Lifestyle
-
ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..
బరువు తగ్గడం అంటే స్ట్రిక్ట్ డైట్, కఠినతరమైన వ్యాయామాలు అనే భావిస్తారు. ఈ వెయిట్లాస్ జర్నీని భారం, అలసటతో కూడిన కష్టసాధ్యమైన సవాలుగా భావిస్తారు. దాంతో కొంత వరకు చేసి మధ్యలో స్వస్తి పలుకుతారు. ఫలితంగా అధిక బరువు తగ్గించుకోలేకపోతున్నాం అంటూ నిరాశనిస్ప్రుహలకు లోనవ్వుతుంటారు. ఆవిధంగా కంటే నిధానంగా శరీరం అలసటకు లోనవ్వకుండా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఆ నాలుగు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటోంది కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సులభంగా బరువు తగ్గడం ఎలాగో పంచుకున్నారు. బరువు తగ్గడం అంటే వీలైనంత తక్కువ తినడం, కాదు, అలసిపోయేంత వ్యాయామాలు చేయడం అస్సలు కాదని అంటోందామె. ఇక్కడ లక్ష్యం బరువు తగ్గడం ఒక్కటే కాదు..మొత్తం ఆరోగ్య శ్రేయస్సు అని గ్రహించమని చెబుతోంది. అందుకే సులభంగా ఇష్టపూర్వకంగా బరువు తగ్గమని పిలుపునిస్తోందామె. అలా చేసే..పొట్టిగా ఉండే తానే తొమ్మిదికేజీల వరకు తగ్గానని చెబుతోంది. తాను ఇది కఠినమైన డైటింగ్లు, తీవ్రతతో కూడిన వర్కౌట్లు చేయకుండానే సాధించానని చెబుతోంది. అందుకోసం ఈ నాలుగు రూల్స్ని పాటించానని వీడియోలో తెలిపారువెయిట్ ట్రైనింగ్కు ప్రాధాన్యత ఇవ్వడంసుల్లివన్ ప్రకారం, వర్కౌట్ తర్వాత అలసిపోతున్నాననే భావనను వెంబడించడం మానేసి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్పై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడే అతిపెద్ద మార్పు వచ్చింది. "కండరాలను పెంచుకోవడం తోటే ఆ టోన్డ్ లుక్ను ఇస్తుందని ఆమె వివరించారు.కండరాలను కాపాడుకోవడం వల్ల కాలక్రమేణా సన్నగా ఉండటం సులభం అవుతుందని, ఎందుకంటే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇవ్వడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుందని ఆ కంటెంట్ క్రియేటర్ తెలిపారు. ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ప్రయత్నించే బదులు, ఆమె బలంగా మారడంపై దృష్టి పెట్టారు.కేలరీల లోటును ఆపడంఆమె పోస్ట్లోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి ఆమె ఆహారం తీసుకునే విధానం. తాను కేలరీ లోటుని ఇష్టపడనన్నారు. ఎక్కువ కాలం కేలరీల లోటులో ఉండటం వల్ల ప్రజలు అలసిపోయినట్లు అనిపించి, వారి ఫలితాలను నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుందని అంటోంది. అందుకే తాను శరీరంలోని కొవ్వును కోల్పోయిన తర్వాత, ఆమె రివర్స్ డైటింగ్ విధానాన్ని అనుసరించానని, ప్రోటీన్ వినియోగాన్ని ఎక్కువగా ఉంచుతూ నెమ్మదిగా తన కేలరీల తీసుకోవడాన్ని పెంచుతానని చెప్పారు.వాకింగ్..తీవ్రమైన వర్కౌట్లు తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, సుల్లివన్ సాధారణ కదలికల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రోజువారీ నడకలు,తక్కువ-తీవ్రత గల కార్డియో తన శక్తి స్థాయిలను పెంచడానికి, ఆకలిని నియంత్రించడానికి, మొత్తం ఫిట్నెస్కు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయని అన్నారు. ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్ దినచర్యలపై ఆధారపడకుండా, ఆమె నడకను ఒక సాధారణ అలవాటుగా మార్చుకున్నారు.తరుచుగా వెయిట్ చెక్ చేయొద్దు..చాలా మంది వెయిట్ మిషన్పై చిన్న మార్పులను చూసి వెంటనే తాము కొవ్వు పెరిగామని అనుకుంటారు. బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతమాత్రాన కొవ్వు పెరగడం కాదని అంటున్నారామె. ఆమె ఇప్పుడు ఒక ఖచ్చితమైన సంఖ్యపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాని చెప్పారామె.ఇక్కడ సుల్లివన్ డేపర్ ప్రయాణం చిన్న, నిలకడైన అలవాట్లు దీర్ఘకాలంలో బరువు నిర్వహణను ఎంత సులభతరం చేస్తాయో తెలియజేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి..స్మార్ట్గా మారే ప్రయత్నం చేయండి మరి.. View this post on Instagram A post shared by sullivan draper (@sullivan.draper)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
hi నాన్న...
ఫీజు కోసం ఎద్దుని అమ్మి...కాలం వక్రిస్తే ఓడలు బళ్లవుతాయి అంటారు. ఆ మాట మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమి అకస్మాత్తుగా ఆవిరైపోతే..? బెదరకుండా పరిస్థితులకు బెదిరిపోకుండా మొండితనంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు మా నాన్న లక్షీనరసింహరావు. అది 1972 తీవ్రమైన కరువు..ఇంట్లో అమ్మతో పాటు నేను నా ఇధ్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఆకలి మంటలు మొదలయ్యాయి.వరి గింజ లేక వణుకు పుట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవదారు ఆకులు తినిపించి మా ్రపాణాలను కాపాడాడు మా నాన్న..పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయాన్ని చూసుకోవడం కాస్త సమయం ఉంటే మాతో గడపడం. రోజుకి 18 గంటలు పొలంలోనే గడిపేసిన రోజులు లెక్కలేనన్ని.. అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. మా చదువుల్ని మాన్పించలేదు. ఏది కావాలన్నా వెనకడుగు వేయలేదు.కాని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. కరువు పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు.. ఇంట్లో దమ్మిడీ లేని పరిస్థితి. చదువుకి ఇక స్వస్తి చెప్పినట్టేనని అనుకున్నా. కాని మా నాన్న చేసిన పనిని నేను జీవితంలో మరిచిపోలేను. అసలే కరువు పరిస్థితులు, అప్పు కూడా పుట్టని రోజులు, ఉన్నవే రెండు కాడెద్దులు..అందులో ఒక ఎద్దుని 370 రూపాయలకు అమ్మేశాడు మా నాన్న.. 170 పరీక్ష ఫీజు పోను మిగిలిన 200 రూపాయలతో మరొక బక్క ఎద్దుని కొన్నాడు.దాన్ని కాస్త మేపి కాడి దున్ని వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కాని వారం తిరక్కముందే అది కాస్తా చనిపోయింది. మా నాన్న ఆశ తిరగబడింది. అసహనం, అశక్తత ఆవహిస్తే ఏ మనిషైనా కుంగిపోక తప్పదు కాని మా నాన్న మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కష్టపడ్డాడు. పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు నేను నా తమ్ముళ్లు, చెల్లెలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రాణించినా, మా వంశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చినా అదంతా కష్టాలకు వెన్నుచూపని మా నాన్న గుండె చలవే. - జగపతిరావు విశ్రాంత అధ్యాపకులు, మహబూబ్నగర్ జిల్లా, తండ్రి లక్షీనరసింహారావుపచ్చ ఇంకు కలం సాకారమైంది!మా స్కూల్ హెడ్మాస్టర్ జేబులో ఓసారి పచ్చ ఇంకు పెన్ను చూసి మా నాన్న ఏదో ఒకరోజు నువ్వు కూడా అలాంటి పెన్ను జేబులో ఉంచుకునే స్థాయికి వెళ్లాలిరా అన్నాడు. ఆయన చదువుకోలేదు.. కాని ఆయన బిడ్డ మాత్రం అందరూ గౌరవించే స్థాయిలో ఉండాలన్నదే ఆయన ఆశ. అదే నాలో పట్టుదల రేకెత్తించింది. అహర్నిశలు శ్రమించేలా చేసింది.ఈ లక్షణం కూడా మా నాన్న భవనం వెంకటేశ్వర్లు నుంచి వచ్చిందే. అర ఎకరం భూమి మాత్రమే వారసత్వంగా వచ్చినా చెమటోడ్చి వ్యవసాయం చేసి 30 ఎకరాల ఆసామిగా మారాడు మా నాన్న. ఆయనే నాకు తొలి గురువు. 21 ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చేరినా, నాన్న చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి హోదాను పొందాను. మా నాన్న కలను సాకారం చేశాను. ఆయన సేవా గుణాన్ని స్పూర్తిగా తీసుకుని 24 లక్షల Ðð చ్చించి పాఠశాలను అభివృద్ధి చేశాను. - భవనం బద్రిరెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, వేటపాలెం, బాపట్ల, తండ్రి భవనం వెంకటేశ్వర్లు -
నరకలోకంలో... భూలోక ఎంట్రెన్స్ టెస్ట్ (బీ.ఈ.టీ)!
నరకలోకవాసులకు బీ.ఈ.టీ (భూలోక ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించారు. జూనియర్, సీనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో పాసైతే... భూలోకంలో కొంతకాలం పాటు సకల సౌకర్యాలు అనుభవించే అపురూప అవకాశం వస్తుంది. అందుకే... ఈ పరీక్ష అంటే అంత క్రేజ్! ఆ పరీక్షలో వచ్చిన రెండు కీలక ప్రశ్నలు...∙∙ ‘డియర్ నరకవాసీ, ఈ క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయుడి. మార్కులు: 10’అనగనగా ఒక అప్పారావు. ఇతడు ఒకరోజు ఊరి చివర చెరువు దగ్గర విషాదంగా కూర్చున్నాడు.దారిన పోయే దానయ్య...‘ఏమిటిరా అప్పీ....ఏడుస్తూ కూసున్నవు?’ అని అడిగాడు.‘ఈరోజు మా ఆవిడ బర్త్డే’ అన్నాడు అప్పారావు.‘మీ ఆవిడకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలిగానీ, ఇలా ఏడుస్తూ కూర్చుంటారా?’ అన్నాడు దానయ్య.‘ఇచ్చాను కదా!’ కోపంగా అన్నాడు అప్పారావు.‘ఏమిచ్చావు?’ అడిగాడు దానయ్య.‘చైన్ ఇచ్చాను. ఇచ్చానో లేదో చీపురు కట్ట అందుకొని ఇంట్లో నుంచి తరిమి కొట్టింది’ ఆవేదనగా అన్నాడు అప్పారావు.ప్రశ్న:∙ ‘బర్త్డే కానుకగా భార్యకు చైన్ కొనివ్వడం తప్పు కాదు కదా! మరెందుకు అప్పారావు భార్యకు అంత కోపం వచ్చింది?’∙∙ రెండో ప్రశ్న: మార్కులు: 15’అలా అయితే నాకు నరకమైనా స్వర్గమే’ అన్నాడు దేవడోస్.అతడు అలా అనడానికి కారణం ఏమిటో క్లుప్తంగా వివరించండి.∙∙ భూలోక ఎంట్రెన్స్ పరీక్షలో దబ్బనూరు అబ్బయ్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పై రెండు ప్రశ్నలకు అతడు రాసిన జవాబులు...∙మొదటి ప్రశ్నకు జవాబు:భార్య బర్త్డేకు అప్పారావు ఇచ్చింది గోల్డ్ చైన్ కాదు. కనీసం రోల్డ్ గోల్డ్ చైన్ కూడా కాదు. అతడు ఇచ్చింది సైకిల్ చైన్! అందుకే ఆమె అంత కోపం వచ్చింది.∙రెండో ప్రశ్నకు జవాబు:దేవడోస్ ప్రతిరోజులాగే లిక్కర్ షాప్ నుంచి ఫుల్బాటిల్ తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. అతడికి దారిలో ఒక పెద్దాయన ఎదురుపడి...‘ఏమయ్యా... రోజూ పీపాలకు పీపాలు తాగుతున్నావు. తాగిన వారు నరకానికి పోతారనే విషయం తెలియదా నీకు?’ అన్నాడు.‘నా సంగతి సరే, మందు అమ్మే పీపారావు నరకానికి వెళతాడా?’ అని అడిగాడు దేవ్డోస్.‘యస్’ అన్నాడు పెద్దాయన,‘బార్ ముందు చికెన్ కబాబులు, గుట్కా, సిగరెట్ ΄్యాకెట్లు అమ్మే శీనయ్య వెళతాడా?’ అని అడిగాడు దేవడోస్.‘యస్’ అన్నాడు డోస్.‘రోజూ నాకు మందు పార్టీలో కంపెనీ ఇచ్చే రమేష్, వెంకటేషం, రాజు కూడా వెళతారా?’ అని అడిగాడు దేవడోస్.‘యస్’ అన్నాడు పెద్దాయన.‘నేను నరకానికి వెళితే ఏం! నాకు ఇష్టమైన ఇంతమంది వ్యక్తులు నాతో ఉన్నప్పుడు అది నరకమైనా నాకు స్వర్గమే!’ అని బాటిల్ మూత తీశాడు దేవడోస్. – యాకుబ్ పాషా -
నా సరస్వతిరేఖ మా నాన్న!
మా నాన్న గోరటి నర్సింహ చిన్న రైతు. చెరువు శికం భూమి ఎకరా, భూదాన ఉద్యమం వల్ల వచ్చిన భూమి ఎకరా, పొత్తుల మాన్యం అర ఎకరా... ఆయన ఆస్తి. ఆ రెండున్నర ఎకరాల్లో సేద్యం చేసేవాడు. ఆ తర్వాత ఎప్పుడో కోమట్ల సలహాతో మరో మూడెకరాలు కొని ఐదున్నర ఎకరాల రైతు అయ్యాడు. మా నాన్న భూమమ్మకు కష్టం చేస్తూ బతికాడు. మా ఊర్లో బావులు తవ్వినప్పుడు తేమ కనపడితే అది నీటి జల కాదు మా నాన్న ఓడ్చిన చెమట అనుకునేవాణ్ణి. జొన్నలు, పల్లికాయలు... లేదంటే కుసుమ పంటలు అవి వేసి బతికాడు మా నాన్న. 1971లో పెద్ద కరువు వచ్చి ఊళ్లో పెద్ద పెద్ద ఇళ్లలోనే బియ్యపు గింజలు ఉండేవి కావు. కాని మా ఇంట్లో ఉండేవి. అంత పొదుపుగా బతికారు మా అమ్మ, నాన్న.మా నాన్న యక్షగాన కళాకారుడు. నాటకాలు వేసేవాడు. బడి చదువు లేకపోయినా నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకున్నాడు. శతక పద్యాలు చెప్పేవాడు. పోతన భాగవతం పలికేవాడు. హరిశ్చంద్రుడి వేషం వేశాడో లేదోగాని హరిశ్చంద్రుడి కంటే నైతికవర్తనుడు. ఆయన నోటిగుండా అబద్ధం పలికినట్టు నేను చూడలేదు. ఉందంటే ఉంది. లేదంటే లేదు. మా నాన్నను ఊళ్లో బహు చక్కని మనిషి అనేవారు. మట్టిలో నుంచి బయల్పడ్డ రంగనాథస్వామి విగ్రహంలా ఉండేది ఆయన రూపం. మితభాషి. ఆయన ఉన్నచోట ఉత్సాహం, ఆనందం ఉండేవి. సందర్భానుసారం హాస్యం పండేది.మా నాన్నకు అంబేద్కర్ తెలియదుగాని చదువు వల్ల బతుకు మారుతుందని తెలుసుకున్నాడు. పిల్లల్ని చదివించాలని పట్టుబడ్డాడు. మేమంతా స్కూలుకు పోతుంటే ఊళ్లో పెద్దలు ‘నువ్వెందుకు ఒక్కడివే కష్టపడతావు. చదువుకొని కొలువుచేసేదుందా. పిల్లల్ని చేతి కిందకు తీసుకో’ అనేవారు. కాని మా నాన్న చదివియ్యాల్సిందే అనుకున్నాడు. నాకు చదువు మీద ధ్యాస లేదు. మా ఊరు (నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామం)లో తల్లిదండ్రులతో, బంధువుల మధ్య, పశువులు కాచుకుంటూ హాయిగా ఉండాలని ఉండేది. మా ఊళ్లో మూడో క్లాసు దాకానే స్కూలు ఉంటే దుందుభికి అవతలి వైపు రఘుపతిపేట్కు వెళ్లి హాస్టల్లో చేరాలంటే ఏదో విదేశానికి వెళ్లినట్టు ఉండేది. అక్కడకు వెళ్లి హాస్టల్లో చేరి, అర్ధరాత్రిళ్లు దెయ్యాలుంటాయనే నెపం పెట్టి ఏడుస్తుంటే మా నాన్న సాయంత్రం మాఊరి నుంచి రఘుపతిపేట్లోని మా హాస్టల్కు వచ్చి నాకు తోడు పడుకుని మళ్లీ ఉదయాన్నే ఊరికి వెళ్లేవాడు. మమ్మల్ని ఏనాడూ కొట్టింది తిట్టింది లేదు. చలం బిడ్డల శిక్షణ చదవకనే పిల్లల్ని ఎలా పెంచాడో తెలుసుకున్నవాడు. తాను, అమ్మ ముతకబియ్యం తిని మేం హాస్టల్ నుంచి వచ్చినప్పుడు సన్నబియ్యం వండి పెట్టేవారు.నా చిన్నప్పుడు మా ఊరికి ఒక కాశీ బ్రాహ్మణుడు వచ్చి అందరికీ చేయి చూసి ఫలానా ఫలానా అని చెప్పి మా నాన్న చేయి చూశాడు. మా నాన్నతో ‘నీ కొడుకు వెయ్యి రూపాయిల జీతగాడవుతాడు’ అని చెప్పాడు. ఊళ్లో అందరూ పరాచికాలాడారు ఆ మాటకు అయ్యేదా చచ్చేదా అని. మా నాన్న మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆయన చదివిస్తే ఎం.ఏ. వరకూ చదివాక నాకు ఉద్యోగం వచ్చింది. జోస్యంలో చెప్పినట్టు వేల జీతం వచ్చింది. మా నాన్న నా ఉద్యోగం చూశాడు. ఎదుగుదల చూశాడు. ఆయన వల్ల నాకు అబ్బిన పద్యం, పాట, గాత్రంతో నేను ఉనికిలోకి రావడం చూశాడు. నేను 49వ ఏట ఉండగా నన్ను విడిచి వెళ్లాడు.ఇప్పటికీ ఆయన ముద్ద ముద్దకూ గుర్తుకు వస్తాడు. ఆనందంలో, దుఃఖంలో, ఆలోచనలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నట్టే ఉంటాడు. నీడ వలే కాపాడుతూనే ఉన్నాడు. ఆయన నాకు దివ్యరూపం. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మార్గం చూపుతూనే ఉన్నాడు. మా నాన్న చదువు చెప్పించి నా జీవితాన్ని తీర్చిదిద్దినవాడు. ఆయనే నా చేతిలోని సిసలైన సరస్వతిరేఖ. – గోరటి వెంకన్న కవి, వాగ్గేయకారుడు -
పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం ఉన్నట్లా..?
పెళ్లైతే పిల్లల్ని కనాల్సిందేనా అనే అంశంపై ఓ 63 ఏళ్ల వ్యక్తి చాలా ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి అవగానే పిల్లలు కనాలని అందరూ చెబుతుంటారు..కానీ ఇది అందరికీ సరిపడే అంశం కాదంటాడు 63 ఏళ్ల కె.ఎఫ్. ఆయన విలియం రోసీ అనే ఇన్ఫ్లుయెన్సర్తో జరిపిన సంభాషణలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. భార్యభర్తలు పిల్లల్ని కంటే సరిపోదు, దానితోపాటే వచ్చే అపారమైన బాధ్యతను గురించి ఎవ్వరూ ఆలోచించరు, చెప్పరు. అందువల్ల పేరెంట్స్గా విఫలమవుతున్నారని అన్నారు కె.ఎఫ్. ముప్పైళ్ల దాంపత్య జీవితంలో తాను తను భార్య ఎంతో సంతోషంగా గడిపామని చెప్పుకొచ్చారు. అయితే తాము ఎప్పుడూ పిల్లలను కనాలని అనుకోలేదని తెలిపాడు. తాము ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి తల్లిదండ్రులుగా ఉండగలం అనుకుంటేనే పిల్లలను కనాలని అన్నారు. ముందుగా పిల్లలకు జీవితంలోని సవాళ్లు, వాస్తవాలు గురించి నేర్పించాలి, కానీ తల్లిదండ్రులు భౌతిక సంపాదనపైనే దృష్టిపెడుతున్నారని, అందుకే విఫలమవుతున్నారని అన్నారు. పిల్లల్ని కనడం అంటే.. మంచి ప్రయోజకులుగా తీర్చిద్దిదే బహృత్కార్యంగా అభిర్ణించాడు. అంతేగాదు పిల్లల్నలి పెంచిన విధానమే తల్లిదండ్రుల్ని ప్రతిబింబిస్తుందన్నారు. అలాxo పిల్లలతో పేరెంట్స్ ప్రవర్తించే తీరుని కూడా తప్పుపట్టారు. నాకు లేని సౌకర్యాలు ఇస్తున్నా అనేది చెప్పొద్దు..అవసరానికి మించి డబ్బు ఇవ్వొద్దు, ఇతరుల పట్ల గౌరవంగా మెలిగేలా పెంచండి చాలు అని అన్నాడు. అలా పెంచలేను అనుకుంటే కనొద్దని పరోక్షంగా చెప్పాడు. అలాగే తమ 30 ఏళ్ల వైవాహిక బంధం గురించి కూడా మాట్లాడారు. ఒకరిపట్ల ఒకరికున్న నమ్మకం, నిబద్ధతతే ఇన్నేళ్లు ఇంతలా కలిసిసాగామని అన్నారు. రోజుకు కనీసం ఒక్కసారైన తనను నవ్వించాలి అనుకుంటా..ఇప్పటికీ ఇంద్దరం ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉంటామని అన్నారు. నెటిజన్లు పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం కాదని చెప్పిన తీరు బాగుందని అన్నారు. అలాగే భార్య నవ్వుతూ ఉండేలా చేస్తానన్న మాట బట్టే అతడేంటో తెలుస్తోందంటూ అభినందించారు. పిల్లలను సరిగా పెంచలేకపోవడం కంటే కనకపోవడమే మేలు అన్న ఆయన మాటలకు మద్దతిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: ‘కంపెనీని నిర్మించాను, మారథాన్ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..) -
60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ
ప్రేమలో పడటానికి, ఆత్మీయ నేస్తాన్ని మనసారా జీవితంలోకి ఆహ్వానించడానికి వయసుతో పనేముంది. కొందరు తమ ఇరవైలలోనే తమ సోల్మేట్ను కలుసుకుంటారు. మరికొందరు నిజమైన తోడు కోసం దశాబ్దాల తరబడి వేచి ఉంటారు. కానీ అరవై ఏళ్ల వయసులో అంటే ఎవ్వరూ ఊహించరు కదా. ప్రఖ్యాత నటి సుహాసిని ములేది 60లలో కూడా ప్రేమ దొరుకుతుందని నిరూపించారు. సుహానా సఫర్తో ఇటీవల జరిగిన సంభాషణలో, జాతీయ అవార్డు గ్రహీత సుహాసినీ 60 ఏళ్ల వయసులో తన పెళ్లి గురించి గుర్తుచేసుకున్నారు.“నేను 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పటివరకు నాకు సరైన జోడి దొరకలేదు. నా భర్త చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి,” అని తన భర్త గురించి ములే చెప్పుకొచ్చారు. లగాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలలో అద్భుత నటనతో ఆకట్టుకుని, అనేక సినిమాల్లో రాణించిన సుహాసిని, ఇక తానెప్పటికీ పెళ్లి చేసుకోలేనేమో ఒంటరిగానే ఉండిపోతానేమే అనుకునేవారట. కానీ విధి మరోలా ఉంది.పేట్ మార్చిన ఫేస్బుక్ మెసేజ్ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా, ఫేస్బుక్లో అనుకోకుండా లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్ట్ (LHC) భౌతిక శాస్త్రవేత్త (Physicist) అతుల్ గుర్తు ప్రొఫైల్ రికమండేషన్ కనిపించింది. అరే..భౌతిక శాస్త్రవేత్తలుకూడా ఫేస్బుక్లో ఉన్నారా?’ అనుకున్నారు. తనకు ఎప్పటినుంచో సైన్స్ అంటే ఆసక్తి ఉండటంతో, ఇంకొంచెంఇంట్రస్టింగ్గా అనిపించింది. ‘LHC అంటే ఏంటి?’ అని ఒక మెసేజ్ పంపారు. అంతే అదే ఆమె జీవితాన్ని అందమైన మలుపు తిప్పింది. ఒక్క మెసేజ్వయసు వ్యత్యాసాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారిద్దరూ అనేకసార్లు మాట్లాడుకున్నారు. అయితే ఒకరోజు అతుల్ ఆమెకు, "బంధాలను మనమే నిర్మించుకోవాలి; అవి ఆకాశం నుండి ఊడిపడవు" అన్నపుడు పట్ల పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది. అయితే, ఆమె నమ్మకాన్ని మరింత బలపరిచిన విషయం ఏమిటంటే, ఆయన తన మొదటి భార్య గురించి రాసిన ఒక వ్యాసం. క్యాన్సర్ బారిన పడ్డ తన భార్య చనిపోయేలోపు ఆమె కోరుకున్న కోరికలన్నీ తీర్చారు. అంతేకాకుండా, ఆమెను సంతోషపెట్టేందుకే ఆమె అనారోగ్య సమస్యను ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఈ విషయం సుహాసిని దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమె హృదయాన్ని కూడా తాకింది.అలా కొన్ని రోజులు ఆన్లైన్లో మాట్లాడుకున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ చివరిలో ముఖాముఖి కలుసుకున్నారు. అలాగే గుర్తును కలిసి, మాట్లాడిన తర్వాత, తన కూతురు సరైన ఎంపిక చేసుకుందని ఆమె తల్లికి నమ్మకం కలిగిందట. అలా సుమారు 75 రోజుల తర్వాత, కుటుంబం అంగీకారంతో 2011 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఎంత అసాధారణంగా ఉందంటే, పెళ్లి రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయారట. అయితే తన యవ్వనంలో పెళ్లి చేసుకోనందుకు ఎదుర్కొన్న విమర్శల మాదిరిగానే, 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట. జీవితంలో ఆలస్యంగా ప్రేమను కనుగొనడం తాను పొందిన అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందంటారు సుహాసిని. సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయో, వయసు పెరుగుతోందనో ఏవరో చెప్పారనో జీవితంలో అతి ముఖ్యమైన సంబంధంలోకి జారిపోకుండా, నిజాయితీగా ఇరు మనసులు కలిసిన నిష్కల్మషమైన ప్రేమే మిన్న అని చాటి చెప్పారు. ఎవరీ సుహాసినీ ములేసుహాసిని ములే హిందీ, మరాఠీ, అస్సామీ చిత్రాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్లో నటించారు. నటనతో పాటు, ఆమె డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో, ఆమె మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. సుహాసిని ములే 1950 నవంబర్ 20న బిహార్లోని పాట్నాలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించారు. 1965లో, పియర్స్ సబ్బు ప్రకటన కోసం సుహాసిని ములే మోడల్గా ఎంపికయ్యారు. ఈ ప్రకటనను చూసిన తర్వాత, ప్రముఖ చిత్ర దర్శకుడు మృణాల్ సేన్ తన చిత్రం భువన్ షోమ్ (1969)లో ఆమెకు ఒక పాత్రను అందించారు.అలా మొదలైన ఆమె నటనా ప్రస్తానం ఎన్నో విజయవంతమైన పాత్రలు, అవార్డులు, రివార్డులతో అద్వితీయంగా సాగింది. -
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!. గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్ఫుల్నెస్తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు. హఠ యోగా అంటే..హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట. అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు. కలిగే ఉపయోగాలు..ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్పెట్టే గొప్ప సాధనవర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది. ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా. ధ్యానానిక పునాదిగా మారుతుంది. ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్నెస్ ట్రెండ్కి మించిందని చెబుతుండటం విశేషం. -
90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..
ఇవాళ ఫ్యాషన్ రంగం ఏ రేంజ్లో ట్రెండ్స్ని సృష్టిస్తూ..లేటెస్ట్ డిజైనర్వేర్లను తీసుకోస్తుందో తెలిసిందే. యువత సైతం వాటిని అనుకరిస్తూ..సోషల్ మాధ్యమాల్లో సరికొత్తట్రెండ్ని సృష్టిస్తున్నారు కూడా. ఇవాళ ఫ్యాషన్ ప్రమాణాలు ఏ రేంజ్లో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ..కుప్పలకొద్ది డిజైనర్లు, క్రియేటివిటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ 90వ దశకంలో పరిస్థితి వేరు. అప్పట్లో దేశం తన మూలాలకు కట్టుబడి ఉంటూనే..అంతర్జాతీయ శైలిని అందిపుచ్చుకుని గ్లోబల్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అందువల్ల ఆ సమయంలో గ్లామర్ ప్రపంచం అందర్నీ ఆకర్షించడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా ఉండేది. అయితే అప్పటి ఫ్యాషన్ దిగ్గజాలు ఆ సవాలుని చాలా సర్థవంతంగా ఎదుర్కొన్నారు. వారిలో మన టాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరీ శ్రీదేవి ఒకరు. అవును ఆ నాడు ఫ్యాషన్ నెమ్మదిగా పురుడు పోసుకుంటున్న సమయంలోనే ఆమె అతిపెద్ద సాహసం చేశారు. కానీ ఇవాళ ఆ స్టైల్ ట్రెండీగా మారింది. ఆ కాలంలోనే శ్రీదేవి ఆ ట్రెండ్ని సెట్ చేసిన ఘనత అందుకుందామె. ఏంటో ఫ్యాషన్ స్టైల్, దాని విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అందుకు సంబంధించిన విషయాలను డిజైనర్ నీతా లుల్లా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. శ్రీదేవి 1993లో వచ్చిన గోవింద మూవీ కోసం మెటాలిక్ హుడెడ్ డ్రెస్ ధరించారు. అది ఇవాళ సర్వసాధారణం. కానీ 90లలో ఫ్యాషన్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన స్టైల్ ఇది. ఆ దుస్తులను ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా రూపొందించారు. దీన్ని మెటల్ మెష్తో (లోహాపు వల వంటి నిర్మాణంతో) ఒకే లైనింగ్ దీనిని తయారు చేయడం విశేషం. దీని డిజైనింగ్లో ఇదే ప్రత్యేకతని అన్నారు. అందువల్లే తాను ఆ మూవీ షూటింగ్ కోసం చిన్నబ్యాగులో హైదరాబాద్కి తీసుకురాగలిగానని అన్నారామె. అయితే ఎయిర్పోర్ట్లో చూడటానికి చిన్న బ్యాగు..కానీ ఏకంగా 25 గ్రాముల బరువు ఎందుకు తూగుతుందని ఎయిర్పోర్టు అధికారులు అడిగారు. అప్పుడు వారికి ఆ డిజైనర్ వేర్ని ఓపెన్ చేసి..మెటల్తో తయారు చేయడం వల్ల ఇంత బరువు తూగుతోందని వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ నాటి సంఘటననను గుర్తు చేసుకున్నారు లుల్లా. ఇదొక్కటే కాదు ఆమో మరో మెటాలిక్ దుస్తులను అప్పట్లోనే ధరించి అప్సరసలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారని ఆ సంఘటననకు కూడా ప్రస్తావించారు. బాలీవుడ్ మూవీ "మిస్టర్ ఇండియా"లో 'హవా హవాయి' పాటలో ఆమె ధరించిన బంగారు వర్ణపు, దుస్తులు అప్సరసను తలపించేలా లుక్ని అందించింది. కేటీ కట్రాక్ రూపొందించిన ఈ దుస్తులలో ప్రత్యేకమైన ఆకృతినిచ్చే టాజిల్స్, కదలికకు అనుగుణంగా ఉండే పూసల పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే తలపై ధరించిన అలంకారప్రాయమైన, మెరిసే శిరోభూషణం (headpiece) మరింత హైలెట్గా కనిపించింది. ఇప్పుడు అదేస్టైల్ 2022లో అమెరికా బ్యూటీ మొగల్ కైలీ జెన్నర్ అచ్చలం అలానే మెడ, తల చుట్టూ హుడ్లాగా చుట్టుకుని మెరిసే సిల్వర్ మెటాలిక్ దుస్తులను ధరించారు. అక్కడ ఫెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ వింటేజ్ పాకో రబానీ ఈ డిజైనర్వేర్ని డ్యూయల్-టోన్డ్ డెనిమ్స్తో సింపుల్ స్టైలింగ్ను జతచేశారు. ఈ ఇద్దరు అందాల తారల మధ్య అద్భుతమైన పోలిక కనిపిస్తున్నప్పటికీ..ఆమె స్టైలిస్ట్ ఈ లుక్ని శ్రీదేవి లుక్తో పోల్చలేదు కానీ..దశాబ్దాలక్రితమే ఈ స్టైల్ ట్రెండ్ని సెట్ చేశారనేది నమ్మక తప్పని నిజం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. View this post on Instagram A post shared by Neeta Lulla (@neeta_lulla) (చదవండి: పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!
సాధారణంగా బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ పీసీఓఎస్ అంటే అంత సులభం కాదు బరువు తగ్గడం. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ జస్ట్ రెండు నెల్లలోనే ఏకంగా తొమ్మిది కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం తానే ఏం చేసింది? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యిందో షేర్ చేసుకుంది. మరి అవేంటో చూద్దామా..!.పీసీఓఎస్తో బరువు తగ్గడం అనేది అసంభవం అనిపించే సవాలులా ఉంటుంది. పైగా అందరికీ ఈ సమస్య ఒకేలా ఉండదు. అలాగే అందరికీ సరిపోయే డైటింగ్, వ్యాయామాలు ఉండవు. అలాంటిది కంటెంట్ క్రియేటర్ తాన్య మాత్రం పీసీఎస్ని ఆరోగ్యవంతంగా నిర్వహించుకుంటూనే బరువు తగ్గిందామె. పైగా ఎలాంటి కఠినమైన ఆహార నియామాలు, తీవ్రమైన వ్యాయమాల జోలికి పోకుండా నిలకడగా జీవనశైలి మార్పులను పాటించానని అంటోంది. అంతేగాదు తాను ఎలా బరువు తగ్గిందో కూడా షేర్ చేసుకున్నారామె. ఆమె కేవలం రెండు నెలల్లో 75 కిలోల నుంచి 66 కిలోలు అంటే మొత్తం 9 కిలోలు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇలా పీసీఓఎస్తో బరువు తగ్గే ప్రయత్నంలో తాను ఆ ఐదు తప్పిదాలను చేయకుండా జాగ్రత్తపడ్డానని అంటోంది. అందువల్ల ఇంత సులభంగా బరువు తగ్గానని పంచుకుంది. చేయకూడని తప్పిదాలు..అల్పాహారం మానేయడంతాన్య ప్రకారం, అల్పాహారం మానేయడం తాను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి. చాలా కాలం పాటు, తక్కువ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతానని నమ్మేదాన్ని అంటోంది. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాక పరిస్థితులు మారాయని వెల్లడించింది.అంతులేని కార్డియో చేయడంగంటల తరబడి కార్డియో చేయడమే బరువు తగ్గడానికి కీలకం అని చాలా మంది అనుకుంటారు. తాన్య దీనితో ఏకీభవించదు. అంతులేని కార్డియో సెషన్లతో తనను తాను బలవంతం చేసుకోవడం కంటే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రమం తప్పకుండా నడవడం తనకు చాలా బాగా పనిచేశాయని ఆమె చెప్పింది.ఆహారానికి భయపడటంతాను వదిలేసిన మరో అలవాటు ఆహారాన్ని శత్రువులా చూడటం అని చెబుతోంది తాన్య. PCOS ఉన్నంత మాత్రాన పస్తులుండటం లేదా క్రాష్ డైట్లపై ఆధారపడటం కానేకాదని అంటోందామె. బదులుగా ప్రోటీన్తో కూడిన సరైన భోజనమే ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది.పానీయాల ద్వారా కేలరీలు తీసుకోవడంచక్కెర పానీయాలలో దాగి ఉన్న కేలరీల గురించి కూడా తాన్య ప్రస్తావించింది. ఫ్యాన్సీ కాఫీ డ్రింక్స్ నుంచి ప్యాకేజ్డ్ జ్యూస్ల వరకు, ఈ పానీయాలు కడుపు నిండినట్లు అనిపించకుండానే అదనపు కేలరీలను చేర్చగలవు. ఇలాంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయని, PCOS ఉన్న చాలా మంది మహిళలు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నించరని అన్నారామె.అనారోగ్యకరమైన అలవాట్లను తేలిగ్గా తీసుకోవడంకొందరు అనారోగ్యకరమైన అలవాట్లని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఏదో అప్పడప్పుడూ అంటూ ఆ అలవాట్లకు దూరంగా ఉండరు. ఇక్కడ కేవలం తన రూపానికి సంబంధించి కాదు బరువు తగ్గడం, ఇది తన మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి సంబంధించింది అని భావించి ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటోంది తాన్య. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకునే యత్రం చేయాలి. ఇది కేవలం రూపం కోసం కాదు భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పీసీఓఎస్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి అన్న దృక్పథంతో జాగుకరకతతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..సత్ఫలితాలను అందుకోగలమని అంటోంది. అందుకోసం తీవ్రమైన ఆహార నియమాలు లేదా కఠినమైన వ్యాయామాలు కంటే నిలకడగా పాటించే అలవాట్లు, సమతుల్య భోజనం, శక్తినిచ్చే శిక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి మంచి మార్పుని తీసుకొస్తాయని నమ్మకంగా చెబుతోంది కంటెంట్ క్రియేటర్ తాన్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Tanya (@tanyabackstage) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
శతక నీతి: త్యాగం!
పిల్లల పెంపకంలో తల్లితండ్రులకు ఓపిక, సహనంతోబాటు ఎంతో త్యాగగుణం.. తాము పస్తులుండి పిల్లలను పెంచే తల్లిదండ్రుల సహజగుణం త్యాగమే.. దేశసేవలోప్రాణాలను ఫణంగా పెట్టి తెగించి త్యాగం చేసే సైనికుల త్యాగం నిస్వార్ధబుద్ధికి మరో ఉదాహరణ...వేమన త్యాగాన్ని ‘వివేకంతో కూడిన దానం’గా పరిగణిస్తాడు..‘తనకు గలదెల్ల ఇతరలకు దానమిచ్చుత్యాగియగు వాడు భువికి దైవమగును సుమ్ము’...అంటాడు.. తన దగ్గర ఉన్నదంతా దానం చేసే వ్యక్తి ‘దేవుడ’ట... దీన్ని బట్టి త్యాగం చేసే వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమో ఆలోచించండి.. దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలూ ఆశించకూడదు. అందుకే గుప్తదానం అంటారు.. తనకున్న దానిలోంచి కొంత ఇవ్వడం దానం అయితే పూర్తిగా వదులుకోవడం త్యాగం అని అనవచ్చు.. తన ఆస్తిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పరులకోసం వదులుకోవడం త్యాగం అవుతుంది.సుమతీ శతకంలో...‘కష్టకాలమందు సహాయము చేయువాడుత్యాగియని బుధులు పొగుడుదురు కదరా సుమతీ’...అటుపక్క వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తిని త్యాగి అని కొనియాడారు. పరోక్షంగా ‘విత్తము గలవాడు వితరణి చేయక, పొదుపు చేసినచో పురుగుగ పుట్టును’ అని శపించాడు, బద్దెన సుమతీ శతకంలో. వైరాగ్యకోణంలో భోగాలను, సుఖాలు, సిరిసంపదలను త్యాగం చేసి.. అంటే వదులుకుని ఆత్మజ్ఞానం పొందండని భర్తృహరి సలహా.. ‘భోగేరోగభయం కులే చ్యుతిభయం.. సర్వం వస్తుభయాన్వితం’.. అన్నీ భయమే, అందుకే వదులుకోండి అని ఉవాచ.నారాయణ శతకంలో, కుమార గిరి శతకంలో, దాశరథి శతకంలో దేవుడు కోసం త్యాగం చేయమంటారు..ధనత్యాగం, భోగత్యాగం, కక్ష, గర్వం, కోరికలు మొ... త్యాగం చేయటం చాలా గొప్ప... పురాణాల్లో కర్ణుడు, దధీచి, శిబి, బలి హరిశ్చంద్రుడు మొదలగు వారు ఉంటే కలియుగంలో ఎందరో మాతృమూర్తులు, సైనికులు, మహానుభావులు... ధనం,ప్రాణం త్యాగం చేసిన వారున్నారు.. వారికి నివాళులతో... – డా. కందాళ సత్యనారాయణమూర్తి -
సువార్త: చెయ్యెత్తి జైకొట్టే జైత్రయాత్ర
బాప్తిస్మమను దేవుని సంకల్పాన్ని పరిసయ్యులు నిరాకరిస్తూ వచ్చారు. యేసు దానికి లోబడ్డాడు. ‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తూ ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’ అంటూ యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు ఉత్తరమిస్తూ అతని ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. ఒడ్డుకు రాగానే ఆకాశం తెరువబడి దేవుని ఆత్మ పావురంవలె దిగి ఆయన మీదకు వచ్చాడు.‘ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అనే ఒక శబ్దము అది తండ్రియైన దేవుని స్వరము అనేలా ఆకాశము నుండి వచ్చింది. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ ప్రేరణ వలన అరణ్యమునకు త్రోసికొనిపోబడ్డాడు. నలుబది దినములు, రాత్రులు ఉపవాసం ఉంటూ అడవి మృగాల మధ్య గడిపాడు. యేసు ఆకలితో ఉన్న ఈ సమయాన అపవాది వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. యేసు ధీరుడిగా నిలబడి తలపడి ఆ శోధకుడను ఓడించాడు.చెయ్యెత్తి జైకొట్టాలనే యేసు జైత్రయాత్ర సరిగ్గా ఇక్కడనే మొదలైంది. యేసు శిశువుగా ఉన్నప్పుడే ఆయన జైత్రయాత్రను, అనేక ఒడిదుడుకులలో అంతటా అట్టి విజయాన్నే చూస్తామని కొందరు అంటారు గానీ ఇది దేవుని కాపుదల, సంరక్షణ. పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు, దేవుని రాజ్యాంగ చట్టనిపుణులు వంటివారు బాలుడిగా ఉన్న యేసు ఆనాడు బోధకులను సైతం ఆలోచనల్లో పడవేసిన విధానం గుర్తు చేసుకుంటారు. ఇలా యేసు బాల్యంలోనే ఆయనదైన జైత్రయాత్ర ప్రారంభమైందనేవారు లేకపోలేదు.ఆ వివరాలలోకి వెళితే – తన తల్లి మరియతో బాలుడిగా ఉన్న బాలయేసు ‘నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా?’ అన్నాడు. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు. ఆయన మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు విస్మయమొందుచున్నారు.మరల మనం మొదటికి వస్తే, సాతాను అనే శోధకుడు ఆకలితో ఉన్న యేసు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆపై కడుపారా తిని నీ ఆకలి తీర్చుకో అంటూ శోధించాడు. యేసు అతనికి ధీటుగా జవాబిచ్చాడు. ‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును’ అన్నది ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉందని చె΄్పాడు.అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి దేవాలయ శిఖరం మీద ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు. దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు వచ్చి నీ పాదములు రాతికి తగులకుండ నిన్ను తమ చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడింది అంటూ అపవాది యేసువలె వాక్య వచనంతో మాట్లాడాడు. అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొకచోట వ్రాయబడిఉన్నదని అపవాదికి చె΄్పాడు.మరల అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండ మీదకు ఆయనను తీసికొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటిని నీకు ఇచ్చెదను అంటూ ఆయనను మరీమరీ శోధించాడు. యేసు వానితో – సాతానా, ΄÷మ్ము ! ప్రభువైన నీ దేవునికి మ్రోక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. దీంతో అపవాది ఆయనను విడిచిపోయాడు.యేసు అంతటి ఆకలిలోను సాతాను శోధనలకు ఏమాత్రం లొంగలేదు. స్వకీయ మహిమను ఏనాడూ వెదకకుండా తన సొంత మాటలు, జ్ఞానంతో కాక, దేవుని వాక్యపుశక్తితో శత్రువైన సాతానును ధీటుగా ఎదుర్కొని ఎదిరించిన వైనం అమోఘం. ఇక్కడి నుండే యేసు జైత్రయాత్ర మొదలైందని చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ విజయయాత్ర సిలువ మరణం వరకు అప్రతిహతంగా కొనసాగింది. – జేతమ్ -
అంతఃశక్తి... అంతులేని బలం
జీవితం అనేది నిరంతరాయంగా సాగిపోయే ఒక ప్రవాహం. ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలడం సహజమే అయినా, నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్నపాటి కష్టాలకే నైరాశ్యంలో మునిగిపోతున్నారు. విజయాల కోసం, బాహ్య ప్రపంచంలో ఎవరో వస్తారని ఎదురుచూడటం కన్నా.. ప్రతి మనిషి తనలోని అపారమైన అంతర్గత శక్తులను గుర్తించడమే పరమార్థం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాలం కలిసిరానప్పుడు బాహ్య పరిస్థితులను నిందించడం మాని, ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మలచుకోవాలి. మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అవకాశాలుగా మార్చుకునే వివేకం లభిస్తుంది.ఈ అంతఃశక్తిని మేల్కొలిపి, జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మన మహర్షులు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా చంచలమైన మనస్సు ప్రశాంతతను ΄÷ంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టత వస్తుంది. దీనితో పాటు సద్గ్రంథ పఠనం బుద్ధిని వికసింపజేసి జీవన సత్యాలను బోధిస్తే.. సత్సంగం (మంచి వ్యక్తుల సహవాసం) మనలో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.సముద్రంలో అలలు ఎంత సహజమో, జీవితంలో కష్టాలూ అంతే సహజం. ఎడారిలో సైతం వేళ్లను లోతుగా పాతుకుని జీవాన్ని వెతుక్కునే మొక్కలా.. మనిషి తన ఆత్మబలాన్ని నమ్ముకుని, ప్రతి కొత్త రోజును ఒక అవకాశంగా భావించి విజయపథంలో ముందుకు సాగాలి. – పసుపులేటి వెంకటేశ్వరరావు -
కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?
ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
Hi నాన్న.. కష్టాల కొలిమిలో... నవ్వుల కలిమి
నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు. తెనాలి మసోడి షెడ్ మా నాన్న కొంజేటి వెంకటేశ్వర్లు ఆఫీస్. ఆయన నడిపే లారీతో పాటు ఆయన స్నేహితులు ఉండే చోటు కూడా అదే.ఎనిమిదేళ్లుంటాయ్ నాకప్పుడు. వర్షం పడ్డ కాసేపటికి నాన్న చేయి పట్టుకుని షెడ్డుకి వెళ్లా. మా నాన్న స్నేహితుడితో ‘‘ఒరేయ్ ఇవ్వాళ నీ డ్యూటీకి నేను వెళతాను. నా కూతురు పుట్టినరోజు వస్తోంది. దానికి ఏమైనా ఇవ్వడం మాట సరే కనీసం భోజనం..’’ దుఃఖం ఎక్కువైతే గొంతు మూగబోతుంది. నా తండ్రి గొంతు బరువుగా మాట్లాడిన ఆ క్షణం నాకింకా గుర్తుంది. అప్పటికే నాలుగు రోజులు డ్యూటీ చేసిన మనిషి. అయినా మళ్లీ స్నేహితుడి దగ్గర లారీ తాళం తీసుకుని, తెనాలి అంబమ్మ హోటల్ భోజనం కట్టించుకుని ఇంటికొచ్చాడు. అమ్మ వడ్డిస్తుంటే నేను గబగబా తింటున్నా. వాకిట్లో ఉన్న నాన్నని చూసి ‘నాన్నా! నువ్వు రావేం’ అన్నాను. భుజం మీదున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకుంటున్నాడు. అర్థం కాలేదు నాకు.. ఆ వయసులో ఆకలి మీదున్న దృష్టి మా నాన్న కళ్ల మీదకి పోలేదు..ఎర్ర పరికిణీ వేసుకుని స్కూలుకి వెళ్లడం, ఆపై కాలేజీ దాని తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇలా నా చుట్టూ అల్లిన జీవితపు మల్లెతోటలో ఆనందాన్ని మాత్రమే నింపిన ఆయన, తన జీవితంలోని కష్టాల ముళ్ల కంచెల్ని మాత్రం నాకు తెలియకుండా దాచేశాడు. తన స్నేహితులు ఆయన్ని సావిత్రి అంటూ పిలిచేవారు. సతీనాటకంలో సావిత్రి వేషంలో చాలా బాగా చేశాడని అలా అంటారంతా.. కాని మేం పెద్దవాళ్లవుతున్న కొద్దీ ఆయన నాటకాలకు దూరమయ్యాడు. మాకోసమే నాటకాలొద్దనుకున్నాడని, మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు తనొక్కపూటే తింటున్నాడని, ఆయన మాతో ఉన్నన్నినాళ్లూ తెలియలేదు. కష్టాల కొలిమిలో కాలుతున్నా నిలువెత్తు చిరునవ్వుకి చిరునామాగా నిలిచి నా ఎదుగుదలని చూడకుండానే వెళ్లిపోయావు నాన్నా!.. నీకంటూ మేమేమీ ఇవ్వలేకపోయినా.. నువ్విచ్చిన మొండిధైర్యం, పట్టుదల, శక్తి మాకు వరం.– సి. సుజాత, రచయిత్రి, జర్నలిస్ట్నిర్వహణ: శ్రావణ్ జయమీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ కింది నంబర్కు మెయిల్ లేదా వాట్సాప్ చేయండి. 9281020501, sakshifamily3@gmail.com -
ఏఐకి సిలబస్ తెలుసు! టీచర్కు నువ్వు తెలుసు!!
‘డియర్ చాట్ జిపిటి..... ఈ క్వశ్చన్ పరీక్షలో రాదు కదా?’ స్టూడెంట్ అడిగితే ఏఐ ‘రాదు’ అని ఊరుకుంటుంది. టీచర్ ‘పరీక్షలో రాకపోయినా జీవితంలో పనికొస్తుంది’ అంటుంది. ఏఐకి సిలబస్ తెలుసు. టీచర్కి నువ్వు తెలుసు. నీ సిల్లీ డౌట్లు, నీ కళ్లలో భయం, నీ గుండెల్లో ఆశ. ఏఐ ఆన్సర్ చెప్తే టీచర్ ఆలోచన నేర్పుతుంది. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.ఇంట్లో పిల్లలు హోంవర్క్ మొదలుపెట్టగానే మొదట అడిగే మాట ‘ఏఐలో కొట్టనా?’. కొట్టాక క్షణాల్లో ఆన్సర్ దొరుకుతుందటే బుర్రకు ఇక పని లేదు. తల్లిదండ్రులు కూడాప్రాజెక్ట్ కోసం ‘ఏఐని అడుగు’ అని ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఒక అనుమానం వస్తోంది. ఏఐ అన్నీ చెప్పేస్తుంటే ఇక స్కూల్, టీచర్ ఎందుకు అని. నిజమే, ఏఐ వేగంగా సమాచారం ఇస్తుంది. అర్ధరాత్రి అడిగినా విసుక్కోదు. కానీ చదువులో తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఆ రెండింటి మధ్య గ్యాప్ను పూడ్చేది టీచర్ మాత్రమే. ఏఐ యుగంలో టీచర్ పోలేదు. టీచర్ పాత్ర మారింది.టీచర్ కలిగించే స్పృహ‘ఆకు పచ్చగా ఎందుకు ఉంది?’ అని పిల్లాడు అడిగితే ఏఐ మూస పద్ధతి జవాబు చెప్తుంది. టీచర్ మాత్రం ‘నువ్వు అన్నం తింటే బలం వచ్చినట్టు, చెట్టు ఎండ తింటే ఆకు పచ్చగా అవుతుందిరా’ అంటారు. దీన్నే ‘కాన్సెప్టువల్ క్లారిటీ’ అంటారు. ఏఐ డేటా ఇస్తుంది. ఆ డేటాను జీవితానికి అన్వయించే వివేకం, విలువ, దృక్పథం టీచర్ మాత్రమే ఇవ్వగలరు. ఇది యంత్రానికి రాని మానవ స్పందన.టీచర్కు ‘క్లాస్రూమ్’ తెలుసుమంచి టీచర్ పాఠం చెప్తూనే పిల్లల ముఖాలు చదువుతారు. ఎవరి కళ్లలో కన్ఫ్యూజన్ ఉందో, ఎవరు అర్థం కాకపోయినా తల ఊపుతున్నారో పసిగడతారు. వెంటనే పాఠం ఆపి, ఉదాహరణ మార్చి, అవసరమైతే మాతృభాషలోకి దిగి చె΄్తారు. పిల్లాడి కంట్లో నీళ్లు చూస్తే సిలబస్ పక్కనబెట్టి ముందు ధైర్యం చె΄్తారు. ఏఐకి ఈ శక్తి లేదు. దానికి ఎమోషన్ తెలియదు. ఒక పద్ధతి ఫెయిల్ అయినా అందరికీ అదే పద్ధతి చూపిస్తుంది. కొత్త బ్యాచ్ వచ్చిన ప్రతిసారీ టీచర్కు మరింత అనుభవం పెరిగి ఉంటుంది. ఆ హృదయం, ఆ పరిశీలన ఏఐకి రాదు.‘పాస్’... ‘పర్సన్’చదువులో ముఖ్యమైనది మోటివేషన్. పిల్లలు సబ్జెక్ట్తో కాదు, సబ్జెక్ట్ చెప్పే మనిషితో కనెక్ట్ అవుతారు. ‘నువ్వు చేయగలవు’ అని ఏఐ చెప్పదు. టీచర్ చె΄్తారు. ఆ మాటే పిల్లాడిని ఫెయిల్యూర్ నుంచి లేపుతుంది. ఏఐ ఆన్సర్ ఇస్తుంది. టీచర్ ప్రశ్న అడిగే ధైర్యం ఇస్తారు. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. టీచర్ విలువలు నేర్పుతారు. క్యూరియాసిటీ వెలిగించడం, తప్పుచేస్తే సరిదిద్దడం, ఒత్తిడిలో ఉన్న పిల్లాడిని గుర్తించి దగ్గర తీసుకోవడం మనిషికే సాధ్యం. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.మనిషి గుర్తుఅసలు ప్రశ్న ‘టీచర్లు అవసరమా’ అని కాదు. ‘టీచింగ్లో మానవీయ స్పర్శ కాపాడుకుంటున్నామా’ అని. ఏఐ వచ్చింది కాబట్టి టీచర్ పని తగ్గలేదు. బాధ్యత పెరిగింది. ఇకపై టీచర్ క్యూరియాసిటీ వెలిగించే కాగడా. డేటా యుగంలో దారి చూపే దిక్సూచి. మీ పిల్లాడి ఫో¯Œ లో ఏఐ ఉండొచ్చు. కానీ వాడి లైఫ్లో ‘నా మేడం, నా సార్’ అనే ఒక మనిషి ఉండాలి. ఆ మనిషిని రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇంకా పుట్టలేదు. బడిగంట మోగింది. ఇక టీచర్ అసలు పాఠం మొదలు. కేస్ స్టడీ 1హైదరాబాద్లో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థి సైన్స్ప్రాజెక్ట్ కోసం ఏఐని.‘గ్లోబల్ వార్మింగ్ కారణాలు’ అడిగాడు. టైప్ చేయగానే ఐదు పాయింట్లు వచ్చాయి. యథాతథంగా చార్ట్ మీద రాసి తీసుకెళ్లాడు. క్లాస్లో టీచర్ ‘మన వీధిలో చెట్లు నరికితే ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?’ అని అడిగారు. పిల్లాడు మౌనం వహించాడు. ఏఐ ఇచ్చిన డేటాను తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అన్వయించలేక పోయాడు. ఆరోజు టీచర్ క్లాస్ మొత్తాన్ని బయటకు తీసుకెళ్లి ఎండలో సిమెంట్ రోడ్డు వేడి, చెట్టు నీడ చల్లదనం తెలిపి ఉష్ణోగ్రత తేడా ఫీల్ చేయించారు. ఏఐ ‘ఏంటి’ చెప్పింది. టీచర్ ‘ఎందుకు’ అనుభవంలోకి తెచ్చారు.కేస్ స్టడీ 2ఓ ఇంటర్ విద్యార్థిని లెక్కల్లో బలహీనం. ట్యూషన్ చేరి అడిగితే ‘సిల్లీ డౌట్’ అని కోప్పడతారేమోనని భయం. దాంతో ఏఐతోప్రాక్టీస్ మొదలుపెట్టింది. సమాధానాలు వచ్చాయి. కానీ పరీక్షలో అదే మోడల్ మార్చి ఇస్తే తడబడింది. కారణం ఏఐ ఆమె భయాన్ని గుర్తించలేదు. కాలేజీలో లెక్కల మేడం ఆమె ముఖం చూసి విషయం కనిపెట్టారు. ‘నీకు కాన్సెప్ట్ రావాలి’ అని ధైర్యం చెప్పి బోర్డు మీద కాకుండా ఆమె నోట్బుక్లోనే తప్పును సరిదిద్దారు. మూడు నెలల్లో ఆ అమ్మాయి పాస్ అయింది. ఏఐ సాధన ఇచ్చింది. టీచర్ నమ్మకం ఇచ్చారు. -
హెల్త్... లీసా రే ఆఫ్ హోప్
లీసారే అనే పేరు వింటే వెంటనే గుర్తు రాక పోవచ్చేమో కానీ టక్కరి దొంగ’లో మహేశ్ బాబు హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొస్తుంది. బోంబే డైయింగ్ బ్రాండ్ మోడల్గా ఒకనాడు ఫ్యాషన్ ప్రపంచపు క్వీన్గా వెలుగొందిన ఈ జన్మతః కెనడియన్ బ్యూటీ... బాలీవుడ్, హాలీవుడ్ నటిగా, టీవీ కార్యక్రమాల హోస్ట్గా, రచయిత్రిగా అనేక పాత్రల్లో నిర్విరామంగా రాణిస్తూనే ఉన్నారు.చాలా చిన్న వయసులోనే బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన లీసా రే దానిని జయించడంతో పాటు ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి... రెట్టించిన ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకు పోతున్నారు. వ్యక్తిగత జీవితానుభవాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఇటీవలే మధ్య వయసు మహిళల ఆరోగ్య సమస్యలు చికిత్సా కార్యక్రమాల కోసం ‘నూహెర్’ను ప్రారంభించారు. ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నూహెర్’ ఆవిర్భావానికి ప్రేరణ అదే...క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ ఫలితంగా, 37 ఏళ్ల వయసులోనే మెనోపాజ్ దశలోకి ప్రవేశించాను. హార్మోన్ల మార్పుల సహా నా శరీరంలోకి చొచ్చుకుని వచ్చే అనారోగ్యాల్ని అర్థం చేసుకునే అవగాహన లేక అలసట, నిద్రలేమి, మతిమరుపు నీరసం వంటివన్నీ బతకడానికి చెల్లించాల్సిన మూల్యంలా మారాయి. అయితే పెరిమెనోపాజ్ను ఎదుర్కొంటున్న స్నేహితులతో సంభాషణల ద్వారా, చాలామంది ఇదే గందరగోళంలో ఉన్నారని గ్రహించాను.అప్పుడే ’నూహెర్’ ఆవిర్భవించింది. మన దగ్గర మధ్యవయస్సు ఆరోగ్యంపై మౌనం తరతరాల వారసత్వంగా మారింది. చర్చించడానికి ఇబ్బందిపడే విషయాలలో మెనోపాజన్ ఒకటి. ఒక మహిళ విలువ ఆమె పునరుత్పత్తి వయస్సుతో ముడిపడి ఉంటుందనే భావన. అందుకే చాలామంది మహిళలు అసౌకర్యాన్ని భరించడానికి అలవాటుపడ్డారు.శరీరంపై అవగాహన మార్చిన క్యాన్సర్...నా శరీరంతో నాకున్న సంబంధాన్ని క్యాన్సర్ సమూలంగా మార్చేసింది. దానికిముందు, నా జీవితంలో ఎక్కువ భాగం బాహ్య రూపానికే ప్రాధాన్యతనిస్తూ గడిచింది. స్త్రీత్వం అనేది యవ్వనం, సంతానోత్పత్తి లేదా రూపంతో నిర్వచించేది కాదని గ్రహించాను. నిజమైన బలంలో భావోద్వేగ, మానసిక శారీరక ఆరోగ్యం ఇమిడి ఉంటాయని నా అనుభవం నాకు నేర్పింది.వృద్ధాప్యం సమస్య కాదు...యవ్వనాన్నే అందానికి ఏకైక కొలమానంగా భావించే సంస్కృతిలో జీవిస్తున్నాం, కానీ అందం కాలక్రమేణా మారుతుందని నేను నమ్ముతాను. మహిళలు... వృద్ధాప్యం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదని గుర్తించడమే మొదటి అడుగు. మీ విలువ ఎప్పటికీ యవ్వనంగా కనిపించడంతోనే ముడిపడి లేదని అర్థం చేసుకోవడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే నేను ‘వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం‘ గురించి మాట్లాడుతుంటాను, మనం అసాధ్యమైన ప్రమాణాలను వెంబడించడం కంటే జీవశక్తిని ఆస్వాదించాలని నమ్ముతాను.మహిళలూ మిమ్మల్ని మీరు గుర్తించండి...ఎంతోమంది మహిళలు దశాబ్దాల పాటు ఇతరుల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, లక్షణాలు విస్మరించలేనంత తీవ్రమయ్యే వరకు తమ ఆరోగ్య సమస్యల్ని వాయిదా వేస్తూ ఉంటారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు, అది అత్యవసరం. మధ్యవయస్సు అనేది మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకోవడానికి మీపై మీరు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన సందర్భం. మీరు ప్రతిరోజూ ఇతరులకు ఇచ్చే అదే శ్రద్ధ, ఆప్యాయత, కరుణ పొందడానికి మీరు కూడా అర్హులని గుర్తించండి.నా మానసిక ఆరోగ్యం... వ్యాపకాల్లోనే...యోగా, ధ్యానం ప్రకృతిలో గడపడం వంటివి నాకు అమూల్యమైన సందర్భాలు. ఇతరుల ఆమోదం కంటే సహజత్వాన్ని ఎంచుకోవడం నాకు అలవాటైంది. బాహ్య గుర్తింపు అశాశ్వతమైనదని జీవితం నాకు నేర్పింది. మిమ్మల్ని నిలబెట్టేది బలమైన అంతర్గత జీవితం, అర్థవంతమైన సంబంధాలు ఒక లక్ష్య స్పృహ.విజయం అంటే?కీర్తి అశాశ్వతమైనది. మనం ఎంచుకున్న విలువలకు అనుగుణంగా జీవిస్తున్నానా? నా పని అర్థవంతమైన మార్పును తీసుకువస్తుందా లేదా?అదే ఇప్పుడు నాకు ముఖ్యం. నేను అనుభవించిన లేదా పంచుకున్న ఏదైనా విషయం మరో మహిళ ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, మరింత సమాచారం తెలుసుకోవడానికి లేదా మరింత సాధికారత పొందడానికి సహాయపడితే, అది అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ప్రపంచానికి ఏదైనా అర్థవంతమైన దానిని అందిస్తూ, యథార్థంగా జీవించే స్వేచ్ఛను కలిగి ఉండటమే విజయం. ప్రస్తుతానికి, నా దృష్టి వినోదానికి అతీతంగా రచన, ‘నూహెర్’ ద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణ, వంటి ప్రాజెక్ట్లపైనే ఉంది. నాకు రచనపై కూడా చాలా ఆసక్తి ఉంది. నా కవితా సంకలనం త్వరలో ప్రచురితం కానుంది.– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
దువ్వెనను ఇలా ఎంచుకోండి!
