్ని, సందేహాలను, ఊహాశక్తిని పెంచుతుంది. ప్రకృతి వేసిన అతి పెద్ద పెయింటింగ్ లాంటిది ఆకాశం. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వర్షం, ఇంద్రధనస్సు.. ఇవన్నీ ఆకాశంలోనే కనిపిస్తాయి.‘నక్షత్రం ఎందుకు మెరుస్తోంది?’, ‘చంద్రుడు మనకోసం ఎందుకు వస్తాడు?’, ‘స్పేస్లో ఎవరు ఉంటారు?’, ‘పగటి పూట నీలంగా కనిపించే ఆకాశం, రాత్రి అయితే నల్లగా ఎందుకు అవుతుంది? అని అడగవచ్చు... అలాంటి ప్రశ్నలే పిల్లలలో విజ్ఞానానికి తొలి అడుగులు అవుతాయి.స్పేస్ అంటే ...భూమి బయట ఉన్న అంతులేని విశ్వంలో.. ఏమేం ఉంటాయి? గ్రహాలు,. నక్షత్రాలు, గెలాక్సీలు.. ఎంత చెప్పినా తరగని గని స్పేస్ పిల్లల సృజనకు మాటల్లో చెప్పలేనన్ని అద్భుతాలకు కేంద్రం అవుతుంది. రాకెట్ల తయారీ, వాటి ప్రయాణం, భూమి స్పేస్లో ఒక చిన్న గ్రహం, చంద్రుడు భూమికి దగ్గరలో ఉన్న సహజ ఉపగ్రహం, సముద్ర అలలపై చంద్రుడి ప్రభావం.. వ్యోమగాములు స్పేస్లో ప్రయాణించి చేసే పరిశోధనలు, రాకెట్ల గురించి, ఇప్పటివరకు వెళ్లిన వ్యోమగాముల గురించి, భారతదేశం స్పేస్లో సాధించిన గొప్ప విజయాలు.. ఇలా ఎన్నో చెప్పవచ్చు.ఆసక్తిని పెంచే యాక్టివిటీస్...నక్షత్రాలు లెక్క పెట్టమని చెప్పండి. ఆకారాలు ఊహించమని అడగండి. చందమామ కథలు, నక్షత్రాల కథలు, రాకెట్ కథలు చెబితే పిల్లలకు బాగా గుర్తుంటాయి. కాగితంతో రాకెట్ తయారు చేయడం. గ్రహాల మోడల్ చేయడం. గ్లోబు చూపించడం, స్పేస్లో భూమి విలువ, ప్రకృతిని కాపాడుకోవడం, ఎన్నో రహస్యాలకు పెద్ద గని స్పేస్. మనిషి బ్రెయిన్ కూడా స్పేస్. అందులో పుట్టుకువచ్చే అద్భుతాలను తమదైన శైలిలో పిల్లల్ని ఆవిష్కరించమని చెప్పండి. పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. సైన్స్ మీద ఆసక్తి కలుగుతుంది. ప్రశ్నలు అడిగే అలవాటు పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఒక చిన్న నక్షత్రాన్ని చూసి కూడా పిల్లలు పెద్ద కలలు కనగలరు. స్పేస్ గురించి తెలుసుకునే విషయాలతో వారి సెలవు రోజులన్నీ పూర్తిగా నిండిపోతాయి.‘పిల్లల మెదళ్లలో ఎన్నో సృజనాత్మక ఆలోచనలకు ఆకాశమే హద్దు అవుతుంది. రాత్రిపూట చుక్కల ఆకాశం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చంద్రుడు, సూర్యుడు ఆకాశంలో ఎలా ఉంటారు? విశ్వం అద్భుతం గురించి తెలియజెబితే.. పిల్లలు ఎంత ఆసక్తిగా వింటారో చాలా క్లాసుల్లో నేను గమనించాను’ అంటారు నటి, ఆర్ట్ టీచర్ గీతా భాస్కర్ (Dhaassyam Geetha Bhascker).చదవండి: అన్నీ ఇచ్చే నేలమ్మకు ఏమిద్దాం? ‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన..ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.comనిర్వహణ: నిర్మలారెడ్డి -
కొత్తదారి..1,2,3... స్టార్ట్!
బిజినెస్ ఐడియా ఉన్నప్పటికీ పెట్టేందుకు పెట్టుబడి లేదు. డబ్బులు ఉన్నాయి, ఎలాంటి బిజినెస్ పెడితే సక్సెస్ అవుతాం? ఒక బిజినెస్ను స్టార్ట్ చేశాం దానిని ఎలా ముందుకు తీసుకు΄ోవాలి? అని తర్జన భర్జన చెందుతుంటారు. ఇలాంటి వారి కోసమే ‘సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ’ పేరుతో ఒక వేదికను సిద్దిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఏర్పాటు చేశారు. చిన్నకోడూరుకు చెందిన రామిని మధు సిద్దిపేటలో కెరీర్ సర్వీస్ను నిర్వహిస్తున్నాడు. సిద్దిపేటకు చెందిన ఆచి విజయ్ ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు...వాక్ అండ్ టాక్సిద్దిపేట పట్టణంలో ‘సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ’ ఆధ్వర్యంలో వాక్ అండ్ టాక్ కార్యాక్రమాన్ని చేపట్టారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునేవారికి ఎలాంటి కంపెనీ ప్రారంభిస్తే సక్సెస్ అవుతారో ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లు, వివిధ రంగాల నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముగ్గురికి ఉచితంగా ప్రమోషన్ప్రతీ వారం హాజరైన వారిలో నుంచి ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రమోషన్ చేస్తున్నారు. వారి స్టార్టప్లకు ఉచితంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేటకు చెందిన నాగహర్ష సిద్దిపేట క్విక్ డెలివరీ యాప్ తయారీకి ఇన్వెస్టర్గా ముందుకువచ్చాడు. అరవింద్ రెడ్డి వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నాడు. నిర్వాన్ ఆర్గానిక్ ఫాం ద్వారా మార్కెట్లోకి వచ్చేందుకు అవకాశం లభించింది. సిద్దిపేట పట్టణానికి చెందిన భవాని అబాకస్ శిక్షణ ఇచ్చేవారు. ఈ కమ్యూనిటీ ద్వారా ఎక్స్ ఎల్ అబాకస్ వారి ్ర΄ాంఛైజీ లభించింది. ‘వాక్ అండ్ టాక్’ కార్యక్రమం ఇస్తున్న ఫలితాలకు ఇవి కొన్ని ఉదాహరణలు.ఆలోచన ఉంటే డబ్బు ఉండదు... డబ్బు ఉంటే ఆలోచన ఉండదుప్రతి ఒక్కరికీ బిజినెస్ చేయాలని ఉంటుంది. కానీ వారికి ఇన్వెస్ట్ చేసేంత డబ్బు ఉండదు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండి సరిౖయెన ఫ్లాట్ఫాం ఉండదు. ఈ నేపథ్యంలోనే యువతకు గైడెన్స్ ఇవ్వాలని సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీకి శ్రీకారం చూట్టాం. మా కమ్యూనిటీ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మా ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.– మధు, విజయ్– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
దళపతి విజయ్ హెయిర్స్టైల్ వెనుక సీక్రెట్ ఇదే..! అదే ఆయన్ను..
ఓ వ్యక్తి ఆహార్యంలో హుందాతనం, స్టైలిష్ని కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసే వాటిలో కురులది ప్రధాన పాత్ర. ఆ హెయిర్స్టైలే పెద్ద మనిషిలా హుందాగా చూపించడం, అలాగే పాతికేళ్ల కుర్రాడి లుక్ చూపించడంలోనూ కీలకంగా ఉంటుంది. ఆ విషయంలో దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ చాలా ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అయిన హెయిర్స్టైల్స్ యువతను ఎంతలా ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రాగానే తన ఆహార్యం మొత్తం మార్చుకుని ఓ పెద్ద తరహా లుక్తో కనిపించే హెయిర్స్టైల్తో ముందుకొచ్చి ప్రజల మనసుని గెలుచుకున్నారు. ఇంతలా హీరో దళపతిని అందంగా హెయిర్ని స్టైల్ చేసి చూపించే వ్యక్తి ఎవరంటే..తమిళనాడులో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టిపెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో విజయదుందుబి మోగించి చర్రిత సృష్టించారు దళపతి విజయ. హీరోగా మొదలై..ఓ రాష్ట్రాన్ని పాలించే నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తి కూడా. నటనలోనూ నాయకుడిగా తనదైన మార్కుని చూపిస్తూ..ప్రజలకు మంచి పాలన అందించే దిశగా దూసుకుపోతున్నారు. ఒక నాయకుడిగా పెద్దతరహాలో కనిపించే ఆయన ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించేది హెయిర్. అంత అందంగా ఆయన హెయిర్ని తీర్చిదిద్దే వ్యక్తి జగదీష్ అవస్థి. 30 ఏళ్ల ఈ హెయిర్ స్టైలిస్ట్ దళపతి అభిమానులను అలరించేలా రకరకాల హెయిర్ని తీర్చిదిద్దడంలో దిట్ట. బిగిల్' సినిమా నుంచి 'లియో', 'గోట్ (GOAT)' వరకు విజయ్కి హెయిర్ స్టైలింగ్గా వ్యవహరిస్తున్నాడు. జగదీస్ విజయ్తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ను సీఎంగా చూడటం తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. తనకు పదోతరగతి నుంచే సినిమాల్లో నటించాలని ఉండేది. ఆ నేపథ్యంలోనే సెలూన్కి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి, ఒక సెలూన్లో పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన హెయిర్స్టైలిస్ట్ల ద్వారా విజయ్ బిగిల్ మూవీ కొత్త హెయిర్స్టైల్ కోరుకుంటున్నారని తెలిసింది. అలా ఆయన్ను తనకు కలిసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రతీ మూవీకి తనే హెయిర్స్టైలిస్ట్గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జననాయగన్కు కూడా ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపాడు. విజయ్ హెయిర్స్టైల్లో బాగా పాపులర్ అయ్యింది 'బీస్ట్' స్టార్ హెయిర్స్టైల్. అయితే హీరో విజయ్ది సహజంగా ఒత్తుగా హెల్దీగా ఉండే జుట్టు కావడంతో ఈ హెయిర్స్టైల్ బాగా నప్పిందని చెప్పుకొచ్చాడు. అదీగాక సులభంగా రకరకాల హెయిర్స్టైల్లోకి మార్చగలమని చెప్పుకొచ్చాడు. అంతేగాదు ప్రతి మూవీలోని ఆయన పాత్రకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆయన జుట్టుకు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. 'మాస్టర్' సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు బాగా చేశావ్ అబ్బాయ్ అని ప్రశంసించన క్షణం ఇప్పటికీ మరువలేను అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇక 2023లో లియో జుట్టుతో చేసిన వైరల్ లుక్ గురించి మాట్లాడుతూ..ఆ లుక్ల సాల్ట్-అండ్-పెప్పర్ (ఉప్పు-మిరియాల) జుట్టు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ స్టైల్లో నుదుటిపై జుట్టు పడే స్టైల్ మాత్రం ఆయన ఆలోచననే అని క్రెడిట్ మొత్తం హీరో విజయ్కే ఇచ్చాడు. అంతేగాదు ఆయ హెయిర్ని సరిచేస్తున్నప్పుడు కూడా చాలా ఓపికగా ఉంటారని అన్నాడు. అలాగే సెట్లో ప్రతిఒక్కర్ని శ్రద్ధగా చూసుకుంటారని, అందరితోటి చాలా సౌమ్యంగా మాట్లాడతారని చెప్పుకొచ్చాడు. చివరగా యవతరం హెయిర్స్టైలిస్ట్లకు చక్కటి చిట్కాలే కూడా సూచించాడుకేవలం హెయిర్స్టైల్స్ మాత్రమే నేర్చుకోకండి , మనుషులను అర్థం చేసుకోవడం, వారి వ్యక్తిత్వం, కెమెరా కోణాలు, ఫ్యాషన్ ఉనికిని క్యాచ్ చేయడం వంటి వాటిపై పట్టు తెచ్చుకుంటేనే మన నైపుణ్యం అందర్నీ ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రతీ సీజన్లో ట్రెండ్లు మారుతుంటాయి కానీ మీ ప్రత్యేకత, వృత్తి నైపుణ్యమే మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టేలా పేరుని తెచ్చుపెడుతుందని అన్నాడు. (చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్గా విదేశీ మహిళ పోస్ట్) -
అంతరించి పోతున్న 'బంజారా'కు గ్లామర్
పేదింటి బిడ్డ ప్రమీలాకు చదువు అంటే ఇష్టం. తన మాతృభాష బంజార భాష అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను లిపి లేని బంజార భాష వ్యాకరణంపై పరిశోధన చేసేలా చేసింది. నల్గొండ జిల్లా, తిరుమలగిరి నేతపురి ధన్సింగ్ తండాకు చెందిన మేగవత్ ప్రమీల ‘బంజారా భాషకు తెలుగులో రాసిన వర్ణనాత్మక వ్యాకరణం’పై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన తొలి వ్యక్తి కావడం విశేషం. మారుమూల తండాలో పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ప్రమీల చిన్నతనం నుంచే కూలీపనులు చేసేది. ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించి ఇంటర్ కాలేజీ టాపర్గా నిలిచింది. కోఠి మహిళా కాలేజీలో(వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ)లో డిగ్రీ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేసింది. 2017లో యూజీసి నెట్, జేఆర్ఎఫ్ సాధించింది. ‘తెలంగాణ జిల్లాలలోనే బంజార భాషల్లో ఎంతో వైవిధ్యం ఉంది. ఆయా జిల్లాలలోని బంజారాలు మాట్లాడే భాషను తెలుగులో రాసుకుని వాటికి వ్యాకరణం రాయాల్సి వచ్చింది. అంతరించి పోతున్న బంజార భాష సంరక్షణకు నా వంతుగా కృషి చేయాలనే ఉద్దేశంతో నా మాతృభాషకు సంబంధించిన పరిశోధన అంశాన్ని ఎంచుకున్నాను. బంజార భాషలోని విభిన్న శైలులను ఏకం చేసేందుకు చేసిన చిన్న ప్రయత్నం ఇది. బంజారాలు మాట్లాడే భాష, యాసలకు ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా దాని సంరక్షణకు నా పరిశోధన కొంత మేరకు ఉపయోగపడనుంది’ అంటుంది ప్రమీల.– సుధాకర్ కంతి, సాక్షి, లాలాపేట -
అడవి ద్రాక్షతో ఇన్ని ప్రయోజనలా..!
వాడుక భాషలో అడవి ద్రాక్షకు వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లున్నాయి: అస్సామీలో గోవాలియా లత, పానిలత అని, ఇంగ్లీష్ లో వైల్డ్ గ్రేప్, జంగల్ అంగూర్, దిబ్రోలి అని, ఒరియాలో పనికచో, పానినోహ, దిబ్రోయి, కంజినోయి, పానిపరు అని, కన్నడలో చితహంబు, కడుద్రాక్ష, కట్టుకోడి మిండ్రి అని, గుజరాతీలో జంగ్లీ డ్రక్ అని, తెలుగులో అడవి ద్రాక్ష, అడవి తీగ ద్రాక్ష, బెడసతివ్వ, దొబ–తీగ, పుల్ల తీగ, బెంగాలీ లో గొవాలియా–లత అని, మరాఠీలో ఒకేల, నడెన, రాన్ ద్రాక్ష గోలింద్ అని, మలయాళంలో వియ–పిర–పిటిచ, కరంట వల్లీ, చంబ్రవల్లీ అని, హిందీలో గొలిండ, కట్టిబేల్, పనిబేల్ అని, సంస్కృతంలో ఆమ్ల వెటసహ, వన ద్రాక్ష అని అంటారు. నేపాలీలో పురేని అంటారు. పూత : మే – ఆగస్టు పండ్లు : డిసెంబర్ – జనవరిదీనికి 1824లో ‘విటిస్ లాటి ఫోలియా’ అనే శాస్త్రీయ పేరు పెట్టిన 60 ఏళ్ల తర్వాత ‘అంపెలోస్పిస్ లటిఫోలియా’గా పేరు మార్చారు. వీటి పండ్లు ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఉంటాయి. పండిన తర్వాత ఎరుపు నలుపు రంగుకు మారుతాయి.English Name:Wild Grape/Jungal Angoorశాస్త్రీయ నామం: అంపేలో సిస్సన్ లటిఫోలియాScientific Name: Ampelocissus latifolia (Roxb.) Planch.Synonym (s): Vitis latifolia Roxb. Cissus latifolia (Roxb.) Walp.కుటుంబం: విటేసిFamily: Vitaceaeఉనికి: ద్రాక్ష మాదిరిగానే దీనికి కూడా పాకుడు గుణం ఉంది. వీటికి వేరు గడ్డలు ఉంటాయి. గడ్డలు నాటుకోవచ్చు లేదా∙విత్తనం కూడా వేసుకోవచ్చు. ఎంతో విలువైన తీగ చెట్టు. ఈ పండ్లలో 2–4 గింజలు ఉంటాయి. ఈ తీగ చెట్టు స్వస్థలం భారత ఉపఖండం, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మాల్దీవులు మొదలగు దేశాలలో గుర్తించారు.మన దేశంలో ఎక్కువగా అస్సాం, ఈస్ట్ హిమాలయాల వరుస, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రాల్లో అడవి ద్రాక్ష కనిపిస్తుంది. అధిక వర్షపాతం ఉన్న అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. నల్లమల అడవుల్లో ఒకప్పటి సాంద్రత ప్రస్తుతం లేదు. దీనిపై ఉన్నత స్థాయి పరిశోధనలు జరిగినప్పటికీ దీని ప్రయోజనాలు ప్రజల చెంతకు చేరలేదు.ప్రయోజనాలుఅడవి ద్రాక్ష పండ్లు తినదగినవే. ఇవి సాధారణ ద్రాక్ష గుత్తుల్లాగే మొదట ఆకుపచ్చగా ఉండి ఎరుపునకు మారి ఆ తరువాత నలుపు రంగుకు మారతాయి. వగరు తీపితో కూడుకొని ఉంటాయి.ఈ తీగ చెట్టుకు ఔషధగుణాలు ఉన్నాయి.ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటిని తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.వీటి నుంచి ఎర్రరంగును తయారు చేస్తారు. ఈ రంగుకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఈ గింజల నుంచి పలుకులను వేరు చేసి తింటారు. ఈ పలుకులు మొర్లి పలుకులను పోలి ఉంటాయి.అనేక రోగాలను తగ్గించటానికి నాటు వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా విరేచనాలు, బొల్లి, పంటి సమస్యలు, కడుపు నొప్పి, గౌట్, టీబీ అజీర్తి, శరీరపు వీక్ నెస్ తదితర సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడుతారు.ఎముకల పటిష్టతకు ఉపయోగిస్తారు.ఆయుర్వేద, హోమియో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ తీగ చెట్ల వినియోగం తప్ప భద్రపరచడం తక్కువ కాబట్టి రానున్న రోజుల్లో ఈ జాతి అంతరించే ప్రమాదం ఉంది.దీనిపై నిర్దిష్టమైన పరిశోధనలు చేసి ఫలితాలను రైతుల చెంతకు చేర్చితే అనేక విధాలుగా లబ్దిపొందవచ్చు. అంటు ద్రాక్ష మొక్కల తయారీకి వీటి కొమ్మలను రూట్ స్టాక్గా వాడవచ్చు.ఈ పండ్లలో ఆల్కేన్ ఈస్టర్స్, అమెన్స్, కిటోన్స్, హల్డే హైట్స్ తదితర ఆమ్లాలు ఉంటాయి. డాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్ (చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!) -
ప్లీజ్..వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి!
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారమే ఆరోగ్యకరమైనది. నాలుకకు రుచిగా, కంటికి ఇంపుగా కనిపించే జంక్ఫుడ్ ఎన్నటికీ అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారమే ఒత్తిడి, అలసట, నిరుత్సాహం వంటి మూడ్స్కి కారణమవుతుందని గమనించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారం కారణంగానే..మన ఒత్తిడి, ఆందోళన బారిన పడి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం.మన తీసుకునే ఆహారం కేవలం కేలరీలు మాత్రమే కాదు, శక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, స్వస్థత వంటి వాటిక మూలం. నిరంతరం అలసటగా, ఉబ్బరంగా, ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడి ఎదురవ్వుతుంటే శరీరం ఆహారాన్నికాదు పోషణను కోరుకుంటుందని అర్థమట. అందుకే శుభ్రమైన ఆహరం తినమని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా సహజమైన ఆహారాన్నే ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మనస్సు + ఆరోగ్యకరమైన శరీరం అని నొక్కి చెబుతున్నారు. దయచేసి వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి.. స్వస్థతకు ఆహారం ఇవ్వడం ప్రారంభించండి అని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.డా. ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం నిపుణుల ఆధారంగా ఇచ్చిన కథనం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!
చిన్నచిన్న కారణాలకే జీవితం ముగిసిపోయినట్లుగా కుంగిపోతాం. కానీ ఈ వ్యక్తిని చూస్తే కష్టం అంటే ఇది కదా..అని అంగీకరిస్తారు. భవిష్యత్తు అనేదే అగమ్యగోచరంగా ఉన్నా..అతడు పోరాడి జీవితంలో గెలవాలనుకున్న విధం చూస్తే ..అత్యుత్తమ ప్రేరణకర్త, స్ఫూర్తిప్రదాతగా అనిపిస్తాడు. అంతేగాదు అతడిని బాధపెట్టిన విధి సైతం చేతులెత్తి నమస్కరించేలా విజయ శిఖరాన్ని అధిరోహించాడు. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరంటే..అతడే రష్యన్ పర్వతారోహకుడు రుస్తమ్ నబీవ్. అసామాన్య ఘనతను సాధించాడు. ఎలాంటి కృత్రిమ అవయవాలు లేకుండా కేవలం చేతులతో మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన తొలి డబుల్ ఆంప్యూటీగా చరిత్ర సృష్టించారు. నేపాల్లో కొనసాగుతున్న వసంతకాల పర్వతారోహణ సీజన్లో భాగంగా బుధవారం (మే 20) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించారు. నబీవ 2015లో తన రెండు కాళ్లను కోల్పోయిన మాజీ పారాట్రూపర్. ఈ చారిత్రాత్మక అధిరోహణ అనంతరం నబీవ్ సోషల్ మీడియా పోస్ట్లో మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన ఒక ఫలకం పట్టుకుని కనిపిస్తారు. ఆ ఫలకంపై ఇలా రాసి ఉంది. "కింద పడగానే జీవితం ముగిసిపోతుందని భావించిన వారికి ఈ సాహసం అంకితం అని ఉంది. ఆయన ఈ మే 20వ తేదీన నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8:16 గంటలకు పర్వాతారోహణ చరత్రలోనే తొలిసారిగా, మానవ చరిత్రలోనే తొలిసారిగా చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోకు క్యాప్షన్గా పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో నబీవ్ ప్రతి ఒక్కరికి ఈ అధిరోహణను అంకితం చేస్తున్నాను. ఈ సాహసంతో తాను చెప్పదలచుకున్నదేంటంటే గొంతులో ప్రాణం ఉన్నతం వరకు పోరాడండి. దయచేసి చివరి వరకు పోరాడండి. అని పేర్కోన్నాడు పోస్ట్లో. ఈమేరకు అతడి ఎవరెస్టు అధిరోహణను ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని ఫీల్డ్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఖిమ్ లాల్ గౌతమ్ ధృవీకరించారు. కాగా, నబీవ్ 2015లో తను నిద్రిస్తున్న సైనిక బ్యారక్స్ భవనం కూలిపోవడంతో రెండు కాళ్లను కోల్పోయాడు. అయితే ఆ ఘటనతో కుంగిపోకుండా కోలుకుని బహిరంగ కార్యకలాపాలు, పర్వతారోహణ కార్యకలాపాల వైపు మళ్లించి..మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు. నెటిజన్లు సైతం నబీవ్ అద్భుతైన ధైర్యాన్ని, పట్టుదలను ప్రశంసిస్తూ..మీరు అత్యుత్తమ ప్రేరణ కర్త, ఏదైనా సాధ్యమే అని మీ సాహసంతో గొంతెత్తి చాటారు అని పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Рустам Набиев (@rustam_nabiev92) (చదవండి: 'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా': ఆరోగ్యానికి మంచిదేనా?) -
ఆటో పాఠాలూ... జీవిత సత్యాలు!!
రాంబాబుగాడి ఇంటికి చేరే సమయానికి వాడు ఆటో ఫొటోకు దండేసి, ఊదుకడ్డీలు వెలిగించి ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రం... పైగా అది వెనక్కు తిరిగి ఉన్న ఆటో!! వాడి సంగతి తెలిసిందేగా. ఏదైనా ఎక్స్ట్రీమ్. అందుకే మొదట పెద్దగా పట్టించుకోలేదుగానీ... చివరాఖరికి ఆగబట్టుకోలేక అడిగేశా... ‘ఏంట్రా ఇదీ?’ అని. ‘‘మహా మహా వ్యక్తిత్వ వికాస నిపుణులకు లక్షలాది రూపాయలిచ్చీ, పెద్ద పెద్ద హోటళ్లలో ఖరీదైన రూములిప్పించీ, భారీ భారీ కాన్ఫరెన్సు హాళ్లు బుక్ చేసీ వాళ్ల చేత పనికిమాలిన పర్సనాలిటీ డెవలప్మెంటు స్పీచులెన్నో ఇప్పించుకుంటారుగానీ... పైసా తీసుకోకుండా జీవితపాఠాలెన్నో చెప్పేదేరా ఆటో... మన మంచి ఆటో’’ అంటూ కొన్ని లైఫ్ లెసన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. అవీ... ‘‘నన్ను చూసి ఏడ్వకురా... అప్పు చేసి కొన్నా’’ → అంటే ఏమిటీ? ఏడుస్తూ ఉండటం వల్ల లాభముండదు. హాయిగా నవ్వుతూ బతకాలి. అప్పుడే సంతోషం. ఎవరినీ చూసి అసూయ పడకు. వీలైతే జాలి పడు. కడుపుకు తిన్నా తినకున్నా వాడు కడుపు కట్టుకుని మరీ ఈఎమ్ఐలు కట్టాలి కదా.‘‘స్టీరింగు తిరగనీ, చక్రాలూ తిరగనీ, కళ్లు మాత్రం తిరగనీకు’’→ జీవితంలో కొన్ని తిరగడం వల్ల ప్రయోజనం ఉంటుందనీ... మరికొన్ని తిరగకపోతేనే మంచిదనేదే ఇక్కడ సూక్తి! మొదటి రెండూ తిరిగితే గమ్యం చేరగలం. కళ్లు తిరిగితే ఆ డ్రైవర్కే కాదు... సదరు సెవన్సీటరు ఆటోలోని అందరికీ ముప్పు. ఇక్కడ ఇంకో సూక్తీ దాగుంది. రోడ్డు మీద నుంచి నీ కళ్లను పక్కకు తిప్పకూ... తిరగనీకు! అలా తిరిగితే యాక్సిడెంటు కావచ్చు. అది బోలెడంత ప్రమాదం. ‘‘రోడ్ కింగ్’’ → ఇదెన్ని లారీల మీదా ట్రక్కుల మీదా ఉంటుందో తెలుసా! రెండు ముక్కల్లోనే ఎంత లైఫ్ ఫిలాసఫీ!! నువ్వెక్కడ బతికినా సరే రాజాల బతుకు. ఇంట్లోనూ రాజే... రోడ్డెక్కినా రాజులాగే. ఇలా బతికేవాడు జీవితం పట్ల ఏ ఫిర్యాదూ లేకుండా హాయిగా మొనగాడి బతుకు బతుకుతాడని అర్థం.‘‘పడకు పడకు వెంట పడకు... కీప్ డిస్టాన్స్’’ → ఎన్ని ఆటలో మీదా, మరెన్ని ట్రక్కులూ, లారీల వెనకాల రాసుంటుందీ కొటేషన్! వాహనం నడిపేటప్పుడూ ఎవ్వరి వెనకా పడొద్దు. యాక్సిడెంట్లు కావచ్చు. ఇక జీవితం విషయానికి వస్తే ఏ అమ్మాయి వెనకా పడకు. సామాన్యుల నుంచి సహాయ మంత్రుల కొడుకుల వరకూ వర్తించేదీ కొటేషన్. ఇది లాస్ట్లో ఎందుకు చెబుతున్నానంటే... ఈ కొటేషన్ పాటించి ఉంటే ఇవ్వాళ మహామహా మాన్యులూ మంత్రుల కుమారుల దగ్గర్నుంచి, సాధారణ సామాన్యుల కొడుకుల వరకూ అందరూ ఇళ్లల్లోనే... కిలకిల నవ్వుతూ కలకల తుళ్లుతూ కళ్లముందే హాయిగా ఉంటారని చెప్పేందుకే ఈ సూక్తి. లిస్టులో లాస్ట్దే అయినా బట్ నాట్ లీస్ట్దీ కొటేషన్. తమ మీటర్లను గిర్రున తిప్పేందుకు దూరం దారుల్లో తీసుకెళ్లి తిప్పుతారనీ, మీటర్ల మీద ఎడాపెడా ఎగస్ట్రాలడుగుతారనీ... వాళ్లను ‘ఆటో’వికులంటూ ఆడిపోసుకుంటాంగానీ... ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా వాటిని గమనించని మనమే ఆటవికులమని తెలియడం లేదా. లోక విద్యార్థుల కోసం తన వీపునే బ్లాక్బోర్డు చేసుకుని జ్ఞానమందించేదే ఆటో! అందుకే జై ఆటో. జైజై ఆటో! అందమైన ఆటో కొటేషన్లు రాయించే అందరికీ ఇవే నా జేజేలంటూ లైఫ్లెసన్ ముగించాడు మా రాంబాబుగాడు.– యాసీన్ -
అలా చేస్తే భూమితల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది!
