breaking news
Lifestyle
-
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..
ఐఏఎస్ అయ్యేందుకు యువత ఎంతగా పరితపిస్తుందో తెలియనిది కాదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. ఏళ్లుగా ప్రిపేర్ అవ్వతూ ఐఏఎస్ అవ్వాలని తపిస్తుంటారు. అలాంటి కలను ఇక్కడొక వ్యక్తి ఎలా సాకారం చేసుకున్నాడో వింటే విస్తుపోతారు. ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ వింటే..నిజాయితీగా లభించిన ఉద్యోగం మంచిగా చేసుకుంటూ..అధికారుల మన్ననలను పొందుతూ ఊహించని విధంగా తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సక్సెస్ స్టోరీ ఇది.ఈయన్ని మరో అబ్దుల్ కలాం అనొచ్చు. అతడే కేరళకు చెందిన అబ్దుల్ నాజర్. అతడి బాల్యం కష్టాలతో ప్రారంభమైంది. ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని దూరం చేసింది. పాపం తల్లి కుటుంబాన్ని పోషించుకునేందుకు పనిమనిషిగా మారి జీవనం సాగించాల్సి వచ్చింది. రాను రాను పరిస్థితి కడు దయనీయంగా మారడంతో నాసర్ అతని తోబుట్టువులు అనాథశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అంతేగాదు పదేళ్ల వయసులో కుటుంబాన్ని పోషించుకునేందుకు డెలివరీ బాయ్గా..ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్గా ఇలా చిన్నాచితక పనులు చేసుకుంటూ చదువుని సాగించేవాడు. ఇన్ని కష్టాల మధ్యలో ఎక్కడ చదువుని మాత్రం వదిలేయలేదు నాజర్. అలా రాష్ట్ర ఆరోగ్య శాఖలో క్లర్క్ ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఇష్టమైన డ్రీమ్. అయితే అదరిలా నాసర్కి కూడా యూపీఎస్సీకి ప్రిపరై, సివిల్స్ రాయాలని ఉండేది. కానీ తనకున్న బాధ్యత రీత్యా అది సాధ్యపడదు. అదీగాక అంత డబ్బు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోవడం అనేది సాధ్యమై పని కాదు. అందుకని అతడు ఎంచుకున్న మార్గం వింటే వావ్..అని మెచ్చకోకుండా ఉండలేరు. ఎందుకుంటే తనకు లభించిన ఉద్యోగాన్నే అధికారుల మన్ననలను పొందేలా వర్క్ చేయాలని భావించాడు. అతడి కష్టానికి తగ్గా ప్రతిఫలం ప్రమోషన్ల రూపంలో వస్తూనే ఉండేది. అలా మొత్తం 20 ఏళ్ల అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. అతని అత్యుత్తమ ట్రాక్ రికార్డు కారణంగా 2017లో సివిల్స్ ఎగ్జామ్ రాయకుండానే ఐఏఎస్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. చెప్పాలంటే తన అచంచలమైన కృషితో అత్యున్నత అధికారి అయ్యాడు. ఈ కథ ఆలోచింప చేసేలా ఉన్నా..బహుశా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ నాసర్ ఈ అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు దశాబ్దాల ఓపిక, అచంచలమైన కృషి, కష్టపడేతత్వం వంటివి ఆయుధాలుగా మలుచుకున్నాడనేది గుర్తురెగాలి. ఈ స్టోరీ కలను సాకారం చేసుకోలేకపోయామని కృశించి పోకూడదు..శక్తివంతమైన ఆలోచనా దృక్పథంతో సాధ్యమయ్యేలా చేసుకోవచ్చని తెలుపుతోంది. ఓపికతో నిశబ్ధంగా తన పని తాను చేసుకుంటూపోతే..ఏదో ఒకనాటికి లక్ష్యానికి చేరకుంటాం అనేది జగమెరిగిన సత్యం. అంతేగాదు పట్టుదలతో అడియాశగా మిగిలిన కలను సైతం ఆశాకిరణంగా మార్చుకోవచ్చని అబ్దుల్ నాసర్ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?
ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. బ్రెడ్, ఎనర్జీ బార్లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) (చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..) -
పర్యాటక ప్రాంతాలకు 'పరుగో పరుగు'
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్గా నిర్వహించే ఏదో ఒక మారథాన్లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది.. పలువురు ఔత్సాహికులు వెకేషన్తో పాటు మారథాన్ కూడా చేస్తున్నారు.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మారథాన్లలోనూ పాలుపంచుకుంటున్నారు. మరికొందరు ఏకంగా రికార్డులవైపు పరుగు పెడుతున్నారు.. ఈ క్రమంలోనే రన్కేషన్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది.. మారథాన్ పరుగునే క్రమంగా వెకేషన్తో కలగలిపి రన్కేషన్ అని పిలుస్తున్నారు.. ఈ ట్రెండ్ టూరిజానికి కూడా భారీగా ఊపునిస్తోందని పలువురు నిపుణులు చెబుతున్నమాట. అనుభవజ్ఞులైన రన్నర్లకు, అంతర్జాతీయ రేసులు అంటే కేవలం ఒక ప్రధాన మారథాన్కు అర్హత సాధించడం లేదా మరో వ్యక్తిగత పరుగు పందెం వేయడం మాత్రమే కాదు.. అవి కొత్త పర్యాటక గమ్యస్థానాలను అన్వేషించడానికి ఒక అవకాశం కూడా. ‘సెలవులు ఇప్పుడు రన్ కేషన్లుగా మారాయి’ అని ప్రముఖ మారథాన్ రన్నర్లు ఈ ట్రెండ్ను నిర్వచిస్తున్నారుఈవెంట్ల కోసమే..‘మారథాన్ టూర్లో పాల్గొనేవారిలో ఎక్కువ మంది పేరున్న అథ్లెట్లు కాదు, ఈవెంట్ల కోసం మాత్రమే శిక్షణ పొందే అమెచ్యూర్ రన్నర్లు. అందుకే మారథాన్ టూరిజం ఊపందుకుంటోంది’ అని మారథాన్ టూర్లను నిర్వహించే గౌరీ జయరామ్ అంటున్నారు. నగరం నుంచి పర్యాటక పరుగుల కోసం ఎంచుకుంటున్న వాటిలో దేశీయంగా ముంబైలో జరిగే టాటా ముంబై మారథాన్, అలాగే న్యూఢిల్లీ, చెన్నైలలో జరిగే రన్స్, అదే విధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సిడ్నీ మారథాన్, రియో మారథాన్, అంటార్కిటికా మారథాన్, లండన్, టొరంటో, న్యూయార్క్.. వంటివెన్నో ఉన్నాయి. మారథాన్ టూరిజం అంటే..మారథాన్ అంటే అత్యంత సుదీర్ఘ దూరంలో పాల్గొనే పరుగు పందెం పోటీలు. రోజు రోజుకూ ఆదరణ పెంచుకుంటున్న ఈ మారథాన్ ఈవెంట్స్ దేశంలోని ప్రతి ప్రధాన నగరానికీ ఒక అలంకారంగా మారాయి. అంతర్జాతీయంగానూ అనేక నగరాల్లో విందు, వినోదాల సమ్మేళనంగా సాగే ఈ మోడ‘రన్’ ఫెస్టివల్స్.. రాను రానూ పర్యాటక ఆకర్షణగా కూడా స్థిరపడుతున్నాయి. ఒకసారి స్థానికంగా జరిగే పరుగు పోటీలో పాల్గొని మారథాన్ రన్నర్గా మారిన తర్వాత కాలక్రమంలో.. ఇతర నగరాల్లోని మారథాన్స్లో పాల్గొనడంపై నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. అదే మారథాన్ టూరిజంకు ఊపునిస్తోంది. ఏటా మారథాన్ టూరిజంలో పాల్గొనే భారతీయ రన్నర్లలో ఐదు రెట్లు పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్న మాట. నిపుణుల సూచనలు.. మారథాన్ పర్యాటకులకు నగరానికి చెందిన నిపుణులు పలు సూచలను చేస్తున్నారు.. అవగాన లేకుండా, శిక్షణ లేకుండా మారథాన్లలో పాల్గొంటే ఆరోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. ప్రయాణించే ముందు తగినంత శిక్షణ పొందాలి. మారథాన్ పర్యటనలలో పేరొందిన మారథాన్ ప్రయాణ సంస్థలను ఎంచుకోవాలి. స్థానిక వాతావరణ పరిస్థితులకుసంపూర్ణంగా సిద్ధం అవ్వాలి. హ్యాండ్ లగేజీలో రేస్ డే పరికరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆతిథ్య దేశంలో అత్యవసర కాంటాక్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. మారథాన్ టూరిజం కోసం ప్రణాళిక సాధారణంగా ఆరు నెలల ముందుగానే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సకుటుంబ సమేతంగా ‘రన్’డి.. రన్నర్లు క్రీడ పట్ల తమ మక్కువను పెంచుకుంటూనే కొత్త నగరాలు సంస్కృతీ, సంప్రదాయాలను అన్వేషించేందుకు ఈ ట్రెండ్ వీలు కలి్పస్తోంది. స్థానిక సంప్రదాయాలు హృదయపూర్వక ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సుందరమైన ప్రకృతి దృశ్యాల మీదుగా పరుగు తీసే అవకాశాన్ని మారథాన్ టూరిజం అందిస్తోంది. ‘పని ఒత్తిడి కారణంగా, నేను నా కొడుకుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. మారథాన్ల కోసం ప్రయాణించే సమయాన్ని పాఠశాల సెలవులతో మేళవింపు చేయడం ద్వారా రన్కేషన్లో ఆ లోటు పూడ్చగలుగుతున్నా’ అని కొన్ని సంవత్సరాలుగా మారథాన్ రన్నర్గా ఉన్న నగరవాసి డాక్టర్ కునాల్ అంటున్నారు. తాము పాల్గొనే మారథాన్ ఈవెంట్స్ కోసం కుటుంబాన్ని తీసుకెళ్లడం అనేది కుటుంబంతో ఒక వెకేషన్ను గడపడం వంటి ప్రయోజనాలతో పాటు స్ఫూర్తిని నింపుతోంది. ‘ఇది నా భార్యను మారథాన్ రన్నర్గా మార్చింది. ఇప్పుడు నా 14 ఏళ్ల కొడుకు 5 కె రన్నర్గా శిక్షణ పొందుతున్నాడు.’ అని కునాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా రన్కేషన్స్ నిర్వహించేందుకు ప్రత్యేక ఈవెంట్ ప్లానర్లు కూడా పుట్టుకొచ్చేశారు. (చదవండి: నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్) -
నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట మిసెస్ ఇండియా–2025 టైటిల్ దక్కించుకున్నారు. ఈ మేరకు బేగంపేటలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నమిత కుల్ శ్రేష్ట కుటుంబ సభ్యులు పోటీల వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు మిసెస్ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్స్కు 56 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో కఠినమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జ్లు అడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో సమాధానాలు చెప్పిన నమితకు మిసెస్ సౌత్ జోన్ టైటిల్తో పాటు వయోవర్గంలో మిసెస్ ఇండియా–2025 టైటిల్ అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మిసెస్ ఇండియా ఎలిగెన్స్, మిసెస్ ఇండియా గ్రేస్ఫుల్ సోల్, మిసెస్ ఇండియా చారిటీ క్వీన్ టైటిళ్లు కూడా దక్కాయని తెలిపారు. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!
పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్ మెటల్తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్ డిజైన్స్ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది. ట్రైబల్ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్ ఆభరణాలు డ్రెస్ స్టైల్ను మార్చేసే ‘హైలైట్ యాక్ససరీస్’గా నిలుస్తున్నాయి. ఇయర్ హ్యాంగింగ్స్హూప్స్, జుమ్కీలు, డ్రాప్ ఇయర్ రింగ్స్, షెల్స్ లేదా జియోమెట్రిక్ షేప్స్.వన్ పీస్ డ్రెస్ లేదా సింపుల్ కుర్తీకి బాగా సెట్ అవుతాయి.నెక్లస్, గాజులుమొత్తం మెడ కవర్ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్తో తయారు చేస్తారు. ప్లెయిన్ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్ వర్క్ ఉన్నవి. వెస్ట్రన్ – ట్రెడిషనల్ రెండింటికీ సెట్ అవుతాయి.క్యాజువల్ లుక్ డైలీ వేర్ / ఫ్రెండ్స్ అవుటింగ్షర్ట్ స్టైల్స్కి ఓవర్సైజ్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్పీస్ + పెద్ద హూప్ ఇయర్ రింగ్స్. బోహో మ్యాక్సీ డ్రెస్ పైకి కలర్ఫుల్ బీడ్స్, షెల్ జ్యువెలరీ, బ్రాడ్ బ్యాంగిల్స్. కుర్తీ లెగ్గింగ్స్ పైకి ఆక్సిడైజ్డ్ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్ చేసే లాంగ్ ఇయరింగ్స్.ఆఫీస్ లేదా ఫార్మల్ లుక్ఆఫీస్ వేర్ పైకి సింపుల్ ఓవర్సైజ్డ్ రింగ్ + చిన్న హూప్స్ బాగుంటాయి. ఒకే రింగ్ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్ ఉంటుంది. కాక్టెయిల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్. బ్లేజర్, ట్రౌజర్స్ పైకి పెద్ద చెయిన్ లేదా మందపాటి నెక్ పీస్ సెట్ అవుతుంది. కాటన్ లేదా లినెన్ శారీస్ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్ లేదా ఆక్సిడైజ్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్.పార్టీ ఈవెనింగ్ లుక్ బ్లాక్ డ్రెస్పైకి గోల్డెన్ చంకీ నెక్పీస్, పెద్ద స్టేట్మెంట్ రింగ్ బాగా నప్పుతుంది. గౌన్ పైకి షైనీ స్టోన్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ సరి΄ోతాయి. నెక్లెస్ అవసరం లేదు.కాక్టెయిల్ పార్టీమినిమలిస్టిక్ గౌన్కి ఓవర్సైజ్డ్ బ్రేస్లెట్ హైలెట్ అవుతుంది. సింపుల్ డ్రెస్కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్ లుక్. వెస్ట్రన్ అవుట్ఫిట్కి బోల్డ్ మెటల్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్ లుక్కి – చిన్న ఓవర్సైజ్డ్ రింగ్స్ లేదా లైట్ కలర్ హూప్స్. పార్టీ లుక్కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్ నెక్పీసులు అందంగా ఉంటాయి. సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు పట్టు చీరల మీదకు ఓవర్సైజ్డ్ కుందన్ లేదా టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్లెస్ లేకుండా హెవీగా ఉండే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్ మీదకు లేయర్డ్ పెరల్ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్ అందంగా కనిపిస్తాయి.మోడర్న్ ఫ్యూజన్ లుక్క్రాప్ టాప్, స్కర్ట్ మీదకు ఓవర్సైజ్డ్ నెక్లెస్, లాంగ్ ఫెదర్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్ ఔట్ఫిట్స్కి ఆక్సిడైజ్జ్ సిల్వర్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ప్లెయిన్ జంప్సూట్ మీదకు బోల్డ్ జియోమెట్రిక్ నెక్లెస్ చుంకీ బ్రేస్లెట్ బాగా నప్పుతుంది.