చాలామంది జుట్టు సంరక్షణ అనగానే రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్, కండిషనర్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ, మనం రోజూ వాడే దువ్వెన కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గమనించరు. కర్లీ జుట్టయినా, స్ట్రెయిట్గా ఉన్నా... సరైన దువ్వెనను వాడటం వల్ల జుట్టుకు మంచి రక్షణ దొరుకుతుంది. మరి అలా సరైన దువ్వెనని ఎంచుకోవాలంటే కొన్ని చిట్కాలు...వెడల్పాటి పళ్లున్న దువ్వెన: కర్లీ, వేవీ హెయిర్ ఉన్నవారికి వెడల్పాటి పళ్లు ఉండే దువ్వెనలు బాగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు చిక్కులను సులభంగా తొలగిస్తాయి. అలాగే జుట్టు విరిగిపోకుండా, కుచ్చుగా మారకుండా కాపాడతాయి.సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు: స్టెయిట్, పల్చని జుట్టు ఉన్నవారికి సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు చక్కగా సరిపోతాయి. ఇవి జుట్టును చక్కగా దువ్వుకోవడానికి, నీట్గా స్టైల్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి.చిక్కులు తీసే దువ్వెనలు: జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టు త్వరగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తడి జుట్టుపై ‘డిటాంగ్లింగ్ కూంబ్’ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోకుండా, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చిక్కులను సులభంగా తొలగించుకోవచ్చు.ఉడెన్ కూంబ్: కర్రతో చేసిన దువ్వెనలు జుట్టు మొత్తానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి స్కాల్ప్ను మృదువుగా మసాజ్ చేయడమే కాకుండా, జుట్టులో స్టాటిక్ కరెంట్ ఏర్పడకుండా తగ్గిస్తాయి. అంతేకాదు, తలలోని సహజ నూనెలను జుట్టు అంతటా సమానంగా వ్యాపించేలా చేసి, జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.టెయిల్ కూంబ్: జుట్టును సమానంగా లేదా నీట్గా పాపిడి తీసుకోవడానికి టెయిల్ కూంబ్స్ ఎంతో అవసరం. హెయిర్ స్టైల్స్ చేసుకునేటప్పుడు జుట్టును వేర్వేరు సెక్షన్లుగా విభజించడానికి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) -
ఆమె ‘స్కర్ట్’పై అమ్మ చిత్రం.. భావోద్వేగంలో ఒబామా!
మిషెల్ తన ఫ్యాషన్ అభిరుచికి పేరుగాంచిన మహిళ. ఎప్పటికప్పడు విలక్షణమైన స్టైలిష్ వేర్లతో ఫ్యాషన్కి సరికొత్త అర్థమిస్తారామె. ఆమె దృష్టిలో ఫ్యాషన్ అంటే మన వ్యక్తితత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే వస్తాలని అర్థం. అయితే ఈసారి మాత్రం ఒబామా అత్యంత విలక్షణమైన స్కర్ట్ టాప్లో మెరిశారామె. పైగా ఈ దుస్తులు అత్యంత ప్రత్యేకం కూడా. చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రెసెప్షన్లో మిషెల్ ఈ బ్రాండెడ్ దుస్తులతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు సైతం ఆమె డ్రెస్ని చూసి ఒక్క క్షణం తత్తరపడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ మిషెల్ ఒబామా దుస్తుల్లో అంత స్పెషాల్టీ ఏంటంటే..చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రిసెప్షన్లో, మిషెల్ ఒబామా వినూత్నమైన డ్రెస్లో మెరిసి అందర్నీ విస్తుపోయాలా చేశారు. ఒబామా ధరించిన స్కర్ట్పై ఆమెకెంతో ఇష్టమైన తన అమ్మ ఫోటోతో ఉన్న స్కర్ట్ ధరించి ఆ కార్యక్రమానికి హాజరవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరికి మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం ఆశ్చర్యపోయారు. From an early age, my mom, Marian Robinson, taught me how to think for myself, use my own voice, and understand my own worth.Ahead of #MothersDay, I’m proud to announce that the “Opening the White House” exhibit at the Obama Presidential Center will be named after her. 💕 pic.twitter.com/QDhSSRRet0— Michelle Obama (@MichelleObama) May 6, 2022 ఆమె తన వస్త్రధారణతో దివంగత తల్లికి నివాళులర్పించేందుకు ఇలా వచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి మరియన్ రాబిన్స్ ఫోటోతో ఉన్న పెన్సిల్ స్కర్ట్ డిజైన్ కోసం మెరెడిత్ కూప్, ఆక్నే స్టూడియోస్తో కలసి పనిచేశానని తెలిపారు. స్కాండేనేవియన్ లేబుల్ ఆటం కలెక్షన్స్కు చెందిన ఈ స్కర్ట్కి బ్రౌన్ రంగు టాప్ని జత చేశారామె. ఆ వేడుకలో ఒబామా తన దుస్తులు గురించి మాట్లాడుతూ..తన భర్తను చూసి తనకెంతో గర్వంగా ఉందన్నారు. అతను నిజంగా చాలా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే మెరెడిత్ కూప్ డిజైన్ చేసిన ఈ స్కర్ట్ గురించి ఒబామాకు అస్సలు తెలియదు. అందుకే ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కంగారుపడుతున్నట్లు తెలిపారు. అలాగే తాను ఈ స్కర్ట్కి అలవాటుపడటానికి చాలా సమయం పట్టిందన్నారు. నిజంగా తన తల్లి ఇది చూసుంటే గర్వపడేది కదా అని ఉద్విగ్నంగా అన్నారామె. దీని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చారు. 'ఈ రాత్రి నా అత్తగారు మరియన్ రాబిన్స్ గురించి ఆలోచిస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్. ఆమె తన పిల్లలు మిషెల్, క్రెయిగ్ల కోసం ఎంతో కష్టపడింది. తన భర్త ఫ్రేర్ రాబిన్సన్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నేవీ పియర్ సమీపంలోని నీటి పునరుద్ధరణ ప్రాంతంలో పనిచేసేవారు. ఆయన వల్లే కష్టపడి పనిచేయడం, కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం గురించి తెలుసుకున్నా. వాళ్లిద్ద్దరూ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులని, నిమ్న వర్గాలతో సహా అందర్నీ గౌరప్రదంగా చూస్తూ..తమ పనులను తాము చక్కబెట్టుకునే వ్యక్తులు. భూమికి పునాది రాళ్లలాంటి మనుషులు ఆ ఇద్దరూ. చికాగో సౌత్ అంతటా, యావత్తు అమెరికా దేశంలోనూ ఉన్నారు" అంటూ తన పోస్ట్ని ముగించారు. View this post on Instagram A post shared by HOLLYWOOD UNLOCKED (@hollywoodunlocked) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..!
జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం(జూన్ 15, 2026) స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అదీగాక 1993లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. విమానం దిగగానే మోదీకి స్లోవేకియా విదేశీ యూరోపియన్ వ్యవహారాల మంత్రి జురాజ్ బ్లానార్ సాంప్రదాయ స్లోవేకియా ఆహార పద్ధతిలో స్వాగతం పలికారు. అసలేంటి స్వాగతం? దాని అర్థం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.స్లోవేకియా స్లావిక్ సంస్కృతి ప్రకారం.. గౌరవనీయ అతిథికి తాజాగా కాల్చిన రొట్టెముక్క, ఒకచిన్న పళ్లెంలో ఉప్పుతో స్వాగతం పలుకుతారు. అక్కడ రొట్టే శ్రేయస్సుని, జీవనోపాధిని, భూమి ఆశీర్వాదాలను సూచిస్తుందట. ఇక ఉప్పు శాశ్వత స్నేహం, రక్షణకు చిహ్నంగా పేర్కొంటారు. ఈ స్వాగత కార్యక్రమంలో రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతోపాటు జావా ప్రాంతానికి చెందిన 'కోపానిసియారిక్' అనే బాలల జానపద బృందం జానపద నృత్యంతో మెదీకి ఘన స్వాగతం పలికారు. స్లోవేకియాలానే ఆహారంతో పలికే కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.ఖర్జూరం, అరబిక్ కాఫీమధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో, అతిథులకు సాంప్రదాయకంగా ఖర్జూరాలు, అరబిక్ కాఫీ (గహ్వా)తో స్వాగతం పలుకుతారు. చరిత్రకారుల ప్రకారం, ఖర్జూరాలు ఉదారతకు, సమృద్ధికి చిహ్నంగా ఉండగా, తేలికపాటి మసాలాలతో కూడిన కాఫీని ఆతిథ్యానికి, గౌరవానికి చిహ్నంగా పేర్కొంటారు.పోయితో అలోహా స్వాగతంచరిత్రకారుల ప్రకారం, సాంప్రదాయ హవాయి సంస్కృతిలో, సందర్శకులకు స్వాగతం పలకడంలో ఆహారం తరచుగా ఒక పాత్ర పోషిస్తుంది. అక్కడ తిథ్యంతో ముడిపడి ఉన్న ఒక ప్రసిద్ధ ఆహారం పోయి. ఇది టారో దుంపతో తయారు చేసే వంటకం. సామూహిక సమావేశాలలో పోయిని పంచుకోవడం స్నేహం, ఐక్యతకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా సందర్శకులకు ఆహారం అందించడం అనేది ఒక కుటుంబం ఉదారతను, అతిథుల పట్ల వారి నిబద్ధతను ప్రదర్శిస్తుందని విశ్వసిస్తారు.టీతో స్వాగతం..నిపుణుల ప్రకారం, మంగోలియా టిబెటన్ పీఠభూమిలో, అతిథులకు తరచుగా వెన్న టీ లేదా పాల టీతో స్వాగతం పలుకుతారు. అతిథి వచ్చిన వెంటనే ఒక గిన్నెడు టీని అందించడం, దానిని స్వీకరించడం గౌరవానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ ఆచారం శతాబ్దాల సంచార సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అక్కడ మనుగడకు ఆతిథ్యం చాలా కీలకం అని ప్రజలు బలంగా విశ్వసిస్తారు.కలాచ్ రొట్టెతో స్వాగతంఉక్రెయిన్, రష్యాలో, అతిథులకు సాంప్రదాయకంగా కలాచ్ అనే ఒక ఉత్సవ రొట్టెతో స్వాగతం పలుకుతారని, తరచుగా దానితో పాటు ఉప్పు కూడా ఉంటుందని చెబుతారు. ఈ సంప్రదాయం స్లోవేకియా రొట్టె-ఉప్పు ఆచారాన్ని పోలి ఉంటుంది; ఈ ఆచారం శ్రేయస్సు, స్నేహం, అలాగే సందర్శకుడు ఎప్పటికీ ఆకలితో ఉండకూడదనే భావనకు ప్రతీక. అలాగే వివాహాలు, రాష్ట్ర పర్యటనలు, సాంస్కృతిక వేడుకలు వంటి ముఖ్యమైన సందర్భాలలో, ఈ రొట్టెను ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రంపై ఉంచి, అతిథులకు ఒక ముక్కను విరిచి ఉప్పులో ముంచుకోమని ఆహ్వానిస్తారు. ఈ ఆచారం నేటికీ అనేక తూర్పు యూరోపియన్ సమాజాలలో ఆప్యాయత ,గౌరవానికి శక్తివంతమైన చిహ్నంగా నిలిచి ఉంండటం విశేషం. (చదవండి: 4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్ ఎందుకంటే..) -
4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్ ఎందుకంటే..
పాఠ్యపుస్తకాల్లో ఆ విగ్రహం మార్పుతో మరోసారి 4,500 ఏళ్ల నాటి మోహంజోదారో డ్యాన్సింగ్ క్వీన్ విగ్రహం తెరపైకి వచ్చింది. ఎన్సీఆర్టీ తొమ్మిదో తరగతి ఎడ్యుకేషన్ పాఠపుస్తకం 'మధురిమ'లో, మోహెంజో-దారోకు చెందిన ప్రసిద్ధ 'నాట్యకారిణి' విగ్రహం మార్పు చేయడంతోనే వివాదం చెలరేగింది. ఈ పాఠ్యపుస్తకంలో కంచు విగ్రహం మొండెంపై నీడను వేసి, ఆ విగ్రహం దుస్తులు ధరించినట్లుగా కనిపించేలా చేశారు. ఈ మార్పుపై చరిత్రకారులు, విద్యావేత్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత సుపరిచితమైన కళాఖండాలలో ఒకటైన ఈ విగ్రహాన్ని ఎందుకు మార్చారంటూ ప్రశ్నించారు. దీంతో పాత చిత్రాన్నే యథాతథంగా ముద్రిస్తామని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ తెలిపారు. అసలు చరిత్రకారులు, కళా ప్రేమికులు అంతలా ఆరాధించే ఆ నాట్యాకారిని విగ్రహం ఎవరిది..ఎందుకు ఇంత క్రేజ్ అంటే..ఈ నాట్యకారిణి" విగ్రహం, క్రీ.పూ. 2500 ప్రాంతంలో ప్రపంచంలోని తొలి పట్టణ సంస్కృతులలో ఒకటైన సింధు లోయ నాగరికత అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. ఈ కంచు విగ్రహాన్ని 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మెకే, మొహెంజో-దారో (ప్రస్తుత పాకిస్తాన్) నుంచి తవ్వకాలలో వెలికితీశారు. ఆ ప్రాచీన నగరంలోని 'తొమ్మిదవ సందు'గా పిలిచే మార్గంలో ఒక సాదాసీదా ఇంటి శిథిలాలలో పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కేవలం 10.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఆశ్చర్యకరంగా చాలా చిన్నది. అయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం అసాధారణమైనది.అత్యంత ఆధునిక పద్ధతిలో..హరప్పా స్థలాల నుంచి లభించిన వేలాది టెర్రకోట విగ్రహాల వలె కాకుండా, 'నాట్యకారిణి' విగ్రహాన్ని అత్యంత అధునాతనమైన 'లాస్ట్-వ్యాక్స్ కాస్టింగ్' పద్ధతిని ఉపయోగించి కంచుతో తయారుచేశారు. ఈ పద్ధతి ఎంత ఆధునికమైనదంటే, అది నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ విగ్రహం తయారీలో భాగంగా, మైనంతో ఒక నమూనాను చెక్కి, దానికి బంకమట్టి పూత పూసి, ఆ మైనాన్ని కరిగించివేసి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలో కరిగిన లోహాన్ని పోస్తారు.కట్టిపడేసే రూపకల్పన..ఇంత సున్నితంగా చెక్కబడిన కంచు వస్తువు ఉనికి, నాలుగు వేల సంవత్సరాల క్రితమే సింధు లోయ ప్రజలకు లోహశాస్త్రం, పోత, కళాత్మక రూపకల్పనలో అత్యంత అభివృద్ధి చెందిన జ్ఞానం ఉండేదని నిరూపిస్తుంది. ఇప్పటికీ ఆధునికంగా అనిపించే ఆ భంగిమ. ఆ డ్యాన్సింగ్ క్వీన్ విగ్రహంలో ప్రధాన ఆకర్షణ అంతా ఆ భంగిమలోనే ఉంది.ఆమె ఒక హారం, అనేక గాజులు ధరించి ఉంది; ఒక చేతికి 24 లేదా 25 గాజులు, మరో చేతికి కేవలం నాలుగు గాజులు ఉన్నాయి. ఆమె జుట్టును ఒక పెద్ద కొప్పులా ముడివేసి, అది ఆమె భుజంపై ఆనించి ఉంది.ఈ విగ్రహాన్ని అధ్యయనం చేసిన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త సర్ జాన్ మార్షల్ ఇలా పేర్కొన్నారు. "ఒక యువతి, నడుముపై చేయి పెట్టి, కొంటె భంగిమలో ఉంది" అని వర్ణించారు. అంతేగాదు ఆ క్షణానికి, తనపైనా, ప్రపంచంపైనా సంపూర్ణ విశ్వాసంతో ఉన్న ఒక అమ్మాయిగా పేర్కొన్నారు.ఆమె నిజంగా "నాట్యం" చేసిందా?విచిత్రమేమిటంటే, ఆమె అసలు నర్తకి అవునా కాదా అనే విషయంపై చరిత్రకారులు ఏకీభవించలేకపోతున్నారు. ఈ సాంప్రదాయక వ్యాఖ్యానం చాలావరకు మార్షల్ వర్ణన నుంచి ఉద్భవించింది. ఆమె భంగిమ, వంగిన కాలు, నడుముపై చేయి పెట్టిన నిలకడ కదలిక వంటివి కనిపించడంతో చరిత్రకారులు దీన్ని "నాట్యకారిణి" గా పిలిచారు. అంతేగాదు ఆమె ఒక పూజారిణి లేదా పవిత్ర స్త్రీ అయి ఉండవచ్చని కొందరు వాదిస్తారు. మరికొందరు ఆమె ఒక రాణి లేదా సమాజంలోని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి, సంతాన దేవతకు లేదా ఒక యోధురాలికి ప్రతీకగా నమ్ముతారు. ఆమె మెడలోని గాజులు అసాధారణంగా అసమానంగా అమరి ఉండటం, అలాగే ఆ గంభీరమైన భంగిమ తదితరాల్ని ఔను అని అంగీకరించేలా ఉండటం విశేషం. కానీ నిజంగానే ఆమె నర్తకీనేనా అనేది మిస్టరీనే..ఎందుకంటే అందుకు సంబంధించిన ఆధారాలు, నిర్థారణలు కానరాలేదు. పైగా సింధు లిపీ కూడా ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టతను ఇవ్వలేకపోయింది. దీని కథ తవ్వకంతో ముగిసిపోలేదు..ఆ విగ్రహాన్ని గుర్తించిన తర్వాత లాహోరల్లో ఉంచారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో న్యూఢిల్లీలోని సంస్థలకు తరలించారు. 1947లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు, ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రదేశాల నుంచి తవ్వకాలలో లభించిన కళాఖండాల యాజమాన్యంపై వివాదాలు తలెత్తాయి. చివరికి, ప్రసిద్ధ పూజారి-రాజు శిల్పం పాకిస్తాన్ వద్దే ఉండిపోగా, నాట్యకారిణి విగ్రహం భారతదేశం వద్దే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ విగ్రహం న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో భద్రంగా ఉంది. View this post on Instagram A post shared by itihāsology | Indian History & Art (@itihasology) (చదవండి: పసుపు కొమ్ము గణపతి రహస్యం..! గురుగ్రహం దోషాలకు పరిష్కారంగా..) -
ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి రూ. 20 లక్షలు : ఎలా?
ఓర్హాన్ అవత్రామణి (Orhan Awatramani) అలియాస్ ఓర్రీ (Orry) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, బాలీవుడ్ స్టార్స్కు అత్యంత సన్నిహితుడిగా సుపరిచితుడు. బిజినెస్, సినిమా ఇలా ఎక్కడ ఏ సెలబ్రిటీ పార్టీ జరిగినా అక్కడ ఓర్రీ వాలిపోవాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్లు, మొదలు, స్టార్ కిడ్స్దాకా క్రేజీ పోజులిస్తూ హాట్ టాపిక్గా నిలుస్తుంటాడు. తాజాగా ఓర్రీ తెగ హల్ చల్ చేస్తున్నాడు. ఎలాంటి ఉద్యోగం లేకుండా ఆయనకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఏం పని చేస్తాడు? ప్రతి సెలబ్రిటీ పార్టీలో కనిపించడం, స్టార్స్తో కలిసి వెకేషన్స్ వెళ్లడం, సోషల్ మీడియా ఫీడ్లో హల్చల్ చేయడం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కేవలం సెలబ్రిటీలతో ఉన్న పరిచయాలు, వినూత్నమైన ఫ్యాషన్ సెన్స్, పార్టీలతో ఇంటర్నెట్ సంచలనంగా నిలుస్తుంటాడు. ఇటీవల కావ్య కర్నాటక్ హోస్ట్ చేసిన 'లెర్న్ బై కేకే క్రియేట్' (Learn by KK Create) పాడ్కాస్ట్లో పాల్గొన్న ఓర్రీ తన సంపాదనా రహస్యాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తన పర్సనల్ బ్రాండ్, ఆన్లైన్ క్రేజ్ను ఒక లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చుకున్నాడో వివరించారు. దీంతో ఈ విషయాలు తెగ వైరల్గా మారాయి.ఒక్క డీల్తో రూ. 76 లక్షలుతన ఆదాయం గురించి ఓర్రీ మాట్లాడుతూ.. తన సంపాదనలో ఎక్కువ భాగం బ్రాండ్ కొల్లాబొరేషన్స్ (Brand Collaborations) , పెయిడ్ అప్పియరెన్స్ (డబ్బులు తీసుకుని ఈవెంట్స్కు వెళ్లడం) ద్వారా వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో నేను కేవలం ఒకే ఒక్క డీల్, అంటే ఒకే ఒక్క రీల్ (Reel) ద్వారా రూ. 76 లక్షలు సంపాదించాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కోసం బ్రాండ్స్ ఇంత చెల్లిస్తున్నాయా అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొంతమంది ఈ నెంబర్ చూసి షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం తనకున్న క్రేజ్ను బిజినెస్గా మార్చుకున్న ఓర్రీ తెలివిని అభినందిస్తున్నారు.అలాగే ఓర్రీ వ్యాపారం కేవలం సోషల్ మీడియా ప్రమోషన్లకే పరిమితం కాలేదు. ప్రైవేట్ ఈవెంట్స్కు వెళితే రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడట. ఇందులో లంచ్లు, డిన్నర్లు, బర్త్డే పార్టీలు, పెళ్లిళ్లు మరియు ఇతర ఫంక్షన్లు ఉంటాయి."రూ. 15-రూ. 25 లక్షలు ఇస్తే, మీరు నన్ను లంచ్కి లేదా డిన్నర్కి పిలవొచ్చు. మీ పెళ్లికి లేదా బర్త్డేకి వస్తాను. మనం చిన్నప్పటి స్నేహితులం అన్నట్లుగా అక్కడ స్పీచ్ ఇస్తాను. మీతో కలిసి తిరుగుతాను, మీ పేరెంట్స్తో కలిసి షాట్స్ వేస్తాను. మీరు ఎవరిని కలవమంటే వారిని కలుస్తాను. ఇదొక ఎక్స్పీరియన్స్, దీన్ని మీరు డబ్బులతో కొనవచ్చు" అంటూ ఛలోక్తులు విసిరాడు. ఈవెంట్స్కు వెళ్ళడమే కాకుండా, అక్కడ ఉన్న అతిథులతో మాట్లాడటం, ఫోటోలకు ఫొజులివ్వడం , తన ఫేమస్ 'సిగ్నేచర్ పోజ్' ఇవ్వడం వంటివి కూడా చేస్తారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!పర్సనల్ బ్రాండింగ్ పవర్అటెన్షన్ అనేది ఒక విలువైన వస్తువుగా మారిన ఈ రోజుల్లో, ఒక వ్యక్తిని కూడా ఒక సర్వీస్ లాగా మార్కెట్ చేయవచ్చని నిరూపిండంలో ఓర్రీ ఆరితేరిపోయాడు. ప్రస్తుత కాలంలో 'క్రియేటర్ ఎకానమీ' (Creator Economy) వల్ల ఫేమ్ను క్యాష్ చేసుకునే విధానం పూర్తిగా మారిపోయిందని ఓర్రీ అభిప్రాయపడ్డారు. తన సిగ్నేచర్ పోజ్ పాపులారిటీ గురించి జోక్ చేస్తూ..హిందుస్తాన్లో కేవలం ఇద్దరి పోజులు మాత్రమే ఫేమస్ - ఒకటి షారూఖ్ ఖాన్, రెండు ఓర్రీ అన్నంత స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నాడు. డబ్బును ఎవరు మేనేజ్ చేస్తారు అని ప్రశ్నించినపుడు సింపుల్గా అమ్మానాన్ని అని సమాధానమివ్వడం విశేషం. భవిష్యత్తులో ఆ విషయంలో తల్లిదండ్రులకే బాధ్యత వదిలేస్తాను అని కూడా చెప్పాడు. -
ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు?
సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా.. గర్భాలయం వెలుపల.. ద్వారానికి అటూఇటూ ఇద్దరు ద్వారపాలకులుంటారు. ప్రాచీన ఆలయాల్లో కూడా అందమైన విగ్రహాల రూపంలో ద్వారపాలకులను ప్రతిష్టించారు. అసలు ఆలయాల్లో ద్వారపాలకులెవరు? ప్రధాన దేవతలకు ద్వారపాలకుల అవసరం ఉంటుందా? వైష్ణవ, శైవ, శక్తి ఆలయాల్లో ఎవరెవరు ద్వారపాలకుల బాధ్యతలను నెరవేరుస్తారు? ఈ వివరాలను గురించి సవివరంగా తెలుసుకుందాం..ఆలయాల్లో గర్భాలయాల వెలుపల విగ్రహాల రూపంలో ఉండే ద్వారపాలకులు కేవలం కావాలివారు అనుకోవడానికి వీళ్లేదు. ఆలయానికి వచ్చే భక్తుడి మానసిక స్థితిని దైవదర్శనానికి అనుగుణంగా మార్చే ఆధ్యాత్మిక సంకేతాలుగా ద్వారపాలకులు నిలుస్తారని పండితులు చెబుతుంటారు. సైన్స్ కూడా.. గర్భాలయం నిర్మాణ శైలి.. గాలిగోపురం వంటివి భక్తుల్లోని నెగటివ్ ఎనర్జీని లాక్కొని.. ఆకాశంలోకి కలిపేసి.. వారిలో పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసేందుకు దోహదపడే అంశాలుగా ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ద్వారపాలకులు కూడా సరిగ్గా అదే పని చేస్తారని తెలుస్తోంది. భక్తుల చిత్తాన్ని దేవుడిపై ఉండేలా వీరు అనుగ్రహిస్తారని పెద్దలు చెబుతుంటారు.ఆలయంలో దేవతను బట్టి..ద్వారపాలకులు..గర్భాలయంలో ఉండే దేవతలను బట్టి.. ద్వారపాలకులు ఉంటారు. విష్ణు ఆలయాల్లో జయవిజయులు ద్వారపాలకులుగా ఉంటారు. వీరిద్దరూ వైకుంఠంలో మహావిష్ణువుకు ద్వారపాలకులు అనే విషయం తెలిసిందే..! వీరిద్దరికీ కూడా విష్ణుదేవుడి మాదిరిగా నాలుగు చేతులుంటాయి. శంఖచక్రాలను ధరించి ఉంటారు. ఇక శివాలయాల్లో చూస్తే.. ద్వారపాలకులుగా దిండి, మొండి ఉంటారు. వీరిద్దరూ శివుడి ప్రధాన గణాల్లోని మహాకాలుడు, నందికి ప్రతిరూపాలుగా చెబుతారు. దిండి, మొండి.. వీరిద్దరిలో ఒకరు శూలాన్ని, ఢమరుకాన్ని ధరించి ఉంటారు. కొన్ని ఆలయాల్లో ధాత్రి, విధాత్రి అనే పేర్లతో కూడా వీరిని పిలుస్తారు. వీరిద్దరూ భక్తుల హృదయంలో ఉండే భయాన్ని, భీతిని తొలగించి, వారి చిత్తం శివుడిపైకి మళ్లేలా చూస్తారని పండితులు చెబుతున్నారు. ఇక అమ్మవారు, శక్తి ఆలయాల్లో స్త్రీ ద్వారపాలికలు ఉంటారు. మీరు గమనించవచ్చు.. గర్భాలయంలో ఉండే అమ్మవారు శాంతస్వరూపిణి అయితే.. ద్వారపాలికలు శాంతంగాను.. అమ్మవారు క్రోదం, రౌద్ర స్వరూపిణిగా ఉంటే.. ద్వారపాలికలు ఉగ్రంగా ఉంటారు. అందుకు కారణాలను మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే.. అమ్మవారి స్వరూపాన్ని బట్టి.. ద్వారపాలికలు మారుతుంటారు.ప్రతీ ఆలయంలో ద్వారపాలకులకు విశిష్ఠత ఉంటుంది. వీరు ఆలయ పవిత్రతను, అనంత శక్తిని కాపాడతారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భక్తులు గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తిని దర్శించడానికి ముందు.. ద్వారపాలకులకు నమస్కరిస్తేనే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ద్వారపాలకులు అనేది కేవలం శిల్పకళ కోసమో.. అలంకారం కోసమో కాదని, వారి అనుమతితోనే ముందుకు సాగాలని వివరిస్తున్నారు. ఆలయాలను నిర్మించిన రాజులు, రాజవంశాలు కూడా ద్వారపాలకుల శిల్పాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవి. గంగైకొండ చోళపురం వంటి చోట్ల.. భారీకాయులైన ద్వారపాలకులు కనిపిస్తారు. పల్లవుల కాలంలో సహజసిద్ధమైన మానవరూపాలకు సారూప్యంగా ఉండే ద్వారపాలకులకు ప్రాధాన్యమిచ్చారు. చాళుక్యుల కాలంలో ద్వారపాలకులకు కూడా అలంకారానికి ప్రాధాన్యతనిచ్చారు. బౌద్ధ, జైన ఆలయాల్లో యక్షుల రూపంలో లేదా ధర్మరక్షకులుగా, సౌమ్యులుగా ద్వారపాలకులు దర్శనమిస్తారు. సో.. ద్వారపాలకుల గురించి తెలిసింది కదా?? ఇకపై ఏ దేవాలయానికి వెళ్లినా.. ముందుగా ద్వారపాలకులకు నమస్కరించాకే.. ప్రధాన దేవతామూర్తిని దర్శించుకోవాలనే విషయాన్ని మర్చిపోవొద్దు. (చదవండి: హిమాలయాల నడుమ చల్లని స్వర్గం) -
జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ప్రయాణంలో ఉండగానే.. ఆసుపత్రికి చేరుకునే ముందు కూడా ఛాతీ నొప్పి కొనసాగింది. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని స్థిరీకరించినప్పటికీ, గుండె పంపింగ్ సామార్థ్యం ఫెయిలై మృతి చెందారు. అంతేగాదు వైద్యులు ఆయన మరణం భారతదేశంలో మధ్య వయస్కులలో పెరుగుతున్న గుండె సంబంధిత మరణాలపై ఆందోళన రేకెత్తించింది. చాలామంది తేలిగ్గా కొట్టిపారేయడంతోనే ఆ టైంలో గోల్డెన్ అవర్ని పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలను గోల్డెన్ అవర్లోనే గుర్తించి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో సవివరంగా తెలుసుకుందామా.ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా విషాద మరణం, గుండెపోటు కేవలం వృద్ధులకు, అనారోగ్యవంతులకు మాత్రమే వస్తుందనే అపోహపై చర్చలను లేవనెత్తింది. వైద్యుల ప్రకారం, రాణాకు తెలియకుండానే మూడు రోజుల పాటు గుండెపోటుతో బాధపడ్డట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన వైద్య సహాయం తీసుకున్నారు. అక్కడికి రాణాకు అత్యవసర చికిత్స విజయవంతంగా అందించినప్పటికీ, ఆ ఆలస్యం చివరికి ప్రాణాంతకంగా మారింది. గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని ఆయన ఉదంతం గట్టిగా గుర్తుచేస్తుంది. సన్నగా, దృఢంగా, కండరాలతో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. అంతేగాదు చాలామటుకు పలు కేసుల్లో 30 ఏళ్ల మగవారిలోనే ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇందుకు ఆహారం, జీవనశైలి వంటివే కారణాలని చెబుతున్నారు వైద్యులు.ఇక్కడ జస్పాల్ రాణా కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడూ తీవ్రమైన ఛాతీ అసౌకర్యాన్ని అనుభవించాడు. కానీ ఆ లక్షణాలు ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ (జీర్ణకోశ సమస్య)కు సంబంధించినవిగా భావించాడు. పైగా ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమే తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకోకపోవడంతో గుండె పనితీరు బలహీనమై వైఫల్యానికి దారితీసిందని చెబుతున్నారు వైద్యులు. నిజానికి రాణా మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా..ఆ తర్వాత ఆయన కార్డియాక్ రప్చర్ (గుండె పగిలిపోవడం) సంభవించిందని వైద్యులు తెలిపారు. ఇది తీవ్రమైన గుండెపోటు తర్వాత సంభవించే ఒక అరుదైన ప్రాణాంతక సమస్యగా పేర్కొన్నారు వైద్యులు.గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం?గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలను హృద్రోగ నిపుణులు "గోల్డెన్ అవర్" అని పిలుస్తారు. ఈ సమయంలో, సత్వర చికిత్స గుండె కండరాల నష్టాన్ని గణనీయంగా తగ్గించి, మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. రోగులు మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చికిత్సలో జాప్యం కోలుకోలేని గుండె నష్టం, ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా కొన్ని గంటలకు మించి ఆలస్యం అయితే గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతే, గుండె కండర కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. చికిత్సను ఎంత ఆలస్యం చేస్తే, గుండె వైఫల్యం, ప్రమాదకరమైన అరిథ్మియాలు, కార్డియోజెనిక్ షాక్, గుండె పగిలిపోవడం వంటి సమస్యల ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే కీలకమైన ముందస్తు చికిత్స అందించడం వల్ల రోగిని అనేక సంభావ్య సమస్యల నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవ్..గుండెపోటును తరచుగా గుర్తించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, దాని లక్షణాలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపించవు. సాధారణ హెచ్చరిక సంకేతాలు:ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా నొప్పిచేయి, దవడ, మెడ, భుజం లేదా వీపుకు వ్యాపించే నొప్పిఆయాసంఅధికంగా చెమట పట్టడంవికారం లేదా వాంతులుతల తిరగడం లేదా అసాధారణమైన అలసటఎసిడిటీగా పొరబడే పై పొట్టలో అసౌకర్యందాదాపు మూడింట ఒక వంతు గుండెపోటులను మొదట్లో అజీర్ణం, కండరాల ఒత్తిడి లేదా అలసటగా కొట్టిపారేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.యువకుల్లోనే అధికం ఎందుకంటే..గతంలో కంటే ఇప్పుడు యువకులలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, పొగాకు వాడకం, సరిగా నిద్రపోకపోవడం, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తదితరాలే కారణమని చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో చిన్నవయసులోనే ఈ సమస్య బారిన పడినట్లయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉండటం, లేదా సాధారణ శరీర బరువుని కలిగి ఉండటం అనేది హృదయ సంబంధ వ్యాధుల దరిచేరవని కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.తీసుకోవాల్సిన జాగ్రత్తులు..క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం పరీక్షలు చేయించుకోవడంధూమపానం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడంఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడంఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం(చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
ప్రియాంకా చోప్రా తల్లి హెయిర్ టిప్స్..! ఇంట్లోనే హెయిర్ మాస్క్..
ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు అఖౌరి చోప్రా గతంలో కాంతివంతమైన ముఖం కోసం సౌందర్య చిట్కాలను పంచుకోగా తాజాగా ఒత్తైన జుట్టు కోసం సింపుల్ హెయిర్ టిప్స్ షేర్ చేశారు. కురులు ఒత్తుగా దృఢంగా ఉండాలంటే సెలూన్లకు వెళ్లాల్సిన పనిలేదని, ఇంట్లోనే చేసే హెయిర్ మాస్క్ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని అంటోంది డాక్టర్ మధు అఖౌరి. చలన చిత్ర నిర్మాణ, కాస్మెటాలజిస్ట్, స్టూడియో ఈస్తటిక్ సహా వ్యవస్థాపకురాలు అయిన డాక్టర్ మధు 40 ఏళ్ల వృత్తి అనుభవంతో జుట్టు సంరక్షణకు సంబంధించిన చిట్కాలు, పద్దతులు గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అదికూడా ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే హెయిర్ మాస్క్ గురించి వివరించారు. తన వారపు సంరక్షణ దినచర్యలో భాగంగా ఒక హెయిర్ మాస్క్ తయారీ విధానాన్ని పంచుకున్నారు. వంటగదిలో అందుబాటులో ఉండే ఈ మాస్క్ జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎలా ఉపకరిస్తుందో సవివరంగా వెల్లడించారామె. తయారీ విధానం..అందుకోసం కొబ్బరి నూనె, మెంతులు, రోజ్మేరీ (నూనెలో ఒక రోజ్మేరీ రెమ్మ), కొంచెం ఉడికించిన బియ్యం నీరు (గంజి), చియా విత్తనాలు తీసుకుంటానని అన్నారు. ఇక్కడ నానబెట్టిన చియా విత్తనాల వల్ల ఆ మిశ్రమం జెల్లీలాంటి ఆకృతిని పొంది, జుట్టుకు సులభంగా రాసుకునేలా మారుతుందని ఆమె తెలిపారు. ఒక్కో పదార్థం ఒక చిన్న చెంచా చొప్పున తీసుకుని ఒక అద్భుతమైన మాస్క్ను తయారు చేస్తానని అన్నారామె. దీన్ని జుట్టుకు రాసుకుని గంటసేపు ఉంచి, ఆ తర్వాత కడిగేస్తానని అన్నారామె. ఇది తన జుట్టుని ఒత్తుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుందంటూ తన వీడియోని ముంగించారు 73 ఏళ్ల మధు అఖౌరి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మరి. View this post on Instagram A post shared by Dr Madhu Akhouri Chopra (@drmadhuakhourichopra) (చదవండి: '30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..) -
'30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..
బరువు తగ్గడం కోసం జిమ్, ఇతర అధిక తీవ్రతర వర్కౌట్ల కంటే యోగా బెస్ట్ అని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందులో ఉండే కొన్ని రకాల ఆసనాలు కండరాలు, కీళ్లను బలోపేతం చేసి..అదనపు కొవ్వు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధిగాంచింది సూర్యనమస్కారాలు. వెయిట్ ట్రైనింగ్ కోసం ప్రతి వారాంతంలో చేయగల ఒక వ్యాయామం 30-60-90-108 సూర్య నమస్కారాలు. బరువు తగ్గాలనుకునేవారందరికీ ఇది బెస్ట్ అని చెబుతోంది ప్రముఖ యోగనిపుణురాలు రూపాళ్ సిధ్. బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్తో కూడా ఇది చేయించానని అన్నారు. ఈ ముద్దుగుమ్మ కరీనా ఒకేసారి 50 సూర్య నమస్కారాలు, ఆ తర్వాత 108 రౌండ్లు చేసేదన్నారు. మరి అంతలా సూర్యనమస్కారాలు ఎలా చేయాలి..?, బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితరాల గురించి ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.యోగా నిపుణురాలు సిధ్ బరువు తగ్గాలనుకుంటే..సూర్యనమస్కారాలు ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, వంటి వాటి గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ముందుగా చేయాల్సినవి కొన్ని..ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయండివేగంగా కొవ్వు తగ్గించుకోవడానికి, జీవక్రియను పెంచేందుకు ప్రతిరోజూ 6 పూటలా చిన్న చిన్న భోజనాలు చేయండివెయిట్ ట్రైనింగ్తో కండరాలను పెంచుకోండి. బరువులు ఎత్తడం ప్రారంభించండి, కానీ క్రమంగా పెంచండిప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగండిఉదయం పూట ముందుగా కొవ్వును కరిగించండిప్రతిరోజూ కనీసం 45 నిమిషాల యోగా/వర్కౌట్ చేయండిప్రతి భోజనం తర్వాత నడవండిచిన్న చిన్న భాగాలుగా ఆహారం తీసుకోండికనీసం 8 గంటలు నిద్రపోండి108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఎలా చేయాలంటే..సూర్య నమస్కారం అనేది బలం, చలనశీలత, వశ్యత, సమతుల్యత, హృదయ సంబంధ ఓర్పుని మిళితం చేసే ఒక పూర్తి శరీరా కదలికల క్రమం. 108 రౌండ్లు పూర్తి చేయడం అనేది రోజువారీ ఫిట్నెస్ అవసరం కంటే ఎక్కువ. పైగా శారీరకంగా మానసికంగా సవాలుగా ఉంటుంది. ఇన్ని సార్లు చేయాలంటే..నెమ్మదిగా సెషన్లు పెంచడమే తెలివైన విధానం అని అంటున్నారామె. పరుగు లేదా బలవర్ధక శిక్షణ మాదిరిగానే, పునరావృతమయ్యే కదలికలకు శరీరం అలవాటు పడటానికి సమయం పడుతుంది. కొన్ని రోజుల పాటు సూర్య నమస్కారాలను 30 నుంచి 60కి, ఆపై 90కి, చివరకు 108కి పెంచాలి. దీని వల్ల కండరాల ఓర్పు, కీళ్లు తట్టుకునే శక్తి, హృదయ సంబంధ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం తోపాటు తరుచుగా అయ్యే గాయాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు యోగా నిపుణులు. అయితే ఇక్కడ రౌండ్లు పెంచడం అనేది వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలు, వయస్సు, కోలుకునే సామర్థ్యం, టెక్నిక్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.అయితే సరైన పద్ధతిలో 20–30 సూర్య నమస్కారాలు సునాయాసంగా చేసేవారికి, ప్రతి వారం మరిన్ని అదనపు రౌండ్లు జోడించొచ్చు కానీ..ప్రారంభకులు మాత్రం ఒకేసారి ఎక్కువ రౌండ్లు చేస్తే మాత్రం మణికట్టు నొప్పి, భుజం బెణకడం, నడుము నొప్పి లేదా అధిక అలసటకు దారితీయవచ్చు. ఒక సూర్యనమస్కారం భుజాలు, ఛాతీ, వీపు, కోర్, గ్లూట్స్, కాళ్లతో సహా అనేక కండర సముహాలను కదిలిస్తుంది. అలాంటిది వీటిని వందసార్లకు పైగా పునరావృతం చేస్తే..కీళ్లు, కండరాలపై గణనీయమైన భారం పడుతుందనేది గుర్తెరగాలి. కాబట్టి వీటన్నింటిన పరిగణలోని తీసుకుని యోగా నిపుణులు సమక్షంలో చేయడం ఉత్తమం. వైద్యపరంగా కూడా సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిలకడగా..చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామటుకు క్రమం తప్పకుండా చేస్తే 12–24 నాణ్యమైన రౌండ్లు మంచి ప్రయోజనాలు ఇస్తాయని నమ్మకంగా చెప్పారు.ఎవరైనా 108 చేయాలనుకుంటే..1–2 వారాలు: 24–30 రౌండ్లు3–4 వారాలు: 40–50 రౌండ్లు5–6 వారాలు: 60–75 రౌండ్లు7–8 వారాలు: 90+ రౌండ్లుఆ తర్వాత, రికవరీ టెక్నిక్ బలంగా ఉన్నప్పుడు 108 ప్రయత్నిస్తే మంచిదని అన్నారు. ఇక్కడ ఫిట్నెస్ సవాళ్లను పరీక్షలా కాకుండా, శిక్షణలా స్వీకరించాలని అన్నారు. View this post on Instagram A post shared by Rupal Sidhpura Faria | Yoga & Travel (@rupal_sidh)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే మందుకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో..
ప్రతి స్టేజీ మీద అవార్డ్ అందుకునే చేతుల వెనుక, ఆ చేతుల్ని చిన్నప్పుడు స్కూల్ గేట్ దగ్గర వదిలిపెట్టి, వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న ఒక జత కళ్లు ఉంటాయి. ఆ కళ్ల పేరే నాన్న. ఆటగాడు స్టేడియంలో సిక్స్ కొడితే కెమెరా అతడి మొహం చూపిస్తుంది. కానీ గ్యాలరీలో సీట్ దొరక్క నిలబడి, ‘వాడు మా అబ్బాయిరా’ అని పక్కవాడి భుజం తడుతూ గర్వంగా చెప్పే మనిషిని చూపించదు. ఆ మనిషి నాన్న.అమ్మాయి ఐ.ఏ.ఎస్ అయ్యి వార్తల్లోకి వస్తే, ‘మా ఊరి అమ్మాయి’ అని ఊరంతా సంబరపడుతుంది. కానీ ఆ అమ్మాయిని రాత్రిళ్లు దీపం కింద కూర్చోబెట్టి, తోడుగా కునికిపాట్లు పడుతూ కూచున్న నీడని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ నీడ పేరు నాన్న.నాన్న ‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు.పిల్లల విజయం వెనుక అమ్మ ఉంటుంది నిజమే. కానీ ఆ అమ్మ చేతిలో గరిటె ఆగకుండా తిప్పడం వెనుక, ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ తొక్కుతూ డ్యూటీకి వెళ్లిన, ఫ్యాక్టరీలో ఓవర్టైం చేసిన, ఎండలో ఆటో నడిపిన ఒక మనిషి చెమట ఉంటుంది. ఆ మనిషి నాన్న.ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.రోజుకో నాన్నకి నమస్కరించుకుందాం.ఫోటోలో కనిపించని, ఫ్లెక్సీలో పేరు లేని, అవార్డ్ అందుకోని నాన్నలందరికీ... ఈ కాలమ్ అంకితం.నాణెం కాదు ప్రాణంగొంతెమ్మె కోరికలు కోరకు.. ఉన్నదాంట్లో సర్దుకో..అన్నమాటను చిన్నప్పుడు మనమంతా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. మరీ ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈమాట సర్వసాధారణం.. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా, కేసరపాత్ గ్రామంలో నివసించే బజరంగ్ రామ్ భగత్ది అలాంటి కుటుంబమే. అతను గుడ్లు, శెనగలు అమ్ముతూ వ్యవసాయం చేసుకునే ఒక సన్నకారు రైతు. అతని కుమార్తె చంపా భగత్ బీకామ్ చదువుతోంది. తనకేమో స్కూటీ నడపాలని, కాలేజ్కి వెళ్లాలని చాలా ఆశ. పదేపదే స్కూటీ కావాలని చంపా నాన్నని అడిగేది. కాని స్కూటీ ధర అక్షరాలా లక్ష. అంత డబ్బు భగత్ దగ్గర లేదు. అప్పు చేసే ధైర్యం లేదు. అలాగని కూతురు మనసుని నొప్పించాలనీ లేదు. అందుకే ప్రతిరోజూ వ్యాపారంలో మిగిలే పది, ఇరవై రూపాయల నాణేలను పోగు చేశాడు. అలా దాదాపు ఏడు నెలలు పోగు చేశాక కూతురుని వెంటబెట్టుకుని బైక్ షో రూమ్కి వెళ్లాడు. అక్కడ సంచుల నిండా ఉన్న నాణేలను తెరచి నేలమీద పోయడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు నాణేలను లెక్కపెట్టగా నలభైవేలకు తేలింది. ఆ మొత్తాన్ని అక్కడ డౌన్ పేమెంట్గా కట్టి కుమార్తెకు స్కూటీని కొనిచ్చాడు. స్కూటీ నడపాలన్న ఆశను కుటుంబ ఆర్థిక స్థోమత సవాల్ చేసినా, కూతురు మీదున్న ఆ తండ్రి ప్రేమ పేదరికాన్ని జయించి చూపింది.నాన్నేనెట్వర్క్పిల్లల కోసం తండ్రులు ఎంతటి త్యాగానికైనా... కష్టానికైనా వెనుతీయరనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణ కర్ణాటకలోని బల్లక్క గ్రామంలో నారాయణ అనే రైతు తన కూతురు చదువు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. గ్రామంలో నెట్వర్క్ లేకపోవడంతో నారాయణ కూతురు గ్రామం బయటకు వెళ్లి ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేది. నెట్వర్క్కి తోడుగా ఒకరోజు ఊరిలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు క్లాసులకు హాజరు కావడం మరింత జటిలంగా మారింది. అయినా సరే తన కూతురు క్లాసులకు మిస్ కాకూడదని నారాయణ కూడా వచ్చి ఇలా గొడుగుపట్టుకుని నిలబడ్డాడు. ఒకవైపు కూతురు తడవకుండా చూసుకుంటూ మరోవైపు తను తడుస్తూ నిలుచున్నాడు. ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన స్థానిక జర్నలిస్ట్ మహేష్ పుచ్చప్పాడి తన కెమెరాలో క్లిక్మనిపించి ట్విట్టర్లో పెట్టాడు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు నారాయణ తన కూతురు ఆన్లైన్ క్లాసుల కోసం ఇదే ప్రదేశానికి తీసుకువస్తున్నాడని, మారుమూల ప్రాంతంలో నెట్వర్క్ లేక ప్రజలు పడుతున్న అవస్థలకు ఇదొక ఉదాహరణ అంటూ పేర్కొన్నాడు.స్విగ్గీ డాడీకొన్ని నెలల కిందట వైరల్ అయిన ఫొటో ఇది. స్విగ్గీలో పని చేస్తున్న ఓ వ్యక్తి తనతో పాటు కూతుర్ని కూడా తీసుకెళ్లాడు. ఓ అపార్ట్మెంట్లో డెలివరీ ఇచ్చాక కాస్త సమయం దొరికింది. అపార్ట్మెంట్ మెట్లు దిగుతూ ఓ చోటు చూసుకుని కూర్చుని పుస్తకం తీసి తన కూతురికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చక్కటి దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే..కొన్ని గంటల్లోనూ వేలాది లైకులు, కామెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. కూతురు కోసం కష్టపడుతున్న తండ్రిని శభాష్ అని మెచ్చుకుంటూ రియల్ హీరో స్విగ్గీ డాడీ అంటూ పోస్ట్లు చేశారు. తండ్రి అన్నవాడు ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా అదంతా బిడ్డ కళ్లల్లో ఆనందం చూడ్డానికేనని, బిడ్డకి మంచి భవిష్యత్ ఇవ్వడానికేనని ఈ ఫొటో నిరూపించింది. నిర్వహణ : శ్రావణ్ జయ -
పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్గా కరీనా కపూర్!
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కెరీర్లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిపోయింది ‘లగాన్. ఈ మూవీ ఒకవైపు దేశభక్తిని, మరోవైపు యువతను విశేషంగా ఆకర్షించే క్రికెట్ సన్నివేశాల మేళవింపుతో భావోద్వేగభరితంగా తెరకెక్కించిన క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దర్శకుడు అశుతోష్ గోవారికర్ (Ashutosh Gowariker) తెరకెక్కించిన ఈ మూవీ 2001 జూన్ 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్తో దూసుకుపోతూ.. సూపర్ హిట్గా నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సరిగ్గా ఈ నెల 15తో 25 ఏళ్లు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా ఈ మైలురాయిని పురస్కరించుకుని, నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ జూన్ 13న ముంబైలో ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్, సల్మాన్ ఖాన్తో సహా బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ తనదైన గ్లామరస్ లుక్తో అలరించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే బేబో పింక్ కుర్తాలో గులాబీలా మెరిసింది. ఈ వేడుకలో ఆమె ధరించి డ్రస్, హైహిల్స్ ధర వింటే విస్తుపోవాల్సిందే. ఇది ఎకాయ బనారస్ బ్రాండ్కి చెందిన సిల్క్ కుర్తా. డిజైనర్ అమృత గిల్ షేర్ రూపొందించారు. కరీనా డిజైనర్వేర్పై క్లిష్టమైన, చేనేత కట్వర్క్ బనారసీ డిజైన్లు ఉన్నాయి. ఫ్లేర్డ్ కుర్తాను స్ట్రెయిట్ ప్యాంట్లు, దానికి సరిపోయే షీర్ దుపట్టాతో జత చేశారు. ఈ లుక్ని మరింత అందంగా కనిపించేలా అక్వాజురా హీల్స్ను ఎంచుకుంది. ఇక కరీనా ధరించిన ఈ అందమైన కుర్తా ధర వచ్చేసి రూ. రూ. 41,000 కాగా, హీల్స్ ధర వచ్చేసి ఏకంగా రూ. 92,000 పైనే పలుకుతుందట. ఇక హెయిర్స్టైల్ కోసం క్లాసిక్ నీట్ బన్ను ఎంచుకున్నారు. అలాగే సింపుల్ మేకప్ టోన్స్, గ్రీన్ కళ్లు అందంగా కనిపించే కాజల్, చిన్న బొట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేశారామె. అంతేగాదు ఈ బ్యూటీ బేబో స్టైలిష్గా ఆకర్షణీయంగా కనపించే అవకాశాన్ని ఎప్పుడు వదులుకోదామె. ఎల్లప్పుడూ ఓ కొత్తలుక్తో కరీనా తన అభిమానులను ఆశ్చర్యపరస్తుంటుందామె. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?) -
జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.కలిగే లాభాలు..జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. అలాగే ఈ పండులో విటమిన్ సీ, లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..) -
నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల ఆహారం, కనీసం వ్యాయామం అవసరమని ఆరోగ్యనిపుణులు నిరంతరం చెప్పేమాట. దాదాపు 93 ఏళ్ల వయసులోనూ సగం వయసున్న వారి కంటే ఎక్కువ ఫిట్నెస్తో జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలనే అబ్బుర పరిచిన ఇటలీకి చెందిన ఎమ్మీ మరియా మజ్జెంకా (Emma Maria Mazzenga) ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం.ఇటలీలోని పాడువా నగరానికి చెందిన 92 ఏళ్ల ఎమ్మీ మరియా మజ్జెంకా ఒక రిటైర్డ్ హైస్కూల్ సైన్స్ టీచర్. 90-94 ఏళ్ల విభాగంలో పలు ప్రపంచ రికార్డులను సృష్టించిన ఎలైట్ స్ప్రింటర్ (పరుగు పందెం క్రీడాకారిణి). ఆమె శారీరక దృఢత్వంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి.ఆమె శరీరం ఆక్సిజన్ను గ్రహించి, కండరాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం 30 ఏళ్ల యాక్టివ్ యువతులలో ఉన్నంత శక్తివంతంగా ఉంది. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా (Mitochondria) పని తీరు 20 ఏళ్ల యువతలో ఉన్నంత బలంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యాయామం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను పూర్తిగా మార్చేయవచ్చని ఎమ్మీ జీవితం నిరూపిస్తోందని వ్యాయామ ఫిజియాలజిస్ట్ సిమోన్ పోర్సెల్లి పేర్కొన్నారు.ఎమ్మీ ఫిట్నెస్ వ్యూహం గంటల తరబడి కష్టపడే మారథాన్లపై ఆధారపడలేదు. ఆమె కేవలం క్రమశిక్షణ (Consistency) ను నమ్ముకున్నారు.వర్కౌట్ ప్లాన్ఆమె వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. ప్రతి సెషన్ గంట లోపే ఉంటుంది. ఆమె సుదీర్ఘ పరుగు పందాల్లోనూ పాల్గొనరు.తేలికపాటి జాగింగ్తో వార్మప్, కొన్ని షార్ట్ స్ప్రింట్స్ (వేగవంతమైన పరుగు), ప్రతిరోజూ అవుట్డోర్ వాకింగ్, అప్పుడప్పుడు తేలికపాటి రెసిస్టెన్స్ వ్యాయామాలు అంతే ఆమె రొటీన్.ఇక ఆహార నియమాలువిషయానికి వస్తే..పెద్దగా నియంత్రణలు కూడా ఏమీలేవు. కఠినమైన డైట్ జోలికి వెళ్లరు. కానీ చాలా తేలికపాటి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, గుడ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. అయితే, తనకు నచ్చినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మాంసం కూడా తింటూ సమతుల్యతను కాపాడుకుంటారు.90 ఏళ్ల వయసు దాటినా కూడా శరీరం వ్యాయామానికి ఎంతో అద్భుతంగా స్పందిస్తుందని ఎమ్మీ మరియా మజ్జెంకా జీవితం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మీ జీవనశైలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.WHO ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన రూల్స్ వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ-తీవ్రత కలిగిన వ్యాయామం, లేదా 75 నుండి 150 నిమిషాల కఠినమైన వ్యాయామం .శారీరక సమతుల్యత , కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలను వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేయడం వల్ల కింద పడకుండా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.కదలికలు లేకుండా కూర్చునే అలవాట్లను మానుకుని, కేవలం తేలికపాటి వాకింగ్ చేసినా కూడా వృద్ధాప్యంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా? -
'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ మంచి స్ఫూర్తిదాయకమైన కథలను, కమనీయ ప్రదేశాల గురించి షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఈసారి ప్రకృతి రమ్యతకు, నిశబ్దమైన గంభీరతకు ఆలవాలమైన ఒక కమనీయ ప్రదేశం ఫోటోలను షేర్చేస్తూ..దాని గురించి రాసుకొచ్చారు. అంతగా చూడని, గమనించని అందమైన ప్రదేశం అంటూ..ఆ పర్యాటక అందాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంతకీ ఆ పర్యాటక ప్రదేశం ఎక్కడ ఉందంటే..కర్ణాటక తీరప్రాంతంలోని హొన్నవార్ అందాలకు ఫిదా అవ్వుతూ దాని గొప్పతనం గురించి సోషల్ మీడియా ఎక్స్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. శ్రద్ధ అనే పదానికి అర్హమైన అపురూపమైన ప్రకృతి రత్నంగా అభివర్ణించారు. తాను ప్రజలు అంతగా అన్వేషించని, రద్దీ తక్కువగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నానంటూ రాశారు. అంతా కేరళ బ్యాక్వాటర్స్(బ్యాక్ వాటర్స్ (Backwaters) అనగా నదులు, సరస్సులు లేదా సముద్రపు తీరాలకు సమీపంలో నీటి ప్రవాహం మందగించడం వల్ల ఏర్పడే నిశ్చలమైన జలాలు. )ని ప్రశంసిస్తుంటాం. కానీ కర్ణాటక తీరంలో అలాంటి బ్యాక్వాటర్కి సంబంధించిన అద్భుతమైన ప్రదేశం ఒకటి ఉందని అన్నారు. జోగ్జలపాతంపై ఘోషించే శరావతి నది చివరకు హొన్నవార్ వద్ద నిశ్శబ్దంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదోక మాయ ప్రదేశం. మడ అవడవులు, వంకరటింకరగా ప్రవహించే జలమార్గాలు, అద్దంలాంటి బ్యాక్వాటర్స్, ఎవ్వరినైన కట్టిపడేస్తాయని అన్నారు. మడ అడవులు ప్రకృతి అత్యంత సమర్థవంతమైన తీర రక్షకులలో ఒకటి కాబట్టి..హోన్నవార్ అందానికి పర్యావరణ ప్రాముఖ్యత కూడా తోడైన రమ్యమైన ప్రదేశంలా ఉంటుంది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్చేశారు. అందుకు నెటిజన్లు కూడా మద్దతిస్తూ..తమకు లిసిన తెలిసిన అద్భుత పర్యాటక ప్రదేశాల గురించి పంచుకున్నారు. కొందరు కేరళ తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ భారతదేశ తీరప్రాంతం దాగి ఉన్న అద్భుత కళాఖండాలతో నిండి ఉంది. అసాధారణంగా ఉండటానికి అందానికి జనసమూహం అవసరం లేదని మనకు గుర్తుచేసే ప్రదేశాలలో హొన్నవార్ ఒకటిగా కనిపిస్తుంది.Continuing my search for underexplored & less crowded destinations….We often celebrate Kerala’s backwaters. But on Karnataka’s coast is a hidden gem that deserves equal attention.The same river that roars over Jog Falls, the Sharavathi River, finally and quietly merges with… pic.twitter.com/N9himujjg1— anand mahindra (@anandmahindra) June 14, 2026 (చదవండి: ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..! తయారీకే ఏకంగా..) -
90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్వర్క్తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
భారత విజ్ఞానం: జెండాపై కపిరాజు...
జెండాపై కపిరాజు అంటే ఆంజనేయుడు.... ఆయన చిరంజీవి కనుక త్రేతా యుగం నాటి రామాయణ కాలంలోనే కాదు.... ద్వాపర యుగంలో జరిగిన మహా భారత యుద్ధంలోనూ ఆంజనేయుడు కన బడతాడు. శ్రీకష్ణుడుని కోరిక మేరకు అర్జునిని రధం పై ఉండే జెండాలో కొలువై ఉంటాడు. ఇలా కొలువై ఉండేందుకు కారణం కూడా ఉంది. మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడు. ఒకసారి భీముడికి గర్వభంగం జరిగిన సందర్భంలో... మరోసారి కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది.΄ాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధికా పుష్పాలు కావాలని భీముడిని కోరుతుంది. ఈ పూలు తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డుతప్పుకోమని భీముడు కోరతాడు. తాను ముసలివాడినని, తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్లమని భీముడికి చెబుతాడు. అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని గ్రహించి, శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మరో సందర్భంలో కోతిరూపంలోనే అర్జునుడిని కలుస్తాడు ఆంజనేయుడు.త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారధిని చూసి దీని నిర్మాణానికి కోతులసహాయం ఎందుకు? నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలుమోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు.ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ నుంచి చివరి వరకూ అర్జునుని రథ జెండాపై ఉంటాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకూ జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది.ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పటివరకూ నీ రథంపై హనుమంతుడు ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవీ ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యేదని చెబుతాడు. అందుకే జెండపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దుష్టశక్తులు దరిచేరవని, విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ఏది ఏమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం, ఇలాంటి ఆంజనేయుని జెండా తమ కూడా ఉంటే విజయం తమనే వరిస్తుందన్న సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది. - సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
సమ్యక్ దృష్టి.. మిధ్యా దృష్టి!
బుద్ధుడు ఒకసారి మగధ రాజధాని రాజగృహలో ఉన్నాడు. వేణు వనంలో ఉడుతలకు మేత వేస్తున్నాడు. వాటిలో కొన్ని బుద్ధుని మీదకు ఎక్కాయి. ఇంకొన్ని మేత మేస్తున్నాయి. కొమ్మ మీద ఉన్న ఉడుతలు రెండు చకచకా వచ్చి బుద్ధుని ముందు నిలబడ్డాయి. అప్పుడు జయసేనుడు, భూమిజుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. వారూ ఉడుతలకు ఆహారం పెట్టారు. అప్పుడు జయసేనుడు ‘‘భగవాన్! సమ్యక్ దృష్టి, మిధ్యా దృష్టి గురించి చెప్పండి’’ అన్నాడు.‘‘భిక్షువులారా! నూనె కావలసిన వాడు నూనె కోసం వెతుకుతున్నాడు. వాడు నూనె తొట్టిలో ఇసుక పోసినాడు. ఎంతసేపటికీ నూనె రాదు. అది మిధ్యా దృష్టి’’ ‘‘భగవాన్! ఔను. నూనె కావలసిన వాడు ఇసుక పోస్తే నూనె ఎలా వస్తుంది?’’ అన్నాడు భూమిజుడు. ‘‘అలాగే.. పాలు కావలసిన వాడు పాల కోసం వెతుకుతూ ఆవు కొమ్మును పితుకుతాడు. వాడూ పాలను పొందలేడు. అవే మిధ్యా కర్మలు’’‘‘ఒకడు వెన్నను కావాలనుకుంటాడు. బానలో నీటిని పోసి కవ్వాన్ని వేసి తిప్పుతాడు. వాడికీ వెన్న లభించదు. ఇదే మిధ్యా ప్రయత్నం’’‘‘భగవాన్! చాలా చక్కగా చెప్పారు’’ అన్నాడు జయసేనుడు. ‘‘అలాగే వేరొకడు... అగ్నిని కావాలని వెతుకుతూ ఉంటాడు. చేవగల పచ్చికట్టెను మధిస్తాడు. అప్పుడూ కూడా మంటను పొందలేడు. ఇదే మిధ్యా సంకల్పం’’ ‘‘కాని ఒకడు పాలు కావాలనుకుని చంటి దూడను పితుకుతాడు. ఆవు రొమ్మును పితకడు. ఇదే మిధ్యా వాక్కు’’ ‘‘ఇంకొకడు... పెరుగును పోసి కవ్వంతో తిప్పుతాడు. వాడు వెన్నను పొందుతాడు. ఇదే సమ్యక్ దృష్టి... అలాగే మిగిలినవన్నీ... అన్నాడు బుద్ధుడు. ‘‘భగవాన్! నూనెను కావలసినవాడు ఆవనూనెతో, పాలు కావలసినవాడు ఆవు పొదుగుతో, వెన్న కావలసిన వాడు బానలోని వెన్నతో... ఇలా పొందాలి.’’అన్నాడు భూమిజుడు.‘‘అవును.’’ అన్నాడు బుద్ధుడు. ఈ నాలుగు ఉపమానాలు చెప్పాడు. ఇద్దరూ ప్రసన్నలయ్యారు. చెట్టు మీద ఉన్న ఒక ఉడుత కిందకు దిగలేదు. అటూ ఇటూ ఆలోచిస్తుంది. కొంచెం కిందకు కొంచెం పైకీ పోతుంది. వారిద్దరూ పిలిచారు. అది అలాగే చూస్తోంది. బుద్ధుడు చూశాడు. ఉడతను కిందికి రమ్మన్నాడు. అది కిందకు వచ్చింది.‘‘ఇదిగో తిను... నీ మేత...’’ అంటూ మేత వేశాడు. అది నెమ్మదిగా వచ్చి బుద్ధుడి దగ్గర వాలింది. దాన్ని తీసుకుని దాని వీపుని నిమిరాడు. అది కొమ్మపైన వాలినట్టుగా ఆయన పాదాల మీద వాలిపోయింది. – డా. బొర్రా గోవర్ధన్ -
ఈ ఆపిల్ తోటలు ఎక్కడ?