భూమి సూర్యుడి చుట్టూ, తన చుట్టూ తనే తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. మనం జీవించడానికి గాలి, నీళ్లు, వెలుగు ఫ్రీగా ఇస్తుంది. మన జీవనానికి ఎంతో మేలు చేస్తున్న నేల తల్లిని రోజూ ఉదయం నిద్ర లేవగానే తాకి, కళ్లకు అద్దుకుంటే మనలో ఎంతో ప్రేమ, బాధ్యత కలుగుతాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. సునామీలు వస్తుంటాయి. కానీ, ఇక్కడ మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతుంది.నిర్లక్ష్యం తగదుభూమి మనకు రోజులో 24 గంటల సమయం ఇచ్చింది. సగం వెలుతురు, సగం చీకటి. వెలుగులో పని చేసుకోవాలి, చీకటిలో విశ్రాంతి తీసుకోవాలి. ఎంతో జీవరాశికన్నా మనకు మంచి ఆలోచనలు ఇచ్చింది. తినడానికి, ఉండటానికి ఎంతో మంచిని ఇచ్చిన భూదేవిని మనం ఎంత బాగా చూసుకోవాలి. కానీ, మనలో చాలా మంది ఏం చేస్తారు, భూమి మీద ఉమ్మివేస్తారు, కాళ్లతో తన్నుతుంటారు, చెత్త పడేస్తుంటారు.. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మనకు భూమి మీద ఉండే అవకాశాన్ని, హాయిగా తిరిగేలా సంతోషాన్ని ఇస్తున్న భూమిని శుభ్రంగా ఉంచుతూ, మనం కూడా మంచి చేస్తూ ఉంటే భూమితల్లి సంతోషిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తుంది.సరిపడే కాంబినేషన్మన చుట్టూ ఎంత నీటుగా పెట్టుకుంటామో అంత మంచిని తిరిగి ఇస్తుంది భూమితల్లి. చెట్లు మనకు ఆక్సిజన్ని ఇస్తాయి, మనం వాటికి కార్బన్డై ఆక్సైడ్ను ఇస్తాం. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎప్పుడూ కలవవు. అలాగే అందరూ భిన్నంగా ప్రవర్తిస్తారు. కానీ, ఒకదాని నుంచి ఒకటి సాయం పొందుతూ కలిసి మెలిసి ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడం అనే కాంబినేషన్ మన చుట్టూతా ఉంది. ఒక చెట్టు పువ్వు, కాయ, పండు ఇస్తుంది. మనం కూడా మన చుట్టూ ఉండేవారికి మనలోని మంచి పువ్వులను, ఫలాలను ఇవ్వాలి.ఆనందమే బహుమతిసూర్యోదయం వేళలలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. మొక్కలు రంగు రంగుల అందమైన పువ్వులను ఇస్తాయి. చెట్లు నీడను ఇస్తాయి. వర్షం పడితే నేల నుంచి మంచి వాసన వస్తుంది. ఇవన్నీ భూమాత మనకు ఇస్తున్న చిన్న చిన్న బహుమతులు. మన అమ్మ మనల్ని ప్రేమగా చూసుకుంటుంది కదా, అలాగే భూమాత కూడా ఎలాంటి ఫలితం ఆశించకుండా మనందరినీ చూసుకుంటోంది. చిన్నవాళ్లమా, పెద్దవాళ్లమా అని కూడా చూడదు. ప్రతి జీవికీ ఈ భూమ్మీద చోటు ఇచ్చింది. పక్షులకు గూళ్లు, జంతువులకు అడవులు, మనుషులకు ఇళ్లు.. అన్నీ భూమాత ఒడిలోనే ఉన్నాయి. ఇన్ని ఇస్తున్న భూమాతకు మనం తిరిగి ఏం ఇస్తున్నాం ∙మొక్కలను నాటి, సంరక్షించాలి. చెట్లను కాపాడుకోవాలి ∙ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ∙నీటి వృథాను అరికట్టాలి. భూమితల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనమూ బాగుంటాం అనే ఆలోచనను చేయాలి. ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తున్న భూమిని మనం ఎలా చూసుకోవాలో మీ ఆలోచనల ద్వారా చూపండి. ధన్యవాదాలు చెబుతూ బాధ్యతగా నడుచుకుంటే ఎన్నో ఆనందాలను మనం అందుకోవచ్చు. ఈ విధంగా చెబితే పిల్లలు మరింతగా భూమితో కనెక్ట్ అవుతారు. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. అనేవి తమ సృజనతో పెద్దలకే పాఠాలు చెబుతారు.నిర్వహణ: నిర్మలారెడ్డిసినీ దర్శకుడు, నటుడు తరుణ్భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ (Dhaassyam Geetha Bhascker) ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com -
కిమ్ కర్దాషియాన్:'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా'
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్, మోడల్, బిలియనీర్ కిమ్ కర్దాషియాన్ రోజకు 35 సప్లిమెంట్లు తీసుకుంటుందట. వాటిని రోజుకు మూడుసార్లుగా విభజించుకుని మరి తీసుకుంటానని ఇటీవల అమీ పోలర్ పోడ్కాస్ట్లో పాల్గొన్నప్పుడు ఆమెనే స్వయంగా తెలిపింది. దీని కారణంగా 'పిల్ ఫెటీగ్' (మాత్రల అలసట)తో బాధపడుతున్నానని కూడా తెలిపింది. అయితే ఆ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోలేక కొన్నాళ్లు ఆపేసినట్లు తెలిపింది. అయితే కొద్దిరోజుల్లనే మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఈ మందులను నేరుగా శరీరంలోకి ఎక్కించుకునేలా ఐవీ డ్రిప్ ఉంటే బాగుండును ప్రతిసారి వర్క్టైంలో గుర్తుపెట్టుకుని వేసుకోలేక అవస్థ పడుతున్నా అని బాధగా చెబుతుంది. అసలు నిజంగా ఒక మనిషి ఇన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే..సప్లిమెంట్లు అదనపు పోషణను అందించి, పోషకాహార లోపాలను భర్తీచేయడంలో సహాయపడినప్పటికీ, రోజుకు 35 సప్లిమెంట్లు అంటే.. సురక్షితం కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్రమైన హాని అని, అవయవాలు దెబ్బతినొచ్చు లేదా జీర్ణ సమస్యలు, కణజాలంలో విషపదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.సప్లిమెంట్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెబుతున్నారు. ఇవి కేవలం పోషకాహార లోపాలకు చికిత్స చేయడానికి, ఇతర వ్యాధులకు , అనారోగ్య సమస్యల నుంచి బయపడటానికి ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను నిల్వ చేసుకోగల సామర్థ్యం కారణంగా, వాటిని అధికంగా తీసుకుంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా, కొన్ని సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయానికి నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, నరాల దెబ్బతినడం, ఔషధాల మధ్య ప్రతిచర్యలు తదితరాలు సంభవిస్తాయని అన్నారు. ఇదేదో ట్రెండ్లా లేదా సెలబ్రిటీలు వాడుతున్నారనో అస్సలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. సప్లిమెంట్లను అధికంగా తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు1. విటమిన్ విషప్రభావం (విటమిన్ టాక్సిసిటీ)అధిక మోతాదు తీసుకోవడం వల్ల మూత్రపిండాల దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, కడుపునొప్పి, విరేచనాలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.2. ఖనిజాల అధిక భారం (మినరల్ ఓవర్లోడ్)విటమిన్ల మాదిరిగానే, ఖనిజాల అధిక భారం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, సప్లిమెంట్ల రూపంలో తీసుకునే అదనపు ఐరన్ తీవ్రమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగించి, కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.ప్రమాదకరమైన ఔషధ రియాక్షన్ (డ్రగ్ ఇంటరాక్షన్స్)సప్లిమెంట్లు శరీరం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చగలవు. ఉదాహరణకు, విటమిన్ కె రక్తాన్ని పల్చబరిచే మందుల (బ్లడ్ థిన్నర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అధిక వినియోగంబ్రేక్ఫాస్ట్ సెరియల్స్, ఎనర్జీ బార్లు, జ్యూస్ల వంటి అనేక రోజువారీ ప్రాసెస్ చేసిన ఆహారాలలో విటమిన్లను అధికంగా కలుపుతారు. రోజువారీ మల్టీవిటమిన్ల తోపాటు నిర్దిష్ట లక్షిత సప్లిమెంట్లు తీసుకుంటే మాత్రం తెలియకుండానే అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుందటపరిగణించవలసిన భద్రతా చిట్కాలుఏ రకమైన ఆహార సప్లిమెంట్లు అయినా వాడే ముందు వైద్యుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో తీసుకోవాలి. అలాగే మనం వాడే సప్లిమెంట్లు మంచి నమ్మదగిన బ్రాండ్వేనా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సప్లిమెంట్ వాడుతున్నప్పుడు వికారం, కడుపు నొప్పి, కామెర్లు, గుండె దడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్యులను సంప్రదించి వాడొచ్చో లేదా నిర్థారించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్..! ఈ బామ్మ చేసే ఐస్క్రీమ్కి ఫిదా అవ్వాల్సిందే..) -
పొగరు Vs ఆత్మవిశ్వాసం, ఏంటి తేడా?
మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలు కలవారు ఉంటారు. సాత్వికులు, మూర్ఖులు, మధ్యస్థంగా ఉండేవారు, తెలివైన వారు, కోపిష్ఠులు... వీరందరిలోనూ ప్రత్యేకంగా కనిపించే మరొక తరహా మనుషులు పొగగరుబోతులు! పొగరు అంటే అవసరానికి మించిన ఆత్మాభిమానమే! పొగరన్న మాట విన్నప్పుడు ఓ కొండో, ఆకాశాన్ని తాకే చెట్టో గుర్తుకు రాక మానదు. ఎందుకంటే కొంతమందిలో అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే... ఇలాంటివారిలోనూ ఒక స్థాయిలో జ్ఞానం దాగి ఉంటుంది. పొగరుబోతులు సహజంగా గర్వంతో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు తమకంటూ ఏదో ప్రత్యేకమైన గొప్ప విలువుందని నమ్ముతారు. ఆత్మన్యూనతా భావం లేకుండా స్వశక్తి మీద విశ్వాసం ఉండటం ఆధ్యాత్మిక జగత్తులో ఓ గొప్ప పరిణామమే! ‘ధీరులు ఆత్మవిశ్వాసంతో భాసిస్తారు’ అని గీతాకృష్ణుడు చెబుతాడు. అయితే... పొగరు వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నటి గీతను గుర్తించాలి. సాధకుడు తనను తాను శక్తిమంతుడిగా నమ్మాలి. కానీ, అది తలబిరుసుతనంగా మారకూడదు. తనలో ఉన్న గొప్పతనాన్ని వినయపూర్వకంగా గ్రహించడం మాత్రమే ప్రగతికి పునాది వేస్తుంది.పొగరును వినయంగా మార్చుకోవడంతో సాధన పరిపక్వత పొందుతుంది. జ్ఞాని మౌనంగా ఉన్నప్పటికీ వారి విజ్ఞత లోకానికి వెల్లడవుతుంది. అవసరమైనప్పుడు అతడు మాటల్లోనూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు. అది అతిశయం ఎంతమాత్రం కాబోదు. అంతర్లీనంగా ఉన్న అతడి వినయాన్ని లోకం అర్థం చేసుకుంటుంది. ఏ విషయం తనలో పొగరుబోతుతనానికి ప్రేరణ కల్పించిందో దాన్ని మిథ్యగా తెలుసుకుని తొలగించుకోవాలి. విన యాన్ని సాధన చేయాలి. పండు సువాసనతో, మాధుర్యంతో తినేవారిని ఆకర్షిస్తుంది. అది పిందెగా ఉన్నప్పుడు వగరుగానో, చేదుగానో, పుల్లగానో ఉండవచ్చు. కాలగతిన ఆ స్థానంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది. పొగరుబోతుతనం తొలుత వెగటు కలిగించినా, జ్ఞానంతో కూడిన సాధనతో అటువంటి వ్యక్తి కూడా తీయని ఫలంలాగా లోకానికి తప్పక ప్రీతి కలిగిస్తాడు. పొగరుబోతుతనం తప్పుకాదు. అదొక తెలియనితనం! అమాయకులైన పిల్లలు విద్యతో వినయాన్ని, జ్ఞానాన్ని సాధించినట్లు పొగరుబోతులు జీవితం బోధించే పాఠాలు ఒంటబట్టించుకున్నాక విలువలు నేర్చుకుని తప్పక జ్ఞానవంతులవుతారు...అవ్వాలి! లోకంలో ప్రతి వ్యక్తిలోనూ కొద్దో గొప్పో అహంకారం ఉంటుంది. అహం లేకుండా మనిషి లేడు. ఆ అహం, అహంకారంగా మారకుండా చూసుకుని పరమాత్మను చేరే మార్గం సాధకుడు అన్వేషించాలి. పొగరుబోతుతనం శాశ్వతం కాదు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ అదే పొగరుబోతుతనం వినయంగా మారుతుంది -
బామ్మ చేతి ఐస్క్రీమ్ ..! తయారీ నుంచి..
రోజురోజుకి ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఈ ఉక్కపోతలకి నోట్లోకి చల్లగా ఐస్క్రీమ్ వెళ్తే ఉంటుంది.. ఆ ఆనందం మాటలకందనిది. అందుకే ఈ కాలంలో చిన్న, పెద్ద అంతా ఐస్క్రీమ్లు తినేందుకు మక్కువ చూపిస్తుంటారు. అలాంటి టేస్టీ.. టేస్టీ.. కూల్ కూల్ ఐస్క్రీమ్లను ఈ బామ్మ తన ఇంట్లోనే స్వయంగా తయారు చేసి అందిస్తోంది. అత్యంత సహజసిద్ధమైన వాటితో ఎలాంటి యంత్రాలను ఉపయోగించుకుండా రుచికరమైన హోమ్మేడ్ ఐస్క్రీమ్లు అందిస్తోంది. దశాబ్దాలుగా ఆమె ఇలానే కొనసాగించడం విశేషం. ఆమె అందించే ఈ రుచికరమైన ఐస్క్రీమ్లు అనతి కాలంలోనే మంచి బ్రాండ్గా స్థిరపడిపోయింది. ఎవరా బామ్మ? ఏమా కథ చూద్దామా..!.అహ్మదాబాద్కి చెందిన నిరంజన్ దేశాయ్ ఇంట్లోనే ఐసీక్రీమ్లు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారామె. అంతా నిరూబెన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ బామ్మ తన వంటగదిలోనే తొలిసారిగా ఐస్క్రీమ్ తయారు చేశారట. ఏ ఇతర బ్రాండ్లు ఆ బామ్మ తయారు చేసే ఐస్క్రీమ్ రుచికి సరితూగదట. ఆమె మామిడి, సీతాపలం, కొబ్బరి-అల్లం నిమ్మకాయ వంటి ప్లేవర్లలో కృత్రిమ రుచుల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్లు ఉపయోగించకుండా తయారు చేయడం ఈ బామ్మ ప్రత్యేకత. అంతేగాదు ఈ బామ్మ తాజాపాలు, మీగడ, స్టీవియా, పండ్లు లేదా డ్రైఫ్రూట్స్ వంటి నాలుగు సాధారణ పదార్థాలనే ఆమె ఉయోగిస్తారు. ఆమె తన ఐస్క్రీమ్ వ్యాపారాన్ని 1986లో ప్రారంభించింది. సాధారణ స్టవ్పై తయారైన ఆ వ్యాపారం దశాబ్దాలు గడిచేకొద్ది చిన్నపాటి సాంప్రదాయ కొలిమితో కూడిన పత్యేక గదిలో ఐస్క్రీమ్లు తయారు చేయడం ప్రారంభించారు. వాణిజ్య బ్రాండ్లు సాధారణంగా ఉపయోగించే పెద్ద పారిశ్రామిక యంత్రాలపై ఆధారపడకుండా సాంప్రదాయ పద్ధతిలోనే డెజర్ట్లను తయారు చేస్తుంది ఈ బామ్మ బృందం. అలాగే తన ఐస్క్రీం రుచిని కాపాడుకోవడం కోసం ప్రతి రోజు లిమిటెడ్గానే ఐస్క్రీమ్లు తయారు చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే ఈ బామ్మ ఐస్క్రీమ్ ఓ ప్రసిద్ధ బ్రాండ్గా స్థిరపడటమే కాదు బల్క్ నుంచి టేక్ అవే ఆర్డర్ల అందించే స్థాయికి చేరువైంది. మొదటగా గులాబీ-కొబ్బరి, మిరియాలు, చాక్లెట్, బాదం, పిస్తా, కేసర్, యాలకులు వంటి రుచులతో ప్రారంభమైన ఈ నిరుబెన్ బామ్మ దుకాణం ప్రస్తుతం దాదాపు 27 రకాలా వైవిధ్యభరితమైన ఐస్క్రీమ్లను అందిస్తుంది. అయితే ఈ బామ్మ వయసు పైబడటంతో కొన్ని రకాల పదార్థాలను సేకరించడం కష్టంగా మారి కొన్ని రకాలా ఐస్క్రీమ్ల తయారీని నిలిపివేసినప్పటికీ..కస్టమర్లు ఇష్టంగా ఆస్వాదించే కొన్ని రకాల హోమ్మేడ్ ఐస్క్రీమ్లను మాత్రం ఇప్పటికీ అందిస్తోంది. తన కాళ్లపై తాను నిలబడాలన్న తాపత్రయం ఉంటే.. ఎంత సవాలుతో కూడిన పనులైనా సునాయాసంగా జయిస్తూ ముందుకు సాగిపోతారనేందుకు ఈ బామ్మే ఉదాహరణ కదూ..!. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: కేన్స్ రెడ్కార్పెట్పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!) -
కేన్స్ రెడ్కార్పెట్పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!
బాలీవుడ్ బుల్లి తెర నటి మౌనీరాయ్ కూడా ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెరిశారు. ఇప్పటి వరకు అలియా భట్, అదితిరావు హైదరి, డయానా పెంటీ, నటి రుచి గుజ్జర్ తదితర తారాగణం అద్భుతమైన డిజైనర్వేర్లతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. తాజాగా వారి సరసన మౌనీరాయ్ కూడా చేరారు. చెప్పాలంటే ఈ వేదికపై భారతీయ సాంప్రదాయ వారసత్వ కళలు తళక్కుమనడం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వారసత్వాలు తరతరాలు తెలుసుకునేలా అత్యద్భతంగా ప్రదర్శించారు పలువురు సెలబ్రిటీలు. ఇక మౌనీరాయ్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పటోలా ప్రింట్ గౌనుతో తుళుక్కుమంది. View this post on Instagram A post shared by mon (@imouniroy)ఈ ప్రపంచ వేదికపైనే ఆమె సినిమా పోస్టర్ టీజర్ని కూడా విడుదల చేశారు . గుజారాతీ పటోలా ఎండ్రాయిడరీ వర్క్ చేసిన ఈ గౌనులో మౌనీరాయ్ అత్యంత స్టైలిష్గా కనిపించారు. దీన్ని డిజైనర్ పూజా షా రూపొందించారు. ఈ డ్రైస్పై ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకు ఏకంగా 300 గంటల సమయం పట్టిందట. ఈ డ్రెస్ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే దుస్తుల లేబుల్కు చెందినది. వీపు భాగం లేకుండా పూర్తి నిడివి గల గౌనుని చేతులు లేని సిల్హౌట్ శరీరానికి హత్కుకుపోయే ఫిట్, స్క్వేర్ నెక్లైన్తో కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ చేశారు. అందుకు తగ్గట్టుగా కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గూలాబీ రంగు లిప్ షేడ్తో అందంగా కనిపించింది. (చదవండి: కేన్స్లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?) -
నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం : సైంటిస్టుల హెచ్చరిక
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వారి్మంగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇదీ చదవండి: సరస్వతీ మాత విగ్రహం కోహినూర్ కన్నా ముఖ్యంఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇదీ చదవండి: 60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్డౌన్ స్టార్ట్ -
జూనియర్ ఎన్టీఆర్ నాలుగు నెలల్లో 15 కేజీలు..! ఎలా తగ్గారంటే..
మే 20న టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ను విడుదల చేశారు. ఆయన న్యూలుక్కి సంబంధించిన పోస్టర్లు అభిమానులను థ్రిల్కి గురయ్యేలా చేసింది. ఎంత స్మార్ట్ లుక్లో కనిపించారంటే మన హీరో తారక్నే కదా అనే సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా అద్భుతమైన లుక్లో కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలోని తన పాత్రం కోసం ఆయన కేవలం నాలుగు నెలల్లో దాదాపు 15 కేజీలు తగ్గారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. అందుకోసం ఆయన ఎంతలా కష్టపడ్డారో..ఎలాంటి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారంటే.!ఆ మూవీలో హంతకుడు పాత్ర కోసం ఆయన్ను మరింత సన్నగా ఉంటే బాగుంటదని చెప్పానని అన్నారు దర్శకుడు ప్రశాంత్నీల్. ఆయన తన పాత్ర కోసం మరింత ఆకర్షణీయంగా కనిపించేలా కష్టపడతారని అనుకున్నా కానీ ఇంతలా తను రూపురేఖల్ని మార్చుకుంటారని తాము ఊహించలేదన్నారు. తాను అలా స్మార్ట్గా అవ్వడంతో ఆయన భార్య, తల్లి తనపై చాలా కోపంగా ఉన్నారని కూడా చెప్పారు. అందుకోసమే ఎన్జీఆర్ నాలుగు నెలలపాటు షూటింగ్కి కూడా రాలేదన్నారు. ఒకానొక సమయంలో దాదాపు 15 కేజీలు తగ్గారు. అది చూసి మధ్యలోనే చాలు ఆపేయండని కోరినా..ఆయన ఆపలేదంటూ నాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. ఆ హీరో మరీ అంతలా కష్టపడటం కూడా చాలా బాధగా అనిపించిందన్నారు.అందుకోసం ఏం చేశారంటే..ట్రైనర్ డెక్కన్ క్రానికల్ ప్రకారం..స్మార్ట్ చురుకైన శరీరాకృతి కోసం కార్డియో- వ్యాయామాలు, రెసిస్టెన్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఉదయం 45 నుంచి 90 నిమిషాల సెషన్లు ఇవే చేసినట్లు తెలిపారు. అలాగే ఆహార పరంగా సాధారణంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించడానికి బదులుగా, తక్కువ ప్రోటీన్తో కూడిన ఆహారాన్ని ఎంచుకున్నట్లు డైట్ ట్రైనర్ కుమార్ మన్నవ తెలిపారు. ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని ఈ విధానం సులభంగా తగ్గేలా చూసి సరికొత్త లుక్తో కనిపించేలా చేసిందన్నారు. ముఖ్యంగా డ్రాగన్ పాత్రకు అనుగుణమైన ఆహార్యంతో అందర్నీ ఆశ్చర్యపరిచారని చెబుతోంది చిత్ర బృందం. తామెవ్వరూ ఇంతలా మార్చుకుంటారని గానీ, ఇంత స్పీడ్గా బరువు తగ్గి స్మార్ట్గా మారిపోతారని ఊహిచలేదని చెబుతోంది మూవీ బృందం. (చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!) -
శ్వాసకోశ వైఫల్యం: బతికే ఛాన్సే లేదన్నారు! కట్చేస్తే..
ఊపిరితిత్తులు ఏ కారణం చేతనైన ఇన్ఫెక్షన్కు గురై పనిచేయడం మానిస్తే..రెస్పిరేటరీ ఫెయిల్యూర్" లేదా శ్వాసకోశ వైఫల్యం అంటారు. ఆ పరిస్థితుల్లో రోగి బతికి బట్టకట్టే అవకాశమే ఉండదు. సింపుల్గా చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. కానీ ఓ రోగి అంత క్రిటికల్ స్టేజ్లో ఉండగా అత్యాధునిక వైద్య విధానంతో ప్రాణంపోసి సరికొత్త చికిత్సా విధానానికి నాంది పలికారు. అసలేం జరిగిందంటే..55 ఏళ్ల వైద్యుడు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం బహుళ అవయవాల సమస్యలతో బాధపడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు తీవ్ర ఇన్ఫెక్షన్ బారినపడటంతో సెప్టిక్ షాక్కి గురై(శరీరంలో రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయే ప్రాణాంతక పరిస్థితి) వారాల తరబడి పోరాటం అనంతరం అత్యాధునిక ఆస్పత్రికి హుటాహుటినా తరలించారు. అక్కడ వైద్యులు రోగిని వెంటిలేటర్, ప్రోన్ వెంటిలేషన్తో సహా అన్ని రక్షణా చర్యలతో చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా..అతడి పరిస్థితి మరింత దిగజారడంతో ప్రముఖ రెస్పిరేటరీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం ఆ వైద్యుడికి ECMO అనే ప్రాణాన్ని నిలబెట్టే చికిత్సు అందించారు.ECMO అంటే..ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) అనేది ప్రాణాలను కాపాడే ఒక యాంత్రిక జీవ సహాయక విధానం. ఇది రోగి రక్తాన్ని నిరంతరం శరీరం బయట ఉన్న కృత్రిమ ఊపిరితిత్తులకు పంప్ చేసి, ఆక్సిజన్ను జోడించి, కార్బన్ డయాక్సైడ్ను తొలగించి, తిరిగి రక్తాన్ని పంపుతుంది. ECMO బలహీనపడుతున్న గుండెలకు, ఊపిరితిత్తులకు విశ్రాంతి తీసుకుని, కోలుకోవడానికి సమయం ఇస్తుంది.అతడిని అనేక వారాల పాటు ICU, CTVS, IDలలో ఉంచి చికిత్స అందించారు. క్రమంగా, అతని ఊపిరితిత్తులు, ఇతర అవయవాల పనితీరు మెరుగుపడింది. ఆ తర్వాత ECMO మద్దతును క్రమంగా తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతను ఇప్పుడు మునపటిలా యథాస్థితికి వచ్చాడని వెల్లడించారు వైద్యులు. ఇలా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ బారినపడి ఇతర అవయవాలు పనిచయుండా విశ్రాంతి స్థితికి వచ్చేసినప్పుడు ఈ ECMO ఒక కృత్రిమ గుండె , ఊపిరితిత్తుల మాదిరిగా సహాయక వ్యవస్థగా పనిచేస్తుందని చెబుతున్నారు. తద్వారా రోగి ప్రాణాలను రక్షించగలమని అన్నారు.(చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!) -
వెట్టిచాకిరిని ఉపేక్షించం
ప్రస్తుత కాలంలో వెట్టిచాకిరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని ఇటుక బట్టీల్లో భారతలక్ష్మి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 474 మంది వెట్టిచాకిరి కార్మికులకు విముక్తి కల్పించారు. ఈ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే..సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి మాదిరిగా నిషేధిత వెట్టిచాకిరి చేయించే పరిస్థితులు ఇప్పుడు ఉండటం విచారకరం. అలాంటి వ్యవహారాలు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే. జిల్లా కేంద్రానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఆలూర్ మండలం దేగాం, ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామాల్లో ప్రధాన రహ దారి పక్కనే ఇటుక బట్టీల్లో నీటి, వసతి, మరెలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులను నిర్బంధించి పని చేయిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తాజా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం. ఇటుక బట్టీల నిర్వాహకులతో స్థానిక పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు మిలాఖత్ కావడంతో ఎవరికీ చెప్పకుండా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.రేకుల గదుల్లో బంధించేవారు..ఇటుక బట్టీల్లో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనులు చేయిస్తున్నారు. కార్మికులు పారిపోకుండా ఉండేందుకు గాను వారి పిల్లలను గాలి, వెలుతురు లేని ఇరుకై న రేకుల గదుల్లో బంధించారు. తాగునీరు లేదు. తగిన ఆవాసం లేకపోవడంతో ప్లాస్టిక్ కవర్ల డేరాల్లో ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులను పిల్లలతో పడుకోన్విరు. పైగా క మ్యూనికేషన్ లేకుండా ఫోన్లు లాక్కున్నారు. ఆధార్ కార్డులు తీసుకున్నారు. పిల్లలతో పనులు చేయిస్తున్నారు. చిన్నారులకు విద్య సౌకర్యం లేదు. పెద్దల కు, పిల్లలకు వైద్యం చేయించరు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ పనులు చేయిస్తున్నారు. ఆస్పత్రికి వెళి తే నిఘా పెడుతున్నారు. పిల్లలతో పనులు చేయించి వారానికి కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారు.రక్తం వచ్చేలా కొట్టేవారు..భార్యాభర్తలు కలిసి రోజుకు 2 వేల ఇటుకలు తయారు చేస్తే వారానికి రూ.3 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు. ఐదు రోజుల బాలింతతో సైతం పనులు చేయించారు. గత ఐదేళ్లుగా తమ పిల్లలను తమ గ్రామాల్లోని బంధువులు చూడలేదని కార్మికులు ఆవేదన చెందారు. వాలి, కల్పన, అంజయ్య, వెంకటేష్ అనే మేసీ్త్రలు తమను రక్తం వచ్చేలా కొట్టేవారని బాధిత కార్మికులు చెప్పడం బాధ కలిగించింది.- ప్రతివారం ఒక మహిళ వస్తే ఆమె వద్ద మాత్రమే కూరగాయలు, సరుకులు కొనాల్సిన పరిస్థితి కల్పించారు. స్థానిక పోలీసులతో యాజమాన్యాలకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏమీ చేయలేక కార్మికులు భయపడ్డారు. ఇక ఇటుక బట్టీల్లో పనులు లేని సమయంలో సమీప పొలాల్లో పనులు చేయించి ఆ వచ్చిన డబ్బులను ఇటుక బట్టీల నిర్వాహకులే తీసుకునేవారు.పిల్లలను చంపేస్తామని బెదిరింపులు..పనులు చేయకుండా పారిపోతే పిల్లలను చంపేస్తామని బెదిరించారు. ఇప్పటికీ ఆ బట్టీల్లో నలుగురు మరణించారు. మరణించివాళ్లలో ఒక బాలుడు ఉన్నాడు. మరణించిన వాళ్ల మృతదేహాలు ఏమి చేశారో కూడా ఇప్పటికీ తెలియని పరిస్థితి. అన్ని అంశాలపై పూర్తి వివరాల కోసం తహసీల్దారును విచారణకు ఆదేశించాం. ఎలాంటి విషయంలోనైనా సరే బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదులు చేయవచ్చు. ఇప్పటికే జిల్లాలో అనేక వీడీసీల బాధితుల సమస్యలు పరిష్కరించాం.కార్మికులకు విముక్తి కల్పించడం సంతోషంగా ఉంది..రెస్క్యూ ఆపరేషన్ చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 474 మందిని విముక్తం చేయడం సంతోషంగా ఉంది. ఈ ఆపరేషన్ రెస్క్యూను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. వందల మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించడం చాలా సంతృప్తినిచ్చింది. బాధితులందరినీ ఆర్మూర్కు తరలించి పూర్తి వివరాలు సేకరించి, కలెక్టర్ సహకారంతో ప్రత్యేకంగా ఏడు ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించాం. ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు పూర్తి వివరాలు పంపించి వీళ్ల పునరావాసం కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది.మూడు ఇటుక బట్టీల్లో వెట్టి నుంచి బాధితులను విముక్తి చేయడంతో మరో ఇటుక బట్టీ నుంచి మరో 150 మంది కార్మికులు బయటకు వచ్చారు. జిల్లాలోని మిగిలిన ఇటుక బట్టీల్లో వెట్టి చాకిరి చేస్తున్న వారిని సైతం వాళ్ల స్వస్థలాలకు పంపిస్తాం. 20 మందికి కార్మిక శాఖ నుంచి లైసెన్సులు తీసుకుని వందలు, వేలమందితో పనులు చేయిస్తుండడం దారుణం. ఇదిలా ఉండగా ఒక సర్వే నంబరులోని పట్టా భూముల్లో అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లో బట్టీలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వీటిపై దృష్టి సారించాల్సి ఉంది. More than 400 workers including over 100 children rescued from three #brickkiln units in #Telangana's Siddapur village, Nandipet mandal, Nizamabad district; operation led by Principal District Judge Bharath Laxmi following directions from State Legal Services Authority; this… pic.twitter.com/MnRt9LRoiW— Uma Sudhir (@umasudhir) May 21, 2026 -
కనిపించని కథ...గాలి బలమెంత!?
వేసవిలో వేడికి చల్లని గాలి మేనికి తగిలితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అదే గాలి ఉదృతమైతే చెట్ల కొమ్మలు ఊగడం, తలుపులు కిటికీలు టపటప కొట్టుకోవడం, తేలిక΄పాటి వస్తువులు ఎగరడం.. ఇవన్నీ చూస్తుంటాం. కానీ, ‘గాలి కంటికి కనిపించదు, ప్రపంచాన్ని మాత్రం కదిలిస్తుంది..’ అంతటి శక్తిమంతమైనది. ఇలా మన కళ్ల ముందు కనిపించే వస్తువులను చూపుతూ, కనపడని గాలిని పరిచయం చేయవచ్చు. పిల్లల వయసును బట్టి, అనేకానేక విషయాలను ఉదహరిస్తూ ‘గాలి’బలం గురించి చెప్పవచ్చు. తెలుసుకోమనవచ్చు. వారికి తెలిసింది తమ క్రియేటివిటీతో చూపమనండి. 1. కనిపించని కథ... గాలి కంటికి కనిపించదు. అయితే చెట్ల కొమ్మలు ఎందుకు ఊగుతాయి, కర్టెన్ ఎందుకు కదులుతుంది, ఉక్క΄ోస్తున్నప్పడు ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది.. ఇవన్నీ చెప్పడంతోపాటు ఒక పేపర్ తీసుకుని నోటితో ఊది కదిలించమనండి. టేబుల్ ఫ్యాన్ ముందు రిబ్బన్ కట్టి ఎలా ఊగుతుందో చూపించండి. కారులో ఏసీ లేకుండా డోర్స్ అన్నీ లాక్ చేసి, కాసేపు ఉంటే ఏమవుతుందో చెప్పమనవచ్చు. ఈ విధానం వల్ల ఊపిరిని నిలిపే ్ర΄ాణవాయువును ఎన్నో రూపాలుగా కళ్ల ముందు ఆవిష్కరింపజేయవచ్చు అనే విషయం పిల్లలకు అర్ధమవుతుంది. 2. విండ్మిల్.. గాలి పటం... గాలి బలంగా ఉంటే విండ్మిల్ ఎలా తిరుగుతుందో చూపించవచ్చు. బెలూన్లో గాలి నింపి, బయటకు వదలమని చెప్పవచ్చు. గాలిపటం ఎందుకు ఎగురుతుంది? గాలి లేక΄ోతే ఏమవుతుంది? పక్షులు గాలిని ఎలా ఉపయోగిస్తాయి? పిల్లలతో చిన్న గాలిపటం డ్రా చేయించండి లేదా తయారు చేయించండి. 3. శుభ్రమైన గాలి... వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ గాలిని ఎందుకు కలుషితం చేస్తుంది. చెట్ల వల్ల గాలి ఎలా శుభ్రపడుతుంది? మొక్కల పెంపకం ప్రాధాన్యత, గాలి వేగం పెరిగితే ఏమవుతుంది? తుఫాన్లు ఎలా వస్తాయి, సుడిగాలులు ఎలా ఉత్పన్నమవుతాయి... గాలిపైన ఎవరెన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయదగితే అన్నీ చేయమనండి.4. ఊహలకు రూపం... గాలికి కోపం వస్తే.. ఊహాకథలు చెప్పమనండి. పాటలు పాడమనండి. ఒక చిన్న వ్యాసం రాయమనండి. పంచభూతాలను తమ సృజనాత్మక కోణంలో ఎలా చూపుతారో ఛాయిస్ వారికే ఇవ్వండి. ఈ విధానం వల్ల కాలుష్యకార కాలను పిల్లలు గుర్తించగలుగుతారు. పర్యావరణంలో తమ పాత్రను తెలుసుకోగలుగుతారు. సినీ దర్శకుడు, నటుడు తరుణ్భాస్కర్ తల్లి గీతాభాస్కర్. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్ టీచర్గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్ ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. (‘ఫైవ్ ఎలిమెంట్స్’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్ ఐడి sakshisummerkids@gmail.com) నిర్వహణ: నిర్మలారెడ్డి(చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...) -
ఊరు చిన్నదే..కానీ అభివృద్దిలో మేటి!
‘గ్రామం చిన్నదైనా....అభివృద్ధిలో పెద్దది’ అనేలా పేరు తెచ్చుకోవడానికిసర్పంచ్ కృషి ఎంతో ఉంటుంది.అలాంటి ఒక సర్పంచి సంగం అర్పితా రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్లారం గ్రామసర్పంచ్అర్పితా రెడ్డికి జాతీయ స్థాయిగుర్తింపు వచ్చింది. ‘సాంకేతికతతోగ్రామ అభివృద్ధి’ అంశంపై ‘క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన ‘డిజిటల్ కృషి–సమృద్ధి గావ్’ జాతీయస్థాయి పోటీలో గ్రామాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు అర్పితారెడ్డి....పారిశుధ్యం నుంచి డిజిటలీకరణ వరకు అన్ని రకాలుగా మల్లారం గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి. గ్రామంలో ΄పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఇంటివారు తడి–పొడి చెత్త వేరు చేసుకునే విధానాన్ని అలవాటు చేశారు. పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోనే ఇప్పటి వరకు ఏ సర్పంచ్ చేయని విధంగా గ్రామ పూర్తి సమాచారం, ప్రభుత్వ పథకాలతో గ్రామ వెబ్సైట్ను ప్రారంభించారు.పన్నుల చెల్లింపులు, ధ్రువపత్రాల జారీ, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఆన్లైన్లో అందించడంతో ప్రజలకు చాలా సౌకర్యంగా మారింది. గ్రామస్థులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. గ్రామంలో భద్రతను మెరుగు పరిచేందుకు 21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యువత కోసం ఓపెన జిమ్ ప్రారంభించారు. నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా ఒక టీచర్ను ఏర్పాటు చేశారు. ప్రతీ మహిళ గ్రామాభివృద్ధిలో భాగమయ్యేలా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారు అర్పితారెడ్డి.బాధ్యత పెరిగిందిగ్రామస్థులలో బాధ్యత పెరిగింది. పారిశుధ్యం, పచ్చదనం, గ్రామ అభివృద్ధి గురించి అందరూ చైతన్యంతో ముందుకు వస్తున్నారు. యువత కూడా గ్రామ అభివృద్ధిలో΄ పాల్గొనడం ఆనందంగా ఉంది. మల్లారం గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మహిళా సంఘాలు, యువత భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటికి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాం.– అర్పితారెడ్డి – ఎస్.డి.తాహెర్ పాషా, పుట్టపాక లక్ష్మణ్, సాక్షి, వేములవాడ (చదవండి: సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...) -
సైబర్ మోసంతో అకౌంట్ ఫ్రీజ్ అయితే...
గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు జమ చేశారు. వాళ్లు సైబర్ నేరగాళ్ళు, ఆ నగదు ఆన్లైన్ మోసం ద్వారా వచ్చింది కాబట్టి నా బ్యాంకు ఖాతా కూడా సీజ్ చేస్తున్నాము అని పంజాబ్ సైబర్ క్రైమ్ వారు నా అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. అలా ఫ్రీజ్ చేసేవరకు ఈ 500 నా అకౌంట్లోకి వచ్చాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. పంజాబ్ పోలీసులను సంప్రదించగా, వారు చెప్పిన విధంగానే అన్ని పత్రాలను, అఫిడవిట్ను – నా వ్యక్తిగత వివరాలతో సహా సమర్పించాను. ఇది జరిగి ఇప్పటికి పదినెలలు అవుతుంది కానీ ఇంతవరకు నా అకౌంట్ను రిలీజ్ చేయకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకువారిని అడిగితే పంజాబ్ కోర్టులో కేసు వేసుకోవాలి అని చెప్తున్నారు. పంజాబ్కి వెళ్లి కేసులు వేయడం చాలా కష్టం – అంత ఖర్చు పెట్టడం కూడా ఇబ్బంది. సలహా ఇవ్వగలరు. – చీమకుర్తి సునీల్ కుమార్, విజయవాడపంజాబ్ పోలీసులు మిమ్మల్ని నిందితుడిగా చూపిస్తూ ఏదైనా ఎఫ్.ఐ.ఆర్. చేశారా అనే విషయం ముఖ్యమైనది. మీ మీద నేరుగా నింద లేకుండా, మీ పేరును ఎటువంటి ఎఫ్.ఐ.ఆర్.లో నిందారోపితుడుగా చూపించకుండా ఉంటే మీరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ హైదరాబాదులో కూడా ఉండాలి. పైన తెలిపిన అంశాలు మీ కేసులో ఉండి ఉంటే, బ్యాంకు వారు చెప్పినట్టుగా పంజాబ్కు వెళ్లవలసిన అవసరం లేదు. పూర్వం కోర్టు పరిధి ఏది వస్తుంది అనే విభేదం కొంత ఉన్నప్పటికీ, అనేక హైకోర్టులు ఇలాంటి బ్యాంక్ ఫ్రీజింగ్ కేసులలో వేరే రాష్ట్రాల పోలీసుల ద్వారా ఫ్రీజ్ చేసిన అకౌంట్లను విడుదల చేయాల్సిందే అని తీర్పులు ఇచ్చాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించండి. అలా వెళ్ళేముందు మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిన కారణానికి గల పత్రాలను, ముఖ్యంగా ఎఫ్.ఐ.ఆర్.ను– పంజాబ్ పోలీసులు బ్యాంకు వారికి పంపిన లేఖలను క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు చెప్పినట్లుగా 500 మాత్రమే మీ అకౌంట్కు వచ్చి ఉంటే – అంతమొత్తాన్నే మీ అకౌంట్లో ఫ్రీజ్ /లీన్ ఉంచి మిగతా నగదును వాడుకునేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చే ఆస్కారం ఉంది. లాయర్ గారితో ఈ విషయాలను మాట్లాడండి. ఇలాంటి గుర్తు తెలియని ట్రాన్సాక్షన్లు వచ్చిన వెంటనే బ్యాంకు వారికి లిఖితపూర్వకంగా చెప్పడం కొంతవరకు మిమ్మల్ని కాడుతుంది. - శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )చదవండి: 'థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమే.. -
'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా?
మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా. తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు. Twisha's death is proof that many Indian parents think their daughter is a commodity that is delivered to the in-laws and has no return policy. The girl can die at the In-laws. That is only honorable after Kanya Daan. Ok?— Chinmayi Sripaada (@Chinmayi) May 19, 2026 అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి. పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె. View this post on Instagram A post shared by Bollywood Bubble (@bollywoodbubble) (చదవండి: థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమూ..) -
అష్ట కష్టాలే.. ఆమె చుట్టాలైనా
పిఠాపురం: సమాజంలో చాలామంది చిన్న కష్టానికే తల్లడిల్లిపోతారు. దాన్ని అధిగమించలేక బెంబేలెత్తిపోతారు. కానీ కొందరు మాత్రం ధైర్యంగా కష్టాలకు ఎదురు నిలిచి ముందుకు సాగుతారు. మిలిగిన వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. పిఠాపురంలోని ఇందిరా నగర్కు చెందిన చాట్ల వెంకటలక్ష్మి ఆ కోవలోకే వస్తారు. ధైర్యంగా ఆటో నడుపుతూ తన పిల్లలతో పాటు తమ్ముడి పిల్లలకు కూడా తల్లిగా మారారు. వివరాల్లోకి వెళితే.. వెంకటలక్ష్మి జీవితం భర్త, ఇద్దరు పిల్లల (పాప, బాబు)తో ఉన్నంతలో సంతోషంగా గడిచిపోయేది. కానీ భర్త ఉన్నట్టుండి భార్యాపిల్లలను వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో జీవితం శూన్యంగా మారింది. ఆమె పెద్దగా చదువుకోలేదు. ఉద్యోగం వచ్చే అవకాశమూ లేదు. కూలి పని చేసుకుని పిల్లలను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టకాలంలోనూ ఆమె ధైర్యాన్ని కూడగట్టుకుంది. కష్టబడి తన పిల్లలను పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాలనుకుని, ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించింది. తక్కువ సమయంలో మెళకువలు నేర్చుకుని చక్కగా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టింది. పాప, బాబులను పెంచుకుంటూ ముందుకు సాగిపోయింది. ఈ సమయంలోనే మరోసారి విధి ఆమెతో ఆడుకుంది. ఆమె తమ్ముడు దంగేటి సత్యనారాయణ, మరదలు లక్ష్మి మృతి చెందడంతో వారి ఇద్దరు పిల్లల భారం కూడా పడింది. అయినా కుంగిపోకుండా, ఆటో నడుపుతూ నలుగురు పిల్లలనూ పోషించుకుంటూ బతుకు బండిని లాక్కోస్తోంది. తమ్ముడి కుమార్తెల్లో మహాశ్రీ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మానసిక దివ్యాంగురాలైన చిన్న కుమార్తె శ్రీవల్లి స్థానిక భవిత స్కూల్లో చదువుతోంది. అయితే తిండి, ఇతర ఖర్చులను ఆటో ద్వారా వస్తున్న ఆదాయంతో నెట్టుకొస్తున్నా, పిల్లల చదువులకు మాత్రం ఆర్థికంగా వెంకటలక్ష్మి ఇబ్బంది పడుతోంది. సొంతిల్లు కూడా లేని తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతోంది. -
మండుటెండలకు ఎలాంటి ఫుడ్ మంచిదంటే..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది కాలానుగుణంగా ఉంటేనే మంచిది. అందులోనూ భగభగలాడే ఈమండుటెండల్లో వేడిని తట్టుకోవాలంటే..వంటగదిలో ఈ చిన్నమార్పులు తప్పనిసరి. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం వేసవి వేడికి ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాగని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతర్గత శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పకుండా ఉండేలా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా.!.తీపి పదార్థాలు..తేనె, బెల్లం 'ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే శరీరంలో వేడి అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్జూరపు పొడి, స్టీవియా, మంక్ ఫ్రూట్ షుగర్ లేదా దాగా మిశ్రి వంటి వాటికి మారమని సూచిస్తున్నారు నిపుణులు.చిరుధాన్యాలుజొన్న, మక్కీ, రాగి, కుట్టు, బ్రౌన్ రైస్లు ఆరోగ్యకరమైనవే కానీ వేసవిలో మాత్రం అంత మంచివికావని అంటున్నారు. ఎందుకంటే వేసవిలో ఇవి జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుందట. అందుకు బదులుగా జొన్న, జౌ (బార్లీ), సమక్, కాంగ్ని, తెల్ల బియ్యం, ఓట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.పప్పుధాన్యాలుకందిపప్పు, మినపపప్పు, కుల్తీ, మోత్(మట్కీ), సోయాబీన్ తదితరాలుబరువుగా ఉండి, గ్యాస్ను ఏర్పరుస్తాయనిన్ హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటికి బదులుగా, పెసరపప్పు, మసూర్ పప్పు, లోబియా, కాబూలీ శనగలను తీసుకోండి.కూరగాయలువంకాయ, బీట్రూట్, పాలకూర వంటివి శరీరంలో వేడిని పెంచి, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున, వాటిని అధికంగా తీసుకోకపోవడమే మేలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా సొరకాయ, టిండా(ఇండియన్ బేబీ పంప్కిన్), కద్దు(ఆనపకాయ), పర్వాల్(దొంకాయ రకం), దోసకాయ వంటివి అధిక నీటి శాతం కలిగి ఉండటం వల్ల గొప్ప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.పాల ఉత్పత్తులుగేదె పాలు వంటి బరువైన పదార్థాలు సహజంగానే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా, అధికంగా ఉండే పెరుగుకు - దాని శీతలీకరణ గుణాలు ఉన్నప్పటికీ ఇది కూడా మండుటెండలకు అస్సలు మంచిది కాదు. రైతా లేదా పులచటి మజ్జిగాలో తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణుల.మసాలాలుసాధారణంగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పరిధిని దాటినప్పుడు, తేలికపాటి ఆహారం తీసుకోవడం, అధిక మసాలాలు ఉన్న వంటకాలకు దూరంగా ఉండటం మేలు. అయితే, ఎండు అల్లం (సౌంత్), దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, మెంతి గింజలు, పిప్పలి వంటి వేడి చేసే మసాలాలు అసిడిటీని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి, వాటి వాడకాన్ని పరిమితం చేయాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటికి బదులుగా, రుచికోసం సోంపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, లెమన్గ్రాస్ ఉపయోగించమని సూచిస్తున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..) -
ఎడ్యుకేషన్పై ఐఏఎస్ అధికారి ఆసక్తికర పోస్ట్..!
మన విద్య విధానం విద్యాపరంగా గెలుపు సాధించడం ఎలా, కఠినతరమైన పరీక్షలను ఎదుర్కోవడం ఎలా తదితరాలనే నేర్పిస్తోంది. జీవితానికి అవసరమైనవి, అత్యంత కీలకమైన పాఠాలను నేర్పించడంలేదట. చదువు అన్ని జీవన నైపుణ్యాలను నేర్పింస్తుందని పొరబడుతున్నాం. అది నిజంగా భావోద్వేగ పరంగా స్ట్రాంగ్ ఉండటం దగ్గర నుంచి జీవితానికి అవసరమై కీలక పాఠాలనేవ ఏమి నేర్పించలేకపోతుందంటూ ఓ ఐఏఎస్ అధికారిణి పెట్టిన పోస్టు అందర్నీ ఆకర్షించడమే కాదు ఆలోచనాత్మకంగా ఉంది. ఇంతకీ ఆమె ఆ పోస్ట్లో ఏం రాశారంటే..ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా..ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు వంటి ప్రతిష్టాత్మక కాలేజీలలో ఉన్నత చదువుని పొందా, ఐఏఎస్ వంటి మంచి గౌరవనీయమైన ఉద్యోగాన్ని దక్కించుకున్నానని అన్నారు. అయితే తాను పొందిన ఉన్నత విద్య పోటీపరీక్షలకు, వృత్తిపరమైన బాధ్యతలకు సిద్ధం చేయగలిగింది కానీ భావోద్వేగ పోరాటాలకు, ఒంటిరితనాన్ని ఎదుర్కోవడం వంటి సవాళ్లకు సిద్ధం చేయలేకపోయిందని రాశారు. నిజానికి మనమంతా విద్యార్థి దశలో గెలుపుని ఎలా అందుకోవాలో నేర్చుకోవడానికి ఏళ్ల తరబడి టైం స్పెండ్ చేస్తాం, కానీ సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఒక్క రోజు కూడా కేటాయించం అని పోస్టులో రాసుకొచ్చారామె. మనం కెమిస్ట్రీలో ఆవర్తన పట్టికను తెగ కంఠస్థం చేస్తాం, అయితే బాధను ఎలా అధిగమించాలో మాత్రం నేర్చుకోం. నిజానికి విద్యార్థులంతా విద్యా సంబంధితమైన అన్నింటిని నేర్చుకుంటారు, కానీ దుఃఖం, ఒత్తిడి లేదా వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పించదు లేదా ఏ గురువు నేర్పే ప్రయత్నం చేయరని అన్నారు. అంతేగాదు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులుగా అణిచేయడం లేదా నియంత్రించడమే నేర్పిస్తారని, అది కాస్త ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె నొక్కి చెబుతున్నారు. అంతేగాదు ప్రతి స్టూడెంట్కి వ్యాసాలు రాయడం ప్రోత్సహిస్తాం, కానీ అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచాలో, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టతరమైన పరిస్థితుల్లో కాదు అనే మాట ఎలా చెప్పాలి వంటి అనేక విషయాలను నేర్పాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారామె. ప్రతి స్కూలు స్టూడెంట్ చెప్పే సమాధానాలకు బహుమతులు ఇస్తుంది, వారినే విజేతలుగా పేర్కొంటుంది. కానీ జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసిన వారే నిలదొక్కుకుంటారని ఆమె అంటున్నారు. అలాగే గణితం నేర్పిస్తాం గానీ ఆర్థిక ఒత్తిడిని ఎలా నిర్వహించాలో నేర్పదన్నారు. కేవలం డబ్బు సంపాదించడమే విద్య నేర్పిస్తుందే కానీ, దాన్ని నిర్వహించడం నేర్పదని పోస్టులో రాసుకొచ్చారామె. ఆమె పోస్టులకు పలువురు నెటిజన్లు మద్దతిస్తూ..విద్య కేవలం వృత్తి జీవితాన్నే నేర్పిస్తుందే తప్ప జీవితానికి కీలకమైన జీవన నైపుణ్యాలనే నేర్పించలేకపోతుందంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..) -
హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..
మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు... బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...కడుపులోని భాగాలు డయాఫ్రమ్ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్ ఛెస్ట్)లోకి. కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. కడుపుకు మధ్యభాగం (మిడ్లైన్)లోకి. కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.హెర్నియాల్లో రకాలివి... హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...ఇంగ్వైనల్ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్ కెనాల్ అనే ప్యాసేజ్ ద్వారా తొడల (అప్పర్ థైస్) భాగంలోకి వెళ్తాయి.ఫీమోరల్ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్ కెనాల్ కింద ఉండే ఫీమోరల్ కెనాల్ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు తొడల (అప్పర్ థైస్) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది. హయటల్ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్నే హయటస్ / హయటల్ హెర్నియా అంటారు.కంజెనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా : హయటల్ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్గా) వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.ఇన్సిషనల్ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.అంబిలికల్ హెర్నియా / పారా అంబిలికల్ హెర్నియా : బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతోనే (కంజెనైటల్గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. వెంట్రల్ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్ హెర్నియా’గా చెప్పవచ్చు.హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్ కండిషన్ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. మున్ముందు ఆ కెనాల్లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా హెర్నియా రావడానికి కారణాలు... క్రానిక్ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్ 30 కంటే ఎక్కువగా ఉండటం).బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్తో తోయడం.మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం. పెల్విస్ భాగంలో అయిన సర్జరీల వల్ల. చిన్నారుల్లో కంజెనైటల్ హెర్నియాలకు కారణాలు... నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్ డెలివరీస్). కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య ఉండటం. కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్–డిసెండెడ్ టెస్టిస్). మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్లో ఏవైనా సమస్యలుండటం. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.పెద్దవారిలో కనిపించే లక్షణాలుబరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్)లో చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. ఎందుకు చికిత్స అవసరమంటే...?సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్ హెర్నియాలో కడుపులోని యాసిడ్ పైకి తోసుకువచ్చే యాసిడ్ రిఫ్లక్స్ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్కార్సెరేషన్’ అంటారు. ఇలాంటి ‘ఇన్కార్సెరేటెడ్ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్ / గ్యాంగ్రీన్గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్ హెర్నియాలకంటే ఫెమోరల్ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. నిర్ధారణ బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం (ఫిజికల్ ఎగ్జామ్) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలు అవసరం పడవచ్చు. హెర్నియాను ఎలా సరిచేస్తారు?హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్ కాదు. పాతకాలంలో ‘ట్రస్’ (సపోర్ట్) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు. శస్త్రచికిత్సలో రకాలుఓపెన్ సర్జరీ / హెర్నియా రిపేర్ సర్జరీ : హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే 3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు. సాధారణంగా స్పైనల్ అనస్థీషియా ఇస్తారు.లాపరోస్కోపిక్ హెర్నియా రిపేర్ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్ను పెట్టి స్లేప్లింగ్ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్ అనస్థీషియాతో ఇస్తారు.లాపరోస్కోపిక్ సర్జరీతో ప్రయోజనాలుచిన్న గాటు తక్కువ నొప్పి త్వరగా కోలుకోవడం త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్ కావడం)రొబోటిక్ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.హెర్నియా నివారణ సాధ్యమేనా? హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి... బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరంచాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా? కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్ కేసుల్లో డాక్టర్లు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే ‘స్ట్రాంగ్యులేషన్’ కేసుల్లో అది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.డాక్టర్ ఎన్. భరత్కుమార్, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!
సమ్మర్ అనగానే నీటి కొరత, అధిక వేడితో సతమతమవుతుంటాయి పట్టణాలు, మెట్రో నగరాలు. చెట్లను పెంచడం, పచ్చదనం కాపాడుకోవడం వంటివి మాటలకే పరిమితం చేసి..సమస్యకు చెక్పెట్టేలా స్వచ్ఛందంగా ముందుకు ఎవ్వరురారు. కానీ ఓ మారుమూల గ్రామంలో ఓ తాత చూస్తుండగానే తన గ్రామం కొండ కోనలు బీడుగా మారిపోయాయి. అక్కడి ప్రజలు నీటి కోసం పడిగాపులు పడేవారు. ఇవన్నీ చూసిన ఓ తాత రోజు కొండలను ఎక్కి మరి చేసిన చిన్న ప్రయత్నం ఆ ఊరి రూపురేఖల్ని మాత్రమే కాదు, అక్కడి ప్రజల కష్టాలకు స్వస్తి పలికేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..ఆ వ్యక్తే ఇండేనిషియాకు చెందిన సదిమాన్. ఇండోనేషియా సెంట్రల్ జావా ప్రావిన్స్లో ఉన్న జెనెంగ్ గ్రామం కొన్నాళ్లు పొరిపరిస్థితులు, కాలానుగుణ నీటికొరతతో అల్లాడింది. ఏళ్ల తరబడి కలప నడికివేత, భూమిని చదును చేయడం, పదేపదే సంభవించిన అగ్ని ప్రమాదాలు వంటి వాటికారణంగా కొండ వాలులో అడవి విస్తీర్ణం తగ్గిపోయింది. దీనివల్ల నేలపొడిగా మారి బీడుగా అయిపోయింది. వేసవి కాలంలో స్థానిక ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోతుండేవారు. అక్కడ నీటి బుగ్గలు అదృశ్యం కావడానికి అడవుల నరికివేతే కారణమని సదిమాన్ గట్టిగా విశ్వసించాడు. చెట్ల విస్తీర్ణాన్ని పునరుద్ధరించడం వల్ల భూమి నెమ్మదిగా నీటిని తిరిగి నిలుపుకునే పునరుజ్జీవించేస్తుందనేది ఆ తాత నమ్మకం. 1990 టైంలో ఆయన గెండోల్ పర్వతం చుట్టు పక్కల ప్రాంతాల్లో బీడు కొండల అంతటా మర్రి, అత్తి చెట్లను నాటడం ప్రారంభించాడు. ఈ పని చేయడం ఆ తాత వయసు రీత్యా శారీరకంగా చాలా శ్రమతో కూడిన పని. కానీ ఆయన దీన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించాడు. అతని కృషికి ఎలాంటి ఆర్థిక సహాయం గానీ, ప్రజా గుర్తింపు గానీ లభించకపోయినా..మొక్కలు నాటడం, పర్యవేక్షించడం అతని దినచర్యగా మారిపోయింది. పైగా అతడు చేస్తున్న పనికి గ్రామస్తుల నుంచి ఎగతాళి, విమర్శలు ఎదురయ్యేవి. అతడి ఆలోచన అస్సలు ఫలిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఇలా మర్రి చెట్లను నాటడాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టి మరి బాధించేవారు ఆ తాతని. అయినా డోంట్ కేర్ అంటూ ఆ తాత కష్టపడి కొండ ఎక్కి మరి శ్రద్ధగా పర్యవేక్షించేవాడు. అందుకోసం తన వద్ద మేకలను అమ్మి మరి మొక్కలు కొనుగోలు చేసి మరి నాటేవాడట. అతడి కృషి ఫలించి నెమ్మదిగా కొండలన్నీ పచ్చగా మారడం ప్రారంభించాయి. కొండలు క్రమంగా ఎక్కువ తేమను నిలుపుకోవడం ప్రారంభించాయి. నేల కోత తగ్గింది, వృక్ష సంపద కూడా పెరిగింది. తద్వారా భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడింది. దాంతో సహజ నీటి బుగ్గలు కనిపించడం ప్రారంభించాయి. అంతేగాదు అక్కడ వ్యవసాయానికి, సమీప గ్రామాలకు నీటి కొరత తగ్గింది. వేసవి కాలంలో సైతం స్వచ్ఛమైన నీరు లభించింది. ఒకప్పుడూ నిస్సారంగా ఉన్న వాలు ప్రాంతాలన్నీ దట్టమైన పచ్చటి అడవులుగా మారాయి.ఆ చెట్లే ఎందుకంటే..మర్రి, అత్తి చెట్టు నేలను స్థిరీకరించడానికి, భూగర్భ జలాలను నిల్వ చేయడానికి సహాయపడతాయి. ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలలో నీటి పరీవాహక ప్రాంతాల పునరుద్ధరణకు ఇవి అత్యంత ముఖ్యమైన జాతులని పర్యావరణ శాస్త్రవేత్తలు సదా చెబుతుంటారు కూడా.పెద్ద అత్తి చెట్లు ఏడాది పొడవునా పక్షులు, గబ్బిలాలు, ఇతర వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా జీవవైవిధ్యానికి తోడ్పడతాయి. అందువల్లే వీటినే ఎంచుకున్నాడు సదిమాన్ తాత. ఆ తర్వాత కొద్దికాలంలో వార్తపత్రికలు, మీడియా ద్వారా అతడి స్టోరీ వ్యాపించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాదు..ఇండోనేషియన్లు ఆ తాతను ఈ పచ్చదనానికి ప్రతీకగా గౌరవించడం ప్రారంభించారు. అంతేగాదు ఈ తాత డబ్బు లేదా ఫేమస్ అవ్వడంలో పెద్ద గొప్ప ఉండదని, ఇతరులు ఇబ్బంది పడకుండా చూడటమే గొప్ప అని, అదే మనం వాళ్లకిచ్చే విలువైన బహుమతని అంటున్నాడు సదిమాన్.(చదవండి: సినిమా ఎంత పనిచేసింది..! మంచి జాబ్ లైఫ్ని వదులుకుని చివరికి..) -
కేన్స్లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్కార్పెట్పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్తో కేన్స్లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !) -
సెల్యుమా అడ్వాన్స్డ్ లైట్థెరపీని ఆవిష్కరించిన సినీ నటి
హైదరాబాద్ : చర్మ కణాల సహజ మరమ్మతు ప్రక్రియను ప్రోత్సహిస్తూ ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండా నిర్వహించే సెల్యూమా అడ్వాన్స్డ్ లైట్ థెరపీ సిస్టమ్ను సినీ నటి స్రవంతి చొక్కారపు ప్రారంభించారు.బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని నిషితాస్ క్లినిక్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ చర్మవ్యాది నిపుణురాలు డాక్టర్ నిషితా రంకాతో కలిసి ఈ ఎల్ఈడీ లైట్థెరపి విధానాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ నిషితా రంకా మాట్లాడుతూ సెల్యుమా ఎల్ఈడీ లైట్ థెరపీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యాధునిక వైద్యం అని వెల్లడించారు. ప్రత్యేక తరంగాల ద్వారా కాంతితో కణాల్లో శక్తి ఉత్పత్తి చేస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ చికిత్స పని చేస్తుందని ఆమె తెలిపారు. -
ఫోరెన్సిక్ వైద్యంలో 'మరణపూర్వ గాయాలు' అంటే? ఎలా గుర్తిస్తారంటే..
భోపాల్లో గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ మిస్ పూణే , కంటెంట్ క్రియేటర్ 33 ఏళ్ల ట్విషా శర్మ మరణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మరణించడానికి ముందు శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయలయ్యాయని ఫోరెన్సిక నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మరణపూర్వ గాయాలు అంటే ఏంటీ?, ఫోరెన్సిక్ వైద్యులు వాటిని ఎలా గుర్తిస్తారు వంటి వాటి గురించి తెలుసుకుందామా.!.ఫోరెన్సిక్ దర్యాప్తులలో ఇవి అత్యంత కీలకమైన ఆధారాలు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోస్ట్మార్టం నిర్వహించడానికి తరలిస్తారు పోలీసులు. అక్కడ ఫోరెన్సిక నిపుణులు ఆ వ్యక్తి ఎలా మరణించాడో నిర్థారించే ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నిపుణులు పోస్ట్మార్టం నివేదికలో మరణానికి ముందు గాయాలు, మరణానంతర గాయాలు అని పేర్కొంటూ ఇస్తారు. ఇవి కేసుని చేధించడానికి ఎంత కీలకం అంటే..ఆయా వ్యక్తుల మరణానికి కారణమైన నేరస్తులను వెలకితీయడానికి ప్రధాన ఆధారాలు. 'మరణపూర్వ గాయాలు' అంటే ..ఫోరెన్సిక్ వైద్యంలో, "మరణపూర్వ" అంటే మరణానికి ముందు జరిగే గాయలని అర్థం. జీవించి ఉండగానే అయ్యిన గాయాలని అర్థం. అవికోతలు లేదా రాపిడి గాయాలువాపుఎముకలు విరగడంఅంతర్గత రక్తస్రావంబలహీనమైన దెబ్బలుఆత్మరక్షణ గాయాలు తదితరాలు.వైద్యులు చెప్పేదేమిటంటే, ఈ పదం గాయాలు ఎలా జరిగాయో దానంతట అదే వెల్లడించనప్పటికీ, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తుంద.ఎలా గుర్తిస్తారంటే?మరణానంతర పరీక్ష సమయంలో, ఫోరెన్సిక్ నిపుణులు మరణానికి ముందు శరీరం గాయానికి ప్రతిస్పందించిందని చూపే ఆధారాలను సేకరిస్తారు. కణజాలంలోకి రక్తస్రావం, వాపు లేదా ఉబ్బరం, రంగు మార్పులతో కూడిన కమిలిన గాయాలు, రక్తం గడ్డకట్టడం, రక్త ప్రసరణ చురుకుగా ఉందని సూచించే కణజాల ప్రతిచర్యలు వంటివి ముఖ్యమైన సంకేతాలు. గుండె ఇంకా రక్తాన్ని పంపింగ్ చేస్తూ, శరీరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిస్పందనలు సాధ్యమవుతాయి. ఇవి చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నివేదిక. దర్యాప్తు అధికారులు ఈ గాయాలు మరణానికి ఏవిధంగా దోహదపడ్డాయి, ఆ టైంలో ఏదైన పెనుగులాట జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగాయ, స్వయంగా జరిగినవా వంటివి నిర్థారిస్తారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కేలుసలలో లేదా ఏదైన కుట్రపన్ని ఉద్దేశ్యపూర్వకంగా చంపేసిన ఘటనల్లోనే ఇలాంటి బహుణ మరణ పూర్వగాయాలకు ఆస్కారం ఉంటుంది. అదీగాక పోలీసులు వైద్య నివేదికలు లేకుండా ఒక నిర్ధారణకు రాకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. మరణానంతర గాయాలు అంటే..మరణం తర్వాత కలిగే గాయాలను మరణానంతర గాయాలు అంటారు. ఇవి సాధారణంగా అవే జీవసంబంధమైన ప్రతిచర్యలను చూపించవు.మరణానికి పూర్వం-మరణానంతర గాయాల మధ్య వ్యత్యాసం..మరణానికి ముందు గాయాలుమరణానికి ముందు సంభవిస్తాయిరక్తస్రావం, వాపును చూపుతాయిగాయం జరిగినప్పుడు శరీరం సజీవంగా ఉందని సూచిస్తాయిమరణానంతర గాయాలుమరణం తర్వాత సంభవిస్తాయిసాధారణంగా వాపు లేదా కణజాల ప్రతిచర్య ఉండదుమృతదేహాన్ని తరలించే సమయంలో, పర్యావరణానికి గురైనప్పుడు లేదా శరీరాన్ని తాకినప్పుడు జరగవచ్చు. ఇక్కడ కేసుని చేధించడంలో ఫోరెన్సిక్ నివేదిక అనేది దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. అధికారులు ఒక నిర్ధారణకు రావడానికి ముందు పోలీసుల ఇన్విస్టిగేషన్, సాక్షుల వాంగ్మూలాలు, టాక్సికాలజీ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, వైద్య చరిత్ర వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.(చదవండి: సింగింగ్'తో జీర్ణక్రియ మెరుగుపడుతుందా? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు) -
ఆస్ట్రోటూరిజం అంటే..!
ప్రయాణం అంటే ప్రపంచంలోని అన్ని ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదు. ఈ రోజుల్లో, చాలా మంది యువ ప్రయాణికులు ప్రయాణాన్ని ఒక విభిన్న కోణంలో అనుభవించడం గురించి ఆలోచించడం ప్రారంభించారు. ప్రతిదీ చాలా నెమ్మదిగా, మరింత భావోద్వేగభరితంగా ఉండాలి వారికి. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే ఆస్ట్రోటూరిజం. దీని అర్థం నల్లని ఆకాశంలో మిలమిల్లాడే నక్షత్రాలను చూడటం, ఉల్కాపాతాలను వీక్షించడం, ఇతర చీకటి ఆకాశ ప్రదేశాలను సందర్శించడం.. అలాంటి విశాల ప్రదేశాల కోసం వెదుకులాట మొదలయ్యింది. వాటి చుట్టూ సెలవులను ప్లాన్ చేసుకోవడం పెరిగింది. రోజువారీ జీవితంలోని టెన్షన్లకు దూరంగా ఉండి, సందర్శకులకు ఎంతో మనశ్శాంతిని అందించే మనదేశ ప్రదేశాలలో.. లడఖ్లోని ఖగోళశాస్త్ర శిబిరాలు, గుజరాత్ ఎడారులలోని రాత్రి ఆకాశ యాత్రలు వంటి ఇతర అనుభవాల పట్ల ప్రయాణికులు ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. నక్షత్రాల కింద నిద్రించడంఆస్ట్రోటూరిజం అనేది టెలిస్కోపిక్ పరిశీలన, నక్షత్రాల కింద నిద్రించడం, ఉల్కాపాతాలు, ఖగోళ శాస్త్ర పర్యటనలు వంటి కార్యకలాపాలపై కేంద్రీకృతమై ఉంటుంది. నేడు, పర్యాటకులు మరింత తీరికైన ప్రయాణాలను కోరుకుంటున్నందున, ప్రపంచవ్యాప్తంగానూ చీకటి ఆకాశ ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ పర్యాటక కార్యకలాపాల్లా కాకుండా, నక్షత్రాలను చూడటానికి సమయం తీసుకుని శ్రద్ధగా గమనించాలి. నిరంతరం వారిని పనిలో మునిగిపోయేలా చేసే ఈ సాంకేతిక యుగంలో, ముఖ్యంగా యువ పర్యాటకులు ఈ యాత్రలను ఎంతో ఆకర్షణీయంగా భావిస్తున్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారంటే.. చాలా కాలంగా, ప్రయాణ సంస్కృతి సోషల్ మీడియా, స్పీడ్గా ఉండే పర్యటన ΄్లాన్స్, అత్యంత సౌందర్యాత్మక అనుభవాల ద్వారా బాగా ప్రభావితమైంది. ఇటీవల భావోద్వేగపు అనుభవాన్ని కోరుకునే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఆస్ట్రో టూరిజంలో సుదూర ప్రాంతాలు, కనెక్టివిటీ లేకపోవడం, నిశ్శబ్దం, నిర్మలమైన ఆకాశం అందించే ప్రశాంత భావన ఈ రకమైన పర్యాటకం యువతరానికి ఆకర్షణీయంగా మారింది. సోషల్ మీడియా కూడా ఇటువంటి విహారయాత్ర ప్రణాళికలకు మరింత ఆకర్షణను జోడించి, ఈ ప్రయాణ ధోరణి వైపు మరింత మందిని ఆకర్షిస్తోంది.డార్క్ స్కై టూరిజం ప్రాంతాలుమన దేశంలో తక్కువ కాంతి, కాలుష్యం ఉన్న ప్రాంతాలైన లడఖ్ , స్పితి లోయ, రాన్ ఆఫ్ కచ్, కూర్గ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు .. నక్షత్రాలను వీక్షించే పర్యటనలపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సాంప్రదాయేతర ప్రయాణ అనుభవాలను కోరుకునే యువ పర్యాటకులలో ఆస్ట్రోఫెస్ట్లు, పరిశీలన పర్యటనలు, ఆస్ట్రో క్యాంపులు, టెలిస్కోప్ టూరిజం వంటివి ప్రజాదరణ దుతున్నాయి. కొత్త తరం ప్రయాణికుల కోసం పర్యాటక రంగం మారుతున్న స్వభావం నుండే ఆస్ట్రోటూరిజంకు ప్రజాదరణ పెరుగుతోంది. ఈ రోజుల్లో పర్యటన అంటే ఆడంబరం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దం, ధ్యానంతో ఎక్కువగా ముడిపడి ఉంది. (చదవండి: పెట్స్ని టూర్కి తీసుకువెళ్లాలంటే..!) -
పెట్స్ని టూర్కి తీసుకువెళ్లాలంటే..!