ప్రకృతి నుంచి స్ఫూర్తిజీన్స్, కుర్తీస్ కి పెర్ఫెక్ట్ లుక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బోహో లుక్ కోసం కలర్ఫుల్ బీడెడ్ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్ పార్టీ లుక్స్ కోసం యంగ్ జనరేషనల్లో బాగా పాపులర్గా ఉన్నది లేయర్డ్ నెక్పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్ షేప్ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ. జాగ్రత్తలుఔట్ఫిట్ కలర్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్ లేదా ఇయర్ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓవర్సైజ్డ్ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్గా వేసుకోకూడదు. హెవీ ఇయర్ రింగ్స్ ధరించినప్పుడు హెవీ నెక్లెస్ వాడద్దు. సింపుల్ డ్రెస్ ధరించినప్పుడు ఓవర్ సైజ్డ్ జ్యువెలరీ అట్రాక్టివ్గా ఉంటుంది. క్లచ్ లేదా హ్యాండ్ బ్యాగ్ కూడా జ్యువెలరీ షైన్ కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. (చదవండి: ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్) -
మనసును ‘స్కాన్’ చేసి వైద్యం నడిపిద్దాం
ఓ టీనేజీ అమ్మాయి అప్పటివరకూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. కానీ అకస్మాత్తుగా కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. ఏమాత్రం కదల్లేకపోవడంతో వీల్చైర్కు పరిమితమైంది. కారణం తెలుసుకోడానికి చేయని పరీక్ష లేదూ... తీయని స్కాన్ లేదు. కానీ ఎందులోనూ ఏమీ కనిపించలేదు. ఎట్టకేలకు తెలిసిన విషయం డాక్టర్లనే అబ్బురపరచింది. ఆ మెడికల్ సీక్రెట్ ఏమిటో చూద్దాం. ఈ కథ ఓ మెడికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎంతకూ క్లూయే దొరకని పరిశోధనాత్మకమైన సస్పెన్స్ స్టోరీని గుర్తుచేస్తుంది. రియా (పేరు మార్చాం) అనే ఓ పదిహేనేళ్ల చురుకైన అమ్మాయికి అకస్మాత్తుగా ఓ క్షణాన రెండు కాళ్లూ పడిపోయాయి. ఎంతకీ చలనం కలగలేదు. దాంతో అమ్మాయి వీల్ చైర్కే పరిమితం కావాల్సివచ్చింది. రియాను హాస్పిటల్కు తరలించారు. అపరాధ పరిశోధనల్లో నేరస్తుని జాడల కోసం వెతికినట్టుగా డాక్టర్లు ఓ అమ్మాయి జబ్బుకు కారణమైన ఆ అంశం కోసం పరిశోధనలు చేశారు... చేస్తూ పోయారు. రక్తపరీక్షలు చేశారు, ఎమ్మారైలు తీశారు. వాటి ద్వారా కండరాలను పరీక్షించారు. నరాలల్లోకి పరికించి చూశారు. ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ పరీక్షలతో మెదడూ, వెన్నుముల్లోకి తరచి చూశారు. ఊహూ... కారణమెంతకూ దొరకలేదు. రియా చదువుల్లో సరస్వతి. స్కూలు వక్తృత్వపు పోటీల్లో మంచి వక్త. అంతేకాదు... మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేసేది. అలాంటి అమ్మాయిని పేరు తెలియని జబ్బు హైజాక్ చేసేసింది. కాళ్లనొప్పితో ఎలాగో కుంటుతూ స్కూలు దాకా వెళ్లిన ఆ అమ్మాయి స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. రక్త పరీక్షలు చేశారు. ఏమీలేదు. ఇలా ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు ఆచూకీ అంతు చిక్కలేదు. విటమిన్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇలా ఎన్ని చికిత్సలు చేసినా ఫలితమూ దక్కలేదు. అప్పటివరకూ అక్షరాలా ‘తన కాళ్ల మీద తాను నిలబడ్డ’ ఆ అమ్మాయి తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లంబార్ పంక్చర్ అనే వెన్నుముక గాటు పెట్టి అందులో నీరు తీసి చూసే చిట్టచివరి పరీక్షకు డాక్టర్లు సిఫార్సు చేశారు.రెండో ఒపీనియన్ కోసం... దేహానికి గాటు పెట్టి చేసి మరింత తీవ్రమైన పరీక్షలతో ఆమెను బాధించడానికి పూనుకునే ముందర ఎందుకోగానీ... రియా తల్లిదండ్రులు రెండో ఓపీనియన్ కోసం హైదరాబాద్లోని సుధీర్కుమార్ అనే న్యూరాలజిస్టును సంప్రదించారు. ఇతరత్రా పరీక్షలతో పాటు రిపోర్టుల్లో విటమిన్–బి12, విటమిన్ డీతోపాటు మెదడూ, వెన్నెముకా, నర్వ్ కండక్షన్ స్టడీస్... ఇలాంటివన్నీ పరిశీలిస్తున్న డాక్టర్గారికి ఎందుకో అనుమానం వచ్చి ‘హూవర్స్ సైన్’ అనే ఓ సునిశిత పరిశీలన చేశారు.ఏమిటీ హూవర్స్ సైన్ ? బాధితులను పడుకోబెట్టాక రెండు కాళ్ల మడమల కింద రెండు చేతులూ పెట్టి, బలహీనంగా ఉన్న ఓ కాలిని ప్రయత్నపూర్వకంగా ఎంతోకొంత పైకెత్తమని డాక్టర్లు అడుగుతారు. వాస్తవంగా కాళ్లలో పూర్తిగా చచ్చుబడిపోయిన వ్యక్తుల్లో ఓ కాలు కాస్త ఎత్తడానికి ప్రయత్నించినా రెండోకాలిలో ఎలాంటి చలనమూ ఉండదు. కానీ అది వాస్తవంగా చచ్చుబడిన కేసు కానప్పుడు బాధితులు ఓ కాలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో కాలిమీద బరువు/ఒత్తిడి పెరుగుతుంది. అంటే... కాలిని ఎత్తే ప్రయత్నంలో మరోకాలు వెనక్కెళ్తుండటంతో ఇలా జరుగుతుంది. (ఈ హూవర్స్ సైన్ (గుర్తు) అన్నది కాలు చచ్చుబడిపోయిన సందర్భంలో నిర్ధారణ కోసం చేసేది. ఇలాంటి హూవర్స్ సైన్స్ (గుర్తులు) ఊపిరితిత్తుల విషయంలో మరో రకంగా ఉంటాయి). దాంతో ఇది వాస్తవంగా కాళ్లు చచ్చుబడిపోయిన కేసు కాదనీ, ఆ కండిషన్ను అనుకరిస్తున్న (మిమిక్ చేస్తున్న కేసు) అని డాక్టర్కు అర్థమైంది. అంతా బాగున్నప్పటికీ ఆమె కాళ్లను కదలించలేకపోతోందంటే ఏదో మతలబు ఉంది.అది నటన కాదు... బాధితురాలు నటించడం లేదు... అయితే ఇక్కడ బాధితురాలు రియా నటిస్తోందని అనుకోడానికి వీల్లేదు. కాళ్లు పడిపోవడం జరగనప్పటికీ... మానసిక కారణాలతో కాళ్లను కదలించలేకపోతోంది. తన మానసిక సమస్య కారణంగా నిజంగానే ఆమె కాళ్లు కదిలించలేకపోతోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫంక్షనల్ న్యూరలాజికల్ డిజార్డర్ – ఎఫ్ఎన్డీ’ అంటారు. దీనికి కౌన్సెలింగ్ అవసరమని గ్రహించిన డాక్టర్ సుధీర్కుమార్ ఆమెతో ఏకాంతంగా మాట్లాడారు.అసలు కారణమిది... రియా కాస్త బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను వెక్కిరిస్తుండేవాళ్లు. ఆమె బరువును చూసి గేలి చేస్తుండేవాళ్లు. దాంతో తీవ్రమైన వ్యాకులతకూ, మనఃక్లేశానికీ లోనైన ఆమె తనకు తెలియకుండానే ఇలాంటి కండిషన్కు గురైంది. అన్నీ నార్మల్గా ఉన్నా అనారోగ్యానికి గురయ్యే మానసిక సమస్య అని తేల్చారు డాక్టర్ సుధీర్కుమార్. ఇందులో నరాలకు సంబంధించిన అంశంతో పాటు మానసిక నిపుణులతో మల్టీ డిసిప్లినరీగా ప్రయత్నించాల్సిన సంక్లిష్టమైన కేసు. ఇది అర్థమయ్యాక ఆమెలో మానసిక స్థైర్యం నింపేలా అనేక స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లు సంయుక్తంగా చికిత్స మొదలుపెట్టారు.