ఇండియాలో అత్యంత అందమైన ఆపిల్ తోటలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇండియాలో ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని కోట్గఢ్. అందమైన హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ హిల్ టౌన్, మన దేశంలో కమర్షియల్ ఆపిల్ కల్టివేషన్ కి పుట్టినిల్లుగా ప్రసిద్ధి పొందింది.1916 సంవత్సరంలో అమెరికన్ మిషనరీ శామ్యూల్ ఇవాన్స్ స్టోక్స్ అమెరికా నుంచి హై క్వాలిటీ ఆపిల్ శాప్లింగ్లను కోట్గఢ్కి తీసుకుని వచ్చి నాటారు. ముఖ్యంగా రెడ్ డిలీషియస్ వెరైటీ ఇక్కడి క్లైమేట్కి చాలా బాగా అడాప్ట్ అయింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ అంతటా ఆపిల్ కల్టివేషన్ వేగంగా అభివద్ధి చెందింది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో అత్యధిక ఆపిల్స్ ్ర΄÷డ్యూస్ చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.కోట్గఢ్ చుట్టూ పచ్చని ఆపిల్ తోటలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, తాజా గాలి టూరిస్టులను ఆకర్షిస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఆపిల్ హార్వెస్టింగ్ సీజన్ ఉంటుంది. ఈ సమయంలో తోటలు అన్నీ కూడా ఎర్ర, ఆకుపచ్చ రంగు ఆపిల్స్తో నిండిపోయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని తోటల్లో ప్రయాణికులు ఆపిల్స్ను కోసుకుని తినే అవకాశం కూడా లభిస్తుంది. ఆపిల్ ఫార్మింగ్ అనేది ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం. ఫ్రెష్ ఆపిల్స్తో పాటు ఆపిల్ జ్యూస్, జామ్, సైడర్, డ్రైడ్ ఆపిల్స్లాంటి ఉత్పత్తులు కూడా ఇక్కడి ఎకానమీకి బలాన్ని అందిస్తాయి. నేచర్ లవర్స్ కోసం కోట్గఢ్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. అందమైన మౌంటైన్ రోడ్స్, ప్రశాంతమైన గ్రామాలు, ఆపిల్ తోటలు, చల్లని వాతావరణం ఇవన్నీ కలిసి ఒక అందమైన, అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.ఆపిల్ తోటల్లో నడవాలి అనుకుంటే, ఫ్రెష్ ఆపిల్స్ డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి తినాలి అనుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కోట్గఢ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. -
వర్షం రాసే దక్షిణ భారత ప్రయాణ గీతం..
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది. చినుకులు పడిన వెంటనే పచ్చని పర్వతాలు, మేఘాలలో దాగిపోయిన లోయలు, జలజలా పారుతున్న జలపాతాలు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.దక్షిణ భారతంలో వర్షాకాలం అంటే కేవలం సీజన్ కాదు. అది ప్రకృతి తన అందాన్ని మరోసారి కొత్తగా అలంకరించే సమయం. కేరళ బ్యాక్ వాటర్స్ నుండి కర్ణాటకలోని ఘాట్స్ వరకు, తమిళనాడు హిల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని లోయల వరకు ప్రతీ చోట వర్షం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాకాలంలో పచ్చని స్వర్గాన్ని తలపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం మేఘాలతో కవర్ అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఒక పెయింటింగ్లాగ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే వెలిసిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్, శాండిల్వుడ్ సువాసనలు, వర్షంతో తడిసిన అడవులుం ప్రతీ దశ్యం ఒక సినిమా ఫ్రేమ్లా ఉంటుంది. ఉదయం సమయంలో మేఘాలు కొండల్ని ముద్దాడుతుంటే, మధ్యాహ్నం చినుకుల మధ్య సూరీడు అందంగా ప్రకాశిస్తాడు. సాయంత్రం అయితే కురిసే వర్షం ఆ తరువాత వీచే చల్లని గాలి మనసుని కూడా ఫ్రెష్గా మార్చేస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి మాన్ సూన్ జర్నీ మొదలైతే ట్రెయిన్ విండో పక్కన కూర్చొని వెళ్లడంలోనే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుంది. సిటీ బిల్డింగ్స్ మెల్లిగా కనుమరుగై, పంటపొలాలు, నదులు, అడవులు మొదలవుతాయి. రోడ్ జర్నీలో ఘాట్ రోడ్డులు, మేఘాల మధ్య ట్రావెల్ చేస్తూ ప్రతీ టర్న్లో కొత్త సీన్ ను ఎంజాయ్ చేయవచ్చు.ఫ్లైట్ జర్నీ అయినా కూడా మేఘాల పైన వెళ్తున్న అనుభవం వేరే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి హిల్ స్టేషన్స్ వైపు వెళ్తుంటే వెదర్ మెల్లిగా మారడం గమనించవచ్చు.విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టే వారికి కూడా రైల్ అండ్ రోడ్డు మార్గంలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.ప్రతీ కిలో మీటర్లో వాతావరణం మారిపోతుంది. గాలి చల్లబడుతుంది. పచ్చని దశ్యాలు చూసి మనసు పరవశించి పోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రయాణాల్ని మెమోరెబుల్ చేస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ లేదా విజయవాడ నుండి 5 రోజుల మాన్ సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఎంచుకునే ప్రయాణ శైలిని బట్టి బడ్జెట్ మారుతుంది. ఒక సాధారణ బడ్జెట్ రేంజ్ ట్రిప్ కోసం వ్యక్తికి సుమారు రూ. 18,000 నుండి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.అదే కొంచెం సౌకర్యవంతంగా ఉండే స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ అయితే రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ వాహనాలతో లగ్జరీగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనిషికి రూ. 60,000 నుండి రూ. 90,000 వరకు బడ్జెట్ అవసరమవుతుంది.ఇక బస విషయానికి వస్తే, బడ్జెట్ హోటల్స్లో ఒక రాత్రికి రూ. 1,500 నుండి రూ. 3,000 మధ్య ఛార్జీలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే స్టాండర్డ్ రిసార్టులు అయితే రూ. 4,000 నుండి రూ. 8,000 వరకు, విలాసవంతమైన ప్రీమియం స్టేలు రాత్రికి రూ. 10,000 పైనే ఉంటాయి.ఇక ఆహార ఖర్చుల కోసం మీ లైఫ్స్టైల్ను బట్టి రోజుకు సుమారు రూ. 600 నుండి రూ. 1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. n విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్లకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం మారవచ్చు కానీ ఓవరాల్ బడ్జెట్ దగ్గరగానే ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ప్లాంటేషన్ స్టేలు, హెరిటేజ్ కాటేజీలు, హౌజ్ బోర్డు ఎక్స్పీరియన్సులు, లోకల్ సైట్ సీయింగ్ ΄్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ అనుభవాలు వర్షాకాలం జర్నీని మరింత మెమోరెబుల్గా మార్చేస్తాయి.ఏం చూడాలి?వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫ్లోలో ఉంటాయి. లోయలు మొత్తం తెల్లని పొగ మంచు కప్పేసుకుంటాయి. టీ తోటల్లో వర్కర్స్ మెల్లిగా పని చేసుకుంటూ కనిపించే దశ్యం స్థానికుల జీవితాన్ని దగ్గరగా చూపిస్తుంది.అడవి మార్గాల్లో ట్రావెల్ చేస్తుంటే చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే పరిగెడుతూ ఉంటాయి. సరస్సులపై పడుతున్న చినుకులు, అవి సష్టించే చిన్న చిన్న వలయాల సోయగం కళ్లతో చూడాల్సిందే.ఉదయం సూర్యోదయం కోసం వేచి చూస్తున్న మేఘాలు చాలా అందంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మేఘాలు మెల్లిగా క్లియర్ అయ్యాక కనపించే పచ్చదనం పైసా వసూల్ సీన్ లా అనిపిస్తుంది.ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు గడపడం, ప్లాంటేషన్ వాక్స్ ఎంజాయ్ చేయడం, లోకల్ మార్కెట్లో తిరగడం, బోటింగ్ను ఆస్వాదించడం, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద సైలెంట్గా నిలబడటం అనే ఈ ఐదు అనుభవాలు సహజంగానే ఈ సీజన్ ని మరింత మధురంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?వర్షాకాలంలో స్టే అంటే కేవలం రూమ్ మాత్రమే కాదు. మార్నింగ్ బాల్కనీలో కాఫీ కప్ పెట్టుకుని మేఘాలను చూస్తూ గడిపే నిమిషాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి.వుడెన్ కాటేజీలు, ప్లాంటేషన్ రిసార్టులు, లోయవైపు ఉన్న హోమ్ స్టేలు, లేక్ సైడ్ ప్రాపర్టీలుం ఇవన్నీ ప్రకతి మధ్య కలిసిపోయిన అనుభవాన్ని ఇస్తాయి.రాత్రి సమయంలో వర్షం చినుకుల శబ్దం అనేది వినసొంపైన శబ్దంగా అనిపిస్తుంది.ప్రతీ ఉదయం విండో తెరిస్తే చల్లని తాజా గాలి, తడిసిన మొక్కల సువాసనలు, దూరంలో కనిపించే ఫాగ్ ఇవన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.మున్నార్..వర్షాకాలంలో మున్నార్ టీ గార్డెన్స్ మధ్య నడుస్తుంటే ప్రతీ క్షణం మేజికల్గా అనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కొండల మధ్య తిరగడాన్ని చూస్తుంటే సమయం కూడా నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.కూర్గ్..కూర్గ్ కాఫీ ఎస్టేట్స్లో వర్షం పడిన తరువాత వచ్చే కాఫీ వాసన చాలా రోజులు గుర్తుండిపోతుంది. చిన్న జలపాతం, గ్రీన్ వ్యాలీస్, తొలి మంచుతో కలిసిన రోడ్డు మార్గాల్లో వెళ్తుంటే సైలెంట్ మెలోడీలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది.వయనాడ్..వయనాడ్ అడవుల మధ్య ట్రావెల్ చేస్తుంటే ప్రకృతి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాంబూ ఫారెస్ట్, జలపాతాలు, లేక్స్ అన్నీ మాన్ సూన్ లో మరింత లైవ్లీగా మారుతాయి.చిక్మగళూరు..చిక్మగళూరు కొండల్లో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తే మేఘాల మధ్య నుండి వెలుగు బయటికి వస్తున్న దశ్యాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.అరకు వ్యాలీ..ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ కూడా ఈ సీజన్ లో మరింత అందంగా మారిపోతుంది. కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా పరిసరాలు అన్ని చినుకులతో కలిసి ఒక ఫ్రెష్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.ఏం తినాలి?కేరళలో అప్పం అండ్ వెజిటెబుల్ స్టూని వర్షం పడుతున్నప్పుడు తినడం అనేది ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే తాజా మసాలాలతో తయారు చేసిన కూరలు లోకల్ ఫ్లేవర్ను పరిచయం చేస్తాయి.కూర్గ్లో ఫిల్టర్ కాఫీ ప్రతీ సిప్పులో కాఫీ ఎస్టేట్ అరోమా ఉంటుంది. చిక్మగళూరు కాఫీ కూడా ట్రావెల్ మెమోరీస్లో స్పెషల్ ప్లేస్ను పొందుతుంది.తమిళనాడు హిల్ స్టేషన్ లో హాట్ హాట్ ఇడ్లీలు, దోశ, పొంగల్ చల్లని వాతావరణంలో ఒకరకమైన కంఫర్ట్ను ఇస్తాయి.అరకులో బాంబూ చికెన్, ట్రైబల్ వంటకాలు, ఫ్రెష్ కాఫీ కాంబినేషన్ అనేవి లోకల్ కల్చర్ని రుచుల ద్వారా తెలుసుకునే అవకాశంగానే భావించవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..మాన్ సూన్ బెస్ట్ టైమ్: జూన్ నుండి సెప్టెంబర్ వరకు సౌత్ ఇండియాలో ప్రకతి దర్శనం అత్యంత అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఫేమస్ప్రాంతాలు: పశ్చిమ కనుములు అనేవి యునెస్కో జీవ వైవిధ్యప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. స్లో ట్రావెల్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీతో పాటు ప్రశాంతమైన హాలిడేస్ కోసం వర్షాకాలం చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్లే దారి, డెస్టినేషన్ లో పరిస్థితి గురించి తెలుసుకోవడం మరవద్దు.గమనిక: ట్రావెల్, బడ్జెట్ వివరాలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకోగలరు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?
ఈ ఏడాది సాంగ్రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ వేడుకలో పాప్ గాయని, గేయ రచయిత్రి టేలర్ స్విఫ్ట్ ప్రదాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస పరంగానే కాకుండా చేతికి ధరించి ఉంగరం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అంతేగాదు ఈ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమానికి విచ్చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా చరిత్ర సృష్టించిందామె. ఈ ప్రత్యేక వేడుక కోసం పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ హుందాగా బ్లాక్ కలర్ పూల గివెన్చీ గౌనులో రెడ్కార్పెట్పైకి అడుగుపెట్టింది. దూరం నుంచి చూస్తే ఆ గౌను చాలా సింపుల్గా క్లాసిక్గా ఉన్నా..దగ్గరకు వస్తే..ఆ డ్రెస్పైనే కనిపిస్తున్న ఎండ్రాయిడరీ పూల లుక్ హైలెట్గా నిలవడం విశేషం. ఈ డిజైనర్వేర్కి అనుగుణంగా చేతిక ధరించి ఆభరణంతో..భారతీయతను జోడించింది. టేలర్ స్విఫ్ట్ చేతికి భారతీయ లగ్జరీ ఆభరణాల సంస్థ అమ్రపాలి జ్యువెల్స్ రూబీ డైమండ్ ఉంగరం ధరించింది. రాజస్థాన్ 18 క్యారెట్ డైమండ్ అండ్ రూబీ రింగ్గా పిలిచే ఆభరణం ప్రత్యేకంగా నిలవడమే గాక, అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ ఉంగరం 18-క్యారెట్ బంగారంలో పొదిగిన 2.41-క్యారెట్ల అండాకారపు రూబీ రత్నం. దాని చుట్టూ పూల వలయం ఆకారంలో మెరిసే రోజ్-కట్ వజ్రాలు అమర్చబడి ఉన్నాయి. ముదురు గులాబీ-ఎరుపు రంగు రూబీ ఈ ఆభరణానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా, వజ్రాలు పాతకాలపు శోభను, పురాతన హస్తకళా నైపుణ్యాన్ని హైలెట్ చేశాయి. దీన ధర వచ్చేసి భారత కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 9.4 లక్షలట. ఈ మేరకు అమ్రపాలి జ్యువెల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో ఇది భారతీయ రాజరిక హస్తకళకు నిజమైన నివాళిగా పేర్కొనడం గమనార్హం. అలాగే మరో చేతి వజ్రాల బ్రాసెలెట్, సున్నితమైన సిట్రిన్ డ్రాప్చెవిపోగులను జతచేస్తూ..చాలా సింపుల్గా లగ్జరీయస్గా సందడి చేసింది టేలర్ స్విఫ్ట్. (చదవండి: పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ..! తొలి ప్రయత్నంలోనే సఫలం కానీ..) -
స్నాక్ సెంటర్: నోరూరించే.. వెరైటీ వంటకాలు!
ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి.బాంబే ఐస్ హల్వా..కావలసినవి:పాలు: ఒకటిన్నర కప్పు,పంచదార: కప్పు,కార్న్ ఫ్లోర్: 1/4 కప్పు,నెయ్యి: 1/4 కప్పు,ఆరెంజ్ ఫుడ్ కలర్: టీ స్పూన్,ఏలకుల పొడి: కొద్దిగా, బాదం ముక్కలు: టేబుల్ స్పూన్,పిస్తా ముక్కలు: టేబుల్ స్పూన్.తయారీ:ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి.స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్గా కలుపుతుండాలి.ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్తో పాటుగా నెయ్యి వేయండి.మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్ ఏలకుల పొడి వేసి బాగా కలపండి.మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి.ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి.ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్ పేపర్ షీట్ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి.ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్ పేపర్ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి.హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్ పేపర్తో సహా ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్ హల్వా సిద్ధం!మసాలా చీజ్ టోస్ట్..కావలసినవి:ఉల్లిపాయ, క్యాప్సికమ్,క్యారట్: కప్పు (సన్నగా తరిగినవి),కారం: 1/2 టీస్పూన్,మిరియాల పొడి: 1/2 టీస్పూన్,ధనియాల పొడి: 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా,బ్రెడ్ స్లైసెస్: 2,చీజ్: తగినంతతయారీ:ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్ ముక్కలను తీసుకోండి.అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.ఈ కూరగాయల మిశ్రమాన్ని ముక్కలు కాస్త మెత్తబడే వరకు పాన్ పై లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి.ఆ తర్వాత ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని, ఒక వైపు మాత్రమే లైట్గా కాల్చండి. ఇప్పుడు బ్రెడ్ కాల్చిన వైపున మనం తయారుచేసి పెట్టుకున్న వెజిటబుల్ మసాలా మిశ్రమాన్ని సమానంగా పరచండి.ఆ మసాలా పైన తగినంత చీజ్ వేసి, దానిని కరగనివ్వండి.బ్రెడ్ కింద వైపు చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత, అలాగే పైన చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడివేడి సువాసనలతో కూడిన మసాలా చీజ్ టోస్ట్ సిద్ధం.ఖట్టా మూంగ్..కావలసినవి:పచ్చ పెసలు: 2 కప్పులు (నానబెట్టినవి),పుల్లటి పెరుగు: కప్పు,శనగపిండి: 3 టేబుల్ స్పూన్లు,కారం: 2 టీస్పూన్లు,పసుపు: 2 టీస్పూన్లు,ధనియాల పొడి: 2 టీస్పూన్లు,జీలకర్ర: టీస్పూన్,ఆవాలు: టీస్పూన్,పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి),కరివేపాకు: 5–6 ఆకులు,అల్లం ముక్కలు (సన్నని తరుగు): 5–6,కొత్తిమీర: 1/2 కప్పు (సన్నగా తరిగినది),నూనె: సరిపడినంత, నీళ్లు.తయారీ:ముందుగా నానబెట్టిన పెసలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి.అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.పెసలు ఉడికేలోపు, ఒక గిన్నెలో శనగపిండి, పుల్లటి పెరుగు, కారం, పసుపు, ఒక కప్పు నీరు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, మీడియం మంట మీద కొన్ని సెకన్ల పాటు వేయించండి.తాలింపు వేగాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును పాన్లో వేసి, తాలింపు అంతా పప్పుకు పట్టేలా బాగా కలిపి.. రెండు నిమిషాల పాటు ఉడికించండి.ఆ తర్వాత, మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి–పెరుగు మిశ్రమాన్ని, ధనియాల పొడిని ఇందులో వేసి బాగా కలపండి.మంటను సిమ్లో పెట్టి 3–4 నిమిషాల పాటు ఉడకనిచ్చి, స్టవ్ ఆఫ్ చేయండి.చివరగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుజరాతీ స్పెషల్ ఖట్టా మూంగ్ రెడీ! ఇది చపాతీలు, పూరీలు, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. -
92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..
తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్లుక్లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్ సైన్స్ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్నెస్ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్నెస్ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్, తేలికపాటి జాగింగ్, లక్షిత స్ప్రింట్ల శ్రేణి, వాకింగ్, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలుఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్నెస్కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost) (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
కాబోయే అమ్మకు కడుపులో వికారం
గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్ సిక్నెస్’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్ కారణమవుతుంది. మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మార్నింగ్ సిక్నెస్ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్ డైట్ తీసుకుంటూ ఉండటం మేలు. ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్ సిక్నెస్ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. వాంతుల కారణంగా బిడ్డకు పోషకాలు అందవా?కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వాంతులు అవుతున్నా బిడ్డకు అందాల్సిన పోషకాలు అందుతూనే ఉంటాయి.ఇటీవలి అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే...ఇటీవల ఓ తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... గర్భవతుల్లో వాంతులకు ప్రధానంగా గ్రోత్ డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ –15 (జీడీఎఫ్–15) అనే అంశం కూడా ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ ఫ్యాక్టర్ వల్ల కొత్తగా గర్భధారణ జరిగిన మహిళల్లో... ఆకలి లేకపోవడం, ఏ ఆహారమూ రుచిగా అనిపించక΄ోవడం / రుచి తెలియక΄ోవడం, వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం తాజాగా వెల్లడయ్యింది. గర్భధారణ తర్వాత మహిళల్లో వాంతులు ఎందుకంటే...ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. మహిళ దేహానికి ఈ హర్మోన్ ఒక సందేశం పంపిస్తుంది. అదేమిటంటే... ‘ఈ దేహంలో గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలనెలా వచ్చే పీరియడ్స్ ప్రక్రియను ఆపేసి, ఇక గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రొజెస్టెరాన్ను స్రవించమనీ, తద్వారా... అండం ఆశ్రయం తీసుకోవాల్సిన ‘ఎండోమెట్రియమ్–యుటెరైన్’ పొరలను మరింత మందంగా చేయడం, తద్వారా గర్భం నిలబడేలా చేయాలం’టూ ఈ హెచ్సీజీ హార్మోన్ ద్వారా దేహానికి సందేశం అందుతుంది. అయితే కొందరిలో ఈ ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిన్ (హెచ్సీజీ) చాలా తక్కువ మోతాదులో, మరికొందరిలో చాలా ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఆ హార్మోన్ కారణంగా గర్భవతుల్లో కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఓ మోస్తరుగా, మరికొంతమందిలో చాలా ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. డాక్టర్ పి. స్వప్న, సీనియర్ కన్సల్టెంట్ అబ్స్టెట్రిక్స్ – గైనకాలజీ నిర్వహణ: యాసీన్(చదవండి: ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్) -
ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, నీతా అంబానీ కాలాతీమైన చేనేత వస్త్రాలతో సదా ఆకట్టుకుంటారు. మన భారతీయ వారసత్వాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని తన ఫ్యాషన్ శైలితో ప్రపంచానికి చాటుతుంటారు. ఈసారి అలానే అంతర్జాతీయ వైద్యుల సమావేశంలో అత్యద్భుతమైన బనారసి చీరలో మెరిశారామె.విలాసవంతమైన కటన్ సిల్క్తో నేసిన ఈ చీరలో, టీల్-ఆక్వా రంగుల మనోహరమైన కలయిక నీతాకు రాజసమైన ఆకర్షణను అందించింది. ప్రకృతిని తలపించే బంగారు జరీ పూల డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బనారస్ నేతలో అత్యంత క్లిష్టమైన కడ్వానేత ఇది. ఈ చీరలో ప్రతి డిజైన్ను వస్త్రం ఉపరితలంపై ఎబ్రాయిడరీ చేయకుండా విడివిడిగా వస్త్రంలోనే నేస్తారు. దీని తయారీకి మూడు నెలలు పైనే పట్టిందట. ఈ చీరను మహమ్మద్ యాసిన్, ఇక్బాల్ అహ్మద్ రూపొందించారు. ఆ చీరల కళాకారులు దశాబ్దాల తరబడి నైపుణ్యం, ప్రతి దారంలో స్పష్టంగా కనిపిస్తుంది. చీరపై అడ్డంగా ఉన్న బంగారు జరీ పూల అల్లిక, మొఘల్ తోటల డిజైన్లో రూపొందించారు. ఒకరకంగా ఇది నాటి వైభవాన్ని కళముందు ప్రతిబింబించేలా చారిత్రక వైభవాన్ని జోడించారు. ఈ చీరకు సరిపోయే మెరిసే వజ్రాల చెవిపోగులు, గాజులు, ఉంగరాలు ఎంచుకున్నారామె. జుట్టు తాజా తెల్లని పువ్వులతో అలకరించి చక్కగా ముడిలా తీర్చిదిద్దారు. అలాగే నీతా తన రూపం హుందాగా కనిపించేలా లైట్ మేకప్ని ఎంచుకున్నారు. ఇక్కడ నీతా చీర చేనేత కళాకారుల అసామాన్య నైపుణ్యాన్ని చాటడమే కాకుండా సందర్భోచితంగా హుందాగా ఎలా దుస్తులు ధరించాలో చెబుతున్నట్లుగా ఉంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) (చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! చివరికి విజయ్ సైతం..జ) -
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
హెయిర్ సెట్ చేయడానికి.. ఈ 'క్యాప్స్లాక్'!
హెయిర్ సెట్ చేయడానికి టైమ్ లేకపోయినా, బార్బర్ చేసిన పని కాస్త అతిగా అనిపించినా, లేదా ‘ఈరోజు కాస్త స్టయిలిష్గా కనిపించాలి’ అనిపించినా, ఒక క్యాప్ పెట్టుకుంటే చాలు– లుక్ ఆటోమేటిక్గా కూల్లాక్ అయిపోతుంది. అయితే, ఈ క్యాప్ కేవలం తలకు కవర్లా కాకుండా, మీ స్టయిల్కి ఒక కిరీటంలా కనిపించాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!బేస్బాల్ క్యాప్ ఎప్పటికీ క్లాసిక్!ఫ్యాషన్ ట్రెండ్స్ మారినా, బేస్బాల్ క్యాప్ మాత్రం ఎప్పుడూ ఔటాఫ్ స్టయిల్ కాదు. జీన్ ్స, టీషర్ట్, షార్ట్స్– ఏ ఔట్ఫిట్తో అయినా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ముఖ్యంగా నేవీ, బ్లాక్, వైట్ కలర్స్లో ఉంటే ఎప్పుడైనా కళ్లుమూసుకుని వేసేయొచ్చు.లోగో మ్యాజిక్!కొన్ని క్యాప్స్పై చిన్న లోగో ఉంటేనే సరిపోతుంది. ఆ చిన్న లోగోనే పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. స్పోర్ట్స్ లోగోలు లేదా మినిమల్ బ్రాండ్ ఎంబ్రాయిడరీలు ఉన్న క్యాప్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి.ట్రక్కర్ క్యాప్స్కి గాలి ఫుల్!వెనుక భాగం మెష్తో ఉండే ట్రక్కర్ క్యాప్స్ సమ్మర్కి బెస్ట్. గాలి బాగా ఆడుతుంది, చెమట తక్కువగా ఇబ్బంది పెడుతుంది. బైక్ రైడ్స్, ట్రావెల్స్, వీకెండ్ ఔటింగ్స్కి ఇవి పర్ఫెక్ట్.క్లాసిక్ స్ట్రీట్ స్టైల్ఒక వైట్ టీషర్ట్, ఓవర్సైజ్డ్ డెనిమ్ జాకెట్, బ్లాక్ లేదా నేవీ క్యాప్ జత చేస్తే చాలు. ఇది ఎప్పటికీ ఫెయిల్ అవని కాంబినేషన్ . సింపుల్గా కనిపించినా స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది.వెకేషన్ వైబ్లైట్ వెయిట్ లినెన్ షర్ట్, షార్ట్స్తో పాటు బీజ్ లేదా క్రీమ్ కలర్ క్యాప్ పెట్టుకుంటే హాలిడే మోడ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. బీచ్కి వెళ్లకపోయినా, చూసేవాళ్లకు మాత్రం మీరు వెకేషన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది.ఆల్ బ్లాక్ ఆటిట్యూడ్బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్ ్స, బ్లాక్ క్యాప్– ఈ కాంబో ఎప్పుడూ పవర్ఫుల్గా కనిపిస్తుంది. అయితే మొత్తం లుక్ బ్లాక్లోనే ఉంటే, ఒక వాచ్ లేదా వైట్ స్నీకర్స్తో చిన్న కాంట్రాస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు.జాగ్రత్తలు!- క్యాప్ పెట్టుకున్నారంటే స్టిక్కర్లు, ట్యాగులు తీసేయండి. లేదంటే కొత్తగా కొన్నానని ప్రపంచానికి ప్రకటన ఇచ్చినట్టే ఉంటుంది.- మురికి పట్టిన క్యాప్తో స్టయిల్ కంటే అలసత్వమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేయండి.- ఇండోర్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ క్యాప్ తీసేయకుండా ఉంటే, అది అలవాటు ఎక్కువైనట్టే. సందర్భాన్ని బట్టి క్యాప్ను క్యారీ చేయాలి. - కొండి దీపిక -
అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్!
ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ ‘ఇన్యూమీ’ సౌందర్య ప్రేమికుల కోసం ఒక సరికొత్త, వినూత్నమైన పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘నానో హైడ్రా ప్రో’ పేరుతో రూపొందించిన ఈ హైటెక్ గాడ్జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల కలయికతో పనిచేస్తుంది.ఈ ఆధునిక నానో హైడ్రా ప్రో డివైజ్లో ఆటోమేటెడ్ డ్యుయల్–పంప్ మెకానిజంతో పాటు ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది చర్మ సంరక్షణకు అవసరమైన లిక్విడ్లను అత్యంత సూక్ష్మమైన స్ప్రే రూపంలోకి మారుస్తుంది. దీనివల్ల స్కిన్ కేర్ లిక్విడ్స్ చర్మం లోపలి పొరల వరకు సులభంగా చేరుకుని, చర్మాన్ని ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్గా ఉంచుతుంది.ప్రయాణాల్లో సైతం ఎంతో సులభంగా తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ డివైస్లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. డివైజ్ను ఎలా ఉపయోగించాలో గైడ్ చేయడానికి ప్రత్యేక డిస్ప్లే, సెన్సర్లు ఇందులో ఉంటాయి. దీనిని ఫోన్ యాప్తో అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాతావరణ పరిస్థితులను బట్టి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు రిమైండర్లను పంపుతూ ఒక పర్సనల్ స్కిన్ కేర్ కన్సల్టెంట్లా ఈ డివైజ్ సహాయపడుతుంది. ఇందులో స్కిన్ కేర్ లిక్విడ్స్ నింపుకోవడానికి వీలుగా సులభంగా మార్చుకోగలిగే మ్యాగ్నెటిక్ క్యాప్సూల్స్ ఉండటం విశేషం.పురాతన ఈజిప్షియన్, భారతీయ, గ్రీకు, రోమన్ ప్రజలు కుంకుమపువ్వును సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా స్నానం చేయడానికి కుంకుమపువ్వు కలిపిన నీరు/పాలు ఉపయోగించేదట! తేనెతో పులియబెట్టిన గుర్రం పాలతో నిండిన టబ్లో స్నానం చేయడం, ఆమె ఆచరించిన సౌందర్య మార్గాలలో ఒకటి. ఆధునిక కాలంలో కూడా అనేక లగ్జరీ స్కిన్ కేర్ బ్రాండ్స్ క్లియోపాత్రా వాడిన పాలు, తేనె, కుంకుమపువ్వు ఫార్ములాను ఆధారంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.ఎండల్లోనూ మెరిసేలా!ఉక్కపోత, వేడి వల్ల వేసవిలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో సన్ స్క్రీన్ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన సన్ బర్న్ బారిన పడితే కలబంద గుజ్జు, జింక్ ఉన్న క్రీములు, ఐస్ ప్యాక్స్తో చర్మాన్ని చల్లబరచుకోవాలి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మళ్లీ తాజాగా మార్చవచ్చు. అందువల్ల ఎక్స్ఫోలియేషన్పై దృష్టిపెట్టాలి.మచ్చలు, మొటిమలు ఏ కాలంలోనైనా రావచ్చు. కానీ వేసవిలో ఇవి మరింత ఎక్కువవుతాయి. మొటిమలు వేధిస్తున్నప్పుడు గ్లైకోలిక్ యాసిడ్ లేదా శాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్సర్ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉన్నట్లయితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. -
ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం.చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి.ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది.కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం?కార్టిసోల్ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది... రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ, రక్తపోటు నిర్వహణ ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందన శరీర జీవక్రియలు (మెటబాలిజం) శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.ఆల్డోస్టెరోన్ పని ఏమిటి?ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ వ్యాధిని అనుమానించాలి. సరైన పరీక్షలతో దీన్ని గుర్తించి చికిత్స చేస్తే బీపీని గణనీయంగా నియంత్రించవచ్చు.అడ్రినల్ గ్రంథి ఆరోగ్యానికి చేయాల్సిందేమిటి...?కంటినిండా నిద్ర క్రమబద్ధంగా చేసే వ్యాయామం ఒత్తిడి నియంత్రణ ధ్యానం సమతుల్య ఆహారం... ఇవి అవసరం. చివరిగా... అడ్రినల్ గ్రంథులు పరిమాణంలో చిన్నవైనా, జీవానికి అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన గ్రంథులు. శరీర సమతుల్యతను కాపాడడంలో ఇవి చేసే పని అసాధారణం. అందుకే శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి,సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, -
పచ్చగా కళకళ.. పక్షుల కిలకిల!
ఢిల్లీ మహా నగరమంటే పొద్దెక్కక ముందే రోడ్డెక్కిన వాహనాలు, నాన్స్టాప్గా మోగే హారన్ మోతలు, గందరగోళాలు, గజిబిజీ బతుకులు.. కాని అదే నగరంలో మరోప్రదేశంలో తెల్లవారకముందే వినిపించే పక్షుల కిలకిలారావాలు, సూర్యకాంతి వెలుగులో జిలుగులు విరజిమ్మే సీతాకోక చిలుకలు, ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఎగబాకే మొక్కలు... ఇదంతా ఓ ఇంటిపైన ... దీని వెనుక ఉంది ఓ కుర్రాడి తపన.ఢిల్లీ వాసి అమన్ శర్మకి 19 ఏళ్లు. బాల్యం నుంచి అతని అమ్మానాన్నలు తరచూ పక్షుల సంరక్షణా కేంద్రాలకు తీసుకెళ్లేవారు. లాక్డౌన్ టైంలో మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమన్కి అప్పుడొచ్చిన ఐడియానే ‘అర్బన్ జంగిల్.’ తన ఇంటిపైన ఉన్న 1500 చదరపు అడుగులను చిన్నసైజు అడవిలా మార్చాలనుకున్నాడు. ఒక్కొక్క పూలకుంyీ ని ఏర్పాటు చేస్తూ వాటిని సంరక్షిస్తూ వచ్చాడు. అలా తన ఇంటి మేడమీద 500 మొక్కలను పెంచాడు. ఒకప్పుడు అలారం పెట్టుకుని లేచే అమన్కి ఇప్పుడు రోజూ పక్షుల కిలకిలారావాలతోనే మెలకువ వస్తుంది. మేడమీదకెళ్లగానే సీతాకోక చిలుకలు స్వాగతం పలుకుతాయి. వాటిని తరుముకుంటూ వచ్చి జామపళ్లను తింటూ చిలుకలు తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.దాదాపు వందకు పైగా రకాల చెట్లు పెరుగుతున్న ఈ అర్బన్ జంగిల్లో 25 నుంచి 30 రకాల పక్షిజాతులు రోజూ వస్తుంటాయి. ఢిల్లీ పరిసరప్రాంతాలలో ఇలాంటి పక్షిజాతులు కూడా ఉన్నాయా అంటూ... చూసిన వారంతా విస్తు΄ోతున్నారు. పక్షులను, కీటకాలను ఆకర్షించడానికి నిమ్మ, కరివేపాకు, మిల్క్వీడ్, జామ, దానిమ్మ, స΄ోట వంటి చెట్లను నాటితే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, చిలుకలతోపాటు ఇతర పక్షులను ఆకర్షించవచ్చని అమన్ పేర్కొన్నాడు.అమన్ 14 ఏళ్ల వయసులోనే పిల్లల కోసం పిల్లలు మాత్రమే నడిపే ‘కుకు అబౌట్ నేచర్ క్లబ్’ అనే క్లబ్నుప్రారంభించాడు. ఈ క్లబ్ద్వారా పిల్లల్ని ఢిల్లీ పరివాహకప్రాంతాల్లోని నేచర్ పార్క్లకు తీసుకెళ్లేవాడు. అచిరకాలంలోనే ప్రకృతి ప్రేమికులు అనేకమంది అమన్తో జతకట్టారు. అలా మొదలైన ఈ చిన్నపిల్లల క్లబ్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బర్డ్ కమ్యూనిటీ క్లబ్గా తయారైంది.పర్యావరణ పరిరక్షణలో అమన్ చూపిన చొరవకు ఐక్యరాజ్యసమితి (యుఎన్జీఏ) నోబుల్ పీస్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక వేదికల నుంచి పిలుపు వచ్చింది. అంతేకాదు నగరాల్లోని వన్య్రపాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ బ్రాండ్ నికాన్ నియమించిన అంబాసిడర్లలో అత్యంత పిన్న వయస్కుడిగా అమన్ గుర్తింపుపొందాడు. -
లిక్విడ్ నైట్రోజన్తో కూడిన ఆహారం సురక్షితమేనా?
అసాధారణమైన ఘనీభవించిన డెజర్ట్ల తయారీ కోసం, అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ద్రవ నైట్రోజన్ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో, ద్రవ నైట్రోజన్తో తయారుచేసిన ఆహారాలు, చూడటానికి ఆసక్తికలిగించే ఫ్యాషన్ ట్రెండ్గా మారాయి. సాధారణ ఫ్రీజింగ్ పద్ధతుల కంటే ద్రవ నైట్రోజన్ ఉష్ణోగ్రత ఆహారపదార్థాలను భిన్నంగా గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల వాటికి విభిన్నమైన చిక్కదనం, ఆకృతి రావడంతో పాటు, ఒక ప్రత్యేకమైన ఆవిరి కూడా వెలువడుతుంది. ఈ ఆవిరిని చెఫ్లు "డ్రాగన్ బ్రీత్" స్నాక్స్ కోసం ఉపయోగిస్తారు. ఎవరైనా డ్రాగన్ బ్రీత్ స్నాక్ను కొరికినప్పుడు, అది ఒక ఆవిరి మేఘాన్ని విడుదల చేస్తుంది. అంటే..ఇది వారి నోటి నుంచి పొగ వస్తున్నట్లుగా ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీన్ని డ్రాగన్ శ్వాస లేదా స్వర్గపు శ్వాస వంటి ట్రెండ్లుగా పిలుస్తారు. అలాంటి ఆహారాలకు కేరాఫ్ బెంగళూరులోని వివి పురం ఫుడ్ స్ట్రీట్. పాపం ఓ పెళ్లైన కొంత జంట అక్కడకువెళ్లి ఆ ట్రెండ్ ఫుడ్ని సరదాగా ట్రైం చేయడంతో ఏం జరిగిందో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు ఇలాంటి ఆహారం తినేటప్పుడు జాగురకతతో తినాలంటూ ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.అసలేం జరిగిందంటే..జస్ట్ పెళ్లై నాలుగురోజులైంది. ఆమె సరదాగా భర్తతో కలిసి ఈ స్మోకీ ట్రెండ్ ఫుడ్ని టేస్ట్ చేయాలని వి.వి.పురం ఫుడ్ స్ట్రీట్కు వెళ్లారు. అక్కడ ద్రవ నైట్రోజన్తో పూత పూసి.. పొగలు వెలువరించే బిస్కెట్లు తిన్నారు. అంతే ఆ నవవధువుకి నోటి నుంచి రక్తస్రావం, ఎండోస్కోపీలో అన్నవాహిక , జీర్ణాశయ శ్లేష్మ పొర గణనీయంగా క్షీణించినట్లు తేలింది. ఆ తర్వాత రెండు చేతులు, కాళ్లలో బలహీనత మొదలై..ఒక నెల వరకు మంచానికే పరిమితమైంది. వైద్య పరీక్షల్లో నరాల ప్రసరణ పరీక్షలలో అక్యూట్ మోటార్ ఆక్సోనల్ న్యూరోపతి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరదాగా తిన్న ఆహారం ఆటోఇమ్యూన్ న్యూరోపతికి దారితీసింది. తినేటప్పుడు తస్మాత్ జాగ్రత్త..ద్రవనైట్రోజన్తో కూడిన ఆహారాలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. అవి పూర్తిగా ఆవిరైకపోక ముందే తింటే నోరు, అన్న వాహిక, కడుపుకి తీవ్రమైన క్రయోజెనిక్ కాలిన గాయలు ఏర్పడి, కోతలు, రక్తస్రావం, చిల్లులు పడటానికి దారితీస్తుందట. ఆ నేపథ్యంలోనే ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దీనిపై స్పష్టమైన హచ్చరికలు జారీ చేసింది. పైగా ఆహారాన్ని ప్లేట్లో వడ్డించేటప్పుడు లేదా కస్టమర్లకు నేరుగా అందించే ముందు ద్రవ నైట్రోజన్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించింది. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో లేదా ఐస్క్రీంల తయారీలో మాత్రమే దీనిని శీతలీకరణ (cooling) ఏజెంట్గా ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఒకవేళ సరదాగా ఇలాంటి క్రయోజనిగ్ ఫుడ్ని ప్రయత్నించాలనుకుంటే..ఆ పొగ అంతా అయిపోయేదాక వెయిట్ చేసి అప్పుడు ఆరగించాలని అంటున్నారు. నేరుగా అలానే తింటే తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ ఏకంగా 19..) -
జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ..
కొందరు సక్సెస్కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్ అలాంటి ఘనతనే సాధించింది.ఆ అమ్మాయే రాయ్పూర్కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్ గవర్నెమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్ టీచర్ లేదా లెక్చరర్ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Charu Pandey, starting her journey at 23 with the dream of a government job, has inspired lakhs of young aspirants by clearing 19 competitive exams, says, "... My family is very happy with this achievement of mine. I am receiving an award for… pic.twitter.com/Zo21tNMxPs— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2026 (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!) -
నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..
ఇటీవల కాలంలో లేఆఫ్స్ ఎంత కామన్గా అయిపోయాయో తెలిసిందే. ఉద్యోగ భద్రత కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పరిస్థితులు ఇవి. అలాంటి స్థితిని ఎలా హ్యాండిల్ చేసి..సులభంగా మన కెరీర్ని పునర్నిర్మించుకోగలమో చెప్పే కథ ఇది. అందుకు కుటుంబ మద్దతు తోడైతే తిరుగే ఉండదంటున్నాడు ఈ వ్యక్తి. అంతేగాదు తన బంగారు తల్లే ఈ సమస్య నుంచి బటయపడేలా కొండంత స్టైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు ఈ నాన్న. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది. హిమాన్షు ఝా అనే పారిశ్రామిక వేత్త తన జాబ్ పోయి ఏడాది అయిన సందర్భంగా.. నాటి తన పరిస్థితి గురించి వివరించాడు. తన కెరీర్లోని అత్యంత గడ్డుపరిస్థితిని ఆ ఏడాదిలో చవిచూశానంటూ..నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు. ఆకస్మికంగా చక్కటి కార్పొరేట్ ఉద్యోగం కోల్పోవడంతో.. ఒక్కసారిగా తన పరిస్థితి తలకిందులైనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఏం చేయాలో దిక్కుతోచని ఆ స్థితిలో తన భార్య, కూతురు ఎలా తన మద్దతుగా నిలిచారో చెబుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ కష్ట సమయంలో మన స్నేహితులు, బంధువులు ఎలా దూరమవుతారో, అలాగే మనకెంతో ప్రియమైన వారు ఎలా అండగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అంతేగాదు ఉద్యోగం కోల్పోవడంతో ఐదు పాఠాలను నేర్చుకున్నానంటున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెతో గడుపుతూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడూ.. ఆమె ఇక ఇప్పుడు మీకు నచ్చింది చేయండి నాన్న అంది. అప్పుడే అర్థమైంది జాబ్ పోవడం అంతం కాదు, కెరీర్లో ఎదురయ్యే ఎదురుదెబ్బ అంతిమం కాదని తెలుసుకోగలిగనంటున్నాడు. ఏ వయసులోనేనా మళ్లీ తిరిగి ప్రారంభించి నిలదొక్కుకోవచ్చు..అందుకు గుండె నిండా ధైర్యం కావాలి. అది ఉంటే చాలు..చతికిల పడినా..రాకెట్లా తిరిగి దూసుకుపోగలమని అవగతమైందని చెప్పుకొచ్చాడు హిమాన్షు. ఇది అప్పటి వరకు ఉన్న సౌకర్యవంతమైన స్థితి నుంచి బయటకు నెట్టి..స్ట్రాంగ్గా మరింత బలంగా నిలబడేందుకు అంకురార్పణ అవుతోందంటున్నాడు. తన కూతురు చెప్పినట్లుగా 44 ఏళ్ల వయసులో నా కలను అనుసరించి స్టార్టప్ ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా మారానని చెప్పాడు. నచ్చిన పనిచేయి నాన్న అంటూ మాట్లాడిన మాటలు..చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నా..ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించిందామె. ఈ పరిస్థితి.. ఎవరు మనకు ఆప్తులు..ఎవరు శత్రువులో కూడా తెలియజేస్తుంది. అలాగే దీంతోపాటు..అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం అని దానిపై సదా దృష్టిపెట్టమని కోరాడు. ఏళ్ల తరబడి కార్పొరేట్ లైప్ బిజీలో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని తెలుసుకున్నా..అంతర్గత శాంతికి ప్రయత్నించి మరీ.. నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు. అలాగే ఎక్కువగా భయపడే ఉద్యోగ తొలగింపు భయం..ఒక్కోసారి మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చే అధ్యయంగా కూడా మారుతుందని నమ్మకంగా చెబుతూ..తన పోస్ట్ని ముగించాడు హిమాన్షు. నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ..ముందుకు సాగకుండా..రాబోయేదాన్ని స్వీకరించకుండా, గతాన్ని పట్టుకుని వేళాడటమే తప్పు..మీకు అంతా మంచే జరుగుతుంది సార్ అని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వారు ఈ వ్యక్తి స్ఫూర్తినే తీసుకుంటూ...ముందుకు సాగండని హితవు పలుకుతున్నాడు హిమాన్షు.(చదవండి: ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే.) -
వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం!
వృక్షాసనం అంటే ‘చెట్టు భంగిమ‘ అని అర్థం. ‘వృక్షాసనం మనకు చెట్టు వంటి స్థిరత్వం, సమతుల్యత, ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం. ‘వృక్షాసనం అనేది ఒక కాలి మీద నిలబడి, శరీర సమతుల్యతను కాపాడుకునే యోగాసనం. చెట్టు మాదిరిగా స్థిరంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 4–6 గంటల వ్యవధి తర్వాత ఈ ఆసనం వేయడం అత్యంత శ్రేయస్కరం.వృక్షాసనం చేసే విధానం..యోగా మ్యాట్పై నిలబడి, రెండు కాళ్లను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలిపై నిలబడి, శరీర బరువును బ్యాలెన్స్ చేయండి.ఎడమ మోకాలిని వంచి, ఎడమ పాదాన్ని కుడి కాలి తొడ లోపలి భాగానికి (తొడమూలానికి వీలైనంత దగ్గరగా) గట్టిగా ఆన్చండి. రెండు చేతులను నెమ్మది గా పైకి లేపి, నమస్కార ముద్రలో అరచేతులను కలపాలి.ముందు భాగంలో ఏదైనా ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరిస్తూ, శ్వాసను సాధారణంగా తీసుకుంటూ 10–20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.ఇదే పద్ధతిని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచి మరోవైపు రిపీట్ చేయాలి..ప్రయోజనాలు..విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది, మనో నిబ్బరం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.కాళ్లు, చీలమండలు, వెన్నెముక దృఢంగా మారతాయి.నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకూరుతుంది.నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.శరీరం బ్యాలెన్స్, స్టెబిలిటీ పెరుగుతాయి.జాగ్రత్తలు..తీవ్రమైన మైగ్రేన్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉంటే ఈ ఆసనం వేయకూడదు.నిద్రలేమి సమస్య ఉన్నవారు దీనిని నిపుణుల సమక్షంలోనే చేయాలి.మోకాళ్లు, తుంటి లేదా మెడకు సంబంధించిన సర్జరీలు అయినవారు ఈ ఆసనాన్ని వేయరాదు.మొదటిసారి చేసేవారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి గోడ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా కుర్చీని పట్టుకుని చేయవచ్చు.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ!
అబ్రహాం లింకన్ కి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియానాలోని పిజన్ క్రీక్ దగ్గర ఉండేవాడు. చదువంటే పిచ్చి. పక్క ఊరిలో జోసియా క్రాఫోర్డ్ అనే రైతు దగ్గర ‘ద లైఫ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్’ అనే పుస్తకం ఉందని తెలిసింది. లింకన్ బతిమాలి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి వర్షం. గుడిసె కప్పులో నుంచి నీళ్లు కారి, పుస్తకం తడిసి నాశనం అయ్యింది.తెల్లారి లింకన్ ఏడుస్తూ క్రాఫోర్డ్ దగ్గరికి వెళ్లి, ‘నేను పుస్తకం పాడు చేశాను సార్’ అని ఒప్పుకున్నాడు. క్రాఫోర్డ్ దానికి ‘సరే, మూడు రోజులు నా పొలంలో పని చెయ్. అప్పు తీరిపోతుంది’ అన్నాడు. 11 ఏళ్ల లింకన్ మొక్కజొన్న పొలంలో, పందుల షెడ్డులో మూడు రోజులు కూలి చేశాడు. పుస్తకానికి ఖరీదు కట్టాడు. ఆ పుస్తకాన్ని మళ్లీ ఎండబెట్టి, అట్ట వేసి, పూర్తిగా చదివాడు. నిజాయితీ ఉన్నవాడు పైకి వస్తాడని ఈ ఘటన చెబుతోంది. -
ఆలోచిస్తూ బుర్ర ఎందుకు గీరుకుంటారో తెలుసా?
‘వినీష్... మన రాష్ట్రపతి పేరేంటి?’ అని టీచర్ అడిగితే వాడు లేచి బుర్ర గీరుకుంటాడు. శ్రేష్ఠ ఎగ్జామ్ రాస్తూ ఆన్సర్ గుర్తుకు రాక తల గీరుకుంటుంది.ఎందుకు అలా తల గీరుకుంటారు?మన చర్మం కింద లక్షల కొద్దీ నరాలు ఉంటాయి. తల గీరినప్పుడు ఆ నరాలు మెదడుకు మెసేజ్ పంపిస్తాయి. ఆ సిగ్నల్తో మెదడులో నిద్రపోతున్న భాగాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆలోచన వేగం పుంజుకుంటుంది. దీన్నే సైంటిస్టులు ‘సోమాటోసెన్సరీ యాక్టివేషన్’ అంటారు. తల గీరడం వల్ల అక్కడి చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా మెదడుకు ఎక్కువగా అందుతుంది. ఆక్సిజన్ అందిన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే ఒక్కసారిగా సమాధానం గుర్తొస్తుంది. మన మెదడు ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. సమాధానం దొరకకపోతే మెదడు పుస్తకాలు అన్నీ వెతుకుతుంది. ఆ సమయంలో బుర్ర గీరడం వల్ల మెదడుకు ఎక్స్ట్రా ఎనర్జీ అందినట్టు అవుతుంది. అందుకే సరైన జ్ఞాపకం టక్కున దొరుకుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే బుర్ర గోకడం అనేది అలసిపోయిన మెదడుకు మనం ఇచ్చే మసాజ్ లాంటిది. -
బడి తెరిచారోచ్..! స్కూల్ బ్యాగ్ సూత్రం ఇదే..
నీ బ్యాగ్ నీకు స్నేహితుడిలా ఉండాలి, శత్రువులా కాదు. అందుకే టైంటేబుల్ చూసి ఆ రోజుకి కావాల్సిన పుస్తకాలు, నోట్బుక్స్ మాత్రమే పెట్టుకో. లెక్కల పీరియడ్ లేనప్పుడు ఆ పెద్ద లెక్కల పుస్తకం ఎందుకు? ఒక పెన్సిల్ బాక్స్, అందులో 2 పెన్సిళ్లు, ఎరేజర్, షార్పనర్, ఒక పెన్ను, ఒక స్కేల్ చాలు. నీళ్ల బాటిల్ తప్పనిసరి. డీహైడ్రేషన్ అయితే బుర్ర పనిచేయదు మరి.లంచ్ బాక్స్, ఒక చిన్న కర్చీఫ్, వర్షాకాలం కాబట్టి చిన్న రెయిన్ కోట్ కూడా ఒక మూలన పెట్టుకో. సెల్ ఫోన్, ట్యాబ్ స్కూల్కి అస్సలు వద్దు. బ్యాగ్ని రెండు భుజాల మీద సరిగ్గా వేసుకో. బ్యాగ్ బెల్టులు వదులుగా కాకుండా బిగుతుగా పెట్టుకుంటే బరువు తెలియదు. గుర్తుంచుకో, మార్కులు తెచ్చేది బ్యాగ్లోని పుస్తకాలు కాదు, నీ బుర్రలోని ఆలోచనలు. కాబట్టి బ్యాగ్ తేలికగా ఉంచుకో, బుర్రని చురుగ్గా ఉంచుకో.వాటర్ బాటిల్ శాస్త్రంస్కూల్ బ్యాగ్లో అన్నింటికంటే ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? వాటర్ బాటిల్. నీళ్లు తాగే బాటిల్ ఎలా ఉండాలో తెలుసా? నీ వాటర్ బాటిల్ స్టీల్తో కానీ, కాపర్తో కానీ ఉంటే బెస్ట్. లేదంటే ’BPA Free’ అని రాసున్న ప్లాస్టిక్ బాటిల్ అయినా ఓకే. BPA అంటే విషం లాంటిది, అది నీళ్లలో కలిసిపోతే కడుపునొప్పి, జ్వరం వస్తాయి. రంగురంగుల బొమ్మల బాటిళ్లు బాగుంటాయి కానీ లోపల ఏ మెటీరియల్ ఉందో అమ్మతో చెక్ చేయించుకో. బాటిల్ మూత గట్టిగా ఉండాలి. లేకపోతే పుస్తకాలన్నీ తడిసి ‘వాటర్ పార్క్’ అయిపోతాయి. సైజు ముఖ్యం..5వ క్లాస్ పిల్లాడివి అయితే 750 ఎంఎల్ బాటిల్ చాలు.హైస్కూల్ హీరోవి అయితే 1 లీటర్ బాటిల్ ఉండాల్సిందే. నీ వయసుకి, నీ దాహానికి సరిపడే సైజు సెలెక్ట్ చేసుకో.సిప్పర్ ఉన్న బాటిల్ అయితే ఇంకా మంచిది.‘కడగడం కంపల్సరీ’. రోజూ బాటిల్ కడగడం మర్చిపోవద్దు.లోపల సబ్బు నీళ్లు పోసి బ్రష్తో తోమాలి. వారానికి ఒకసారి వేడి నీళ్లు, కాస్త ఉప్పు వేసి కడిగితే బ్యాక్టీరియా బైబై. -
కొన్ని సందర్భాల్లో.. మౌనమే సమాధానం!
మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం!మాటలు మంత్రంలా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్బాల్లో రిలేషన్స్లో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కా΄ాడుతుంది. అదెప్పుడో చూద్దాం..ముఖ్య విషయాలు చెబుతున్నప్పుడు..ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన విషయాలు కావొచ్చు.. ఇలా దేనికి సంబంధించి విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినడం తప్ప మధ్యలో కల్పించుకోకూడదు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటివరకూ మౌనంగా ఉండడమే ఉత్తమం.ముందే పరిష్కారం దొరికినప్పుడు..మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. కానీ, అదే విషయాన్ని మీరు మొదట్నుంచీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు.విషయం తెలియనప్పుడు..మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి కచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం తెలియకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే, ఇలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల΄ాలయే అవకాశం ఉంది.రుజువు చేసుకోలేనప్పుడు...మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరక ప్రభావం చూపే అవకాశం ఉంది.అవతలివారిని బాధపెట్టే సందర్భంలో...మన మాటల వల్ల మనకి కానీ, ఎదుటివారికి కానీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.మనసు బాగోలేనప్పుడు...అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి అలవోకగా మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ సమయంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం మంచిది. -
నేరేడు పండ్లు తింటున్నారా?
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి. నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. -
బరువు తగ్గాలంటే.. మోయాలంతే!
స్మార్ట్ ఉండాలంటే ఆలోచిస్తే సరిపోదు.. ఫిట్గా కూడా ఉండాలి. అలాంటప్పుడే బ్రెయిన్ బాగా పని చేస్తుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫిట్సెస్ సెంటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామాల్లో కూడా కొత్త విధానాలొచ్చేస్తున్నాయి. జిమ్, ఏరోబిక్స్, యోగా లాంటివి..కాని ఇవ్వన్నీ కామన్.. ఇప్పుడు కొత్తరకం ఫిట్నెస్ మంత్ర వచ్చింది అదే ‘రక్కింగ్’.కొత్త ఫిట్నెస్ ట్రెండ్ ఇప్పుడు బాగాప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట బరువున్న వెస్ట్ను లేదా బ్యాక్ప్యాక్ను ధరించి నడస్తూ వెళ్లాలి. అలా అనుకున్న టార్గెట్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఒకసారి టార్గెట్ పూర్తయ్యాక నడకలో కాస్త వేగాన్ని పెంచాలి. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఈ పద్ధతిని లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఈ రక్కింగ్ వల్ల కాళ్ల కండరాలు రక్తప్రసరణ జరిగి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వాస్తవానికి ఇదేం కొత్త పద్ధతేం కాదు.. మిలటరీ శిక్షణలో భాగంగా సైనికులకు తుపాకీ, బ్యాక్ప్యాక్ ఇచ్చి నడిపిస్తారు. ఈ పద్ధతినే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి కొత్తరకం ఫిట్నెస్ సూత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఊబకాయంతో బాధపడేవారికి మాత్రం ఈ రక్కింగ్ పద్ధతే కరెక్ట్... పైగా రక్కింగ్ చేయడానికి జిమ్లకు, యోగా క్లాసులకు వెళ్లక్కర్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటూ రక్కింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
నో గాసిప్స్ ప్లీజ్! ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే.. ఇలా చేయండి!
మనం జీవితంలో రెండు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటిలో చాడీలు చెప్పడం ఒకటైతే నిందలు వేయడం రెండోది. ఎదుటి వ్యక్తి గురించి చాడీలు చెప్పినా, నిందలు వేసినా.. మనం దిగజారిపోయినట్టే! కనుక మనం మాటను ఆచితూచి ఉపయోగించాలి లేదంటే చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే! మన స్నేహితులతోనో, బంధువులతోనో, సన్నిహితులతోనో మాట్లాడేటప్పుడు మన దగ్గర లేని వ్యక్తి గురించి ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు. ఇలాంటి ధోరణి హత్యతో, అత్యాచారంతో సమానమని, ఇతరుల గురించి విపరీతంగా అసూయపడే వారే ఇలాంటి ఇచ్చకాల మాటలకు పాల్పడుతుంటారని రామాయణం, మహాభారతంతో సహా పురాణాలన్నీ నొక్కి చె΄్పాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలూ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి ఆధారం లేకుండా ఇతరుల దోషాలను, లోపాలను, తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ మాట్లాడడాన్ని మహాపాపంగా బైబిల్ పరిగణించింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూప్రోత్సహించవద్దని, చేరదీయవద్దని గట్టిగా హెచ్చరించింది. ఇలా ఇచ్చకాలు మాట్లాడడాన్నే ఆంగ్లంలో గాసిప్స్ అని వ్యవహరిస్తారు. గాసిప్ మాట్లాడటం అంటే ఉత్తి పుణ్యానికి ఇతరుల మీద బురద చల్లడం, ఇతరుల ప్రతిష్టను, గౌరవ మర్యాదలను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం. ఇది సమాజానికి, వ్యక్తిగత జీవితానికి కూడా శ్రేయస్కరం కాదని మహాభారతంలో విదురుడు చె΄్పాడు. ఇతరుల గురించి పొరపాటున తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఒక్కటే దీనికి పరిహారమని బైబిల్ స్పష్టం చేసింది. ఇతరుల పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి నరకాలకు వెళతాడని, హీనమైన జన్మ ఎత్తుతాడని మహాభారతం పేర్కొంది.కనుక పనికి రాని ఇచ్చకాలు ఎప్పటికీ ప్రమాదమే. అది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. చెత్త ఆలోచనలు , చెత్త కబుర్లు మాట్లాడడం వల్ల అవి మనలోనిప్రాణశక్తిని హరించి వేయడమే కాకుండా మన జీవితంలో విలువైన సమయం వధా కావడానికి దోహదపడతాయి.పుకార్ల వల్ల చోటుచేసుకునే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా,ప్రాణాంతకంగా ఉంటాయి. గాసిప్లో మునిగి తేలే వ్యక్తి ఎటువంటి దారుణానికైనా ఒడిగడతాడు. గాసిప్స్కు పాల్పడే వ్యక్తి తాను మానసికంగా చెడిపోవడమే కాకుండా, ఇతరులను కూడా మానసికంగా చెడగొడతాడు.అంతేకాదు అతను వ్యాప్తి చేసే పుకార్ల వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ‘గాసిప్స్ వల్ల నిజం మరుగున పడిపోతుంది. అదొక కార్చిచ్చు లాంటిది. అది తన చుట్టూరా ఉన్న సమాజాన్ని దహించి వేస్తుంది. అది విషంతో సమానం.మనసులో ద్వేషాన్ని నింపుకున్న వాడే గాసిప్స్ను వ్యాప్తి చేస్తాడు. ఇటువంటి పనికిమాలిన కబుర్లు చెప్పడం ఎంత టైమ్ వేస్టో, వాటిని వినడం,ప్రోత్సహించడం కూడా అంతకన్నా ఎక్కువ టైమ్ వేస్ట్, ఇటువంటి వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇటువంటి గాలికబుర్లు చెప్పడంప్రారంభించగానే వాటిని తిరస్కరించడమో లేక వారిని ఆపు చేయడమో చేయాలి. లేదంటే అది కొన్ని సున్నితమైన గుండెల్ని బద్దలు చేయవచ్చు. మనసుల్ని, మనుషుల్ని కుప్పకూల్చవచ్చు. చివరకు మన వ్యక్తిత్వాన్నే సర్వనాశనం చేస్తుంది. నిస్సహాయుల్ని దారుణంగా దెబ్బతీస్తుంది’’ ఇటువంటి వ్యక్తుల్నిప్రోత్సహించే వారిని, చేరదీసే వారిని సైతం ఆ నీలినీడలు వెంటాడుతూనే ఉంటాయి.కేవలం మన పట్ల మనం మాట్లాడుకునే మాటలే ఎంతో ప్రభావం చూపిస్తే.. మరి మనం ఇతరుల జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడటం ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి.ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే ఆ వ్యక్తి అంత హితమైన వ్యక్తి కాదని వెంటనే గ్రహించాలి. మనసు నిండా కుళ్లుతోనూ, అసహనంతోనూ, అంతకుమించిన అసూయతోను అలాంటి గాలిమాటలు చెబుతున్నాడని అర్థం చేసుకుని అటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వకపోవడం మంచిది. ఏది ఏమైనా, గాసిప్ మాట్లాడే వ్యక్తి తనను తాను దుర్మార్గుడిగా పరిచయం చేసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. -
Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇవే మేలు!