కుక్కలను పెంచుకునేవారికి పర్యటనలకు వెళ్లేటప్పుడు వాటిని ఎక్కడ ఉంచి వెళ్లాలో తెలియదు. తోడుగా తమతో పాటు తీసుకెళ్లాలనుకుంటారు. సాధారణంగా కారు ప్రయాణం అయితే తమతోపాటు తీసుకెళ్లే వీలుంది. కానీ, బస్సు, ట్రెయిన్, విమాన ప్రయాణాలలో పెట్స్ను తీసుకెళ్లడం కుదురుతుందా..?!ఏ వాహనంలోనైనా తమ పెంపుడు జంతువును తీసుకెళ్లే వీలుందా అనే విషయాన్ని ‘ముందస్తుగా బుక్ చేసుకున్నా’ కన్ఫర్మ్ చేసుకుంటూనే ఉండాలి. బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించుకోవాలి. కొన్ని పెట్ రైలు ప్రయాణం కోసం నెలల తరబడి టైమ్ పట్టవచ్చు. టికెట్ రేట్లు కూడా ప్రయాణాన్ని బట్టి ఉంటాయి. హోమ్ స్టే కోసం రూ.600 నుంచి 10,000 వరకు ఉంటుంది. సౌకర్యానికే మొదటి ప్రాధాన్యత..సుదీర్గ రైలు ప్రయాణాలు, గంటల తరబడి కారు ప్రయాణాలు, విమానప్రయాణాలు జంతువులను గందరగోళాన్ని కలిగించవచ్చు. వాటి దినచర్య పెట్ యజమానికి తెలుసు కాబట్టి, దానికి తగిన విధంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల ముందు నుంచే కారులో వాటిని షికారుకు తీసుకెళ్లాలి. ప్రయాణాన్ని అలవాటు చేయాలి. తేలికపాటి భోజనం పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించడం చేయాలి. అవసరమైనవి వెంట తీసుకెళితే..కుక్కలు విశ్రాంతి తీసుకునే పరుపులు, ఆడుకునే బొమ్మలు, వాటికి తెలిసిన వస్తువులు వెంట తీసుకెళ్లాలి. ఇవి కొత్త పరిసరాలలో వాటి రోజువారీ జీవనాన్ని మొదలుపెట్టడానికి సహాయపడతాయి. ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు ఉన్నా, తెలిసిన వస్తువుల ద్వారా కొంత అలజడిని నివారించవచ్చు. అనుకూలమైన ప్రదేశాలుకొన్నినగరాలలో క్యాట్ కేఫ్లు, డాగ్ పార్కులు ఉంటాయి. వాటికి మీ పెట్స్ను తీసుకెళ్లినంత మాత్రానా అవి అనుకూలంగా ఉండకపోవచ్చు. మన దేశంలో పెంపుడు జంతువులను సహించేవారు ఎక్కువే మందే ఉన్నారు. అలాగని అన్ని హోటళ్లు కుక్కలను అనుమతించవు. కొన్ని హోటళ్లు మార్కెటింగ్ కోసం పెట్స్కు ‘అనుమతి’ని ఇస్తున్నాయి. పెట్స్ తమతో పాటు ఉండాలంటే ప్రైవేట్ విల్లాలు, ఫామ్ హౌజ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. గోవా వంటి ప్లేసుల్లో రెస్టారెంట్లు, బీచ్లలో పెట్స్కు తగినంత స్వేచ్ఛ లభిస్తుంది. మహాబలేశ్వర్లోని బీచ్, కొండ ప్రాంతాల్లో చేసే ట్రెక్కింగ్, ప్రశాంతమైన వీధుల గుండా పెట్స్తో ప్రయాణించవచ్చు. మీతో పాటు మీ కుక్క సముద్రపు అలలతో ఆడుకోవడం, రోజంతా కొత్త అనుభవాల కోసం అన్వేషించడం, తర్వాత మీతో పాటు ముడుచుకొని విశ్రాంతి తీసుకోవడం.. పెట్తో చేసే ప్రయాణంలో ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా నిలిచి΄ోతాయి. ఆందోళన అనిపించే ఎలాటి అడ్డంకి అయినా సులువుగా తొలిగిపోతుందన్న భావన మదిలో మెదులుతుంది. -
సమ్మర్ సఫారీ చేద్దామా..!
దట్టమైన అటవీ ప్రాంతంలో జీపు సఫారీ..బెంగాల్ పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లను దగ్గరినుంచి తిలకించడం, రిజర్వాయర్లో బోటు షికారు.. నదుల మధ్య కాటేజీలు, తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు, ట్రెక్కింగ్ చేయాలన్నా.. చూడాలన్నా ఏ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తే చాలు వన్య్రప్రాణుల సహజసిద్ధమైన జీవన శైలిని కళ్లారా చూస్తూ.. ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఈ వేసవిలో పర్యాటకులకు మంచి అనుభూతిని మిగిల్చేందుకు రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి.ప్రకృతిని, వన్య ప్రాణులను దగ్గరి నుంచి చూడాలనుకునే వారికి సంతృప్తి పరిచేలా పలు పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడవులు, అటవీ జంతువులు, పక్షులు, నదులు, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలు, కృష్ణా, గోదావరి నదుల మధ్యలో కాటేజీలు ఇలా ఏ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనుకున్నా అందుకు తగిన ΄్ప్రాకేజీలు సిద్ధం అవుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన వన్య్ప్రాాణి పర్యాటక కేంద్రాలు ఇలా ఉన్నాయి. పర్యాటకులు తమ పర్యటనను అధికారిక వెబ్సైట్ల ద్వారా ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. వేసవి ఎండల దష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంతం టేకు చెట్లకు ప్రసిద్ధి. ఓపెన్ టాప్ జీపుల్లో అడవి లోపలికి తీసుకెళ్తారు. ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు, అలాగే 9:30 నుంచి 11:30 గంటలు; మధ్యాహ్నం 3:30 – 5:30 వరకు సఫారీ అందుబాటులో ఉంటుంది. సాధారణ రోజుల్లో జీపునకు (6 గురు వరకు) రూ.3,500, వారాంతాల్లో రూ.4వేల వరకు ఉంటుంది. ఏటూరునాగారం వన్య్రప్రాణి అభయారణ్యం (తాడ్వాయి)వరంగల్ సమీపంలోని ఏటూరు నాగారం వన్య్రప్రాణి అభయారణ్యంలో ’తాడ్వాయి హట్స్’ (కుటీరాలు), ’నైట్ వాచ్’ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జీపు సఫారీకి రూ.1,500లు, అటవీ ట్రెక్కింగ్కు ఒక్కొక్కరికి రూ.100 ఉంటుంది. అలాగే సైక్లింగ్ సౌకర్యం ఉంది. ఇక్కడ భారీ ఉడుతలు, అడవి దున్నలు కనిపిస్తాయి.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (నల్లమల అడవులు)హైదరాబాద్కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఇక్కడ ‘టైగర్ స్టే‘ ప్యాకేజీ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో పర్యావరణ విద్యా కేంద్రం సందర్శన, సఫారీ, ట్రెక్కింగ్ ఉంటాయి. ఫరాహాబాద్ సర్క్యూట్లో ఈ సఫారీ సాగుతుంది.కృష్ణా నది అందాలను చూస్తూ గడపడానికి తాబేలు, మొసలి వంటి థీమ్ కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమ్రాబాద్లో మూడు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. ఫరాహాబాద్ సఫారీ మెుత్తం 16 కి.మీ. ప్రయాణం కాగా... 7 సీట్ల వాహనానికి రూ. 3 వేలు ఛార్జ్ చేస్తున్నారు. గుండం సఫారీ దట్టమైన అడవిలో 35 కి.మీ. ప్రయాణం కాగా.. వాహనానికి రూ. 5 వేలు, అక్కమహాదేవి గుహల సఫారీ 14 కి.మీ ప్రకృతి అందాల మధ్య ప్రయాణానికి.. 5 సీట్ల వాహనానికి రూ. 3 వేలు వసూలు చేస్తున్నారు. కిన్నెరసాని వన్య్రప్రాణి అభయారణ్యం (కొత్తగూడెం) ఖమ్మం సమీపంలోని కొత్తగూడెంలో ఉన్న ఈ ప్రాంతం నీరు, పచ్చదనంతో అలరారుతుంటుంది. డీర్ పార్క్ (జింకల పార్క్), రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యం కలవు. ఇక్కడి ప్రకతి అందాల మధ్య ప్రశాంతంగా గడపడానికి కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.. భద్రాచలం పుణ్యక్షేత్రం వెళ్లే సమయంలో వీటిని సందర్శించవచ్చు. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం (చదవండి: ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!) -
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..) -
వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా?
గత కొన్ని రోజులుగా భారత్లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్ విశాల్. ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.పారాసెటమాల్ వేసుకోవచ్చా..వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్ఎస్ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్ విశాల్.గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Vishal Gabale (@health.with.vg) (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
పుదీనాతో చెమటకు చెక్!
పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షించడమే కాకుండా, హైడ్రేట్ చేసి తాజాగా ఉండేలా చేస్తాయి. పుదీనాలోని విటమిన్ ‘ఏ’ చర్మంలోని జిడ్డును తగ్గించి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పుదీనా ఆకుల పేస్ట్, గుడ్డు తెల్లసొన మిశ్రమంతో మాస్క్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. పుదీనాలోని శాలిసిలిక్ యాసిడ్ మొటిమలను తగ్గిస్తుంది. పుదీనా రసం, పచ్చి బొప్పాయి రసాన్ని కలిపి మచ్చలు, కీటకాలు కుట్టిన చోట లేదా చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేసవిలో చన్నీటిలో పుదీనా ఆకులను వేసి ముఖం కడుక్కోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులు లేదా పుదీనా నూనె వేసుకుంటే అలసట తగ్గి, అధిక చెమట సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే మచ్చల నివారణకు కూడా పుదీనా తోడ్పడుతుంది. సమాన పరిమాణంలో ఎండిన తులసి, వేప, పుదీనా ఆకులను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక చెంచా ఈ పొడికి కొంచెం పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసి మచ్చలపై రాస్తే అవి క్రమంగా తగ్గుతాయి. చర్మ సంరక్షణ కోసం కానోపిఎంత ఖరీదైన ఫేస్ వాష్లు వాడినా, ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే నీరు బాగుండకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథానే. కొళాయి నీటిలో ఉండే క్లోరిన్, ఇతర మలినాలు, హార్డ్ వాటర్ చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా, మొటిమలు, అలర్జీలకు దారితీస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ వెల్నెస్ బ్రాండ్ కానోపీ తన సరికొత్త ఫాసెట్ ఫిల్టర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫిల్టర్ సాధారణ వాటర్ ఫిల్టర్ల లాగా కాకుండా, ప్రత్యేకంగా చర్మ సంరక్షణ కోసం రూపొందించినది. ఇది నీటిలోని క్లోరిన్, ఇతర మలినాలను తొలగించి, నీటిని సున్నితంగా మారుస్తుంది. దీనివల్ల చర్మంపై కలిగే మంట, అలర్జీలు తగ్గుతాయి. మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.ఈ ఫిల్టర్ కేవలం పనితీరులోనే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాత్రూమ్ ఇంటీరియర్కు తగినట్లుగా ఇది లావెండర్, ఇత్తడి, మ్యాట్ బ్లాక్, బ్రష్డ్ నికెల్ వంటి అద్భుతమైన రంగులలో లభిస్తుంది. కానోపీ సంస్థ కేవలం ఫిల్టర్లకే పరిమితం కాకుండా, షవర్ హెడ్లు హ్యూమిడిఫైయర్లను కూడా సరికొత్త రీతిలో డిజైన్ చేస్తోంది. గృహోపకరణాలను బ్యూటీ టూల్స్గా మార్చడం ద్వారా మన ఇంట్లోనే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.(చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?) -
కృత్రిమ గర్భధారణకు కృత్రిమ మేధోసాయం!
కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తోడ్పడుతోంది. మునుపు దాదాపు పరిశోధనల్లో లేదా మరికొన్ని అంశాల్లో సహాయకారిగా ఉండే ఏఐ ఇప్పుడు వైద్యరంగంలోని చాలా విషయాల్లో తన సహాయం అందించడం పరిపాటి అయ్యింది. ఐవీఎఫ్ ప్రక్రియకు మరింత చేయూత ఇచ్చేందుకు అవసరమైన పరిజ్ఞానం సమకూర్చుకుంటోంది. ఆ వివరాలేమిటో చూద్దాం...పిల్లలు లేనివారు ఓ బిడ్డకోసం తాపత్రయపడటం మన సమాజంలో ఉన్నదే. ఇందుకు సహాయపడే కృత్రిమ గర్భధారణ ప్రక్రియల్లో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ఒకటి.ఐవీఎఫ్ అంటే... ఐవీఎఫ్ ప్రక్రియలో మొదట మహిళ అండాశయాల నుంచి అండాలను సేకరించి వీర్యకణంతో కృత్రిమంగా ఫలదీకరణం జరిగేలా చూస్తారు. దంపతులు కలిసినప్పుడు ఏదైనా కారణాలతో మహిళలో నేచురల్గా ఫలదీకరణం జరగనప్పుడు డాక్టర్లు ఇలా బయటే ఫలదీకరణ జరిగేందుకు సహాయపడుతుండటంతో దీన్ని ‘అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ’ (ఏఆర్టీ) అంటారు. ఫలదీకరణ లోపలే జరగకపోవడానికి కారణాలంటే... మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకు΄ోవడం, ఎండోమెట్రియాసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) లేదా ఓవరీ తాలూకు సమస్యలుండటం, నిర్దిష్టంగా ఇదీ సమస్య అని తెలియని కారణాలు ఉండటం. అదే పురుషుల విషయంలో వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) తక్కువగా ఉండటం. ఈ సమస్యలున్నప్పుడు ఫలదీకరణ జరిగేందుకు బయటే ఐవీఎఫ్ జరిగేలా చూస్తారు.ఎలా చేస్తారంటే... సంక్లిష్టమైన ప్రక్రియ అయి ఐవీఎఫ్ను అనేక అంచెల్లో చేయాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మహిళలో అండాలు పెరిగేలా చూస్తారు. మామూలుగానైతే మహిళలో నెలకు ఒక అండమే పెరుగుతుంది. ఇలా అనేక అండాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడాన్ని ‘కంటెయిల్డ్ ఒవేరియన్ స్టిమ్యులేషన్’ అంటారు. ఇలా అండాలు పెరిగాక ఒక సూదిలాంటి పరికరంతో ‘ఫాలికిల్’ నుంచి వాటిని బయటకు తెస్తారు. అటు తర్వాత ఆ అండాలను ఓ ఇంక్యుబేటర్లోకి ప్రవేశపెడతారు. ఆపైన ఆ అండాల్లోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడాన్ని ‘ఇంట్రా సైటో΄్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఐసీఎస్ఐ) అంటారు. ఫలదీకరణం అయిన అండం ఇక ‘పిండం’ (ఎంబ్రియో)గా మారుతుంది. బయట కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేశాక... ఇక ఆ పిండాన్ని (ఎంబ్రియోను) గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియను ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. తాజా పిండాన్ని మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంబ్రియో’ అంటారు. కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన ఎంబ్రియోలను మహిళ గర్భసంచిలోకి ప్రవేశపెడితే దాన్ని ‘ఫ్రోజెన్ ట్రాన్స్ఫర్’ అని అంటారు. ఇలా మహిళలోకి ప్రవేశపెట్టిన పిండాన్ని గర్భసంచి ఆమోదించి, తనలో నేచురల్గా పెరిగేందుకు అనుమతిస్తే ఇక ఆ ప్రెగ్నెన్సీ మామూలు గర్భవతిలోలాగే పెరుగుతుంది. ఐవీఎఫ్లో జరిగేది ఇదే.ఏఐ సహాయం ఎక్కడెక్కడ...ఇప్పుడు ఐవీఎఫ్లోని అనేక దశల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) సహాయం చేస్తోంది. అదెలాగంటే... ∙హార్మోన్ ఇంజెక్షన్స్ ఏవేవి ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించడం కృత్రిమంగా పెరిగిన అనేక అండాలలో నాణ్యమైన వాటి ఎంపిక పార్టనర్ వీర్యకణాల్లోనూ నాణ్యమైన వాటి ఎంపిక టైమ్–లాప్స్ ఎంబ్రియో ఇమేజింగ్ సిస్టమ్స్... అంటే ఇందులో పిండం (ఎంబ్రియో) డిస్టర్బ్ కాకుండా ఉండేలా చూస్తూ... కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాల సహాయంతో... ఆ ప్రక్రియ ఎలాంటి అంతరాయాలూ లేకుండా జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం. ఈ డేటా సహాయంతో నాణ్యమైన ఎంబ్రియోను సూచించడం.భవిష్యత్తులో మరింత పురోగతి... ఏఐ పరిజ్ఞానాన్ని మరిన్ని అంశాల్లో మరింత లోతుగా ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యనిపుణులు భావిస్తున్నారు. వాటిలో కొన్ని... ∙గర్భధారణ ఏ మేరకు విజయవంతం కాగలదనే అంశాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ∙ల్యాబ్లలో జరిగే ప్రక్రియలు మరింత తేలిగ్గా / సులువుగా జరిగేందుకు తగిన సాంకేతికతను అభివృధ్ధి చేసుకోవడం (ఎంబ్రియాలజీ ల్యాబ్ ఆటోమేషన్) మహిళ దేహంలో జరుగుతున్న హార్మోనల్ మార్పులను పరిశీలించడం (డిజిటల్ పేషెంట్ మానిటరింగ్) ∙రోబోటిక్స్ సహాయంతో ప్రక్రియలు మరింత సునిశితంగా / ఖచ్చితత్వంతో జరిగేలా చూడటం ∙తనకు డాక్టర్ ఇచ్చిన సూచనలను మహిళ ఖచ్చితంగా పాటిస్తోందా లేదా అన్నది పరిశీలించడం (రియల్ టైమ్ అప్డేట్) ∙అండాలు/పిండాల నిల్వలో (క్రయోప్రిజర్వేషన్)లో గణనీయమైన మెరుగుదల.ఏఐ సహాయంతో ఇవీ ప్రయోజనాలు...మెరుగైన గర్భధారణ ఫలితాలు: నాణ్యమైన ఎంబ్రియో ఎంపికతో గర్భధారణకు మెరుగైన అవకాశాలు ప్రమాదాలు / ముప్పులు తగ్గడం : దేహానికి కోత / గాటు పెద్దగా లేకపోవడంతో (అతి తక్కువ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల) తక్కువ నొప్పి, తక్కువ ముప్పు (రిస్క్) సునిశితత్వం / ఖచ్చితత్వం: ల్యాబ్ ప్రక్రియలన్నీ సమర్థంగా జరిగేలా చూడటం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించడం. చివరగా... ఐవీఎఫ్ అన్నది ఇప్పటికీ కొంత ఖరీదైన ప్రక్రియే. ఈ ప్రక్రియలో వేగాన్నీ, సునిశితత్వాన్ని, ఖచ్చితత్త్వాన్ని పెంచడం ద్వారా ఫలదీకరణ అవకాశాలు మరింత మెరుగుపరచడం, తద్వారా ఖర్చులు తగ్గించడం సాధ్యమవుతుంది. ఇలా ఏఐ సహాయంతో భవిష్యత్తులో ఐవీఎఫ్ మరింత ఫలవంతంగా రూపొందే అవకాశముంది.నిర్వహణ : యాసీన్ (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
పిల్లల్ని పొగడటం మంచిదేనా?
పిల్లలు ఏదైనా చిన్న మంచి పని చేయగానే "నువ్వు గ్రేట్", "you are a hero" అని ఆకాశానికి ఎత్తేస్తున్నారా? అలా పొగిడితే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ తప్పకుండా చదవండి.పిల్లల పెంపకంలో ప్రశంస మంచిదే, కానీ అది ఏ మోతాదులో, ఎలా ఇస్తున్నామనే దానిపైనే వారి రేపటి విజయం ఆధారపడి ఉంటుంది.మీరు చేస్తున్న అతి ప్రశంస (Over-praise) వారి ఎదుగుదలకు ప్లస్ కాకపోగా, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే సైకలాజికల్ బాంబుగా మారుతోంది.Importance of Praiseచైల్డ్ సైకాలజీ కోణంలో చూస్తే, పిల్లల మెదడు వికాసానికి ప్రశంస అనేది ఒక పాజిటివ్ యాంకరింగ్ లాంటిది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, తల్లిదండ్రుల నుండి వచ్చే సానుకూల గుర్తింపు పిల్లల మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది వారిలో నేర్చుకోవాలనే జిజ్ఞాసను, సామాజిక నైపుణ్యాలను (Social Skills) పెంచుతుంది.అస్సలు ప్రశంసలు దక్కని పిల్లలు అండర్ కాన్ఫిడెన్స్ తో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పెరుగుతారు.The Danger of Over-praiseసమస్య అంతా అవసరం లేని చోట, అతిగా పొగడటంతోనే మొదలవుతుంది. Journal of Experimental Child Psychology లో ప్రచురితమైన ఒక కీలక అధ్యయనం షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఏదైనా మామూలు పని చేసినా లేదా అసలు శ్రమే పెట్టకపోయినా పిల్లలను అతిగా పొగిడితే, వారిలో Praise Addiction (ప్రశంసల వ్యసనం) ఏర్పడుతుంది.దీనివల్ల రేపు క్లాస్రూమ్లోనో, సమాజంలోనో ఎవరైనా తమను పొగడకపోతే వారు తీవ్ర నిరాశకు గురవుతారు. అంతేకాదు, తమను తాము ఎక్కువగా ఊహించుకునే నార్సిసిస్టిక్ (Narcissistic) ధోరణులు వారిలో పెరుగుతాయి.The Famous Dweck Studyప్రశంసకు, అతి ప్రశంసకు మధ్య ఉన్న అసలు తేడాను స్టాన్ఫర్డ్ సైకాలజిస్ట్ Carol Dweck తన ప్రసిద్ధ పరిశోధనలో నిరూపించారు. ఆమె పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి ఒక పజిల్ టాస్క్ ఇచ్చారు.* మొదటి గ్రూప్ లో "నువ్వు చాలా స్మార్ట్", "నువ్వు చాలా ఇంటెలిజెంట్" అంటూ పిల్లల తెలివితేటలను పొగిడారు (Trait Praise).* రెండో గ్రూప్ లో "నువ్వు చాలా బాగా కష్టపడ్డావు", "చాలా శ్రద్ధగా చేశావు" అంటూ పిల్లల శ్రమను పొగిడారు (Process Praise).ఆ తర్వాత మరింత కష్టమైన పజిల్స్ ఇచ్చినప్పుడు... కేవలం తెలివితేటలను పొగిడిన మొదటి గ్రూప్ పిల్లలు ఓడిపోతామనే భయంతో టాస్క్లు వదిలేశారు (Fixed Mindset).కానీ, శ్రమను పొగిడిన రెండవ గ్రూప్ పిల్లలు సవాల్ను స్వీకరించి, కొత్తగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు (Growth Mindset).పేరెంట్స్ కోసం 3 ప్రాక్టికల్ టిప్స్ఈ అతి ప్రశంస లూప్ నుండి బయటపడటానికి పేరెంట్స్ ఈ క్రింది మూడు విషయాలను గుర్తుంచుకోవాలి.1. ఫలితాన్ని కాదు, ప్రయాణాన్ని పొగడండి. "నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, నువ్వు తోపు" అనడానికి బదులు... "ఈ మార్కులు సాధించడానికి నువ్వు రోజు రాత్రి పడ్డ కష్టం నాకు నచ్చింది" అనండి.2. ప్రశంసను వారు సంపాదించుకునేలా చేయండి (Earned Praise). ప్రతి చిన్న సాధారణ విషయానికి కాకుండా, వారు నిజంగా పట్టుదల చూపించినప్పుడు మాత్రమే మెచ్చుకోండి.3. రియలిస్టిక్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పొగడ్తల్లో నిజాయితీ లేకపోతే పిల్లలు దాన్ని సులభంగా పసిగట్టేస్తారు. కాబట్టి ప్రశంస ఎప్పుడూ జెన్యూన్గా ఉండాలి.పిల్లలకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలను కాకుండా, వారు పెట్టే శ్రమను మాత్రమే ప్రశంసించండి. అప్పుడే రేపటి పోటీ ప్రపంచంలో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే Resilience, మానసిక దృఢత్వం కలిగిన అద్భుతమైన జనరేషన్ను మనం నిర్మించగలం!-సైకాలజిస్ట్ విశేష్ Founder, Genius Matrix Hub www.psyvisesh.com 8019 000066 -
పండ్లు ఎప్పుడు తినాలి?.. భోజనం తరువాత? ముందా?
పండ్లు, కాయగూరలు నిత్యం తినడం ఆరోగ్యానికి మంచిదని వింటూనే ఉంటాం. మనలో చాలామంది ఆరోగ్య సంరక్షణ కోసం తింటూ ఉంటారు కూడా. అయితే సాధారణంగా భోజనం తరువాత పండ్లు తింటూంటాం మనం. ఇది ఆరోగ్యానికి మేలు చేయదంటోంది తాజా అధ్యయనాలు. ఇలా ఎందుకు? ఎప్పుడు తినాలి? అన్నది బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ మాటల్లో...చీకటిపడగానే నిద్ర... కడుపు ఖాళీ అవుతూండగానే ఆకలి అన్నది ప్రకృతి ద్వారా మనకు సహజసిద్ధంగా అందిన లక్షణాలు.. ఇలా కాకుండా.. పగలు నిద్రపోయినా.. ఇష్టానుసారం తిన్నా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఇది పండ్ల విషయంలోనూ వర్తిస్తుంది. భోజనం తరువాత లేదా భోజనంతో కలిపి తినడం వల్ల పండ్లు ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పండ్లలో మనకు ఉపయోగపడే ఎంజైమ్లు.. బొప్పాయిలోని పపెయిన్, అనాసలోని బ్రోమలీన్ వంటివి ఖాళీ కడుపులోనే బాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఇతర ఆహార పదార్థాలు ఏవి ఉన్నా.. ఈ ఎంజైమ్లు శరీరానికి ఒంటబట్టడం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం తరువాత పండ్లు తింటే.. ఈ ఎంజైమ్లు వెనుకబడిపోతాయి. తేలికగా జీర్ణమయ్యే చక్కెరలు మాత్రమే శరీరానికి ముందుగా అందుతాయి. అందుకే కడుపారా భోంచేసిన తరువాత రక్తంలోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరిగిపోవడం. ఈ క్రమంలో ప్రొటీన్లు, కొవ్వుల తరువాత మాత్రమే ఎంజైమ్లు జీర్ణమవుతాయి. ఫలితంగా ఇవి చిన్న పేవుల్లోకి చేరే ముందే (పోషకాలన్నీ శరీరానిక అందేది ఇక్కడి నుంచే) పులిసిపోయి పనికి రాకుండా పోతాయి.తరుణోపాయం...భోజనం తరువాత పండ్లు తీసుకోవడం సరికాదన్నది స్పష్టం. మరి ఎప్పుడు తీసుకోవాలి? ఉదయాన్నే పరగడుపున మంచిది అంటోంది యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం. ఇలా చేస్తే... రక్తంలో చెక్కర మోతాదు కూడా ఎక్కువగా పెరగలేదని ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ఒక పండును ఉదయం తిన్నప్పుడు రక్తంలో విటమిన్ సి, కరొటనాయిడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నాయని, అదే పండు సాయంకాలం తిన్నప్పుడు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ అధ్యయనం తెలిపింది.ఇంకోలా చెప్పాలంటే నిద్రకు సమయం ఉన్నట్టే పండ్లు తినేందుకు మంచి సమయం ఒకటి ఉందన్నమాట. ఉదయం పూట తిన్నప్పుడు పండ్లలోని ఫ్రక్టోస్ (ఒకరకమైన చక్కెర) మెరుగ్గా జీర్ణమవుతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు గ్లైకోజెన్ గురించి అర్థం చేసుకోవాలి. కాలేయంలో ఉంటుంది ఈ పదార్థం. రాత్రిపూట బాగా తగ్గిపోతుంది. శరీరానికి అవసరం కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఉదయం పూట తినే పండ్లతో లభించే ఫ్రక్టోస్ను నేరుగా గ్లైకోజెన్గా మార్చేస్తుంది కాలేయం. కావాల్సినంత గ్లైకోజెన్ ఉంటే మాత్రం కాలేయం ఫ్రక్టోస్ను కొవ్వుగా మార్చేస్తుంది. అదన్నమాట విషయం. కాబట్టి ఇకపై పరగడుపునే కాసిన్న పండ్లు మీ పొట్టలోకి పడేశారనుకోండి... చక్కటి ఆరోగ్యం మీ సొంతమయ్యే అవకాశం ఎక్కువవుతుంది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఉమెన్ పవర్
‘మైనింగ్ రంగంలో మహిళలు ఏమిటి?’ అనే ఆశ్చర్యం... మహిళా ఉద్యోగులు సునిత్నమైన పనులు మాత్రమే... అదీ ఆఫీసు నాలుగు గోడల మధ్యే పనిచేయాలనే నమ్మకాలు, అపోహలు...వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఉమెన్ పవర్ చాటి చూపుతున్నారు మహిళలు.తాజా విషయానికి వస్తే... మైనింగ్ రంగంలో 50, 100 టన్నుల బరువులు మోసుకెళ్లే హెవీ డ్యూటీ డంపర్లను మహిళలు నడిపిస్తున్నారు. తొలి అడుగు ఉత్తర భారతంలోని టాటా స్టీల్స్ కంపెనీలో పడగా, రెండో అడుగుకు తెలంగాణలోని సింగరేణి వేదికైంది.పదమూడు మంది మహిళా కార్మికులు సిరిసిల్లలోని ‘తెలంగాణ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’లో హెవీ ఎర్త్ మూవర్ మెషిన్లను నడపడంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఇంటర్నల్ రిక్రూట్ ద్వారా సంస్థ పరిధిలోని పదిహేడు ఓపెన్ గనుల్లో విధులు నిర్వహించనున్నారు...వారిలో కొందరి హెవీ వాహన ప్రయాణం గురించి వారి మాటల్లోనే...ఆర్మీ మిస్సైనా... మరుదనాయగం శిరీషమాది మంచిర్యాల జిల్లా మందమర్రి. చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. మా తాత, తండ్రులు, బాబాయ్లు సైతం సైన్యంలో పనిచేశారు. వాళ్ల స్ఫూర్తితో పోలీస్ శాఖలో చేరాలని ప్రయత్నించాను. ఎస్.ఐ. పరీక్షల్లో పల్టీ కొట్టినా, ఆ తర్వాత ఇంట్లోవాళ్లను ఒప్పించి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు సిద్ధమయ్యాను. ఆర్మీలో జాయిన్ అవడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న సమయంలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తోన్న నాన్న రఫేల్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో అమ్మ విక్టోరియా కోరిక మేరకు కుటుంబంకోసం ఆర్మీ కలలను పక్కనపెట్టి సింగరేణి కార్మికురాలిగా 2024 మార్చిలో జాయిన్ అయ్యాను. చిన్నప్పటి నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపే అలవాటు ఉంది. ఆ తర్వాత కార్లు కూడా ధైర్యంగా నడిపించేదాన్ని. అయితే, గనుల్లో వాటికంటే పరిమాణంలో, సామర్థ్యంలో పెద్దవైన ప్రొక్లెయినర్లు, డంపర్లు, షావెల్స్ క్రేన్లు కనిపించేవి. కార్లు, బైకులు నడిపిన నాకు వాటిని కూడా నడిపించాలని అనిపించినా, ఎవరిని అడగాలో తెలియక ఆశను మనసులోనే దాచుకున్నాను. సీఎండీ బలరామ్నాయక్ 2024 చివర్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్లో నేరుగా కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే అదనుగా సీఎండీ సార్తో మాట్లాడుతూ ‘సార్, నాకు గనిలో ఎప్పుడు తిరుగుతూ కనిపించే డంపర్లు నడపాలని ఉంది. నాకు ఆ అవకాశం ఇస్తారా’ అని అడిగాను. దానికి ఆయన ‘అవి నడపాలంటే డ్రైవింగ్లో అనుభవం ఉండాలి. నీకు ఉందా?’’ అని ప్రశ్నించారు. దీంతో చిన్నప్పటి నుంచి బైకులు, కార్లు నడపడంలో నాకున్న అనుభవం గురించి వివరిస్తూ.. మాకు కూడా పురుషులతో సమానంగా డంపర్లు నడిపే ఛాన్స్ ఇవ్వండి అని మరోసారి కోరాను. నా ఉత్సాహం చూసిన సీఎండీ సార్ ‘ సరే,. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాను’ అని హామీ ఇచ్చారు. నిలబెట్టుకున్నారు.ప్రతీ చోట సవాలే.. ప్రయత్నిస్తే విజయాలే – తోకల త్రివేణిమాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. మా నాన్న తోకల ఎల్లయ్య సింగరేణి కార్మికుడు. నాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో జాయిన్ అయ్యాను. పెళ్లికిముందు నాకున్న కార్ డ్రైవింగ్ అనుభవం తర్వాత పనికి వచ్చింది. మహిళా కార్మికులకు డంపర్ ఆపరేటర్గా అవకాశం ఇస్తామంటూ 2025 ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఓ సవాల్గా తీసుకున్నాను. సిరిసిల్ల ట్రైనింగ్ సెంటర్లో మొదటి వారం థియరీ, సిమ్యులేషన్ మీద క్లాసులు తీసుకున్నారు. తర్వాత 16 అడుగుల పొడవైన స్కూల్బస్సును, 26 అడుగుల పొడవు ఉండే ట్రక్ (లారీ)ని నడిపించడంపై గ్రౌండ్లో శిక్షణ ఇచ్చారు. కానీ శిక్షణ మలిభాగంలో అవే హెవీ వెహికల్స్ను నేరుగా రోడ్డుపై నడపమన్నారు. మొదట్లో కొంత భయపడ్డప్పటికీ, నా ఫస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ను గుర్తు తెచ్చుకుని క్లచ్ వదిలి, ఎక్సలేటర్ తొక్కి గేరు మార్చాను అంతే!కెరీర్ గ్రోత్ కోసం...– షేక్ రహమత్ ఉన్నీసామా నాన్న షేక్ అబ్దుల్ ఖదీర్ భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పని చేసేవారు. ‘మనది సంప్రదాయ కుటుంబం, కట్టుబాట్లు పాటించాలి’ అనే పరిధిలోనే నేను డిగ్రీ పూర్తి చేయడం. పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే. ఐటీ సర్వీసెస్లో పనిచేసే నా భర్త జుబేర్ అహ్మద్తో పెళ్లి తర్వాత ఆయన నా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. కొత్తగా ఆయన కారు కొనుక్కోవడమే కాకుండా నాకు పట్టుబట్టి డ్రైవింగ్ నేర్పించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2022లో సింగరేణిలో బదిలీ వర్కర్గా జాయిన్ అయ్యాను. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 2025 ఆగస్టులో డంపర్ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరెన్ని విధాలుగా వెనక్కి లాగాలని చూసినా వినలేదు. సంప్రదాయ పద్దతిలో రెగ్యులర్ ఆఫీస్ జాబ్కే పరిమితం అవడం కంటే కెరీర్ గ్రోత్ ఉండే డంపర్ ఆపరేటర్గా వెళ్లడమే ఉత్తమం అనుకుని ముందడుగు వేశాను. కొత్త బాటలో నడిచేటప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలు, తిరస్కారాలు ఎదురుకావచ్చు. వాటిని లెక్కచేయక ముందుకు సాగి విజయం సాధిస్తే తరువాత అదే బాటని మిగిలిన వాళ్లు అనుసరిస్తారు.– తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
పల్లెటూరి అమ్మాయి ఘనత.. రైతన్నల కోసం..!