ఆర్నెల్ల తర్వాత... అన్ని చికిత్సలూ ఫలించడంతో రియా మామూలుగా మారింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను మళ్లీ నిలబడటంతో పాటు తన చేతుల్లోని కుంచెను కదిలించి అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె టీనేజ్ లైఫ్ తాను వేస్తున్న పెయింటింగ్స్ అందంగా అందులోని కలర్సంతగా రంగులమయంగా మళ్లీ మారిపోయింది. చివరగా... అందించాల్సిన ట్రీట్మెంట్ ఒక్కటే డాక్టర్ల బాధ్యత కాదు... సంక్లిష్ట సమయాల్లో అందించాల్సినవి... చికిత్సా, మందులతో పాటు అక్కడ నిజంగా అందాల్సినదీ, అవసరమైనదేమిటంటే... చక్కటి సానుభూతీ, చిక్కటి సహానుభూతి. – యాసీన్డాక్టర్లూ... ఇది వినండిఈ కేసు ద్వారా డాక్టర్లకూ ఓ సందేశమిస్తున్నారు డాక్టర్ సుధీర్కుమార్. అదేమిటంటే... కేవలం రిపోర్టులు చూసే ఓ నిర్ధారణకు రాకండి. బాధితులు చెప్పేది పూర్తిగా సానుభూతితో, సహానుభూతితో వినండి. అప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.ఫంక్షనల్ డిజార్డర్లలో పేషెంట్స్ చేసేది నటించడం కానే కాదు. వాళ్ల బాధలు పూర్తిగా జెన్యూన్. వాళ్లు చెప్పేది పచ్చి వాస్తవం. క్లినికల్ పరీక్షల తర్వాత కూడా ఏ కారణాలూ తెలియకపోతే... వారిని కోసి చేసే పరీక్షలకూ, పొడిచి నిర్వహించాల్సిన ప్రోసీజర్లకు వెంటనే గురిచేయకండి. కాస్త చురుగ్గా, నిశితంగా ఆలోచించి ‘హూవర్స్ సైన్స్’ లాంటి వాటి గురించి మీ పరిధి దాటి (ఔట్ ఆఫ్ ద బాక్స్) ఆలోచించేలా ప్రయత్నించండి. దాంతో పేషెంట్స్ను బాధించి చేసే ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్కు ముందే జబ్బు నిర్ధారణకు అవకాశం దొరుకుతుంది. ఒక వ్యక్తికి స్వస్థత చేకూర్చడం మీ ఒక్కరివల్లనే కుదరనప్పుడు టీమ్తో కలిసి... అంటే సైకాలజిస్టులూ, ఫిజీషియన్లూ, ఫిజియోథెరపిస్టుల తోపాటు అవసరమైతే టీచర్లూ, కుటుంబ సభ్యులందరూ బృందంగా టీమ్వర్క్తో తగిన చికిత్స అందించి, బాధితులు హాయిగా కోలుకునేలా చేయండి. డాక్టర్ సుధీర్కుమార్, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: 'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
బరువు పెరగాలనుకుంటే ఇలా తినండి..! 45 కిలోలు నుంచి 87 కిలోలు..
కొందరు ఎత్తుకి తగ్గ బరువు లేక బాధపడుతుంటారు. చాలామటుకు అధిక బరువుతో బాధపడుతంటే..ఈ వ్యక్తులు మాత్రం ఎంత తిన్నా.. పీలగానే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వచ్చిందా.. మరింత బక్కచిక్కిపోతారు. చూసేందుకు కూడా బాగోదు వారి ఆహార్యం. అలాంటి వాళ్లు ఆరోగ్యంగా లావు అవ్వాలనుకుంటే.. ఇలా తినండని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ సుజీత్ చౌరాసియా. సోషల్ మీడియా వేదికగా అత్యంత బలహీనంగా ఉండే తను ఎలా ఆరోగ్యకరమైన రీతీలో బరువు పెరిగాడో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. మరి అదెలాగో తెలుసుకుందామా..!. కంటెంట్ క్రియేటర్ 46 కిలోలు బరువుతో బక్కపలచగా ఉండేవాడు. తన ఎత్తుకి బరువుకి వ్యత్యాసమే లేనట్లు గాలిస్తే ఎగిరిపోయేలా ఉండేవాడు. అలాంటి వాడు మంచి ఫిజిక్తో ఏకంగా 85 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నాడు. అందుకోసం అతడు డైట్ ఎలా సెట్ చేశాడంటే ఉదయం శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఒక లీటర్ నీటితో రోజుని ప్రారంభించేవాడట. ప్రోటీన్ రిచ్ స్టార్ కోసం 70 గ్రా బ్లాక్ చనా + 60 గ్రా పెరుగు తీసుకునేవాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్గా నెమ్మదిగా జీర్ణమయ్యే 100 గ్రా ఓట్స్, రెండు అరటిపండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్, ప్రోటీన్ బూస్ట్ కోసం బ్రెడ్ లేదా ఆమ్లెట్తో 4 బ్రెడ్, మిల్క్షేక్ రెసిపీ తీసుకునేవాడినని తెలిపాడు. అది కూడా పాలు, అరటి పండ్లు, డ్రైఫ్రూట్స్తో చేసిన మిల్క్ షేక్. లంచ్ టైంలో వందగ్రాముల బియ్యం, 80 గ్రాముల నెయ్యి,ఫైబర్, విటమిన్ల కోసం సలాడ్ తీసుకున్నట్లు చెప్పాడు. సాయంత్రం వ్యాయమానికి ముందు 80 గ్రా ఓట్స్ + 2 అరటిపండ్లు. వ్యాయమం చేసిన తర్వాత శక్తిని నింపడానికి, కోలుకోవడానికి 100 గ్రా బంగాళాదుంపలు లేదా మిల్క్ షేక్. ఇక రాత్రి డిన్నర్కి సముతల్యమైన ఆహారం కోసం మూడు రోటీలు, సబ్జి, వందగ్రాముల పన్నీర్ తీసుకునేవాడిని అంటూ తన డైటింగ్ విధానాన్ని పోస్ట్లో వివరించాడు. మెరుగైన ఫలితాల కోసం..భోజనం పరిమాణం పెంచుకోవడంహైడ్రేట్గా ఉండేలా ప్రతిరోజూ మూడు నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోండిఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రవ్యాయామాలను 1.5 గంటల కంటే తక్కువగా ఉండాలి. View this post on Instagram A post shared by Sujeet Chaurasia l Content Creator (@fearlesshimm)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి
శంఖం (Conch) అనేది భారతీయ సంస్కృతిలో పవిత్రత, శుభం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఇది క్షీరసాగర మథనంలో ఉద్భవించిన 14 రత్నాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి శంఖాన్ని ఊదితే ఆ వ్యాధి నయమైపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో ఇది వెల్లడైందని తెలిపారు. ఈ శంఖరావం ప్రయోజనాన్ని హైలెట్ చేసేలా పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల చాలామంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారు. అందుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అని చెబతున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దాంతో మధ్యలో మెలుకవ వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాసాగిపోయి గురకపెడుతుంటారు. దీని కారణంగా మధుమేహం, గుండుపోటు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక జబ్బుల బారినపడతారని చెబుతున్నారు వెద్యులు. ఈ స్లీప్ ఆప్నియా కారణంగా చాలామంది కంటిపై కునుకనేది సరిగా ఉండదు. అందువల్ల ఉదయం చాలా అలసట, ఒక విధమైన నిద్ర ఆవరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారని చెబుతున్నారు. అయితే ఈసమస్యకు మందుల కంటే శంఖం చక్కగా చెక్పెడుతుందంట. శంఖారావంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గాలి వాయిద్యాలను వాయించడం మెరుగైన శ్వాసకు ఎలా సహాయపడుతుంది అనే దిశగా అధ్యయనం చేయగా..