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారిపోవడం, కాంతి విహీనంగా మారడం సహజం. అయితే మార్కెట్లో దొరికే కెమికల్ప్రొడక్ట్స్ కంటే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటితోనే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి ఓట్మీల్, హనీ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఎక్స్ఫోలియేటర్. ఓట్స్ను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి స్క్రబ్ లాగా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయడమే కాకుండా, తేనెలోని గుణాలు చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి.ముఖానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పసుపు, కాఫీతో పాటు తేనె కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, చర్మానికి మంచి తాజాదనాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన లుక్ను అందిస్తుంది.చాలామంది అరటిపండు తొక్కను పారేస్తుంటారు. కానీ, అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై మెల్లగా రుద్దడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది ముఖానికి ఇన్స్టంట్గా ఒక సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. -
ఈ ఐదు రాష్ట్రాలలోనే వీళ్లు ఎక్కువ..
సామాజిక కోణంలో చేసే నివేదికలు ఆప్రాంత, రాష్ట్ర, దేశంలోని జనాభా మనుగడ ఏ స్థాయిలో ఉందో సూచిస్తాయి. దీనిలో భాగంగానే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.దేశవ్యాప్తంగా 5.4 శాతం మంది మహిళలు వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, విడిపోయినవారు ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే పెద్ద రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు 11.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపుకు పైగా ఉంది. కేరళలో 10.4 శాతం ఉండగా దాని తర్వాతి స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా 8.6 శాతం, 8.0 శాతం, 7.6 శాతం వాటాలను నమోదు చేశాయి. ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు కలిసి జాతీయ స్థాయిలో మొదటి ఏడు స్థానాలలో ఐదింటిని ఆక్రమించాయి. బిహార్లో అత్యల్పంగా 2శాతంతో దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా ఉంది.దేశంలో ఈ ఐదు రాష్ట్రాలలోనే వితంతువులు, ఒంటరి, వృద్ధ మహిళా జనాభా అధికంగా ఉండటానికి గల కారణాలను ఎస్ఆర్ఎస్ శోధించింది. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, స్వతంత్రంగా జీవించడం, పనిచేసే వయస్సులో పురుషుల మరణాలు అధికంగా ఉండటం గమనించింది.ఇదే విషయంలో జాతీయ స్థాయిలో పురుషుల జాబితా చూస్తే.. భార్యను కోల్పోయిన, విడాకులు తీసుకున్న లేదా విడిపోయినవారి సగటు శాతం 1.6 ఉంది. కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 1.6 శాతం నమోదు కాగా, తమిళనాడు 2.9 శాతంతో అత్యధికంగా ఉంది. అయినప్పటికీ మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ శాతం చాలా తక్కువ. తమిళనాడులో జీవిత భాగస్వామి లేకుండా జీవిస్తున్న స్త్రీ, పురుషుల వాటాల మధ్య వ్యత్యాసం 8.7 శాతం పాయింట్లు కాగా, కేరళలో ఈ అంతరం 8.6 శాతం పాయింట్లుగా నమోదైంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ వ్యత్యాసం 3.8 శాతం పాయింట్లతో జాతీయ సగటును మించిపోయింది. -
ఆఫీస్బాయ్ నుంచి ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ రేంజ్కి..!
‘అక్కడే ఆగిపోకు... ముందుకు వెళ్లి చూడు’ అనేది వ్యక్తిత్వ వికాస పాఠాల్లో ఒకటి. ఆఫీస్ బాయ్గా పనిచేసిన ఫణిరాజ్ అక్కడే ఆగిపోలేదు. చకచకా షార్ట్హ్యాండ్ నేర్చుకొని క్లర్క్ ఉద్యోగం సాధించాడు. అక్కడే ఆగిపోతే...కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఐటీ కంపెనీకీ అధిపతి అయ్యేవాడు కాదు. ‘సాధించాలి అనే గట్టి పట్టుదల ఉంటే అసాధ్యం అనేది లేదు’ అంటున్న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లికి చెందిన ఫణిరాజ్ జలిగామ స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ...చిన్న వయసు నుంచే ఫణిరాజ్ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించినా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు చదివే అవకాశం దక్కలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి పాన్ షాప్లో పని చేశాడు. వారపత్రిక ఏజెంట్గా, ఎలక్ట్రీషియన్ గా, డ్రైవర్గా ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఎన్ని పనులు చేసినప్పటికీ చదువుపై ఆసక్తి దూరం కాలేదు. ఐటీఐ, ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్గా ఉద్యోగంలో చేరాడు.ఆత్మవిశ్వాసమే శక్తిగా...కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్గా చేరడం ఫణిరాజ్ జీవితంలో కీలక మలుపు. కోర్టులో పనిచేస్తున్న క్లర్కులను చూసి ‘నేను కూడా ఏదో ఒకటి సాధించాలి’ అనుకున్నాడు. షార్ట్హ్యాండ్లో శిక్షణ తీసుకుని నిమిషానికి 225 పదాలు టైప్ చేసే స్థాయికి చేరుకున్నాడు. దీంతో స్టెనోగ్రాఫర్గా పదోన్నతి పొంది కెరీర్లో మరో మెట్టు ఎక్కాడు. తనలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇంకా ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. స్టెన్గ్రాఫర్ ఉద్యోగాన్ని వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఆయన బలంఎంసీఏ పట్టభద్రురాలైన జీవిత భాగస్వామి శ్రీలలిత రాకతో ఫణిరాజ్ ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో కంప్యూటర్ కోర్సుల్లో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, రూ.15,000 జీతంతో పుణెలోని ఐటీ సంస్థలో చేరాడు. ‘బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రిస్క్ చేస్తున్నావు’ అన్నారు కొందరు.రిస్క్ చేస్తేనే కదా... ఘన విజయాలు దక్కేవి! ఈ విషయం తెలిసిన ఫణిరాజ్ ‘నేను రిస్క్ చేస్తున్నాను’ అనుకోలేదు. ‘మరో మంచి ప్రయత్నం చేస్తున్నాను’ అని మాత్రమే అనుకున్నాడు. ఐటీ కంపెనీలో పనిచేస్తూనే ఎంబీఏ పూర్తి చేసి, క్రమంగా సీనియర్ మేనేజర్ నుండి అసోసియేట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు.పాజిటివ్ ఎనర్జీతో.. .పద ముందుకు...ఐటీ కంపెనీలో పనిచేయాలనే కలను సాకారం చేసుకున్న ఫణిరాజ్ మరో పెద్ద కల కన్నాడు. అది అంత సులువైన పని కాదని ఫణిరాజ్కు తెలియనిది కాదు. అయినా సరే, ముందుకు వెళ్లాడు.తన స్నేహితుడు అరుణ్ కుమార్తో కలిసి ‘ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‘ అనే ఐటీ కంపెనీ స్థాపించాడు, ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, భార్య తన బంగారు నగలను అమ్మి అండగా నిలబడింది. ప్రారంభ కష్టాలు ప్రారంభంలోనే ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి’ అనుకున్న ఫణిరాజ్ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ‘పాజిటివ్ ఎనర్జీ’తో ముందుకు వెళ్లాడు. తాను ఆశించినట్లే కంపెనీ లాబాల బాట పట్టింది. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాజెక్టులతో 100 కోట్ల రూపాయల టర్నోవర్ని సాధించి, 900 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.గెలుపు అంటే...ఇతరులను గెలిపించడం కూడా!‘ఎలాగైనా గెలవాలి. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను’ ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం... నాలాగే గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే విద్యార్థులకు, ఐటీ రంగంలోకి రావాలని కోరుకునే నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నాను. బీఏ, బీకాం చదివిన వారికి కూడా ఐటీ రంగంలో అవకాశాలు ఎలా దక్కించుకోవాలో నేర్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నా ముందున్న లక్ష్యం.– ఫణిరాజ్, సీఈవో, ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి -
ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్ కేన్సర్..!ఎందువల్ల వస్తుందంటే..
రొమ్ము కేన్సర్ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్, టైలర్ మానేకు బ్రెస్ట్ కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్ కేన్సర్ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్ స్టేజ్లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.పురుషుల రొమ్ము కేన్సర్ అంటేరొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.కేన్సర్ లక్షణాలుప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.కొన్ని సాధారణ లక్షణాలు:రొమ్ములో గడ్డ లేదా వాపురొమ్ము కణజాలం గట్టిపడటంరొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివిచనుమొన నొప్పి లేదా సున్నితత్వంలోపలికి తిరిగిన చనుమొనచనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చుచంక కింద శోషరస గ్రంథులు వాపునిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులుపురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.పురుషులలో రొమ్ము కేన్సర్కు ప్రమాద కారకాలుఅనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.నివారణరొమ్ము కేన్సర్ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Tyler Mane (@therealtylermane)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే..
జీరో నుంచి మొదలు పెట్టి కోట్లు గడించే రేంజ్కి చేరుకున్నాడు. అదికూడా తన చుట్టు ఉన్న అవసరాలే వ్యాపారంగా మలిచాడు. ఆఖరికి విలాసవంతమైన కారు కొన్నా..అది తన స్థాయి చూపించుకోవడానికి కాకుండా..సొంతూరు గర్వించే స్థాయిలో ఉన్నాను అని చూపేందుకు అని చెబుతుంటాడు. గెలుపుకి పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాగ్రౌండ్తో పనిలేదని చాటిచెప్పే అసామాన్యుడి కథ ఇది. సాధారణ ఆటో రిక్షా డ్రైవర్గా మొదలైన జీవితం ఏకంగా రూ. 900 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి యజమానిగా మారి యవతకు ప్రేరణగా నిలిచిన విజయగాథ ఇది. అతడే కర్ణాటకలోని బళ్లారికి చెందిన సత్య శంకర్. అతడు ఇంటర్ డ్రాపౌట్. తండ్రి సాధారణ పూజరి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ కోసం కష్టపడి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి..ఆటో రిక్షా నడుపుతుండే వాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద రుణంపై సొంతంగా ఆటో కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు ఆ రుణాన్ని తీర్చేసి..వెంటనే తన ఆటోని కారుగా మార్చాడు.ట్యాక్సీ డ్రైవర్గా తనుండే జిల్లా చుట్టూనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లాడు. ఆ క్రమంలో తరచుగా విదేశీ పర్యాటకులను తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. వాళ్లంతా ఎక్కడ నుంచి వచ్చినా..మొదటగా కొనేది ప్యాక్ చేసిన మంచినీటి సీసానే అని గమనించాడు శంకర్. తాను రోడ్డుపై దృష్టిపెడితే..విదేశీ పర్యాటకులంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారని గ్రహించాడు. అప్పుడే ఇదేదో పనికొచ్చే బిజినెస్లా ఉందే అని అతడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కారు నడపడం కంటే..కారు విడిభాగాలను అమ్మే వ్యాపారమే బెటర్ అని గ్రహించి ఆటోమొబైల్ వ్యాపారం ప్రారంభించాడు. విడిభాగాలు కొనే ప్రతి కస్టమర్కు టైర్ కూడా అవసరం అని గ్రహించి టైర్ల దుకాణాన్ని కూడా తెరిచాడు. అంతేగాదు తన వద్ద రైతులు, స్థానికులు అరువుపై వస్తువులు కొనుగోలు చేసేవారు. చిన్న చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించేవారు. దాంతో తను కూడా బ్యాంకుకు విడతల వారీగా డబ్బు చెల్లించొచ్చని తెలుసుకున్నాడు శంకర్. అలా 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఇతర ఫైనాన్షియర్లు పాత వాహనాలను పట్టించుకోనప్పటికీ, శంకర్ సెకండ్ హ్యాండ్ ఆటోలు,కార్లకు రుణాలు ఇచ్చాడు. అతను కూడా ఒక కష్టపడే డ్రైవరే కాబట్టి, కష్టాల్లో ఉన్న డ్రైవర్ను పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇక ఆ తర్వాత తనలో ఆనాడు విదేశీ పర్యాటకుల కారణంగా తన బ్రెయిన్లో తట్టిన ఆ వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. భారీ వర్షాలు కురిసే పుత్తూరు సమీపంలోని నరిమొగేరు అనే గ్రామంలో అతను మంచినీటి ఫ్యాక్టరీని స్థాపించాడు. అతను ఆ బ్రాండ్కు బిందు (‘కన్నడలో చుక్క’) అని పెట్టారు. అక్కడితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపలేదు. శంకర్ ఉత్తర్ భారత దేశ పర్యటనలో ఓ చిన్న సోడా దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ సర్వ్ చేసిన సోడా పానీయం అతడికి మరో వ్యాపారాన్ని నిర్మించేదుకు దారితీసింది. అలా తన సొంతూరు పుత్తూరులో బిందు ఫిజ్ జీరా మసాల అనే కూల్డ్రింక్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. మొదట్లో వంద సేల్ అవ్వడమే కష్టంగా ఉండేది. అయితే దేశీ రుచి కచ్చితంగా విజయవంతమవ్వుతుందన్న ఆశతో వెనక్కి తగ్గకుండా హైవేలపై ఉండే గోడలనే ప్రచార బోర్డులుగా మార్చి ఆ డ్రింక్ ప్రకటనలను ఇచ్చేవాడు. నోటి మాటతో దాని రుచి ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. దాంతో గ్రామీణ శైలి ఆహారంతో ప్రజలు కోరుకునే పానీయంగా ప్రజల మదిలో నిలిచే చల్లని పానీయంగా బిందు ఫిజ్ని స్థిరపడేలా చేశాడు. మార్చి 2025 నాటికి 60 ఏళ్లు శంకర్కి. కానీ ఆయన వ్యాపార విస్తరణ ఆగలేదు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సాగిపోతున్నాడయన. అంతేగాదు ఆయన ఎస్జీ కార్పొరేట్స్, ఇప్పుడు రూ. 900 కోట్ల టర్నోవర్ ఆర్జిస్తుండగా, హౌస్ ఆఫ్ బిందు (పానీయాలు , స్నాక్స్) రూ. 570 కోట్ల ఆదాయం, ప్రవీణ్ క్యాపిటల్ (ఫైనాన్స్ విభాగం) రూ. 330 కోట్లను ఆర్జిస్తోంది. ఆయన ప్రసిద్ధ జీరా మసాలా నుంచి మామిడి రసాలు, స్నాక్స్ వరకు 55 రకాల ఉత్పత్తులను అమ్ముతారు. ఆయనకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఆంధ్రలో కొత్తవి రానున్నాయి కూడా. ఆయన వద్ద ప్రస్తుతం రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. అది తన స్టేటస్ ఆఫ్ సింబల్ కోసం కాదని, బళ్లారికి చెందిన వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడు అని చెప్పడానికని గర్వంగా అంటాడు శంకర్. తన వ్యాపారాలన్నీ..సామాన్య ప్రజలు కోరుకునేది, వారి అవసరాల దృష్టి నుంచి మొదలైనవేనని, అదే తన సక్సెస్మంత్ర అని అంటాడాయన. అంతేగాదు అంతా ఇంగ్లీష్ పానియాలతో వ్యాపారం చేస్తే..స్థానిక భాషకు ప్రాధాన్యత ఇచ్చి..దేశీ రుచిని అందించే పానీయాలను తీసుకొచ్చారు. ఓపిక, నిశిత పరిశీలన ఉంటే..ఎప్పటికైనా గెలుపు తథ్యం అంటాడు కర్ణాటకకు చెందిన సత్య శంకర్.(చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..) -
90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
ఫిఫా ప్రపంచకప్ 2026 (fifa world cup 2026) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్ బాల్ క్రీడకు వన్నె తెచ్చి, ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. లియోనెల్ మెస్సీ, రొనాల్డో, లూకా మోద్రిచ్, థామస్ ముల్లర్, నెయ్మార్ వీరిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. ఆతని సంపాదన తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది.పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నిజానికి జీతం ఏమీ సంపాదించడం లేదు. కానీ ఆయన సంపాదన ఒక యుగ కాలంతో సమానం. ఆయన ఫుట్బాల్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్బాలర్, కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి సుమారు 20 కోట్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో దాదాపు రూ. 1,600 నుండి 1,700 కోట్ల వరకు ఉంటుంది. క్లబ్, దేశం తరఫున ఆయన ఒక సీజన్లో సాధారణంగా 55 మ్యాచ్లు ఆడుతారని అనుకుందాం. ఆ వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆడే ప్రతి మ్యాచ్కు దాదాపు రూ. 30 కోట్లు. మరోలా చెప్పాలంటే, 90 నిమిషాల ఫుట్బాల్ ఆట (అదనపు సమయంతో కలిపి), అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది.కళ్లు చెదిరే నెట్వర్త్ రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం 120 కోట్ల డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్లు). ఈ అపారమైన సంపద అనేది కేవలం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెండు దశాబ్దాలకు పైగా టాప్-క్లాస్ జీతాలు, ఛాంపియన్స్ లీగ్ బోనస్లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది.ఒక మ్యాచ్కు రొనాల్డో సంపాదన దాదాపు రూ.30 కోట్లు. వార్షిక జీతం రూ. 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరీర్ను కొనసాగించినా ఈ ఆస్తిలో ఒక చిన్న భాగానికి కూడా సరిపోలదు.. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే రూ. 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2 వేలమందికి సమానం. ఏడాదికి సుమారు 2,000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే, ఇది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. దీనికి బదులు రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ గంటకు రూ. 20 కోట్లు సంపాదిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక ఫుట్బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్బాల్. -
పరమ విశిష్టమైన ఏకాదశి..
అధికమాసంలో వచ్చే ఏకాదశిని ‘పరమ ఏకాదశి‘ అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ రోజున శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతీతి. యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. నేటి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.ఎందుకని అంతటి విశిష్టత?‘పరమ‘ అంటే అత్యున్నతమైనది, శ్రేష్ఠమైనది. పురాణాల ప్రకారం మూడేళ్లకోమారు అధికమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైనది. విష్ణుప్రీతికరమైనది. ఈ రోజు మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.ఏం చేయాలి?విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః‘ మంత్రాన్ని జపించండి.దానాలు... పరమ ఏకాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, ఆర్థికసాయం వంటివి చేస్తే అక్షయ పుణ్యఫలాలను పొందడానికి మార్గం సుగమం అవుతంది. తామర గింజలు లేదా సగ్గుబియ్యంతో పాయసం చేసి లక్ష్మీదేవికి సమర్పించిన తరువాత కర్పూర హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి, కుటుంబ సభ్యులకు పెట్టడం వల్ల లక్ష్మీవిష్ణువుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.తులసి కోట దగ్గర... ఈ పవిత్రమైన ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీ నారాయణులను మనస్ఫూర్తిగా స్మరించుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. -
మిమ్మల్ని మీరు తెలుసుకోండి..
నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ భూమి మీద మానవుడిగా జన్మించాను ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి ఈ జన్మ అయిన తర్వాత నా పయనం ఎటువైపు. చాలామంది సత్యాన్వేషకులలో ఈ ప్రశ్నలు తరచూ వారి మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మనకు ప్రసాదించడానికి పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.ఈ సహజ యోగం ద్వారా మనలో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరం ఉనికిని గుర్తించి అనుభూతిపరంగా తెలుసుకొనవచ్చు. భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ముడు నీవు కేవలం ఆత్మవు ఈ శరీరం బుద్ధి అహంకారం కాదు అని సుస్పష్టంగా తెలియజేశాడు. ఆరవ శతాబ్దంలో వచ్చిన శంకరాచార్యులు కూడా నీవు ఆత్మవు అని సంపూర్ణంగా వివరించి తెలియజేశారు.బుద్ధుడు, మహావీరుడు కూడా పరమాత్ముని తెలుసుకొనుటకు ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. అది గురు దత్తాత్రేయ పదిసార్లు ఈ భూమి మీద వివిధ ప్రదేశాలలో వివిధ సమయాలలో వచ్చి నీవు ఎవరవు అన్న విషయాన్ని తెలియజేయ ప్రయత్నించాడు. కబీర్ దాస్, భక్తవేమన, రమణ మహర్షి మొదలైన మరెందరో ఈ భూమి మీదకు వచ్చి నిన్ను నీవు తెలుసుకో అని చెబుతూ వస్తూ ఉన్నారు. మనలో ఉన్న ఆత్మను తెలుసుకొనడానికి పరమాత్మునితో అనుసంధానం అవడం తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా బోధించారు మనల్ని ముందుకు నడిపించారు.అవతరించిన 10 మంది ఆది గురువులు..శ్రీ రాజా జనకుడుమిథిలా రాజు, శ్రీరాముని భార్య సీతాదేవి తండ్రి (భారతదేశం సుమారు క్రీస్తుపూర్వం 8000).శ్రీ అబ్రహాం ఇజ్రాయేలు, 12 గోత్రాల పూర్వికులు (ఇజ్రాయేలు సుమారు క్రీస్తుపూర్వం 2000).శ్రీ జరథుస్త్రుడుఏకేశ్వరవాదం, అగ్ని ఆరాధనను స్థాపించినవారు (పర్షియా సుమారు క్రీస్తుపూర్వం 1800).శ్రీ మోసెస్యూదుల ధర్మశాస్త్ర స్థాపకులు (ఈజిప్ట్ సుమారు క్రీస్తుపూర్వం 1250).శ్రీ లావో–త్సు ‘‘టావో టే చింగ్’’ రచయిత(చైనా జననం క్రీస్తుపూర్వం 604).శ్రీ కన్ఫ్యూషియస్ నైతిక విలువలను బోధించి ‘‘ఐ చింగ్’’ సంకలనం చేసినవారు (చైనా జననం క్రీస్తుపూర్వం 549).శ్రీ సోక్రటీస్ గ్రీకు తత్వశాస్త్ర స్థాపకుడు (గ్రీస్ జననం క్రీస్తుపూర్వం 431).శ్రీ మహమ్మద్ ఇస్లాం మత స్థాపకుడు (అరేబియా మరణం క్రీస్తుశకం 632).శ్రీ గురు నానక్ సిక్కు మత స్థాపకుడు (భారతదేశం జననం క్రీస్తుశకం 1469).షిర్డీ సాయినాథ్ శ్రీ మాతాజీ జననాన్ని ప్రవచించినవారు (భారతదేశం సుమారు 1840 – 1918 క్రీస్తుశకం).ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనలో ఉన్న శక్తులను మనం తెలుసుకుని మన జీవితాన్ని వివేకం,విచక్షణ,జ్ఞానం, వినమ్రత, ప్రశాంతతతో ఆనందంగా జీవించడానికి మనలో ఉన్న శారీరిక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక సామాజిక, ఆధ్యాత్మిక సమస్యల నుంచి బయటపడడానికి, మతకల్లోలాల నుంచి యుద్ధాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మనలో ఉన్న కుండలిని శక్తిని ఆత్మసాక్షాత్కారం ద్వారా జాగృతపరచుటకు ఆత్మను ప్రకాశవంతం చేసుకొనుటకు స్వీయ అనుభవం ద్వారా మనలో ఉన్న సూక్ష్మ శరీర అవగాహన చేసుకొనుటకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యల నుంచి బయటపడడానికి సహజ యోగ ధ్యానం ద్వారా విముక్తులు అయి అత్మసాక్షాత్కారం పొందండి. – డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు -
పునరుత్థానుడైన క్రీస్తు ఆరోహణ వాగ్దానం
యేసు పునరుత్థానుడైన తరువాత 40 రోజులు వరకు ఆయన సేవకులకు, శిష్యులకు, ప్రేమించిన వారికి దర్శనం ఇచ్చాడు. అనేక విషయాలు ప్రబోధించాడు, వాటిలో ప్రాముఖ్యంగా మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొనులాగున తండ్రిని వేడుకొనుచున్నాను, నేను వెళ్లుచున్నాను, నేను వెళ్లి మీ కొరకు ఆదరణ కర్తను పంపుతాను ఆ ఆదరణ కర్త మిమ్ములను సర్వసత్యంలోనూ, మంచి మార్గంలోనూ నడిపిస్తాడు. అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ మార్గం ఏది? తండ్రి ఎవరని ప్రశ్నలు అడిగారు.అందుకు యేసు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరును దేవుని వద్దకు రాలేరన్నాడు. తండ్రి, నేను ఏకమై ఉన్నామన్నాడు. ఆదరణ కర్త ఎవరు సత్య స్వరూపి ఆయన ఆత్మయై ఉన్నాడు, కావున భయపడకండి అంటూ ధైర్యపరిచాడు.నా తండ్రి ఇంట అనేక నివాసాలు, స్థలము ఉన్నవి నేను మిమ్ములను నాతో ఉండు లాగున తీసుకొని వెళ్తాను. ఆదరణకర్తను పంపుతాను అనగా పరిశుద్ధాత్మ ఆయన కూడా వ్యక్తి, శక్తి అనగా త్రిత్వదైవత్వం. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్ముడు వీరు ఒక్కరైనా ఏక దేవుడై ఉన్నారు. అని సందేశం ఇచ్చి వారిని బేతనీయ అనే ప్రాంతానికి తీసుకొని వెళ్లి వారిపై చేతులుంచి ఆశీర్వదించి పరమునకు ఆరోహణమయ్యాడు (పరి. యోహాను 14:1–30) , (లూకా 24: 50–51) పరలోకం అనగా నిత్యజీవముండే స్థలము (హెవెన్) భౌతిక శరీరం విడిచి మన ఆత్మ చేరే శాశ్వత ఆధ్యాత్మిక స్థలం. ఆరోహణమనగా పైకి వెళ్లడం, అది ఒక క్రీస్తుకే సాధ్యం. ఎందుకనగా పరిశుద్ధాత్మ మహిమ కన్యగర్భంలో ఏ విధంగా జన్మించాడో అదే రీతిన దేవునితో ఆరోహణమయి దేవునిలో లీనమయ్యాడు. కుడిపార్శా్వన కూర్చుని ఉన్నాడు. అంటే ఇది ఏఐ లాగున కాదు ఆ ప్రణవ నాదమైన పవిత్ర వాక్యం (పరి. యోహాను 1:1–2).ఒకటి యేసు వారి ఆరోహణం, రెండు పరిశుద్ధాత్ముని పంపుతానన్న వాగ్దానాన్ని చూస్తున్నాం (పరి. యోహాను : 14:16). పరిశుద్ధాత్మ అనేది క్రైౖ స్తవ సంఘానికి ఊపిరి, ప్రాణం. పరిశుద్ధాత్మ తండ్రి (సృష్టికర్త), కుమారుడు (యేసుక్రీస్తుతో), సమానం. దీన్ని పరిశీలించగా ‘రువా’ హెబ్రూ పదం అనగా ఊపిరి, శ్వాస ఇది వీచే గాలిలోనూ, జీవించే మనుషుల్లోనూ ఉన్న దేవుని ఆత్మ, అందుకే ‘సామెతలు’ గ్రంథకర్త 20:27, ఈ విధంగా ప్రబోధించాడు. నరుని ఆత్మ యెహోవా (ప్రభువు) పెట్టిన దీపం. యెహోవా అనగా సర్వంతర్యామి, సర్వశక్తుడగు దేవుడు, పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఉన్నది.దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అనగా మన శ్వాస, నిశ్వాసలలో ఉన్న ఊపిరి ఆయనదే (దేవునిదే). మనలో నుండి ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోతుంది అనగా మనం అబద్ధాలు, వ్యభిచారం, మద్యపానం, ధూమపానం మొదలగు వాటికి బానిసలై స్పృహ కోల్పోయినప్పుడు మరణించుతాం. దానినే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ చెబుతుంది, ఉదాహరణకు గొంగళి పురుగును చూడగా, దాన్ని మనుషులు అసహ్యించుకుంటారు కానీ అదే రూపాంతరం చెంది సీతాకోకచిలుకగా అయినప్పుడు ఆనందించుతాము, అలాగే పరిశుద్ధాత్ముని మనలోనికి ఆహ్వానిస్తే దురాత్మ దూరమైపోతుంది, అలాగే దురలవాట్లు గల వ్యక్తిని చూసినప్పుడు అసహ్యించుకుంటారు. పరిశుద్ధాత్మ అట్టి వారిలో ప్రవేశించితే ఆ వ్యక్తికి గౌరవమర్యాదలు ఇస్తారు కదా!కావున పరిశుద్ధాత్మను కోరుకుందురు గాక, దేవుడిచ్చిన జీవాత్మను కాపాడుకుందాం ఇలాంటి సందేశం ఇచ్చి యేసు – మెస్సయ్యగా, ప్రభువుగా, క్రీస్తుగా చూస్తున్నారు.ఈ సందేశం ఇచ్చిన ప్రభువును మనుషులలో దీపాలు వెలిగించును గాక, ప్రభువును అంతరంగంలోనికి రమ్మని ఆహ్వానిద్దాం, ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుచేత దేవుని అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశించక నిత్యజీవం పొందుతారు, అందుచేత నిత్యజీవాన్ని కోరుకుందుముగాక! (పరి. యోహాను 3:16). – బి.బి. చంద్రపాల్ కోట -
శతక నీతి: విద్యాప్రభావం..
విదురనీతిలో విద్యయే మనిషికి నిజమైన అందం, దాచి పెట్టిన ధనం, దొంగిలించడానికి వీలులేని సంపద అని చెప్తారు. భీష్ముడు ‘నాస్తి విద్యాసమం చక్షు:’ అంటాడు. అంటే విద్యతో సమానమైన కన్ను మరొకటి లేదని. అమరకోశ వాక్యం ప్రకారం పండితులు శ్రేష్తులు.. ‘విద్వాన్ సర్వత్రే పూజతే’ అన్నది సంస్కృత సుభాషితం.మన జీవితంలో అనునిత్యం ముడి పడే ప్రతి అంశానికి, సందర్భానికి సముచితంగా బోధించే శతకాలు చాలా ఉన్నాయి.. ఒక్కొక సందేశం విలువైన మాట, జీవితాన్ని శాసించే మాట, నిలబెట్టే మాట, సక్రమ మార్గంలో పెట్టే మాట... విద్య విషయంలో శతక నీతులు ఏమని అంటాయంటే..‘సకల కళా విభూషితులు.... విత్తము లేకయు వారు పూజ్యులే’ అంటారు భర్తృహరి. ‘ప్రభువులు పండితులగువారివలన గర్వకలన మా నుడు వారు మీ కలిమి తృణము లీల బోలింపలేమి మృణాళ గుణము భూరిమదవారణంబె’ అంటే పాండిత్యం ముందు రాజుల సంపద గడ్డిపోచ అని అంటాడు.‘కేయూరాణి న భూషయన్తి... వాగ్భూషణం భూషణమే’.. ఒకప్పుడు ఆకాశవాణి కేంద్రం ద్వారా ఉదయం వార్తలు తరువాత వినేవాళ్ళం.. దీనర్థం విద్యయే అలంకారం అని.‘విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్విద్య యశస్సుభోగకరి విద్య గురుండు విదేశబంధుడన్విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే..'భావం: విద్యయే సర్వోత్తమం. విద్య ఉంటే అన్ని ఉన్నట్టే. విద్వాంసుల వలనే లోకం నిలుస్తుంది. మహా కవులు, పండితులు మరణించినా కీర్తితో బతికే ఉంటారు.భర్తృహరి సంస్కృత శతకానికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన అనువాదంలో బయటపడ్డ ఆణిముత్యాల సారాంశం ఇదంతా అయితే, వేమన శతకాల్లో .విద్య లేని వాడు వింత పశువులన్నారు. చదువు రాని వాని బ్రతుకంత శూన్యం అన్నాడు..‘చదివినంతనే పండితుండగునే మనుజుడు ‘ అని అన్నాడు..బద్దెన సుమతీ శతకం లో ‘విద్య నిగూఢగుప్త మగు విత్తం’ అని అన్నారు..భాస్కర శతకంలో భాస్కరుడు పేరుకు తగ్గట్టు నిత్యం ప్రకాశించే మాట చె΄్పారు..‘విద్యయే భూషణము నరునకు ‘... ఇది ‘కేయూరాణి’కి... దగ్గరలో ఉంది.‘విద్య లేని వాడు వింత మృగంబు రా’ అంటూ వేమన భావాన్నీ వెలిబుచ్చాడు.రామదాసు శతకంలో రామునే స్మరించినా రామదాసు ‘చదువు రాని వాడు జగములోనూ దద్దమ్మ అని తేల్చేశాడు.కాళీదాసు మూడు ముఖ్య విషయాలు చె΄్పాడు..‘విద్య వినయ సహితం’ అని,‘శైశమేభ్యస్త విద్యానం యువనే విషయైషిణామ్’ అంటేబాల్యంలోనే నేర్చుకోవాలని, ధర్మంగా బతకడం కోసం విద్య అని.విద్య ద్వారా ఉత్తమ గుణాలను వెలికితీయాలని సెలవిచ్చారు.విద్య విషయంలో తగిన శ్రద్ధ వహించి, కాలానికి తగ్గట్టుగా చదివి, విషయాలుని సంగ్రహించి, వినయంతో ఉండి, విజ్ఞానాన్ని సంపాదించి, నైతిక విలువలను, మానవ విలువలను పాటిస్తూ, రక్షిస్తూ ధార్మిక జీవితం గడపాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
క్షమాగుణానికి నిలువెత్తు రూపం..
కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, అధికారం చేతికి రాగానే పగ తీర్చుకోవడం మానవ నైజం. కానీ, ఎన్ని అపనిందలు ఎదురైనా అల్లాహ్ పై నమ్మకం కోల్పోకుండా, తప్పు చేసిన వారు కళ్లముందు నిలబడినా కక్ష సాధించకుండా క్షమించిన మహోన్నత చరిత్ర ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం)ది. ముళ్లబాటలను అధిగమించి, ఈజిప్ట్ దేశాన్ని కరవు బారి నుంచి రక్షించిన ఒక అద్భుత ప్రజా నాయకుడి జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.యూసుఫ్ (అ) చిన్నతనం నుంచే ఎంతో అందమైనవాడు, అమాయకుడు. ఒకరోజు ఆయన కు ఒక వింత కల వచ్చింది. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు తన ముందు వంగి నమస్కరిస్తున్నట్లు కల కన్నారు. ఈ విషయాన్ని తన తండ్రి యాఖూబ్ (అ) కు చెప్పగా.. ఆయన ఆ కలలోని దైవ సందేశాన్ని గ్రహించారు. ‘నాయనా! ఈ విషయాన్ని నీ సోదరులకు చెప్పకు, వారు అసూయపడతారు’ అని హెచ్చరించారు. కానీ, తండ్రికి యూసుఫ్పై ఉన్న మితిమీరిన ప్రేమే అన్నదమ్ముల మధ్య అసూయకు కారణమైంది.బావి నుంచి బానిసగా..అసూయతో రగిలిపోయిన సోదరులు యూసుఫ్ను అంతమొందించాలని పథకం వేశారు. ‘ఆడుకోవడానికి తీసుకెళ్తాం’ అని తండ్రిని ఒప్పించి, అడవిలోని ఒక పాడుబడ్డ బావిలోకి యూసుఫ్ను తోసేశారు. ఆయన బట్టలకు గొర్రె రక్తం పూసి, ‘తోడేలు తినేసింది’ అని తండ్రిని నమ్మించారు. ఆ కన్నతండ్రి ‘ఇది దైవ పరీక్ష, నేను ఓపిక పడతాను’ అని సహనం వహించారు. మరోవైపు, ఆ బావి మీదుగా వెళ్తున్న వర్తకులు యూసుఫ్ను రక్షించి, ఈజిప్ట్సంతలో ఒక అధికారికి బానిసగా అమ్మేశారు.జైలు జీవితం.. కలలోని సత్యంఅక్కడ అపనిందలు, ఆరోపణలు ఎదురైనా యూసుఫ్ తన శీలాన్ని, దైవభీతిని కాపాడుకున్నారు. ఫలితంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలులోనే ఆయనకు అల్లాహ్ ‘కలల అర్థాలను వివరించే’ అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించాడు.సరిగ్గా అదే సమయంలో ఈజిప్ట్ రాజుకు ఒక వింత కల వచ్చింది. 7 బలిసిన ఆవులను, 7 బక్కచిక్కిన ఆవులు మింగేయడం.. అలాగే 7 పచ్చటి పనసలు, 7 ఎండిన పనసలు కనిపించడం రాజును కలవరపెట్టింది. దేశంలోని పండితులెవరూ ఆ కలకు అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు జైలు నుంచి యూసుఫ్కు పిలుపు వచ్చింది. ఆ కలకు యూసుఫ్ చెప్పిన పరిష్కారం ఇది: ‘రాబోయే 7 ఏళ్లు ఈజిప్ట్లో సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ తర్వాత 7 ఏళ్లు ఘోరమైన కరవు వస్తుంది. కాబట్టి తొలి ఏడేళ్ల ధాన్యాన్ని వృథా చేయకుండా ఖజానాలో దాచండి’’యూసుఫ్ మేధస్సుకు ముగ్ధుడైన రాజు, ఆయనను సగౌరవంగా జైలు నుంచి విడుదల చేసి, ఖజానా అధిపతిగా నియమించాడు. బానిస గా వచ్చిన వ్యక్తి, తన మేధస్సుతో ఆ దేశ రక్షకుడి గా మారాడు! పగ కాదు.. ప్రతీకారం అంతకన్నా కాదు!రాజు కన్న కల నిజమైంది. దేశంలో కరవు తాండవించింది. ఆహారం కోసం పొరుగు దేశాల నుంచి జనం ఈజిప్టుకు రావడం ్రపారంభించారు. ఆ గుంపులో యూసుఫ్ సోదరులు కూడా ఉన్నారు. తమను బావిలో పడేసిన అన్నదమ్ములు తన ముందే నిలబడి యాచిస్తుంటే, యూసుఫ్ వారిని గుర్తుపట్టారు. కానీ పగ తీర్చుకోలేదు.చివరకు తన నిజమైన రూపాన్ని బయటపెడుతూ.. ‘నేనే మీ తమ్ముడు యూసుఫ్ను. మీ తప్పులను నేను క్షమించేశాను. నాపై మీకు ఎలాంటి నిందలు లేవు‘ అంటూ వారిని కౌగిలించుకున్నారు. తండ్రి యాఖూబ్ (అ) ను, మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు పిలిపించుకున్నారు. చిన్నప్పుడు కన్న కలకు నిజరూపంగా.. తల్లిదండ్రులు, సోదరులు అందరూ యూసుఫ్ ఉన్నత స్థానాన్ని చూసి గౌరవంతో తలవంచారు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఇతిహాసాలను మలుపు తిప్పిన శాపాలు..!
ప్రాచీన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు కేవలం కథల సమాహారం మాత్రమే కాదు... మానవ జీవన విలువలను, కర్మ సిద్ధాంతాన్ని బోధించే అద్భుత జ్ఞాన నిధులు. మన సంస్కృతి లో ‘వాక్కు’కు అత్యున్నత స్థానం ఉంది. ఒకసారి నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. అందుకే, పూర్వం మహర్షులు, తపస్సంపన్నులు ఆగ్రహంతోనో, అధర్మాన్ని సహించలేకో ఇచ్చిన శాపాలు... చరిత్ర గమనాన్నే మార్చేశాయి. తీవ్రమైన భావోద్వేగాలు, ద్రోహం, అహంకారం, క్రోధం నుంచి పుట్టిన 5 శక్తిమంతమైన శాపాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలు ఇవే...అశ్వత్థామకు శ్రీ కృష్ణుని శాపం...మహాభారత యుద్ధం ముగింపు దశలో, నిద్రిస్తున్న ఉపపాండవులను క్రూరంగా వధించిన అశ్వత్థామపై జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అశ్వత్థామకు మరణశిక్ష విధించకుండా, అంతకంటే భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు పరమాత్ముడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తొలగించి, ఒళ్లంతా రక్తం, చీము కారుతున్న గాయాలతో, నిరంతర వేదనతో మూడు వేల సంవత్సరాల పాటు ఒంటరిగా భూమిపై సంచరించాలని శపించాడు.పరిణామం... మరణం లేని అమరత్వం ఒక్కోసారి ఎంతటి నరకంగా మారుతుందో ఈ ఘటన నిరూపిస్తుంది. చేసిన కర్మల నుంచి, అధర్మం నుంచి ఎంతటి యోధుడైనా తప్పించుకోలేడని, ప్రకృతి నియమాలకు అందరూ లొంగాల్సిందేనని ఈ శాపం మనకు బోధిస్తుంది.నారద మహర్షి శాపం...ఒకానొక సందర్భంలో నారద మహర్షి మోహపాశంలో చిక్కుకున్న ప్పుడు, శ్రీమహావిష్ణువు ఆయనకు హితం చేయడం కోసం మాయా రూపంతో నారదుడిని పరీక్షించి విఫలుడిని చేస్తాడు. భంగపడిన నారదుడు తీవ్ర అవమాన భారంతో, విచక్షణ కోల్పోయి విష్ణుమూర్తినే శపిస్తాడు. తాను ఏ విధంగానైతే స్త్రీ విరహంతో బాధపడ్డాడో, అదే విధంగా విష్ణుమూర్తి కూడా భూలోకంలో మానవుడిగా జన్మించి, భార్యావియోగాన్ని అనుభవించాలని, కోతులే ఆయనకు సహాయం చేయాలని శపించాడు.పరిణామం... ఈ శాప ఫలితంగానే త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన పరమాత్ముడు... సీతాదేవిని కోల్పోయి, అరణ్యాలలో తీవ్ర విరహ వేదనను అనుభవించాడు. వానరుల సహాయంతో లంకపై దండెత్తాడు. దైవమైనా సరే, భక్తుని వాక్కును గౌరవించక తప్పదనే సత్యాన్ని ఈ కథ చాటిచెబుతుంది.గాంధారి శాపం...కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి దేవి దుఃఖం క్రోధంగా మారింది. ఈ సర్వనాశనానికి అంతటా ఉండి నడిపించిన శ్రీ కృష్ణు్ణడే కారణమని ఆమె భావించింది. భారతీయులందరినీ కాపాడగలిగే శక్తి ఉండి కూడా యుద్ధాన్ని ఆపనందుకు... ఏ విధంగానైతే కౌరవ వంశం అంతమైందో, అదే విధంగా 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి కళ్లముందే యాదవ వంశం కూడా అంతర్గత కలహాలతో నశించిపోతుందని శపించింది.పరిణామం... గాంధారి శాపం వృథా పోలేదు. మౌసల పర్వం నాటికి యాదవులంతా ప్రభాస తీర్థంలో ఒకరినొకరు హింసించుకుని సర్వనాశనమయ్యారు. చివరికి శ్రీ కృష్ణుడు కూడా ఒక బోయవాడి బాణానికి చిక్కి, ఏకాకిగా అవతారాన్ని చాలించాల్సి వచ్చింది. ఒక తల్లి ఆక్రందన, దుఃఖం ఎంతటి శక్తిమంతమైనవో ఈ ఘట్టం వివరిస్తుంది.దుర్వాస మహర్షి శాపం...శకుంతల దుష్యంతుడి ప్రేమలో మునిగిపోయి, తన ఆశ్రమానికి వచ్చిన తపోధనుడైన దుర్వాస మహర్షిని గమనించకుండా అగౌరవపరుస్తుంది. తీవ్ర కోపిష్టిగా పేరొందిన దుర్వాసుడు ఆమె ప్రవర్తనకు ఆగ్రహించి శాపాన్ని ఇస్తాడు. ‘నువ్వు ఎవరి ధ్యానంలో మునిగిపోయి నన్ను నిర్లక్ష్యం చేశావో... ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోవు గాక!‘ అని శపించాడు.పరిణామం... దీనివల్ల దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మరచిపోతాడు. శకుంతల ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక క్షణ కాలపు చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని ఎంతటి అగాధంలోకి నెడుతుందో, అలాగే అతిథి మర్యాద ఎంత ముఖ్యమో ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.వశిష్ఠుడి శాపం...దేవతలు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని పవిత్రమైన కామధేనువును అపహరించడానికి ప్రయత్నిస్తారు. త్రికాలజ్ఞాని అయిన వశిష్ఠుడు వారి తప్పును తెలుసుకుని తీవ్రంగా శపించాడు. దివ్యలోకంలో ఉండే అర్హతను కోల్పోయి, అష్టవసువులంతా భూలోకంలో మానవులుగా జన్మించాలని శపించాడు.పరిణామం... ఈ శాపం వల్లే వసువులు గంగాదేవి గర్భాన జన్మించాల్సి వచ్చింది. వారిలో ఏడుగురిని గంగాదేవి పుట్టగానే నదిలో కలిపేసి శాపవిముక్తి కలిగించగా, ఎనిమిదో వసువు మాత్రం భూమిపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనే మహాభారతంలో అజేయ యోధుడిగా పేరొందిన ’భీష్మ పితామహుడు’. దేవతలైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. ప్రాచీనగాథలలోని ఈ శాపాలు కేవలం శిక్షలు మాత్రమే కావు... అవి మనకు కొన్ని జీవితసత్యాలను బోధిస్తాయి. కోపం, అహంకారం, నిర్లక్ష్యం ఎంతటి వారినైనా పతనానికి నడిపిస్తాయని హెచ్చరిస్తాయి.మాట అనేది చాలా పదునైన ఆయుధం, దాన్ని ఉపయోగించేటప్పుడు వివేకం ఎంత అవసరమో ఈ కథలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. – పసుపులేటి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు -
రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
భార్య వైద్య అవసరాల కోసం నానా పాట్లు డుతోంటే భర్త ఏకంగా రూ. 19 కోట్లను దాచిపెట్టి, తనకు కనీసం 35 వేలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టాడని ఒక మహిళ వాపోయిన వైనం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం,తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లుగా సుమారు 14 మిలియన్ యువాన్లను (దాదాపు రూ.19 కోట్లు) రహస్యంగా ఉంచాడని చైనాకు చెందిన 53 ఏళ్ల మహిళ గుర్తించింది. ఒక పక్క తాను దాదాపు రూ. 95వేల వైద్య బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, ఆయన మాత్రం విలాసంగా జీవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఆస్తులన్నింటినీ రహస్యంగా ఉంచాడనిఆరోపించింది. విడాకుల ప్రక్రియ సమయంలో ఆర్థిక రికార్డులను పరిశీలించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. తన ఆదాయాన్నిగానీ, ఆస్తులను గానీ ఎపుడూ వెల్లడించలేదని వాపోయింది. ఇంతకాలం అవగాహన లేక అతని ఆస్తిపాస్తులపై పట్టించుకోలేదని వాపోయింది.వైద్య ఖర్చులకు ఇబ్బందులుఇంత సంపద దాచిపెట్టినప్పటికీ, తన భర్త కనీస ఆర్థిక సాయం చేయడానికి కూడా నిరాకరించాడని వాంగ్ ఆరోపించింది. తనకు నెలకు ఇవ్వాల్సిన 2,500 యువాన్ల (సుమారు రూ.35,000) అలవెన్స్ను ఇచ్చేందుకు నిరాకరించాడని, అలాగే తన వైద్య చికిత్సకు ఒక్క రూపాయికూడా సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. బీజింగ్లో చికిత్స పొందుతున్న సమయంలో చాలా పొదుపుగా జీవించాల్సి వచ్చిందని. అద్దె తక్కువ ఇంట్లో ఉంటూ, చౌక ధరల బట్టలు ధరిస్తూ , వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో తన భర్త మాత్రం బ్రాండెడ్ వస్తువులు, కాస్మెటిక్ ట్రీట్మెంట్ల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడని ఆమె ఆరోపించింది.గృహహింస, శారీరక దాడి ఈ కేసులో తీవ్రమైన గృహహింస ఆరోపణలు మరో ముఖ్యమైన అంశం. భర్త చేతిలో పదేళ్ల పాటు శారీరక హింసను భరించింది. ఆమె కొట్టిన దెబ్బలు పక్కటెముకలు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన 100 కి పైగా ఫోటోలను ఆమె ఆధారాలుగా చూపించింది. ఈ శారీరక హింస , ఆర్థిక నియంత్రణ వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్కు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
పిల్లల సమాచారం.. సోషల్గా వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్ ప్రొఫైల్ను సేకరించడం సైబర్ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.అనంతరం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్లు పెట్టుకోవాలి.లొకేషన్ ట్యాగ్లను నిలిపివేయాలి. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ను కఠినంగా అమలు చేయాలి.పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి. -
డైనమిక్ డయాన్ @ 79
విజయానికి ఎన్ని మెట్లో ఎవరు చెప్పగలరు? కొందరు మాత్రం కొన్ని మెట్ల తర్వాత ఆగిపోతారు. కొందరు మాత్రం ప్రతి మెట్టులో ప్రతికూలతలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ‘ఫోర్బ్స్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదవసారి చోటు సాధించిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల డయాన్ హెండ్రిక్స్ రెండో కోవకు చెందిన మహిళ. ‘పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలి’ అని చిన్నప్పటి నుంచే కలలు కన్న డయాన్ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసిన రోజులూ ఆమె జీవితంలో ఉన్నాయి. ‘విజయం అంటే కొత్తగా ఆలోచించడం. మార్కెట్లోని లోటుని భర్తీ చేయడం’ అంటున్న డయాన్ హెండ్రిక్స్ గురించి...పదేళ్ల వయసు నుంచే ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కనేవారు డయాన్ హెండ్రిక్స్. ‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం... అవి నిజమవుతాయా!’ అని ఆ తరువాత అనుకోలేదు డయాన్. తన ‘లక్ష్యం’ అనే మొక్కను పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కలను సాకారం చేసుకొని ‘సెల్ఫ్–మేడ్ ఉమెన్ బిలియనీర్’గా జేజేలు అందుకుంటున్నారు డయాన్.అప్పులు చేసి.. ఆస్తులు తాకట్టు పెట్టి...తాజాగా... తొమ్మిదవసారి అమెరికా రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్(2026) జాబితాలో చోటు సాధించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు డయాన్. ఆమె సంపదలో అధిక భాగం ఆమె రూఫింగ్ మెటీరియల్ కంపెనీ ‘ఏబీసీ సప్లై’కి చెందినదే. తన భర్త కెన్ హెండ్రిక్స్తో కలిసి 1989 లో ఈ కంపెనీని స్థాపించారు. ఆరోజుల్లో వివిధ తయారీదారులు తయారు చేసిన రూఫింగ్ మెటీరియల్స్ ఒకేచోట దొరికే దుకాణాలు చాలా తక్కువగా ఉండేవి. ఇది గ్రహించిన డయాన్ ‘ఏబీసీ సప్లై’ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీప్రారంభించడానికి బ్యాంక్ నుంచి అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. విస్కాన్సిన్లోని బెలోయిట్ కేంద్రంగా మొదలైన కంపెనీ కొన్ని సంవత్సరాలలో లాభాల బాట పట్టింది.విజయ రహస్యం‘నా విజయ రహస్యం... మార్కెట్లోని ఒక లోటును భర్తీ చేయడం’ అంటారు డయాన్. ఒస్సియో(యూఎస్)లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన డయాన్ పెద్ద నగరంలో ఉండాలని, నీలం రంగు సూట్లు ధరించి, ఖరీదైన కార్లు నడపాలని కలలు కనేవారు. చిన్న వయసులోనే పెళ్లి అయి గర్భవతి కావడంతో ఇంటి నుంచే చదువు పూర్తి చేశారు. కాలేజీ చదువు కంటే రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ వెదుక్కోవడానికి చిన్నాచితకా పనులు చేశారు. చిన్న వయసులో తల్లి అయిన డయాన్ తన ఖర్చుల కోసం ప్లేబాయ్ బన్నీ(ప్లేబాయ్ క్లబ్లో పనిచేసే కాక్టెయిల్ వెయిట్రెస్)గా కూడా పనిచేశారు.క్యాన్సర్ను జయించి...రెండు సార్లు క్యాన్సర్ బారిన పడ్డారు డయాన్. తన సంకల్పబలమే క్యాన్సర్ను జయించే శక్తిని ఇచ్చింది. భర్త మరణం ఆమెను దుఃఖంలో ముంచెత్తింది. కష్టకాలం లో, నిరాశానిస్పృహల చీకటిలో కూడా...‘సాధించాలి. తప్పకుండా సాధించాలి’ అని గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకునేవారు డయాన్. ప్రారంభ రోజుల్లో...ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసేవారు. పాత ఇంటిని కొని స్వయంగా మరమ్మతు చేసి కాలేజీ స్టూడెంట్స్కు అద్దెకు ఇచ్చేవారు.చాలా కష్టం...అయినా సరే...డయాన్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ‘ఏబీసీ సప్లై కో’ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ మార్కెట్ లో దూసుకుపోతోంది. మార్కెట్ పోకడలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది. రైతుబిడ్డ నుండి బిలియనీర్ వ్యాపారవేత్తగా డయాన్ ప్రయాణం అనేది పట్టుదల, అపారమైన ధైర్యసాహసాల కలబోత. ఎంతోమంది ఔత్సాహికులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అపూర్వ విజయం.‘ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘వ్యాపారవేత్తగా రాణించడం అనేది చాలా కష్టం. మూస ఆలోచనలు కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. మీరు చేయాలనుకుంటున్నది మార్కెట్కు ఎంత అవసరం... అనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. వ్యాపారంలో విలువైన సమయంతోపాటు, డబ్బు కూడా కోల్పోవలసి రావచ్చు. అలా అని భయపడకూదు. రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్కైనా సరే!’ ఎంతోమంది ఔత్సాహికులు తమ కలలను నిజం చేసుకోవడంలో సహాయపడిన డయాన్ దాతృత్వ కార్యక్రమాలలోనూ ముందుంటారు. టెన్ కమాండ్మెంట్స్కష్టపడి పనిచేసి నా కలలను నిజం చేసుకున్న ఒక సాధారణ అమెరికన్ అమ్మాయిని, రైతు బిడ్డను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది నా తల్లిదండ్రులు. మా నాన్నగారు ఏది సరైనదో, ఏది కాదో చెప్పేవారు. ‘నేను చేస్తున్న పని సరైనదేనా అని నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’ అని చెప్పేవారు. టెన్ కమాండ్మెంట్స్ నా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిజీవితంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి. నేను వాటిని మళ్లీ మళ్లీ చదువుతాను. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఏది సరిౖయెనదో, ఏది త΄్పో అవి వివరిస్తాయి.– డయాన్ హెండ్రిక్స్ -
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్నుంచి ఫిట్గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్ -
అదే తలమానికం.. మార్చుకోకండి!
మన తలపై ఉండే ఉపరితల భాగమైన మాడును ఇంగ్లిష్లో స్కాల్ప్ను అంటారన్నది తెలిసిందే. నిజానికి మాడు అంటే అదో దేహ భాగం అనుకునేందుకు అవకాశముంది. కానీ అది సరికాదు... ఇంగ్లిష్లో పేరు పెట్టిన ఆ యాక్రొనిమ్కి విస్తృతార్థం ఉంది. ఇంగ్లిష్ స్కాల్ప్ స్పెల్లింగ్లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాల్లో... ‘ఎస్’ అంటే స్కిన్ అనీ, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా అనీ, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా అనీ, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆ ఐదు అక్షరాలూ కలిసి ‘స్కాల్ప్’గా ఏర్పడ్డాయని ఈ పదాల వల్ల తెలుస్తుంది. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలుకొని... ‘పి’ అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక వరకు వరసగా ఉంటే పొరల తాలూకు ఇంగ్లిష్ పేర్లతో ఈ ‘స్కాల్’ అనే ఇంగ్లిష్ పదం ఏర్పడింది. మాడు అనే స్కాల్ప్ సంరక్షణ ఎలాగో తెలుసుకుందాం...మాడును వెంట్రుకలు కప్పేసి ఉంచి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ వెంట్రుకలు దట్టంగా ఉన్నవారిలో ఎండకూ, వెలుతురుకూ అడ్డు పడటం ద్వారా అక్కడ పుట్టే చెమట తాలూకు తేమ వాతావరణం కొన్ని సూక్ష్మజీవులు పెరిగే వాతావరణాన్ని కల్పించడం వల్ల దురద రావడం వంటి నలుగురిలో ఇబ్బంది పెట్టే లక్షణాలూ కనిపించవచ్చు. అలాగే ఎండ వల్ల కూడా మాడుపై కొన్ని అనర్థాలూ కనిపించవచ్చు. ఆ అనర్థాలూ, నష్టాలూ ఎలా వస్తాయో చూద్దాం.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాడుకు కలిగే అనర్థాలేమిటంటే...మానవ దేహం మీద మిగతా చర్మంతో పోలిస్తే మాడు మీద ఉండేవీ... నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని పిలుస్తారు, అలా స్రవించే నూనెను సీబమ్ అంటారు. ఈ సీబమ్ ఎప్పుడూ స్రవిస్తూ ఉన్నప్పటికీ ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా సీబమ్ స్రవిస్తుంటుంది. దానికి తోడు మిగతా చర్మం కంటే మాడులో ఈ సెబేషియస్ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల స్రావాల పరిమాణం కూడా బాగా పెరురుగుతుంది. దాంతో చర్మం త్వరగా జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.చర్మంలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అవి... 1. పొడి చర్మం (డ్రై స్కిన్)2. సాధారణ చర్మం (మాడరేట్ స్కిన్)3. జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్)పైన చెప్పిన నేపథ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో సీబమ్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటుంది. దాంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల మరింత జిడ్డుగా మారడం చాలా సాధారణం. దానికి తోడు చర్మంపై చెమట పట్టే గుణం ఎక్కువగా ఉన్నవారిలో తల మరింత జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.జిడ్డు చర్మంపై చుండ్రు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే...‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్ పెరగడానికి మన తలపైన ఉండే మాడు చాలా అనువైన ప్రదేశం. ఆ మలసేజియా ఫంగస్ అనేది ఈ ‘సీబమ్’ను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో సీబమ్ ఎక్కువగా స్రవించేవారిలో మలజేజియా పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అదే చుండ్రు పెరుగుదలకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమై... చర్మంపై నుంచి జిడ్డు పొడిబారినప్పుడు అది పొట్టుగా రాలుతుంటుంది. అందుకే మాడుపైన ఈ తరహా పెరుగుదల ఉన్నవారి తలలో దురదగా ఉండటం, గీరినప్పుడు పొట్టు రాలుతుండటంతో నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.ఫాలిక్యులైటిస్ వంటి సమస్యలు కూడా... మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించడంతో పాటు కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి చెమట ఎక్కువగా పడుతుండటం, దానికి తోడు జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ వాతావరణం ఏర్పడి... అక్కడ మరికొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి కూడా ఆ వ్యక్తుల్ని నలుగురిలో మెలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.ఎలా దువ్వుకోవడం అన్నది మాడుకు మంచిదంటే...జుట్టు రాలకుండా ఉండటంతో పాటు మాడు ఆరోగ్యం బాగుండాలంటే జుట్టు దువ్వుకునే సమయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మేలు.తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా రాలిపోకుండా ఉంటుంది. ఇందుకోసం పరిశుభ్రమైన మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు జుట్టును దువ్వాలి. ఇందుకు మరీ సన్నటి పళ్లు ఉన్న దువ్వెన కంటే కాస్తంత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వడమే మంచిది. సన్నటి పళ్ల దువ్వెన వల్ల జుట్టును లాగినట్టుగా ఉంటుంది. కాస్త వెడల్పాటి పళ్లున్న దువ్వెన వల్ల రోమాంకురాలకు అంతగా నష్టం ఉండదు. జుట్టును ఇలా పాయలు పాయలుగా విడదీసే సమయంలో మాడుపై వెలుగూ వెలుతురూ ఎక్కువగా ప్రసరించడం వల్ల చుండ్రు పెరిగే వాతావరణానికి భంగం కలిగి చుండ్రు అంతగా పెరగదు. దీనికి తోడు ఇలా దువ్వడం వల్ల తలలో దుమ్ము తగ్గి అది మాడుకు మేలు చేస్తుంది.మాడు సంరక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలివి...మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు, ఖనిజలవణాలతో పాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ, తగినన్ని ద్రవాహారాలూ, నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దాంతో సాధారణ ఆరోగ్యం బాగుండటంతో పాటు... మాడుకు వచ్చే అనేక సమస్యలూ నివారితమవుతాయి.ప్రతిరోజూ రెండు లీటర్లకు తగ్గకుండా లేదా కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండడటం వల్ల మాడు మీద ఏర్పడుతుండే మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే తప్పనిసరి అయినప్పుడు వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.మాడు విషయంలో డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలలో ఏదైనా కనిపిస్తే మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహించి తక్షణం డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఆ లక్షణాలేమిటంటే...మాడు మీద దురద విపరీతం వస్తూ మరింతగా పెరుగుతూ పోతుండటంఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరగడంమాడుపైన ఎర్రగాగనీ లేదా చీముతో కూడిన కురుపులు కనిపించడంమాడు మీద తెలుపు లేదా గ్రే కలర్లో పెచ్చులు వస్తున్నప్పుడుఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు మరింతగా రాలిపోతుండటం.అపోహలూ... వాస్తవాలుమంచి షాంపూతో తల స్నానం చేశాక ఎండలోకి వెళ్తే జుట్టు బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటుందనీ, అలాగే ఎండ నుంచి రక్షించుకోడానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అవెంతవరకు వాస్తవమో చూద్దాం.ఎండవేడిమిలో జుట్టు ఆరబెట్టుకుంటే సూర్మరశ్మి కారణంగా వెంట్రుకలు మెరిసిపోతూ జుట్టు అందం ఇనుమడిస్తుందా?ఇది చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూతో తలస్నానం చేశాక... కాసేపు మంచి ఎండలో వెంట్రుకలను ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తూ కనిపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి జుట్టుపై ఎండ తీవ్రత నేరుగా పండటం అంత మంచిది కాదు. నేరుగా వెంట్రుకలపై పడే ఎండ తీవ్రత వాటిని డల్గా మార్చేసేందుకు అవకాశాలెక్కువ. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే... ఎండ సమయంలో వెంట్రుకలకు రక్షణగా గాలి ఆడుతూ ఉండే బ్రిమ్ హ్యాట్ లేదా క్యాప్ ధరించడం మేలు. కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరీ మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.ఎండ వల్ల కూడా జుట్టు రాలే ముప్పు... ఎండ తీవ్రత నేరుగా మాడుపై పడే కొందరిలో జుట్టు రాలిపోయే ముప్పు కూడా ఎక్కువే. దీనికి కారణమూ ఉంది... నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యతో పాటు మరికొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఎండ తీవ్రత నుంచి మాడును రక్షించుకోవడమిలా...ఎండలో మాడును రక్షించుకోడానికీ, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం మేలు. అవి...మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించే దేహలక్షణం ఉన్నవారిలో జుట్టు జిడ్డుగా మారడం చాలా ఎక్కువ. ఆ జిడ్డు కారణంగా జుట్టు మరీ ఎక్కువ డల్గా కనిపించవచ్చు. ఇలా జుట్టు డల్గా కనిపించకూడదంటే... జిడ్డు చర్మం ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.స్కాల్ప్పైనున్న మన దేహ భాగంలో పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. ఇలాంటివారు సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే అది వాళ్ల మాడుకు ఉపయుక్తంగా ఉంటుంది.చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను పాటించడం మంచిది. సాధారణంగా చుండ్రు ఉన్నవారికి డర్మటాలజిస్టులు వారికి అనువైన లేదా కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూలను సూచిస్తుంటారు. ఆ మేరకు బాధితులు వాటిని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లాగా వాడుకోవచ్చు.జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పట్టించడం అంత మంచిది కాదు.ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అన్నది జిడ్డు చర్మంతో ఉండేవారితో పాటు అందరికీ మేలు చేసే అంశం.హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. గాలి ఆడక చెమట పడుతుండటం వల్ల ఇలాంటి అభి్రపాయం చాలామందిలో కలగడం చాలా సాధారణం. అయితే నిజానికి హెల్మెట్ అన్నది ప్రమాద సమయంలో తలనూ ్రపాణాలనూ కాపాడటమే కాదు... దాన్ని ధరించడం వల్ల అది ఇటు జుట్టునూ, అటు మాడునూ ఏకకాలంలో రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా జుట్టును కాపాడుతుంది. నిజం చెప్పాలంటే... హెల్మెట్ ధరించని బైక్ రైడర్స్తో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలోనే జుట్టు రాలిపోకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.హెల్మెట్ వాడే వారు పాటించాల్సిన సూచన... అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన పొడి గుడ్డను కాస్తంత లూజ్గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ ధరించాలి. ఆ గుడ్డ కూడా కాటన్తో తయారైన మృదువైన కర్చిఫ్లాంటిదైతే మరింత మేలు. ఇలా ధరించడం వల్ల హెల్మెట్ పైభాగం ఆ వ్యక్తి తాలూకు చెమటతో తడిసిపోకుండా ఎప్పుడూ పొడిగా ఉంటుంది. దాంతో చెమటతో తడిసిన హెల్మెట్నే మాటిమాటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పరచుకునే గుడ్డను మారుస్తూ దాన్ని మాటిమాటికీ ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉతికిన వస్త్రాన్ని వాడుకోవచ్చు. అయితే ఇలా కాకుండా హెల్మెట్ను నేరుగా ధరిస్తుంటే... దాన్ని శుభ్రపరచుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిపుణులు ఈ జాగ్రత్తను సూచిస్తుంటారు.చివరగా... మనిషిని చూడగానే మొదటగా అందరికీ కనిపించేది తల... దానిపైన ఉండే మాడు భాగం మాత్రమే. అది ఆరోగ్యంగా కనిపిస్తుంటేనే సదరు వ్యక్తి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కేవలం నలుగురిలోకి వెళ్లినప్పుడు కలిగే ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోడానికే కాకుండా... మాడును ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు మాడు విషయంలో జాగ్రత్త వహించడమన్నది మిగతా దేహ ఆరోగ్యానికీ మేలు చేసే అంశమని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
బ్రెయిన్ ట్యూమర్కి వైఫై, స్మార్ట్ఫోన్లే కారణమా?