పిల్లలూ! ప్రతిరోజు మనం పాఠశాలకు వెళ్లి ఏం చేస్తాం? పాఠాలు వింటాం.. స్నేహితులతో ఆడుకుంటాం కదా.. కానీ పూజ అనే మనలాంటి ఒక విద్యార్థిని మాత్రం తను ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఒక యంత్రాన్ని ఆవిష్కరించేసింది. అది ఆ పాఠశాల విద్యార్థుల సమస్యని పరిష్కరించడమే కాదు.. మనకు అన్నం పెట్టే అన్నదాతల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తోంది. మరి మంచి పనులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా .. పూజా పేరు దేశమంతటా ప్రశంసలతో మార్మోగింది.. ఎన్నో బహుమతులనూ సొంతం చేసుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...పేద కుటుంబానికి చెందిన పూజ ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ బడిలో చదువుకునేది. పంట కోతల సమయంలో పొలాల్లోని యంత్రాల (థ్రెషర్లు) నుంచి వచ్చే దుమ్ము, ధూళి గాలిలో కలిసి ఆమె తరగతి గదిలోకి వచ్చేవి. దానివల్ల పిల్లలకు సరిగ్గా ఊపిరి ఆడక΄పోయేది, పుస్తకాలు కూడా కనబడకపోయేవి. మరోవైపు ఈ కాలుష్యం వల్ల ఎంతో మంది రైతులు అనారోగ్యం పాలవ్వడం పూజను బాధించింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించింది.డస్ట్ ఎక్స్ట్రాక్టర్ఒకరోజు ఇంట్లో తన తల్లి పిండిని జల్లెడ పట్టడం పూజ చూసింది. సన్నని పిండి కిందకు పడితే, గరుకుగా ఉండేవి జల్లెడలో ఉండిపోయాయి. అదే సూత్రం పూజను పరిష్కారం దిశగా ఆలోచించేలా చేసింది. పంటలోని దుమ్మును వేరు చేస్తే బాగుంటుందని ఆలోచించింది. వెంటనే తన సైన్స్ మాస్టారు సహాయంతో పాత రేకులు, వెల్డింగ్ మిషన్ ఉపయోగించి ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది. దీనికి ఆమె డస్ట్ ఎక్స్ట్రాక్టర్ అని పేరు పెట్టింది. ఈ యంత్రం పొలాల్లో పని చేస్తున్నప్పుడు, పంట నూర్పిడి సమయంలో వెలువడే దుమ్మును పీల్చుకుని, ఒక చోట సేకరిస్తుంది. దీనివల్ల రైతులు పీల్చే గాలి శుభ్రంగా ఉంటుంది, తద్వారా ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే ఈ యంత్రాన్ని ఎవరైనా సులభంగా కొనుగోలు చేసేలా, అందుబాటులో ఉండే వస్తువులతోనే పూజ దీనిని రూపొందించింది.దేశం గర్వించే గుర్తింపు!పూజ సాధించిన ఈ విజయానికి గానూ, ఎన్నో ప్రశంసలతోపాటు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకుంది. సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో తను చూపించిన ప్రతిభకు గాను జపాన్కి వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పూజ తన యంత్రం గురించి వివరించింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ‘బాల శాస్త్రవేత్త’గా గుర్తించి లక్ష రూపాయల నగదు బహుమతిని అందించింది.పర్యావరణంపై చైతన్యంపూజ భవిష్యత్తులో ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. పర్యావరణ పరిరక్షణపై తన గ్రామంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చైతన్యం తీసుకువస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరిస్తోంది. ఒక సాదాసీదా పల్లెటూరి అమ్మాయి తన తెలివితేటలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మనందరం ఆమెను చూసి నేర్చుకుందాం కదూ!మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు భయపడకూడదు. వాటికి పరిష్కారం ఆలోచించాలి. మన దగ్గర డబ్బు లేక΄ోయినా, పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు.– పూజ (చదవండి: ఇద్దరు సిస్టర్స్ కృషి: 'యాత్రి'కుల కోసం..) -
59 ఏళ్ల వయసులోనూ అంతే అందంగా మాధురి దీక్షిత్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో 1980-90ల్లో బాలీవుడ్ని ఓ ఊపు ఊపేసింది. దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన డ్యాన్స్తో పాటు నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలా ‘బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్’గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ రోజుతో 59 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికీ అంతే అందంగా యువ హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ సందర్భంగా ఆమె మెరిసే అందం కోసం, ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఏం చేస్తుంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటుంది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా.!.ఈ అందాల తార మాధురి దీక్షిత్ మాత్రం ఇప్పటికీ మెరిసేచర్మం, ఆరోగ్యకరమైన జుట్టుతో ఆకట్టుకుంటూనే ఉంటారామె. అందుకోసం ఏం చేస్తుంటుందో ఆమెనే స్వయంగా వెల్లండించారు. ఆరోగ్యకరమైన చర్మం కోసం..మాధురీ దీక్షిత్ అందం చర్మం లోపలి నుంచే మొదలవుతుందని చెబుతున్నారామె. అందుకోసం, ఆరోగ్యకరమైన ఆహారం, హైడ్రేటెడ్గా ఉండటం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. అలాగే చర్మ సంరక్షణ అంటే ముఖానికి ఏం పూస్తున్నాం అనేది కాదని, శరీరానికి తేమను అందించేలా పుష్కలంగా నీరు తాగాలని అంటున్నారు.మెరిసే చర్మం కోసం..మాధురీ దీక్షిత్ తన రోజును ముఖంపై మురికిని తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఒక మంచి క్లెన్సర్తో ప్రారంభిస్తుంది.ఆ తర్వాత టోనర్ను ఉపయోగిస్తుంది. రోజ్ వాటర్ ఆమెకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైనది. అందువల్ల దాన్నే ఆమె టోనర్గా ఉపయోగిస్తుంటారామె.తర్వాత విటమిన్ సీ సీరం వస్తుంది, దీనిని ఆమె తన చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంది.చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ని ఉపయోగించాలని చెబుతుంది. జిడ్డు చర్మం అయితే వాటర్ బేస్ట్ మాయిశ్చరైజర్, పొడి చర్మం అయితే చిక్కటి క్రీమీ మాయిశ్చరైజర్ను ఎంచుకోవాలని అన్నారామె.ఆమె తన చర్మాన్ని రక్షించుకోవడానికి సన్స్క్రీన్తో తన ఉదయపు దినచర్యను ముగిస్తుంది.అలాగే మేకప్తో నిద్రపోవడం పెద్ద తప్పు అని మాధురీ దీక్షిత్ నొక్కి చెబుతున్నారు. ఆమె సాధారణంగా క్లెన్సింగ్ బామ్తో మేకప్ను తొలగిస్తారట. ఒక్కోసారి సున్నితమైన క్లెన్సర్తో ముఖాన్ని మళ్లీ కడుక్కోవడానికి ముందు వైప్స్తో మైసెల్లార్ వాటర్ను కూడా ఉపయోగిస్తానని అన్నారు.అలాగే రాత్రి సమయంలో కూడా టోనర్, విటమిన్ సీ సీరమ్ని అప్లై చేస్తానని అంటోంది. రోజుకు రెండుసార్లు అప్లై చేస్తానని చెబుతోంది.ఇక రాత్రంతా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి రాత్రిపూట రొటీన్ మాయిశ్చరైజర్, అండర్-ఐ క్రీమ్, లిప్ బామ్ తప్పనిసరి అని అంటోంది.జుట్టు సంరక్షణ కోసం..మృదువైన, మెరిసే జుట్టు కోసం తాను ఉపయోగించే ఒక సాధారణ ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ను కూడా మాధురి పంచుకుంది. ఈ మాస్క్లో మెత్తగా చేసిన అరటిపండు, కొబ్బరి నూనె, తేనె ఉంటాయి. ఇక్కడ అరటి పండ్లు జుట్టుకు లోతైన పోషణను ఇవ్వగా, కొబ్బరి నూనె జుట్టు చిట్లడాన్ని తగ్గించి, మెరుపుని ఇస్తుంది. ఇక తేనె కుదుళ్లను మృదువుగా చేసి వొత్తుగా పెరిగేలా చేస్తుందట. -
బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..?
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి రక్తపోటు(బీపీ). దీనితో ముడిపడి చాలా రకాల ప్రమాదకర వ్యాధులు ఉన్నాయి. అందువల్ల వైద్యులు ప్లీజ్ బీపీని నియంత్రణలో ఉంచుకోండి, ‘ఉప్పు తక్కువ తినండి’ అని సదా చెబుతుంటారు. నిజానికి ఈ ఒక్క సాధారణ సలహా అన్ని వేళలా సముచితం కాదు. మందుల తోపాటు జీవనశైలిని ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ని అనుసరిస్తే బీపీ దెబ్బకు నియంత్రణ ఉంటుందని నమ్మకంగా చెబుతున్న ఆరోగ్య నిపుణులు. మరి అదెలాగో సవివరంగా చూద్దామా.!.చాలామంది రోగులు ఎక్కువగా మందులపై ఆధారపడుతుంటారు. దానికంటే అర్థవంతమైన జీవన మార్పులతో ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలిని మంచిగా ప్రభావితం చేసే ఈ 3-3-3 రూల్ రక్తపోటుని చాలా సులభంగా నియంత్రణలో పెట్టగలదని అంటున్నారు. మరి ఈ రూల్ ఎలా సహాయపడుతుందంటే..సాధారణంగా ఉప్పు తక్కువ, వ్యాయమాలు అధికం వంటి సలహాలను రోగులు నిలకడగా పాటించాలంటే కష్టం. అలగే కేవలం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్లే అధిక రక్తపోటుకి దారితీయడం లేదంటున్నారు. ఇన్సులిన్ నిరోధకత, జీవక్రియ లోపాలు వంటి కారకాలతో కూడా ముడిపడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జీవక్రియ లోపం కారణంగా శరీరంలోని కణాలు ఇన్సులిన్కి సరిగ్గా స్పందించడం మానేస్తాయి. దాని ఫలితంగా శరీరం సోడియం నీటిని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. దాంతో రక్తనాళాలు గట్టిపడి, శరీరంలోని సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ చురుకుగా మారుతుంది. అంటే అంతర్లీనంగా ఉన్న జీవక్రియ లోపానికి చికిత్స తీసుకోకుండా కేవలం ఉప్పు తగ్గస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు నిపుణులు.‘3-3-3’ రూల్ అంటే..ఇందులో మొదటిది ఆహారం, రెండోది, రోజువారీ అలవాట్లు, మూడోది ఆరగ్యో తనిఖీలుగా విభజించి ఆరోగ్యంగా ఉండేలే చేసే హెల్దీ సూత్రం ఇది.1. మొదటి ‘3’ ఆహారపు అలవాట్లు(1) కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించడం..తెల్ల రొట్టె, బిస్కెట్లు, నమ్కీన్, స్వీట్లు, చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన తృణధాన్యాలు - ఇవి రోజంతా పదేపదే ఇన్సులిన్ను పెంచుతాయి. ఇలా ఇన్సులిన్ అధికంగా ఉండటం అనేది అధిక రక్తపోటుకు దారితీసే కారణాలో ఒకటి. వీటికి దూరం చేసే ఒక్క మార్పు రక్తపోటును గణనీయంగా తగ్గించడంలో అత్యంత ప్రభావంతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.(2) ప్రతి భోజనంలో ప్రోటీన్ తీసుకోండిప్రతి భోజనంలో గుడ్లు, పనీర్, చికెన్ లేదా చేపల నుండి 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. తగినంత ప్రోటీన్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లపై కోరికలను తగ్గిస్తుంది, అలాగే శరీరాన్ని ఇన్సులిన్-సెన్సిటివ్గా మార్చే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇస్తుంది.వాస్తవానికి చాలా మంది భారతీయ అల్పాహారాలు మరియు మధ్యాహ్న భోజనాలలో ప్రోటీన్ ప్రమాదకరంగా తక్కువగా ఉంటుంది.(3) ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడందేశీ నెయ్యి, వెన్న, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, ఇవి రక్తపోటును పెంచవు. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది.2. రెండో ‘3’ డైలీ దినచర్య..(1) రోజువారీ అలవాట్లుకేవలం కార్డియో మాత్రమే కాకుండా, రెసిస్టెన్స్తో కదలండిఇవి వారానికి మూడు సెషన్లు, ఒక్కోసారి 30-40 నిమిషాలు చేయడం, కేవలం నడవడం కంటే రక్తనాళాలకు ఎక్కువ మేలు చేస్తుంది.(2) కూర్చోవడాన్ని తగ్గించడంఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా కూర్చోవడాన్ని సాయంత్రం నడకతో సరిచేయలేము.ప్రతి గంటకు 2-3 నిమిషాలు నిలబడి కదలండి.(3) శ్వాసపై ఫోకస్ప్రతిరోజూ 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా శ్వాస తీసుకోండి.నిమిషానికి ఆరుసార్లు, ముక్కు ద్వారా గాలి లోపలికి పీల్చి, నెమ్మదిగా బయటకు వదలండి.క్రమబద్ధమైన శ్వాస సిస్టోలిక్ బీపీని తగ్గిస్తుంది.3. మూడో ‘3’ వారంతపు తనిఖీలేప్రతి వారం తనిఖీ చేయవలసిన 3 విషయాలు(1) బీపీ చెకింగ్వారానికి కనీసం రెండుసార్లు ఇంట్లోనే బీపీ చెక్ చేయడంఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత, ఒకే చేతికి, ఒకే సమయంలో కొలవండి.(2) నడుము కొలతముఖ్యంగా దక్షిణాసియా వ్యక్తుల శరీరాల BMI కంటే నడుము-ఎత్తు నిష్పత్తి జీవక్రియ ప్రమాదాన్ని స్పష్టంగా అంచనా వేస్తుంది. మీ నడుమును మీ ఎత్తులో సగం కంటే తక్కువగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.(3) మంచి నిద్ర..కనీసం ఏడు గంటలు నిద్ర ఉండేలా చేసుకోవాలి. లేదంటే నిద్రలేమితో బాధపడే వారి శరీరాలు కార్టిసాల్పై ఆధారపడి పనిచేస్తాయి, ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచి, బీపీని అధికం చేస్తాయి.ఈ ‘3-3-3’ రూల్ మందులకు ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు వైద్యులు. మందుల తోపాటు..జీవనశైలిలో ఈ రూల్ని అప్లై చేస్తే..సమర్థవంతంగా బీపీ నియంత్రణలో ఉండటమే గాక వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?) -
ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాదీ ర్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. నిత్యం జిమ్ చేస్తూ ఉండటంతోపాటు లక్నోలో అనేక హై ఎండ్ వ్యాయామశాలలను ప్రారంభించాడు. కండలు తిరిగి, కమ్మెచ్చులు తేలి అత్యంత ఫిట్గా ఉండే తన దేహంతో రాష్ట్రవ్యాప్తంగా జిమ్ కల్చర్ ప్రమోషన్కు కారణమయ్యాడు. ఈనెల 13న ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడం చాలామందిని విషాదంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరణించే నాటికి అతడి వయసు కేవలం 38 ఏళ్లు మాత్రమే. అటాప్సీ రిపోర్టులో అతడి దేహ స్వభావంలో రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉందనీ... దాంతో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అనే ఆరోగ్య సమస్య కారణంగా పల్మునరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి... అది అతడికి మరణం సంభవించిందనే నివేదిక వచ్చింది. డీవీటీ అంటే... దేహంలోని రక్తనాళాల్లో... ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకమైన పరిస్థితి. దేహంలోని రక్తనాళాలన్నింటిలోనూ ఇది కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి 20 మందిలో ఒకరికి... తమ జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. పల్మునరీ థ్రాంబో ఎంబోలిజమ్లో ఏం జరుగుతుందంటే... రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ (క్లాట్) లేదా రక్తపు ఉండ... కొన్నిసార్లు అలా రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ... పంపింగ్ కోసం గుండెలోని కుడి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్ను నింపుకోడానికి పల్మునరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు రక్తం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పల్మునరీ ఆర్టరీలో రక్తపు ఉండ ఇరుక్కుపోవడం జరిగితే... బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీన్ని పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు తక్షణం మరణం కూడా సంభవించవచ్చు. డీవీటీ లక్షణాలు... డీప్ వీన్ థ్రాంబోసిస్తో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ అవే లక్షణాలు కనిపించక΄ోవచ్చు. పైగా లక్షణాల తీవ్రతలోనూ (మరీ ముఖ్యంగా డీవీటీ తొలి దశల్లో) మార్పులుంటాయి. రక్తపుగడ్డ చాలా చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. కొందరిలో సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. అయితే కొందరిలో కనిపించే లక్షణాలివి... రక్తం గడ్డ కట్టిన చోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, పాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం డీవీటీ కాల్లో ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టిబారడం నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. అంటే మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టుతీయని కాయధాన్యాలూ (హోల్గ్రెయిన్స్), ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం. క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం. (రోజుకు కనీసం 30 – 45 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడటం తగ్గుతుంది). తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండటం. దీంతో రక్తం పలుచబారి ఉండలు అడ్డుపడకుండా సాఫీగా సాగి΄ోయే అవకాశాలు ఎక్కువ. ఒకేచోట కుదురుగా కూర్చుని ఉండకుండా, చురుగ్గా కదులుతుండటం. ఇలా కదులుతున్నప్పుడు కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం. దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకుంటూ ఉండటం. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం. చికిత్స : డీప్ వీన్ థ్రాంబోసిస్ చికిత్సలో... దాంతో పాటు నివారణ చర్యలూ తప్పనిసరి. ఈ చికిత్స తీవ్రతను బట్టి ఉంటుంది. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు తొలిదశల్లో సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం.బ్లడ్ థిన్నర్స్ వాడటం : యాంటీ కోయాగ్యులెంట్స్ అని పిలిచే రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఈ ఔషధాల్ని వాడటం.ఇప్పుడు తాజాగా సక్షన్ ను ఉపయోగించి రక్తపు గడ్డను బయటకు లాగేసి, రక్తపు ఉండను తొలగించడం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ డీవీటీ ముప్పు ఉన్నప్పుడు రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉన్నవారు నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ వైద్యులు చెప్పిన విధంగా ఫాలో అప్లో ఉండటం చాలా ముఖ్యం. – యాసీన్ (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..
ఓ వ్యక్తి తలచుకుంటే అనితర సాధ్యమైనదంటూ ఉండదు అని నిరూపించాడు ఈ విద్యార్థి. విలాసవంతమైన స్పాన్సర్లు, ఎలాంటి సాహసయాత్ర చేసిన నేపథ్యం లేకుండా ఎవరెస్టుని చుట్టేయలని ఉత్సాహం మాత్రం ఆకాశమంత. ఏదైతేనేం తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే ఎవరెస్టు బేస్ క్యాప్కు చేరుకుని ఓ చిన్నపాటి విజయం సాధించాడు పైగా తన వయసు యువకులకు జస్ట్ ఊహాలాంటి డ్రీమ్ని సాధ్యం చేసి..పరిమిత వనరులు, ఆర్థిక పరిస్థితి, మార్గదర్శక లేమి వంటివి ఏమీ పెద్ద అడ్డంకులు కావని ప్రూవ్ చేశాడు. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కేశవ్ సునీష్ బీకామ్ విద్యార్ధికి ఎవరెస్టుని అధిరోహించడం అతని డ్రీమ్. అలా అని బాగా ధనవంతుల కుటుంబ నేపథ్యమా? అంటే అదీ కాదు. పోనీ సాహసయాత్రలు చేసిన చరిత్ర ఉందా ?అంటే అదీ లేదు. కానీ ఎలాగైనా ఆకోరిక నేరవేర్చుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఒక్కటే బలంగా ఉంది. అదే అతడిని ఇంత పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. అందుకోసం అతను కూరగాయ దుకాణంలో సహాయకుడిగా, ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసిన పోదుపుతో ఎవరెస్టు బేస్ క్యాంప్కు చేరుకున్నాడు. ఈ యాత్ర కోసం అతడ ఖర్చు చేసిందో ఎంతో తెలిస్తే విస్తుపోతారు. కేవలం రూ. 16 వేలతో ఈ డ్రిమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అంత తక్కువ డబ్బుతో ఎలా సాధ్యం అంటే..మనసుంటే మార్గం ఉందని అంటాడు కేశవ్. నిజానికి ఆ స్టూడెంట్ ఆశయం సాధరణమైంది కాదు. ఎందుకంటే ఎవరెస్టు యాత్రకు అయ్యే ఖర్చు సుమారు రూ. 15 లక్షలు. అయితే ఎవరెస్టు శిఖరాగ్రం అతడి స్థోమతకు అందనిది, అందుకని చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఒక్కో మైలు రాయిని చేరుకునేలా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంప్కు చేరుకున్నాడు కేశవ్. అలాగే తన స్థోమతకు అనుగుణంగా ఖర్చులు తగ్గించుకునేలా యాత్ర ప్లాన్ చేశాడు. సెకండ్ క్లాస్ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి సోనౌలి సరిహద్దు ద్వారా నేపాల్లోకి ప్రవేశించి, కాలినడకన యాత్ర కోసం సల్లేరికి చేరుకున్నాడు.దాదాపు ఎనిమిది రోజులు పైయా, టెంగ్బోచే, డింగ్బోచే, లుబుచేలా గుండా ప్రయాణిస్తూ..చివరకు ఎవరెస్టుబేస్ క్యాంప్కు చేరుకున్నాడు. అలాగే క్యాంప్కు సమీపంలో ఉన్న గోరక్షెప్కు చేరుకోవడానికి 132 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. మధ్యమధ్యలో టెంట్ వేసుకుని నిద్రించాడు కూడా. అలాగే తన బడ్జెట్కి అనుగుణంగా స్వయంగా వండుకుని ఆహారం తినేవాడు. ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు..అతడు ఈ యాత్రను సెప్టెంబర్ 2025లో ప్రారంభించాడు. జనవరిలో తన అమ్మమ్మ మరణింతో మధ్యలోనే తిరిగి వచ్చేశాడు, కానీ సంకల్పం వదులుకోలేదు. ఆ తర్వాత చిన్న చితకా ఉద్యోగాల్లో చేరి డబ్బు ఆదా చేసి ఏప్రిల్ 7న అధిరోహణ పునః ప్రారంభించాడు. అలా రెండో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు. అతడి కథ..చుట్టూ ఎలాంటి వనరులు లేకపోయినా..కనీసం మార్గనిర్దేశం లేకపోయానా..సాధించాలి అన్న తపన ఎవరెస్టు వరకు నడిపించింది. చాలా శ్రమకోర్చి సాధించిన విజయం ఇది. పైగా కేశవ్ జస్ట్ 21 ఏళ్లకే దాన్ని సాధించాడు. అయితే అతడు శిఖరాగ్రం చేరుకోకపోవచ్చు..సమీపం వరకు వెళ్లి అనుకున్నది సాధించాడు. నిజానికి ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకోవడానికి బేస్క్యాంప్లో ఫిజికల్ శిక్షణ, వంటివి చాలానే ఉంటాయి. అయినా ఇంత సాధించిన కేశవ్కి అదేమంత కష్టమేమి కాదు. మరి అతడికి ఆల్ది బెస్ట్ చెబుదామా..! View this post on Instagram A post shared by Kesav Suneesh | Traveller 🇮🇳 (@kesav_on_go) (చదవండి: ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు స్పేస్ టెక్ కంపెనీ సీఈవోగా..!) -
రోజుకి రెండు పెగ్గులు పడాల్సిందే..కంట్రోల్ చేయడం ఎలా?
మా నాన్న గారికి 64 ఏళ్లు. చిన్న వయసు నుంచే మందుకు బాగా అలవాటు పడ్డారు. ఆయనకు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మందు మానడు. ఏమంటారంటే డాక్టర్లే చెబుతారు కదా... రోజుకి రెండు పెగ్గులు తీసుకోమని అని వాదిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మేము గమనించింది ఏమిటంటే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు అబద్ధాలు ఉంటున్నాయి, కానీ ఆయనకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన బాగా తూలుతున్నారు. మాటిమాటికి పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతోంది. మూత్రంపై అదుపు ఉండట్లేదు. గత ఆరు నెలల నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదు. ఇట్లా ఉండి కూడా మందు మాత్రం మానలేదు. మేము దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్కి, న్యూరాలజిస్ట్కి కూడా చూపించాము. వాళ్లు మందులు రాసిస్తున్నారు కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మీరు దీని గురించి ఏమైనా సలహా ఇవ్వగలరా?– రమేష్, యానాం మీ సమస్య విన్నాక చాలా బాధగా ఉంది. ముందుగా ఈ డాక్టర్లు రెండు పెగ్గుల గురించి చెప్పుకునే విషయం ఎలా వచ్చిందంటే, దీనికి ఒక ‘మెడిటెరేనియన్స్ డైట్’ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ డైట్లో ΄పాశ్చాత్యదేశాల్లో ప్రజలు ఎక్కువగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకుంటారు. అంటే తాజాపండ్లు, ఆకుకూరలు, సముద్రపు చేపలు లాంటివి. వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు కొందరు రోజుకు 30 నుంచి 60 ఎం.ఎల్. వరకు మాత్రమే వైన్ తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ కాదు. అలాగే రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. ఈ మొత్తం జీవనశైలిని కలిపి ‘మెడిటేరియన్స్ డైట్’ అంటారు. దీనివల్ల గుండెజబ్బులు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన దగ్గర చాలామంది ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి ‘‘రోజుకి రెండు పెగ్గులు మంచిదట’’ అన్న ఒక్క మాటనే పట్టుకుంటారు. దీనినే సైకాలజీలో ‘సెలక్టివ్ అబ్స్ట్రాక్షన్’ అంటారు. నిజానికి మన దగ్గర చాలామంది ఒకటి లేదా రెండు పెగ్గులతో ఆగరు. సరైన డైట్ కూడా తీసుకోరు. తాగిన తర్వాత భోజనం మానేస్తారు. దాంతో శరీరంలో విటమిన్ బీ1 లోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు మొదట్లో అయోమయం, నడకలో తేడా, తూలడం లాంటివి వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారిలో కనిపిస్తున్న లక్షణాలే. ఈ దశలోనే మందు పూర్తిగా ఆపి సరైన వైద్యం తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. కానీ చాలామంది ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు, మందులు సరిగా వాడరు. దానివల్ల మెదడుకి శాశ్వతంగా నష్టం కలుగుతుంది. మెదడులో జ్ఞాపకశక్తి , సమతుల్యతకి సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి. దీనివల్ల మతిమరపు వస్తుంది. గుర్తు లేక΄ోయినా, ఖాళీలను నింపడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కావాలనే చెప్పే అబద్ధాలు కాదు. ప్రస్తుతం దీనిని తగ్గించేందుకు ప్రత్యేకించి మందేం లేదు కానీ అధిక మోతాదులో విటమిన్లు ముఖ్యంగా విటమిన్ బీ1 ఇవ్వాలి. నిద్ర కోసం కూడా కొంతవరకు మందులు అవసరం కావచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు రికవరీ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఆయన్ని ఆపడం కష్టమైతే, మంచి రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించండి. అక్కడ క్రమపద్ధతిలో చికిత్స ఉంటుంది కాబట్టి ఆయన బాగుపడే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.సమస్య నుంచి రిలీఫ్కని కొందరు; సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకని కొందరు ఏదో ఒక వంకతో డ్రింక్ తీసుకోవటం తరచుగా మనందరం చూసే విషయమే! వారందరికీ తాగటం ముఖ్యం. దానికోసం ఏదో ఒక కారణం వెతుక్కుంటారు కాబట్టి ఆల్కహాల్ ఏ రూపంలోనూ తీసుకోకుండా పూర్తిగా దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com )(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు స్పేస్ టెక్ కంపెనీ సీఈవోగా..!
చాలా చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఎందరో ఉన్నతమైన వ్యక్తుల విజయగాథలను చూశాం. కానీ ఈ స్టోరీ విద్యాపరమైన గాథలా ఉండదు. ఎన్నో ఎదురుదెబ్బలు, ఆకస్మిక మలుపులు, సుదీర్ఘకాలం పాటు అనిశ్చితి తర్వాత ఉవ్వెత్తున ఎదిగిన శిఖరాగ్రంలా ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి పాఠశాలకు వెళ్లి చదువుకున్న ఓ సామాన్య ట్రాక్టర్ డ్రైవర్ కొడుకు సాధించిన విజయం ఇది. ఆ వ్యక్తే డాక్టర్ ఆనంద్ మేఘలింగం. అతడి బాల్యం రాకెట్లు లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి గానీ సంబంధ లేకుండా సాగింది. ఆయన తమిళనాడులోని ఒక గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. అక్కడ ఆయన తండ్రి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఆశయాల కన్నా అవసరాల చుట్టూనే దైనందిన జీవితం సాగేది. ప్రతి రోజు ఆరుకిలోమీటర్లు దూరం నడిస్తే గానీ చదువుకోలేని పరిస్థితి. అదే అతడిలో నిశబ్దంగా క్రమశిక్షణను అలవరచుకునేలా చేసింది. అందరిలానే ఇంటర్ వచ్చాక ఎంసెట్ రాసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. కానీ అందులో సబ్జెక్టులేవి మైండ్కి ఎక్కేవి కాదు. దాంతో మధ్యలో కాలేజ్ చదువుకి స్వస్తి పలికాడు. కానీ మళ్లీ కొద్ది రోజులకి స్ట్రాంగ్గా వచ్చి ఈ సారి భిన్నమైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నాడు. అందులో అనూహ్యంగా మేఘలింగం మంచి అకడమిక్ మార్కులతో పాసవ్వడమే కాదు గోల్డ్ మెడల్ సాధించాడు.స్పేస్ జోన్ ఇండియా తొలి ప్రయాణంకాలేజ్ చదువు పూర్తి చేసిన అనంతరం డాక్టర్ ఆనంద్ మేఘలింగం స్పేస్ జోన్ ఇండియాను స్థాపించారు. అలా ఆయన ప్రైవేట్ స్పేస్-టెక్ ఉద్యమానికి వ్యవస్థాపకుడిగా నిలిచారు. ఈ స్పేస్ జోన్ ఇండియా ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్పేస్ జోన్ ఇండియా పరిమిత వనరులతో, గొప్ప ఆశయాలతో ప్రారంభమైంది. ప్రారంభ అభివృద్ధిలో ప్రయోగాత్మక ఆవిష్కరణలు, బలమైన వ్యక్తిగత నిబద్ధత కీలక పాత్ర పోషించడమే కాకుండా కుటుంబ మద్దతు కూడా తోడవ్వడంతో కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకునేలా నిలదొక్కుకుంది. మొబైల్ ప్లాట్ఫామ్ నుంచి ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్గా వర్ణించే RHUMI-H మిషన్ ఆ సంస్థ సాధించిన విజయాల్లో ఒకటి. ఈ ఘనత భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం అందరి దృష్టిని ఆకర్షించింది, ఇది ఒక సాంకేతిక ముందడుగు కూడా. కొద్దికాలంలో RHUMI మిషన్ ప్రాముఖ్యత అమాంత పెరిగింది. అలాగే భారతదేశపు ప్రైవేట్ అంతరిక్ష సామర్థ్యాలపై జరిగే చర్చలలో ఈ కంపెనీ స్థానం దక్కించుకునేలా పేరుతెచ్చుకోవడం విశేషం.ఆవిష్కరణలకు హద్దులు లేవు..డాక్టర్ మేఘలింగం ఏరోస్పేస్ అవకాశాలకు సంబంధించి యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు అత్యంత కీలకం. కానీ వీసా తిరస్కరణతో అతి పెద్ద ఎదురదెబ్బ తగిలింది మేఘలింగంకి. కానీ ఆయన తగ్గేదే లే అంటూ భారత్లోనే తన పనిని కొనసాగించారు. సరిహద్దులు మనుషులకే గానీ ఆవిష్కరణలకు కాదు అని చెప్పపేలా తన ఆవిష్కరణలు కొనసాగించాడు.ఊహించని మలుపు నాసాతో అనుసంధానం..ఆ తర్వాత అతని కెరీర్ ఊహించని మలుపు తీసుకుంది. ప్రపంచ నిపుణుల బృందంతో కూడిన ఒక అంతర్జాతీయ నాయకత్వ కార్యక్రమం కోసం అమెరికా విదేశాంగ శాఖ ఆయన్ను ఎంపిక చేసుకోవడం ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి, అనూహ్యమైన మలుపు కూడా. ఈ కార్యక్రమం మేఘలింగంకి ఆధునాతన ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థలపై మంచి అవగాహన కల్పించింది. అంతేగాదు నాసా సౌకర్యాలతో అనుసంధానించబడిన శిక్షణా వాతావరణంలో కూడా పాల్గొని, ఉన్నత స్థాయి ఏరోస్పేస్ వ్యవస్థలు, రక్షణ సాంకేతికతలు, మిషన్ ప్రణాళికా చట్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందారాయన. ప్రస్తుతం మేఘలింగం చెన్నై నుంచి ఏకకాలంలో రాకెట్ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్న RHUMI ట్విన్ ప్రాజెక్ట్ ప్రణాళికలతో సహా కొత్త మిషన్లకు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆయన కంపెనీ విలువ 800 కోట్లు టర్నోవర్ పైనే పలుతుందట.(చదవండి: శీర్షాసనంలో శివ తాండవ స్తోత్రం పఠించి ప్రపంచ రికార్డు!) -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది.అమ్మగా మారిన ఎస్ఎన్సీయూపాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్ఎన్సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు.తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి..50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.పుట్టిన గంటలోనే.. తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జిల్లాలోని లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్హిల్స్ ఎంసీహెచ్లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్నంబర్ ఆధారంగా నరేష్కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. -
ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..!