ఈ విషయం వెల్లడైందని తెలిపారు. అందుకోసం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న సుమారు 30 వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సముహం శఖం ఊదే సాంప్రదాయ భారతీయ శ్వాస వ్యాయమాన్ని అభ్యసించింది. అంటే శంఖం పూరించడం లాంటిది. మరొక సముహం లోతైన శ్వాస వాయామాలు చేశారు. అందులో శంఖం ఊదిన బృదం నిద్ర నాణ్యతలో గణనీయమైన మెరుగదల కనిపించిడాన్ని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి ఈ స్లీప్ ఆప్నియాతో ఇబ్బంది పడేవాళ్లకి నిరంతర సానుకూల వాయుమార్గ పీడన యంత్రం లేదా CPAP వంటి ప్రామాణిక చికిత్సను అందిస్తారు. ఇందులో ఫేస్మాస్క్ ద్వారా గాలిని ఊదుతూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా వాయుమార్గం తెరచుకుని ఈ సమస్య తగ్గుతుంది. అయితే దీన్ని చాలామంది రోగులు అసౌకర్యంగా భావించడమే కాకుండా ఇలా నిరంతరం చేయడంలో ఇబ్బంది పడుతున్నారట. అలాగాక ఈ శంఖ ఊదడం అనే సాంప్రదాయ యోగ శ్వాస వ్యాయామం ప్రకారం.. ఉచ్ఛ్వాసాన్ని వదులుతూ..సాధన చేస్తారు కాబట్టి చక్కటి విశ్రాంతితో కూడిన నిద్రపడుతుందట. ఈ పురాతన అభ్యాసం ఈ సమస్యకు చక్కని పరిష్కారమని వెల్లడించారు. అంతేగాదు శంఖ ఊదడం అనే వ్యాయామాలు శ్వాసకోశ కండరాలను బలోపేతం చేయగలవని, నిద్రలో వాయుమార్గాలను స్పష్టంగా తెరుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. స్లీప్ అప్నియా లక్షణాలను నిర్వహించడానికి ఈ శంఖారావం అనేది చక్కటి నివారిణి అని పేర్కొన్నారు పరిశోధకులు. ఈ అధ్యయనాన్ని భారతదేశంలోని జైపూర్లోని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది.(చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే..! శ్రుతి హాసన్
సినీ సెలబ్రిటీలు గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే..అందం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కోసారి కాస్మెటిక్ సర్జరీలు తప్పవు కూడా. అది అందరికీ తెలిసిందే. చాలామంది ప్రముఖులు తాము చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు గురించి బయటకు గమ్మున చెప్పరు. కానీ కొందరు ధైర్యంగా చెబుతారు. పాపం అదే వారిని ఇక్కట్లు పాలు చేస్తుంది.నిజాయితీగా మాట్లాడారని మెచ్చుకోకపోయినా పర్లేదు..ఏకంగా తీసిపడేసినట్లుగా కామెంట్లు, సోషల్ మీడియా ట్రోలింగ్తో మానసికంగా చంపేస్తుంటారు. అలాంటి పరిస్థితినే తాను ఎదుర్కొన్నానంటూ టాలీవుడ్ నటి శ్రుతి హాసన్ తన గోడును వెళ్లబోసుకున్నారు.ఏం జరిగిందంటే..గాయని, ప్రముఖ నటి శ్రుతిహాసన్(Shruti Haasan) తన మనసులోని మాటను మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పేస్తారామె. అలానే తాను చేయించుకున్న కాస్మెటిక్ విధానాల గురించి చాలా ఓపెన్గా చెప్పింది. అలా చెప్పడంతో ఒక్కసారిగా అంతా ఆశ్యర్యపోయారు, ఆమె ధైర్యానికి మెచ్చుకున్నారు కూడా. అంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి మొదలైన కష్టాలు అంతా ఇంత కాదు. ఓహో ప్లాస్టిక్ సర్జరీ బేబీ అని మాట. ఆమె శరీరం అంతా ప్లాస్టిక్నే అంటు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజాయితికి లభించిన మూల్యం అని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇతర నటి నటులు కూడా తాను చేయించుకున్న వాటికంటే ఎక్కువ చేయించుకుని ఉండొచ్చు. అయినా అది వారి వ్యక్తిగత విషయం. అందం, దాని ప్రామాణికత పరంగా ఒక్కొక్కరిది ఒక్కో విధానంలో ప్రాముఖ్యత ఇస్తారు. అలా అని దాన్ని అందరూ అనుసరించాలని తామేమి సందేశం ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనవి, వారి వారి ఇష్టాలకు సంబంధించినవి. అయినా ఒకరి ఇష్టాన్ని ఎవ్వరూ జడ్జ్ చేయలేం అనేది నర్మగర్భంగా అంగీకరించాల్సిన విషయం. అలాగే తాను చేస్తున్న పని, జీవితం, ప్రేమ వంటి వాటికి సంబంధించిన వాటి గురించి చాలా ఓపెన్గా మాట్లాడేస్తుంటాని అన్నారామె. కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ నిజాయితీ అస్సలు పనికి రాదని, అలా చెప్పిన తత్క్షణమే వేళ్లన్నీ నా వైపు చూపించడం మొదలవుతుందని అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. నిపుణులు ఏమంటున్నారంటే..ఇది అందరికి వర్తిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకప్పుడూ చాలా ఓపెన్గా మన మనసులో విషయాలను స్వచ్ఛంగా మాట్లాడేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని ట్రోలింగ్ రాయుళ్లను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి మాట్లాడాల్సిందే. ఇక్కడ అందరూ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా సొంత విషయాలు లేదా వ్యక్తిగత విషయాల ప్రస్తావించక పోవటమే మేలు అనే సూత్రాన్ని అవలంభించాలి అదే నేటి కాలంలో శ్రీరామ రక్ష అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: 'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..) -
పెళ్లి రోజు: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్
మాజీ మంత్రి, వైసీపీనేత ఆర్కే రోజా (R K Roja) తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. భర్త రోజా ఆర్కే సెల్వమణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా తన వివాహ బంధంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. రోజా ఇన్స్టా పోస్ట్ ❝మణి ఎదలో…రోజా పూదోట…అదే నింగి, అదే నేల…అదే దివి, అదే భువి…అదే నీరు, అదే గాలి…నింగిలో మార్పు, నేలలో మార్పు జరిగినా...పంచభూతాల సాక్షిగా,మనువాడిన మణి నీఎదమది తోటలో ప్రతీ రోజూవికసించే రోజానైనీ వెంట…నీ జంటగానిలిచాను...!!మన 34 ఏళ్ళ ప్రయాణంనా జీవితానికి అందమైన కానుక...ప్రతీ క్షణం తోడుగా, బలంగా,ప్రేమగా నన్ను నిలిపినమీకెప్పటికీ రుణపడిఉంటాను..❜దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఆగస్టు 21న రోజా, దర్శకుడు సెల్వమణి వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్ను తయారు చేశాడు. జీవాను ఎఫ్డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!) -
నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!