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వై-ఫై, స్మార్ట్ఫోన్లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు. అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్ని దెబ్బతీస్తుందా?స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..కంటి ఒత్తిడి, తలనొప్పులునిద్ర నాణ్యత తగ్గడంఒత్తిడి, ఆందోళన పెరగడంశారీరక శ్రమ తగ్గడంమానసిక అలసటకానీ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఒత్తిడి కారణమా?కేన్సర్తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.అసలు కారణం ?చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్లుఅధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్కు గురికావడంవయస్సుకొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్రఅరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలుసాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!
ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు తల్లిదండ్రులు మధ్య సత్సంబంధాలు సరిగా లేవనే చెప్పాలి. తల్లిదండ్రులిరువురు తమ ఉద్యోగాలతో బిజీ అయిపోవడంతో పిల్లలతో సాన్నిహిత్యంగా ఉండేది తక్కువనే చెప్పాలి. దాంతో వారిలో అభద్రతా భావం ఎక్కువైపోతోంది. పైగా చిన్న చిన్న వాటికే కోపతాపాలు ఎక్కువైపోవడం, చదువులో వెనకబడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా అలాంటి పిల్లలు ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకుని అధిగమించే ప్రయత్నం చేయరు. భయంతో వణికిపోవడం లేదా చికాకు, నిరాశ నిస్ప్రుహలతో చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అలా కాకుండా చిన్నారులు మానసికంగా బలంగా ఉండి, ప్రతి మాట తల్లిదండ్రులకు నివేదించేలా పెంచాలంటే ఏం చేయాలంటే..ఈ డిజిటల్ యుగంలో పిల్లలు పెద్దలు స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దాంతో ఇరువురి మధ్య దూరం ఎక్కువైపోతోందని అంటున్నారు. అదీగాక పిల్లలు కూడా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యి..అభద్రతా భావనికి గురయ్యిపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా వాళ్లలో మానసిక పరిణితి సరైన విధంగా ఉండటం లేదని అందువల్లో చిన్న వయసుకే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని చెడు మార్గాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. మొదటగా పిల్లలు తల్లిదండ్రలు మధ్య విడదీయరాని అనుబంధం స్ట్రాంగ్గా ఉండాలంటున్నారు. అందుకోసం గంటలు గంటలు.. లేదా రోజుల తరబడి వెచ్చించాల్సిన పనిలేదు. ప్రతిరోజు మీ దినచర్యలో భాగమయ్యేలా ఓ పదినిమిషాలు పిల్లల కోసం కేటాయిస్తే చాలంటున్నారు. అదికూడా పేరెంట్స్ తమ స్క్రీన్ టైంకి జస్ట్ 30 నిమిషాలు వీడ్కోలు పలికేలా ప్లాన్ చేస్తే చాలంటున్నారు. పైగా అది బిజీ షెడ్యూల్కి విరామంలా పిల్లలు హ్యాపీగా ఫీలయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. జస్ట్ 30 నిమిషాలా అంటే..ఔను జస్ట్ 30 అంటూ సరికొత్త పేరెంటింగ్ టిప్ ‘10+10+10’ రూల్ని పరిచయం చేస్తున్నారు మానసిక నిపుణులు. అంటే ..పిల్లలు నిద్ర లేచినప్పుడు ఓ పది నిమిషాలు, పిల్లలు పడుకునే టప్పడు ఓ పదినిమిషాలు, అలాగే పాఠాశాల నుంచి తిరిగి రాగానే వారితో కాసేపు పది నిమిషాలు ఎలాంటి పరధ్యానం లేకుండా, ఫోన్తో పనిలేకుండా వాళ్ల కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడండి. అది ఇరువురి మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరిచి పిల్లలు మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది వినడానికి జస్ట్ 30 నిమిషాలైనా అనిపించినా..చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ఇక్కడ చిన్నారులు పేరెంట్స్ ఎంత ప్రేమ పంచారనేది చూడరు..తమ అమ్మనాన్నలు తమకెంత అందుబాటులో ఉన్నారో అర్థమవుతుందంటున్నారు. తాము భద్రంగా ఉన్నామనే భరోసా, ధైర్యం అందిస్తుంది. పైగా పిల్లలకు ఏం జరిగినా, ఏ సమస్య వచ్చినా..నేర్పుగా వ్యవహరించడం ఎలాగే తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. అదీగాక పిల్లలను స్క్రీన్లకు అతుక్కుపోయే వ్యసనం బారినపడకుండా రక్షించేందుకు చక్కటి మందులా కూడా ఉపయోగపడుతుందట. రోజుంతో కొద్దిసేపు పిల్లలను పర్యవేక్షించే తీరు వల్ల వాళ్లు తప్పు చేసే అవకాశం, తప్పుడు మార్గంలో పయనించే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే భావోద్వేగపరంగా బలంగా ఉంటారని అంటున్నారు. అంతేగాదు తమకంటే పేరెంట్స్కి ఏది ఎక్కువ కాదనే నమ్మకం పిల్లల్లో పెంపొందుతుంది కూడా. సో ఇంకెందుకు ఆలస్యం పిల్లల కోసం జస్ట్ 30 నిమిషాలు కేటాయించి చూడండి మరి..(చదవండి: సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!) -
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..) -
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..) -
నీలి అలల మధ్య పచ్చని కల..
కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్లాలి అనుకుంటాం. కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని రారమ్మని పిలుస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘రాజా అంపట్’. ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉన్న ఈ ‘రాజా అంపట్’ అనేప్రాంతం వేలాది చిన్న ద్వీపాల సమూహం. ప్రకృతి తన అందం మొత్తం ఒక్కసారి చూపించాలి అనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కనులారా వీక్షించవచ్చు. పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లని ఇసుక తీరాలు కలిసి ఒక చిత్రకారుడి కాన్వాస్లా కనిపిస్తాయి. ప్రతి ప్రయాణంలో ఒక కొత్త దృశ్యం, ప్రతి అలలో ఒక కొత్త అనుభవం నిండి ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలు..రాజా అంపట్ అంటే ఇండోనేషియా భాషలో నలుగురు రాజులు అని అర్థం.ఇది ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉంటుంది.ఈప్రాంతం మొత్తం వేలాది చిన్న ద్వీపాలతో కలిసి ఉంటుంది.ప్రకృతి, సముద్ర జీవ వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.సముద్రం రంగుల మార్పులు ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాల్లో ఒకటి.రాజా అంపట్ చేరగానే మనకు ముందు కనిపించేది విశాల సముద్రం. అక్కడి నీటి రంగుల్లో ఆకాశంలోని మబ్బుల కదలికలను స్పష్టంగా చూడవచ్చు. కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల టార్కాయిస్, మరికొన్ని చోట్ల గాఢమైన నీలం. ద్వీపాల మధ్య వెళ్తున్న బోట్ ప్రయాణం ఒక సినిమా సీ¯Œ లా అనిపిస్తుంది. చుట్టూ చిన్న చిన్న లైమ్స్టోన్ ద్వీపాలు నీటి నుంచి వెలుస్తున్నట్టు ఉంటాయి. వాటిని చూస్తుంటే ప్రకృతి. సముద్రం మధ్యలో తన సంతకం పెట్టినట్టు అనిపిస్తుంది. అలలు మెల్లిగా బోట్ని తాకుతుంటే సమయం కూడా అక్కడ నిలిచిపోయిందేమో అనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలు..రాజా అంపట్లో ప్రతి ద్వీపం ఒక కొత్త కథ చెబుతుంది. ప్లేనెమో వ్యూ పాయింట్ నుంచి చూస్తే పచ్చని ద్వీపాలు నీలి సముద్రంపై విరిసిన ఆకుల్లా కనిపిస్తాయి. వాయాగ్ అనేప్రాంతంలో సముద్రం, ద్వీపాల మధ్య కనిపించే దృశ్యం ఒక కలలా ఉంటుంది. మిసూల్ దగ్గర నీటి కింద ఉన్న పగడపు దిబ్బల ప్రపంచం మరింత ఆకర్షిస్తుంది. సముద్రంపై చూస్తున్నప్పుడు ఒక అందం, నీటి కింద చూస్తున్నప్పుడు మరొక అందం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సముద్రం అంతా స్పష్టంగా ఉంటుంది కాబట్టి బోట్ నుంచి కూడా నీటి కింద లైఫ్ ఎలా ఉందో కనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?రాజా అంపట్లో ఉండటం అంటే కేవలం రూమ్కి పరిమితం అవ్వడం మాత్రమే కాదు. సముద్రం దగ్గర కట్టిన వుడెన్ కాటేజీలు, నీటిపై నిలబెట్టిన విల్లాలు, అడవి మధ్య ఉన్న ఎకో రిసార్ట్స్ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి ఉదయం అలల శబ్దాలతో మేలుకోవడం, సాయంత్రం సముద్రంపై పడిన సూర్యాస్తమయం చూస్తూ కూర్చోవడం అక్కడి రోజుల్లో భాగం అయిపోతుంది. నగర హడావిడి నుంచి దూరంగా ప్రకృతి మధ్య గడిపిన సమయం మనసుకి ఒక కొత్త ప్రశాంతతను ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైతే ముందు ఇండోనేషియా రాజధాని జకార్తా లేదా బాలీ చేరుతారు. అక్కడి నుంచి పాపువాప్రాంతం వైపు విమానం వెళుతుంది. ప్రయాణంలో నగర దృశ్యాలు తగ్గి సముద్రం, ద్వీపాల ప్రపంచం మొదలవుతుంది.విజయవాడ నుంచి రాజా అంపట్ వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ లేదా చెన్నై నుంచి వెళ్లవచ్చు. ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సముద్రం మధ్య చిన్న ఎయిర్పోర్ట్ చేరిన అనుభవమే యాత్రలో ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగులుతుంది. ఆకాశం నుంచి కనిపించే ద్వీపాల దృశ్యం రాజా అంపట్ అందాన్ని ముందుగానే పరిచయం చేస్తుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో సముద్రంపై పడిన సూర్యకిరణాలు రాజా అంపట్ని మరింత వెలుగులతో నింపేస్తాయి. బోట్లో ద్వీపాల మధ్య తిరుగుతుంటే ప్రతి మలుపు దగ్గర కొత్త దృశ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల పక్షుల గానం వినిపిస్తుంది. మరికొన్ని చోట్ల సముద్రం శబ్దం మాత్రమే ఉంటుంది. నీటి కింద కనిపించే కోరల్ గార్డెన్స్, రంగురంగుల చేపలు, నిశ్చలంగా తిరిగే సముద్ర జీవులు అక్కడ ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గర నుంచి చూపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో సముద్రంపై విరిసిన బంగారు వెలుగు ప్రయాణంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?ఇండోనేషియా రుచులను ఎంజాయ్ చేయడానికి రాజా అంపట్ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. తాజా సీఫుడ్ సముద్రం దగ్గర కూర్చుని ఆస్వాదించే అనుభవం ప్రత్యేకం. కొబ్బరి ఫ్లేవర్స్, లోకల్ స్పైసెస్, సముద్రపు రుచులు కలిసిన భోజనం ప్రయాణంలో భాగం అయిపోతుంది. సాయంత్రం వేళలో సముద్రం ముందు కూర్చుని లోకల్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ సీఫుడ్ లేదా ఇండోనేషియన్ డిషెస్ ఆరగించడం అక్కడి జీవన శైలిని దగ్గరగా అనుభవించిన అనుభూతిని ఇస్తుంది.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి రాజా అంపట్కి ఐదు రోజుల యాత్ర కోసం బడ్జెట్ రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల మధ్య ఉంటుంది. స్టాండర్డ్ కంఫర్ట్ యాత్ర రూ.1 లక్షా 40 వేల నుంచి రూ.2 లక్షల వరకు చేరవచ్చు.ప్రీమియం రిసార్టులు, ఎక్స్క్లూసివ్ ఐలాండ్ ఎక్స్పీరియెన్స్ యాడ్ చేస్తే రూ.2 లక్షల 50 వేల వరకు ఉండవచ్చు.స్టే చార్జీలు ప్రతి రాత్రికి రూ.4 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటాయి. ఫుడ్ ఖర్చు రోజుకు సాధారణంగా రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. ఐలాండ్ హాపింగ్ బోట్ ఎక్స్పీరియెన్స్ మెరైన్ ఎక్స్΄్లోరేషన్ యాక్టివిటీస్ ఈ యాత్రలో ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతాయి.ఇండోనేషియాకి భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం ఉంటుంది. ట్రావెల్ ప్లాన్ ను బట్టి లేటెస్ట్ వీసా గైడ్లైన్స్ని ముందుగా పరిశీలించడం – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..
దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..ఇటీవల సోషల్ మీడియాలో చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్పై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో.. చాయ్ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. "బహుశా అందుకే ఇలా చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." ఇడ్లీని చాయ్లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. తాను బ్రేక్ఫాస్ట్ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. నిపుణులు ఏం అంటున్నారంటే..టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్తో చాయ్ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్ కాంబినేషన్తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.Oh, I see what you're doing here! Aside from provoking me, that is.I have to be honest: that idli looks a bit too solid and dense for my liking. And the discolouration in the pic is not very appetising. There’s something about a perfectly soft, snowy-white, fluffy idli that… https://t.co/O9GsGAGPa6— Shashi Tharoor (@ShashiTharoor) June 7, 2026 (చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..) -
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..) -
క్యూఆర్ కోడ్ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?
పిల్లలూ! నేడు చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ తప్పనిసరి అయిపోయింది. అసలు ఆ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది చదివేయండి. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. అంటే త్వరగా స్పందించడం అని అర్థం. మనం ఏ క్యూఆర్ కోడ్ను గమనించినా, దాని మూడు మూలల్లో పెద్ద నల్లటి బాక్సులు కనిపిస్తాయి. ఇవి డిజైన్ కోసం పెట్టినవి కావు. మనం మొబైల్ ఫోన్ ను ఏ యాంగిల్లో పెట్టి స్కాన్ చేసినా, కెమెరా ఆ కోడ్ను వెంటనే గుర్తించడానికి ఈ మూడు బాక్సులు ఎంతగానో సహాయపడతాయి.అలాగే క్యూఆర్ కోడ్ మధ్యలో వేల కొద్దీ చిన్న చిన్న నల్లటి, తెల్లటి చుక్కలు ఉంటాయి. ఆ కోడ్ను స్కాన్ చేసినప్పుడు, ఆ నలుపు–తెలుపు చుక్కలను ‘1’లు ‘0’లుగా మన ఫోన్ కెమెరా చదువుతుంది. దానినే బైనరీ డేటా అని పిలుస్తారు. అలా చదివిన సమాచారాన్ని క్షణాల వ్యవధిలో మనకు అవసరమైన డేటాగా లేదా చెల్లింపు లింక్గా మార్చేస్తుంది.ఈ అద్భుతమైన సాంకేతికతను మొదటగా 1994లో జపాన్ లోని ఒక ప్రముఖ కంపెనీ కనిపెట్టింది. తమ కార్ల విడిభాగాలను ట్రాక్ చేయడం కోసం ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అలా వచ్చిన ఈ సాంకేతికతనేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సక్షన్లలో, వ్యాపారాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. -
జస్ట్ ఏడాదికే 35 కిలోలు..! ఆ ఆరు బోరింగ్ అలవాట్లు..
బరువు తగ్గే జర్నీలు ఇప్పటి వరకు వర్కౌట్లు, పక్కా ప్లాన్తో నిలకడగ చేసి.. స్లిమ్గా మారిన వారి గురించి విన్నాం. అలా కాకుండా ఈ మహిళ వెరైటీగా రోజువారీ జీవితంలో భాగమైన బోరింగ్ అలవాట్లతో బరువు తగ్గింగిదట. సంక్లిష్టమైన డైట్, వర్కౌట్లు లేకుండా.. సింపుల్గా చేసేవి, మన రోజువారి కొన్ని రకాల అలవాట్లకే దూరంగా ఉంటే బరువు తగ్గడం సులభం అంటోంది ఆ మహిళ. మరి అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!షావీ అనే మహిళ తాను కేవలం 12 నెలల్లో 35 కిలోలు తగ్గానంటూ..తనకు ఉపకరించిన ఆరు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన రోజువారీ క్రమశిక్షణలో పాతుకుపోయిన సరళమైన, స్థిరమైన అలవాట్లు తన బరువు తగ్గే ప్రయాణంలో ఎలా కీలక పాత్ర పోషించాయో సవివరంగా వెల్లడించారామె.డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయకపోవడంఇది తాను బరువు తగ్గే దశలో చేసిన తాత్కాలిక మార్పుగా షావీ పేర్కొంది. కుటుంబంతో ఉంటే తన డైట్ గురించి చేసే వ్యాఖ్యలు బరువు తగ్గడంపై ఫోకస్ని దూరం చేస్తాయని ఈ మార్పు చేసినట్లు వివరించారామె. అందుకే తాను వారితో కలిసి తినడం మానేశానని అన్నారామె. తనకు, ఇది కుటుంబం నుంచి భావోద్వేగపరంగా దూరం కావడం గురించి కాదని పేర్కొంది.రాత్రి భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడంఆ రోజుకు తినడం అధికారికంగా ముగిసిందని తన మెదడుకు అది ఒక అధికారిక 'షట్ డౌన్' లాంటిది," అని ఆమె అంటోంది. నియంత్రణ కోల్పోయి, మళ్ళీ తినేసిన రోజుల్లో, తాను మరోసారి బ్రష్ చేసుకునేదాన్నని షావీ చెబుతుంది. ఆ చిన్న చర్య తన మనసులో ఒక హద్దును సృష్టించి.. వంటగది క్లోజ్ అయ్యిందని చెబుతుండేదని అన్నారామె.స్క్రీన్ లేకుండా ఎక్కువగా తినే అలవాటును పాటించడంఇలా చేస్తే ఎక్కువగా తినం, పైగా తింటున్న ఆహారంపై అటెన్షన్ ఉంటుందని అంటోంది. ఎప్పుడైనా ఎక్కువగా తినాలనిపిస్తే, ఏ స్క్రీన్ లేకుండానే పూర్తి చేస్తానని అంటోంది.ఎక్కువగా తినడాన్ని రేపటికి వాయిదా వేయడంనియంత్రణకు బదులుగా, పోస్ట్పోన్ చేయడం ఒక సాధనంగా మారుతుంది. ‘నేను దీన్ని రేపు తినగలను’ అని చెప్పుకుంటూ ఉంటే.. ఎప్పుడోకప్పుడూ తింటాననే సంతృప్తి అతిగా తినడాన్ని నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు.ఫ్రిజ్లో ప్రోటీన్ను కనిపించేలా ఉంచడంతినే ఆహారం కంటికి కనిపించే చేరువలో పెడితే..అవి తీసుకోవాలనే స్పృహ ఉంటుందని అంటోంది. అందుకే వేయించిన శనగలు, సోయా, పనీర్, ఉడికించిన గుడ్లు, చీజ్, ఇవి ఎప్పుడూ కంటికి కనిపించేలా పెట్టుకునేదాన్ని అని చెబుతున్నారామె.ఫుడ్ రీల్స్కి దూరంగా ఉండటం..కంటెంట్ వినియోగానికి, తినాలనే కోరికలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని వివరించింది షావీ. రోజంతా బ్రెయిన్కి ఆహార సంబంధిత కంటెంట్ను అందించడం ఆపేసినప్పుడు, తినాలనే కోరికలు చాలా వరకు తగ్గుతాయని అంటోంది. మనం ఏం చూస్తామో అదే తినాలని అనుకుంటామని అని చెబుతోంది షావీ. వినడానికి విచిత్రంగా ఉన్నా..కష్టంగా లేకుండా ఆచరణాత్మకంగా చిన్నపాటి మార్పులతోనే సులభంగా బరువు తగ్గే బెస్ట్ రెమిడ్స్లా ఉన్నాయి కదూ. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి. View this post on Instagram A post shared by Shavy | 35 kgs off (@shavyjain7) (చదవండి: ఆత్మవిశ్వాసం ఉంటే..అద్భుతం చేయొచ్చు!: మిస్ యూనివర్స్ కేరళ) -
లుక్స్, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..!
కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. మిస్ యూనివర్స్ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్గా నడవగలిగానని అన్నారు. ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!) -
ప్లీజ్ అంతా అయిపోయాక కాదు..! ముందుగానే తెలుసుకుందాం..
ఏ విషయంలోనైన అశ్రద్ధ ఉన్నా..పర్లేదు కానీ..ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పెద్దయ్యాక..చూద్దాంలే అనుకుంటూ..ఉంటే..కథే అడ్డం తిరుగుతుంది. మనం యంగ్ ఏజ్లో తీసుకున్న ఆహారాలు, జీవనశైలి వంటివే నాలుగుపదుల వయసులో మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యం సమీపించే సమయానికి రకరకాల వ్యాధుల బారినపడి..ఆరోగ్యాన్ని చేజాతులారా పాడు చేసుకుంటారని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. అంతేగాదు. ముందుగానే ఈవిషయాలు తెలిసి ఉంటే బాగుండును అనుకునే ఐదు శక్తిమంతమైన ఆరోగ్య పాఠాలపై అందరికీ అవగాహన ఉండాలంటున్నారు. అవేంటంటే..యంగ్ ఏజ్లో ఉండగా..ఆ తర్వాత అంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. నిశబ్దంగా నష్టం జరిగిపోయాక గానీ మేల్కోరని అంటున్నారామె. నిద్ర అలవాట్ల నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతిదాంట్లో కేర్ఫుల్గా ఉండాలని అంటున్నారు.తెలుసుకోవాల్సిన ఐదు శక్తిమంతమైన పాఠాలు..తన 20 ఏళ్ల వయసులో తనకు తెలిసి ఉంటే బాగుండేదని అతను భావించే ఐదు శక్తివంతమైన పాఠాలు ఇక్కడ ఉన్నాయి:జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మిగతా అన్నింటినీ నిర్ధారిస్తుంది..శక్తి, మానసిక స్థితి, చర్మం, రోగనిరోధక శక్తి, మానసిక స్పష్టత అన్నీ జీర్ణవ్యవస్థలోనే మొదలవుతాయని అంటున్నారు వైద్యులు. ఇదంతా జీర్ణవ్యవస్థలో నిశ్శబ్దంగా ఉంటుంది,నిద్ర అనేది మీరు తర్వాత భర్తీ చేసుకోగలిగేది కాదుచాలా మంది అనుకున్నట్లుగా నిద్రలేమిని పూడ్చలేము. ప్రతి రాత్రి సరిగా నిద్రపోకపోవడం కాలక్రమేణా పేరుకుపోతుంది. కోల్పోయిన నిద్రకు బ్యాంకు ఖాతా లేదు,అని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి వేగవంతమైన జీవసంబంధమైన వృద్ధాప్యం, అధిక జీవక్రియ ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధనలు చెబుతున్నాయని చెబుతున్నారు.ఆహారం కంటే.. ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తుంది..దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంపై ప్రత్యక్ష జీవసంబంధమైన ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి కొన్ని గంటల్లోనే జీర్ణవ్యవస్థ, శరీరాన్ని ప్రభావితం చేయగలదు. నాడీ వ్యవస్థ నియంత్రణ గురించి మంచి అవగాహన ఉండాలి.ఇష్టంగా తినే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం..ఇవాల్టి ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక కాలేయం, జీవక్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలు అకస్మాత్తుగా రావు, దశాబ్దాల తరబడి పునరావృతమయ్యే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేవని అంటున్నారు.అత్యంత శక్తిమంతమైన పదార్థం ఫైబర్అందరు రోజుకు కేవలం పది నుంచి 15 గ్రాముల ఫైబరే తీసుకుంటున్నారు. తగినంత ఫైబర్ పెద్ద ప్రేగు కేన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saurabh Sethi MD MPH | Gastroenterologist (@doctor.sethi) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
గాటు లేకుండా ‘పొడి’చేసే గన్!
మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు కలిగే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి మూత్రపిండాలు మన దేహంలోని జీవక్రియల తర్వాత వెలువడే అనేక వ్యర్థాలూ, విషపదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. ఈ క్రమంంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరుకుపోయి ఒక స్ఫటికంలా మారే అవకాశాలుంటాయి. వీటినే మనం రాళ్లుగా చెబుతుంటాం. ఇటీవల ఈ రాళ్ల తొలగింపు చాలా సులభం అయ్యింది. ఇప్పటికీ సంప్రదాయ శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించే అవకాశమున్నప్పటికీ కొన్ని ఆధునిక వైద్య ప్రక్రియలతో దేహంపై ఎలాంటి గాటు పెట్టకుండానే శబ్దతరంగాల సహాయంతో వాటిని పౌడర్లా చేసే ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...సహజంగానే రోజూ తక్కువ నీళ్లు తాగేవారిలో, అలాగే నిత్యం ఏసీ రూముల్లో ఉండటం వల్ల నీళ్లు తక్కువగా తాగేవారిలో, చాక్లెట్లు, కెఫిన్ వంటివి ఎక్కువగా తీసుకునేవారితోపాటు... కొందరిలో వారి దేహస్వభావంలోనే రాళ్లు ఏర్పడే అవకాశముంటుంది. వీటి తొలగింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాయి సైజు, దాని గట్టిదనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శస్త్రచికిత్స నిపుణులు తొలగింపు ప్రక్రియను ఎంపిక చేస్తారు. అయితే చిన్నపాటి గాటు పెట్టి చేసే శస్త్రచికిత్సలతో పాటు అసలు ఎలాంటి గాటూ లేకుండా కేవలం ఒక గన్లాంటి ఉపకరణంతో రాళ్లను పౌడర్ చేయడం ద్వారా వాటిని తొలగిస్తారు.కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?రెండు మూత్ర పిండాలూ రక్తంలోని వ్యర్థాలను వడపోస్తూ ఉంటాయి. రక్తంలోని అనేక అంశాలను శుద్ధి చేసి సమయం లో అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మాత్రం మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని వ్యర్థాలైన క్యాల్షియమ్ ఆక్సలేట్, సిస్టిన్ వంటివి స్ఫటికాలుగా పోగుపడుతూ రాళ్ల రూపాన్ని సంతరించుకుంటాయి. నిజానికి ఆ రాళ్లు యురేటర్ లేదా మూత్రనాళం సైజు కంటే తక్కువగా ఉంటే అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్కు పెరిగితే మూత్రంలో కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో ఇరుక్కుపోవచ్చు. ఇలా రాళ్లు ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. చిన్న గాటు కూడా పెట్టాల్సిన అవసరమే లేకుండా... ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్డబ్ల్యూఎల్) అని పిలిచే ఈ అత్యాధునిక ప్రక్రియ సహాయంతో మూత్రపిండం ఉండే భాగంలో చర్మంపై నుంచే కేవలం గన్లాంటి అత్యాధునిక ఉపకరణం సహాయంతో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలూ అలాగే బలమైన అల్ట్రా సౌండ్ తరంగాలను పంపుతారు. ఈ చికిత్స ప్రక్రియలో అల్ట్రాసోనిక్ తరంగాల ద్వారా రాయిని చాలా చిన్న చిన్న పలుకులు లేదా పొడి పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి రూపంలో ఉన్న రాళ్లు మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. రాతిని పలుకులు, పొడిగా చేశాక... కొన్ని కేసుల్లో మాత్రమే యురేటర్లో స్టెంట్ వేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ రాతిపలుకుల వల్ల మూత్రనాళాలు లేదా బ్లాడర్ గోడలు ఒరుసుకుపోయి గాయపడకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. బాధితుల ఒంట్లోనుంచి రాతి పౌడర్లాంటి చిన్న చిన్న పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్ను తొలగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా బాధితులకు ఎలాంటి బాధ, శ్రమ లేకుండా చికిత్స జరుగుతుంది. రాయి సైజు ఎక్కువగా ఉన్నా... ఎక్కువ గట్టిగా ఉన్నా రెండో సిట్టింగ్ అవసరం పడవచ్చు. సర్జరీ ఎప్పుడంటే... బాధితుల్లో తీవ్రమైన నొప్పి ఉండి, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. చివరగా... మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి పెరుగు చాలా తోడ్పడుతుంది. దీంతోపాటు తగినన్ని నీళ్లు ద్రవాహారాలు తీసుకోవడం మంచిది.లక్షణాలు... → భరించలేని నొప్పి → మూత్రంలో రక్తం పడటం → మూత్రంలో చీము రావడం → విసర్జన సమయంలో మూత్ర మార్గంలో మంట → మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు ∙∙అబ్డామినల్ డిస్టెన్షస్లో... తల తిరగడం, వాంతులవడం. ఈ లక్షణాలతో పాటు ఒక్కోసారి చలి, జ్వరం. పోస్ట్రిరీనల్ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్కు దారి తీయడం ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆకలి లేకపోవడం / ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, దాంతో బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.నిర్థారణ పరీక్షలు...మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్–రే, సీటీ స్కాన్ అబ్డామిన్ల వంటి పరీక్షలు అవసరమవుతాయి. వీటితో పాటు డాక్టర్లు సూచించే మరికొన్ని నిర్దిష్టమైన పరీక్షలూ చేయించాల్సి రావచ్చు.ఇతర చికిత్సలు... కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, మూత్రవిసర్జక వ్యవస్థలో రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఉదాహరణకు రాయి సైజు 2 సెం.మీ కంటే తక్కువగా ఉంటే యుటెరోస్కోపీ (యూఆర్ఎస్) అనే ప్రక్రియతోనూ, 2 సెం.మీ కంటే ఎక్కువగా ఉండి, కాస్తంత సంక్లిష్టంగా అంటే జింక కొమ్ముల (స్టాగ్ హార్న్) వంటి ఆకృతి ఉన్నవాటిని పీసీఎన్ఎల్ అనే చిన్న గాటు పెట్టే ప్రక్రియలతోనూ అలాగే 2 సెం.మీ. పరిణామంలో ఉండే రాళ్లను ఆర్ఐఆర్ఎస్ అనే బ్లాడర్లోకి పైప్ను పంపుతూ లేజర్ సహాయంతో లోపల ఉన్న రాయిని పౌడర్ చేసే ప్రక్రియలాంటి వాటిని ఉపయోగిస్తారు. పీసీఎన్ఎల్ మినహా యూఆర్ఎస్, ఆర్ఐఆర్ఎస్లలోనూ ఎలాంటి గాటూ ఉండదు.డాక్టర్ పూర్ణచంద్రా రెడ్డిసీనియర్యూరాలజిస్ట్– యాసీన్ -
మండుటెండల్లో మంచులా...
ఈ ఎండల్లో చర్మం నిర్జీవంగా, అలసటగా మారడం సహజం. అయితే, మీ చర్మాన్ని చల్లబరిచి, తేమను అందిస్తూ, ఆరోగ్యంగా ఉంచడానికి మన ఇంట్లోనే దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.ఎండ తీవ్రత వల్ల చర్మంపై వచ్చే మంట, ఎరుపుదనం, సన్బర్న్ను తగ్గించడంలో కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చర్మాన్ని శాంతపరచడానికి, చికాకును తగ్గించడానికి అలోవెరా జెల్ ఒక ఉత్తమమైన ఔషధం.గంధానికి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంది. ఎండకాలంలో వచ్చే మొటిమలను తగ్గించడానికి, చర్మంపై వచ్చే దురద, మంటను నివారించడానికి గంధం పూత వేసుకోవడం వల్ల తక్షణ ఫలితం కనిపిస్తుంది.రోజ్ వాటర్ చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ, జిడ్డును నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు మూసుకు΄ోకుండా, ముఖాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచే ఒక అద్భుతమైన నేచురల్ టోనర్గా ఇది పనిచేస్తుంది.గ్రీన్ టీ కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై వచ్చే మంట, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొటిమల సమస్యతో బాధపడేవారికి, సున్నితమైన చర్మం గలవారికి చక్కని టోనర్గా ఉపయోగపడతాయి.దోసకాయలో నీటి శాతం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై వచ్చే వాపును తగ్గించడమే కాకుండా, ముఖానికి తక్షణ చలవను అందిస్తుంది. అలసి΄ోయిన, ఎండ వేడికి గురైన చర్మానికి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. (చదవండి: సైక్లింగ్తో యాక్టివ్గా..!) -
డాల్ఫిన్కు కూడా 108 ఉందోచ్!
పిల్లలూ... ఎవరికైనా ఆరోగ్యం హటాత్తుగా పాడైతే, ప్రమాదం జరిగితే అంబులెన్స్ వస్తుంది కదా. ‘కుయ్కుయ్’ అని సౌండ్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. మరి గంగానదిలో ఉండే డాల్ఫిన్కి ప్రమాదం జరిగితే ఎవరు కాపాడతారు? అందుకే మన దేశం ప్రపంచంలోనే మొదటి ‘డాల్ఫిన్ అంబులెన్స్’ని తయారు చేసింది. దీని పని ఏంటో తెలుసా? నదిలో దారి తప్పిన, గాయపడిన డాల్ఫిన్స్ని కాపాడి, మందు వేసి, మళ్లీ నదిలో వదిలిపెట్టడం. ‘నమామి గంగే’ అనే పథకం కింద ఈ అంబులెన్స్ని మొదలుపెట్టారు. అంటే గంగమ్మను, గంగలో ఉండే జీవులను కాపాడటమే దీని లక్ష్యం.ఈ అంబులెన్స్ స్పెషల్ ఏంటి?ఇది కదిలే హాస్పిటల్. మన 108 లాగే ఇది కూడా ఒక మొబైల్ ఐ.సి.యు, అంటే లోపల డాక్టర్ల సామాన్లు, మందులు, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి. డాల్ఫిన్కి ఎక్కడ దెబ్బ తగిలినా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. ఇది ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ఇప్పటిదాకా ఎనిమిది డాల్ఫిన్లను కాపాడింది. సూపర్ కదా! ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఒక పెద్ద డాల్ఫిన్ ఇటీవల కాలువలో ఇరుక్కుపోయింది. నీళ్లు తక్కువై నీరసంగా అయి΄ోయింది. వెంటనే మన ‘డాల్ఫిన్ 108’ వచ్చేసింది. 13 గంటలు కష్టపడి, బయటికి తీసి, చెకప్ చేసి, రాప్తి నదిలో సేఫ్గా వదిలిపెట్టారు. గంగా డాల్ఫిన్ అంటే?ఇది మంచి నీటి డాల్ఫిన్. సముద్రంలో ఉండదు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని నదుల్లో కనిపిస్తుంది. అత్యధికంగా గంగలోనే. ప్రపంచంలో మంచినీటి డాల్ఫిన్లు కేవలం 5–6 జాతులు మాత్రమే ఉన్నాయి. అందులో గంగా డాల్ఫిన్ ఒకటి. అదీ అంతరించిపోయే దశలో ఉంది. అందుకే దీనికి ‘జాతీయ జలచర జంతువు’ హోదా ఇచ్చారు. మన నెమలి, పులి లాంటిదన్నమాట. దీనికి కళ్ళు సరిగా కనిపించవు. ‘క్లిక్ క్లిక్’ అని సౌండ్ చేసి దారి కనుక్కుంటుంది. ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది. అందుకే దీన్ని ‘నవ్వే దేవత’ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఇవి కేవలం 6,324 మాత్రమే మిగిలాయి. అందుకే ప్రతి డాల్ఫిన్ చాలా విలువైనది. మనం నదిని శుభ్రంగా ఉంచితే, డాల్ఫిన్ హ్యాపీగా ఈదుకుంటూ ఉంటుంది. సరేనా?.(చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
సైక్లింగ్తో యాక్టివ్గా..!
ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక్క సులువైన పరిష్కారం ఉంది, అదే సైక్లింగ్. మరి ఆ సైక్లింగ్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.శరీర భాగాల సమన్వయం, సమతుల్యత మెరుగవుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఊబకాయం నుంచి కాపాడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. కేన్సర్ నివారణకు సహాయపడుతుంది. కీళ్ల కదలికలు సులువవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించే ప్రాణయామంయోగాలో శ్వాస నియంత్రణ ప్రక్రియను ణాయామం అంటారు. ప్రాణ (జీవశక్తి) + ఆయామ (నియంత్రణ/విస్తరణ) కలయికే ప్రాణాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.ప్రయోజనాలు: ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి ముక్కు ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. భ్రామరీ: తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలిని వదలడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది.కపాలభాతి: శ్వాసను వేగంగా బయటకు వదలడం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.భస్త్రిక: బలమైన, వేగవంతమైన శ్వాస ప్రక్రియ. శరీరంలో శక్తిని పెంచుతుంది.ముఖ్యమైన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో (ఉదయం లేదా సాయంత్రం) చేయడం మంచిది. గుండెజబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే అభ్యసించాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ (చదవండి: Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..) -
చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!
ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్ వాచ్మన్గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్ చేస్తే... అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ సక్సెస్ జర్నీ... జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది, యువతకు ప్రేరణ కలిగిస్తుంది. కలిఖో పుల్... ఆ పేరుకు అర్థం 'మంచి భవిష్యత్తు' అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా.. ఊహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడే తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్. అలా దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్ని అతడి అత్తయ్య చేరదీసింది. అది అతడి మీద ప్రేమతో కాదు... ఇంట్లో పనులకు పనికొస్తాడని. పదేళ్లకు వడ్రంగిగా... ఆరేళ్ల వరకూ పుల్ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని 'హవాయి క్రాఫ్ట్ సెంటర్'లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. జీవితాన్ని మలుపు తిప్పిన ఆ పాట..పుల్ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్ సెంటర్కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్లోనే మాట్లాడేవాళ్లు. పుల్కి అస్సమీస్ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్ స్కూల్లో ఒకటో తరగతిలో చేరాడు పుల్. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. ఓరోజు పుల్ చదువుతోన్న స్కూల్కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్ పుల్కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్ని డే స్కూల్కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్ ఇప్పించాడు. అదే పుల్ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. ఆత్మహత్యవైపు అడుగులు తరగతులు మారే కొద్దీ పుల్కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టం మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్ వాచ్మన్గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్ చేయించుకోకుంటే గానీ సమస్య తగ్గదనే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు. చదువుకుంటూనే పని జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్ గ్రాంట్తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్కి వెదురుతో ఫెన్సింగ్ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. దాన్నే ఉపాధిగా చేసుకుని అంచలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్ హ్యాండ్ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు. పాతికేళ్లకే ఎమ్మెల్యే చిన్న కాంట్రాక్టర్గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పుల్ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. మంత్రిగా 22ఏళ్లుచిన్న వయసులోనే స్థానికంగా పుల్ సంపాదించిన పేరు కాంగ్రెస్ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడు కాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు. తొలి ఎన్నికల్లో పుల్ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు.మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 'ఒకప్పుడు ఆపరేషన్ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్ రెండువేల ఐదొందలు గ్రాంట్ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ పుల్ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22 ఏళ్లు పుల్ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్లోని పుల్ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. కష్టమే దేవుడని నమ్ముతా..ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్, అరుణాచల్ ప్రదేశ్లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరదించి, ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. "నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్గా, కాంట్రాక్టర్గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు 12 గంటలు ప్రభుత్వ వాచ్మన్గా పనిచేసిన నేను ఇప్పుడు 24 గంటలూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు". అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్. అయితే పుల్ ఆగస్టు 9, 2016న 47 ఏళ్ల వయసులో మరణించాడు.చదవండి: బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం.. కానీ పేదవాడే! -
బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం..! కానీ పేదవాడే..
మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ. ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ. అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by Dr Sunny Garg (@drsunnygarg) (చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు) -
65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..
బరువు తగ్గాలంటే కఠినమైన ఆహార నియమాలు, కష్టతరమైన వ్యాయమాల క్రమం అనుకుంటారు అంతా. కానీ తెలివిగా ఎంజాయ్ చేస్తూ సులభంగా తగ్గే ప్రక్రియ అని అంటోంది ఫిట్నెస్ కమ్ యోగా కోచ్ త్రిప్తి. చాలామంది. ఇక్కడ స్మార్ట్గా ఆలోచిస్తే స్లిమ్ అవ్వడం చాలా సులవు అని చెబుతోందామె. మరి అదెలాగో త్రిప్తి మాటల్లోనే తెలుసుకుందామా.!.దుబాయ్కు చెందిన ఫిట్నెస్, స్ట్రెంత్, యోగా కోచ్ త్రిప్తి తను కేవలం ఏడు నెలల్లో 7.7 కేజీల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఎక్కువ కేలరీలు ఖర్చు చేసేందుకు, పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడానికి సహాయపడిన సులభమైన ప్రభావవంతమైన వ్యాయామాలను పంచుకున్నారామె. తాను కాంపౌండ్ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ 7.7 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఇది కొవ్వు తగ్గడాన్ని వేగవంతం చేయడంలోనూ, మొత్తం ఫిట్నెస్ను మెరుగుపరచడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది.మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్త్రిప్తి తన వర్కౌట్ను మోకాలి-నుంచి-మోచేతి క్రంచెస్తో ప్రారంభించారు. ఈ వ్యాయామం కోర్ తోపాటు శరీర దిగువ భాగాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. కొత్తగా చేసేవారికి, కేవలం శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్ చేయమని ఆమె సిఫార్సు చేశారు.కాలును పైకి లేపేటప్పుడు శ్వాసను బయటకు వదలండి, తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చేటప్పుడు శ్వాసను లోపలికి తీసుకోండి. కదలిక అంతటా మీ కోర్ను బిగుతుగా ఉంచి, నిటారుగా ఉండే భంగిమను కొనసాగించాలని చెప్పారామె. అలాగే క్రమం తప్పకుండా వర్కౌట్ చేసేవారికి లేదా జిమ్కు వెళ్లేవారికి, బరువులను జోడించి, రెప్స్ సంఖ్యను 20కి పెంచమని త్రిప్తి సూచించారు. నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించడంతరువాత, ఆమె నిలబడి మోకాలిని కాలివేళ్లకు తాకించింది. ఇది కోర్, హామ్స్ట్రింగ్స్ మరియు హిప్ ఫ్లెక్సర్లను లక్ష్యంగా చేసుకునే ఒక సులభమైన వ్యాయామం. తొలిసారిగా ప్రారంభించేవారు తమ శరీర బరువును ఉపయోగించి ప్రతి వైపు 10 రెప్స్తో మొదలుపెట్టవచ్చు. ఆ తర్వాత ఆమె 10 కేజీల డంబెల్ను పట్టుకొని అదే వ్యాయామాన్ని చేసింది. మరింత సవాలు కోరుకునే వారు వేగాన్ని పెంచుకోవచ్చు లేదా సరైన భంగిమను పాటిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.మోకాలిని తిప్పే వ్యాయామంఆ తర్వాత త్రిప్తి మోకాలిని తిప్పే వ్యాయామం గురించి వివరించింది. ఈ వ్యాయామం ఒబ్లిక్స్ను బలపరచడానికి, మొండెం కదలికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ కదలికను చేయడానికి, ఒక మోకాలిని పైకి లేపి, కోర్ను బిగుతుగా ఉంచుతూ పై శరీరాన్ని దాని వైపుకు తిప్పండి. తొలిసారిగా ప్రారంభించినవారు ప్రతి వైపు 10 రెప్స్ లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఈ కదలికను మరింత సవాలుగా మార్చడానికి, ఆమె డంబెల్ లేదా వెయిట్ ప్లేట్ను జోడించమని సూచించింది. అధునాతన వ్యాయామం చేసేవారు వేగంపై కాకుండా నియంత్రిత మెలికలపై దృష్టి పెడుతూ, 5-10 కేజీల బరువును పట్టుకొని ప్రతి వైపు 15-20 రెప్స్ చేయవచ్చు.హై నీస్ (లేదా హై-నీ మార్చ్)ఈ వర్కౌట్లో హై నీస్ కూడా ఉంది. ఇది ఒక కార్డియో వ్యాయామం, ఇది ఓర్పును పెంచుతూనే కోర్, గ్లూట్స్, కాలి కండరాలను ఉత్తేజపరుస్తుంది. తొలిసారి ప్రారంభించేవారు సౌకర్యవంతమైన వేగంతో మోకాళ్లను నడుము ఎత్తు వరకు పైకి లేపుతూ, 10-12 సార్లు హై-నీ మార్చ్ చేయవచ్చు. తీవ్రతను పెంచడానికి, ఇంతకు ముందు వర్కౌట్ అనుభవం ఉన్నవారు ప్రతి చేతిలో తేలికపాటి డంబెల్స్ పట్టుకుని 45-60 సెకన్ల పాటు హై నీస్ చేయవచ్చు. నిటారుగా కూర్చోవడం,చేతులను పంప్ చేయడం ఈ వర్కౌట్ను మరింత మెరుగుపరుస్తాయి.ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజ్ఆమె ఓవర్హెడ్ డంబెల్ లాటరల్ లెగ్ రైజెస్ చేసింది. ఈ వ్యాయామం భుజాలు, కోర్, గ్లూట్స్, బయటి తొడలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు బ్యాలెన్స్, స్థిరత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తొలిసారిగా ప్రారంభించేవారు కేవలం తమ శరీర బరువును ఉపయోగించి, ప్రతి వైపు 10 రెప్స్తో ప్రారంభించవచ్చు. ఈ కదలిక అంతటా కోర్ను నిమగ్నంగా ఉంచడం నిటారుగా కూర్చోవడంపై దృష్టి పెట్టాలి.వ్యాయామం చేసేటప్పుడు డంబెల్ను తలపైన పట్టుకోవాలని త్రిప్తి సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మధ్యస్థం నుండి ఎక్కువ బరువును ఉపయోగిస్తూ ప్రతి వైపు 15-20 రెప్స్ వరకు పెంచుకోవచ్చు. చివరగా ఆమె ఈ వ్యాయామాల తోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర రోజువారీ కదలికలు కలిపి చేస్తే..బరువులో మాత్రమే కాకుండా, బలం, శక్తి, ఆత్మవిశ్వాసంలో కూడా మార్పుని గమనించగలుగుతాం అని అంటోంది త్రిప్తి. ఇక్కడ కేవలం నిలకడ, క్రమశిక్షణే మంచి ఫలితాలను తెలస్తుందని అంటున్నారామె. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారామె. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by TriptiFitFlow | Strength•Yoga•Transformation (@triptifitflow) (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
విటమిన్–సి పుల్లటి పండ్లలో కంటే వాటిల్లోనే అధికం..!
మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్–సి అత్యంత కీలకమైనది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా, చర్మ సౌందర్యానికి, కణాల మరమ్మత్తుకు ఎంతగానో సహాయపడుతుంది. అందుకని మన రోజూవారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా ఈ విటమిన్ని సులభంగా పొందవచ్చు. సిట్రస్ జాతికి చెందిన నారింజ పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విదేశీ పండైనప్పటికీ ప్రస్తుతం మన దేశంలో విరివిగా లభిస్తున్న కివీ పండులో విటమిన్–సి తోపాటు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలామంది విటమిన్–సి కేవలం పుల్లటి పండ్లలోనే ఉంటుందని భావిస్తారు. కానీ, ఎర్రటి క్యాప్సికమ్లో నారింజ కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్–సి ఉంటుంది. ప్రతిరోజూ తగిన మోతాదులో విటమిన్–సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. యాంగ్జైటీ తగ్గించే యాలక్కాయ!భోజనం ముగిసిన వెంటనే ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమలడం మంచిది. యాలకుల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు లాలాజలాన్ని, డైజెస్టివ్ ఎంజైమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. వీటిల్లో ఉన్న కార్మినేటివ్ గుణాలు కడుపులో గ్యాస్ తయారవ్వకుండా నిరోధిస్తాయి. ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. వీటి నుంచి వచ్చే సువాసనలో మానసిక ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది. యాంగ్జైటీ వల్ల వచ్చే జీర్ణ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం) -
గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం
సాధారణంగా మల్లెలు అనగానే మగువలే గుర్తొస్తారు. ఇది తరతరాలుగా మహిళలకు, మల్లెలకు ఉన్న అనుబంధం. అలంకారానికి మాత్రమే కాక ఆహ్లాదం, ఆనందం, అనురాగాన్ని కూడా పంచుతాయి మల్లెలు. అన్నట్లు మహిళలు మల్లెలను ధరించేది తమకోసమే కాదు, తమను ప్రేమించే వారి కోసం కూడా! మల్లెలు ఏడాదిలో మూడు నాలుగు నెలలు మాత్రమే పూస్తాయి. అది కూడా వేసవి ఎండల్లోనే. అందుకే మల్లెల గురించి మరింతగా...మనసుకు, మేనికి ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సువాసన కారణంగా మల్లెపూలను మన దేశంలో పూలకే రాణిగా పరిగణించడంతో పాటు బెల్లె ఆఫ్ ఇండియా లేదా సువాసన రాణి అని కూడా సంబోధిస్తుంటారు. తలకు..మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెల కషాయంతో కళ్లమంటలు, నొప్పులు తగ్గుతాయి. మల్లె పూలు, ఆకులతో కషాయం కాచి, వడగట్టి చల్లార్చాలి. అనంతరం రెండు వంతుల కషాయంలో ఒక వంతు నువ్వులనూనె, కొబ్బరినూనె, ఒక స్పూను బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది. సువాసన వెదజల్లే పూలను తల దిండు పక్కన పెట్టుకుని పడుకుంటే.. మనసు స్థిమితమై హాయిగా నిద్ర పడుతుంది. మధుమేహులు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉంటుంది. కొబ్బరినూనెలో మల్లెపూలను రోజంతా నానబెట్టి, తర్వాత కాచి వడగట్టాలి. చల్లారాక తలకు మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. అదేవిధంగా కొబ్బరినూనెతో మల్లెపూల రసాన్ని కలిపి తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది. చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలు పోగొట్టడంలోనూ మల్లెలు ఉపకరిస్తాయి. అంతేకాదు మల్లెపూలతో చేసిన పలు ఔషధాలు శరీరంపై ఏర్పడే కణితులను కూడా నివారిస్తాయని పరిశోధనల్లో తేలింది. మహిళలకు రుతుస్రావంలో తలెత్తే సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయట. అలాగే గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేందుకు ఇవి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మల్లెలు భాగస్వాముల మధ్య మానసిక ఆందోళనలను, బిడియాన్ని తొలగించి, మనోల్లాసం కలిగించే భావనలను ప్రేరేపిస్తాయట. అందుకే భారతీయ సంప్రదాయంలో మల్లెలకు పెద్ద పీట వేశారు. సాహిత్యంలోనూ మల్లెలకు ప్రముఖ స్థానం ఇచ్చారు. కవులు, గాయకులు, రచయితలు మల్లెపూల సొగసును, వాటి పరిమళాన్ని వర్ణిస్తూ ఎన్నో పాటలు రాశారు. రచనలు చేశారు. కవితలు అల్లారు. స్త్రీల సౌకుమార్యాన్ని మల్లెపూలతో పోల్చారు. ఏ రకంగా చూసినా మల్లెపూలు నిత్యజీవితంలో పరిమళాన్ని అద్దుతూనే ఉంటాయి. గాఢమైన వాసనతో గుండెను హత్తుకుంటూనే ఉంటాయి. ఎన్నో పరిమళాలుభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని విభిన్న రకాల పేర్లతో పిలుస్తుంటారు. మోగ్రా, మోతియా, చమేలి, మల్లి పూవ్వు, జాటి, మల్లిగే, జూహి, మోగ్రా లేదా పొద జాతి వక్షాల్లో మూన్లైట్ అని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. మొత్తం మీద మల్లెపూలలో 300 రకాలు ఉన్నట్టు అధికారికంగా నమోదైంది. మల్లెపువ్వుకి మల్లిక, మగేష్టము, మల్లియ, ప్రయ, శూన్య, ముద్గరము, హసంతి, చంద్రిక, సుభగ వంటి పేర్లెన్నో ఉన్నాయి. మరి ఇంత చరిత్ర, ఇన్ని పేర్లు ఉన్న మల్లెపూలలో నిత్యమల్లెలు, బొండు మల్లెలు, దొంతర మల్లెలు, కాగడ మల్లెలు, శంకు మల్లెలు, బొడ్డు మల్లెలు, నాగ మల్లెలు, కొండమల్లెలు, కంచె మల్లెలు, దేశవాళి మల్లెలు వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. అరోమా థెరపీమల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుంగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమాథెరపీలోనూ మల్లె పూలను వాడతారు. కళ్లు అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టూ మర్దన చేసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే తాజా మల్లెలను మెత్తగా నూరి, తడిబట్టతో చుట్టి కళ్లమీద పెట్టుకుంటే, కళ్లలో నీరు కారడం, తడి ఆరిపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. నపుంసకత్వం, శీఘ్రస్కలన సమస్యల పరిష్కారానికి కూడా మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమయ్యే విటమిన్–సి మల్లెపూలలో సమృద్ధిగా లభిస్తుంది. – డి.వి.ఆర్.(చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్ కుమారుడు..!) -
ఓ మై గార్డ్...∙
హీరో రామ్చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మీరు అతన్ని బాగా ఫేమస్ చేసేశారు, నేనిక అతన్ని బయటకు వెళ్లనివ్వబోవడం లేదు’ అంటూ జోక్ చేశారంటే... అది ఎవరి గురించి అయి ఉంటుంది? బహుశా రామ్ చరణ్ బాడీ గార్డ్ కెవిన్ కుంటా గురించే అయి ఉండొచ్చు.. అవును మరి... ఆయన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. ఈ బాడీగార్డ్ తమ కుటుంబంతో కలిసి దాదాపు నాలుగేళ్లుగా ప్రయాణిస్తున్నాడని, తమ వ్యక్తిగత దినచర్యల గురించి అతనికి బాగా అవగాహన ఉందని, పిల్లలతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు తమతోపాటే ఉంటాడని రామ్ చరణ్ ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.వీడియోతో వైరల్...నాలుగేళ్లుగా ఉన్నప్పటికీ...‘పెద్ది’ సినిమా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాల సమయంలో మాత్రం రామ్చరణ్ పక్కనే నిలబడి నిలువెత్తు స్టైలిష్ లుక్లో కనిపించిన కెవిన్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరీ ముఖ్యంగా.. ఒక అభిమాని జాన్వి, చెర్రీల దగ్గరకు అకస్మికంగా దూసుకురాగా రెప్పపాటులో అడ్డుకున్న కెవిన్ అతడిని అమాంతం రెండు చేతుల్తో ఎత్తేసి అవలీలగా మోసుకుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అతను సెలబ్రిటీ బాడీగార్డ్స్లో సెలబ్రిటీగా మారిపోయాడు. మన దేశంలో తనకు లభిస్తున్న అనుకోని ఆదరణకు ఉబ్బితబ్బిబ్బయిన 28 ఏళ్ల కెవిన్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు, సినీ అభిమానులకు తనపట్ల వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.నేపథ్యం ఇదే...ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం, కెవిన్ తాను గాంబియాలో జన్మించి ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్న వ్యక్తిగా, అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ)ఫైటర్గా పరిచయం చేసుకున్నాడు. ఆన్ లైన్లో 81,900 మంది ఫాలోయర్లతో చెప్పుకోదగ్గ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. అతని పోరాట రికార్డులు టాపోలజీ వంటి ఆన్లైన్ ΄్లాట్ఫార్మ్స్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అతను అబ్డో కాదిర్ర్ సోవె అనే అసలు పేరుతో నమోదవడం విశేషం. గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ గుర్తింపు ΄÷ందిన బిరుదు ల్యామిన్ ఆఫ్ బర్రాగా కూడా కెవిన్ రెజ్లింగ్ సర్కిల్లో సుపరిచితుడు. అతను గత నవంబరులో మిడిల్ వెయిట్ కేటగిరీలో ఎంఎంఎ ఫైట్లో పాల్గొన్నాడని కూడా సమాచారం. తన సేవలకు గానూ రోజువారీగా ఫీజు వసూలు చేసే కెవిన్... ప్రస్తుత సేవల ఖరీదు రోజుకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా... ఒక ఇండియన్ సెలబ్రిటీ బాడీగార్డ్ ఇంత ఫాలోయింగ్ అందుకోవడం విశేషం. ఈ ఫాలోయింగ్ కెవిన్ను తెరకెక్కించే ఛాన్స్ కూడా లేకపోలేదు... చూద్దాం మరి! – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
సక్సెస్ నేర్పారు.. ఓకే! ‘సంతోషం’పై శిక్షణ ఏది?
ఐఐటీ ఢిల్లీ నుంచి ఐఐఎం బెంగళూరు దాకా, అక్కడి నుంచి ఐఏఎస్ దాకా సాగిన ప్రయాణంలో దివ్య మిట్టల్ ఎన్నో నేర్చారు. ఆ తర్ఫీదులో ఇన్ని నేర్పినా, వృత్తి సవాళ్లను ఎదుర్కొనడం నేర్పించినా ‘మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో, ఒంటరితనాన్ని ఎలా తట్టుకోవాలో, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పించలేదు’ అంటున్నారామె. ఆమె ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరమైన చర్చను లేవదీశాయి. ‘ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు నుంచి ఐఏఎస్ వరకు దేశంలో అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం నాకు దక్కింది. కఠినమైన పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, పెద్ద బాధ్యతలను ఎలా భుజాలపై మోయాలో ఆ విద్య నేర్పింది. కానీ అది నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలాగో, ఆనందంగా ఎలా ఉండాలో, ఒంటరితనాన్ని తట్టుకోవడం ఎలాగో మాత్రం ఎప్పుడూ నేర్పలేదు’ అన్నారు దివ్య మిట్టల్. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ దివ్య మిట్టల్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు మన విద్యావ్యవస్థలోని లోటుపై లక్షల మందిని ఆలోచింపజేస్తున్నాయి. ‘మన దేశ విద్యావ్యవస్థ ఏం నేర్పుతోంది? దేనికి దూరమవుతోంది?’ అనే అంశంపై విస్తృత చర్చకు అవి దారి తీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మనం విజయం ఎలా సాధించాలో నేర్చుకోవడానికి ఏళ్లకు ఏళ్లు వెచ్చిస్తాం. కానీ సంతోషంగా ఉండటం ఎలాగో నేర్చుకోవడానికి ఒక్క రోజూ కేటాయించం’ అని ఆమె వ్యాఖ్యానించారు.దివ్య మిట్టల్ కామెంట్స్కు వందలాది స్పందనలు వచ్చాయి. మన దేశంలోని స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని, ఆర్థిక అక్షరాస్యత, భావోద్వేగ ఆరోగ్యం, జీవన నైపుణ్యాలను గాలికి వదిలేస్తున్నాయని నెటిజన్లలో చాలామంది అభి్రపాయపడ్డారు.ఇలా అయితే ఎలా!భావోద్వేగ నియంత్రణ గురించి తన పోస్ట్లో దివ్య ప్రస్తావించారు. ‘విద్యార్థులు విద్యాసంబంధమైన భావనలు నేర్చుకుంటున్నారు. కానీ దుఃఖం, ఒత్తిడి, వైఫల్యాన్ని ఎదుర్కోవడం గురించి అరుదుగా నేర్చుకుంటున్నారు. మనం పీరియాడిక్ టేబుల్ను కంఠస్థం చేశాం. కానీ విరిగిన హృదయం వెనుక ఉన్న రసాయన శాస్త్రాన్ని ఎవరూ వివరించలేదు’ అని పేర్కొన్నారు. భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి బదులు వాటిని అణచివేయమని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని, ఇది భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే విధానంపై ప్రభావం చూపుతుందని దివ్య మిట్టల్ అన్నారు. ఒత్తిడిని ఎదుర్కోవడంలో చాలామంది విఫలమవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అవి ఎందుకు నేర్పడం లేదు?తన వైరల్ పోస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా దివ్య ప్రస్తావించారు. ‘వ్యాసాలు రాయడం, మార్కులు సంపాదించడం నేర్పిస్తాం. కానీ అసౌకర్యంగా అనిపించినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలి, హద్దులు ఎలా ఏర్పరచుకోవాలి, కష్టంగా ఉన్నప్పుడు ‘కాదు’ అని ఎలా చెప్పాలో నేర్పడం లేదు’ అని ఆమె అన్నారు. విమర్శనాత్మక ఆలోచన, ఆర్థిక అక్షరాస్యత ప్రాధాన్యం గురించి కూడా ఆమె నొక్కి చెప్పారు. ‘పాఠశాలలో ఎక్కువ జవాబులు చెప్పేవాడు గెలుస్తాడు. జీవితంలో ఎక్కువ ప్రశ్నలు వేసేవాడు కాలానికి నిలబడతాడు’ అంటున్న దివ్య మిట్టల్ ఆర్థిక అక్షరాస్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘గణితం నేర్చుకోవడానికి వెచ్చించిన సమయం, అనుభవం ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగపడటం లేదు. అప్పులు, ఖర్చు అలవాట్లపై ఆ పాఠాలు ప్రభావం చూపడం లేదు’ అని ఆమె అభి్రపాయపడ్డారు. ‘మన విద్య డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడుతుంది, దాన్ని నిర్వహించడంపై కాదు’ అని ఆమె సూటిగా చెప్పారు.క్షేత్రస్థాయిలో...‘ఒకరకంగా చెప్పాలంటే ప్రతిభను కూడా అదృష్టంగా పిలవొచ్చు. అయితే మన చేతుల్లో ఉన్నదానిపైనే మనం దృష్టి పెట్టాలి. అదే– కఠోర శ్రమ’ అన్నారు దివ్య మిట్టల్. ఈ చర్చ మన దేశంలోని ‘ఎగ్జామ్ కల్చర్’ను కూడా టచ్ చేసింది. దానిలోని మంచి, చెడులను విశ్లేషించింది. దివ్య మిట్టల్ తన పోస్ట్లో ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబులు కొందరు మాత్రమే చెప్పేవి కావు. సోషల్ మీడియాకే పరిమితమైనవీ కావు. క్షేత్రస్థాయిలో చర్చ జరగాల్సినవి. నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొని ప్రవేశ పెట్టాల్సినవి. -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన రిక్షాడ్రైవర్ కుమారుడు..!