ఒత్తిడి లేకుండా హాయిగా వందేళ్లు బతికేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి జీవితం పొందాలంటే కోటీశ్వరుడే కానక్కర్లేదు. ఉరుకులు పరుగులతో రోజును గడపనక్కర్లేదు. చేయాల్సిందల్లా ప్రకృతితో, కుటుంబంతో, సంఘంతో సన్నిహితంగా గడపడమే. ఇది ఇంత సులువా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అలా బతకడాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే దాన్నో జీవన విధానంగా మార్చుకోవచ్చు. దాన్ని నిరూపించి చూపిస్తున్నారు ఇకారియా ద్వీప ప్రజలు. అదెలాగో చూద్దాం.గ్రీస్లోని ఇకారియా ద్వీపం ప్రపంచంలోని ఐదు ’బ్లూ జోన్లలో ఒకటి. అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకుపైగా జీవిస్తారు. వారి సుదీర్ఘ ఆయుష్షు వెనకున్న రహస్యం కేవలం వారు తినే ఆహారం మాత్రమే కాదు.. వారి విలక్షణమైన జీవనశైలి. వారి మంత్రం ‘నిదానమే ప్రధానం’.నిదానమైన జీవనశైలిఇకారియా ప్రజలకు ‘సమయం’ విషయంలో అస్సలు టెన్షన్ ఉండదు. వారు ఉదయం అలారం పెట్టుకొని పరుగు పరుగున లేవరు. నిద్ర లేవగానే నిదానంగా కాఫీ తాగుతూ కుటుంబంతో గడుపుతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా తమ ఇష్టానుసారం షాపులు తెరుస్తారు. కస్టమర్లు కూడా గంటల తరబడి వేచి ఉండటానికి ఇబ్బంది పడరు. ఈ ధోరణి వల్ల వారిలో గుండె జబ్బులకు ప్రధాన కారణమైన ‘కార్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) చాలా తక్కువగాఉంటోందని తేలింది.మధ్యాహ్న నిద్ర ఇకారియాలోమధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం ఒక అలవాటు. ప్రతిరోజూ మధ్యాహ్నంకనీసం 30 నిమిషాలనిద్ర వల్ల గుండె జబ్బుల ప్రమాదం 37% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతోంది.ఆహార రహస్యాలుఇకారియావాసులు తినే ఆహారం పూర్తిగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటారు. వారు ప్రతిరోజూ రోజ్మేరీ, సేజ్, పుదీనాతో చేసిన టీ తాగుతారు. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి రక్తపోటును తగ్గిస్తాయి. రెడ్ మీట్ చాలా అరుదుగా తీసుకుంటారు. చక్కెర వాడకంచాలా తక్కువ.శారీరక శ్రమ ఇకారియా ప్రజలు జిమ్కు వెళ్లి బరువులు ఎత్తరు. కానీ రోజంతా కదులుతూనే ఉంటారు. ఇకారియా ద్వీపం కొండ ప్రాంతం కాబట్టి పక్కింటికి వెళ్లాలన్నా మెట్లు ఎక్కాలి. తోట పని చేయడం, నడవడం వారి దైనందిన జీవితంలో భాగం. ఈ సహజమైన శ్రమ వారిని 90 ఏళ్లలో కూడా దృఢంగా ఉంచుతోంది.సామాజిక అనుబంధాలు ఇకారియాలో ఎవరూ ఒంటరిగా ఉండరు. సాయంత్రం వేళల్లో స్నేహితులు, బంధువులతో కలిసి నవ్వుతూ చిన్నచిన్న పార్టీలు చేసుకుంటూ గడుపుతారు. వారిలో ఒంటరితనం అనే మాటే వినిపించదు. ఈ సామాజిక మద్దతు మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతోంది.మరి మనం ఏం చేద్దాం?హడావుడి పడకుండా నిదానంగా పనులు చేయడం, ఆస్వాదిస్తూ పనుల్లో మునిగిపోవడం, ప్రకృతితో గడపడం, అవకాశం దొరికినప్పుడు తోటపని లేదాచిన్ననడక అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే సహజ సిద్ధమైనఆహారం, పానీయాలు తీసుకోవడం, మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం, కాసేపు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం, స్నేహితులను పెంచుకొని వారితో కొన్ని గంటలు సరదాగా గడపడం చేస్తే చాలు..మనమూ దీర్ఘాయుష్షుతో జీవించగలం. సాక్షి స్పెషల్ డెస్క్(చదవండి: రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..) -
రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..
ఇటీల ఆరోగ్య స్పృహతో గ్రీన్టీ వంటివి తీసుకుంటున్నారు. అందులోనూ వర్కౌట్లు, డైట్లు పాటించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి రోజు గ్రీన్టీ తోనే మొదలవుతుంది. అయితే ఇలా గ్రీన్టీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సోషల్ మీడియా వేదికగా దాని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా వివరించారు. మరి అవేంటో చూద్దామా.!గ్రీన్ టీ తాగడం అనేది ఒక సాధారణ ఆరోగ్యకరమైన విధానంగా పేర్కొనవచ్చు. దీనిలో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలతో నిండిన గ్రీన్ టీతో మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం ముడిపడి ఉందని చెబుతున్నారు నిపుణులు. అలాంటి గ్రీన్టీని క్రమంతప్పకుండా తీసుకుంటే.. జీవక్రియ, మెదడు పనితీరు, కాలేయ ఆరోగ్యం తదితరాలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. కేవలం 14 రోజుల్లోనే..గొప్ప మార్పులు..కేవం 14 రోజుల్లోనే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో అర్థవంతమైన మార్పులు ఎలా సంతరించుకుంటాయో గమనించొచ్చని అన్నారు. అంతేగాదు హర్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ 14 రోజుల పాటు ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఇలా జరుగుతుందంటూ ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన ఈ వీడియోకి ఇది ఆరోగ్యకరమైన అలవాటా? లేక అతిగా ప్రచారం చేయబడిన ట్రెండా? అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు.కలిగే ప్రయోజనాలు..ఆ వీడియోలో గ్రీన్ టీ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే మొదటి అవయవాలలో కాలేయం ఒకటని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ టీలో EGCG వంటి కాటెచిన్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించి, జీవక్రియను మెరుగుపరుస్తాయని అన్నారు. అంతేగాదు యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటం ద్వారా పనిచేస్తాయి, ఇది అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా కాఫీ వల్ల వచ్చే త్రీమైన వణుకుని నివారించి ఏకాగ్రత శక్తిని పెంచుతుందట. అంతేగాదు మెదడు చురుకుగా ఉంటుందని చెబుతున్నారు View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..) -
ఆ కుంచె గొంతులోమళ్లీ అమృతం
ఆమె మరణించి 85 ఏళ్లు అవుతున్నా భారతీయ కళారంగం తలుచుకుని అబ్బురపడుతూనే ఉంది. 28 ఏళ్లకే ఆమె చేతి కుంచెను మృత్యువు లాక్కున్నా ఆమె గీసిన చిత్రాన్ని 62 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంటూనే ఉంది. అమృతా షేర్గిల్. భారతీయ అద్భుత చిత్రకారిణి. ఆమె బయోపిక్ త్వరలో రాబోతూ ఉంది. దర్శకురాలు మీరా నాయర్ దీని రూపకర్త. ఒక స్త్రీ మరో స్త్రీ జీవితాన్ని కెమెరా కేన్వాస్పై దించనుంది. వివరాలు....ఈ సినిమా కచ్చితంగా మీరా నాయర్ ఇంతకుముందు సినిమాల కంటే భిన్నమైనది. ఆమె ఇప్పటి వరకూ బయోపిక్స్ తీయలేదు. తీయాలనుకున్నది సామాన్యమైన వ్యక్తి గురించీ కాదు. ‘నేను సినిమాలు తీశానంటే అమృతా షేర్గిల్ గీసిన బొమ్మల ప్రభావం వల్లే. అందుకే ఆమె బయోపిక్ తీయడానికి ధైర్యం చేశా’ అంటారు మీరా నాయర్. అమృతా షేర్గిల్ పేరు భారతీయ చిత్రకళలో మరణం లేనిది. అమె గురించి తెలియడం, తెలియకపోవడం రెండూ కళాభిమానులను బాధించే విషయాలు. తెలిస్తే ‘అరె చిన్న వయసులో మరణించిందా’ అని బాధ. తెలియకపోతే ఇంత గొప్ప మనిషి తెలియకుండా పోయిందా... అనే బాధ. మన దేశంలో స్త్రీలు వంటిల్లు దాటడానికి కూడా భయపడిపోయే రోజుల్లో అమృతా షేర్గిల్ ΄్యారిస్కు వెళ్లి మరీ చిత్రకళ అభ్యసించింది. అక్కడి మహా చిత్రకారులతో భుజాలు రాసుకు తిరిగింది. తిరిగి భారతదేశానికి వచ్చి యూరోపియన్ వాసనలు లేకుండా తన కుంచె మెరుగుదనంతో భారతీయ సౌందర్యాన్ని చూపింది. అందుకే ఆమె కథ విశిష్టమైనది... ఆమె బొమ్మల్లానే. మీరా నాయర్ ఈ పాత్రకు తగిన నటి కోసం, రాయాల్సిన స్క్రిప్ట్ కోసం చాలా పరిశ్రమించింది. అమృత పాత్రకు త్రిప్తి డిమ్రి, తాన్య మణిక్తలా పేర్లు పరిశీలనకు వచ్చినా ‘బ్యాడ్ గర్ల్’ ఫేమ్ అంజలి శివరామన్ లోని భావగాఢత నచ్చి ఆమెను ఎంచుకుంది.దిగ్గజ బృందంతాను ఎవరి గురించి బయోపిక్ తీస్తున్నదో మీరాకు బాగా తెలుసు. భారతీయ ఆధునిక కళకు అమ్మగా, ‘పయొనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్’గా పిలువబడే షేర్గిల్ను తెర మీద సాక్షాత్కరించడం... సవాల్. తీశాక అభిమానులు, విమర్శకులు వేయికళ్లతో పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. వారి అభిమానం కంటే తన అభిమానమే గొప్పదని నిరూపించుకోవడానికి పరీక్షకు సిద్ధమైంది మీరా నాయర్. అమృతా షేర్గిల్ను అందరూ ‘అమ్రి’ అని ముద్దుగా పిలుస్తారు. మీరా కూడా అలానే పిలుచుకుంటుంది. అదే టైటిల్ ‘అమ్రి’.స్క్రిప్ట్ పనిలో ఫ్రెంచ్ స్క్రీన్ రైటర్ క్లారా రాయర్ సహాయం తీసుకుంది. ప్రియాంక చోప్రాను ముఖ్యపాత్ర వేయమని కోరడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేలా మెప్పించింది. ఎమిలీ వాట్సన్ , జైదీప్ అహ్లావత్, జిమ్ సర్భ్, అంజనా వాసన్ మంచి ఆర్టిస్టులను ఇతర పాత్రలకు తీసుకుంది. ఇండియా, హంగేరీలలో షూటింగ్ చేసింది.మృత్యువు గీసిన చివరి గీతఅమృతా షేర్గిల్ అనూహ్య ధోరణిలో ఎదిగింది. పురుష చిత్రకారులు దేవతల్ని గీస్తున్న రోజుల్లో అమృత గ్రామీణ స్త్రీల వేదనను గీసింది. పెళ్లి, ప్రేమ, సెక్స్– దేన్నీ దాచుకోలేదు. అందువల్ల స్కాండల్స్ వెంటాడినా పట్టించుకోలేదు. అందుకే ఆమెను ఎరిగినవాళ్లు ‘50 ఏళ్లు ముందు పుట్టింది’ అంటారు.‘ఆమె జీవితం ఒక సినిమా కన్నా నాటకీయం. ప్రతి ఫ్రేమ్లో పోరాటమే’ అని ఆమె జీవిత చరిత్రకారిణి యశోధర దాల్మియా వ్యాఖ్యానిస్తారు. ఇంత గొప్ప భవిష్యత్తు ఉన్న అమృత డిసెంబర్ 5, 1941న లాహోర్లో మరణించడం పెద్ద షాక్. అప్పటికి వయసు కేవలం 28. మరణానికి కారణం డాక్టర్లు ‘పెరిటోనైటిస్’ అన్నారు... అంటే ΄÷ట్టలో ఇన్ఫెక్షన్. చరిత్రకారులేమో ‘ఫెయిల్డ్ అబార్షన్’ అన్నారు. తల్లి మాత్రం ‘నా కూతుర్ని మొగుడే చంపేశాడు’ అని ఏడ్చింది. ఏది నిజమో ఎవరికీ తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే– భారతీయ ఆధునిక కళ ఉచ్ఛస్థితికి చేరుకుంటున్న సమయంలో, ఆ కళకు అమ్మ లాంటి అమృత చేతిలోంచి కుంచె జారిపోయింది.బయో పోయెమ్‘సలామ్ బాంబే’,‘మాన్ సూన్ వెడ్డింగ్’, ‘ది నేమ్సేక్’ తీసిన మీరాకు ‘అమ్రి’ పర్సనల్ ఫిల్మ్. ప్రొడ్యూసర్ మైఖేల్ నోజిక్ మాటల్లో చె΄్పాలంటే ‘మీరా నాయర్ దర్శకత్వంతో అంజలి పెర్ఫార్మెన్ ్స అద్భుతంగా ఉండబోతోంది’. అమృతగా అంజలి ఫస్ట్లుక్కే ప్రశంసలు వస్తున్నాయి. అమృతలోని క్రాస్ కల్చరల్ ఐడెంటిటీ, కళాత్మకత, ధిక్కారం ఇవన్నీ మీరా నాయర్ కెమెరాలో ఒదిగితే ‘అమ్రి’ ఒక విజువల్ పోయెమ్ అవుతుంది. 85 ఏళ్ల తర్వాత అమృత మళ్లీ బతుకుతుంది. అమృతా షేర్గిల్ ఎవరు?మీరా నాయర్నే కాదు ప్రపంచ కళాభిమానులను ఆకర్షించే అమృతా షేర్గిల్ది భిన్నమైన జీవితం. హంగేరీ తల్లి, పంజాబీ సిక్కు తండ్రికి 1913లోబుడాపెస్ట్లో జన్మించింది. పారిస్లోని ఆర్ట్ స్కూల్ ‘అకాడెమీ దె బోజార్’లో అతి చిన్న వయసులో చదువుకుంది. యూరోపియన్ టెక్నిక్తో భారతీయ గ్రామీణ స్త్రీల వేదన, ఒంటరితనం, దైనందిన జీవితాన్ని కాన్వాస్ పైకి తెచ్చింది.‘త్రీ గరల్స్’, ‘బ్రైడ్స్ టాయిలెట్’, ‘విలేజ్ సీన్’... ఈ మూడు చిత్రాలతో భారతీయ కళలో మోడర్నిజానికి తొలి అడుగులు వేసింది. అందుకే ఆమెను ఆమె 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ పెయింటింగ్ 2023లో 61.8 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఇక ఆలోచించండి ఆమె కళావైశిష్ట్యం.– కె. -
చిన్నారుల మెదడుకు మేత..సామేత!
ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మన తెలుగు సామెతలు విన్నారా? ‘చాలా విన్నాను’... ‘కొన్ని విన్నాను’ అనేవారితోపాటు... ‘సామెత అంటే ఏమిటి?’ అని అడిగేవారు కూడా మీలో ఉన్నారు.వినడానికి సామెతలు సరదాగా ఉంటాయి గానీ... అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటిలో మంచి ఉంది. మనల్ని నవ్వించే కామెడీ ఉంది. జీవిత సత్యాలు ఉన్నాయి.లాంగ్వేజ్ స్కిల్స్లో సామెతలు ఉపయోగించడం కూడా ఒకటని మీరు గుర్తు పెట్టుకోవాలి.‘మన సామెతలను మనం తెలుసుకోవడం అంటే... మన ముత్తాతలతో మూడువేల సార్లు మాట్లాడినట్లు’ అనే సామెత కాని సామెత ఉంది. సామెతలు అనేవి సముద్రంలాంటివి. అందులో మనకు ఎన్ని తెలిస్తే అంతమంచిది. ఈరోజు మనం కొన్ని సామెతలు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు వాటిని ఎక్కడో ఒకచోట ఉపయోగించాలి కూడా!కొయ్యర కొయ్యర పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట!వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. అలా కాకుండా లేని విషయాన్ని బాగా పెద్దగా చేసి చెప్పడం మంచిది కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. మిరియాలు చిన్న సైజ్లో ఉంటాయి. ‘మా ఊళ్లో అలా కాదు... తాటికాయలంత ఉంటాయి’ అనడం అబద్ధం చెప్పడమే కదా! ఒక విషయాన్ని పదింతలు చేసి చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నాడట!కొందరు వ్యక్తులు, మనం ఒకటి అడిగితే వారొకటి చెబుతారు. వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ΄పొంతన లేని సమాధానాలు ఇచ్చి నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి వాడే సామెత...‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నట్లు!’దీనికి సంబంధించి ఒక జోక్...రాత్రి బ్యాంకు దొంగతనానికి వచ్చిన దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘దొంగతనానికి వచ్చాను. తప్పయిపోయింది’ అనలేదు. ఏదోరకంగా తప్పించుకోవాలని... ‘సార్... మీరు పొరబడుతున్నారు. రాత్రిపూట కూడా బ్యాంక్ పనిచేస్తుందా లేదా? అనేది తెలుసుకోవడానికి వచ్చాను’ అన్నాడట!కుక్కను పెంచి...తానేమొరిగినట్లు!‘అనవసరంగా కష్టపడుతున్నారు’ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత... కుక్కను పెంచి తానే మొరిగినట్లు!ఉదాహరణకు....ఒక వ్యక్తి తన ఇంటికాపలాకు వాచ్మెన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘నువ్వు రెస్ట్ తీసుకో...నేను చూస్తాను’ అని వాచ్మెన్తో యజమాని అంటే ఎలా ఉంటుంది చెప్పండి!...ఇవే కాదు ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి. పెద్దలను అడిగి వాటిని తెలుసుకోండి. నోట్బుక్లో రాసుకోండి. అన్ని ్ర΄ాంతాలకు తెలిసిన సామెతలతో పాటు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాపులర్ అయిన సామెతలు కూడా ఉంటాయి. మీ ప్రాంతంలో పాపులర్ అయిన సామెతలు ఏమిటో తెలుసుకోండి.ఘడియ పురుసత్తు లేదు... దమ్మిడీ ఆదాయం లేదు!మనం కష్టపడ్డామంటే దానికి ఫలితం ఉండాలి. మనం ఒక పని మీద టైమ్ పెట్టామంటే ప్రయోజనం ఉండాలి. అలా కాకపోతే... టైమ్ వేస్ట్ చేసినట్లే కదా! ఇలాంటి సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.సామెతల సముద్రంలో నుంచి కొన్ని సామెతలు...ఆశ దోషమెరుగదు అంగట్లో అరువు తల మీద బరువుఅంగడి అమ్మి గొంగళి కొన్నట్లు అండ ఉంటే కొండలు దాటొచ్చుప్రీతితో పెట్టింది పిడికెడు చాలు ఎంత చెట్టుకు అంతగాలిచేటు కాలానికి చెడు బుద్దులు మన దీపమని ముద్దాడితే మూతి మీది మీసాలు కాలకుండా ఉంటాయా!కాలికి చుట్టుకున్న పాము కరవక మానదుకడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువపంచాంగం ΄పోయిందని తిథివారాలు పోతాయా? గుర్రాన్ని గుగ్గిళ్లకు అమ్మినట్లుకుక్క సింహం కాదు, కుందేలు తోడేలు కాదు నలుగురు నడిచేది దారి... పదుగురు చెప్పేది నీతి. -
చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..
వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం సహజమే. అయితే కొందరికి మాత్రం ఈ చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్నవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు...స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును వాడటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాహుమూలలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.గాలి ఆడేలా ఉండే కాటన్ బట్టల్ని ధరించాలి. ఇవిగాక యాంటీ–పెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ వాడటం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మంచి సువాసనను ఇస్తాయి.వీటికన్నా ముఖ్యం ఏమిటంటే.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట గాఢత తగ్గి, దుర్వాసన తక్కువగా వస్తుంది. -
మదర్ అదర్సైడ్ మాస్టర్ షెఫ్
ఒకప్పుడు సాధారణ గృహిణిగా, పిల్లల తల్లిగా ఇంటిపట్టునే ఉన్న కనక కతూరియా ఇప్పుడు మాస్టర్ షెఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేంతగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ‘కనక్స్ కిచెన్’ పేరుతో సోషల్ మీడియాలో మిలియన్ల మంది అభిమానం సొంతం చేసుకున్నారు. బార్బిక్యూ నేషన్స్లో మెక్సికన్ రుచులను పరిచయం చేయడానికి ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చిన కనకను ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె తన ‘వంట’రి పోరాటాన్ని గురించి పంచుకున్న ఎన్నో విశేషాలు ఆమె మాటల్లోనే...‘‘పాతికేళ్లుగా వంటల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. ఇండియన్, ఇటలీ, చైనీస్, జపనీస్, మెక్సికన్, ఫ్రెంచ్, అమెరికన్.. అన్నిదేశాల రుచులూ మా ఇంటి కిచెన్లో నేటికీ ఘుమఘుమలాడుతూనే ఉన్నాయి. నేను పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పనిచేసే షెఫ్ని కాదు. సాధారణ గృహిణిని. కానీ, ఈ రోజు ఇండియన్ షెఫ్గా పేరొందాను.బిజీగా మార్చుకున్నాను...నేను ఎం.కామ్. చదివినా, పెళ్లయ్యాక ఇంటికే పరిమితం అయ్యాను. ఇద్దరు కూతుళ్ల పెంపకంలో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియనంత బిజీ అయిపోయింది జీవితం. వంటలపై నాకున్న అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి రోజూ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. పిల్లలు ఏడుస్తుంటే వారిని ఎత్తుకొని తిప్పుతూ, నిద్రపుచ్చుతూ, రకరకాల వెస్ట్రన్ వంటకాలు తయారు చేసేదాన్ని. ఆ సమయంలోనే వాటిని వీడియో తీసేదాన్ని. యూ ట్యూబ్ ల్యాంచ్ అయిన తొలినాళ్ల నుంచీ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉన్నాను.హోస్ట్గా.. గెస్ట్గా...ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, నా వంటకాలు బ్లాగ్లు, వీడియోలు... ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. మా ఇద్దరు అమ్మాయిలు కాలేజీ స్థాయి చదువుల్లో రాణిస్తున్నారు. నా వంటలకు మొదట వారే టేస్టర్స్. ‘మా అమ్మ చేతి వంట ది బెస్ట్’ అని మార్కులు ఇస్తుంటారు. వాళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటూనే దేశంలో జరిగే అన్నిరకాల ఫుడ్ ఫీస్ట్లకు జడ్జిగా హాజరయ్యాను. ఫుడ్ ఈవెంట్స్ను హోస్ట్ చేశాను. ప్రముఖ రెస్టారెంట్స్తో కలిసి వర్క్ చేశాను. వెస్ట్రన్ ఫుడ్స్ అందించే విషయంలో నన్ను ఆహ్వానిస్తుంటారు. నా వంటకాల రుచులనూ ఈ సందర్భంగా పరిచయం చేస్తుంటాను. టీవీ రియాలిటీ షో మాస్టర్ షెఫ్ ఇండియా ఫస్ట్సీజన్లో పాల్గొన్నాను. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలలో కనక్స్ కిచెన్ పేరుతో ఫుడ్ ఛానెల్స్ తీసుకు వచ్చాను. ఏ విభాగంలోనైనా సవాళ్లు ఎదుర్కోవడానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ, వంటల తయారీలో ప్రతీ రోజూ, ప్రతి డిష్ ఛాలెంజింగ్గానే ఉంటుంది. రుచిలో అందరినీ మెప్పించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా వృథా అయిపోతుంది. మనసు పెట్టి చేసే వంట మన అనుకున్నవారందరినీ చేరువ చేస్తుంది. అదే నా సక్సెస్ మంత్ర’ అని వివరించారు ఈ ఇండియన్ షెఫ్.ఫిట్గా హెల్తీగా...టేస్టీ, హెల్తీ, వెజ్, నాన్వెజ్... ఇలా ఇన్నిరకాల వంటకాలు చేస్తూ, రుచి చూస్తూ, తింటూ ఉంటారు కదా! ‘బరువు పెరుగుతారు’ అని చాలా మంది అనేవారు. కానీ, ఈ విషయంలోనూ హెల్తీగా ఫిట్గా ఉండటానికి కృషి చేస్తుంటాను. యాక్టివ్గా ఉండటానికి జిమ్, వాకింగ్ నా లైఫ్స్టైల్లో భాగం చేసుకున్నాను. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
సహజీవనంలో కూడా ఆ చట్టం వర్తిస్తుందా?
గత నాలుగు సంవత్సరాలుగా ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అంతా బాగానే ఉంది కదా పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. పోయిన ఏడాది అతన్ని వాళ్ళ ఇంట్లో చెప్పమని అన్నాను. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు అన్నారు. అప్పటినుంచి తన వ్యవహార శైలి మారిపోయింది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నాడు. తన బలవంతంపై ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను. ప్రతి వారం నాకు చెప్పకుండా ఎటో వెళ్తున్నాడు. తన వాటా అద్దెకానీ, ఇంటి సరుకులకు కానీ డబ్బు కూడా ఇవ్వడం లేదు. అడిగితే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటూ... ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటా అని మోసం చేశాడు అని కేసు పెట్టమని ఒకరు సలహా ఇచ్చారు. నాకు మాత్రం గృహహింస చట్టం కింద కేసు వేయాలి అని ఉంది. ఏం చేయమంటారు?– ఒక సోదరి, విశాఖపట్నంపెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి కూడా గృహహింస నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ప్రతి సహజీవనం కేసులో గృహహింస నిరోధక చట్టం వర్తింప చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం ‘వివాహ స్వరూపంలో ఉన్న సంబంధం’ ఏ పరిస్థితుల్లో ఉంటుందో నిర్ధారించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి సంపూర్ణమైనవి కాక΄ోయినా, అలాంటి సంబంధాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి అని కోర్టు చెప్పింది. అందులో ముఖ్యమైనవి...సంబంధం కొనసాగిన కాలవ్యవధిడీవీ చట్టంలోని సెక్షన్ 2(జ) మేరకు వారి సంబంధం ఒక సముచిత కాలం పాటు కొనసాగి ఉండాలి. ఆ కాలవ్యవధి ప్రతి కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.సహవాస గృహం (షేర్డ్ హౌస్ హోల్డ్) ఏదో ఒక సమయంలో కలిసి ఒకే ఇంట్లో నివసించారు అనే ఆధారం.ఆర్థిక వనరుల భాగస్వామ్యం ఒకరికి ఒకరు ఆర్థికంగా సహకరించడం, జాయింట్ బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, స్థిరాస్తులను ఇద్దరిపేర్లపై లేదా మహిళ పేరుపై కొనుగోలు చేయడం, వ్యాపారాల్లో లేదా షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు.గృహ వ్యవహారాల నిర్వహణ ముఖ్యంగా మహిళకు ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, ఉదాహరణకు వంట చేయడం, శుభ్రపరచడం, ఇంటిని నిర్వహించడం వంటి పనులు చేయడం.లైంగిక సంబంధం వివాహ స్వరూపంలోని సంబంధం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉండే లైంగిక సంబంధం కాదు. అది భావోద్వేగ, ఆత్మీయ బంధం, సంతానం పొందాలనే ఉద్దేశం, స్నేహభావం, పరస్పర ప్రేమాభిమానాలు, శ్రద్ధ వంటి లక్షణాలను కలిగి ఉండాలి.పిల్లలు/సంతానం పిల్లలు ఉండటం అనేది వివాహ స్వరూపంలోని సంబంధానికి బలమైన సూచన. ఎందుకంటే అది దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. పిల్లలను పెంచడం, వారి బాధ్యతలను పంచుకోవడం కూడా అలాంటి సంబంధానికి బలమైన సూచన.సామాజికంగా భార్యాభర్తలుగా ప్రవర్తించడంస్నేహితులు, బంధువులు, సమాజంలోని ఇతరుల ముందర భార్యాభర్తలుగా ప్రవర్తించడం, అలాగే తమను అదేవిధంగా పరిచయం చేసుకోవడం, ఆ సంబంధం వివాహ స్వరూపంలో ఉందని నిర్ధారించడానికి బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది.ఇరుపక్షాల ఉద్దేశం, ప్రవర్తనతమ సంబంధం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏమిటి, ఇద్దరి పాత్రలు, బాధ్యతలు ఏమిటి అనే విషయాలపై ఇరుపక్షాల ఉద్దేశం ఆ సంబంధ స్వభావాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచబడవచ్చు లేదా ప్రవర్తన ద్వారా పరోక్షంగా అర్థమవవచ్చు. వివాహానికి సాధారణంగా ఉండే లక్షణాల విషయంలో వారి ఉద్దేశమే ముఖ్యమైనది.పైన సూచించిన విధంగా మీ బంధం/సహజీవనం కొనసాగి ఉంటే మీకు గృహహింస చట్టం వర్తిస్తుంది. సహజీవనం చేస్తున్న వారు చాలామంది ఎటువంటి ఆధారాలను ఉంచుకోవడం లేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అందులో కేవలం ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉంటే మంచిది. వారి బంధాన్ని ఎవరికీ చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. పైన సూచించిన అంశాలను గుర్తుపెట్టుకుని సహజీవనం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది.అదలా ఉంటే మీకు మీ సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకుంటాను అని మోసపూరితంగా శారీరకంగా కలిశారు అంటూ బీ.ఎన్.ఎస్. లోని సెక్షన్ 69 ప్రకారం కూడా క్రిమినల్ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కానీ అది నిజమైతే మాత్రమే క్రిమినల్ కేసు పెట్టండి. సెక్షన్ 69 ప్రకారం పురుషునికి మొదటి నుండి మోసపూరిత ఉద్దేశం ఉంది అని రుజువు చేయాల్సి ఉంటుంది. మీ హక్కులు మీకు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవనం భంగపడకుండా చూసుకోండి. ప్రస్తుత బంధాన్ని ముగించవలసి వస్తే, ఆ పని చేసి కేసులను నడిపించవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది( మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్) -
కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే. తాను కేన్సర్తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాజవ్రీ దేశ్పాండ్కు మార్చిలో గ్రేడ్1 రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారామె.పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..ఈ కేన్సర్ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..ఈ కేన్సర్ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. తన ఫ్యామిలీ డాక్టర్ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్ మ్యాన్ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్') -
ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్'
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరును అధికారికంగా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS)గా మార్చారు. అందరు ఈ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా కాకుండా సంతానలేమి సమస్యగా పరిగణిస్తూ అపార్థం చేసుకోవడంతో ప్రపంచ వైద్య ఏకాభిప్రాయం తర్వాత ఇలా అధికారికంగా ఆ వ్యాధి పేరు మార్చారు. ప్రపంచంలోని చాలామంది మహిళల్లో కనపించే అత్యంత సాధారనమైన రుగ్మతలలో ఒకటి ఇది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇలా చారిత్రాత్మకంగా కొత్తపేరు నామకరణం చేశారు. అంతర్జాతీయ ఎండోక్రైన్ అండ్ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల నేతృత్వంలో ప్రపంచ వైద్యుల చర్చల ఫలితమే ఈ పీఎంఓస్గా పేరు మార్పు. దేని గురించి ఈ పేరు మార్పు..ఇన్నాళ్లు ఈ పీసీ ఓఎస్ అనేది అండాశయ తిత్తుల గురించే నొక్కి చెప్పలా ఉంది. నిజానికి చాలామంది మహిళలకు అండాశయ తిత్తులనేవి ఉండవు. అందువల్ల ఈ పందం "PCOS" వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు వాదించారు. పైగా జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పాత పేరు సరిగా వివరించలేకపోయిందని అన్నారు.ఈ కొత్తపేరు ఏం వివరిస్తోందంటే..పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ల వ్యవస్థలు ప్రభావితమవుతాయిమెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం ఉందిఓవేరియన్: ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుస్రావం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందిసిండ్రోమ్: ఇది ఒకదానికొకటి సంబంధించిన లక్షణాలు,ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుందిఈ పేరు మార్పు లక్ష్యం రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపవాదును తగ్గించడం, మరింత సంపూర్ణమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. స్కాన్లలో అండాశయ తిత్తులు కనపడితే తప్ప తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.PMOS అంటే..?PMOS అనేది గతంలో PCOS అని పిలువబడిన అదే వైద్య పరిస్థితి. దీని నిర్ధారణ ప్రమాణాలు మారలేదు. ఇది ఒక హార్మోనల, జీవక్రియ రుగ్మత,లక్షణాలు:క్రమరహిత లేదా ఋతుస్రావం లేకపోవడంఅధిక ఆండ్రోజెన్ హార్మోన్లుమొటిమలు,ముఖంపై రోమాలు పెరగడంబరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బందిఇన్సులిన్ నిరోధకతసంతానోత్పత్తి సవాళ్లుకొంతమంది రోగులలో అనేక అపరిపక్వ అండాశయ ఫోలికల్స్ ఉండటంఈ పరిస్థితి వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు..టైప్ 2 మధుమేహంఅధిక రక్తపోటుగుండె జబ్బులుఫ్యాటీ లివర్ వ్యాధినిద్రలేమిడిప్రెషన్, ఆందోళనప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PMOSతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సమస్యకు గల కారణాలు:నిశ్చల జీవనశైలిప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపెరుగుతున్న ఊబకాయంసరిగా నిద్రపోకపోవడంఒత్తిడివంశపారంపర్య కారణాలురోగ నిర్ధారణను మెరుగుపరుస్తుందిఇక ఈ కొత్త పేరు PMOS అనే పదం సంతానలేమి సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల కోసం ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోనేలా ప్రోత్సహిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది మహిళలు ఈ వ్యాధిని తేలికగా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకునేవారు కాదు. ఈ పేరు మార్పుతో మహిళలంతా ఆరోగ్య స్పృహతో ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..) -
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..