హైదరాబాద్ నగరంలో ప్రతీ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ పండగ సందడి మొదలైంది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా గణేష్ మండపాలను నిర్మిస్తున్నారు. మరోవైపు నిర్వాహకులు భారీ గణనాథులను ఆగమనం పేరుతో గ్రాండ్గా మండపాలకు తీసుకొస్తున్నారు. వినాయక నిమజ్జనానికి భారీ ఉత్సాహంతో బ్యాండ్ బాజాతో వెళ్లడం విధితమే. అయితే ఈసారి నగరంలో మండపాలకు వినాయకులకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు. ఈ కొత్త సంస్కృతి నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మూసారాంబాగ్ జేజీవైఏ అసోసియేషన్ నిర్వాహకులు 22 ఫీట్ల భారీ గణేష్ విగ్రహాన్ని గ్రాండ్ సెలబ్రేషన్స్తో మండపానికి తరలించారు. గణేశుడి రాక, గణేశోత్సవ వేడుకలలో మహారాష్ట్ర బ్యాండ్ ఆట పాటలు, కలర్ఫుల్ ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఆగమన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జనం కాకుండా, ఆగమనం కార్యక్రమాలను భారీ సెటప్స్తో మండపాలకు తీసుకొస్తున్న ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంది.(చదవండి: Fake Wedding: పెళ్లి థీమ్..పార్టీ జూమ్..! ఇది పెళ్లిళ్లకు పేరడి..) -
పెళ్లి థీమ్..పార్టీ జూమ్..
మిరుమిట్లు గొలిపే లైట్లు, మెరిసే డిజైనర్ దుస్తులు, చెవుల్లో హోరెత్తించే మ్యూజిక్, నోరూరించే ఆహారం.. ఉత్సాహభరిత వాతావరణం.. ప్రతిదీ విలాసమే, విశేషమే.. వేదికను చూడగానే చెప్పేయవచ్చు అది ఖరీదైన వివాహ వేడుక అని. అవును నిజమే.. అక్కడ పెళ్లి జరుగుతున్న ఆనవాళ్లన్నీ ఉన్నాయి కానీ.. అగ్నిగుండాలు, వధూవరులు మాత్రం లేరు. బంధువులు లేరు, కన్నీటి వీడ్కోలు లేవు. అదేమిటి? అంటే అదే ఫేక్ వెడ్డింగ్ థీమ్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ పార్టీలను సరికొత్తగా మారుస్తున్న ట్రెండ్. హోటళ్లు, క్లబ్బులు ఈవెంట్ కంపెనీలు వరుసగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఈ ఈవెంట్లు పూర్తిగా వినోదం కోసం రూపుదిద్దుతున్నారు. ఎటువంటి ఒత్తిడి, ఆచారాలు లేదా బాధ్యతలు లేకుండా వివాహ విందుకు సంబంధించిన పూర్తి అనుభవాన్ని అందిస్తాయివి. సింపుల్గా చెప్పాలంటే, ఇది వివాహ నేపథ్య నైట్ పార్టీ. వెస్ట్రన్ నుంచి వెల్కమ్.. కొన్ని నెలలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మోడల్ పెళ్లిళ్లు సందడి చేస్తున్నాయి. నగరంలో మాత్రం ఇటీవలే ప్రవేశించాయి. ఈ పార్టీలకు స్నేహితులతో కలిసి హాజరైన వారు, సంప్రదాయ భారతీయ వివాహ వేడుకల్లోని అనేక భాగాలను నాటకీయతతో మేళవించి విందు వినోదం ఆస్వాదిస్తారు. ‘సిటీలో ఫేక్ వెడ్డింగ్లో భాగంగా ఒక ఖరీదైన క్లబ్లో సంగీత్ నిర్వహించారు. అక్కడ వాతావరణం ఉల్లాసంగా ఉంది. సీక్విన్డ్ చీరలు లెహంగాలు (పొడవాటి స్కర్టులు బ్లౌజులు) ధరించిన మహిళలు, టైలర్డ్ కుర్తాలు జాకెట్లలో పురుషులు కనిపించారు. ఒక సంప్రదాయ ధోల్ డ్రమ్మర్ జనాన్ని డ్యాన్స్ ఫ్లోర్కు నడిపించాడు..’ అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన శివాంగి దీనిని ఓ ఆసక్తికర పార్టీగా అభివర్ణించారు. ‘సంప్రదాయ వివాహాలలో ఒత్తిడి ఉంటుంది. దుస్తులు ధరించడం చుట్టూ నియమాలు, బంధువుల ఆక్షేపణలు, కానీ ఇక్కడ అవేవీ ఉండవు.. సో సరదాగా ఉంటుంది.’ అని ఆమె చెప్పారు.రూ.1500తో పెళ్లిలోకి ఎంట్రీ.. ఈ పార్టీ టిక్కెట్ ధరలు సాధారణంగా దాదాపు రూ.1,500 నుంచి ప్రారంభమవుతాయి. సౌకర్యాలను బట్టి రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. శివాంగి ఆమె స్నేహితులు హాజరు కావడానికి ప్రతి జంటకు రూ.10 వేలు చెల్లించారు. ‘నెలకు ఒకసారి ఆ మాత్రం ఖర్చు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే.. ఈ అనుభవం అంతకు మించి విలువైనది.‘ అంటున్నారామె. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెస్టారెంట్ యజమాని శరద్ మాట్లాడుతూ.. కొత్త కొత్త అనుభవాలను అతిథులకు అందివ్వడం ఆతిథ్య రంగంలో కీలకమన్నారు. విదేశాల్లో మనోళ్లే.. క్లాప్ కొట్టారుగత నెలలో బెంగళూరులో 2,000 మంది హాజరైన ఫేక్ వివాహ విందుకు ఆతిథ్యం ఇచ్చిన 8 క్లబ్ ఈవెంట్స్ సహ వ్యవస్థాపకుడు కౌశల్ చనాని, నకిలీ వివాహ వేడుకలకు ప్రేరణ విదేశాలలో నివసిస్తున్న యువ భారతీయుల నుంచి వచ్చిందని చెప్పారు. వారు అక్కడ ఉండి మన పెళ్లిళ్లు మిస్ అవుతున్నారు. అదే వీటిని డిజైన్ చేయించింది అన్నారాయన. ‘అన్ని పారీ్టల్లాగే ఇక్కడా జన సమూహం ఉంటుంది. వారంతా బాలీవుడ్ సంగీతానికి నృత్యం చేస్తారు.. సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.. సరికొత్త సాయంత్రాన్ని ఆనందిస్తారు’అని ఆయన అన్నారు. ట్రెండీగా మారింది.. ఫేక్ వెడ్డింగ్ పార్టీస్ ఇప్పుడు సిటీలో ఫ్రెష్గా ట్రెండీగా మారాయి. కార్పొరేట్ ఉద్యోగులు, స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పబ్స్, క్లబ్స్లో కూడా ఈ తరహా పార్టీస్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో భాగమైన సంగీత్ను పార్టీ పీపుల్ బాగా కోరుకుంటున్నారు. ఒక డీజెగా ఇది నాకు కూడా భిన్నమైన ఎంజాయ్మెంట్ను అందిస్తోంది. – డీజె పీయూష్ పెళ్లి సందడిని రుచి చూపిస్తున్నాం..ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ద్వారా ఆఫ్లైన్ ఈవెంట్స్ డిజైన్ చేసే సంస్థగా అండర్ గ్రౌండ్ ఫెరారి, పూల్ పారీ్ట.. వంటివి నిర్వహిస్తున్నాం. ఈ ఫేక్ వెడ్డింగ్ పారీ్టలు పాశ్చాత్య దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తరచూ పెళ్లి వేడుకల్ని మిస్ అవుతున్నవారి కోసం వీటిని డిజైన్ చేశారు. ప్రస్తుతం మన దేశంలో కూడా కార్పొరేట్ వర్క్ కల్చర్ వల్ల దగ్గరి బంధువులు, సొంత ఊర్లో పెళ్లిళ్లకు కూడా హాజరు కాలేకపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫేక్ షాదీ కాన్సెప్ట్ను మేం తొలుత బెంగళూర్కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలకు తీసుకెళ్లాం. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది సంప్రదిస్తున్నారు. త్వరలోనే నగరంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది. – మాథుర్, సహ వ్యవస్థాపకులు, 8 క్లబ్ ఈవెంట్, బెంగళూర్ (చదవండి: 'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