ఆ గ్రామంలోని విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఓ కల. పరిమిత వనరులు, దీనిపై సరైన అవగాహన లేకపోవడం తదిరతరాల వల్ల ఆ ఊరు విద్యార్థులందరికీ అదొక కలగా మిగిలిపోయింది. ఎవ్వరూ దాన్ని సాధ్యం చేయలేకపోయారు. కానీ ఒకే ఒక్కడు ఆ గ్రామం ఎన్నే ఏళ్ల కలను నిజం చేసి ఆ ఊరిపేరు మారుమ్రోగేలా చేశాడు. అంతేగాదు ఆ గ్రామం నుంచి ఐఐటీ చదువు అందుకోనున్న తొలి విద్యార్థిగా నిలిచాడు.అతడే రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలోని పఠాన్వాలా గ్రామానికి చెందిన ఇంద్రజిత్. అతనే ఈ రిక్షా డ్రైవర్ కుమారుడు. ఇంట్లో ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ..చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. ఇంద్రజిత్ పదోతరగతి చదువుతున్నప్పడే.. సీనియర్ విద్యార్థుల ద్వారా ఐఐటీ ప్రక్రియ గురించి తెలుసుకున్నాడు. అప్పటి వరకు స్థానిక పాఠశాలలో చదువుకున్న ఇంద్రజిత్..ఐఐటీల గురించి తెలుసుకోవడంతో ఓ కొత్త మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంట్లో ఎంత కష్టమైన ఆర్థిక పరిస్థితులున్నా.. ఇంజనీరింగ్ చదవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. అయితే లక్ష్యం గట్టిగా ఉన్న ఆర్థిక పరిమితులు అందుకు ఉపకరించలేదు. దానికి బదులుగా ఆన్లైన్ లెర్నింగ్, స్వీయంగా ప్రిపరేవ్వడంపై ఆధారపడ్డాడు. ఓ పక్క గ్రామాల్లో తరుచుగా విద్యుత్ కోతలు ఉండటంతో స్టడీ మెటీరియల్ పొందడం చాలా కష్టంగా ఉండేది. దాంతో తండ్రి సూచనల మేరకు ఒక ఆచారణాత్మక పరిష్కారం లభించింది. అక్కడ సమీపంలోని గ్రామాలయ గ్రంథాలయంలో చేరాడు. అక్కడైతే ఇంటర్నెట్ సదుపాయం తోపాటు..చక్కగా కూర్చొని చదువుకునే చక్కటి వాతావరణం ఇంద్రజిత్కి ఎంతోగానో ఉపకరించింది. క్రమంగా అతడికి గ్రంథాలయం అతని ప్రిపరేషన్కి కేంద్రంగా మారింది. 2025లో జేఈఈ పరీక్ష రాసినా..అంతగా సంతృప్తినివ్వక లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి మరోసారి ఐఐటీ జేఈఈకి ప్రిపరేయ్యాడు. సూర్యోదయానికి ముందే గణిత సాధన, పిజిక్స్, కెమిస్ట్రీ చదవడం సాగించేవాడు. అన్నింట్లకంటే నిలకడగా చదవడం అన్నది కీలకం అని తెలుసుకుని చాలా శ్రద్ధ ఆసక్తులతో ప్రిపరేషన్ కొనసాగించాడు. అయితే మార్క్టెస్ట్ల్లో వచ్చే మార్కులు తన లక్ష్యాన్ని చేరుకోవడంపై పలు సందేహాలను రేకెత్తించేవి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండేవాడు. చివరికి సంవత్సరాల తరబడి పట్టుదల, స్వయంకృషితో జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఓబీసీ-ఎన్సీఎల్ విభాగంలో 1040వ ర్యాంకు సాధించి తన గ్రామం ఆకాంక్షను నెరవేర్చాడు. పైగా గ్రామాల్లో చదివే కుర్రాళ్లకు జేఈఈ చేధించడం కష్టం అన్నమాట అబ్ధం అనేలా తన గెలుపుతో చాటిచెప్పాడు. గ్రామీణ విద్యార్థులకు తన విజయం ఒక స్ఫూర్తిగా నిలిచి..వాళ్ల కూడా ఇలాంటి మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటున్నా అంటున్నాడు ఇంద్రజిత్. ఇక తను ఐఐటి రూర్కీలో బీటెక్ డిగ్రీని అభ్యసించి, ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో కెరీర్ నిర్మించుకోవాలని, కోరుకుంటున్నట్లు తెలిపాడు. పైగా తన గెలుపుకి కారణంగా తన కుంటుంబం సవంత్సరాల తరబడి అందించిన త్యాగం, మద్దతేనని చెబుతున్నాడు ఇంద్రజిత్.(చదవండి: పారిశ్రామికవేత్తగా 8th డ్రాపౌట్ ..! ప్రముఖ బ్రాండ్లకు..) -
‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!
ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్ అయితే శాలువా కప్పి సన్మానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పడం చాలా కామన్ అయితే మంచి చెప్పడం కన్నా చేతల్లో చూపించడం అరుదు. అదే చేశారు కేరళలోని కొందరు పూర్వ విద్యార్థులు. కాసరగాడ్లోని చెన్మాద్ వెస్ట్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో హెడ్మాస్టర్గా పని చేసిన పీటీ. బెన్నీ గతవారం రిటైర్ అయ్యారు. పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామస్తులందరూ కలిసి ఓ కారుని బెన్నీకి బహుమానంగా అందజేశారు.నూట ఇరవై ఏడు సంవత్సరాల స్కూల్చెన్మాద్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి 1899లో చెన్మాద్ జమాద్ కమిటీ కొంత స్థలాన్నిచ్చింది. ఆ తర్వాత క్రమక్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాని పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు, ఉపాధ్యాయులు, ఇతర వసతులు అందుబాటులోకి రాలేదు. పీటీ బెన్నీ ఎక్కడ పని చేసినా ఎవరో ఇచ్చే విరాళాల కోసం చూడకుండా తన సొంత ఖర్చులతో స్కూలును బాగు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావర ణాన్ని అందించేవారు. ఆయన గురించి తెలిసి 2019లో చెన్మాద్ స్కూల్కి రప్పించారు. హెడ్మాస్టర్గా బెన్నీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాలను పూర్తిగా మార్చివేశారు. ఆయన ప్రయత్నం చూసి స్థానికులు కూడా తమ వంతు సాయం చేశారు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తరగతి గదులు పెరిగాయి. పాఠశాలకు రెగ్యులర్గా 25 మంది ఉపాధ్యాయులను నియమించారు. విద్యార్థుల సంఖ్య 550 నుంచి 850కి పెరిగింది. ప్రముఖ పోగటీ పరీక్షలలో పాఠశాల విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. నూట ఇరవై ఏడు సంవత్సరాల పాఠశాల చరిత్రలో ఉత్తమ గురువుగా బెన్నీ పేరు సంపాదించారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా పండగలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతి ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. తమ గురువు రిటైర్మెంట్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులే కాదు పూర్వ విద్యార్థులతో పాటు మొత్తం గ్రామమంతా సంబరంలా నిర్వహించి పదమూడు లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చి తమ గురు భక్తిని చాటుకున్నారు. (చదవండి: ఐదేళ్ల చిన్నారి 'హ్యాపీ స్లీప్'ఆవిష్కరణ..! అనారోగ్యంతో బాధపడే పిల్లలకు..) -
రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500
రొటీన్ లైఫ్ ఎవరికైనా బోర్ కొడుతుంది. కార్పొరేట్ ఉద్యోగంలో ఉండే వారికి ఇంకా ఫస్ట్రేషన్ వస్తుంది. కానీ బాధ్యతలు, స్థిరమైన జీతం, మిగిలిన సౌకర్యాల కారణంగా ఉద్యోగం చేయక తప్పదు. కానీ 9-5 జాబ్ విసుగు నుంచి బయట పడేందుకు ఒక యువకుడు ఎంచుకున్న వినూత్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రోజూ ఆఫీసులో గంటల తరబడి పని, అలసి ఇంటికొచ్చాక ఏదో వెలితిగా అనిపించడం, ఇలా ప్రతిరోజూ ఒకేలా సాగుతుండటంతో విసుగు చెంది, సాయంత్రం వేళల్లో ఇంట్లోనే కూర్చోకుండా, రాపిడో రైడర్గా రిజిస్టర్ చేసుకుని పని ప్రారంభించాడు. ఇది అతనికి ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ ఎంతో మేలు చేసింది.రోజుకు అదనంగా రూ. 600,రూ. 700 వరకు సంపాదిస్తాడు. అదే ఫుల్ టైం రైడింగ్ చేస్తే, రోజు రూ. 1,500 వరకు సంపాదిస్తానంటూ దీపక్ పాండే తన గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో చెప్పు కొచ్చాడు. View this post on Instagram A post shared by Deepak Pandey (@trippypandey03)రొటీన్ లైఫ్కు బ్రేక్స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో అలసిపోయినట్లు అనిపించడంతో దీపక్ ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆఫీస్ పనిలోని ఏకధాటి రొటీన్ నుండి తప్పించుకోవడానికి సరదాగా ప్రారంభించిన ఈ ప్రయోగమే రెండో ఆదాయ వనరుగా మారిందని తెలిపాడు. కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు విభిన్న వ్యక్తులతో మాట్లాడటం, నగరాన్ని చుట్టేయడం, కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం కారణంగా సరికొత్త జీవనశైలిఅలవడి కొత్త స్ఫూర్తినిస్తోందని దీపక్ తెలిపాడు.ఇంకో విషయం ఏమిటంటేచాలా కాలం పాటు ఓటమి భయం, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళన తనను కొత్త విషయాలు ప్రయత్నించకుండా అడ్డుకున్నాయని దీపక్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అలసట అనేది మనం చెప్పుకునే ఒక సాకు మాత్రమే. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే మన కంఫర్డ్జోన్ నుంచి బయటికొచ్చి కష్టపడాలి అంటూ తన ఫాలోవర్లకు సందేశమిచ్చాడు. . కార్పొరేట్ ఉద్యోగం, ర్యాపిడో ద్వారా అదనపు ఆదాయంతో పాటు, PhD చేస్తున్నాడు. స్వయంగా వంట చేసుకుంటాడు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేస్తూ, వీడియోలను ఎడిట్ చేసుకుంటాడు. దీంతో దీపక్ లైఫ్స్టైల్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.ఇదీ చదవండి: అడపా దడపా సిగరెట్ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...! -
అడపా దడపా సిగరెట్ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!
సిగరెట్లు తాగేవారు చెప్పే సాకులు వింత వింతగా ఉంటాయి. రోజూ తాగను, ఎక్కువగానూ, తాగను, ఏదో అప్పుడప్పుడు, వీకెండ్లోనో, ఏ పార్టీలోనో, లేదా మూడ్ బాగా లేనప్పుడు మాత్రమే తాగుతాను అని చెబుతుంటారు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి లేదా ప్రతిరోజూ సిగరెట్లు కాల్చే వ్యక్తుల్లో మాత్రమే అనారోగ్య సమస్యలుంటాయని నమ్ముతారు.కానీ అలాంటి వారికి ఇదొక హెచ్చరిక. అప్పుడప్పుడు ధూమపానం చేసే వారిలో కూడా పలు అనారోగ్య ప్రమాదాన్ని పెంచుతాయని ఆధారాలు సూచిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు పొగాకు ప్రధాన కారణాలలో ఒకటి. దీనివల్ల ప్రతి ఏడాది 80 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ, ధూమపానం కారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లతో ముడిపడి ఉన్నాయి. పొగాకు పొగలో 7వేలకు పైగా ఎక్కువ రసాయనాలు ఉంటాయి, వీటిలో క్యాన్సర్కు కారణమయ్యేవిగా తెలిసిన అనేక పదార్థాలు విష పదార్థాలు కూడా ఉన్నాయి. దీని ప్రభావం విషయంలో రోజూ సిగరెట్ తాగేవారికి అప్పుడప్పుడు తాగే వారికి మధ్య పెద్ద తేడా ఉండదు.గుండె, రక్తనాళాలపై ప్రభావంహృదయనాళ వ్యవస్థ పొగాకు పొగ ప్రభావానికి తొందరగా లోనవుతుంది. పొగత్రాగడం మొదలుపెట్టిన కొద్ది నిమిషాలకే, నికోటిన్ రక్తనాళాలు సన్నబడటానికి, హృదయ స్పందన రేటు పెరగడానికి , రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది.పొగత్రాగని వారితో పోలిస్తే, రోజుకు కొన్ని సిగరెట్లు మాత్రమే తాగే వారికి కూడా గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది.గుండెపోటు ప్రమాదం పెరగడంఅంగ స్తంభనలో సమస్యలురక్తనాళాల లోపలి పొర దెబ్బతినడంధమనులలో అడ్డంకులు వేగంగా ఏర్పడటంరక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం పెరగడంఅంతేకాదు ఈ ముప్పు, మనలో ఎలాంటి లక్షణాలు కనిపించడానికంటే ముందే మన శరీరంలో ప్రారంభం కావచ్చు.ఊపిరితిత్తులపై ప్రభావాలుప్రతిసారి పొగ పీల్చినప్పుడు ఊపిరితిత్తులు నేరుగా ప్రభావితమవుతాయి. అడపాదడపా గురైనప్పటికీ అది శ్వాసనాళాలను చికాకు పెట్టి, వాపుకు గురిచేస్తుంది. అప్పుడప్పుడు ధూమపానం చేసే చాలామంది ఈ క్రింది లక్షణాలను కనిపిస్తాయి.నిరంతర దగ్గు, ఆయాసం,శారీరక శ్రమ సమయంలో ఆయాసం, తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లుక్యాన్సర్ ప్రమాదంధూమపానానికి, క్యాన్సర్కు మధ్య ఉన్న సంబంధం అత్యంత ఆందోళనకరమైన అంశాలలో ఒకటి. అప్పుడప్పుడూ సిగరెట్ తాగినా, కూడా పొగాకు పొగలో ఉండే క్యాన్సర్ కారకాలు, DNAను దెబ్బస్తాయి. ఈ నష్టం కాలక్రమేణా పేరుకుపోయి, అసాధారణ కణాల పెరుగుదల సంభావ్యతను పెంచుతుంది.ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ , ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటిగా కొనసాగుతోంది. అప్పుడప్పుడు ధూమపానం చేసేవారికి, నిరంతరం ధూమపానం చేసేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి.నోట్: ధూమపానం ప్రాణానికి ప్రమాదం. అంతేకాదు సిగరెట్ తాగడం వల్ల, మనతోపాటు, మన చుట్టుపక్కల ఉన్నవారిని ప్రమాదంలోపడవేస్తున్నామనే విషయాన్ని గ్రహించాలి. ఇది ప్రకృతికి కూడా చాలా చేటు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. -
పర్యావరణ పరిరక్షణే మన సంస్కృతి
భారతదేశంలో అనాది నుంచి కూడా భూమిని భూమాతగా కొలుస్తున్నారు. వృక్షా లను, పశువులను పూజిస్తున్నారు. అంటే భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ప్రకృతి– పర్యావరణం ఒక విడదీయలేని భాగం. మొక్కలు నాటడం, సహజ వనరులు వాడటంలో పొదుపు; వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత భారతీయ జీవన విధానంలో అంత ర్భాగంగా కొనసాగుతున్నాయి. అయితే ఆధునిక కాలం పోకడల కారణంగా మన జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి. ఫలితంగా పంచభూతాలను కలుషితం చేస్తున్నాము. నిజానికి ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాలు మన శరీరం పంచభూతాత్మకం (భూమ్యాకాశాలు, గాలి, నీరు, అగ్ని) అని పేర్కొంటున్నాయి. ఈ పంచభూతాలను నాశనం చేస్తున్నామంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే కదా! అందుకే పర్యావరణంలో భాగమైన పంచభూతాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే లెక్క. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, సునామి, భూకంపాలు వంటివి అన్నీ కూడా భూతాపం పెరిగి వాతావరణంలో అసమానతలు ఏర్పడి నందువలన వస్తున్నాయి. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా మానవుడు ప్రకృతిని విచక్షణా రహితంగా కొల్లగొట్టడమే. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని అధికం చేయడం కూడా మరో కారణం. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్ పదార్థాలను 2040 కల్లా 60 శాతానికి తగ్గించాలని పిలుపు ఇవ్వడం ఈ సదర్భంగా గమనార్హం. భూతాపానికి కారణమైన ఇంధనాల వినియోగాన్ని తగ్గించి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం వాడకాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, మన సంస్కృతిని కూడా రక్షించుకున్నట్లవుతుంది. – ప్రొ. వై.వి. రామిరెడ్డి -
పచ్చగా ఉందాం
మంచి చెప్పాలనే ఆలోచన కొందరిలోనైనా మార్పు తీసుకురావాలనే తపన వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. ‘భూమాతకు జవం జీవం కల్పించండి’ అంటూ సోషల్మీడియా ద్వారా సస్టెయినబులిటీ, జీరోవేస్ట్, రీ సైక్లింగ్ గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఇళ్లలో పోగవుతున్న చెత్తఫ్రెంచ్ సబ్జెక్ట్లో పిల్లలకు పాఠాలు చెబుతుంది విధి. ఐదేళ్లక్రితం పర్యావరణ అనుకూల జీవనంవైపు ప్రయాణం ఆరంభించింది. మిలియన్కు పైగా వీక్షకులు ఉన్న విధి ట్రేషీ సిస్టర్ పేరుతో బోలెడన్ని ఇంటి చిట్కాలు చెబుతుంది. ‘మహిళలు ఉపయోగించే మెనుస్ట్రువల్ కప్ను కనుక్కోవడంతో ఈ దిశగా నా ఆలోచనలు సాగాయి. మహిళలు రుతుక్రమ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యా డ్స్ వల్ల చెత్త ఎంత ఎక్కువగా వస్తుందో గ్రహించాను. దీంతోపాటు వివిధ రకాల వ్యర్థాలు పర్యావరణంపైనే కాకుండా మన ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నాను. ఇళ్లలో పోగవుతున్న చెత్త గురించి నా పేజీ ద్వారా మాట్లాడుతుంటాను. చిరిగిన బట్టలు, అరిగిన చెప్పులు, వాడేసిన టూత్బ్రష్షులు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. వీటన్నింటినీ తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతుంటాను. నా కంటెంట్ చూసి, ఒక్కరు మారినా చాలు’ అంటుంది విధి.ప్రకృతి ప్రేమికురాలు.. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ ఛేంజ్ అడ్వకేట్, ఫొటోగ్రాఫర్, సస్టెయినబిలిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా పేరొందారు శివ్యానాథ్. సోలో ట్రావెలర్ అయిన శివ్యా పదేళ్లుగా మాంసాహార ఉత్పత్తుల నుంచి దూరమై వీగన్ ఫుడ్వైపుగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. వాయిసెస్ ఆఫ్ రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు కో–ఫౌండర్గా వర్క్ చేస్తున్నారు. రూరల్ స్టోరీ టెల్లర్గా తన గొంతుకను వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లక్షల్లో ఫాలోవర్లు ఉన్న శివ్యా సోలో ట్రావెలర్గా ప్రకృతి, పర్యావరణం గురించి తన అనుభవాలన్నీ ఇందులో జోడిస్తుంది.చెట్లను రక్షిద్దాం..హిమాచల్ప్రదేశ్ వాసి శివాని కన్వర్ స్వచ్ఛభారత్ మిషన్లోనూ వర్క్ చేస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మీద కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అమృత్సర్ జిల్లాలోని మజీతాలోని స్థానిక సంస్థలలో చేసిన కృషికి గాను ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాన్నీ పొందింది. ‘చెట్లను నాటడం ముఖ్యం. కానీ, ఇప్పటికే ఉన్న పెద్దచెట్లను రక్షించడం మరింత కీలకం. ఒక చెట్టుకు హాని జరుగుతుంటే చూస్తూ మౌనం వహించకండి. దానిని రక్షించండి. ఇలా దేశమంతటా చేస్తే పచ్చదనాన్ని కాపాడుకున్నవారం అవుతాం. ఎవరైనా అక్రమంగా చెట్లను నరుకుతుంటే దాని గురించి పోలీసులకు తెలియజేయండి. ఒక్క ఫోన్ కాల్ ఒక చెట్టును కాపాడగలదు. కాపాడిన చెట్టు తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ప్రచారం చేసే శివానీ ఎకో ఎఫర్ట్స్ పేరుతో పర్యావరణ హితానికి కృషి చేస్తోంది.రీ యూజ్ప్రకృతిలో మమేకం అవుతూ ఎలా జీవించవచ్చో తన పేజీ ద్వారా విరిస్తుంది ఇండోర్వాసి ‘శ్వేత కటారియా’. వీగన్ న్యూట్రిషన్పై వర్క్ చేస్తున్న శ్వేత తన పేజీ ద్వారా సస్టెయినబిలిటీ జీవన విధానాల గురించి వివరిస్తుంది. వంటగదిలో వాడే క్లీనింగ్ ప్రొడక్ట్స్, వేస్టేజ్, రీయూజ్ దుస్తుల గురించి మొక్కల పెంపకం, చెట్ల ప్రాముఖ్యత.. ఇలా ప్రతిదీ వివరిస్తుంది. లక్షకు పైగా ఫాలోవర్లు తన కంటెంట్ను ఫాలో అవుతున్నారు. -
60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు
హుషారు కోసమో, లేదా బేజారు తగ్గడం కోసమో శరీరానికి కాస్త వ్యాయామం అవసరమని సైకిలింగ్ చేసేవాళ్లను చూశాం. బ్యాటరీ సైకిళ్లు, స్కూటర్లు వచ్చాక పెడల్ మీద కాలు పెట్టేవారే కరువయ్యారు. కాని రాజస్థాన్లోని ఓ మహిళ తన అనితర సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జైపూర్కి చెందిన రేణు సింఘి వయసు అక్షరాల 60 ఏళ్లు. అయితేనేం? టీనేజర్లు కూడా షాక్ అయ్యేలా సైకిలింగ్ చేస్తూ ఛాలెంజ్ విసురుతోంది. సైకిలింగ్ అంటే అదేదో ట్రాక్లోనో స్మూత్గా ఉన్న రోడ్డు మీదో కాదు. మిట్టపల్లాలు, కొండలు, గుట్టలు ఇలా ప్రదేశమేదైనా తగ్గేదేలే అంటూ సైకిల్ తొక్కేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె సైకి లింగ్ మొదలుపెట్టింది 51 ఏళ్ల వయసులో..కాని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె 1.5 లక్షల కిలోమీటర్లు సైకిలింగ్ చేసింది. అలాగే ‘1200 కి.మీ పారిస్ బ్రెస్ట్ పారిస్’ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే.. ఇలా పలు రేసుల్లో పాల్గొంటూ తన తోటి వయసు వారికి ఆదర్శంగా నిలుస్తోంది. -
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అధిక బరువు ఏ రేంజ్లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్ మాదిరి స్మార్ట్ లుక్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఆ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్ విషయంలో చాలా కేర్ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. భోజన ప్రణాళిక..తొలిరోజు..ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్ బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.రెండవ రోజురెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.3వ రోజుఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.4వ రోజుకాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్తో రెండు రైస్ కేక్లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.5వ రోజుఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్నట్లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Fit kajal (@flex_fit_kajal) (చదవండి: 'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..) -
'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..
మన సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడ్డ పేరెంట్స్కి తిరిగి ఏదైన ఇవ్వగలిగడం కంటే మించిన విజయం ఇకొంకటి ఉండదు. ఈ కల కోసం అంతా ప్రయత్నిస్తుంటారు. కొందరికీ ఏవేవో కారణాల వల్ల కుదరకపోవచ్చు. కానీ కొందరు అనుకున్నది సాధించి విజయానికి అసలైన నిర్వచనం ఇస్తుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.అభిషేక్ ఝా అనే వ్యవస్థాపకుడు ఏళ్లుగా ఈ కలం కోసం ఎదురు చూస్తున్నా అంటూ వివరిస్తుండటం వీడియోలో చూడొచ్చు. భావోద్వేగభరితమైన ఆ వీడియో క్లిప్లో తన తలిద్రండులను మొదటిసారి విదేశాలకు తీసుకువెళ్తున్నా అంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సతోషాన్ని పంచుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ వీడియోలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. "ఎయిర్పోర్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారి ఎందుకింత సంతోషంగా ఉన్నారని అడిగాడు. అందుకు తాను జీవితంలో విజయం సాధించిన మొదటి క్షణం ఇది. ఈ రోజు తొలిసారి తన తల్లిదండ్రులని ఒక అంతర్జాతీయ పర్యటనకు తీసుకువెళ్తున్నా. ఇదంతా తనకెలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. నాతో కలిసి దేశం బయటకు అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. వాళ్లు తమ కూమారుడు వారికోసం సంపాదించిన ప్రపంచాన్ని చూడనున్నారు. అయినా ఈ సంతోషం అంతా గెలిచిన వారికే దక్కుతుంది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పేరెంట్స్ కోసం విజేతగా నిలవాలి. అంటూ అభిషేక్ తన పోస్ట్ని ముగించాడు. అంతేగాదు ఆ వీడియోకి ‘తన తల్లిదండ్రులకు ప్రపంచాన్ని ఇవ్వాలని కలలు కన్న ఆ 16 ఏళ్ల అభిషేక్ ఝా కోసం..’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా ఇది నిజమైన విజయానికి నిర్వచనం, తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం కంటే మించిన అనుభూతి మరొకటి లేదు అని కొందరు, మీ పేరెంట్స్ ముఖాల్లో చిరునవ్వు వాళ్లు చేసిన ప్రతికష్టానికి దక్కిన ప్రతిఫలం అని మరికొందరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhishek Jha (@nofilterabhi) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
నటి కంగనా వెండిగ్లాసులో నీళ్లు తాగడం..! ఆరోగ్యానికి మంచిదేనా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల భారత 'భారత్ భాగ్య విధాత' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించారు. 40 ఏళ్ల నటి గతంలో కూడా ఇలానే ఒక సందర్భంలో తాగుతూ కనిపించడంతో విమర్శులు వెల్లువెత్తాయి కూడా. అయితే తాను ఇలా వెండిగ్లాస్లో నీళ్లు తాగడానికి రీజన్ ఏంటో వివరించారు. ఎందుకు తాగుతానంటే..తాను తాగే వెండిగ్లాస్ చాలా పాతదని, ముఖ్యంగా రాజ కుటుంబాలలో అనుసరిస్తున్న ఒక పురాతన సంప్రదాయం అని అన్నారామె. తాను ఆరోగ్యం కోసం ఇలా వెండిగ్లాస్లో తాగుతున్నట్లు తెలిపారు. అధిక పిత్తదోషం ఉన్నవారికి చల్లదనం కోసం ఇది ఎంతో మంచిదని అన్నారు. వెండికి, నీటికి ఉన్న చల్లదనాన్నిచ్చే గుణాలను గురించి కూడా నొక్కి చెప్పారామె.నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?వెండి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వెండి పాత్రలో నీళ్లు తాగడం అనేది భారతీయ సంప్రదాయంలో ఆరోగ్యంలో ఒక భాగం. పైగా వెండికి సహజంగా సూక్ష్మజీవులను నిరోధించే గుణం ఉన్నందున దానికి ప్రాధాన్య ఇస్తారని అన్నారు. వెండిగిన్నెలో నిల్వ ఉన్న నీరు కొన్ని సూక్ష్మ జీవుల పెరుగుదలను నెమ్మదింప చేస్తుందన్నారు. మొత్తం ఆరోగ్య విషయానికి వస్తే ప్రయోజనాలు పరిమితంగా ఉన్నాయన్నారు. ఇలా వెండిగిన్నెలో నీరు తాగితే దానంతట అదే పోషణ, రోగనిరోధక శక్తి వస్తాయని కాదని, ఈ చిన్న మార్పు మొత్తం ఆరోగ్య మెరుగుదల అని అనుకుంటే పొరపాటే అని అన్నారు.మన ఆయుర్వేదంలోనూ, భారతీయ సాంప్రదాయంలోనూ వెండి అనేది ఆరోగ్యానికి మంచిదే . అది వాస్తవమే అయినా..మొత్తం ఆరోగ్యంకి ముడిపెట్టడం సరికాదన్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లలో చేర్చడం కూడా సముచితం కాదన్నారు ఆరోగ్య నిపుణుల. View this post on Instagram A post shared by Peepingmoonofficial (@peepingmoonofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: బంధనం, బాధ..భళ్లుమనేలా అద్భుతమైన కళకు ఊపిరిపోసింది..!) -
'బంధనం', 'బాధ' ఆవిష్కరించిన అద్భుత కళ..!
ఓ వ్యక్తి ఎలాంటి తప్పు చేయకుండా బంధింపబడి, బాధలకు గురైతే..కుంగిపోయి ఢీలా పడిపోతాడు. కానీ సోనాబాయి అలా కాదు. తన కష్టాల్ని, నిశబ్ద బాధని అద్భుతమైన కళకు ఊపిరిపోసి, స్వేచ్ఛకు మార్గం వేసింది. పైగా యావత్తు ప్రపంచం తనవైపు తిరిగేలా గుర్తింపు తెచ్చుకుంది. బాధలను వరంగా మార్చుకుని తన ఉనికిని ఎలా తెలియజేయాలో చాటి చెప్పింది. కళ అంటేనే సృజనాత్మక ప్రతిభకు సంబంధించింది. తన తప్పు ఏమి లేకుండా భర్త చేత సమాజం నుంచి వెలివేయబడి నిర్బంధింపబడింది సోనాబాయి రాజావర్. చత్తీశ్గఢ్కు చెందిన సోనాబాయి తన భర్త దురహంకారానికి బలైన మహిళ అని చెప్పొచ్చు. ఆయన ఆమెను కిటికీలు లేని ఇంట్లో బంధించేవాడు. దాంతో ఆమె తన కొడుకుతో ఒంటిరిగా, నిశబ్ద వేదనను అనుభవించింది. నాటి మూఢనమ్మకాలు, చాదస్తాలకు బాధితురాలిగా మారిన మహిళ సోనాబాయి. అయితే ఆ బంధనాన్ని తన స్వేచ్ఛను సంపాదించుకునే మార్గానికి పునాది వేసింది. మొదట తన కొడుకుని ఊరడించడానికి బావి వద్ద ఉన్న మట్టితో బొమ్మలు చేసేది. కాలక్రమేణ ఆమెలోని అద్భుత ప్రతిభా పాటవాలతో గొప్ప కళ పుట్టుకొచ్చి..మొత్తం ఇల్లు ఆ బొమ్మలతో నిండిపోయింది. బొమ్మలకు వేసే రంగులను సైతం ఆమె స్వయంగా ఇంట్లో సహజసిద్ధిమైన వాటితో తయారు చేసి ఉపయోగించేది. అంతేగాదు వేసవికాలంలో ఉక్కపోతాలకు తాళ్లలేక ఇంటిని చల్లగా ఉంచే మార్గం కోసం అన్వేషించి ఓ చక్కటి పరిష్కారాన్ని వెతికింది. వెదురు, బంక మట్టిలతో చిన్నపాటి రంధ్రాలతో ఇంటి చుట్టు ప్రహరీని ఏర్పరుచుకుని చల్లటి గాలి లోపలికి వచ్చి ఎండ వేడిని అధిగమించింది. అంతేగాదు ఆమె ఇంటి గోడలు సైతం తన కళతో కళకళలాడుతుండేవి. నిజానికి టాలెంట్ ఉన్నవాడిని బంధించడం అంత ఈజీ కాదు అనేందుకు ఉదహారణగా నిలిచేలా ఆమె కళకు గుర్తింపు దక్కింది, పైగా ప్రపంచమంతటికీ ఆమె పేరు మారుమ్రోగిపోయింది. సరిగ్గా 1983లో భారత్ భవన్కు చెందిన క్షేత్ర పరిశోధకుల బృందం ఆమె ఇంటిని కనుగొనడంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అదే ఏడాది ఆమె తులసి సమ్మాన్ అవార్డును అందుకుంది.ఆమె నిశబ్ద తిరుగుబాటుకు, దృఢత్వానికి ప్రతీకగా మారింది. నిజానికి ఆమె ఈ కళ కోసం ఎలాంటి శిక్షణ తెలుసుకోలేదు. ఆమె బాధలు, కష్టాలకు ఈ కళకు ఊపిరిపోశాయి. అందులోంచే తన ఆనందం, స్వేచ్ఛను వెతుక్కుంటూ మంచి కళకారిణిగా మలుచుకుని జీవితాన్ని స్వర్గధామంగా మార్చుకుంది. అంతేగాదు ప్రతికూల అణిచివేత వాతావరణంలో ఎలాంటి మద్దతు లేకుండా కేవలం కళా ప్రతిభతో ధైర్యంగా మనుగడ సాగిస్తే..ఏదోనాటికి గుర్తింపు లభిస్తుందని ప్రూవ్ చేసింది. సోనాబాయి 2007లో కన్నుమూశారు. అంతేగాదు ఆమె మరణాంతరం ఛత్తీశ్గఢ్ ప్రభుత్వం 2015లో ఆమె స్వగ్రామం ఫుహ్పుత్రలో ఆమె గౌరవార్థం ఒక మ్యూజియంను స్థాపించింది. రాష్ట్రంలో ఒక కళాకారిణి జ్ఞాపకార్థం నిర్మించిన తొలి మ్యూజియం ఇదే కావడంతో ఇది మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. నిజంగా ఈ కథ అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పిస్తోంది కదూ..!.(చదవండి: నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?) -
కత్రినా కైఫ్ పొడవాటి ఒత్తైన జుట్టు రహస్యం...!
బాలీవుడ్ నటి, కత్రినా కైఫ్ ఇటీవల తన పొడవైన, ఒత్తైన మెరిసే జుట్టుకి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేశారు. నటుడు విక్కీ కౌశల్ పుట్టిన రోజు వేడుకుల నిమిత్తం వెళ్లిన టూర్ ఫోటోలు. అందులో కొన్ని అందమైన కుటుంబ క్షణాల తోపాటు ఆమె ఆకర్షణీయమైన కురుల ఫోటోలు అందర్నీ మత్రముగ్ధుల్ని చేశాయి. కానీ ఆమె అభిమానుల్లో ఒకటే చర్చ మొదలైంది కత్రినాకు ఇంత ఒత్తైన మెరిసే జుట్టు ఉందా అని. ఈ కురులు ఎంత ఆకర్షణగా నిలిచాయంటే మా హెయిర్ కూడా ఇలా ఉండాలంటే ఏం చేయాలో చెప్పరు అంటూ పోస్టులు వెల్లువెత్తేలా చర్చనీయాంశమైంది. అయితే తన పొడవైన జుట్టు రహస్యం ఖరీదైన సెలూన్ ట్రీట్మెంట్ లేదా విలాసవంతమైన హెయిర్ ప్రొడక్ట్ కాదని, తన అత్తగారు వీణా కౌశల్ ఇంట్లో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అని కత్రినానే స్వయంగా వెల్లడించారు. మరి ఆ ఆయిల్ ఏంటో దాని వివరాలు గురించి తెలుసుకుందామా..!.తన అత్తగారు ఉల్లిపాయ, ఉసిరి, అకవాడోతోపాటు మరికొన్ని పోషకపదార్థాలతో నూనెను తయారు చేస్తారని అన్నారు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసే ముందుకు చాలా గంటలపాటు మరిగిస్తారని అన్నారు. తాను వాడుతున్న నూనె అత్యద్భుతమైనదని అన్నారు. ఫ్యానీ ఫ్యాషన్ కంటే స్థిరమైన దినచర్యే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారామె.కత్రినా ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్ ప్రయోజనాలు ఇవే..ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలోపేతం చేయడానికి, తల చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాంప్రదాయ కేశ సంరక్షణ పద్ధతిగా చెప్పొచ్చు. ఉల్లిపాయ రసం జుట్టు చిన్న వయసులోనే నెరసిపోవడాన్ని తగ్గించి, చుండ్రును నివారిస్తుందిమరోవైపు, అవకాడోలో ఉండే సహజ నూనెలు, పాలీఅన్శాచురేటెడ్, మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతో సహా ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా, ఇది జుట్టుకు లోతైన పోషణను అందించి, తేమను చేకూరుస్తుంది.ఈ పోషకాలు అన్ని రకాల జుట్టుకు మేలు చేసినప్పటికీ, ముఖ్యంగా పొడిబారిన, నిర్జలీకరణానికి గురైన జుట్టుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇవి జుట్టు మృదుత్వాన్ని, దువ్వుకునే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) (చదవండి: చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!) -
చిన్న దుకాణం నుంచి..ఏకంగా రూ. 900 కోట్ల ఆతిథ్య సామ్రాజ్యం..!
చిన్నపాటి స్టోర్ మాదిరి రెస్టారెంట్ నుంచి ఏకంగా లగ్జరీ రెస్టారెంట్ల రేంజ్కి చేరుకోవడం అంత ఈజీకాదు. పైగా ఆతిథ్య రంగంలో తనకంటూ గర్తింపు తెచ్చుకుని ప్రసిద్ధ బాండ్ రెస్టారెంట్లతో కోట్లలలో ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడు ఈ సక్సెస్ని ఎలా అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటో తప్పక తెలుస్తుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. అతడే ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థకు వ్యవస్థాపకుడు రియాజ్ ఆమ్లానీ. అతడు చిన్నగా మొదలు పెట్టిన రెస్టారెంట్ వ్యాపారం అనతికాలంలోనే సోషల్, స్మోక్ హౌస్ డెలి, పృథ్వీ కేఫ్, స్లింక్ అండ్ బార్డోట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్ల రెస్టారెంట్లు రన్ చేసే రేంజ్కిచేరుకున్నాడు. అంతేగాదు భారతదేశ ఆహార, పానీయాల పరిశ్రమలో తన పేరుని నిలిచేలా చేసుకున్నాడు. తన బ్రాండ్ల వెనుకు ఉన్న తన ఫుడ్ బేవరేజ్ సంస్థ ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ అండ్ హాస్పిటాలిటీ సంస్థ సీఈవో రియాజ్ ఎలాంటి సక్సెస్ సూత్ర పాటించి ఈ రేంజ్కి వచ్చాడంటే..ప్రజల ఫీడ్బ్యాక్ని ఆధారంగా అని చెబుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లు ఇష్టపడే ప్రదేశాలు వంటి వాటిపై చర్చించి ఆ దిశగా తన రెస్టారెంట్లలో అవి ఉండేలా ఏర్పాట్లు చేశాడట. ముంబైకి చెందిన ఈ వ్యాపారవేత తన 35 ఏళ్ల వ్యాపార జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనని, అదే తన విజయ రహస్యమని అంటున్నారు. ప్రజలు ఆనందించగల ప్రదేశాలనే నిర్మిస్తా..అదే తన రెస్టారెంట్లను విజయవంతంగా నడిపిస్తుందని అంటున్నారు. ఆయన తన రెస్టారెంట్ల వ్యాపారం నుంచి దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తాడట. మన కళ్ల ముందే చాలా కంపెనీలు ఆతిథ్య రంగంలోకి వచ్చి ఇబ్బంది పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తను నిలదొక్కుకోవడానికి కీలకం కస్టమర్లే అంటాడు. మొదట కస్టమర్ల ప్రాధాన్యత, ఆ తర్వాత అవి అమలు చేయడంలో కలిగే సానుకూల, ప్రతికూల అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తానని అంటున్నాడు. తన కుటుంబ వ్యాపారమైన బెర్రీస్ రెస్టారెంట్ నుంచి మొదలైందట. అక్కడ నుంచే మొరాకో-శైలి కేఫ్ అయిన 'మోచా' ద్వారా ఆతిథ్య వ్యాపారంలోకి వచ్చినట్లు తెలిపారు. అలా తన కుటుంబ వ్యాపారం అంచలంచెలుగా విస్తరించి ఆతిథ్య సంస్థగా ఎదిగిందన్నారు. చివరగా ఆయన ఎదగడానికి రెండు మార్గాలున్నాయన్నారు. మొదటిది విశ్రాంతి తీసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్స చేసి ఎదగొచ్చు , రెండు పూర్తిగా పనికే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్పై దృష్టి పెట్టొచ్చు. ఆ విధంగా నిబద్ధతతో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై అటెన్షన్ పెడితే విజయం తథ్యం అని అన్నారు. (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్,స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తాజా సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపుతోంది. హోమియోపతి వైద్యాన్ని సమర్ధిస్తూ, ఒక వైద్యుడి వీడియోను ఆమె పంచుకున్నారు. తన జీవితంలో హోమియోపతి ముఖ్యమైన పాత్ర పోషించిందంటూ ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట అగ్గి రాజుకుంది. అనుష్కకు సపోర్ట్గా కొందరు, వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు రెండుగా విడిపోయారు.నమిత థాపర్తో డాక్టర్ రాజన్ శంకరన్ జరిపిన సంభాషణ క్లిప్ను అనుష్క ఇన్స్టాలో షేర్ చేశాడు. ఆరోగ్యం , హెల్దీ జీవనవిధానానికి తాను ప్రాధానత్య ఇస్తానని, డా. రాజన్ సూచనలు, సలహాలకు ఎంతో విలువ ఇస్తానని తెలిపింది. తన జీవితంలో హోమియోపతి ఒక ముఖ్యమైన పాత్ర పోషించిందనీ, అందులో డాక్టర్ రాజన్ శంకరన్ ఒక కీలకమైన భాగమని పేర్కొంది. దీంతో నెట్టింట సందడి మొదలైంది.Virat Kohli’s wife, Anushka Sharma is recommending homeopathy to Indians.Fraud babas are not enough, she is now promoting unscientific fraud medicine to IndiansGive them enough money and they might one day tell people, “Just visit Premanand Maharaj to cure all your diseases.” pic.twitter.com/5L6y8Wcxa6— Mohit Chauhan (@mohitlaws) June 2, 2026దుమ్మెత్తిపోసిన నెటిజన్లుఇక్కడ ఉన్న దొంగ బాబాలు చాలదన్నట్టు, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అశాస్త్రీయమైన నకిలీ వైద్య విధానాన్ని ప్రమోట్ చేస్తోందంటూ అనుష్క శర్మ వైఖరిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అంతేకాదు డబ్బులిస్తే ఏదైనా చెబుతారంటూ మండిపడ్డారు. 60 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న నటి హోమియోపతిని ప్రమోట్ చేయడం మరికొందరు విమర్శలు గుప్పించారు. నమ్మకం పేరుతో సరైన అల్లోపతి వైద్యం తీసుకోకుండా, చనిపోయిన చాలా మందిని చూశాను. ఇకపై తాను అనుష్క ఫ్యాన్గా ఉండదలుచుకోలేదని ఒకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు అనుష్క స్టోరీ చూస్తే రక్తం మరుగుతోంది. ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉండి హోమియోపతిని ఎలా ప్రమోట్ చేస్తారు? వీరికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే హోమియోపతి లేదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్తారా? ఇలాంటి ప్రచారాల వల్లే ప్రజలు ప్రాణాంతక వ్యాధులు ముదిరిపోయే వరకు హోమియోపతి వాడుతూ, చివరి దశలో అల్లోపతి ఆసుపత్రులకు వస్తున్నారని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడిఅనుష్కకు మద్దతుగా మరికొందరు మరోవైపు, అనుష్క శర్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలంటూ . హోమియోపతి వల్ల తమకు జరిగిన మేలును వివరిస్తూ చాలా మంది ఆమెకు, హోమియో వైద్య విధానానికి మద్దతుగా నిలిచారు అందరూ ఆ డాక్టర్ లేదా బాబా దగ్గరికే వెళ్లాలని ఆమె ఎక్కడా చెప్పలేదు ఒకరు, కొన్నిసార్లు అల్లోపతి కూడా నయం చేయలేని వ్యాధులను హోమియోపతి నయం చేస్తుందని ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ అల్లోపతి వైద్యులే. కానీ నాకున్న దీర్ఘకాలిక చర్మ సమస్య కోసం రెండేళ్లు మోడరన్ మెడిసిన్ వాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు గత రెండున్నర నెలలుగా హోమియోపతి వాడుతున్నాను, నాలో చాలా మార్పు కనిపిస్తోంది" అని ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. నన్ను ట్రోల్ చేశారుదీనికి హోమియోపతి వైద్యులు కూడా స్పందించడం గమనార్హం. హోమియోపతి డాక్టర్ని అని చెప్తేనే ఎక్స్లో తనను చాలా ట్రోల్ చేశారంటూ ఒక హోమియోపతి వైద్యుడు కూడా అనుష్కకు మద్దతుగా సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు. ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం! -
వృద్ధులకు వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ ఎందుకు మంచిదంటే..!
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండేందుకు బల శిక్షణ(స్ట్రెంగ్త్ ట్రైనింగ్) ఎంతో మంచిదంటోంది హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీనా అరాగాన్. కండరాల క్షీణత, ఎముకలు, కీళ్లు బలహీనపడటం వంటి ఇతర కారణాల వల్ల వయసు పెరిగే కొద్దీ ప్రజలు బలహీనపడతారు. దీనికి విరుగుడు బరువులు మోయడ మేలని చెబుతోంది. అదెలాగో తన 87 ఏళ్ల తండ్రిని ఉదాహరణగా చూపిస్తూ..ఆయన జిమ్ వర్కౌట్లతో ఎలా మెరుగ్గా ఉన్నారో వివరించేలా వీడియోని షేర్ చేశారామె. ఆయన ప్రతి వారం ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేలా చూస్తుంటానని చెప్పారామె. అయితే తన తండ్రి కేవలం పైకి, కిందకు వెయిట్లిప్ట్ చేస్తూ..కండరాలకు మాత్రమే పనికల్పిస్తున్నాని అనుకుంటారు. కానీ అంతకు మించి ప్రభావవంతమైందని, మొత్తం బాడీలోని అన్నింటికి మంచిదని ఆయనకు తెలియదని చెప్పుకొచ్చింది. ఆయన వయసు పైబడుతున్ను కొద్దీ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే వ్యాయం ఇదేనని, అందుకే ఆయన చురుకుగా, బలంగా ఉండేలా ఇలా కండరాలకు ఇలా బరువులు ఎత్తే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆయనను పదేపదే జిమ్కి వచ్చేలా చూడటమే తన పని అంటోంది. అయితే ఆయన ఈ జిమ్ సెషన్లో పాల్గొనెటప్పడూ..మంచి అనుభూతితో, తన కేర్ని అర్థం చేసుకునేలా చేస్తానంటోంది. ముఖ్యంగా ఆయన తన తదుపరి సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెయిట్లిఫ్ట్కి సంబంధించిన రెండు రకాల ప్రత్యేక వ్యాయామాలు చేస్తుంటారని అన్నారామె. ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా తన తండ్రి బ్యాలెన్స్ చేసుకోగలరని, అలాగే 80 పౌండ్ల కంటే ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేగాదు వృద్ధులకు బరువులు ఎత్తడం వంటి వర్కౌట్లు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. View this post on Instagram A post shared by Jeana Aragon (김제나) (@jeana.aragon) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?
నేను బాగానే ఉన్నాను..అనేది సానుకూలమైన ధోరణి అనుకుంటాం. కానీ అది ఎంతలా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. నిజానికి ఈ సిండ్రోమ్తో బాధపడుతున్నామని వైద్యుల, మానసిక నిపుణులు సైతం ముందుగా గుర్తించలేరట. మనకు ఎవరైనా మీరు ఎలా ఉన్నారు? అనగానే ఐమ్ ఫైన్, థాంక్యూ అని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. కానీ ఈ సమాధానమే పెద్దయ్యాక సర్దుబాటు పద్ధతిగా మారి మానసిక క్షోభగా పరిణామం చెందుతోందని గుర్తించమని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటని విస్తుపోకండి. అసలు ఏంటి సిండ్రోమ్..బాగున్నా అన్నా ధోరణి ఇంత ప్రమాదకరంగా ఎలా మారుతుందంటే..ఈ సిండ్రోమ్ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను విస్మరించి అంతా తన అధీనంలో ఉండాలనే ధోరణినే 'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్ అంటారట. మస్తత్వవేత్తలు ఇది ఒక రకమైన లక్షణాలను అంగీకరించకుండా.. భావోద్వేగాలను అణిచివేసే స్థితిగా చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమలోని ఆందోళన సంకేతాలను తక్కువగా అంచనా వేస్తారు లేదా విస్మరిస్తారని అంటున్నారు. అంతేగాదు ఈ 'నేను బాగానే ఉన్నాను' అనేది కేవలం మామూలుగా చెప్పే సమాధానం కాదు. అదొక సర్దబాటు విధానంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యే ఇదని అంటున్నారు. అంటే వృత్తిరీత్యా సమావేశాలు, టార్గెట్లు, అదనపు వర్క్ని పరమావధిగా చూస్తూ..భోజనం మానేయడం, నిద్రలేని రాత్రలు, నిరంతర అలసట, భావోద్వేగపరమైన నీరసం వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తూ..అంతా తమ అధీనంటో ఉందన్నట్లు పనులు చేస్తుంటారని చెబుతున్నారు మానసిక నిపుణుల. ఇక్కడ జీవించడం లేదు కేవలం పోటీ పడుతున్నాం. ఫలితంగా స్వీయం సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య సమస్యలు గురించి ఆలోచించ్చని అనుకుంటూ..తెలియకుండానే ఆ భయానక వలయంలో కూరుకుపోతారని అంటున్నారు. అంతేగాదు దీని కారణంగా అనారోగ్య అలవాట్ల బారిన పడతారని కూడా అంటున్నారు. ఈ సిండ్రోమ్ సంకేతాలు..నిద్రలేమిఏకాగ్రత లోపంజ్ఞాపకశక్తి సమస్యలువైద్యపరంగా వివరించలేని ఆకలి లేదా బరువులో మార్పులుపనిలో ఉత్పాదకత తగ్గడంసామాజిక ఒంటరితనంఅభిరుచులపై ఆసక్తి లేకపోవడంచిరాకుఆవేశపూరిత ప్రవర్తనతరచుగా వచ్చే తలనొప్పులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు,అలసట వంటి శారీరక అనారోగ్యాలుఈ లక్షణాలు ఒక్కోసారి ఆపీసు లేదా కార్యాలయాల్లో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పుడూ కూడా ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దీనివల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేని విధంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిరాకరణ నుంచి 'నేను బాగానే ఉన్నాను' అనే సిండ్రోమ్ వస్తుందట. మానసిక నిరాకరణ అనేది తరుచుగా భయం, సామాజిక కండిషనింగ్ నుంచి పుడుతుందని అంటున్నారు. చాలామంది తాము బలంగా ఉండాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని ఇతరులకు భారం కాకూడదని భావిస్తూ పెరుగుతారు. అది కాస్తా తమ బాధను అంగీకరించడానికి ఇబ్బందిపడే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ మనం బాధను అంగీకరిస్తే బలహీనంగా కనిపిస్తామని సిగ్గుపడి చివరకి నిరాకరణ ధోరణి మొదలవ్వుతుందని అంటున్నారు. అందుకే భావోద్వేగాలను అణిచివేయొద్దు, బాధ, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అంగీకరించి వాటి నుంచి బయటపడే మార్గం చూడండి తప్ప అణిచేసేలా బాగానే ఉన్నాను అనే మాటకు ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ బాగానే ఉన్నాను అను మాటకు కట్టుబడి ఉండేలా స్వీయ భద్రతపై దృష్టిపెట్టండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి..తర్వాత అనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. (చదవండి: ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..) -
సైనికులకు ‘పాదా’భివందనం
ఆమె కాళ్ల కింద తారు కరుగుతోంది. నెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయినా రాజస్థాన్ అజ్మీర్ బిడ్డ సూఫియా సూఫీ పరిగెడుతూనే ఉంది. ‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో భారత సాయుధ దళాల గౌరవార్థం కన్యాకుమారి నుంచి హిమాలయాల్లోని కారకోరం రేంజ్ వరకు 5,000 కిలోమీటర్ల పరుగును 88 రోజుల్లో పూర్తి చేయడానికి బయలుదేరింది. ఒంగోలు మీదుగా సాగుతున్న పరుగులో ఆమె ప్రతి అడుగు సైనికునికి శాల్యూట్ పలుకుతోంది.‘పరుగు నాకు ధ్యానం లాంటిది. నేను పరిగెత్తిన ప్రతి అడుగు నన్ను శక్తిమంతం చేసింది’ అంటుంది సూఫియా. భగభగలాడే ఎండల్లో, పొగలు కక్కే హైవే మీద ఆమె పరిగెడుతూ ఒంగోలు మీదుగా ముందుకు సాగుతూ కనిపించింది. సాధారణంగా అటువంటి వాతావరణంలో బయటకు రావడమే కష్టం. పరుగు తీయడం అసాధ్యం. ‘అయినా నేను ఆగను. సైనికులకు అంకితం ఇచ్చే వరకు నా పరుగు ఆపను’ అన్నారామె.‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో సూఫియా మే 12, 2026న కన్యాకుమారి వద్ద పరుగు మొదలుపెట్టింది. 88 రోజుల పాటు నిరవధికంగా పరిగెత్తి, పదకొండు రాష్ట్రాలు, యుద్ధ స్మారకాలు దాటి, 18,000 అడుగుల ఎత్తున కారకోరం పాస్ వద్ద ఆగస్టు 6న ఆ పరుగును ముగించనుంది. ఆ విధంగా సైనికులకు తన పరుగును అంకితం చేయనుంది. వారికి పాదాభివందనం చేయనుంది.ప్రశాంతత కోసం పరుగుసూఫియా సూఫీది రాజస్థాన్లోని అజ్మీర్. పదహారేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో బ్యాగేజ్ హ్యాండ్లింగ్ ఆఫీసర్గా పదేళ్లు పనిచేసింది. ‘మరబొమ్మలాంటి ఆ జీవితం నా ఆరోగ్యాన్ని నాశనం చేసింది’ అంటుందామె. ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రశాంతత కోసం పార్కులో రోజూ మూడు కి.మీ. పరుగు మొదలుపెట్టింది. అది కాస్తా అలవాటుగా, అలవాటు ఫ్యాషన్ గా,ఫ్యాషన్ జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఉద్యోగాన్ని వదిలేసి, 2019లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 4,000 కి.మీ పరిగెత్తి మొదటి గిన్నెస్ రికార్డ్ కొట్టింది. ఆ తర్వాత ఆల్ట్రా మారథాన్ రన్నర్గా పరిగెడుతూనే ఉంది.ప్రజల తోడు‘నేను రోజుకు అరవై నుంచి అరవై అయిదు కిలోమీటర్లు పరిగెత్తుతున్నాను. మొదటి పది రోజులు ఎండల వల్ల చాలా కష్టంగా గడిచింది. తమిళనాడు, ఆంధ్రలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తెల్లవారుజాము నాలుగు నుంచి ఉదయం 9.30 వరకు.. సాయింత్రం నాలుగున్నర నుంచి రాత్రి 9 వరకు పరుగు పెడుతున్నాను. రోజురోజుకూ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. దారి మధ్యలో కొందరు రన్నర్లు నాపై అభిమానాన్ని చూ పారు. సంఘీభావంగా నాతో పరిగెత్తారు. చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు నాతో పరిగెత్తారు. ఇంతకు మించి ఏం కావాలి’ అంటుంది సూఫియా.శరీరానికి నచ్చ చెప్తూ...‘రోజుకు 15 గంటల పాటు పరిగెడుతుండటంతో నా శరీరం హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. అయినా దానిని సముదాయిస్తూ ఓర్పుగా ముందుకు కదులుతున్నాను. నేను ఐదు గిన్నిస్ రికార్డులు సాధించడానికి నా భర్త వికాస్ సహకారం మరువలేనిది. అనుక్షణం నన్ను నా పరుగులో జాగ్రత్తగా గమనిస్తూ ఆహారంలో, పరుగులో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. మహిళలు ఏమీ చేయలేరు, వాళ్లందరూ శక్తిహీనులేనని చాలామంది అంటుంటారు. స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించదలచుకున్నాను. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మహిళలకు అన్ని అవకాశాలు లభిస్తున్నాయి. స్త్రీలు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అన్ని అడ్డంకులను పటాపంచలు చేయాలి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం’ అని హరిణిలా దూసుకుపోయారామె.సైనికుల అభిమానిసూఫియాకు పరుగు ఒక క్రీడ కాదు. దేశభక్తిని చాటే మార్గం. భారత సాయుధ దళాలు అత్యంత కఠిన పరిస్థితుల్లో దేశాన్ని కా పాడుతున్నాయని చెప్పడానికి కఠినమైన దారుల్లో సూఫియా పరుగు నిర్వహిస్తూ ఉంటుంది. 2022లో సియాచిన్ నుంచి కార్గిల్ వరకు ఎముకలు గడ్డ కట్టే స్థితిలో పరిగెత్తిన మొట్టమొదటి మహిళగా నిలిచింది. 2023లో మనాలి–లేహ్ మధ్య 480 కి.మీ దూరాన్ని 98 గంటల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ‘రన్ ఫర్ డ్రీమ్స్’లో భాగంగా సముద్ర మట్టానికి 5,540 మీటర్లు ఎత్తున లేహ్కు ఉత్తరంగా భారత్–చైనా సరిహద్దులో ఉన్న కారకోరం వరకూ పరిగెత్తనుంది. ‘సైనికుల కష్టం ముందు నా పరుగు నొప్పి చాలా చిన్నది’ అంటుంది సూఫియా. – కె. గంగాధర్, సాక్షి, ఒంగోలు డెస్క్ -
చింతగింజలతో మైక్రోప్లాస్టిక్కి చెక్..!
ప్లాస్టిక్ భూతం ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. ముఖ్యంగా నీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్ను తొలగించడం అంత సులభం కాదు. అదీగాక నీటి నుంచి మైక్రోప్లాస్టిక్ని వేరుచేయడం అంటే కచ్చితంగా రసాయనాలు కలపక తప్పని పరిస్థితి, ఖర్చు కూడా అధికమే. ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపి ఎర్త్ప్రైజ్ గెలుచుకున్నారు ఈ టీనేజర్లు.వాళ్లే వివాన్ ఛావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే భారతీయ విద్యార్థుల బృందం. ఈ విద్యార్థులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్లను వేరు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిని అభివృద్ధి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం చింత గింజల పొడిని ఉపయోగించి జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని రూపొందించారు. ఇది కలుషితమైన నీటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్ కణాలకు అంటుకుంటుంది. ప్లాస్-స్టిక్ అని పిలువబడే ఈ ఆవిష్కరణ రసాయనాలను జోడించకుండా, సాంప్రదాయ ఫిల్టర్లు తరచుగా వదిలివేసే మైక్రోప్లాస్టిక్లను ఎలా బంధించగలదో పరిశోధనలో వెల్లడైంది. అంతేందుకు ఇప్పుడు వాటర్ టిన్లు, బాటిల్స్ అన్ని ప్లాస్టిక్. అందువల్ల తాగు నీటిలో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు దాగి ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వాటిని పారేసి చింతగింజలతో తయారు చేసిన ప్రత్యేక పొడితో ఈ మైక్రోప్లాస్టిక్ చెక్పెట్టారు.ఈ చింతగింజల పొడి అయస్కాంతం మాదిరిగా ప్లాస్టిక్ని ఆకర్షించి వేరు చేస్తుందట. దీనివల్ల శుభ్రమైన నీటిని సులభంగా పొందొచ్చని చెబుతోంది ఆ విద్యార్థుల బృందం. సేకరించిన ప్లాస్టిక్ను టైల్స్ లేదా కోస్టర్స్ వంటి చిన్న, ఉపయోగకరమైన వస్తువులుగా మారుస్తారు. ఫలితంగా అది తిరిగి ప్రకృతిలోకి చేరదు. ఈ ఆవిష్కరణలో జంతువులు, మానవులు కనిపించన ప్లాస్టిక్ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతామని చెబుతున్నారు. ఆ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలను సందర్శించనప్పుడే ఈ ఆలోచన తట్టిందని, అక్కడ చాలామంది ప్రజలు ప్లాస్టిక్ పాత్రలలోని నీటిని నిల్వ ఉంచడం చూశామని అన్నారు. వెనుబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగి ఈ మైక్రోప్లాస్టిక్ బారిన పడటం చూశాక ఈ ఆవిష్కరణకు పురికొల్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావవంతమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా స్థానికంగా లభించే వనరులతోనే దీన్ని ఆవిష్కరించడంతో ఈ టీనేజర్లపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అంతా. కలుషితమైన నీటి వనరులతో ఇబ్బంది పడుతున్న వర్గాలకు ఇది గొప్ప ఆచాణాత్మకమైనదని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ విద్యార్తి బృందం ‘ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ’ ఎంపికయ్యారు. ఇలా గుర్తింపు పొందిన బృందం మాదే కావడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ ముగ్గురు టీనేజర్లు. కాగా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రజా ఓటింగ్ ద్వారా ప్రపంచ విజేతను ఎంపిక చేశారు. అంతేగాదు ఈ ఆవిష్కరణ సంక్లిష్టమైన కాలుష్య సమస్యలను సరళమైన, ప్రకృతి ఆధారిత ఆలోచనలు ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. ఈ విజయం యువత నేతృత్వంలోని విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచవ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ తొలగింపు సాంకేతికతల కోసం పెరుగుతున్న కృషికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.(చదవండి: ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..! వైరల్గా టెకీ స్టోరీ) -
ముంబై స్లమ్ నుంచి అంతర్జాతీయ కెరీర్ రేంజ్కు..!