మెట్గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్గా మారింది. ఈ అమ్మాయి లుక్ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్కార్పెట్పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్చైర్కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
చిలుకల తల్లికి గ్రీన్ ఆస్కార్
చంబల్... ఒకప్పుడు బందిపోట్లకు నెలవు. ఇప్పుడు అదే చంబల్ అంతరించిపోతున్న అందమైన పక్షి జాతికి అభయారణ్యం. ఆ మార్పుకు కారణం – పర్వీన్ షేక్. నిప్పుకణిక లాంటి ముక్కుతో చిలుకల్లా ఉండే ‘ఇండియన్ స్కిమ్మర్’ పక్షులు ఒరిజినల్గా ఏ దేశానివి. అవి మన దేశానికి వలస పక్షులా? లేక మన దేశంలో ఉంటాయా? ఆ పక్షులు అంతరిస్తుంటే ఆమె వాటి సంఖ్యను పెంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందుకే ‘గ్రీన్ ఆస్కార్స్’గా పిలిచే ‘విట్లీ అవార్డు’ ఆమెను వరించింది.లండన్ లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ హాల్... వేదిక మీద బ్రిటన్ రాకుమారి ప్రిన్సెస్ ఆన్... ఆమె చేతిలో 50,000 పౌండ్ల చెక్... ప్రిన్సెస్ ఆన్ నుంచి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘విట్లీ అవార్డు’ అందుకునేందుకు పర్వీన్ షేక్ వేదిక ఎక్కగానే చప్పట్లు మార్మోగాయి. అంతరించిపోతున్న ‘ఇండియన్ స్కిమ్మర్’ అనే చంబల్ చిలుకలను కాపాడినందుకు ఆమెకు గౌరవం. ‘ఈ అవార్డు నాకు కాదు, చంబల్ ఇసుకలో గూళ్లకు కాపలా కాసిన నా గ్రామీణ సోదరులకు’ అని వేదిక మీద ఆమె చెప్పిన మాటలకు హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. ‘గ్రీన్ ఆస్కార్’గా భావించే విట్లీ అవార్డును అందుకున్న పర్వీన్ తాను చేసిన సుదీర్ఘ పోరాటాన్ని తలుచుకుని ఉద్వేగం పొందింది.పక్షి ప్రేమికురాలు...పర్వీన్ షేక్ ముంబై అమ్మాయి. రామ్నరైన్ రూయా కాలేజీలో జువాలజీ చదివిన రోజుల్లోనే పక్షుల మీద పిచ్చి పట్టుకుంది. ‘‘నా కాలేజ్ చదువే నన్ను బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వైపు నడిపించింది’’ అంటారామె. 2012లో బాంబే నేచురల్ హిస్టరీలో సైంటిస్ట్గా చేరిన పర్వీన్ కి ఒక క్లారిటీ ఉండేది– ‘అంతరించిపోతున్న పక్షి జాతుల కోసం పని చేయాలి’ అని. ఆ అన్వేషణలోనే ఒకరోజు ఆమె దృష్టి ఒక మేగజీన్లోని ఒక పక్షి ఫొటో మీద పడింది. నల్లటి రెక్కలు, తెల్లటి పొట్ట, నిప్పు అంటుకున్నట్టు ఎర్రగా మెరిసే ముక్కు. కింది దవడ పైదవడ కంటే పొడుగు. పేరు ‘ఇండియన్ స్కిమ్మర్’. ఒకప్పుడు దక్షిణ ఆసియా అంతటా కనిపించే ఈ పక్షి, ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్లలో మాత్రమే మిగిలింది. మన దేశంలో 1990లో 10,000 ఉండే ఈ పక్షులు 2017కి 400కి పడిపోయాయని తెలిశాక ఆమె గుండె విలవిలలాడింది. వీటిని కాపాడలేనా అనుకుందామె.చంబల్ లోయకు ప్రయాణం...మన దేశంలో ఇండియన్ స్కిమ్మర్ పక్షులు ఎక్కువగా చంబల్ లోయలో ఉంటాయి. అందుకే డిసెంబర్ 2016లో పర్వీన్ బృందం చంబల్ నది మీద బోట్లో సర్వే మొదలుపెట్టింది. ఇది ఇండియాలో ఇండియన్ స్కిమ్మర్ మీద జరిగిన మొదటి శాస్త్రీయ సర్వే. అక్కడ కనపడిన దృశ్యాలు ఆమె మనసును ఇంకా వికలం చేశాయి. ఇండియన్ స్కిమ్మర్ పక్షి నది ఒడ్డున ఇసుక లోడి గుడ్లు పెడుతుంది. అదే దాని గూడు. అలాంటి గూళ్ల మీద ఆవుల మందలు నడుస్తూ నాశనం చేస్తున్నాయి. ఇసుక మాఫియా ట్రాక్టర్లకు మిగిలినవి బలి అవుతున్నాయి. మిగతావి కుక్కలు, నక్కలు, మనుషుల ఆటలకు. ‘పక్షులను చంపుతోంది ప్రకృతి కాదు. మన నిర్లక్ష్యం’’ అని ఆ రోజు డైరీలో రాసుకుంది.నెస్ట్ గార్డియన్స్...‘గూళ్లకు కాపలా పెడితే?’– పగిలిన గుడ్డు చేతిలో పట్టుకుని పర్వీన్ వేసుకున్న శపథం అది. కానీ చెప్పడం తేలిక. చేయడం? బందిపోట్ల లోయ అనే పేరున్న చంబల్లో, ఇసుక మాఫియా రాజ్యమేలే చోట, ముంబై నుంచి వచ్చిన ఒక మహిళా సైంటిస్టు మాట ఎవరు వింటారు? పర్వీన్ గ్రామాల్లో తిరిగింది. ‘ఈ పక్షులు నది ఆరోగ్యానికి గుర్తు. ఇవి పోతే నది చచ్చిపోయినట్టే. నది చస్తే మనమూ బతకలేం’ అని అర్థమయ్యే భాషలో చెప్పింది. మొదట్లో నవ్వారు. తర్వాత విన్నారు. అర్థం చేసుకున్నారు. అలా 30 మందికి పైగా స్థానిక యువకులు, మత్స్యకారులు ‘నెస్ట్ గార్డియన్స్’గా మారారు.వాళ్లు చేసే పని మామూలుది కాదు. ఆ పక్షుల బ్రీడింగ్ సీజన్ మార్చి నుంచి జూన్ దాకా ఎండనకా వాననకా, ఇసుక తిన్నెల దగ్గర కాపలా కాస్తారు. గూళ్ల చుట్టూ వెదురు కంచె వేసి ‘పక్షులు గుడ్లు పెడుతున్నాయి, దయచేసి దూరంగా వెళ్లండి’ అని బోర్డులు పెడతారు. ఫలితం? 2025లో పక్షుల సంఖ్య 400 నుంచి 1000 దాటింది. అంతకంటే గొప్ప విషయం ఏంటే, ‘ఇవి మన పక్షులు’ అని గ్రామస్తులు ఓన్ చేసుకున్నారు. ఇదే పర్వీన్ కి అతిపెద్ద విజయం. పర్వీన్ చేతిలో తుపాకీ లేదు. ఇసుక తిన్నెల మీద వెలిసిన పక్షుల గూళ్ల మీద అవ్యాజమైన ప్రేమ ఒక్కటే ఉంది. అందుకే ఇవాళ చంబల్ చిలుకలు తిరిగి ఆకాశంలో ఎగురుతున్నాయి. ‘గ్రీన్ ఆస్కార్’ పర్వీన్ కి దక్కిన గౌరవం కాదు, చంబల్ నది ఆమె పాదాలు కడిగి చెప్పిన కృతజ్ఞత. -
నీట్గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!
మొక్కలు నేల మీదే పెరుగుతూ ఉంటాయన్నది అపోహ. కానీ అవి నేల మీదే కాదు... మానవుల చర్మం సహా అన్ని రకాల జంతువుల దేహాల మీదా, మొక్కల మీద కూడా పెరుగుతుంటాయి. మనుషుల చర్మం మీదే కాదు... వెంట్రుకల మీదా, గోళ్ల మీద కూడా పెరుగుతాయి. దీనికి తార్కాణాలను మనం చాలాసార్లు అనుభవించే ఉంటాం. కానీ అవి మన దేహం మీద పెరిగే ‘ఫంగస్’ కారణంగా అని తెలియదు. ఉదాహరణకు తప్పని పరిస్థితుల్లో తడి అండర్వేర్ తొడుక్కున్న సమయాల్లో గజ్జల్లో ఒరుసుకుపోయినట్లు కావడం, తొడలు, పిరుదులు, ప్రైవేట్ పార్ట్స్ వద్ద చర్మం నల్లబారి దురదగా అనిపించడం, గోరు మీద గోరుచుట్టు... ఇవన్నీ ఫంగస్ పెరుగుదల వల్ల కనిపించేవే. వీటినే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ డిసీజెస్గా పేర్కొంటారు. సాధారణంగా మన దేహంలోని అనేక చోట్ల పెరిగే ఫంగల్ డిసీజెస్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం...నిజానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దేహంలో అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా రావచ్చు. అందుకే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను అబిక్విటస్ అంటారు. నిజానికి నేల (సాయిల్) మీద లేదా పండ్ల మీద కూడా కుళ్లుతున్నచోట ఇవి మొలుస్తుంటాయి. పండ్లు కుళ్లడానికి కారణం ఈ ఫంగసే. వృథా పదార్థాలన్నీ మళ్లీ ఖనిజలవణాల్లా రూపంలోకి మారిపోయి తమ మౌలికమైన అణువులుగా తనలో కలిసిపోడానికి ప్రకృతి తన కోసమే ఈ ఫంగల్ రూపాలనుసృష్టించుకుందని చెప్పవచ్చు. అలా చూసినప్పుడు ఫంగస్ జీవులు ప్రకృతికి మేలే చేస్తాయి.పూర్తిగా మొక్కలూ కావు... సూక్ష్మజీవులూ కావు... జీవశాస్త్రపరం (బయలాజికల్)గా చూసినప్పుడు మొదట్లో వాటిని మొక్కల్లోని ఒక విభాగంగా చూసేవారు. అందుకే వృక్షశాస్త్రం (బాటనీ)లోని ఒక విభాగంగానే వాటి అధ్యయనం కొనసాగేది. కానీ వాటిలోనే పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవి పూర్తిగా మొక్కలూ కావనీ, అలాగని పూర్తిగా సూక్ష్మజీవుల కింద కూడా వాటిని పరిగణించలేమని తేలింది. దాంతో ఫంగస్లను ఇప్పటికీ వృక్షశాస్త్రవిభాగంలోనే చదువుతున్నప్పటికీ... వాటి గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు మాత్రం ఫంగస్లను ‘మైకాలజీ’ అనే ఓ ప్రత్యేక శాస్త్రవిభాగంగా పరిణమిస్తుంటారు.ఫంగస్ రకాలు... ఫంగస్లోని రకాలను వర్గీకరించేటప్పుడు వాటిలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు...ఆకృతిని బట్టి : వాటి ఆకారాన్నీ / ఆకృతిని బట్టి వర్గీకరణ చేస్తే... ఈస్ట్ అనీ, మౌల్డ్స్ అనీ వర్గీకరించవచ్చు, ఇందులో ఈస్ట్ అనేవి ఆహారాన్ని పులిసేలా చేస్తూ మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ మౌల్డ్స్ మాత్రం ఆహారానికి బూజులా పట్టి మన ఆహారాలను తినడానికి యోగ్యం కాకుండా చేస్తాయి. (ఉదాహరణకు బ్రెడ్ను అలాగే వదిలేస్తే ఆకుపచ్చరంగులో బూజు రావడం మనకు తెలిసిందే).స్పీషీస్ (ప్రజాతులను) ఆధారంగా: ఫంగస్ ప్రజాతులను అంటే వాటి స్పీషీస్ను బట్టి చూసినప్పుడు... డెర్మటోఫైట్ స్పీషీస్, క్యాండిడా స్పీషీస్, మలేసేజియా స్పీషీస్ అనే రకాలు ఉంటాయి. మన దేహంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో చర్మంపై వచ్చేవి డర్మటోఫైట్స్ స్పీషీస్కు చెందినవనీ, ఇక గజ్జలు లేదా చర్మం ముడతల్లో వచ్చే ఎర్రటి ఇన్ఫెక్షన్ను క్యాండిడా స్పీషీస్వని చెప్పవచ్చు.ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి : చర్మంపై వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ఉపరితలానికే పరిమితమయ్యేవి (సూపర్ఫీషియల్), చర్మంలోపల చాలా లోతుగా ఇన్ఫెక్ట్ చేసేవి (డీప్ స్కిన్) అని వర్గీకరించవచ్చు. సాధారణంగా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ పైపైనే వస్తాయి. కానీ ఎయిడ్స్ వ్యాధి సోకినవారిలో వచ్చేవి చాలా డీప్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి.ఎన్విరాన్మెంట్ను బట్టి చూస్తే : మన పర్యావరణంలో అవి పెరిగే చోటను బట్టి కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నేల మీద పెరిగేవాటిని జియోఫిలిక్ అనీ, జంతువులపై నివసించేవాటిని జూఫిలిక్ అనీ, కేవలం మానవుల దేహంపైనే పెరిగేవాటిని ‘యాంథ్రపోఫిలిక్’ అని అంటారు.సాధారణంగా అడల్ట్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లుటీనియా కార్పోరిస్ : ఇది టైకోఫైటాన్ రబ్రబ్ అనే పంగ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది పాదాలూ, చేతులు, మర్మావయవాలు (ప్రైవేట్ ΄పార్ట్స్) మినహా దేహంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. ముఖ్యంగా పాడిపశువుల, పందుల పెంపకంలో నిమగ్నమయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరిలో వారాలూ, నెలలూ, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల పాటు కూడా ఏమాత్రం మానకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసందర్భాల్లో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం దురద రావచ్చు. కొందరిలో మాత్రం చిన్నవి మొదలుకొని పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్టుగా కనిపించే ప్యాచ్లు రావచ్చు. ఈ గుండ్రటి అంచులు అన్ని పక్కలకూ వ్యాప్తిస్తూ... మధ్యలోని చర్మం మామూలుగా ఉండవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదారితో మరొకటి కలిపిపోయేంతగా విస్తరిస్తూ పెద్దగా పెరగవచ్చు. కొన్నిసార్లు పగుళ్లూ, పొక్కల వంటివి (బ్లిస్టర్స్ అండ్ గ్రాన్యులోమా) వంటివీ కనిపించవచ్చు. వీటినే మాజోకాస్ గ్రాన్యులోమా అని పిలుస్తారు. కొన్నిసార్లు కొందరిలో అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాఫార్మ్ మచ్చల వంటివీ కనిపించవచ్చు. ఇది జంతువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.టీనియా క్రూరిస్ (ధోబీస్ ఇచ్) : ఇది ప్రైవేట్ పార్ట్స్ వద్ద కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్నే సాధారణంగా అందరూ ‘ధోబీస్ ఇచ్’ లేదా ‘జాక్ ఇచ్’ అని పిలుస్తారు. ఒక్కోసారి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గడ్డ›రూపంలో వచ్చి బాధిస్తుంటుంది. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టి తడిగా, చెమ్మతో ఉండే చోట్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించడం వల్లా... అలాగే స్థూలకాయం కారణంగా బట్టలు బిగుతుగా ఉన్నప్పుడూ... ఇక చాలాకాలంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్నవారిలోనూ ఈ సమస్య కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తూ ఉంటుంది. నెలల నుంచి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ. గతంలో పాదాలకు ‘టీనియా పెడిస్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మరీ మరీ ఎక్కువ. ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎర్రటి / నల్లటి మచ్చలతో... అలాగే తరచూ దురదతో చాలా అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. అయితే ఇది వృషణాల సంచి చర్మంపైనా లేదా పురుషాంగం పైనా పాకడం మాత్రం చాలా చాలా అరుదు.టీనియా మ్యాన్యువమ్ : ఇది చేతులకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కోసారి కాళ్లలో కూడా రావచ్చు. చేతులపై దురద వస్తుంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన చోట... మధ్యనుండే చర్మం బాగానే కనిపిస్తున్నా అంచులు స్పష్టంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంటుంది. అరచేతుల వెనకవైపున కనిపిస్తూ... ఒక్కోసారి అరచేతుల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. దీనికి పూత మందులు పనిచేయవు. నోటి ద్వారా (ఓరల్గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు వాడాలి.టీనియా పెడిస్ (అథ్లెట్స్ ఫూట్) : ఆటలాడే వయసున్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలోనూ ఇది కనిపించడం వల్ల దీన్ని ‘అథ్లెట్స్ ఫూట్’ అంటారుగానీ... ఆటలకూ దీనికి సంబంధం ఉండదు. అయితే అరుదుగా కొందరిలో 50 ఏళ్ల వయసు వారిలోనూ కనిపించవచ్చు. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. బిగుతుగా ఉండే ΄పాదరక్షలు (ఫుట్వేర్) వాడేవారిలోనూ, పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. పాదానికి వచ్చినప్పుడు చర్మం పొట్టులా రాలవచ్చు. అలాగే కొందరిలో కాలి బొటనవేలి కింద పగులులా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యన కనిపిస్తుండవచ్చు. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తుంటుంది. ఇందులో రెండు రకాలుంటాయి. మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితైన దాన్ని ‘మోకాసిన్ టైప్’ అంటారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటిబుడగలు, తిత్తుల రూపంలో కనిపిస్తే దాన్ని ‘బ్లూలస్ టైప్’ అంటారు. కాస్తంత వదులుగా, సౌకర్యంగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్ పెరాక్సైడ్తో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అలాగే క్లాకిమాజోల్, మైకోనజోల్, కీటోకెనజోల్, ఎకోనజోల్ వంటి పూతమందులతోనూ దీనికి చికిత్స అందించవచ్చు.క్యాండిడియాసిస్ : ఇది ఈస్ట్ తరహా ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. సాధారణంగా నోటిలోనూ లేదా ప్రైవేట్ పార్ట్స్ (మర్మావయవాల) వద్ద వస్తుంటుంది. అక్కడ నిత్యం చెమట పడుతూ తడిగా, చెమ్మగా ఉండటం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. క్యాండిడే అబ్బిలెన్స్ అనే ఒక రకం ఫంగస్... మానవుల నోటి నుంచి మలద్వారం వరకు ఉండే జీర్ణవ్యవస్థకు చెందిన మార్గం (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటుంది. దీని లక్షణాలను బ్యాక్టిరియల్ లక్షణాలుగా పొరబడి యాంటీబయాటిక్స్ వాడేవారిలో దీని తీవ్రత మరింత పెరిగి బాధిస్తుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చర్మం ఎక్కువగా పట్టే గుణం, ఎండోక్రైన్ సమస్యలూ, స్టెరాయిడ్స్ వాడటం, దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. కొందరు మహిళల్లో ఇది రొమ్ముల కింది భాగంలో ఎర్రబారినట్టుగా వ్యక్తమవుతుంది.ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే క్యాండిడియాసిస్ : ఇది పురుషుల్లో మర్మావవం వద్ద... అలాగే మహిళల్లో యోని వద్ద కనిపిస్తుండే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇందులో వుల్వైటిస్, వుల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనో΄ోస్థైటిస్ వంటి రకాలు ఉంటాయి. పూతమందులతో, నోటి ద్వారా వాడే మందులతో ఈ ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చు.శోభి మచ్చలు (పిటిరియాసిస్ వెర్సికలర్) : తెలుగులో శోభిమచ్చలు అని పిలిచే ఈ తెల్లమచ్చలు / తెల్లపొడ కూడా ఒక రకం ఫంగస్ వల్లనే వస్తుంది. ఈ సమస్యలో ఎలాంటి నొప్పీ, బాధా లేకపోయినప్పటికీ కాస్తంత అసహ్యంగా కనిపిస్తూ కాస్మటిక్గా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి ఒక మచ్చపైకి మరో మచ్చ పెరుగుతూ ‘మలసేజియా ఫర్ఫర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఎక్కువగా బాగా వేడి వాతావరణంలో ఉండేవారిలోనూ, బాగా చమటలు పడుతూ అవి త్వరగా ఆరి΄ోని పరిస్థితుల్లోనూ, జిడ్డు చర్మం ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. అలాగే ఎయిడ్స్ వంటి జబ్బు ఉన్నవారిలో ఈ ఫంగస్ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బాగా పెరుగుతుంది. కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా కనిపిస్తుంటుంది. కొందరిలో కాస్త దురదలూ కనిపించవచ్చు.కొందరిలో ఈ సమస్యతో ఒక్కోసారి చర్మం పొట్టులా, పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలూ, మెడ, వీపు, పొట్ట, అరుదుగా కొందరిలో ప్రైవేట్ పార్ట్స్, తొడల వద్ద ఈ సమస్య కనిపించవచ్చు. కర్రదీపంలో చూసినప్పుడు ఈ సమస్య ఉన్నచోట చర్మం నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తుంది. ఈ సమస్యకు కీటకెనజోల్ షాంపూలు వాడుతూ, కీటకెనజోల్ క్రీమ్, క్లాట్రిమాజోల్ క్రీమ్ వంటి పూత మందులు వాడుతూ... నోటి ద్వారా (ఓరల్గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు.వెంట్రుకల్లో వచ్చే టీనియా రకాలు టీనియా క్యాపిటిస్ : ఇది రోమం అంకురంలో వచ్చే ఇన్ఫెక్షన్. టీనియా క్యాపిటిస్ మాడు మీద వస్తే పేనుకొరుకుడులా కనిపిస్తుంది. పిల్లల్లో యుక్తవయసుకంటే ముందుగా అంటే... 6 – 10 ఏళ్లవారిలో ఎక్కువగా వస్తుంటంది. తలలో పొలుసుల మాదిరిగా కనిపిస్తాయి. వెంట్రుకలు విరిగిపెతుంటాయి. తలలో మొటిమల్లా వస్తూ కొన్నిసార్లు అక్కడ చీము వంటి స్రావం కనిపిస్తుండవచ్చు. చివరగా... అక్కడి వెంట్రుకలన్నీ గుండ్రని ఆకృతిలో రాలిపోయి మచ్చలా (స్కారింగ్ అలొపేషియాగా) కనిపిస్తుంటుంది. ఇది స్కూలు పిల్లల్లో వచ్చినప్పుడు ఒక చిన్నారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఒక్కోసారి ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడినప్పుడూ ఇది వ్యాప్తి చెందుతుంటుంది. ఇందులోని ఒక రకాన్ని ‘బ్లాక్ డాట్’ అంటారు. ఇందులో మాడుపైన రోమమూలంలో వెంట్రుక విరిగిపోతుంది. వెంట్రుక మూలం దగ్గర క చుక్కలాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి ఉబ్బిన చుక్కల గుంపు అంతా ఒక ప్యాచ్లా కనిపిస్తుంటుంది.ఇక ‘గ్రే ప్యాచ్’ అనే మరోరకం మచ్చ వచ్చిన చోట కూడా వెంట్రుకలన్నీ విరిగిపోయి... అక్కడ ఓ గోధుమ రంగు ప్యాచ్లా అది కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్లో పొలుసులన్నీ కాస్తంత ఎరుపురంగుకు తిరిగి మచ్చలా కనిపిస్తాయి. ఈ సమస్యలోనూ వెంట్రుకలన్నీ విరిగి రాలిపోయి పేనుకొరుకుడు మచ్చలా కనిపిస్తాయి. కర్రమంట వెలుగులో చూస్తే ఈ మచ్చ... ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.టీనియా బార్బే : ఇది మాత్రం గడ్డంలో వచ్చి... అక్కడ పేనుకొరుకుడులా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీసంలోనూ కనిపిస్తుంది. గడ్డం లేదా మీసంలోని వెంట్రులన్నీ రాలిపోవడంతో అక్కడ పేనుకొరుకుడు మచ్చ కనిపిస్తుంది.ఆగ్మినేట్ ఫ్యాలుక్యులైటిస్ : ఇది కూడా కీకన్ లాగే ఎర్రటి మచ్చలతో కనిపించేదే అయినా... దీనిలో నొప్పి తీవ్రత తక్కువ.ఫేవస్ : ఇందులో రోమమూలంలో ఎర్రగా కనిపిస్తుంటుంది. వెంట్రుకలు ఒకదానితో మరొకటి కలిసి పోయినట్లుగా చిక్కుబడినట్టుగా అల్లుకుపోయి కనిపిస్తుంటాయి. వెంట్రుకల మొదళ్లలో మొదటి ఎరుపురంగులో కనిపించేవి కాస్తా తర్వాత ఉబ్బినట్టుగా పసుపు పొక్కుల్లా కనిపిస్తుంటాయి. రోమంతో పాటుగా అక్కడి చర్మం కూడా శిథిలమై వెంట్రుక కుప్పగా పడిపోవడం వల్ల అది పసుపు పొక్కులా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఒక్కోసారి వెంట్రుకలన్నీ రాలిపోయి పేనుకొరుకుడుగా కనిపించవచ్చు.పిల్లల్లో సమస్య నివారణ / చికిత్స...స్కూలు పిల్లల తల ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు తరచూ వాళ్ల తలలను / మాడును పరిశీలిస్తూ ఉండాలి.కీటోకొనజాల్తో పాటు సెలేనియమ్ సల్ఫైడ్ ఉన్న షాంపూలతో తల స్నానం చేయిస్తూ ఉండటం వల్ల ఫంగస్ల వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.పైపూత (టాపికల్ మెడిసిన్)గా రాయాల్సిన యాంటీ ఫంగల్ పూత మందులను వాడటం ద్వారా కొన్ని రకాల ఫంగస్లకు చికిత్స చేయవచ్చు.నోటి ద్వారా యాంటీ ఫంగల్ మందులు ఇవ్వడం ద్వారా చేసే చికిత్స : గ్రీసియోఫల్విన్ మందులుగా చెప్పే యాంటీ ఫంగల్ మందులతో ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించవచ్చు. ఇక వాటితో పాటు టెర్బినాఫిన్స్, ఇట్రాకెనజోల్, ఫ్లూకోనజోల్, కీటాకెనజోల్ వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ల విచక్షణ మేరకు చర్మంపైన వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడానికి అవసరమైతే కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సిరావచ్చు. పరిస్థితి కాస్త తీవ్రమై... ఇన్ఫెక్షన్ గనక మొదటి దశ దాటిపోతే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకే (సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్) దశకు చేరితే అప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు.గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్...టీనియా అన్గ్యువమ్ : ఇది గోరు (నెయిల్ ప్లేట్)కు వచ్చే ఫంగస్. ట్రైకోఫైటాన్, రబ్రమ్, ట్రైకోఫైటాన్ మెంటారోఫైట్స్, ఎపిడర్మోఫైటాన్ ఫ్లోకసమ్ వంటి ఫంగల్ రకాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇందులో గోటికి ఇరువైపులా ఉండే గోరుభాగం పైకి వచ్చిన చర్మం ముడతల నుంచి వ్యాపిస్తుంది. గోరు తన పారదర్శకతను క్రమంగా కోల్పోతుంది. శిథిలం అవుతుంది. కట్ చేసినప్పుడు స్పష్టంగా తెగకుండా... పొట్టుగా రాలిపోతుంది. యుక్తవయసుదాటిన వారిలో, బలహీనమైన గోళ్లు ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలెక్కువ. ఇందులో డిస్టల్ అండ్ ల్యాటరల్ సబ్ అన్గ్యువల్ ఒనైకోమైకోసిస్, సూపర్ఫీషియల్ వైట్ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్ సబ్ అన్గ్యువల్ ఒనైకోమైకోసిస్ వంటి రకాలూ ఉంటాయి. త్వరగా చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం. పూతమందులు పనిచేయవు. ఇట్రకెనజోల్, టర్బినాఫిన్ వంటి మందులు వాడాలి. చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఎప్పుడూ తగిన హైజీన్ పాటిస్తూ శుభ్రంగా ఉండేవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్స్టైలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో కీలక భూమిక పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.డాక్టర్ విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ -
గర్భం దాల్చిన ఐదో నెలకు బ్లడ్ కేన్సర్..!చివరికి..
గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్ స్టేజ్లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్ కేన్సర్ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్ లింఫోబ్లాస్లిక్ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు) -
కాఫీ వృద్ధాప్యాన్ని తగ్గించగలదా?