వీల్ఛైర్కే పరిమితం చేసే అరుదైన రుగ్మత..! కానీ ఇవాళ గిన్నిస్ రికార్డు..
ఆస్తిపాస్తిల్లా కొన్ని వ్యాధులు వంశాపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మందులతో నయం కానీ ఆ జబ్బులతో సహవాసం నరకం అనే చెప్పాలి. అలాంటి రుగ్మతతో బతకడమే గాక..తనలా బాధుపడుతున్న వారిలో స్థ్యెర్యాన్ని నింపేలా రికార్డు సృష్టించే పనిలో ఉన్నాడు ఈ 31 ఏళ్ల వ్యక్తి.అహ్మదాబాద్లోని వదోదరకు చెందిన సాగర్ బ్రహ్మభట్ మార్షల్ ఆర్ట్స్ అభిమాని. అతడు పట్టుదలతో వీల్ఛైర్కే పరిమితం చేసే వంశాపారంపర్య వ్యాధిపై గెలిచి, సమర్థవంతంగా నిర్వహించి బతకొచ్చని నిరూపించాడు. బ్రహ్మభట్ స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA) అనే కండరాలను నాశనం చేసే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి అతని తాత, నాన్నను వీల్ఛైర్కే పరిమితం చేసింది. ఇది అతడి కుటుంబంలో వారసత్వంగా వస్తున్న రుగ్మత. అదృష్టవశాత్తు తాను ఆ వ్యాధి బారినపడలేదని సంతోషించేలోపే అటాక్ అయ్యి భయపెట్టింది. అచ్చం తన తండ్రి అనారోగ్యం లాంటి లక్షణాలు సరిగ్గా కోవిడ్ టైంలో మొదలయ్యాయి. అయితే అతడుదాన్ని కొట్టిపరేసి మూడేళ్లు మొండిగా బతికేవాడు. అయితే సరిగ్గా 2023కి సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం వంటి సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా..స్పినోసెరెబెల్లార్ అటాక్సియా(SCA)నిర్థారణ అయ్యింది. స్పినోసెరెబెల్లార్ అటాక్సియా అంటే..ఇది జన్యు పరివర్తన వల్ల కలిగే రుగ్మత. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి నాడీ కణాలు, ఫైబర్లను బలహీనపరిచి సెరెబెల్లమ్ క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా శరీర విధులపై ప్రభావం చూపి..తనంతట తాను పనులు చేసుకోని పరిస్థితి ఎదురవ్వుతుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న మెదడును ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్.ఇక బ్రహ్మభట్ని న్యూరాలిజిస్ట్లు వీట్ఛైర్కే పరిమితం కాకతప్పదని..అందుకు మానసికంగా సిద్ధం అవ్వమని సూచించారు. అతడి తండ్రి ఇటీవలే మరణించడంతో ఇప్పుడు ఆ వ్యాధి తాను భారినపడ్డానంటే అమ్మ, చెల్లి తల్లడిల్లతారని ఆ వ్యాధిని కుటుంబసభ్యులకు చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అమెరికాలో ఉండే దూరపు బంధువుతో మాట్లాడి ఈ వ్యాధిని విదేశాల్లో నయం చేయగలరే లేదా అనే విషయం గురించి చర్చించి తెలుసుకుంటుండేవాడు. అయితే అక్కడ కూడా ఈ వ్యాధికి నివారణ లేదని, మందులతో నిర్వహించాల్సిందేనని తెలుసుకుంటాడు. దాంతో ఫిజియోథెరపీస్టుతో మాట్లాడుతూ తన వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీన్ని తగ్గించుకునేలే ఏం చేయొచ్చు అనేదాని గురించి శాస్త్రీయ పరిశోధనలు కూడా చేశాడు. అయితే తండ్రి లేకపోవడంతో తన పరిస్థితిని మెరుగుపురుచుకునేందుకు ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేలా వ్యాపారంపై దృష్టి సారిస్తూ..అటాక్సియా రోగులు గురించి తెలుసుకుంటుండేవాడు. యూఎస్లో కొందరు ఈ వ్యాధి కోసం తాయ్చి శిక్షణ తీసుకుంటున్నారని తెలుసుకుంటాడు. తాను ఎలాగైనా వీల్చైర్కి పరిమితం కాకుండా బయటపడేలా ఏదైనా చేయాలని భావించి అస్సాంకి చెందిన తాయ్ చి మాస్టర్ బబ్లూ సావంత్ వద్ద శిక్షణ తీసుకుంటాడు. తాయ్ చి (Tai Chi) అంటే..చైనాలో పుట్టిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్. మనస్సు-శరీరాన్ని సమన్వయం చేసే ఒక అభ్యాసం(సాధన) ఇది శ్వాస నియంత్రణ, మైండ్ఫుల్నెస్, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే బ్రహ్మభట్కి ఈ వ్యాయామాలు శరీర కదలికలకు మంచి హెల్ప్ అయ్యాయి. అయితే నేరుగా నడవడం మాత్రం కష్టమయ్యేది. కానీ కారు నడపగలడు, వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలడు. దీని సాయంతోనే బుద్ధిపూర్వకంగా కదలికలు, అవయవాల సమన్వయాన్ని తిరిగి క్రమాంకనం చేయగలిగాడు. ఇది ఒక యుద్ధ కళ మాత్రమే కాదు, మన శరీరాన్నే గాక, అంతర్గత అంశాలపై దృష్టి పెట్టి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సుపై నియంత్రణను సాదించగలుగడమే గాక ఈ భంగిమలు రక్తప్రసరణను మెరుగ్గా ఉంచుతాయి. ప్రస్తుతం బ్రహ్మ భట్ ఈ తాయ్చి సాయంతో స్పెషల్ పర్సన్స్ విభాగంలో 35 పుష్ అప్లు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తనలాంటి వారిలో ఆశావాహ దృక్పథాన్ని అందించి ఈ వ్యాధితో జీవించడం ఎలాగో తెలియజేయాలనేది బ్రహ్మభట్ ఆకాంక్ష. అనారోగ్యంతో భయపడుతూ కూర్చోకూడదు, ధైర్యంగా పోరాడి జయించే మార్గం వెతకాలి అనే సందేశాన్ని ఇస్తోంది కదూ ఇతడి కథ..!.(చదవండి: ChatGPT Weight Loss: ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!) -