చాలా సక్సెస్ స్టోరీలు మన కళ్ల ముందు..నుంచే వస్తుంటాయి. అప్పటి వరకు ఊహించం ఆ వ్యక్తి ఆ స్థాయి చేరుకుంటాడని. చాలా దయనీయ పరిస్థితిల్లో బతికి మనం చూస్తుండగానే ఆకాశమంత స్థాయికి ఎదిగి సక్సెస్ని ఒడిసిపట్టి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కథే ఈ టెకీ గాథ.ముంబైలో జన్మించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ యాదవ్ దాదాపు దాదాపు మూడు దశాబ్దాల పాటు మురికివాడలోనే నివశించాడు. అక్కడే అతడి చదువు, బాల్యం సాగింది. ఆ స్థాయి నుంచి జర్మనీలో కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్ స్థాయికి ఎలా చేరుకున్నాడో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆయన భార్యతో కలిసి ఉన్న సోషల్ మీడియా పోస్ట్ని షేర్ చేస్తూ..తన కథను పంచుకున్నారు. సంతోష్ యాదవ్ ప్రస్తుతం యాంగులర్ గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ (GDE), గిట్హబ్ స్టార్, ఓపెన్-సోర్స్ కంట్రిబ్యూటర్, అంతర్జాతీయ స్పీకర్గా పేరు తెచ్చుకున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన జీవితంలో ఎక్కువ భాగం ముంబై మురికివాడలోనే పెరిగానని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువులో చాలా ఇబ్బందిపడ్డానని అన్నారు. క్రికెట్ అంటే మహాఇష్టం అందువల్లే చదువులో అంతమాత్రంగా ఉండేవాడినని అన్నారు. ఆ కారణంగానే ఇంటర్లో సైన్సు కోరులో చేరలేకపోయానని అన్నారు. అయితే తండ్రి స్నేహితుల్లో ఒకరు యాదృచ్ఛికంగా ఇచ్చిన సలహా వల్ల కంప్యూటర్ డిప్లోమా కోర్సులో చేరినట్లు తెలిపారు. అయితే ఇంగ్లీష్ తన మాతృభాష కాకపోవడంతో పాఠాలతో పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదన్నారు. I lived in slum in Mumbai for 29 years, decided to move after my daughter was born, next week we will be moving to multi storied apartment on rent, pic.twitter.com/QIgX3igafc— Santosh Yadav (@SantoshYadavDev) August 21, 2020 తన యాస కారణంగా తాను ఎలా ఎగతాళికి గురయ్యానో కూడా చెప్పారు. ఇక చదవలేను అని ఏడ్డిన సంగతి కూడా ఇంకా గుర్తు ఉందన్నారు. మళ్లీ యథావిధిగా పెయిల్ అవుతానేమోనని తెగ భయపడేవాడినని అన్నారు. బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో క్రికెట్ కూడా ఆడటం మానేసి, స్నేహితులకు దూరమై పూర్తిగా చదువుపైనే ఫోకస్ పెట్టానన్నారు. దాంతో తన గ్రేడ్లు మెరుగుపడటమే గాక సుమారు 60%కు పైగా మార్కులతో డిప్లోమాను పూర్తి చేశానని అన్నారు. అప్పుడు తెలిసిందే సాధించాలని గట్టిగా అనుకుంటే ఎలాగైనా.. సాధించగలరు, చేయగలరని, కేవంల పట్టుదలను వదులుకోకూడదని అన్నారు. తన క్లాస్మేట్ తన యాసను ఎగతాళి చేయడంతోనే సవాలుగా తీసుకుని తనను తాను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే ఆకస్మికంగా తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టాయన్నారు. ముంబై విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుదామంలే కాలేజ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి దాంతో ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్లు కరాఖండీగా చెప్పారని తెలిపారు. దాంతో రాత్రంతా ఏడుస్తూ ఉన్న నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అయితే తన పరిస్థితిని చూసిన తల్లి తండ్రితో మాట్లాడి చదువుకు కొనసాగించేలా చేసిందన్నారు. తన మేనమామ సాయంతోనే చదువు కొనసాగించగలిగానని అన్నారు. సరిగ్గా కంప్యూటర్ సైన్సుతో డిగ్రీ పూర్తి చేసేనాటికి 2008 ఆర్థిక సంక్షోభం సంభవించి ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. దాంతో ఎంతో కష్టపడి నెలకు రూ. 5000 జీతంతో ఒక ఉద్యోగాన్ని సంపాదించానని నఅ్నారు. కోడింగ్ అంటే ఇష్టంతో C#లో మంచి పట్టు సాధించానన్నారు. నిరంతరం కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాభివృద్ధిని సంపాదించుకుని 2010 కల్లా నెలకు రూ. 12 వేల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆగస్టులో 2011లో ఒక స్టార్టప్లో చేరి ఐదేళ్లపాటు అక్కడే పనిచేశానని అన్నారు. జీతం బాగుండేది, పైగా తాను చేరినప్పుడు 50% కంటే ఎక్కువ జీతం పెరిగిందన్నారు. అలా చివరకు కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్, పీఎఫ్ కూడా లభించాయన్నారు. అలా సరిగ్గా 2016లో భార్యతో కలిసి పూణేకు మారారు. అక్కడ బహుళజాతి కంపెనీలలో పనిచేస్తూ..టెక్నికల్ బ్లాగులు రాయడం, శిక్షణా తరగతులు నిర్వహించడం, డెవలపర్ కమ్యూనిటీకి తన వంతు సహకారం అందించడం ప్రారంభించానని అన్నారు. అయితే పనికోసం కుటుంబ జీవితాన్ని అస్సలు త్యాగం చేయొద్దని అన్నారు. ఎందుకంటే ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేసినా అదనంగా వేతనం మాత్రం లభించదన్నారు. తన కెరీర్ 2019లో అనూహ్యమైన మలుపు తిరిగిందన్నారు. ఆ సమయంలో యాదవ్ Angular, NgRx వంటి ఓపెన్-సోర్స్ ప్రాజెక్టులకు తన వంతు సహకారం అందించడం ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే కమ్యూనిటీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అదే ఏడాది తన తొలి కాన్ఫెరెన్స్ ప్రసంగం ఇచ్చాడు. ఆ తర్వాత గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందింది. అలాగే నవంబర్ 13, 2019న తన పుట్టి రోజున యాంగులర్ కోసం గూగుల్ డెవలపర్ ఎక్స్పర్ట్గా అధికారికంగా ప్రకటించబడ్డారు. ఆ తర్వాత 2020లో తన తోటి డెవలపర్లు నామినేట్ చేయడంతో భారతదేశపు తొలి గిట్హబ్ స్టార్ అయ్యాడు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫెల్ ప్రకారం..జనవరి 2026లో జర్మనీలోని కోడ్రాబిట్లో ప్రిన్సిపల్ డెవలపర్ అడ్వకేట్గా మారడానికి ముందు, అవోడాక్ ఏజీ సెలొనిస్ వంటి కంపెనీలతో పనిచేశారు. తన కెరీర్లో 17 ఏళ్లకు పైగా గడిచినా..యాదవ్ ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్లో ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. 50కి పైగా అంతర్జాతీయ ప్రసంగాలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉన్నారు.We celebrated our 17th wedding anniversary together in Hamburg, this is the first time we decided to spend it with Hiya, she will be 14 soon.This weekend was all about us 😅.Thank you for everything ❣️ and staying by my side, when we married I was not able to afford anything,… pic.twitter.com/EkmgWLKk7N— Santosh Yadav (@SantoshYadavDev) May 31, 2026 (చదవండి: రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..) -
రాళ్లతో ధ్యాన సాధన..! కళకారుడి అద్భుత టెక్నిక్..
ధ్యాన సాధన గురించి ప్రముఖ యోగా గురువుల వద్ద శిక్షణ తీసుకుని మరీ ప్రయత్నిస్తుంటాం. అయినప్పటికీ నిలకడ సాధ్యం గాక పట్టు సాధించలేకపోతుంటాం. అలాంటి ధ్యాన సాధనను గౌతమ్ వైష్ణవ్ అనే కళాకారుడు రాళ్లతో అలవోకగా నేర్పిస్తున్నాడు. అదెలాగో తెలిస్తే..విస్తుపోతారు.రాళ్లతో సాధన అంటే..సున్నితమైన ఆకృతుల్లో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చేలా సమతుల్యం చేయడం. అందుకోసం ఎలాంటి జిగురు ఉపయోగించరు. ఇది కేవలం మన ఏకాగ్రత, ఓపికలకు సంబంధించిన సామర్థ్యం. మరి ఇదెలా ధ్యాన సాధన అవుతుందంటే..ముంబైకి చెందిన కళాకారుడు గౌతమ్ వైష్ణవ్ ధ్యాన చేయడం ఎలా అనేది నేర్పించారు. కేవలం చేసేలా ఈ టెక్నిక్తో బలవంతం చేస్తారు. అంటే వివిధ రాళ్లను వాటిని ఒకదానిపై ఒకటి నిలబడేలా చేసే టెక్నిక్ని నేర్పిస్తారు. అంతే అదే వారిని లోతైన ధ్యాన సాధన చేసేలా చేస్తుంది. ఇక్కడ ఈ టెక్నిక్లో రాళ్లతో మమేకమవ్వుతారు. ఒకదానిపై ఒకటి పెట్టే క్రమంలో ఓపిక, పదే పదే ప్రయత్నాలు..ఏకాగ్రత, నిలకడని పెంపొందిస్తాయి. పైగా ఏ కేంద్రం వద్ద రాయి నిలబడగలదు అనే దానిపై పూర్తి అటెన్షన్ సామర్థ్యం పెంపొంది సులభంగా తనకు తెలియకుండానే ధ్యాన సాధన చేయగలుగుతారు. రాళ్లను సమతుల్యంచేసే కళాత్మక నైపుణ్యం ఏళ్లు గడిచే కొద్ది లోతైన ధ్యాన సాధనగా పరిణామం చెందుతుందట. ఇది ఏకాగ్రత, సహనం, భావోద్వేగ స్థిరత్వం, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ టెక్నిక్లో రాయి చేప్పేది వింటుంటారు. అదే అన్ని నేర్పిస్తుందని అంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో కావాల్సింది కూడా ఇదే. ఇదొక విభిన్నమైన ధ్యాన పద్ధతని గౌతమ్ నొక్కి చెబుతున్నారు. అందుకే తాను ఎవ్వరికి ధ్యానం గురించి భోధించనని, చేసేలా బలవంతం చేస్తానని నవ్వుతూ చెబుతున్నారు. ఆలోచనలను నిశబ్దం చేయడానికి సతమతమయ్యే వాళ్లకు ఈ టెక్నిక్ ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది పూర్తి మైండ్ఫుల్నెస్ ఆధారిత విధానం అని అంటున్నారు గౌతమ్. దాదాపు 90 నిమిషాల పాటు ఎవరైనా నిరంతరాయంగా రాళ్లను సమతుల్యం చేసేలా దృష్టిసారిస్తే..కచ్చితం మిగతా విషయాలన్నింటి గురించి ఆలోచించడం మానేస్తారని అంటున్నారు. తమకు తెలియకుండానే నిశ్చల స్థితిని అనుభవిస్తారని అంటున్నారు. ధ్యానం అంటేనే ఎలాంటి ఆలోచనలు లేని నిశ్చల స్థితి, శ్వాసపై ధ్యాస అది ఈ టెక్నిక్తో సులభంగా అలవడుతుందని గౌతమ్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..ధ్యాన సాధన సునాయాసంగా నేర్చుకోండి. View this post on Instagram A post shared by Gautam Vaishnav | A Balance Artist (@the.gautamvaishnav)(చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..) -
నాలుగు నెలల్లో 15 కిలోలు తగ్గాలంటే..! ఈ ఐదు సింపుల్ చిట్కాలతో..
బరువు తగ్గాలంటే చక్కని డైట్లు, ఫోర్స్బుల్ వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి భారం కలిగించేలా ఇలాంటి వర్కౌట్లతో బరువు తగ్గడం ఎలా ఉన్నా.. సమస్యలే ఎక్కువ. కొందరు తగ్గకపోగా..మరింత బరువు పెరుగుతారు. అలా కాకుండా శరీరానికి హాయినిచ్చేలా సులభంగా చేసే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేయడమే గాక సులభంగా బరువు తగ్గగలుగుతారని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా.!.15 కిలోల బరువును విజయవంతంగా తగ్గించుకున్న ఆమె తన వెయిట్లాస్ జర్నీని సాధారణమైన రోజువారీ జీవనశైలి అలవాట్లతో ప్రారంభించినట్లు తెలిపారు. ఏం చేసినా..స్కిప్ చేయకుండా నిలకడగా చేస్తే తప్పక ఫలితం పొందగలమని అంటోందామె. తాను తీవ్రమైన వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ల జోలికి పోకుండా తగ్గానని చెబుతోంది. అందుకోసం ఏం చేసిందో కూడా షేర్ చేశారామె. వాకింగ్..ఇది కార్షియో వ్యాయామంలా పనిచేస్తుంది. కుదిరినప్పుడల్లా మెట్లు ఎక్కండి, లిఫ్టులు వాడండి.నీరు తాగడం..నిద్రలేవగానే నీళ్లు తాగండి, గోరువెచ్చని నీరైనా.మరే ఏవిధంగానైన నీటిని ఎక్కువగా తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకోండి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీనివల్ల రోజంతా మన శక్తిని స్థిరంగా ఉంచుతుంది.ఫైబర్ను మర్చిపోవద్దుప్రోటీన్ ముఖ్యమే, కానీ ఫైబర్ కూడా అంతే ముఖ్యమని గుర్తించండి. అదుకోసం భోజనంలో మంచి మొత్తంలో ఫైబర్ను చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.ఇంట్లో వండిన ఆహారంప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారు చేసిన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. దీనివల్ల పదర్థాఆల పరిమాణాలు, వంట పద్ధతులపై ఒక నియంత్రణ ఉంటుంది. అలాగే అధిక సోడియం, ఉప్పుని తగ్గించే వీలు కూడా ఉంటుంది.కేలరీ లోటుతినే ఆహార పరిమాణాలను అర్థం చేసుకోండి. ద్రవరూప క్యాలరీల పట్ల జాగ్రత్త వహించండి. పండ్ల రసాల కంటే ఎల్లప్పుడూ పండ్లనే తినండి. కొవ్వును తగ్గించుకోవడానికి, కొద్దిపాటి కేలరీ లోటును పాటించాల్సి ఉంటుంది.తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, ఫిట్నెస్ లక్ష్యాలను సాధించాలని చూస్తున్న వారికి, ఈ సాధారణ అలవాట్లు చాలా బాగా హెల్ప్ అవుతాయని చెబుతోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దిశా. (చదవండి: 76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..) -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు. దీనికి పెరిగే వయసుతో పాటు బరువు పెరుగుతుండట కూడా అల్జీమర్స్కూ అంతే కారణమవుతోందనేందుకు పరిశోధనల రూపంలో తార్కాణాలు లభ్యమవుతున్నాయి. ఇలా బరువు పెరుగుతుండటంతో పాటు అల్జీమర్స్కు కారణమవుతున్న ఇతర అంశాలేమిటన్నది తెలుసుకుంటూ బరువు తగ్గించుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో చూద్దాం...మతిమరపును ఇంగ్లిష్లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైనది ‘అల్జీమర్స్’. డిమెన్షియా కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు సహాయపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. ఇటీవలి కాలంలో అల్జీమర్స్ బాగా పెరుగుతోంది. ఇది అకస్మాత్తుగా కాకుండా క్రమంగా... అంటే కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలోమరచిపోయే అంశాలను పెంచుతూ పోతుంటుంది. ఉదాహరణకు మొదట్లో పేర్లు, కొద్దిసేపటి కిందట జరిగిన సంఘటనలూ, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అటు తర్వాత తెలిసిన దారులనూ, అటు తర్వాత సమీప వ్యక్తులనూ, కుటుంబ సభ్యులను మరచిపోవడం జరుగుతుంది. చివరగా... భయభ్రాంతులకు లోనవ్వడం, మలమూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం వరకు జరగవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నేర్చుకున్న అనేక అంశాలు రాతిమీది రాతల్లా ఉండిపోవాల్సినవి కాస్తా... పలక మీద రాతలా చెరిపివేతకు గురవ్వడాన్ని అల్జీమర్స్గా చెప్పవచ్చు. ఒకసారి అల్జీమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా పూర్తిగా నార్మల్ అయ్యేలా చేయడం ఇప్పటికి సాధ్యం కాదు.చికిత్స...అల్జీమర్స్ను పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మెదడులోని అన్నిరకాల కార్యకలాపాలను నిర్వహించే ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం సరైన మోతాదుల్లో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. గత కొద్దికాలం కిందట ‘లెకనిమ్యాబ్’, ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందుల్ని ఎఫ్డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు. ఈనెలలోనే (మే, 2026లో) ‘డొనానిమ్యాబ్’ అనే సరికొత్త మందు మనకు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ మందు అల్జీమర్స్ తొలిదశలో ఇది అత్యంత ప్రభావవంతమైనది. దీన్ని నెలకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకోవాలి.పెరిగే బీఎమ్ఐతో జ్ఞాపకశక్తి తగ్గు తున్నా... అది నివారించగలిగే అంశమే... యూనివర్జిటీ ఆఫ్ జార్జియాలో నిర్వహించిన ఇటీవలి తాజా పరిశోధన ఫలితాలేమిటంటే... వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞాపకశక్తి గతంలో వారు యువకులుగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. దీనికి తోడు పెరుగుతున్న బరువు (బాడీ మాస్ ఇండెక్స్–బీఎమ్ఐ) పెరుగుతున్న కొద్దీ వారిలోనూ అభ్యాసనం ద్వారా నేర్చుకునే (కాగ్నిటివ్) నైపుణ్యాలూ, గుర్తుంచుకునే సామర్థ్యాలు (మెమరీ), భావోద్వేగాల అదుపు (మేనేజింగ్ ఎమోషన్స్), ప్లానింగ్ అలాగే నిర్వహణ సామర్థ్యాలూ, ఏకాగ్రత (కాన్సంట్రేషన్) తగ్గుతాయని తేలింది. 24 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో దాదాపు 8,200 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇదేమీ చెడు వార్త కాదనీ... ఒకవేళ మనం మన బరువును అదుపులో పెట్టుకుంటే ఆ దుష్పరిణామాలు నివారించవచ్చని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో కాలేజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన లీడ్ ప్రొఫెసర్ డాక్టర్ సుహాంగ్ సాంగ్ పేర్కొన్నారు.నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ను చాలావరకు ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.ఆహారం... పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో వాడే పసుపుతో పాటు పాశ్చాత్య ఆహారాల్లో మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు బాగా తోడ్పడతాయి.మెదడుకు మేత కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం వంటి మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.వ్యాయామం...దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. దాంతో మెదడుకు రక్తప్రసరణ బాగాజరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, వివిధ జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.నిర్ధారణ అల్జీమర్స్ నిర్ధారణ కోసం ఇప్పడు కొన్ని రకాల పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలోని ఎమ్మారై బ్రెయిన్తో పాటు కొన్ని రక్తపరీక్షలూ ఇప్పుడ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి టీఏయూ (టావు) అండ్ అమైలాయిడ్ శాతాన్ని నిర్ధారణ చేయడం; అమైలాయిడ్ పెట్ స్కాన్ ద్వారా అల్జీమర్స్ను నిర్ధారణ చేయవచ్చు. ఇవి చాలా తాజాగా అందుబాటులోకి వచ్చిన వైద్యపరీక్షలు.సమాజంలో నలుగురితో పాటు ఒకరిగా మెలగడం...వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. అలాంటి ఉల్లాస జీవితం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ వచ్చే ముప్పూ తగ్గుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల అదుపు...డయాబెటిస్, హైబీపీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వంటి వాటిని అదుపులో పెట్టుకోవాలి.మతి మరుపు, అల్జీమర్స్ కారణమయ్యే అంశాల్లో కొన్ని...మతిమరుపునకూ, అల్జీమర్స్కూ అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లోని అతి ముఖ్యమైన ఓ అరడజను కారణాలేమిటో చూద్దాం...1. జన్యుపరమైనవి : అల్జీమర్స్తో వచ్చే మతిమరుపునకు జన్యుపరమైన అంశాలు అతి ముఖ్య కారణాలు. కొందరి కుటుంబాల్లో అల్జీమర్స్ వంశాపారంపర్యంగా కనిపిస్తుంటుంది. ఏపీఓఈ 4 ఎల్లీల్ జన్యువు వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి.2. వయసు : పెరుగుతున్న వయసు పై సమస్యలకు ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). పైగా ఇది నిరోధించలేని అంశం.3. పెరుగుతుండే బరువు : అధిక బరువు / ఊబకాయం (ఒబేసిటీ) వల్ల దేహంలో కొవ్వుల మోతాదు పెరగడమనే అంశం అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పును పెంచుతుందని ఇటీవల కొన్ని తాజా అధ్యయనాల్లో తేలింది. దేహంలోనూ, అందునా మరీ ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరగడంతో పాటు ఫిట్నెస్ తగ్గడమనే అంశం మెదడును మందకొడిగా మార్చడంతో పాటు మతిమరపును తెచ్చిపెట్టే ప్రమాదమైన సిగ్నల్స్ కారణంగా అల్జీమర్స్ వస్తుందనేది కొన్ని పరిశోధనల్లో తేలిన అంశం.4. జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినవారిలో... అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, చురుకైన జీవితానికి దూరంగా ఒకేచోట మందకొడిగా ఉండటం, వ్యాయామం లేకుండా బద్ధకంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంట అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవాళ్లలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ.5. దేహంలో దాగి ఉన్న ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు)లతో పాటు దీర్ఘకాలికంగా దేహంలో ఉండే ఇన్ఫ్లమేషన్ (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతూ అల్జీమర్స్కు కారణమయ్యే అవకాశాలెక్కువ.6. వాతావరణ అంశాలు : వాతావరణంలోని కాలుష్యాలు, విషపూరిత (టాక్సిక్) పదార్థాలు కూడా అల్సైమర్స్ మతిమరపునకు కారణమవుతాయి. దీనికి విరుధ్ధంగా వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.- డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డిసీనియర్ న్యూరో ఫిజీషియన్ నిర్వహణ యాసీన్ -
65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!
బరువు తగ్గాలంటే వాకింగ్ కీలకం అనేది చాలామంది ఫిట్నెస్ నిపుణులు చెప్పేమాట. రోజుకు 5-10 వేల అడుగులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే బిజీ షెడ్యూల్స్, వర్షంవల్ల, మండే ఎండలు లాంటి వాతావరణ అననుకూలత వల్ల రోజుకు 10వేల అడుగులు వేయడం ఎలా? అనుకుంటున్నారా? అయితే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకుండానే కేవలం 65 నిమిషాల్లో 10వేల అడుగులు ఎలా పూర్తి చేయాలో ఫిట్నెస్ కోచ్ రీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఇండోర్ వర్కౌట్ ప్లాన్ వివరాలు చూద్దామా.వార్మ్-అప్, హై-నీ మార్చింగ్, స్టెప్-అప్స్, వాక్-అండ్-లంజ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాల కలయికతో ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేయవచ్చని రీత్ కూర్ తెలిపారు. ప్రతిరోజూ 10వేల అడుగులు నడవాలనే ఆలోచన మెరుగైన ఫిట్నెస్ , బరువు నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అయితే, తీరికలేని పనులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మరియు ఎక్కువ పని గంటల కారణంగా, చాలా మందికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా అనిపిస్తుంది.అందుకే తగినప్లాన్ అవసరం . ఎలా అంటే65 నిమిషాల్లో అంటే గంట 5 నిమిషాల్లో 10వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే., సగటున నిమిషానికి 167 అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 10వేల అడుగులు కాకుండా, ఫిట్ నెస్ను బట్టి నెమ్మదిగా ప్రారంభించాలి.వార్మ్-అప్ (5 నిమిషాలు)వర్కౌట్ ప్రారంభించే ముందు గాయాలు కాకుండా కండరాలను సిద్ధం చేయడానికి ఇది చాలా అవసరం. ఒకే చోట నిలబడి నడవడం (March in place), చేతులు తిప్పడం , పక్కలకు చిన్న అడుగులు వేయాలి. తద్వారా సుమారు 500 అడుగులు వస్తాయి.మెయిన్ ఇండోర్ వర్కౌట్ (50 నిమిషాలు)బోరింగ్గా అనిపించకుండా ఉండటానికి ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఒకసారి క్రింది వ్యాయామాలను మారుస్తూ చేయాలి.హై-knee మార్చింగ్ లేదా ఒకే చోట జాగింగ్ అంటే మోకాళ్లను పైకి లేపుతూ, చేతులను వేగంగా కదిలిస్తూ జాగింగ్ చేయాలి. దీనివల్ల దాదాపు 1,200–1,500 అడుగులు వస్తాయి.స్టెప్-అప్స్ (5 నిమిషాలు): ఇంట్లోని మెట్లు లేదా ఏదైనా బలమైన కుర్చీ సహాయంతో కాళ్లు మారుస్తూ పైకి, కిందికి అడుగులు వేయాలి. ఇది కాళ్లకు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల 600–800 అడుగులు వస్తాయి.ఫ్రీస్టైల్ డ్యాన్స్ లేదా జుంబా (10 నిమిషాలు): మీకు నచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ పెట్టుకుని హుషారుగా డ్యాన్స్ చేయాలి. దీని ద్వారా 1,500 కంటే ఎక్కువ అడుగులు సాధించవచ్చు.వాక్-అండ్-లంజ్ కాంబో (5 నిమిషాలు): గదిలో 10 అడుగులు నడిచిన తర్వాత ఐదు లంజెస్ (Lunges) వ్యాయామం చేయాలి. ఇది లోయర్ బాడీని బలోపేతం చేస్తుంది. దీనివల్ల 500 అడుగులు వస్తాయి.సైడ్ స్టెప్స్ & స్కేటర్ జంప్స్ (5 నిమిషాలు): పక్కలకు పెద్ద అడుగులు వేస్తూ చిన్నగా గెంతాలి. ఇది కాళ్లు మరియు కోర్ (Core) కండరాలకు మంచిది. దీనివల్ల 800 అడుగులు లభిస్తాయి.పవర్ మార్చింగ్ (10 నిమిషాలు): వేగంగా మెట్లు ఎక్కడం లేదా ఇంట్లోనే వేగంగా అడుగులు వేయడం చేయాలి. దీనివల్ల కేవలం 10 నిమిషాల్లోనే 2,000 అడుగుల వరకు వస్తాయి.స్ట్రెచింగ్ (5 నిమిషాలు)హై-ఇంటెన్సిటీ వర్కౌట్ పూర్తయిన తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.నెమ్మదిగా నడవడం, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, బాడీ స్ట్రెచింగ్ చేయడం లాంటి కూల్ డౌన్ ప్రక్రియ ద్వారా చివరిగా మిగిలిన 500 అడుగులు దీని ద్వారా పూర్తవుతాయి. ఈ విధంగా సరైన పద్ధతిలో సమయాన్ని కేటాయిస్తే, జిమ్కు లేదా పార్కుకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని మీ ఫిట్నెస్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. View this post on Instagram A post shared by Reet Kaur | Fat Loss Coach | Thyroid & Postpartum (@transformationwithtwins)నోట్ : సాధారణంగా వాకింగ్ చేయడం చాలా సులభం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా మెల్లగా సాధన చేసుకోవచ్చు. అయితే ఏదైనా సమస్య ఉంది అనిపించినపుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
ఈ నాలుగింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా..!
మన నిత్య జీవితంలో తరచుగా వాడే కొన్ని పదాల మధ్య అసలు తేడా చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో హోటల్, మోటెల్, రెస్టారెంట్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రిసార్ట్ పదాలు ఉన్నాయి. ఈ నాలుగు ప్రదేశాలు దాదాపు ఒకే విధంగా అనిపించినా, వాటి సేవలు, ఉద్దేశం, స్థానాల విషయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వీటిని ఒకే విధంగా వాడటం వల్ల కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ రోజు ఈ నాలుగు పదాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.హోటల్ అంటే..హోటల్ అనేది చాలా మందికి బాగా తెలిసిన, తరచుగా ఉపయోగించే ఒక వసతి కేంద్రం. ప్రయాణ సమయంలో బస చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతి పొందే ప్రదేశం. హోటల్స్లో సాధారణంగా భోజనం (రెస్టారెంట్), టీవీ, వైఫై వంటి అదనపు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. హోటళ్లు పట్టణాల మధ్యలో లేదా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో నిర్మించి ఉంటాయి.మోటెల్ అంటే..మోటెల్స్ అనేవి హోటల్స్కు భిన్నంగా, చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో నిర్మించబడ్డాయి. మోటెల్ అంటే కారు డ్రైవ్ చేస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి, ఆగి వెళ్లడానికి వీలుగా ఉండే ప్రదేశం. ఇవి ప్రధానంగా సుదూర హైవేల వెంబడి నిర్మించబడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా వంటి దేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.మోటెల్స్లో సాధారణంగా రాత్రి బస చేయడానికి గది దొరుకుతుంది, ఉచిత పార్కింగ్ తప్పనిసరి ఉంటుంది. అయితే, రెస్టారెంట్ లేదా పూర్తి భోజన సౌకర్యం ఉండకపోవచ్చు. కొన్ని మోటెల్స్లో కేవలం కేఫ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది.రెస్టారెంట్..హోటల్, మోటెల్తో పోలిస్తే రెస్టారెంట్ ఉద్దేశం పూర్తిగా భిన్నమైనది. రెస్టారెంట్ అనేది వసతి సౌకర్యం లేకుండా, కేవలం తినే సదుపాయం మాత్రమే ఉన్న ప్రదేశం. ఇక్కడ వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. చాలా పెద్ద హోటళ్లు తమ అతిథుల కోసం తమ సొంత రెస్టారెంట్లను కలిగి ఉంటాయి. కానీ, రెస్టారెంట్లలో రాత్రి బస చేసే సదుపాయం ఉండదు.రిసార్ట్ అంటే... రిసార్ట్ అనేది హోటల్ కంటే చాలా విస్తృతమైన సౌకర్యాలు, అనుభవాన్ని అందిస్తుంది. రిసార్ట్లు సాధారణంగా హోటళ్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇవి కేవలం బస కోసమే కాకుండా, కుటుంబం లేదా స్నేహితులతో విశ్రాంతి తీసుకోవడానికి, వినోదం పొందడానికి ఉద్దేశించబడ్డాయి.రిసార్ట్లో వసతి, భోజనాలతో పాటు అదనపు వినోద సౌకర్యాలు ఉంటాయి. ఉదాహరణకు, స్విమ్మింగ్ పూల్, గేమ్ జోన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్పా, ఇతర ఆటల సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్తో సహా అనేక పర్యాటకప్రాంతాలలో ఈ రిసార్ట్ల సంఖ్య పెరుగుతోంది. -
సత్యమే శివం.... సుందరం
సనాతన ధర్మం కేవలం మతం కాదు; అనంత విశ్వాన్ని సుస్థిరంగా నిలిపేప్రాకృతిక నియమం. ధారణాత్ ధర్మమిత్యాహుః – ఏది సమస్తాన్ని ధరిస్తుందో, రక్షిస్తుందో అదే ధర్మం. మానవ ఉనికికి, ప్రకృతి సమతుల్యతకు ధర్మమే వెన్నెముక. వ్యక్తిగత స్వార్థం వీడి లోకకల్యాణం కోసం నడుచుకోవడమే అసలైన ధర్మశీలం. అస్థిరత నిండిన ఆధునిక జగత్తులో దిశానిర్దేశం చేసే అక్షయమైన ధ్రువతార ఈ ధర్మపథం.ధర్మానికి పునాది ధర్మానికి మొదటి మెట్టు సత్యం. సత్యం అంటే కేవలం నిజం మాట్లాడటం కాదు; మనసా, వాచా, కర్మణా ఏకరూపంలో ఉండటం. సత్యం ఒక మహా వృక్షానికి భూమిలో లోతుగా పాతుకుపోయిన వేరు వంటిది. వేరు బలంగా లేని వృక్షం గాలివానలకు కూలిపోయినట్లే, సత్యనిష్ఠ లేని వ్యక్తిత్వం కష్టకాలంలో నిలబడలేదు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తన వృత్తిలో నిజాయితీగా బాధ్యత నిర్వర్తించడం, ఒక వ్యాపారి తన వస్తువు నాణ్యత విషయంలో నిబద్ధత కలిగి ఉండటం అసలైన సత్య ధర్మ పరిపాలన. సత్యం కఠినంగా అనిపించినా, అది ఇచ్చే ఫలితం శాశ్వతం, నిర్భయం. నిప్పును మూటగట్టలేనట్లు, సత్యాన్ని ఎవరూ అణచివేయలేరు. సూర్యకాంతిని మేఘాలు తాత్కాలికంగా కప్పివేసినా, సత్యం స్వయంప్రకాశితమై విజయతీరాలకు చేరుస్తుంది.మంగళకరమైన జీవనం ధర్మం రెండవ రూపం శివం. శివం అంటే మంగళం, శుభప్రదం. మనం చేసే ప్రతి పని తోటివారికి మేలు చేసేదిగా ఉండాలి. పరహితమే పరమార్థంగా జీవించడం శివ తత్వం. ఇది వెలుగునిచ్చే దీపం వంటిది; దీపం తాను వెలుగుతూ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలినట్లే, మన జీవనం ఇతరుల కష్టాలను తొలగించేదిగా మారాలి. తన ఎదుగుదల కోరుకుంటూనే, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించేవాడే ధర్మాత్ముడు. దైనందిన జీవితంలో ఆకలితో ఉన్నప్రాణికి అన్నం పెట్టడం లేదా అవసరంలో ఉన్న మిత్రుడిని ఆదుకోవడం వంటి చిన్న కార్యాలూ శివత్వాన్ని పొందుతాయి. లోక కల్యాణార్థం సాగే నిస్వార్థ జీవన యానమే మానవ జన్మకు అసలైన సార్థకత చేకూరుస్తుంది. ప్రతి జీవిలో శివుడిని దర్శించడమే అత్యున్నత ఆధ్యాత్మిక సంస్కారం. స్వార్థం సంకెళ్ళను తెంచుకున్నప్పుడే జీవుడు శివుడు కాగలడు.సుందరం: ధర్మబద్ధమైన సౌందర్యం సత్యం, శివం మేళవించిన చోట అద్భుతమైన సౌందర్యం ఉట్టిపడుతుంది. ఇది బాహ్య రూపం కాదు; అంతర్గత క్రమశిక్షణ వల్ల కలిగే మానసిక ప్రశాంతత. ధర్మబద్ధమైన జీవితం గడిపే వ్యక్తి ముఖంలో దివ్యమైన తేజస్సు ఉంటుంది. దీనికి ఉపమానం పద్మం; బురదలో పుట్టినా తన పవిత్రతను కాపాడుకునే పద్మం వలె, మనిషి లౌకిక బంధాల మధ్య ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తే ఆ జీవితం సుందరమవుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఇంద్రియ నిగ్రహం, ప్రకృతి పట్ల గౌరవం జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయి. పర్యావరణాన్ని ప్రేమిస్తూ, సృష్టిలోని ప్రతి జీవిని దైవ స్వరూపంగా భావించడం ఈ సుందర ధర్మంలో అంతర్భాగం. కళాత్మకమైన హృదయం, ధార్మిక చింతన తోడైతే మానవ జీవితం ఒక అద్భుత కావ్యమవుతుంది. చిత్తశుద్ధి కలిగిన మనసే భగవంతుడు నివసించే అసలైన ఆలయం.బురదలో పుట్టినా తన పవిత్రతను కాపాడుకునే పద్మంలా, మనిషి లౌకిక బంధాల మధ్య ఉంటూనే ధర్మబద్ధంగా జీవిస్తే ఆ జీవితం సుందరమవుతుంది. క్రమశిక్షణతో కూడిన దినచర్య, ఇంద్రియ నిగ్రహం, ప్రకృతి పట్ల గౌరవం జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయి. – కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు. -
76 కేజీల నుంచి 56 కేజీలకు..! జస్ట్ సింపుల్ వ్యాయమాలతోటే..
బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్ సెషన్లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్ డైట్ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్లాస్ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు, కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.స్టాండింగ్ జాక్స్తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.స్టాండింగ్ హై నీస్ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.పల్స్ స్క్వాట్స్ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.వాల్ క్లైంబర్పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
బ్రీజీ ఔట్ఫిట్... క్రేజీ స్టయిల్
చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్ లూజ్గా ఉన్నాయని ఫీల్ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్ ట్రెండీ ఫ్యాషన్స్లో ఇప్పుడు ఓవర్సైజ్డ్, రిలాక్స్డ్ ఫిట్ కూడా ఒక హాట్ స్టయిల్గా మారిపోయింది. అందుకే, లూజ్గా, లైట్గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్ఫిట్స్ సమ్మర్లో కంఫర్ట్తో పాటు స్టయిల్ కూడా ఇస్తున్నాయి.హీరో లినెన్ !సమ్మర్ అనగానే గుర్తొచ్చేది లినెన్ బట్టలే. వీటిల్లో రిసార్ట్ కాలర్ అంటే ఓపెన్ కాలర్ షర్ట్స్ వేసుకుంటే పక్కా బీచ్ వైబ్ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్ ఫిట్టెడ్ టీషర్ట్ వేసి, పైన షర్ట్ బటన్స్ తీసేసి ఓపెన్గా వదిలేయండి. లేయర్డ్ లుక్ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. నిట్టెడ్ పోలోస్కి క్లాస్రెగ్యులర్ కాలర్ టీషర్ట్స్ బోర్ కొడితే, ఈ నిట్టెడ్ అంటే అల్లిక డిజైన్ పోలోస్ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి.వైడ్ లెగ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ కింద లూజ్గా ఉంటూ, పైన ప్లీట్స్ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్ లుక్ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్ మీటింగ్స్ లేదా స్మార్ట్ క్యాజువల్ ఈవెంట్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ కలర్స్లో ప్లీటెడ్ ట్రౌజర్స్ వేసుకుని, లోఫర్స్ జోడిస్తే సమ్మర్ ఫ్యాషన్లో మీరే టాపర్!డ్రాస్ట్రింగ్ లినెన్ ప్యాంట్స్బెల్ట్ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్ ప్యాంట్లు బెస్ట్ చాయిస్. క్యాజువల్ అవుటింగ్స్, ఈవినింగ్ వాక్స్, ట్రావెల్స్ ఏదైనా సరే ఈజీగా సెట్ అయిపోతాయి.జాగ్రత్తలు!లూజ్ ఫిట్ అంటే చాలా పెద్ద సైజ్ కాదు. లేదంటే బెడ్షీట్లా కనిపించే చాన్స్ ఉంది.లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్ అయితే సమ్మర్లో భరించలేరు.ఒక ఔట్ఫిట్లో చాలా ప్రింట్స్ వద్దు. రిలాక్స్డ్ ఫిట్ అంటే క్లీన్, సింపుల్ లుక్ బెటర్.లైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్లో కూల్గా కనిపిస్తారు. బ్లాక్తో పూర్తి ఔట్ఫిట్ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్గా కనెక్ట్ అయిపోతాడు! కొండి దీపిక(చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..) -
ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..!
కొన్ని వస్తువులతో గొప్ప ఎమోషన్ ఉంటుంది. ఎన్ని సరికొత్త ట్రెండ్లు వచ్చినా..ఆ వస్తువులనే పదేపదే వాడతాం. అవి మనకు ఓదార్పు, ప్రియమైన లేదా ఇష్టమైన వ్యక్తులు మనతో ఉన్న అనుభూతిని అందిస్తూ సదా ధైర్యాన్ని ఇస్తుంటాయ్. ఆ విషయమైన చెబుతున్నాడు ఈ బాలీవుడ్ బుల్లితెర నటుడు. మనలో ఇలాంటి భావోద్వేగ కనెక్టివిటీ ఉన్నవాళ్లు ఉన్నారంటూ తన భావోద్వేగ కథను పంచుకున్నారు. బుల్లితెర నటుడు, హోస్ట్ రాజీవ్ ఖండేల్వాల్, ప్రతి ఉదయం 56 ఏళ్ల నాటి టీ కప్పులలో టీ తాగే తన దినచర్యకు సంబంధించిన ఒక భావోద్వేగ జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు. తన అమ్మ నాన్న చనిపోయినప్పుడు 70వ దశకంలో తను కొన్న కప్పులను మాత్రమే వాడాలని నిర్ణయించుకుని ఇప్పటికీ వాటిల్లోనే టీ తాగుతుంటానని అన్నారు. తన రోజు మొదలయ్యేది కూడా ఆ కప్పులోని టీ సిప్తోనే అని అన్నారు. అవే ఎందుకంటే..1970లో వాళ్ళ పెళ్లి సమయంలో... ఈశాన్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లారని, అక్కడే తన తండ్రికి పోస్టింగ్ ఉండేదని చెప్పుకొచ్చారు. 2019లో అమ్మ, 2022లో నాన్న చనిపోయినప్పుడూ..ఏమేమి తీసుకువెళ్లాలని చర్చిస్తుండగా..తాను ఈ కప్పులు కావాలని అడిగానని అన్నారు. తన తల్లి కొన్న ఆ ఐదు కప్పులు, సాసర్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయన్నారు. ప్రతి ఉదయం వీటిలోనే టీ తాగుతానని చెప్పారు. ఈ అలవాటు మన వాళ్లను కోల్పోయిన బాధకు ఉపశమనంగా, ఆ వస్తువులు వ్యామోహంతో కూడిన విలువను కలిగి ఉంటాయన్నారు. మానవువుల కేవలం మనుషులతోనే బంధాలు ఏర్పరుచుకోరని మనం ప్రేమించే వ్యక్తులతో ముడిపడి ఉన్న ఆచారాలను, వాసనలు, ప్రదేశాలు, దినచర్యలు, వస్తువులు, స్పర్శలు, వంటి వాటితో బంధాలను ఏర్పరుచుకుంటామని అన్నారు. చూడటానికి అవి వస్తువులే గానీ అంతకుమంచి.. అనుబంధాన్ని ఇచ్చేవి. ముఖ్యంగా దఃఖం నుంచి కోలుకుని ముందుకు సాగడానికి, భావోద్వేగపరంగా స్ట్రాంగ్గా మారడానికి హెల్ప్ అవుతాయని అంటున్నారు. భద్రత, అనుబంధాన్ని కొనసాగించడం..మానసిక నిపుణులు దుఃఖానికి మందు, భావోద్వేగ భద్రతను ఇస్తుందని ఇది సరైనదనే అంటున్నారు. ఒక తండ్రి తన దివంగత భార్య మొక్కలకు నీరు పోసినట్లుగానే తాను చేస్తుంటాడు. ఒక కుమార్తె తన తల్లి శాలువాను మడిచి దిండు పక్కన పెట్టుకుంటుంది. ఒక కుమారుడు ప్రతి ఉదయం తన తల్లిదండ్రులకు ఇష్టమైన కప్పులో టీ తయారుచేస్తూనే ఉంటాడు. ఇవన్నీ వాళ్లతో ఉన్న అనుబంధాలకు సజీవ సాక్ష్యాలు, కొనసాగింపు అంటున్నారు. ఇవి వారికి దుఃఖం నుంచి బయటపడేసి, కోల్పోయిన వ్యక్తులు తమతో ఉన్నారనే భావోద్వేగ భద్రత, మద్దతను ఇవ్వడమే గాక, ధైర్యంగా లైఫ్ని లీడ్ చేసేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఒక్కోసారి వారి జ్ఞాపకాలు మోయలేనంతగా మారినప్పుడూ..ఒంటరిగా ఉండకుండా..సాముహిక సేవ, ప్రార్థన, పని, వ్యాయామం వంటి పనులతో మమేకమవ్వాలంటున్నారు. అలానే పూర్తిగా ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆ వస్తువులే పరమావధిగా కాకుండా ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగండని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒక్కోసారి ఆయా వస్తువులు కూడా కాలక్రమేణ పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి అది మనల్ని కుంగదీయకముందే అంతరంగికంగా స్ట్రాంగ్గా ఉండేలా స్థిరంగా ఉండండని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Curly Tales | A Fork Media Group Co. (@curly.tales) (చదవండి: డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?) -
నిమ్మతో నిగనిగలాడే మెరిసే అందం..
సాధారణంగా చుండ్రు, బ్లాక్హెడ్స్, నిర్జీవమైన చర్మం వంటి సమస్యలకు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, వీటన్నింటికీ మన వంటింట్లో ఉండే నిమ్మకాయతోనే సులభంగా చెక్ పెట్టవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్–సి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు బ్లాక్హెడ్స్ ఉన్న ప్రాంతంలో కొద్దిగా నిమ్మరసం రాయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్లాక్హెడ్స్ పూర్తిగా తగ్గే వరకు ఈ చిట్కా పాటించవచ్చు. పొడి చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. నిర్జీవంగా మారిన జుట్టుకు మెరుపును తీసుకురావడానికి 3 చెంచాల నిమ్మరసం, అర కప్పు తేనె, ముప్పావు కప్పు ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు 3 చెంచాల నిమ్మరసంలో ఒక గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే చుండ్రు సమస్య మాయమవుతుంది.చర్మటానిక్కొరియాకు చెందిన జోసెయోన్ రాజవంశంలోని మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి పులియబెట్టిన బియ్యపు నీటిని చర్మ టానిక్గా ఉపయోగించేవారు. అమినో యాసిడ్లు, విటమిన్లు, పిండిపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ నీరు చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. దీనిని అప్పట్లో మిగ్వామ్ అని పిలిచేవారు. ఈ నీరు మురికిని, మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. బియ్యపు నీటిని పులియబెట్టడం వల్ల అందులో పిటెరా వంటి యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఇవి ముడతలను తగ్గించి, చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మానికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్హ్యాన్స్డ్ ప్రొడక్ట్ లైన్లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్హ్యాన్స్డ్ ప్రొడక్ట్ లైన్లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. -
డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?
నా వయసు ఇరవై ఐదేళ్లు. మొదటిసారి గర్భం దాల్చాను. రెండు నెలలు నిండాయి, పరీక్ష చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ నా బ్లడ్ గ్రూప్ ‘బి నెగటివ్’ అని తేలింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అసలు ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి ఈ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ సమస్య అసలు రాకుండా ఉండటానికి ఇంకా ఎలాంటి సమయాల్లో యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందో, డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్ గురించి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో దయచేసి వివరంగా చెప్పండి.– లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్.సాధారణంగా కాబోయే తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ (ఆర్హెచ్ నెగటివ్) ఉండి, భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మొదటగా భర్తకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆయనది కూడా నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ భర్తది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో యాంటీబాడీలు తయారై బిడ్డపై ప్రభావం పడకుండా ఉండటానికి ‘ఇండైరెక్ట్ కూంబ్స్ టెస్ట్’ (ఐసీటీ) అనే రక్త పరీక్షను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి చేస్తారు. ఒకవేళ ఈ పరీక్ష ఫలితం సాధారణంగా (నెగటివ్) వస్తే తల్లి శరీరం ఇంకా సెన్సిటైజ్ అవ్వలేదని అర్థం. కాబట్టి గర్భాధారణ ఇరవై ఎనిమిదవ వారంలో మళ్ళీ ఈ పరీక్ష చేసి, అప్పుడు కూడా నెగటివ్ వస్తే తల్లికి ’యాంటీ–డి’ నివారణ ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే కాన్పు అయిన తర్వాత పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని తేలితే డెలివరీ అయిన డెబ్బై రెండు గంటల లోపు తల్లికి మళ్ళీ యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆమెను, భవిష్యత్తులో వచ్చే గర్భాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే, ఒకవేళ ఈ ఐసీటీ పరీక్ష ఫలితం పాజిటివ్ వస్తే మాత్రం దానిని ‘ఇమ్యూనైజ్డ్ ప్రెగ్నెన్సీ’ అంటారు, అప్పుడు బిడ్డకు రక్తహీనత (ఎనీమియా) వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, స్కానింగ్ (మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ పరీక్ష) ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే కడుపులోనే బిడ్డకు రక్తం ఎక్కించే (ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్) అత్యాధునిక వసతులు, నియోనేటాలజీ విభాగాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలోనే (టెర్షియరీ సెంటర్) డెలివరీ చేయించుకోవడం చాలా సురక్షితం. ప్రెగ్నెన్సీ కొనసాగుతున్న సమయంలో మొదటి మూడు నెలల కాలంలో గర్భస్రావం అయినా, మహిళలు స్వచ్ఛందంగా గర్భాన్ని తీసివేయించుకున్నా, గర్భాశయాన్ని క్లీన్ చేసే ప్రక్రియ జరిగినా, గర్భాశయం వెలుపల పిండం పెరిగే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తున్నా, గర్భం చివరలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి పరీక్షించే ‘అమ్నియోసెంటసిస్’ లాంటి ప్రత్యేక పరీక్షలు చేసినా, లేదా నెలలు నిండకుండానే కాన్పు అయినా సరే తల్లి శరీరం సెన్సిటైజ్ అవ్వకుండా ఉండటానికి ఈ యాంటీ–డి ఇంజెక్షన్ కచ్చితంగా రక్షణగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెలివరీ సమయంలో రక్త లభ్యత (బ్లడ్ అరేంజ్మెంట్) విషయానికి వస్తే, ’నెగటివ్’ బ్లడ్ గ్రూపులు అనేవి చాలా అరుదైనవి కావడంతో అత్యవసర సమయంలో ఇవి బయట త్వరగా దొరకవు, కాబట్టి డెలివరీ సమయంలో ఒకవేళ తల్లికి అధిక రక్తస్రావం లాంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఒక బ్లడ్ డోనర్ను సిద్ధంగా ఉంచుకోవడం, ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకూ ఎంతో రక్షణ ఇస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ మరియు డెలివరీని సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు.డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!) -
పాడు పొగతో మూడింతల సెగ
సిగరెట్ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్... నష్టాలు..సిగరెట్ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. తలలోని అవయవాలూ, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇలా తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ – అనర్థాలు...నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్ స్మోకింగ్కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.థర్డ్ హ్యాండ్ స్మోకింగ్... దుష్ప్రభావాలు...నేరుగా సిగరెట్ కాల్చేవారిది ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్ హ్యాండ్ స్మోకింగ్’ కిందకు వస్తాయి. ఈ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్పోజ్ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్ హ్యాండ్ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. యూఎస్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్లో సెల్బయాలజిస్ట్ ప్రూ టాల్బోట్ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.క్యాన్సర్ను సిగరెట్ బాక్స్లో ప్యాక్ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?ప్రాణాంతకమైన క్యాన్సర్ను అందమైన సిగరెట్ పెట్టెలో ప్యాక్ చేసి తీసుకెళ్లి ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్ఏ దక్కడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్ఫోర్ట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్డ్) డీఎన్ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం. నిర్వహణ: యాసీన్ (చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి) -
వయసు చిన్నదే..కానీ మనసు మాత్రం చల్లన
వేసవి సెలవలు అంటే....పిల్లలకు మహా సరదా. ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు...ఇంకేముందు ఫుల్ ఎంజాయ్. దాదాపుగా పిల్లలంతా ఇలానే ఉంటారు కదా. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలోని పిల్లలు ఈ వేసవిలో చేసిన పనిని చూస్తే పెద్దవాళ్లందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతేకాదు ఇది చూసి తమ పిల్లలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అసలింతకీ ఆ పిల్లలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి మరి.సమ్మర్ అంటే సూపర్ హాట్ కదూ...ఎండ వేడి, ఉక్కపోత విపరీతమైన దాహం. మరీ ముఖ్యంగా ఏదైనా పని మీద రోడ్డు మీదకు వెళినపుడు దాహమేస్తే ఇక నరకమే. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతాంలోని బాలాజీనగర్ రోడ్డు నెం.4 కి వెళితే మాత్రం మీకు ఓ జ్యూస్ స్టాల్ కనిపిస్తుంది. అందులో నుండి బుడి బుడి అడుగులతో పిల్లలు బయటకు వచ్చి మీకు చల్లని జ్యూస్ అందిస్తారు. అది కూడా మీకు ఏ జ్యూస్ కావాలో అడిగి మరీ ఇస్తారు. అంతేకాదు మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అలా దారిన పోయే ప్రతి ఒక్కరికి వారం నుండి దాహం తీరుస్తున్నారు ఈ పిల్లలు. పుప్పాలగూడ లోని త్రిపుర రెసిడెన్సీ, టెంపుల్ వ్యూ రెసిడెన్సీ వాసుల పిల్లలు సంయుక్తంగా చేప్పట్టిన ఈ సోషల్ ఇనిషియేటివ్ పలువురిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ఈ పిల్లల ఆలోచన మాత్రం నిజంగా సూపర్ కదూ, ఇంకెందుకాలస్యం పేరెంట్స్ మీ పిల్లలతో మీ ప్రాంతంలో ఓ సారి ట్రై చేయండి.ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా? -
‘నేను అచ్చం ఏఐ బొమ్మలా కనిపించాలి’ అంటున్నారు!
అందానికి సంబంధించి ఏ.ఐ జనరేటెడ్ చిత్రాలు ఆహా అనిపించినా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాయి. న్యూయార్క్కు చెందిన డెర్మటాలజిస్ట్ డేచర్ వెబ్స్టే దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏఐ జనరేటెడ్ చిత్రాన్ని చూపించి ‘ఈ ఇమేజ్లో ఉన్న అమ్మాయిలాగే కనిపించాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఆ మాటకు వెబ్స్టే షాక్ అయ్యారు.‘ఈ ఇమేజ్లోలాంటి పెద్ద పెదవులు, పెద్ద కళ్లు, చెక్కినట్లు ఉండే దవడతో నేను కనిపించాలి’ అని అడిగిన ఆ అమ్మాయి వెబ్స్టేను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా ఫిల్టర్లు సౌందర్య ప్రమాణాలను మార్చిన తీరుకు ఈ సంఘటన అద్దం పడుతుంది. ఏఐ సృష్టించిన సౌందర్య చిత్రాలు నిజజీవితంలో సాధ్యపడతాయని కొంతమంది నమ్ముతున్నారు.ఒక అధ్యయనం ప్రకారం... తమ ఫొటోలను ఎడిట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ను ఉపయోగించే వారిలో కొంతమందికి, అందాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ఎన్నో అద్భుతాలు చేస్తుందనే విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ మాన్హాటన్లోని ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఏఐ జనరేట్ చేసిన తన ఫొటోతో వచ్చింది. సర్జికల్ టైమ్ మిషన్ కావాలని, తాను తన మనవరాలిలా కనిపించాలని అడిగి ఆ సర్జన్ షాక్ అయ్యేలా చేసింది.‘అలా కుదరదు’ అని నచ్చచెప్పినా ఆ బామ్మ వినలేదు. ‘అలా కనిపించేలా చేయండి’ అని పట్టుబట్టింది. ఫైనల్గా చెప్పొచ్చేదేమిటంటే... ఏ.ఐ ఇమేజ్లతో హాస్పిటల్స్కు వస్తున్న వారిని చూసినప్పుడు వైద్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి! -
బేర్ ఫేస్ ఛాలెంజ్! నో మేకప్... ఓన్లీ కాన్ఫిడెన్స్!!
అందాల పోటీలు అంటేనే మేకప్... ఇంకా చెప్పాలంటే భా...రీ మేకప్! అయితే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఆల్స్టార్స్లో పాల్గొన్న మహిళలు (పోటీదారులు) వేదికపైనే మేకప్ తొలగించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆకర్షణీయమైన గౌన్లు ధరించిన ఈ అందాల రాణులు మేకప్ను తుడిచి వేసి ఎలాంటి మేకప్ లేకుండానే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై నడిచారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది.సౌందర్య సాధనాలకు అతీతంగా సహజ సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పేందుకు తొలిసారిగా ఈ పోటీలో ‘బేర్ ఫేస్ ఛాలెంజ్’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఛాలెంజ్ థాయ్లాండ్లో జరుగుతున్న అందాల పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ రౌండ్లో పోటీదారులు పూర్తి మేకప్తో వెలుగులు వెదజల్లుతున్న వేదికపైకి అడుగు పెడతారు. వేదిక మధ్యలో వేసిన కుర్చీలలో కూర్చుని ప్రేక్షకులు చూస్తుండగా బోల్డ్ లిప్స్టిక్ నుంచి ఐ మేకప్ వరకు మేకప్ మొత్తం తుడుచుకుంటారు. ‘అందాల పోటీలు సాధారణంగా ఆడంబరమైన మేకప్, స్టైలింగ్ తో నిండి ఉంటాయి.ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఇంటర్నేషనల్ ఆల్స్టార్స్ పోటీ ఒక సాహసోపేతమైన అడుగువేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే... ‘సహజమైన సౌందర్యమే అసలు సిసలు సౌందర్యం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజనులు. పోటీకి సంబంధించి గ్రాండ్ ఫినాలే ఈరోజు థాయ్లాండ్లో జరుగుతుంది. అక్కడ పోటీదారులు ‘ఆల్స్టార్స్’ కిరీటం కోసం పోటీపడతారు. -
ఫిట్నెస్... ఫర్ స్ట్రెస్!
గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్ సోమన్ ఒకరు. చాలామందికి రిటైర్ మెంట్ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం.‘యూరప్ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు మిళింద్ సోమన్. బాడీ ఫిట్నెస్తో దేశంలో తరచు చర్చనీయాంశం గా మారే ఏకైక సెలబ్రిటీ మిళింద్. తెరపై నటుడిగా ఆయన సినిమా ప్రేక్షకులకు మాత్రమే పరిచితులు కావచ్చు.. ఫిట్నెస్ ఐకాన్గా మాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి.సూపర్ మోడల్ టూ సూపర్ రన్నర్...ఆయన ప్రయాణం 1990లలో సూపర్ మోడల్గా నిలవడంతో మొదలైంది. ఆ తర్వాత జుర్మ్ , ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు దాదాపు పాతికేళ్లుగా రన్నింగ్ ట్రాక్ మీద సాటిలేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సుదూరప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అనూహ్యమైనప్రాంతాల్లో పరుగులు తీయడం ద్వారా ఫిట్నెస్కు సరికొత్త అర్థాన్ని చె΄్పాడు. చెప్పులు లేకుండా పరుగెత్తడంలో కూడా ఆయన పాపులర్.పింక్థాన్.. మహిళలకు ఇన్స్పిరేషన్ప్రస్తుతం దాదాపు ప్రతినగరంలో సర్వసాధారణంగా మారిన మారథాన్లు, ఫిట్నెస్ ఈవెంట్స్కు ఆయన దాదాపు దశాబ్దమున్నర క్రితమే రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి లేదని గమనించాక... మహిళల కోసం ప్రత్యేకించి ఒక ఈవెంట్ను రూపకల్పన చేయాలన్న ఆలోచనతో గత 2012లో, సోమన్, ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి ప్రారంభించిన పింక్థాన్ ఈవెంట్ ప్రస్తుతం మన దేశంలోనే అతిపెద్ద మహిళల రన్నింగ్ ఈవెంట్ గా అవతరించింది.హిట్... ఫిట్... ఫీట్స్ ఎన్నో...50 ఏళ్ల వయసులో గత 2015లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో జరిగిన ఐర¯Œ మ్యాన్ ట్రయాథ్లాన్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైకిల్ రైడ్, 42.2 కిలోమీటర్ల పరుగును కలిపి... 15 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశాడు.2017లో ఫ్లోరిడాలో 3రోజుల పాటు జరిగిన, 517 కిలోమీటర్ల ట్రయాథ్లా¯Œ లో భాగంగా 10 కిలోమీటర్ల ఈత, 421 కిలోమీటర్ల సైకిల్, 84.4 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశాడు.సిక్స్ ΄్యాక్ కాదు... స్ట్రెస్ బ్యాక్ ముఖ్యంకండలు తిరిగిన శరీరం కన్నా తన దృష్టిలో ఫిట్నెస్ అంటే ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యమేనంటాడు సోమన్. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన అభి్రపాయం. ఎంతో డబ్బు వెచ్చించి జిమ్లకు వెళ్లడానికి బదులు పుష్–అప్స్ పుల్–అప్స్ వంటి సహజమైన బాడీ వెయిట్ వ్యాయామాలపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక శిక్షణ కంటే రోజువారీ కదలికకుప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాడు. సమతుల్యమైన, ΄ోషకాహారం కోసం ఇంటి భోజనానికేప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నాడు.30 రోజుల్లో 1500 కి.మీ. పరుగు తీయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు.59 ఏళ్ల వయసులో ఐదు రోజుల్లో పూణే నుంచి వసాయి వరకు 240 కి.మీ. పరుగెత్తాడు. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
మోహం క్షణికం శిక్ష జీవితాంతం
ఒక ఊరిలో భర్త హతమయ్యాడు. మరో నగరంలో భార్య కడతేరిపోయింది. రెంటిలోనూ జీవిత భాగస్వాములే నిందితులు. తెలుగు రాష్ట్రాల్లో వైవాహిక బంధం వివాహేతర ఆకర్షణల వల్ల వార్తలకెక్కుతోంది. దంపతులు నేరస్తులుగా మారుతున్నారు. జీవన భాగస్వామి నచ్చకపోతే చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింస ఎందుకు? నిపుణుల అభిప్రాయాలతో కథనం...ఆ ఫోను పాము అని ఆమె తెలుసుకోలేదు. ఆ ఫోన్ ఆమెకు ఎవరినో పరిచయం చేసింది. మరెవరికో దగ్గర చేసింది. ఆ ఫోన్ ఆమెను గంటలు గంటలు తనను తానే మర్చిపోయేలా చేసింది. ఇది శాశ్వతం చేసుకోవాలనుకుందామె. భర్త ఇందుకు ముల్లులా కనిపించడం మొదలు పెట్టాడు. నిజానికి వాళ్లిద్దరికీ గొడవలు లేవు. కాని కొత్త ఆకర్షణ వల్ల పాత బంధం విసుగు పుట్టిస్తోంది. ఆమె ఎవరినీ సలహా అడగలేదు. పర్యవసానాలు ఆలోచించలేదు. ప్రత్యామ్నాయాలు వెతకలేదు. చివరకిప్పుడు నిందితురాలిగా మిగిలింది.అతను ఆమెకు భార్యగా ఏ లోటూ రానివ్వలేదు. కాని అతనికి భార్యతోపాటు మరో బంధం కావాలనిపించింది. అయితే కొత్త బంధంలో ఉన్న ఆమెకు పాత బంధం తెంపుకుంటేగాని అభద్రత పోదు. భర్తకు పాత బంధాన్ని ఎలా తెంపుకోవాలో తెలియదు. ఆమెతో విడిపోవడంలో రిస్కు ఉందని ఆమెనే లేకుండా చేసి మరింత పెద్దరిస్కు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మూడుముళ్ల బంధం మూడు మూరల తాడుగా మారి ప్రాణాలు తీస్తోంది. పోలీసు గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో వైవాహికేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యలు పెరిగాయి. అయితే... చట్టం ముందు, సమాజం ముందు విడిపోయే దారులుండగా హింసను ఆశ్రయించే దుస్థితి ఎందుకొస్తోంది?వివాహేతర సంబంధం నేరమా?సుప్రీంకోర్టు 2018లోనే ఐ.పి.సి. 497 సెక్షన్ ను కొట్టేసింది. అంటే వివాహేతర సంబంధం ఇప్పుడు ‘నేరం’ కాదు. ‘సివిల్ తప్పిదం’ మాత్రమే. భార్య, భర్త విడాకులకు దీన్ని కారణంగా చూపొచ్చు, కానీ శిక్ష ఉండదు. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ‘చట్టం నన్నేమీ చేయదు’ అనే ధీమా ఒకవైపు, ‘నా పరువు పోయింది’ అనే కక్ష మరోవైపు ఈ రెండూ వివాహబంధాన్ని అడకత్తెరలో పెట్టాయి. విడిపోవాలనుకుంటే విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ వీటన్నింటికీ ఫ్యామిలీ కోర్టులున్నాయి. కానీ కోపం, పరువు, పగ ముందు బుర్ర ఇంకా చిన్నదై నేరాన్ని ప్రేరేపిస్తోంది.మూడో వ్యక్తి మాత్రమే కారణమా?వైవాహిక బంధాల్లో హత్యలకు ‘మూడో వ్యక్తి’ మాత్రమే కారణమై ఉండదు. వెతికి చూడాలే కాని, మూలాలు కనిపిస్తాయి.ఎ) సంభాషణ కరువు: మొబైల్ లో ఆరు గంటలు మాట్లాడే భార్యాభర్తలు ముఖాముఖి ఆరు నిమిషాలు మాట్లాడరు. దాంతో అపార్థాలు పేరుకుపోయి అగాధంగా మారుతున్నాయి. ఆ) ఆర్థిక అసమానతలు భార్య ఎక్కువ సంపాదిస్తున్నా, భర్త నిరుద్యోగిగా ఉన్నా ‘ఈగో’ దెబ్బ తిని బయట వ్యక్తి వైపు ఆకర్షణ పెరుగుతోంది. ఇ) సోషల్ మీడియా వల: రీల్స్లో కనిపించే ‘పర్ఫెక్ట్ కపుల్’ని చూసి, తమ బంధా న్ని చిన్నచూపు చూస్తున్నారు. కొత్త పరిచయాలు ఒక్క క్లిక్ దూరంలో దొరుకుతున్నాయి. ఈ) పరువు భయం: ‘విడాకులు తీసుకుంటే ఊరేమంటుందో’ అనే భయం, ‘చంపేస్తే పోలీసులే కదా’ అనే తెగింపుగా మారుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన.నేరమే శరణ్యమా? కానే కాదు. కోపంలో, ఆవేశంలో, కళ్లు కానరాని మోహంలో తీసుకునే నిర్ణయం జీవితాంతం జైలుగోడల మధ్య కుళ్లబెడుతుంది. దానికి బదులుగా మ్యూచువల్ కన్సెంట్తో ఆరునెలల్లో విడిపోవచ్చు. మోసం చేసిన భాగస్వామి నుంచి భరణం, పిల్లల బాధ్యత, ఆస్తిలో వాటా కోరే హక్కు చట్టం కల్పించింది. మానసిక, శారీరక హింస ఉంటే వెంటనే ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ప్రతి జిల్లా కోర్టులో ఉచిత కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒకసారి మాట్లాడితే 70 శాతం కేసులు కోర్టు దాకా రావు.సమాజం ఏం చేయాలి?ఇది కేవలం పోలీసు, కోర్టుల సమస్య కాదు. మనందరి సమస్య. అందువల్ల సమాజం మొత్తం కొన్ని మెరుగుదలలను చేసుకోవాలి. ∙పెళ్లికి ముందు కౌన్సెలింగ్ను తప్పనిసరి చేయాలి. పెళ్లి తర్వాత ‘సర్దుకుపో’ అని కాకుండా ‘మాట్లాడుకోండి’ అని నేర్పాలి ∙9వ తరగతి నుంచే ‘రిలేషన్ షిప్ ఎథిక్స్’, ‘లీగల్ లెసన్స్’ పాఠ్యాంశంగా పెట్టాలి ∙మీడియా సంచలనం కోసం ఇలాంటి హత్య వివరాలు రాయడం కంటే ‘హెల్ప్లైన్ నంబర్లు’, ‘ఉచిత న్యాయ సలహా’ నంబర్లు ప్రమోట్ చేయాలి ∙ప్రభుత్వం ప్రతి మండలంలో ‘కుటుంబ పరిష్కార కేంద్రం’ పెట్టి లాయర్, సైకాలజిస్ట్, పోలీస్ ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలి.బంధం నచ్చకపోతే. .. దంపతులు నేరస్తులుగా మారితే రేపు పిల్లలు జైల్లో ఉన్న తల్లిదండ్రులను సిగ్గుతో తలుచుకోవాలి. విడిపోవడానికి చట్టపరమైన దారి ఉందనీ, చంపితే కోర్టు ఉరిశిక్ష వేస్తుందనీ మర్చిపోవద్దు. బంధం నచ్చకపోతే తెంచుకోవాలి. హింసను ఆశ్రయించరాదు. ఎందుకంటే మోహం క్షణికం, శిక్ష జీవితకాలం. కుటుంబ న్యాయవ్యవస్థ ఉండాలివివాహేతర సంబంధాలలో జరిగే నేరాలకు ప్రధాన కారణాలు ఆవేశం, సామాజిక అపకీర్తి భయం, ఆర్థిక వివాదాలు... మన దేశంలో విడాకుల కేసులలో జరిగే ఆలస్యం, భావోద్వేగ నియంత్రణ లోపం, వివాహంపై ఉన్న సామాజిక ఒత్తిడి... ఇవన్నీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. నివారణకు వేగవంతమైన కుటుంబ న్యాయవ్యవస్థ, కౌన్సెలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక స్థైర్యం కలిగించటం ఎంత అవసరమో ముందస్తు ప్రణాళికతో చేసే హత్యలకు త్వరితగతిన కఠిన శిక్షలు అంతే అవసరం. విఫలమైన వివాహాన్ని అవమానంగా కాకుండా చట్టబద్ధంగా విడిపోవడాన్ని సమాజం సహజం గా అంగీకరించాలి. అలా చేస్తే చంపడం కంటే చట్టపరంగా విడిపోవటం సులభమని గ్రహిస్తారు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఆలోచనల్లో వైపరీత్యం వస్తుందివైవాహిక బంధాలలో పరస్పర గౌరవం, కమ్యూనికేషన్ లోపించినప్పుడు వ్యక్తులు ఎమోషనల్ సపోర్ట్ కోసం బయట వెతుకుతుంటారు. బంధంలోకి వెళతారు. అయితే ఆ వైవాహికేతర బంధం బయటపడుతుందనే తీవ్రమైన భయం, పరువు పోతుందనే ఆందోళన వారిలో తీవ్ర ఒత్తిడిని, క్యాట్ అండ్ మౌస్ మానసిక స్థితిని కలగజేస్తాయి. ముఖ్యంగా ఆలోచనా వైకల్యం చోటు చేసుకుంటుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని తొలగిస్తేనే తాము ప్రశాంతంగా జీవించగలమనే ఒక భ్రమ లేదా విపరీతమైన ఆలోచన మెదడులో స్థిరపడిపోతుంది. నేరం చేసిన తర్వాత దొరకకుండా తప్పించుకోవచ్చనే అతి నమ్మకం కూడా ఇందుకు కారణం. ఇవి తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభానికి సంకేతాలు. కుటుంబ వ్యవస్థలో కౌన్సిలింగ్, ఎమోషనల్ కంట్రోల్పై అవగాహన పెంచడం తక్షణ అవసరం. – విశేష్, సైకాలజిస్ట్పంచుకునేవారు లేకపోవడం వల్లే...వివాహేతర సంబంధాలను వయసుల వారీగా చూద్దాం... 25 నుంచి 35 సంవత్సరాల వయసువారు నచ్చకపోతే విడాకులకు వెళ్లిపోతున్నారు. అదే 35–45 మధ్యలో ఉన్నవారిలో పిల్లల బాధ్యతలు, ఖర్చులు ఎక్కువ కావడం వల్ల భర్త సంపాదనలో కూరుకుపోయి భార్యకు టైమ్ ఇవ్వలేడు. దాంతో గృహిణి మనసులో శూన్యం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరికి ఎవరైనా బయటి వ్యక్తి పరిచయం అవడం, పొగడటం, మానసికంగా దగ్గరవడంతో అటువైపు అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి కేసుల్లో కలిసి బతకాలనే ఆలోచనతో అడ్డుగా ఉన్నవారిని తొలగించుకోవాలనుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆనందించాల్సిన విషయాలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తే వివాహేతర సంబంధాలు అనే సమస్య ఉండదు. – డా.సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – కె. -
పాల ఉత్పత్తిని మరింత పెంచాలంటే..
జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం పురస్కరించుకుని భారత్ సాధించిన విజయాలతో పాటు మన ముందున్న ఒక పెద్ద సవాలును కూడా గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పాల కొరతతో ఇబ్బంది పడిన మన దేశం.. శ్వేత విప్లవం (వైట్ రెవల్యూషన్) సాధించిన అద్భుత విజయంతో ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా ఎదిగింది. అయితే ఇప్పుడు పాలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఆ డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోతే.. రాబోయే రోజుల్లో దేశ అవసరాలకు పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే మనం పశువుల సంఖ్యను పెంచడం కాదు, ప్రస్తుతం మన దగ్గర ఉన్న పశువుల నుండి పాల ఉత్పాదకతను (దిగుబడిని) పెంచడమే ఏకైక మార్గం. భారత్లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పశువులు ఉన్నాయి. కానీ ఒక్కో పశువు ఇచ్చే పాల దిగుబడి మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో పశువు నుండి సగటున రోజుకు 7.18 కిలోల పాలు లభిస్తుంటే, మన దేశంలో అది కేవలం 4.87 కిలోలుగా మాత్రమే ఉంది. ఈ పాల దిగుబడిని పెంచడానికి 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి.ఒకటి పశువులు పాలు ఇచ్చే దశలు, వాటి జాతి లక్షణాలు మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో మేత అందించడం (సైంటిఫిక్ ఫీడింగ్ ప్రాక్టీసెస్) చాలా అవసరం. ఇలా చేయడం వల్ల పాల దిగుబడి పెరగడమే కాకుండా పశువుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, రెండో మార్గం భారతదేశంలోని మొత్తం పశువులలో 73.5 శాతం ఇప్పటికీ మన దేశవాళీ రకాలే ఉన్నాయి. అయితే ఈ పశువుల జాతుల శాతాన్ని మార్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2012, 2019 సంవత్సరాల మధ్య కాలంలో విదేశీ, సంకరజాతి పశువుల సంఖ్య 25 శాతానికి పైగా పెరిగింది. దేశంలోని 56 మిలియన్ల రైతులకు చెందిన 92 మిలియన్ల పశువులకు లబ్ధి చేకూరుస్తున్న 'రాష్ట్రీయ గోకుల్ మిషన్' ఇప్పటివరకు 12.2 కోట్ల కృత్రిమ గర్భధారణలు చేసిన 'నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్' వంటి ప్రభుత్వ పథకాలు ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి.మూడోది, పశువుల ఆరోగ్య నియమాలను పాటించడం, పాలు పితికేటప్పుడు పరిశుభ్రతను పాటించడం, గాలి వెలుతురు బాగా వచ్చేలా పాకలను నిర్మించడం. డిజిటల్ సేవల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇవి పశువుల అసలు సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో పాల దిగుబడిని సాధించడంలో ఎంతగానో తోడ్పడతాయి.300 మిలియన్ టన్నుల మార్కును దాటడంస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశం సాధించిన డైరీ రంగాభివృద్ధిని ఒక గొప్ప విజయగాథగా అభివర్ణించవచ్చు. ప్రభుత్వ విధానాల మద్దతుతో జాతీయ సంకల్పం ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ విజయాన్ని మనం గతంలో ఒకసారి సాధించి చూపించాం. ఇప్పుడు మరోసారి సాధించలేకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఈసారి మన దేశ పాల ఉత్పత్తిని 300 మిలియన్ టన్నుల సరిహద్దు దాటించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం.క్యాప్టెన్ (డాక్టర్) ఎ.వై. రాజేంద్ర, సీఈఓ – యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్, గోద్రెజ్ ఆగ్రోవెట్(చదవండి: వరల్డ్లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్) -
వరల్డ్లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్
"ఏ చాయ్ చమక్కునే చూడరా భాయ్" అంటూ పొద్దుపొద్దున పొట్టలో టీ చుక్క పడాల్సింది చాలామందికి. అదీగాక కాసేపు చాయ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ..ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అంత ఘన చరిత్ర ఉంది భారత్లో చాయ్కి. అలాంటి టేస్టీ టేస్టీ టీల్లో మన భారతీయ మసాలాటీనే అత్యుత్తమ చాయ్గా అగ్రస్థానంలో దక్కించుకుంది. ప్రసిద్ధ అంతర్జాతీయ ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన వంద అత్యుత్తమ మసాలా చాయ్ జాబితాలో మన భారతీయ మసాలా టీనే తొలి స్థానం దక్కించుకుంది. భారత్లో టీ ఒక పానీయం మాత్రమే కాదు. అది ఒక ఆచారం, సంభాషణను ప్రారంభించేది, పనిమధ్యలో తీసుకునే విరామంలాంటిది, రైల్వేఫ్లాట్ఫామ్లపై తప్పనిసరిగా ఉండేది, కొన్నిసార్లు ఉచిత చికిత్సలా పనిచేస్తుంది. మన దేశంలో అంత ప్రాముఖ్యత సంతరించుకున్న మన చాయ్కే అత్యుత్తమైనదిగా ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ పట్టం గట్టడం విశేషం. అంతేగాదు భారతదేశం అద్భుతమైన టీని అందిస్తుందని కితాబు కూడా ఇచ్చేసింది. దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ టీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అవేంటంటే..మసాలా చాయ్ — 1వ స్థానండార్జిలింగ్ టీ — 6వ స్థానంఅస్సాం చాయ్ — 13వ స్థానంసులేమానీ చాయ్, కేరళ — 39వ స్థానంకాంగ్రా టీ, హిమాచల్ ప్రదేశ్ — 41వ స్థానంనూన్ చాయ్, జమ్మూ కాశ్మీర్ — 43వ స్థానంప్రపంచ టీ జాబితాలో కేవలం భారతీయ టీలదే ఆధిపత్యం కాదు. హోజిచా టీ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జపాన్కు చెందిన వేయించిన గ్రీన్ టీ. దీని వెనుకే శ్రీలంకకు చెందిన సిలోన్ బ్లాక్ టీ ఉంది. ఇది మృదువైన, అదే సమయంలో ఘాటైన బ్లాక్ టీ రకాలకు ప్రసిద్ధి చెందింది. తర్వాతి స్థానంలో సెంచా ఉంది, ఇది జపాన్కు చెందిన ఎంతో ఇష్టపడే గ్రీన్ టీ.ఐదవ స్థానంలో చైనాకు చెందిన పు ఎర్ ఉంది, దీనిని ఏజ్డ్ లేదా వింటేజ్ టీ అని కూడా పిలుస్తారు.(చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!) -
'ఒకే ఒక్కడు' సాధించిన ఘనత!
ఒక్క రోజుల్లో ఎంత పనిచేయగలం అంటే..సాధ్యమైనంత ఇంత మేరకు అని చెప్పగలం. అంతేగాని ఏళ్ల తరబడి కష్టపడితేగానీ..సాధ్యం కానీ పనిని ఒక్కరోజుల్లో చేయడం అంటే నో ఛాన్స్ అనేస్తాం. కానీ సుసాధ్యమే అంటున్నాడు ఈ వ్యక్తి. ఏకంగా ఒక్కరోజులో వేలకొద్ది మడ చెట్లను నాటి యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. అతడెవరంటే..ఆ అనితర సాధ్యమైన ఘనతను సాధించిన 'ఒకే ఒక్కడు' కెన్యాకు చెందిన పర్యావరణ కార్యకర్త ఆంటోయిన్ మోసెస్. ఆయన కేవలం 24 గంటల్లో 47,460 మడ చెట్లను నాటి అరుదైన ఘనత సృష్టించాడు. కెన్యాలో ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న అడవుల పునరుద్ధరణ ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఆయన కెన్యా తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున మడ చెట్లను నాటినట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఇంత వేగవంతంగా ఇంత కచ్చితత్వంతో చేయడం నిజంగా ప్రశంసనీయం.ఎవరీ ఆంటోయిన్ మోసెస్?ఈ అరుదైన ఘనత కారణంగా ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రపంచంలో ఆయన పేరు హాట్టాపిక్గా మారింది. ఆయన ఒక ప్రొఫెషనల్ ట్రీ ప్లాంటర్ కమ్ అల్ట్రా-మారథాన్ రన్నర్. భూతాపాన్ని తగ్గించేలా పచ్చదనంతో కళకళలాడేలా చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఆంటోయిన్. అంతేగాదు ఆయన రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అయితే ఇది కేవలం వ్యక్తిగత శ్రమను మాత్రమే కాకుండా, జట్టుకృషి, నాయకత్వం, వ్యవస్థీకరణను ప్రతిబింబిస్తోంది. నాటిన ఈ చెట్ల సంఖ్య కంటే అవి పెరగడం వల్ల అంతకుమించిన ప్రభావం ఉంటుందంటున్నారు ఆంటోయిన్. అంతేగాదు కొత్తగా పెరిగిన ఈ మడ అడవులు తీరప్రాంతాల స్థితిస్థాపకతను పెంచడం తోపాటు సముద్ర జీవ ఆవాసాలను, జీవవైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు ఆంటోయిన్.మడ చెట్లు ఎందుకంటే..మడ అడవులు కీలకమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి. అవి తుఫానుల వల్ల తీర కోతను మరియు తీరప్రాంత ఆస్తులకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్ను కూడా అధికంగా గ్రహిస్తాయి.వాటిని అత్యుత్తమ సహజ కార్బన్ సింక్లలో ఒకటిగా పరిగణిస్తారు. కెన్యా వంటి ప్రాంతాలలో మత్స్య సంపదకు, జీవవైవిధ్యానికి మడ అడవులు చాలా ముఖ్యమైనవి. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యానికి,తీరప్రాంత సంరక్షణకు ఇవి అత్యంత కీలకమైనవి.Most mangrove trees planted by an individual in 24 hours 🌳 47,460 by Antoine Moses 🇨🇦 in Mombasa, Kenya, on 30 April 2026 @antomosplant pic.twitter.com/7fJeIosE7H— Guinness World Records (@GWR) May 27, 2026(చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టంట్స్’ కొత్త ఫీచర్ మీకోసం!
ఫొటో–షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ‘ఇన్స్టంట్స్’ అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ‘ఆ క్షణంలో తీసిన ఫొటోలను, ఫిల్టర్ చేయని, సహజమైన ఫొటోల రూపంలో స్నేహితులతో షేర్ చేసుకోవడానికి కొత్త మార్గం’ అని ‘ఇన్స్టంట్స్’ గురించి అభివర్ణించింది ఇన్స్టాగ్రామ్. యాప్ ఇన్బాక్స్ ద్వారా నేరుగా తాత్కాలిక ఫొటోలను పంపడానికి యూజర్లను ఈ ఫీచర్ అనుమతిస్తుంది.సాధారణ, రోజువారీ ఫొటోలు మీ స్నేహితులు చూడడానికి ఇది ఒక కొత్త మార్గం. వారు చూసిన తరువాత ఫొటోలు మాయమైపోతాయి. ఇన్స్టంట్స్ మీ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ బాటమ్ రైట్ కార్నర్లో ఉంటుంది. కెమెరాపై టాప్ చేయడం ద్వారా ఫ్రెండ్స్, మ్యూచువల్స్ (మీరు ఫాలో అయ్యే ఫాలోవర్స్) ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. ‘ఇన్స్టంట్స్’ని నచ్చిన వారితో పాటు నచ్చనివారు కూడా ఉన్నారు.నచ్చకపోతే... ‘ఇన్స్టంట్స్’ను టర్న్ ఆఫ్ చేయడానికి...ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్స్లోకి వెళ్లాలి.టాప్ రైట్ కార్నర్లోని 3 లైన్స్పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్’ ఓపెన్ చేయాలి.కంటెంట్ ప్రిఫరెన్సెస్–స్క్రోల్ డౌన్‘హైడ్ ఇన్స్టంట్స్ ఇన్ ఇన్బాక్స్’ ఆప్షన్ కనిపిస్తుంది.‘హైడ్ ఇన్స్టంట్స్ ఇన్ బాక్స్’ టర్న్ ఆఫ్ చేయడం ద్వారా ఇన్బాక్స్ నుంచి ఇన్స్టంట్స్ తొలగించవచ్చు.ఇన్స్టాగ్రామ్ క్యారెసెల్..ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ని తీసుకువచ్చింది. దీని ద్వారా క్యారెసెల్స్ క్రియేట్ చేయవచ్చు. వాటికి మ్యూజిక్ యాడ్ చేయవచ్చు. ఇమేజ్ ఎడిట్ చేయవచ్చు. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఈ కొత్త ఫీచర్ ‘ఫీడ్’ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది.ఎలా చేయాలంటే...ఇన్స్టాగ్రామ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లోని ‘ప్లస్’ ఐకాన్ క్లిక్ చేయాలి.‘పోస్ట్’పై క్లిక్ చేయాలి.మినిమమ్ రెండు పిక్చర్లను సెలెక్ట్ చేసుకోవాలి.క్లిక్ నెక్స్›్టమల్టిపుల్ ఎడిటింగ్ టూల్స్ కనిపిస్తాయి.మీ చిత్రాలు నిలువుగా (పోర్ట్రెయిట్) చతురస్రాకారంలో ఉండడానికి అవసరమైన టూల్స్ ఎంచుకోవచ్చు. ఫొటోలను ఓవర్లే చేయవచ్చు. టెక్ట్స్, మ్యూజిక్ జోడించవచ్చు. ఎడిటింగ్ పూర్తయ్యాక... ‘నెక్ట్స్’పై క్లిక్ చేసి ఫొటోలను పోస్ట్ చేయడానికి ‘షేర్’పై క్లిక్ చేయాలి. -
కాలేయం ఆరోగ్యం కోసం..!
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య అధికమైంది. ఆల్కహాల్ తాగకపోయినా ఈ సమస్య బారినపడుతున్నారు చాలామంది. అసలు కాలేయం అనారోగ్యం బారిన పడకూడదంటే జీవనశైలిలో ఈ మార్పలు చోటుచేసుకుంటే చాలు అని చెబుతున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ. సమతుల్య ఆహారం, రోజూవారీ వ్యాయామంతో ఈ సమస్యకు చెక్కుపెట్టొచ్చని అంటున్నారు. జస్ట్ ఒక అరగంట వ్యాయామాలు, మంచి ఆహారంతోనే కాలేయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చిన చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.ముందుగా కాలేయంపై భారాన్ని తగ్గించడని విజ్ఞప్తి చేస్తున్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనవసరమైన పెయిన్ కిల్లర్ మందులు అతిగా వాడటం, దీర్ఘకాలిక ఒత్తిడి, సరిగా నిద్రపోవకపోవడం వంటి వాటితో కాలేయంపై అతిగా భారాన్ని మోపొద్దు అంటున్నారు. అంటే సమయానికి భోజనం, నిద్ర ఉండేలా కేర్ తీసుకుంటూ ఆరోగ్యకరమైన పోషకవంతమైన ఆహారాలను తినమని సూచిస్తున్నారు. తీసుకోవాల్సినవి..కాలేయం ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందించి హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది.మిల్క్ థిస్టిల్: అనేది శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్న ఒక పురాతన మూలిక. దీనిలో ఉండే 'సిలిమరిన్' అనే క్రియాశీలక సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి (Liver health) అత్యంత మేలు. ఇది లివర్ వాపును తగ్గించి, విషతుల్య పదార్థాలను బయటకు పంపి కణాలను పునరుద్ధరిస్తుంది. హెపటైటిస్, కామెర్లు వంటి సమస్యల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలను తగ్గించి, ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుందినిమ్మకాయ పరోక్షంగా డిటాక్స్కు మద్దతు ఇస్తుంది. ఇది విటమిన్ సిని అందిస్తుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రక్షణకు సహాయపడుతుంది మరియు గ్లూటాథియోన్ రీసైక్లింగ్కు మద్దతు ఇస్తుంది. నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి తగినంత నీటిని అందిస్తుంది, ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వ్యర్థాల విసర్జన అనేది పైత్యరస ప్రవాహం, మూత్ర విసర్జన మరియు జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది.క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం: దీనిలో గ్లూకోసినోలేట్లు ఉంటాయి, ఇవి సల్ఫోరాఫేన్ సంబంధిత సమ్మేళనాలుగా మారగలవు. ఇవి ఫేజ్ 2 డిటాక్స్ ఎంజైమ్ చర్యకు, యాంటీఆక్సిడెంట్ ప్రతిస్పందన మార్గాలకు మద్దతు ఇస్తాయి.క్రూసిఫెరస్ కూరగాలు అంటే..బ్రోకలీక్యాబేజీకాలీఫ్లవర్ముల్లంగిపాలకూర (కాలే)బోక్ చోయ్ఔషధాల పరంగా: గ్లూటాథయాన్ అండ్ బి విటమిన్లు ఫ్యాటీ లివర్ ఫేజ్ 2కు కీలకమైన సాధనాలు. గ్లూటాథయాన్ రియాక్టివ్ సమ్మేళనాలను బంధించి, తటస్థీకరించడంలో సహాయపడుతుంది. బి విటమిన్లు మిథైలేషన్, శక్తి జీవక్రియ డిటాక్స్ మార్గాలకు మద్దతు ఇస్తాయి.వీటితోపాటు ప్రోటీన్, గ్లైసిన్, సిస్టీన్, ఫోలేట్, బి12, బి6, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృఫ్టి పెట్టాలి.వెల్లుల్లి సల్ఫర్ సమ్మేళనాలను అందిస్తుంది, ఇవి డిటాక్స్ కెమిస్ట్రీకి, యాంటీఆక్సిడెంట్ రక్షణకు మద్దతు ఇస్తాయి. ఇది హృదయ సంబంధ, రోగనిరోధక మార్గాలకు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో మార్పులు చేర్పులు చేసుకుంటే..మంచి ఆరోగ్యం సులభంగా సొంతం చేసుకోవచ్చిన అంటున్నారు. మరిన్ని వివరాలకు ఈ కింది లింక్పై క్లిక్ చేయండి (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
పూజా సక్సేనా: జ్ఞాపకాల దారుల్లో...!
నగరాల్లోని వీధుల్లో నడవడం అనేది కళాత్మక ప్రయాణం కూడా! షాపులపై రంగు రంగుల అందమైన బోర్డులు కనిపిస్తాయి. రంగు వెలిసిన బోర్డులు కూడా కొత్త అందంతో వెలిగిపోతుంటాయి. ఈ అందాలకు పుస్తక రూపం ఇచ్చింది పూజా సక్సేనా.దిల్లీ, బెంగళూరు, కోల్కతాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల్లోని మూడు వందల సైన్బోర్డ్లపై ఫొటోబుక్ తీసుకువచ్చింది పూజ.దిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుతున్న రోజుల నుంచి పూజకు సైన్బోర్డ్లపై ఉన్న అందమైన అక్షరాలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను డిజైన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టేలా చేసింది. యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్లో టైప్ఫేస్ డిజైన్ను స్టడీ చేసింది.ఈ ఫొటోబుక్లో దిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. మండీ హౌజ్లోని శ్రీరామ్ సెంటర్ నుండి పహర్గంజ్లోని ఇంపీరియల్ సినిమా థియేటర్ వరకు సైన్బోర్డ్లపై ఎన్నో భాషలలో అందమైన, అద్భుతమైన అక్షర శైలులు!దురదృష్టమేమిటంటే... దిల్లీలో కనువిందు చేసే అలనాటి సైన్బోర్డ్లు క్రమంగా మాయమవుతున్నాయి.సైన్బోర్ట్ల కోసం వీధులు చుట్టి రావడమే కాదు పాత ఆర్కైవ్స్ నుంచి ఫొటోలను సేకరించడం ప్రారంభించింది పూజ. ఆ ఫొటోలలో అలనాటి అందమైన సైన్బోర్ట్లు ఎన్నో కనిపిస్తాయి.ఫ్యూచర్ డాక్యుమెంటేషన్లో భాగంగా భువనేశ్వర్, సౌత్ గోవా, కోయంబత్తూరు, మీరట్... లాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటోంది పూజా సక్సెనా. -
ఆకాశంలో ఒక పెద్ద కుటుంబం!
సూర్యుడు... సౌరకుటుంబంలో ఇంటికి పెద్దవాడు సూర్యుడు. మన ఇంటికి నాన్న ఎలాగో అలా. సూర్యుడి చుట్టూ తిరిగే పిల్లల్లాంటి గ్రహాలే మన ప్లానెట్స్. సూర్యుడు వెలుగు, వేడి ఇస్తాడు. ‘టైమ్కు లేవండి!’ అని చెప్పే నాన్నలా ఉంటాడు. అందరూ అతని చుట్టూ తిరుగుతుంటారు.బుధుడు...ఇంటి చిన్న తమ్ముడు ఎలా వేగంగా పరుగెడతాడో బుధుడు కూడా అలానే!. సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు. ‘నేనే ఫస్ట్!’ అనేలా ఉంటాడు. పగలు వేడిగా... రాత్రిళ్లు చల్లగా చిన్నపిల్లల మూడ్స్ మార్చుకున్నట్టే ఉంటాడన్నమాట.శుక్రుడు...స్టైల్ క్వీన్గా పిలిచే ఈ గ్రహం ఆకాశంలో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ‘నేను చాలా అందంగా ఉంటాను!’ అనుకునే అక్కలా ఉంటుందన్నమాట. మబ్బులతో ఫుల్ మేకప్ వేసుకున్నట్టుంటుంది. బయటకి వైబ్రెంట్గా కనిపిస్తూ, లోపల హాట్ హాట్గా ఉంటుంది. భూమి...అమ్మ ప్రేమలా ఉంటుంది. మనందరం ఉండేది భూమిపైనే కదా! గిరగిరా తిరుగుతుంది ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి పెట్టే అమ్మలా. కానీ, మనల్ని ఎక్కడా పడేయదు. జాగ్రత్తగా అందరికీ నీళ్లు, గాలి, ఆహారం ఇస్తుంది. చెట్లు, పక్షులు, మనుషులు.. అందరికీ ఇల్లు భూమే. అందుకే భూమి అంటే ప్రేమతో నిండిన ఇల్లు అన్నమాట.అంగారకుడు...ఎర్రగా కనిపించే గ్రహం. నా జోలికి ఎవరైనా వచ్చారా.. అంతే! అన్నట్టుగా ఉంటాడు. లోపల అంతా ఎడారిలా ΄÷డిగా ఉంటుంది. భవిష్యత్తులో మనుషులు అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రఫ్గా కనిపించినా ఇంట్రెస్టింగ్ గ్రహం.గురుడు...ఇంటిలో పెద్దన్న అమ్మకు, నాన్నకు, తమ్ముడు, చెల్లెలికి సపోర్ట్గా ఎలా ఉంటాడో అలా ఉంటాడు. సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం. పెద్ద అన్నలా అందరినీ కా΄ాడుతాడు. ‘నేను బిగ్ బాస్!’ అన్నట్టుంటాడు. చాలా పెద్దవాడు కానీ గ్యాస్ నింపిన పెద్ద బెలూన్లా కనిపిస్తాడు.శని...శాటర్న్గా పిలిచే ఈ గ్రహం చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫ్యాషన్ అంటే ఇష్టం ఉన్న తాతయ్యలా ఉంటాడు. శని చుట్టూ ఉన్న రింగ్స్ చూసారా? ఐస్, రాళ్లతో ఆ రింగ్స్ ఏర్పడ్డాయట. ఆకాశంలో ఫ్యాషన్ స్టార్ అంటే శనిగ్రహమే.ఇంకా యూరేనస్, నెఫ్ట్యూన్ వంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ, అవి దూరపు బంధువుల్లాంటివి. ఎప్పుడో వాళ్ల వాళ్ల గురించి ఇంట్లోవాళ్లు చెబుతుంటే వింటుంటాం. ఆకాశంలో మనలాగే ఒకరు కోపంగా, ఒకరు వేగంగా, ఒకరు ప్రేమగా, ఒకరు బ్రైట్గా, ఒక పెద్దగా, ఒకరు చాలా చిన్నగా... ఇలా విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఎవరికి వాళ్లే అత్యంత ప్రత్యేకం. కానీ, అందరూ కలిసి ఉండటం వల్ల ఒక కుటుంబంగా స్పెషల్గా నిలిచిపోయారు అని చెప్పవచ్చు. ఈ విధానం వల్ల పిల్లలు రిలేషన్స్ గురించి, మనలోని భావోద్వేగాల గురించి, విభిన్న వ్యక్తుల గురించి అర్థం చేసుకుంటారు. వారి సృజనాత్మకతకు పని చెబుతారు. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
‘ఓపెన్’గా మాట్లాడితే!
ఆ బ్యాంక్ పేరు... భద్రం బీకేర్ఫుల్ బ్రదర్. ఒకరోజు ఆ బ్యాంకులో సేఫ్టీలాకర్ ఎంతకీ ఓపెన్ కావడం లేదు. నగరంలో పేరున్న మెకానిక్లను పిలిపించారు. నో... ఫలితమ్. ‘సేఫ్టీ లాకర్ను సేఫ్గా ఓపెన్ చేయడం ఎలా?’ అని యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసి ట్రై చేశారు. నో.... ఫలితమ్. ‘ఇలా కాదుగానీ అతడిని పిలిపించాల్సిందే’ అన్నాడు బ్యాంకులో సీనియర్ ఉద్యోగి శీనయ్య పటేల్. ‘ఎవరు అతడు?’ అని అడిగాడు కొత్త మేనేజర్.‘అతడి పేరు... ఓపెనర్ కుమార్ (ఓ.కె) అసలు పేరేమిటో తెలియదు కానీ అందరూ ఓ.కే అని పిలుస్తారు’ అని చెప్పాడు శీనయ్య. మారుమూల పల్లెటూరులో ఉండే ఓ.కే.ను పిలిపించారు. సేఫ్ లాకర్ను ఓ.కె. అవలీలగా ఓపెన్ చేశాడు. ఆనందం తట్టుకోలేక అందరూ చప్పట్లు కొట్టారు. ‘నీది మామూలు టాలెంట్ కాదు తమ్ముడూ! ఇదిగో పదివేలు...గిఫ్ట్గా ఇస్తున్నాను’ అని ఆప్యాయంగా ఓ.కె భుజం తట్టాడు మేనేజర్. అంతే...ఓ.కే.లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అతడి కళ్లలో అగ్నిపర్వతాలు ఢమాల్, ఢమాల్ అని రెండుసార్లు పేలాయి. వీరావేశంతో బ్యాంక్ మేనేజర్ను మ«ధ్యయుగాల నాటి కిరాతకమైన తిట్లు తిట్టడం ప్రారంభించాడు.ఆ తరువాత ఇలా అన్నాడు: ‘................ ....... ......... .............. ......... ............ ........’ ‘విక్రమార్కా.... ఆ బ్యాంక్ మేనేజర్ ఓ.కే.ను పల్లెత్తు మాట అనలేదు. పైగా ప్రశంసించాడు. అంతేకాదు, గిఫ్ట్క్యాష్ ఇవ్వబోయాడు. మరి అతడిని పట్టుకొని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టడమేమిటి? ఇంతకీ ఓ.కె. కోపానికి కారణం ఏమిటి? పనిలో పనిగా పై ఖాళీని పూరించు. ఓ..కె ఏమన్నాడో చెప్పు. చెప్పకపోయావో...’ అని ఎప్పటిలాగే హెచ్చరించాడు భేతాళుడు. ‘పై ఖాళీలో ఓ.కె. చెప్పిన డైలాగ్ చెబుతాను. అందులోనే నీకు సమాధానం దొరుకుతుంది’‘అలాగే చెప్పు’ అన్నాడు భేతాళుడు.సీన్ రీకన్స్ట్రక్షన్‘ఏమయ్యా బ్యాంకు మేనేజర్, నేను ఇంట్లో సుఖంగా ఉండడం, హాయిగా ఇంటి భోజనం చేయడం నీకు నచ్చడం లేదా! మళ్లీ ఆ జైల్లో చిప్పకూడు తినాలా? ఈ డబ్బులకు ఆశపడే కదయ్యా చిప్పకూడు తిన్నాను. గతంలో ఒకసారి సేఫ్ లాకర్ ఓపెన్ చేసినందుకే చా...లా సంవత్సరాలు జైల్లో ఉండి చచ్చాను’ ఆవేశంగా, ఆవేదనగా, ఆందోళనగా అన్నాడు ఓ.కె.‘మరి అప్పుడు నిన్ను ఏ బ్యాంక్ వాళ్లు పిలిచారు?’ అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి. ‘ఎవరూ పిలవలేదు. ఒక అర్ధరాత్రి నేనే సరదాగా వచ్చాను. పోలీసులకు దొరికిపోయాను’ అసలు విషయం చెప్పాడు ఓ.కె. ఎలియాస్ ఓపెనర్ కుమార్.–యాకుబ్ పాషా -
పరుగు ఆపితే... మెరుగైన లైఫ్!
బ్రష్... ఫోన్... టిఫిన్.. ట్రాఫిక్... మీటింగ్... జొమాటో... నెట్ఫ్లిక్స్... నిద్ర...మధ్యలో మనిషి ఎక్కడ? ప్రఖ్యాత పర్యావరణవేత్త వందన శివ అదే అడుగుతున్నారు...‘ఈ స్పీడ్లో పడి బతకడాన్నిమర్చిపోతున్నారా?’ వందనా శివ తాజా పుస్తకం ‘స్లో లివింగ్’ నవీన జీవన సూత్రాన్ని బోధిస్తోంది.పరుగు తగ్గించమని, భూమికి మేలు చేయమని హితవు చెప్తోంది.‘ఆగండి. ఊపిరి పీల్చుకోండి. మీరు మిషన్ కాదు, మనిషి’ అంటున్నారు వందనా శివ. పర్యావరణ యోధురాలుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వందనా శివ తన స్నేహితురాలు, పీస్ ఎడ్యుకేటర్ శ్రేయ జానీతో కలిసి రాసిన పుస్తకం ‘స్లో లివింగ్: వాట్ యూ కెన్ డూ అబౌట్ క్లయిమేట్ ఛేంజ్’ తాజాగా విడుదలై ఆలోచనలు రేకెత్తిస్తోంది. ‘నేటి మనిషి నిరంతర పరుగులో జీవన ఆనందాన్ని కోల్పోతున్నాడు. భూమిని ప్రమాదంలో నెడుతున్నాడు. నేటి మనిషి అన్నీ తొందరగా జరిగిపోవాలనుకుంటున్నాడు. అందుకే ఫాస్ట్ఫుడ్ తిని పొట్ట పాడు చేసుకుంటున్నారు. ఫాస్ట్ లైఫ్తో మనసు పాడు చేసుకుంటున్నారు. నిద్ర లేదు, నవ్వులేదు, నాన్నతో మాట్లాడే టైమ్ లేదు, అమ్మ చేతి ముద్ద రుచి తెలియదు, చివరికి సంపాదించింది హాస్పిటల్ బిల్లులకి సరిపోతుంది. అందుకే నెమ్మదిగా బతకండి. దాని వల్ల భూమి కూడా ప్రాణం పోసుకుంటుంది’.... అనే సారం అందజేస్తోంది ‘స్లో లివింగ్’ పుస్తకం. 73 ఏళ్ల వందనా శివ మనిషినీ, భూమినీ కాపాడుకోవడానికి ‘స్లో లివింగ్’ను ప్రతిపాదిస్తున్నారు.మనిషి స్పీడ్ వల్ల ఏమైంది?ఐ.ఎం.డి.లెక్కల ప్రకారం 2026లో హీట్ వేవ్స్కి వందల మంది చనిపోయారు. వానలు రావడం లేదు. కారణం? మన ఫాస్ట్ లైఫ్. ఎక్కువ కొనడం, ఎక్కువ పడేయడం, ఎక్కువ కాలుష్యం సృష్టించడం. ఫ్యాక్టరీలు నీళ్లని పాడు చేస్తున్నాయి. పండించే తిండిలో ముప్పై శాతం వేస్ట్ చేస్తున్నాం. అది ఎనిమిది శాతం గ్లోబల్ ఎమిషన్స్ కి కారణమవుతోంది. ప్రతి దానికీ ప్లాస్టిక్ వాడటం వల్ల 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. వన్యమృగాల ఆవాసాలను నాశనం చేయడం వల్ల గత యాభై ఏళ్లలో 300 కొత్త వ్యాధికారక క్రిములు వచ్చాయి. రెడీమేడ్ దుమారంలో ఉత్పత్తిదారులు బట్టలను వాడి పారేసేవిగా తయారు చేస్తూ రీసైక్లింగ్ వీలుగాని దిబ్బలను రాసి పోస్తున్నారు. అందుకే వందన శివ ‘ఆగు’ అంటున్నారు. ‘నెమ్మదించడం అంటే వెనక్కి వెళ్లడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం’ అంటున్నారు. ‘ఫాస్ట్ లివింగ్ ఎంత చేయగలవు అని నిలదీస్తుంది. స్లో లివింగ్ మరింతకాలం నిలబడేలా సాయం చేస్తుంది’ అంటారామె.ఇది శ్రీమంతులకే పాఠమా?మధ్యతరగతికి సవాలక్ష బాదరబందీలు. రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తే తప్ప నాలుగువేళ్లు నోట్లోకెళ్లవు. ఇలాంటప్పుడు ‘స్లో లివింగ్’ సాధ్యమా? ఇది శ్రీమంతులకైతే సరేగాని అనుకోవచ్చు. కాని వందన శివ ‘స్లో లివింగ్’ అందరికీ అంటున్నారు. మధ్యతరగతికి స్లో లివింగ్ అంటే ఏమిటో చెప్తున్నారు.→ ఇంట్లో కూరగాయల తొక్కు చెత్తలో వేయకుండా మొక్కకి వేయడం → వారానికి ఒకసారి కారు కాకుండా సైకిల్ తొక్కడం → ప్లాస్టిక్ కవర్ బదులు గుడ్డ సంచి పట్టుకెళ్లడం → యాప్ తిండి మాని అమ్మ చేతి వంట తినడం → పండగలకి, ఫంక్షన్లకి మాత్రమే కొత్త బట్టలు కొనడం. మిగతా టైం ఉన్నవి ఆల్టర్ చేయించుకోవడం... ‘మిక్స్ అండ్ మ్యాచ్’ అంటే అమ్మచీరకి కొత్త బ్లౌజ్ కుట్టించుకోవడం. ఇవి చేయడానికి కోటీశ్వరుడు అవ్వక్కర్లేదు. కావాల్సింది ఒక్కటే – ఓపిక.మాల్స్, మార్ట్ల నుంచి బయటపడండివీధి చివర పచారి కొట్టుకు వెళితే ‘పద్దు’ ఇచ్చి ‘ఇవి చాలు’ అంటాం. అదే మార్ట్కు వెళితే కనపడినవి అన్నీ బుట్టలో వేస్తాం. దీనిని ‘స్లో లివింగ్’ పుస్తకం కోరైటర్ శ్రేయ జానీ ‘కలోనియల్ జాయ్’ అంటారు. వలస పాలనలో మనం కొనడంలో ఆనందం వెతుక్కున్నాం. అదే అలవాటైంది. అది ‘కలోనియల్ జాయ్’. ఆ కృత్రిమ ఆనందం నుంచి అసలైన ఆనందంలోకి రావాలి. ‘డీకలోనియల్ జాయ్’ పొందాలి. స్థానిక ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, స్థానిక మనుషుల అనుబంధాలు... వీటిలోనే ఆనందం ఉందని తెలుసుకోవాలి. ఏసీ రూంలో కూర్చుని నెట్ఫ్లిక్స్ చూసినా రాని హాయి మొదటి వాన చినుకు అరచేతిలో పడితే వస్తుందని తెలుసుకోగలగాలి. అదే స్లో లివింగ్.పెద్దలు చెప్పినా పుస్తకం చెప్పినా హెచ్చరిక ఒకటే... ‘అతి వేగం చంపుతుంది. నెమ్మది బతికిస్తుంది’.... మనల్నే కాదు. భూమిని కూడా. స్లో లివింగ్ అంటే?స్లో లివింగ్ను వందనా శివ ఇలా నిర్వచిస్తున్నారు. → తినే తిండి ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవాలి. ΄్యాకెట్ చూసి కొనడం కాదు, పొలం చూసి కొనాలి. రైతు దగ్గర కొనాలి. → అనవసరంగా ఏదీ కావాలనుకోకూడదు. కొనే ప్రతి వస్తువు అవసరమా కాదా అని 10 సెకన్లు ఆలోచించాలి. → ‘ఫాస్ట్ ఫ్యాషన్ ’ అంటే నాలుగుసార్లు వాడి పడేసే బట్టలు కొనకూడదు. ‘స్లో ఫ్యాషన్ ’ ఫాలో కావాలి. అంటే అమ్మమ్మలా ఒక నాణ్యమైన చీరను 20 ఏళ్లు కట్టుకోవడం. → భూమిని గౌరవించాలి. చెట్టు నరకడం కాదు, చెట్టు నాటాలి. నీళ్లని వృథా చేయడం కాదు, ఒడిసి పట్టాలి. → మనతో మనం గడపాలి. ఫోన్ లేకుండా రోజైనా ఒక గంటైనా మనతో మనం గడపడం. కుటుంబంతో మాట్లాడాలి. ఆకాశం ఒకటుందని గుర్తు చేసుకుని దాని వైపు చూడాలి. – కె. -
ఆవకాయ పచ్చడిని వేరుశెనగ నూనెతో పెట్టడానికి రీజన్ ఇదే!
భారతదేశంలో వేసవికాలం అంటేనే నోరూరించే ఆవకాయ పట్టే కాలం. పచ్చి మామిడికాయల ఘాటైన పుల్లదనం, తాజాగా దంచిన మసాలాల సహజమైన తీక్షణత, ఆ మిశ్రమంపై పోసే వేడి నూనె స్పష్టమైన, గాఢమైన సువాసన మనందరి పాకశాస్త్ర జ్ఞాపకాలను నిర్వచిస్తాయి. తరతరాలుగా, సాంప్రదాయ రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఊరగాయ రహస్యం పూర్తిగా నూనె ఎంపికలోనే ఉందని అమ్మమ్మలు చెబుతుంటారు. సున్నితమైన గింజల రుచితో కూడిన వేరుశెనగ నూనె ఒక వైవిధ్యమైన పాకశాస్త్ర విజేత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శక్తివంతమైనది. పైగా వంటకాలకు మరింత రుచిని అందించేది. ఇక్కడ వేరుశెనగ నూనె సహజ నిల్వకారిగా, రుచిని పెంచేదిగా పనిచేస్తుంది. ఇది తేలికపాటి సువాసనను, సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగివుంటుంది. దాంతో ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. దీన్ని గాలి చొరబడని విధంగా మూత వేసి ఉంచితే..బూజు పట్టకుండా, పాడవకుండా నివారిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో మామిడి కాలంలో, సాంప్రదాయ ‘అమ్మమ్మ’ వంటకాలతో ఊరగాయ తయారు చేయడం ఒక ఆచారం. ఇది కుటుంబాలను ఒకచోట చేర్చి, ఆ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేసి, పాత జ్ఞాపకాలలో మునిగిపోయేలా చేస్తుంది. సాంప్రదాయ తెలుగు/కన్నడ కుటుంబాలలో ఊరగాయ తయారీ అనుభవం గురించి జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్పి. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఫ్రీడమ్ డబుల్ ఫిల్టర్డ్ వేరుశెనగ నూనెను జాగ్రత్తగా ఎంపిక చేసిన వేరుశెనగల నుంచి తీసి, రెండుసార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక నాణ్యత గల, శుద్ధి చేసిన నూనెను ఎంచుకోవడం ద్వారా, భారతీయ నిల్వ పద్ధతుల ప్రాచీన జ్ఞానాన్ని గౌరవిస్తూనే, మీ కుటుంబానికి స్వచ్ఛమైన, పోషకాలు అధికంగా ఉన్న, గాఢమైన సువాసనతో కూడిన వేసవి మధుర జ్ఞాపకాలను అందివ్వగలరని అంటున్నారు. (చదవండి: 60 ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..) -
60 ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..
పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్ తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్లాస్ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్ తల్లి సైతం జిమ్కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. అలాగే కంటెంట్ క్రియేటర్ హరీష్ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేశారు. ఆమె ఫిట్నెస్ చర్యలో భాగంగా డెడ్లిఫ్ట్లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.పెద్దలకు మంచిదేనా..?60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by HotFix | Harish Thakur (@itshotfix) (చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్) -
కుమార్తెలకు గ్రాండ్గా పెళ్లి చేయడం 'గిప్ట్' కాదు..!
మధ్యప్రదేశ్లోని భోపాల్లోట్విషా శర్మ ఉదంతం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసు రోజుకో మలుపుతిగరుతూ చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసు వాదోపవాదనలు విచారిస్తూ..అసలు వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకుని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతి తల్లిదండ్రుల తీరుకు చెంపెట్టులా ఉండటం విశేషం. అలాగే మానసిక నిపుణులు సైతం కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాలని హితవు పలుకుతున్నారు. కష్టపడి చదివించి పాతికేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి అనే రెండక్షరాలకు బలి అవ్వకాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి వంటి వాటి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ప్రతి పేరెంట్ తమ కుమార్తెలకు అంగరంగ వైభవంగా పెళ్లిచేయడం గొప్ప బహుమతి కాదని అంటున్నారు. వివాహం తనను ఊపిరాడనివ్వని పరిస్థితుల్లోకి నెట్టేస్తే..ధైర్యంగా బయటకొచ్చి నిలబడేలా ఉండాలి, అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని అంటున్నారు. వరకట్నం మరణాలను నివారించాలంటే పేరెంట్స్ని తమ కుమార్తెలను జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులకు ఆమెను సిద్ధం చేసేలా ట్రైన్ చేయాలి. సాంప్రదాయకంగా పెళ్లి చేయడం కంటే..ఆమెకు ఈ వైవాహిక బంధం రక్షణ, స్వేచ్ఛను ఇవ్వగలదా చూడాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలకు ముందుకు మానసిక ధైర్యం, ఆర్ధిక స్వేచ్ఛ వంటివి నేర్పించాలి. ఇక వివాహానికి పునాది త్యాగం కాదు, భద్రతే ముఖ్యం అని గ్రహించాలి. అలాగే ఆడపిల్లలకు అత్తంటిలో సమస్యలు, హింసను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే ప్రతి తల్లిదండ్రులు సద్దుకోమని చెప్పడం కాదు. ధైర్యంగా బయటకు వచ్చేలా స్వేచ్ఛను ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి తల్లిదండ్రల్లో పెళ్లితో తమ అమ్మాయి పరాయిది అనే భావాన్ని తొలగించాలి.ఆ వైవాహిక జీవితం నరకప్రాయంగా మారినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకోవాలి, భద్రత అందించాలి. చిన్నప్పటి నుంచి అత్తారింటికి వెళ్లే అమ్మాయి ఇలా ఉండాలి అని స్టోపాయిజన్లా కుమార్తెలకు ఎక్కించడం మానాలి. అంతేగాదు ఆడపిల్లలు కూడా అత్తంట్లో సమస్య వస్తే..పుట్టింటికి వెళ్లడాన్ని అపరాధ భావంలా కాకుండా తన హక్కుగా ధైర్యంగా వచ్చేలా చేయాలి. అలాగే శ్రద్ధ అన్న పేరుతో కుమార్తెలను ప్రతి నిమిషం పర్యవేక్షించడం, కట్టుబాట్లు విధించడం వంటివి చేయకూడదని అంటున్నారు. వాళ్లను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల్లా తీర్చిదిద్దాలన్నారు. ఆడిపిల్లకు ఇచ్చే బంగారం, డబ్బు అత్యవసర నిధుల్లోకి మళ్లించాలి. అది ఆమెకు పెళ్లి తర్వాత భరోసానిచ్చే నిధిలా ఉంటుంది. సమస్య ఎదురైతే ధైర్యంగా బయటకకు వచ్చి బతకగలను అన్న ధైర్యం అందిస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేస్తే..కేవలం నాలుగు రోజులే గుర్తుంటుంది. అదే డబ్బు మిగిల్చి ఆమె స్త్రీ ధనంగా ఇస్తే..ఆమెకు భరోసానిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకవేళ కూతురు పుట్టింట్లో ఉంటే చుట్టూ జనాలు ఏం అనుకుంటారో అన్న భయంతో ముందే తలుపులు వేసుకుని కూర్చొవద్దని పిలుపునిస్తున్నారు. మన అమ్మాయికి అత్తంట్లో కష్టం వస్తే భయపడొద్దు..ఎప్పటికీ పుట్టింటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయన్న నమ్మకం ఇవ్వండని సూచిస్తున్నారు. అలాగే బాధను సాధరణీకరించొద్దు, తొలగించి, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికేలా ధైర్యం ఇవ్వండని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!) -
పిల్లల డ్రీమ్ హౌజ్..!
పిల్లలతో ఊహాశక్తి, బాధ్యత, అలంకరణ పట్ల అభిరుచిని పెంచేది వారి డ్రీమ్ హౌస్. అందులో గోడలు, ఫర్నిచర్, వాతావరణం.. ప్రతిదీ పరిచయం చేయవచ్చు. పిల్లల్లో వచ్చే సృజనాత్మక ఆలోచనలకు మీరే ఆశ్చర్యపోతారు.వెల్కమ్ చెప్పే డోర్..మన ఇంటి తలుపు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆహ్వానించేలా ఉండాలి. దాంతోపాటు మెయిన్ డోర్ ఎలా ఉండాలో చూపమనండి.లివింగ్ – డైనింగ్..కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆనందించే ప్రదేశం, అందరూ కలిసి భోజనం చేసే చోటు ఎలా ఉంటే వారికి నచ్చుతుందో చెప్పమనవచ్చు. గది గోడల రంగు, లైటింగ్, వాల్ పేపర్స్ .. ఇలా ప్రతిదీ క్రియేటివ్గా వారి మైండ్లో నుంచి వచ్చినదై ఉండాలి. రంగులు మన మూడ్ను ఏ విధంగా మార్చుతాయి... ఎక్కువ వస్తువులు కాకుండా ఇంటిని నీటుగా ఎలా సర్దుకోవడం, ప్రతి వస్తువు ఉపయోగం.. ఇలా ప్రతిదీ పాఠమే అవుతుంది.‘పిల్లలను ఇంటి బొమ్మ డ్రా చేయమని సాధారణంగా అడుగుతుంటాం. వాళ్లు ఒక ఇంటి రూపాన్ని డ్రాయింగ్ చేసి చూపుతారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వారి డ్రీమ్ హౌజ్.. దానితో పాటు కిచెన్, బెడ్రూమ్, లివింగ్, స్టడీ రూమ్, రంగులు, ఆర్కిటెక్చర్, అలంకరణ, ఇండోర్– ఔట్డోర్ మొక్కలు... ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా ఉండాలో చెప్పమనవచ్చు. డ్రా చేసి చూపమనవచ్చు. ఇల్లు.. పిల్లల్లో ఎన్నో క్రియేటివ్ ఐడియాలకు రూపకల్పన ఇస్తుంది. వారి క్రియేటివ్ ఐడియాలను మాకు పంపించండి. మెయిల్ ఐడి : sakshisummerkids@gmail.com- గీతాభాస్కర్, నటి, ఆర్ట్ టీచర్బెడ్రూమ్ – చదువుకునే ప్లేస్పిల్లల గది ఆలోచనల పుట్టకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ల చెప్పిన విధానం, డ్రాయింగ్లో చూపిన విధానం.. వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. దీని వల్ల గదులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. కాంతి ఎక్కువగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే దగ్గర, ఒకే సమయంలో చదువుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతాయి. రీడింగ్ ప్లేస్ను ఎలా ఉంచుకోవాలో బాధ్యత పెరుగుతుంది.మొక్కలు – అలంకరణ..ఇండోర్ ΄్లాంట్స్ అమర్చితే ఇల్లు జీవకళతో ఆకట్టుకుంటుంది. ప్రకృతిపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటి లోపల పెంచే మొక్కలు ఎన్ని రకాలు, వాటికి గాలి, వెలుతురు, నీరు .. ఎంతవరకు అవసరమో తెలుసుకుంటారు. మన జీవనానికి ఉపయోగపడే వాటి గురించి కొత్తగా ఆలోచించగలుగుతారు.‘నీ గది ఎలా ఉండాలని అనుకుంటావు? ఏ రంగు అయితే బాగుంటుంది?’, ‘‘పుస్తకాలను ఎలా సెట్ చేద్దాం?,’ ‘చిన్నమొక్కలు ఎక్కడ పెడతావు..’ ఇలా అడిగితే వాళ్లు తమ చిన్న చేతులతోనే చేసి చూపుతారు. ప్రేమ, పరిశుభ్రత, ప్రశాంతత ఉన్న ఇల్లు నిజమైన డ్రీమ్ హౌస్ అంటూ ఒక వ్యాసం రాసి చూపమనవచ్చు.నిర్వహణ : నిర్మలా రెడ్డి -
మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!
ప్రతి వ్యక్తి కెరీర్లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏదీ అంత ఈజీగా దొరికేయదు కూడా. అలానే ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా చదువు అవ్వంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ కొట్టేశాడు. కానీ అది వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తా అంటూ సివిల్స్ వైపుకి వచ్చాడు. అందులో వరుసపెట్టి వైఫల్యాలే, మధ్యలో వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ ఇలా.. వరుసపెట్టి ఎదురుదెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉన్నాయి అతడిని. కానీ చివరికి వాటన్నింటిని ఓర్చుకుంటూనే సక్సెస్ అందుకున్నాడు. చేతులెత్తేయకుండా చివరి వరకు పోరాడటం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ఫూర్తిదాయక కథ వింటుంటే. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికాస్ అల్విస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తన ఫాట్మేట్ గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో వికాస్..తన ఫ్లాట్మేట్ 2012లో ఐఐటి మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్లో బీ.టెక్ పూర్తి చేసి, రూ. 10 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తొందరగానే సెటిల్ అయిపోయాడు. కానీ అతడు దాన్ని వద్దనుకుని మరీ యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాడు. రెండో సారి మెయిన్స్లో తప్పింది. ఇక ఈ రెండు వైఫల్యాలు కారణంగా కాస్త విరామం తీసుకుని తనకిష్టమైన బ్యాడ్మింటన్పై దృష్టిసారించాడు. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఆడటం ప్రారంభించాడు. అయితే మైదానంలో చాలా రాజకీయాలు ఉండేవి వాటిని చూసి విసుగొచ్చి బ్యాడ్మింటన్ వదిలేసి మరో ఏడాది వృధా చేసుకున్నాడు. మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. ఆ టైంలోనే ప్రేమలో పడ్డాడు. దాంతో మూడోసారి ప్రయత్నంపై ఎఫెక్ట్ పడి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక నాల్గో ప్రయత్నంలో లవ్ బ్రేకప్ అతడిని మరింత కుంగదీసింది. ఇక ఐదు, ఆరో ప్రయత్నాల్లో అంత సీరియస్నెస్తో ప్రిపేర్ కాలేక ఓటమిని చవిచూశాడు. అలా మొత్తం 12 ఏళ్లు చేజేతులారా వృధా చేసుకున్నాడు. అప్పటికీ అతనికి 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కూడా లేదు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అతడు జీవితంలో పదే పదే ఎడతెగని వైఫల్యాలను చవిచూసినప్పటికీ..చివరికి అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. అతడు ఆన్లైన్ సాయంతో ట్రేడింగ్ నేర్చుకుని..ఏకంగా సెబీ సలహాదారుడుగా మారాడు. పైగా ట్రేడింగ్ ద్వారా నెలకు ఏకంగా రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు టెకీ వికాస్. నిజం చెప్పాలంటే అతడు ఈ స్థాయికి చేరకుంటాడని ఊహించలేదు కానీ చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్ని ముగించాడు టెకీ. ఈ కథ ఓటములు పలకరిస్తూనే ఉన్నా..గివ్ అప్ ఇవ్వకూడదని చెబుతోంది కదూ..!.There is a guy in my flat who completed his https://t.co/Ws1j7hoGgc in Chemical Engineering from IIT Madras in 2012. After graduation, he got a campus placement offer of 10 LPA, but he rejected it and started preparing for UPSC. He belongs to the general category.In the first…— Vikas Alwys (@VikasAlwys) May 27, 2026 (చదవండి: ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..) -
30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్
అందరికీ స్మార్ట్గా, స్లిమ్గా అవ్వాలని ఉంటుంది. కానీ తక్కువటైంలోనే తగ్గాలనేది అందరి కోరకి. కానీ ఆ క్రమంలో శరీరం కాస్త ఒత్తిడికి గురై బరువు తగ్గడం ఎలా ఉన్నా అధిక బరువు పెరిగిపోతుంటాం. అలాంటి వాళ్లు హెల్దీ కమ్ స్పీడ్గా బరువు తగ్గేందుకు ఈ 15 రూల్స్ని ఫాలో అయితే చాలని అంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. కేవలం చీటింగ్కి తావు లేకుండా క్రమశిక్షణతో కూడిని దినచర్యకు కట్టుబడి ఉంటే చాలని అంటున్నారామె. అలాంటప్పుడే ఈ 15 నియమాలు చాలా సమర్థవంతంగా ఫలితాలనిస్తాయిని చెబుతున్నాడు.క్రమబద్దమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, సరైన నిద్ర, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించే డెడికేషన్ తదితరాలు ఉంటే 30 రోజుల్లో బరువు తగ్గడం సులభమేనని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్. అందుకోసం ప్లాన్ ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నియంత్రిత ఆమారం, అధిక ప్రోటీన్తో కూడినా ఆహారాలు, శారీరక శ్రమ వంటి వాటితో కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు రాషిద్. అందుకోసం స్ట్రిక్ట్గా శిక్షణను కొనసాగించాలని నొక్కి చెప్పారు. ఆ వెయిట్లాస్ ప్లాన్ ఏంటంటే..కేలరీల లోటుతో తినండినిర్వహణ స్థాయి కంటే 500-750 తక్కువ. గరోజువారీ ప్రోటీన్ లక్ష్యాన్ని చేరుకోండిశరీర బరువులో ప్రతి పౌండ్కు 0.8-1 గ్రా. చాలా మందికి కనీసం 130-180 గ్రా.ప్రతి భోజనంలో 20-30 గ్రా ప్రోటీన్ తినండిప్రోటీన్కు అనుగుణంగా ప్రతి భోజనం ఉండాలివారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండివారానికి 3-5 సార్లు ఇంక్లైన్ వాక్ / స్టెయిర్మాస్టర్ చేయండి 30-45 నిమిషాలు. ఈ వారం నేను పంచుకున్న వాకింగ్ ఛాలెంజ్ లాగా.ప్రతిరోజూ పదివేల పైనే అడుగులు నడవడంఇది ఒత్తిడి లేకుండా కొవ్వును కరిగించడం.రాత్రికి 7-9 గంటలు నిద్రపోండినిద్ర లేకపోతే కొవ్వు కరగడం నెమ్మదిస్తుంది.భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండిప్రణాళిక లేకపోతే ఇష్టం వచ్చినట్లు తినడంతో ఫలితం పొందలేరు. ప్రధానంగా సంపూర్ణ ఆహారాలనే తినండి. కొవ్వు తక్కువగా ఉండే మాంసం, అన్నం, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఆకుకూరలు.అధిక కేలరీలు గల పానీయాలను మానుకోండినీళ్లు, కాఫీ, కేలరీలు లేని పానీయాలు. స్మూతీలను లెక్కపెడితే ఫర్వాలేదు.ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించండిమిఠాయిలు, పేస్ట్రీలు, చక్కెర కలిపిన తృణధాన్యాలు, లేదా జంక్ ఫుడ్ వద్దు.చివరగా 30 రోజుల పాటు చీట్ మీల్స్ వద్దుప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే బరువు చూసుకోండిమొదట్లో కాస్త కష్టంగా అనిపించినా..స్మార్ట్గా మారాలన్న లక్ష్యంపై గురిపెడితే ప్రతి శారీరక బాధ ఇష్టంగా మారుతుందని అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ తకై రాషిద్ . View this post on Instagram A post shared by Takai Raashid | MacroMaster® (@takai.raashid)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..) -
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్రైస్ కంటే బ్రౌన్రైస్ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్ రైస్ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్రైస్ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్ రైస్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్ రైస్ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే..తెల్లబియ్యం..తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది.బ్రౌన్రైస్ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.పోలిస్తే..సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9) అధిక స్థాయిలో ఉంటాయిఆరోగ్య పరంగా..ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తుంటే, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే బరువును మెరుగ్గా నియంత్రించుకోవడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే తెల్ల బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ± 4, ఇది అధికం. బ్రౌన్ రైస్ను మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ 68 ± 4 కారంగా ఆరోగ్యప్రదంగా పరిగణించారు నిపుణులు. అదీగాక, బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది, కానీ తెల్ల బియ్యం తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.ఎలా తీసుకుంటే మంచిదంటే..చాలా మంది బ్రౌన్ రైస్ మంచిదన్న ఉద్దేశ్యంతో దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణం చేసుకోవడం కష్టతరం చేసి జీర్ణసంబంధిత రుగ్మతలు తీవ్రమై ప్రమాదం లేకపోలేదని అంటున్నారు ఆదర్శ గౌడ. అందువల్ల బ్రౌన్ రైస్, వైట్రైస్ రెండిటిని కలిపి ఎంచుకోమని సూచిస్తున్నారు నిపుణులు. మెరుగైన పోషకాహారం కోసం కొద్దిపాటి మార్పులతో రెండిటిని సమంగా తీసుకునే ప్రయత్నం చేయమని అంటున్నారు అప్పుడు శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు ఆదర్శ గౌడ.(చదవండి: బాదంపప్పులు నానబెట్టే ఎందుకు తినాలంటే..! పరిశోధనలో షాకింగ్ విషయాలు)