కాఫీ మితంగా తాగటం వల్ల ఆయుష్షు పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నదే. అయితే తాజాగా ఆ విధంగా ఆయుష్షు పెరగడానికి మూల కారణాన్ని పరిశోధకులు కనిపెట్టారు. మన శరీర కణాల్లోనే ఆ మర్మం దాగి ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలోని వెటర్నరీ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది.ఇంతవరకు తెలిసింది కాఫీలోని కొన్ని పదార్థాలు మన శరీరంలోని కణాలలో ఉండే ఒక నిర్దిష్ట ఎంజైమ్ను ప్రేరేపిస్తాయి. ఆ ఎంజైమ్ కణాల వయసు త్వరగా పెరగనివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపులు) నయం అవుతాయి. దాంతో హృద్రోగాలు వచ్చే ముప్పు తగ్గుతుంది. రోజుకు ఇన్ని కప్పులు అని మితంగా కాఫీ తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగుపడి, వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి.ఇప్పుడు తెలుసుకున్నది మన శరీర ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని నిర్ణయించే కణ స్థాయిలోని ‘నియంత్రణ వ్యవస్థే’కాఫీ సేవించే అలవాటు ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనినే ‘టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ’ పరిశోధకులు ‘బయోలాజికల్ స్విచ్’అంటున్నారు. మనం సేవించే కాఫీ కణాల్లోని అటువంటి ఒక స్విచ్ను ఆన్ చేయడం ద్వారా మనం వృద్ధులుగా మారటాన్నినెమ్మదింపజేస్తోందన్న మాట. ఏమిటీ ‘బయొలాజికల్ స్విచ్’? మన శరీరంలోని కణాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా అణువులు ఉంటాయి. ఇవి బయట నుండి వచ్చే సంకేతాల (ఉదా: మనం కాఫీ తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే సంకేతాలు) ద్వారా శరీరంలో కొన్ని రసాయన ప్రక్రియలను ‘ఆన్’లేదా ‘ఆఫ్’అయ్యేలా చేస్తాయి. వీటినే బయోలాజికల్ స్విచ్లు అంటారు. కాఫీ తాగినప్పుడు అది శరీరంలోని ఒక నిర్దిష్ట స్విచ్ను ‘ఆన్’చేస్తుంది. ఈ స్విచ్ ఆన్ అయినప్పుడు మన కణాలు తమను తాము శుభ్రం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. మేలు చేసే కొన్ని ఎంజైమ్లు కూడా విడుదల అవుతాయి. దీనివల్ల వృద్ధాప్యం లక్షణాలు ఆలస్యమవుతాయి. అలాగే మన శరీరంలోకి ఏదైనా వైరస్ చొరబడినప్పుడు,ఒక బయోలాజికల్ స్విచ్ ‘ఆన్’అయ్యి తెల్ల రక్తకణాలను యుద్ధానికి పంపిస్తుంది. వైరస్ చనిపోయాక, ఆ స్విచ్ మళ్లీ ‘ఆఫ్’అవుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..) -
మంచులోకపు చివరి చిరునామా
మంచు పరుపుపైన ఆకాశం వాలిపోతుంటే ప్రకృతి తన మౌనరాగాన్ని వినిపిస్తుంది. అక్కడ సూర్యుడు ఉదయించడు.. ఉదయిస్తే అస్తమించడు.మనుషుల కన్నా పోలార్బేర్ ఎక్కువ ఉండే మంచు రాజ్యం స్వాల్బార్డ్. ఆర్కిటిక్ వెలుగు మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ‘స్వాల్బార్డ్’ అనే ఈ ప్రాంతం నార్వే దేశంలో భాగం. యూరప్ నుంచి దూరంగా ఉండే మంచుతో నిండిన ద్వీప సమూహం ఇది. మంచులోకపు చివరి చిరునామాను తెలుసుకోవాలంటే ‘స్వాల్బార్డ్’ వెళ్లాల్సిందే!ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి స్వాల్బార్డ్కు నేరుగా విమాన సర్వీసులు లేవు. ముందునార్వే రాజధాని అయిన ఓస్లో వరకు చేరుకుని అక్కడి నుంచి స్వాల్బార్డ్లోని లాంగ్ఇయర్బైయెన్ ప్రాంతానికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి స్వాల్బార్డ్ వెళ్లాలి అనుకుంటే ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది.ఎక్కడ ఉండాలి?స్వాల్బార్డ్లో స్టే అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లాంగ్ఇయర్బైయెన్లో ఉన్న చిన్న బుటిక్ హోటల్స్, గెస్ట్ హౌసెస్ చాలా బాగుంటాయి. వుడ్తో చేసిన గోడల మధ్య బయట చలి ఉన్నా.. లోపల ఉండే ఆ వెచ్చదనం మనసుకి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అక్కడ ఉన్న లగ్జరీ అమెనిటీస్ కన్నా అక్కడి సింప్లిసిటీ, హాస్పిటాలిటీ మనసుని గెలుచుకుంటాయి. లాడ్జిలోని వెచ్చని మంట దగ్గర కూర్చుని పుస్తకం చదవడం కానీ, లేదా బయట ఉన్న మంచును చూడటం ఒక మెమొరీగా మిగిలిపోతాయి.ఏం చూడాలి?స్వాల్బార్డ్లో చూడాల్సిన ప్రదేశాలు, చేయడానికి ఆక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఆర్కిటిక్ వైల్డర్నెస్లో డాగ్ స్లెడింగ్ చేస్తూ మంచులో వెళ్లడం చాలా మందికి నచ్చుతుంది. స్నో మొబైలింగ్ చేయడం, నార్తర్న్ లైట్స్ చూడటం ఇవన్నీ చాలా మంది చేసేవే. కానీ మీరు వెళ్తే మాత్రం అక్కడ ఉన్న డూమ్స్డే వాల్ట్ అనే ప్రపంచ విత్తనాల బ్యాంకును చూడటం మరవకండి. గ్లేషియర్స్, వాటి మధ్యలో ఉన్న మంచు గుహలను చూసేందుకు మంచి ట్రావెల్ ఏజెన్సీలు సాయం చేస్తాయి. దీంతో పాటు సోవియట్ కాలంలో తవ్వి వదిలేసిన పిరామిడెన్, బారెంట్స్బర్గ్ అనే మైనింగ్ టౌన్ ఒక సినిమాటిక్ ఫీలింగ్ అందిస్తాయి. ఇక్కడి మ్యూజియంలో పోలార్ బేర్స్, అంటే ధ్రువపు ఎలుగుబంట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.ఏం తినాలి?ఆర్కిటిక్ వాతావరణంలో ఫుడ్ ఒక సూపర్ ఎక్స్పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ లోకల్గా లభించే సీ ఫుడ్, ముఖ్యంగా ఫ్రెష్ ఆర్కిటిక్ చార్ అనే కోల్డ్ వాటర్ ఫిష్ డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. దీంతో పాటు లోకల్ కాఫీ, రీన్డీర్ మీట్, లోకల్ సూప్స్ ఫుడ్ లవర్స్కు మంచి ఆప్షన్స్గా ఉంటాయి.నిజానికి ఇక్కడ ఫుడ్ అనేది ఆకలి తీర్చుకునే సాధనం మాత్రమే కాదు.. ఆ వాతావరణంలో మనసుని తృప్తిపరచుకునే మార్గం కూడా.సందర్శనీయ స్థలాలుస్వాల్బార్డ్లో లాంగ్ఇయర్బైయెన్ అనే చిన్న టౌన్ నుంచి మంచు కొండల మధ్యలోకి వెళ్లే కొద్దీ మనకు వినపడే ఒకే ఒక శబ్దం.. నిశ్శబ్దం. ఇక్కడి పిరామిడెన్ అనే ఘోస్ట్ టౌన్ చూస్తుంటే గత కాలంలో మనుషుల జీవితం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అక్కడున్న ప్రతీ కట్టడం, కోల్ మైన్స్ ఇప్పుడు మంచులో కలిసిపోయి ఒక వింత కథను చెబుతాయి. నై–ఆలేసుండ్ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు హఠాత్తుగా ఆకాశంలో నక్షత్రాలు మనకు దగ్గరయ్యాయేమో అని అనిపిస్తుంది.ఆసక్తికరమైన విషయాలుస్వాల్బార్డ్లో మనుషుల కన్నా పోలార్ బేర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మిడ్నైట్ సన్ వల్ల సమ్మర్లో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇక్కడే ఉంది. దీనిని డూమ్స్డే వాల్ట్ అని కూడా అంటారు. ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ చాలా తక్కువ. ప్రయాణానికి స్నో మొబైల్స్ ఎక్కువగా వాడతారు. స్వాల్బార్డ్లో చనిపోయిన వారిని ఖననం చేయరు. దీనికి కారణం ఇక్కడ నేల మొత్తం శాశ్వత మంచుతో ఉండటమే. దీనిని పెర్మాఫ్రోస్ట్ అంటారు. దీని వల్ల మృతదేహాలు పూర్తిగా డీ కంపోజ్ కావు.పోలార్ బేర్స్ అడ్డాస్వాల్బార్డ్ ప్రయాణం ఎంత అందమైనదో అంతే ప్రమాదకరం కూడా. ఇక్కడ మనుషుల కన్నా పోలార్ బేర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పట్టణం పరిధి దాటి బయటికి వెళ్లినప్పుడు చేతిలో రైఫిల్ తీసుకెళ్లడం అక్కడ తప్పనిసరి. ధ్రువపు ఎలుగుబంట్లు ఎంత అందంగా ఉంటాయో అంతే శక్తివంతమైనవి కూడా. ఇవి 8 నుంచి 10 అడుగుల ఎత్తు, సుమారు 700 కిలోల బరువుతో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే మ్యాగ్జిమం ఉస్సెయిన్ బోల్ట్ స్పీడ్ గంటకు 37 కిమీ మాత్రమే. మంచు కొండల మధ్య హఠాత్తుగా ఒక పోలార్ బేర్ కనిపిస్తే గుండె క్షణం పాటు ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే అక్కడ చాలా మంది గైడ్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు.స్వాల్బార్డ్లో చేయాల్సిన 5 పనులుఫ్రోజెన్ బబుల్ ఫోటోగ్రఫీలాంగ్ఇయర్బైయెన్ లో అత్యంత చల్లని వాతావరణంలో వేడి నీటి బుడగలు నేల నుంచి బయటికి వచ్చి పేలుతుంటాయి. ఈ ప్రత్యేక దృశ్యాలను ఫోటోగ్రఫీ చేయడం చాలా మందికి ఇష్టం.ఆర్కిటిక్ బోట్ సఫారిఇస్ఫ్యోర్డెన్ ప్రాంతంలో ఐస్బర్గ్లు, గ్లేషియర్స్ చూడొచ్చు. అలాగే మంచు ప్రపంచంలో మాత్రమే కనిపించే పోలార్ బేర్స్ను కూడా చూడవచ్చు.బారెంట్స్బర్గ్ ట్రిప్స్థానిక కల్చర్, వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలి అంటే రష్యన్ సెటిల్మెంట్ ఉన్న బారెంట్స్బర్గ్ వెళ్లవచ్చు.గుడ్ నైట్ చెప్పని సూరీడుస్వాల్బార్డ్లో ఏప్రిల్ చివరి నుంచి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అస్తమించడు.పోలార్ నైట్ అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్య వరకు సూర్యుడు ఉదయించడు. దీనినే పోలార్ నైట్ అంటారు. ఇదే స్వాల్బార్డ్ ప్రత్యేకత.యాత్ర – బడ్జెట్ వివరాలుస్వాల్బార్డ్ ప్రయాణం కొంచెం ఖర్చుతో కూడినదే. అయితే అక్కడ లభించే అనుభవం మాత్రం పక్కా పైసా వసూల్ అనిపిస్తుంది.ఈ సుదీర్ఘ ధ్రువ ప్రయాణానికి 5 రోజులు కేటాయిస్తే సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బడ్జెట్ అవుతుంది.హైదరాబాద్ నుంచి ఓస్లోకు ఫ్లైట్ టికెట్ను బట్టి 12 నుంచి 22 గంటల వరకు సమయం పడుతుంది. అప్ అండ్ డౌన్ టికెట్ ధరలు రూ.99 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉండొచ్చు.ఓస్లో నుంచి లాంగ్ఇయర్బైయెన్ కు ఫ్లైట్లో వెళ్తే వన్ వే జర్నీకి సుమారు రూ.45 వేల వరకు ఖర్చవుతుంది. టికెట్ ధరలు సీజన్ ను బట్టి మారొచ్చు.స్టే ఆప్షన్స్ విషయానికి వస్తే మీ బడ్జెట్ను బట్టి రూ.8 వేల నుంచి రూ.62 వేల వరకు కూడా హోటల్స్ లేదా లాడ్జ్లలో రూమ్స్ దొరికే అవకాశం ఉంది.ఫుడ్ అండ్ లోకల్ సఫారీ విషయానికి వస్తే డైలీ రూ.12 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ట్రిప్ కొనసాగించవచ్చు. అదే మీరు ఆర్కిటిక్ క్రూజ్లో ప్రయాణించాలి అనుకుంటే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది.కరెన్సీ తక్కువ..స్వాల్ బార్డ్ అధికారిక కరెన్సీ నార్వేజియన్ క్రోన్. కె.ఆర్ నగదు మొత్తానికి ముందు రాస్తారు. నగదు వాడకం చాలా తక్కువ. ఎక్కువ శాతం కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తారు. వీసా అవసరమా?భారతీయులకు స్వాల్బార్డ్ వెళ్లేందుకు సాధారణ నార్వే షెంజెన్ వీసా అవసరం అవుతుంది. నిజానికి స్వాల్బార్డ్ వెళ్లేందుకు ప్రత్యేక వీసా అవసరం లేదు. టెక్నికల్గా అది వీసా–ఫ్రీ జోన్.అయితే అక్కడికి వెళ్లాలంటే నార్వే మెయిన్ లాండ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ షెంజెన్ వీసా అవసరం అవుతుంది. అలాగే పాస్పోర్ట్ వ్యాలిడిటీ, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్స్ వంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం అవుతాయి.ఇక్కడ ఇచ్చిన ట్రావెల్ అండ్ బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు వివరాలు స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.ఇక్కడ రాత్రి లేకుండా సాగిపోయే సమయం, మనసులో వెలుగును మిగిల్చే ఒక అనుభవంగా మారుతుంది. స్వాల్బార్డ్ ఇది కేవలం ఒక ప్రదేశం కాదు ఒక అనుభూతి. ఆర్కిటిక్ సముద్రం మధ్యలో మంచు కొండల నడుమ మనుషుల హడావిడి లేని ఒక ప్రశాంతమైన ప్రపంచం. ప్రకృతి తన విశ్వరూపాన్ని ఎంత అందంగా చూపిస్తుందో ఇక్కడ మనం వీక్షించవచ్చు. ఇక్కడ సమయం అనేది ఒక నెంబర్ కాదు.. ఒక ఎమోషన్. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: వరుణుడు కోసం అగ్నిబాణాలు) -
అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?
వెనిస్ బినాలే (Venice Biennale) ప్రారంభోత్సవ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ స్టైలిష్ లుక్ విశేష ఆకర్షణగా నిలిస్తోంది. ఆడ్రీ హెప్బర్న్ - జాక్వెలిన్ కెన్నెడీల శైలిని అనుకరిస్తూ, గివెన్చీ రూపొందించిన టాగో చీర గౌనులో మెరిసారు రాధికా మర్చంట్వెనిస్ బినాలే ప్రారంభోత్సవ గాలాలో రిలయన్స్ అధినేత అంబానీ కోడలు, రిలయన్స్ వారసుడు వ్యాపారవేత్త అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ పాత-హాలీవుడ్ గ్లామర్ మేళవింపుతో ప్రత్యేకమైన గివెన్చీ కౌచర్ దుస్తుల్లో స్పెషల్ లుక్లో ఆకట్టుకున్నారు. ఒపెరా గ్లోవ్స్, వజ్రాలు, సున్నితమైన రెట్రో బ్యూటీ స్టైలింగ్తో కూడిన ఈ లేత నీలి రంగు దుస్తులు, ఐకానిక్ ఆడ్రీ హెప్బర్న్ సిల్హౌట్లను గుర్తుచేస్తూ, అతిపెద్ద ఫ్యాషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచాయి. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)stify"> ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను రాధికా మర్చంట్ 'ఆడ్రీ హెప్బర్న్' ఇన్స్పైర్డ్ లుక్ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గివెంచి (Givenchy) రూపొందించిన ప్రత్యేకమైన గౌన్లో ఆమె మెరిశారు. ఇది పౌడర్ బ్లూ (Powder blue) రంగులో భారతీయ చీర కట్టును (Saree drape) పోలి ఉండేలా ఆధునిక హొయలతో రూపొందించారు. ఒకప్పుడు దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ హ్యూబర్ట్ డి గివెన్చీ, లెజెండరీ నటి ఆడ్రీ హెప్బర్న్ కోసం రూపొందించిన ఐకానిక్ చీర తరహా గౌన్ల నుండి స్పూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ గౌన్కు మ్యాచింగ్గా 'ఒపెరా గ్లోవ్స్' ధరించారు. ఇది పాతకాలపు హాలీవుడ్ గ్లామర్ను గుర్తుకు తెచ్చింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే డైమండ్ రింగ్, మెరిసే ఆర్మ్ యాక్సెసరీతో తన లుక్ను మరింత రిచ్గా మార్చుకున్నారు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేమేకప్ , హెయిర్ స్టైల్వింగ్డ్ ఐలైనర్, గ్లోసీ న్యూడ్ లిప్స్,సున్నితమైన గ్లోయింగ్ స్కిన్తో 'సాఫ్ట్ గ్లామ్' మేకప్ను ఎంచుకున్నారు. రెట్రో స్టైల్లో ఉండే సాఫ్ట్ వేవ్స్ (Polished waves) ఆమె వింటేజ్ మూడ్కు సంపూర్ణంగా సరిపోయింది. పారిసియన్ ఎలిగెన్స్ మరియు భారతీయ సంప్రదాయ కట్టు కలబోతగా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతకాలపు హాలీవుడ్ స్టైల్ను ఆధునిక పద్ధతిలో ప్రదర్శించి రాధికా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
సమ్మర్ ట్రిప్స్లో ఈ కిట్ తప్పనిసరి!
సమ్మర్ వెకేషన్స్ అంటే మన తెలుగు వాళ్లకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్ స్టేషన్స్, జలపాతాలు, బీచ్ ట్రిప్స్, ఆలయాలు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న సీజన్ కాబట్టి చిన్ననాటి ఏమరపాటు అయినా మొత్తం ట్రిప్ను స్పాయిల్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, ఫ్యామిలీ టూర్స్, పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కిట్ అనేది తప్పనిసరి!చాలా మంది బట్టలు, చార్జర్స్, కెమెరా ప్యాక్ చేస్తారు కానీ ఎమర్జెన్సీకి పనికొచ్చే వస్తువులు మర్చిపోతారు. కానీ మన జర్నీలో ఈ కిట్ ఒక సూపర్ హీరోలా అవసర సమయంలో ఆదుకుంటుంది అని చాలా మందికి తెలియదు. ప్రయాణంలో అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడేందుకు మీ వద్ద ఈ కిట్ మెయింటేన్ చేయడం మరవకండి.ఎమర్జెన్సీ కిట్లో ఏముండాలి?ఈ ఎమర్జెన్సీ కిట్లో తప్పకుండా స్పేర్గా ఒక వాటర్ బాటిల్, కొన్ని ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య. అందుకే రీయూజబుల్ బాటిల్తో ΄ాటు ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ క్యారీ చేయండి.బేసిక్ మెడిసిన్స్.. తలనొప్పి ట్యాబ్లెట్స్, ఫీవర్ మెడిసిన్, మోషన్ సిక్నెస్ ట్యాబ్లెట్స్, ఆసిడిటీ రెగ్యులేటర్ ట్యాబ్లెట్స్, బ్యాండ్ ఎయిడ్స్, యాంటిసెప్టిక్ క్రీమ్ తప్పకుండా ఉండాలి. పిల్లలతో వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఇవన్నీ తీసుకున్నాక అవసరమైతే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించడం మరవకండి!సన్స్క్రీన్, క్యాప్... మన తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పీఎఫ్ సన్స్క్రీన్, సన్గ్లాసెస్, క్యాప్ లేకపోతే వేడికి చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పవర్ బ్యాంక్ అండ్ టార్చ్ ... కొండప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు వెళ్తే చార్జింగ్ పేయింట్స్ లభించకపోవచ్చు. పవర్ బ్యాంక్, చిన్న టార్చ్ లైట్ చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ సమస్యలు సాధారణమే.వెట్ వైప్స్, శానిటైజర్... రోడ్ ట్రిప్స్లో హైజీన్ మెయింటేన్ చేయడానికి వెట్ వైప్స్ చాలా ఉపయోగపడతాయి. శానిటైజర్ మీ బ్యాగ్లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.చిరుతిళ్లు ... బిస్కిట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ బార్స్ లాంటి స్నాక్స్ క్యారీ చేయడం మరవకండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎండాకాలం రోడ్ ట్రిప్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఉదయం త్వరగా బయల్దేరి ఎండ పెరిగేలోపు ప్రయాణించండి. తరువాత సాయంత్రం సమయంలో ప్రయాణాన్ని కొనసాగించండి. ఇలా చేస్తే మీ ప్రయాణం మరింత కంఫర్టబుల్గా సాగుతుంది. (చదవండి: చిన్న నది.. పేద్ద కథ!) -
చిన్న నది.. పేద్ద కథ!
భారతదేశంలో నదులు అంటే ముందు గంగా, గోదావరి, కృష్ణా, బ్రహ్మపుత్ర లాంటి మహానదుల పేర్లే గుర్తొస్తాయి. కానీ మన దేశంలో ఉన్న అత్యంత చిన్న నది ఏంటో తెలుసా? ఈ ప్రశ్నకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. భౌగోళిక నిపుణులు, ట్రావెల్ గైడ్స్, కొన్ని జియోగ్రఫీ రిఫరెన్సుల ప్రకారం ఈ అత్యంత చిన్న నదుల్లో ఒకటిగా ఎక్కువగా వినిపించే పేరు ఆర్వారీ నది.ఆర్వారీ నది ఎక్కడుంది?రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో ప్రవహించే ఈ నది సుమారు 45 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని చెబుతారు. చివరకు ఇది సాహిబీ నదీ వ్యవస్థలో కలుస్తుంది. చిన్నదైనా ఈ నది పేరు మాత్రం జియోగ్రఫీ డిస్కషన్స్లో చాలాసార్లు వినిపిస్తుంది.అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇండియాలో ‘అఫీషియల్ షార్టెస్ట్ రివర్’ అంటూ ఫిక్స్డ్ నేషనల్ రికార్డు ఏమీ లేదు. కొందరు ఇంకొన్ని చిన్న నదుల పేర్లు కూడా ప్రస్తావిస్తారు. కానీ ఆర్వారీ నదిని ఈ జాబితాలో ముందుగా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నదికి స్పష్టమైన సోర్స్ టు ఎండ్ అంటే నది చివర అంతం.మాయం అయిన నది.. మళ్లీ ప్రవహించిన కథఒకప్పుడు ఈ నది పూర్తిగా ఎండిపోయి దాదాపు మాయం అయిందట. నేల చిట్లిపోయి, నీటి జాడ కూడా కనిపించని పరిస్థితి వచ్చిందని చెబుతారు. కానీ అక్కడి స్థానిక గ్రామస్థులు, నదీ సంరక్షణ సంఘాలు, ప్రకృతి ప్రేమికులు కలిసి నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. చెక్డ్యామ్లు, సంప్రదాయ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులతో ఈ నదికి మళ్లీ ప్రాణం పోశారు. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు ఆర్వారీ నది పునరుజ్జీవన కథను చాలా మంది ఉదాహరణగా చెబుతుంటారు.నిజానికి మన దేశంలో కేవలం వర్షాకాలంలోనే ప్రవహించే చిన్న వాగులు చాలా ఉంటాయి. కానీ వాటిని అధికారికంగా నదులుగా పరిగణించరు. ఆర్వారీ మాత్రం చిన్న నది అయినా, దాని వెనక ఉన్న మానవ ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. ఈ చిన్న నది మనకు చెప్పే విషయం ఒక్కటే ప్రకృతిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటే ప్రకృతి కూడా మనల్ని అంతే ప్రేమగా కాపాడుకుంటుంది. (చదవండి: ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..) -
జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..
జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్ నెక్స్ట్ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్లు, రిజెక్ట్లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్తక్కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్లో పూర్తి చేశాడు.ఆ తర్వాత అందరిలానే ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్ ట్యూటర్, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్. పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమేఅయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్ఈఈకి సన్నద్ధమయ్యాడు. అయితే అది కూడా రిజుల్కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్ వచ్చింది. దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్ని పూర్తి చేశాడు. ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్షిప్కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్మార్కట్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. గూగుల్లో జాబ్ కొట్టడం కోసం..ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్లో జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్లో జాబ్ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్, ఆఫర్ లెటర్ అందుకుంటావ్ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్ మూవీలోని ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. View this post on Instagram A post shared by Rijul (@rijulsinghmalik_) (చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!) -
బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
బిగ్ బాస్ ఫేమ్ మనీషా రాణి ముంబైలోని లగ్జరీ హౌస్ నెట్టింట సందడిగా మారింది. భారీ వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూం , విశాలమైన బాల్కనీతో ఉండే మనీషా రాణి "డ్రీమ్ హౌస్" విశేషాలపై ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. మే 1వ తేదీన మనీషా రాణి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా తన ప్రియమైన వారి సమక్షంలో, సాంప్రదాయ దుస్తుల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇనష్టాలో షేర్ చేశారు. పదండి ఆ వివరాలేంటో తెలుసు కుందాం.బిగ్ బాస్ OTT 2లో సెకండ్ రన్నరప్గా నిలిచిన మనీషా రాణి తన చలాకీతనం, మాట్లాడే శైలితో బాగా పాపులర్ అయింది. ఆమెకు ఇన్స్టా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఝలక్ దిఖ్లా జా 11 విజేతగా గుర్తింపు పొందిన మనీషా రాణి, ముంబైలో తన కలల ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 5 కోట్లు.ఇంటీరియర్, డిజైన్ఈ ఇల్లు ఆధునిక శైలిలో, విశాలమైన గదులతో ఉంటుంది. గోడలకు పాస్టెల్ రంగులు (Muted tones) ఉపయోగించారు, అక్కడక్కడా వైబ్రెంట్ రంగులతో ఇంటికి కొత్త లుక్తో ఆకర్షణీయంగా ఉంటుంది.లివింగ్ రూమ్ చాలా విశాలంగా, వెలుతురు వచ్చేలా ఉంటుంది. స్టైలిష్గా కనిపించడమే కాకుండా సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. ఈ గది ఆధునిక ఇంటీరియర్ డిజైన్లు,ట్రెండీ లైటింగ్ , గాలి ధారాళంగా వచ్చేలా క్రాస్-వెంటిలేషన్ సౌకర్యం ఉంది.వార్డ్ రోబ్ అది పెద్ద కిచెన్ దీని మరో ప్రత్యేకత. ప్యారలల్ లేఅవుట్తో మార్బుల్ ఫినిషింగ్ కౌంటర్లు , స్టైలిష్ క్యాబినెట్లతో వంటగదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తన దుస్తుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూమ్ను సిద్ధం చేసుకోవడం విశేషం. అందంగా, స్టైల్గా డిజైన్ చేయబడిన ఈ విశాలమైన వార్డ్రోబ్లో, బట్టలు, బూట్లు, యాక్సెసరీల కోసం చక్కగా అమర్చిన అరలు, చక్కటి స్టోరేజ్ ప్లేస్, విలాసవంతమైన ఏర్పాటు ఉన్నాయి. ఇది ఫ్యాషన్పై ఆమెకున్న ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ముంబై నగరాన్ని వీక్షించేలా పెద్ద బాల్కనీ, దానికి ఫ్లోర్-టు-సీలింగ్ కిటికీలు ఉండటంతో ఇల్లు మరింత లగ్జరీగా కనిపిస్తుంది ఫైనల్లీ తన కలనెరవేరింది అంటూ తన ఇంటిగృహప్రవేశ ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసిందీ ఈ బీహారీ చిన్నది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002) -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
నిరంత అలసట, జుట్టురాలడం ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..!
చాలామంది అలిసిపోడం, జుట్టు రాలడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కొందరిలో కీళ్ల నొప్పులు, నోటి పూతలు తరుచుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైకి సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు ఆ వ్యాధికి సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి సమస్యలు ఎక్కుగా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లోనే అధికం అని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..బాగా అలసిపోవడం, జుట్టురాలిపోవడం, తరుచుగా నోటిపూతలు, కీళ్ల నొప్పులు..ఒక వారానికి పైగా ఉండటం, లేదా మళ్లీ మళ్లీ అదేపనిగా ఈ సమస్యలు రావడం వంటివి జరిగితే అది లూపస్ వ్యాధికి సంకేతం కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే యువతులలో తరుచుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకుండానే ఉండిపోతోందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలతో మొదలవుతుందని అనుకుంటారు. కానీ ఇది నిరంతర అలసట, కీళ్ల నొప్పులు, కారణం తెలియని జుట్టు రాలడం, నోటి పూతలు, స్వల్ప జ్వరం, ఎండ తగిలిన దద్దుర్లు వంటి వాటితో ప్రారంభమవుతుందని అన్నారు. ఇది రోజువారి చిన్నపాటి సమస్యలతో పోలి ఉండటంతో చాలామంది యువతులు ఈ సమస్యలను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారని అంటున్నారు. ఎందుకు వస్తుందంటే..మహిళలు కెరీర్ని నిర్మించుకునే క్రమంలో గర్భధారణ ప్లాన్స్ వేసుకోవడం, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తుంటారు. అదీగాక కొందరు హర్మోన్ల మార్పులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్లలో ఈ లూపస్ వ్యాధి మరింత సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్స్ క్రోమోజోమ్లతో ముడిపడి ఉన్న రోగ నిరోధక సంబంధింత జన్యువుల కారణంగా పురుషుల కంటే మహిళలకు సహజంగానే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ బలమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు అది అతి చురుకుగా మారి పొరపాటున శరీరం సొంత కణజాలాలపై దాడి చేస్తుందట. దీన్నే లూపాస్ వ్యాధి అంటారట. ఇదొక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చాలామటుకు ఒకే కారకం వల్ల అరుదుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కోసారి ఈ క్రింది వాటి కలయిక వల్ల మరింత వేగవంతమవుతుందంటుననారు.జన్యుపరమైన సున్నితత్వంహార్మోన్ల మార్పులుసూర్యరశ్మికి గురవ్వడం(ఎండకు బహర్గతమవ్వడం)ఇన్ఫెక్షన్లుమానసిక లేదా శారీరక ఒత్తిడిలక్షణాలు:నిరంతర అలసటకీళ్ల నొప్పి లేదా వాపుజుట్టు రాలడంనోటి పూతలుస్వల్ప జ్వరంఎండ తగిలిన తర్వాత చర్మంపై దద్దుర్లుకండరాల నొప్పిమెదడు మసకబారడంకారణం తెలియని బలహీనతఈ లక్షణాలు ఒత్తిడి, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం వంటి వచ్చే సమస్యల్లా కనిపించడంతో చాలామంది మహిళలు తేలికగా తీసుకుంటారట. దాంతో తక్షణ వైద్య సహాయం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.లూపస్ కేవలం హార్మోన్ల వల్ల వచ్చే వ్యాధి కాదు, కానీ ఈస్ట్రోజెన్ రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది. జన్యుపరంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారిలో, ఆ అదనపు రోగనిరోధక ప్రేరణ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులులూపస్ని ప్రభావితం చేసేవి..ఋతుచక్రాలు, గర్భధారణ, ప్రసవానంతర కోలుకోవడం, గర్భనిరోధకం సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కొంతమంది రోగులలో లూపస్ తీవ్రతను ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో లూపస్పై కేర్ తీసుకుంటారట వైద్యులు. లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన పర్యవేక్షణ మరియు చికిత్సతో, లూపస్ ఉన్న చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండగలరని నిపుణులు నొక్కి చెబుతున్నారు.సకాలంలో చికిత్స తీసుకోకపోతే..కీళ్ళుచర్మంమూత్రపిండాలుఊపిరితిత్తులుగుండెనాడీ వ్యవస్థ తదితరాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలసట, జుట్టురాలడం, కీళ్లనొప్పులు, జ్వరం వంటివి తరుచుగా వస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది లేదా నివారించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
67 కిలోల నుంచి 53 కిలోలకు..! కానీ జంక్ఫుడ్కు నో చెప్పక్కర్లేదట..
బరువు తగ్గడం అనేది ఆరోగ్య స్పృహతో కూడిన ట్రెండ్గా మారింది. యువత కాదు పెద్దలు సైతం స్మార్ట్, హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చేతనైనంతలో కొద్దిపాటి వ్యాయామాలు, మితంగా భోజనం, చక్కటి జీవనశైలిని పాటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అంతేగాదు బరువు తగ్గడం భారం కాదు అనారోగ్యం బారిన నుంచే కాపాడుకునే రక్షణచర్యగా భావిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చేరిపోయారు. ఆమె కేవలం 12 కిలోలను బరువుని చాలా తేలికపాటి అలవాట్లతో తగ్గించుకుని శెభాష్ అనిపించుకున్నారు. కష్టంగా కాకుండా చిన్నచిన్నగా సాధ్యమై వాటినే ఎంచుకుని, పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ అని అంటున్నారామె. మరి అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.తక్షణ పరిష్కారాలపై ఆధారపడకుండా, సమతుల్య దినచర్యలు, ఆలోచనాత్మకమైన ఆహారం, శక్తి శిక్షణ, తగినంత నీరు తాగడం, నాణ్యమైన నిద్రపై దృష్టి పెట్టడమే బరువు తగ్గడానికి ఆదర్శవంతమైన మార్గం. అంతేగాదు కొలెస్ట్రాల్ని రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సాధారణ అలవాట్లతోనే తగ్గించుకోవచ్చని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సృష్టి కృష్ణన్. దీర్ఘకాలం హాయిగా చేయగలిగే చిన్నపాటి జీవనశైలి మార్పులతో 14 కిలోలకు పైగా తగ్గారామె.జంక్ ఫుడ్కు నో చెప్పకండి..వాట్ ఇదేంటి అనకండి. మనకు తినాలనిపించే వాటిని వద్దని కంట్రోల్ చేయడం వల్ల తెలియకుండానే అతిగా లాగించేస్తాం అంటోంది. అదే దాన్నే అణిచివేసే బదులు..జంక్ ఫుడ్ తినాలనిపించిన వెంటనే ఫటాఫట్ తినేయండి. ఆ తర్వాత అందుకు తగ్గట్టు వర్కౌట్లు, లేదా కేలరీ తగ్గించుకునే ప్రయత్నం చేయండని అంటోందామె.ప్రతిరోజు నడక..ప్రతిరోజూ నడవడం వల్ల కొవ్వు కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదివేల అడుగులు నడవాలని పెద్ద లక్ష్యాలు ఏమి అవసరం లేదు. కొన్ని రోజులు రెండు వేల అడుగులకుపైగా నడచేందుకు ప్రయత్నించండి చాలు. అది కూడా ఇష్టపూర్వకంగా చేయండని అంటోంది.రాత్రిపూట కార్బోహైడ్రేట్లు వద్దు..రాత్రి భోజనంలో అన్నం, రోటీకి బదులుగా గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ తినమని ఈ ఇన్ఫ్లుయెన్సర్ సిఫార్సు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఉదయం చాలా హాయిగా మేల్కోగలుగుతారు.నెమ్మదిగా తినండినెమ్మదిగా తినడం వల్ల మీ ప్రేగులు కడుపు నిండిన సంకేతాలను మెదడుకి అందిస్తాయి. తినడానికి 20-30 నిమిషాలు తీసుకోవడం ద్వారా జీవక్రియను సహజంగా మెరుగుపరుచుకోవచ్చు, ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనానికి ముందు నీళ్లు తాగండి..భోజనానికి సుమారు 30 నిమిషాల ముందు నీళ్ళు తాగడం వల్ల, కడుపు నిండిన భావన పెరిగి, కేలరీల వినియోగం తగ్గి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది.తరుచుగా బరువు చెక్చేయొద్దు..ప్రతిరోజూ బరువు చూసుకోవడం అనేది మిమ్మల్ని మరింత నిరాశపరుస్తుంటుంది. వారానికి ఒకసార లేదా అప్పుడప్పుడు చేస్తే మనసు ఉల్లాసంగా, హెల్దీగా ఉంటుంది.వేళకు నిద్రపోవడం..సరిగ్గా నిద్రపోకపోతే తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. ఏడు గంటల నిద్ర అన్నింటిని మార్చేస్తుందని అంటోంది.చీట్ మీల్ గురించి భయపడొద్దు..కొందరు తినాలనిపించినవి తొనేసి మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అనే మైండ్సెట్తో ఉంటుంటారు. ముందు ఆ ధోరణిని తీసేయండి. తప్పులేదు. ఒక్కోసారి జిహ్వచాపల్యం నియంత్రించడం కష్టమవ్వచ్చు. అందుకని నచ్చినవి హాయిగా తినండి. కానీ తినే ముదు కాస్త మితం అనుకోండి, ఒక వేళ్ల ఫుల్గా లాగించినా..అందుకు తగ్గట్టుగా ఆరోజు కేలరీలు తగ్గించే పనిపట్టండని అంటోందామె. ఈ చక్కటి జీవనశైలి మార్పులు ఆరోగ్య లక్ష్యాలను అంచలంచెలుగా అందుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయని అంటోంది. View this post on Instagram A post shared by Srishti Krishnan (@srishhhsaidwhat) గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