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్లో తనతో మాటలు కలుపుతుంది. అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది. ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Tamanna Tanweer | Your Online Bestie (@tamannapasha_official) (చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే మన ప్రాణ సమానమైన వ్యక్తిని రక్షించిన వస్తువు లేదా మనిషి మనకు ఆప్తమిత్రుడు లేదా అత్యంత ఆత్మీయులు. అందుకు అర్థం పట్టేదే ఈ వెడ్డింగ్ గౌను. దీని వెనుకున్న కథ వింటే కళ్లు చెమరుస్తాయి. 'ప్రేమకు అర్థం ఏదంటే'.. అన్న పాట గుర్తొచ్చేలా ఉంటుంది ఈ జంట కథ. చరిత్రలో దాగున్న ఈ అందమైన స్టోరీ ఏంటో చదివేద్దామా..!ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐకానిక్ వెడ్డింగ్ గౌను ఒక జంట ప్రేమకు గుర్తుగా మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదే ఇవాళ స్టైలిష్ వెడ్డింగ్ గౌనుగా బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి నవ వధువు ఇష్టపడే ఆ వివాహ గౌను వెనుక కథ చూస్తే ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. దీని గురించి సంస్కృతి, చరిత్రపై అమితాసక్తి కలిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మే షరీఫ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేశారు. దాంతో ఈ వెడ్డింగ్ గౌను వెనుకున్న లవ్స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. అంతేగాదు 'ప్రేమకు అర్థం ఎవరంటే?'..అన్న పాటను గుర్తుకుతెస్తోంది. ఆ వీడియోలో షరీఫి ప్రముఖులు ధరించిన ఎన్నో వెడ్డింగ్ గౌనులు చూసుంటారు గానీ ఈ పారాచూట్ వెడ్డింగ్ గౌను(parachute wedding dress) గురించి విన్నారా అంటూ ఆ స్టోరీ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. This wedding dress was made from a parachute that saved Maj. Claude Hensinger during WWII. In our @amhistorymuseum: https://t.co/0lf4659Pu0 pic.twitter.com/dSvRHwnvl7— Smithsonian (@smithsonian) June 16, 2017 వెడ్డింగ్ గౌను వెనుకున్న కథ..1947లో, ఒక మహిళ రెండవ ప్రపంచ యుద్ధం(World War II)లో తన భర్త ప్రాణాలను కాపాడిన పారాచూట్నే వెడ్డింగ్ గౌనుగా డిజైన్ చేసిందట. నైలాన్ ఫ్రాబ్రిక్ క్లాత్తో ఉండే పారాచూట్ని చాలా అందమైన వివాహ దుస్తులుగా మార్చిందామె. ఆ జంటే మేజర్ క్లాడ్ హెన్సింగర్, రూత్లు. 1947 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికన్ బీ 29 పైలట్ అయిన మేజర్ క్లాడ్ హెన్సింగర్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. వెంటనే పారాచూట్ సాయంతో తన సిబ్బందిని, తనను రక్షించుకున్నారు. అంతేగాదు వారు ఆగిన నిర్మానుష్య ప్రదేశానికి అధికారులు వచ్చేంతవరకు వారికి ఆ పారాచూట్ రక్షణ కవచంలా వెచ్చదనాన్ని అందించింది. అతను సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయపడిన వెంటనే తన స్నేహితురాలు రూత్ని నేరుగా కలసి జరిగినదంతా వివరించి ఆ పారాచూట్ని ఆమెకు ఇచ్చాడు. తన భర్త ప్రాణాలను కాపాడిన ఈ పారాచూట్ తనకెంతో అపురూపం అంటూ దాంతోనే వెడ్డింగ్ గౌనుని స్వయంగా రూపొందించుకుంది. అంతేగాదు దాన్ని ఆ దంపతులు ఎంత భద్రంగా ఉంచుకున్నారంటే..తన కూతురు, కోడలు కూడా వారి వివాహంలో ఆ గౌనునే ధరించారు. ఆ తర్వాత స్మిత్సోనియన్ మ్యూజియంలో ఆ గౌను నేటికి పదిలంగా ఉంది. View this post on Instagram A post shared by Mae Sharifi (@history_mae) (చదవండి: Smartphone Photography: కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ) -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ
ఒక్క ఫొటో అనేక భావాలను, అర్థాలను ప్రతిబింబిస్తుంది. చరిత్రలోని అనే సంఘటనలను, మధురానుభూతులకు కళ్లకు కట్టేది ఈ చిత్రమే.. అయితే ఒకప్పుడు ఇది సామాన్యునికి బహుదూరం.. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేడు ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మధురమైన జ్ఞాపకాలను పదిలపరుస్తోంది.. మరికొందరికి ప్రకృతిలోని ప్రతిదీ చిత్రీకరించే సాధనంగా మారుతోంది. మొబైల్ రాకతో ఇది మరింత చేరువయ్యింది.. ఈ నేపథ్యంలో మొబైల్ ఫొటోగ్రఫీ అనే హాబీ ట్రెండింగ్ అవుతోంది.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఔత్సాహికులు వారు తీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో రీల్, సినిమాలు, జోకులు, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. దీనికి భిన్నంగా గత కొంతకాలంగా యువతకు సంబంధించిన క్రియేటివ్ వర్క్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్లో ఫొటోలు తీయడం హాబీగా మారిన కొందరి ఫొటోలు ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టులుగా తెగ వైరల్ అయ్యాయి. వీటికి షేర్లు, లైకులు కొడుతూ పలువురు కామెంట్లు చేశారు. ఫొటో గ్రఫీపట్ల తమకున్న ప్యాషన్ని, తమలోని క్రియేటివిటీని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు. ఒక్కో ఫొటోకూ.. ఒక్కో కథ.. ఈ ఏడాది ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలు విభిన్న, వినూత్న ఫొటోలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరు తమ కెమెరాలో బంధించిన ప్రత్యేక క్షణాలను షేర్ చేస్తూ ‘ఇదే నా స్టైల్, ఇదే నా ప్రత్యేకత’ అని తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు యువత ప్రకృతిని తమ కెమెరాలో బంధించగా, మరికొందరు నగర జీవన శైలిని, మరి కొందరు ట్రావెలింగ్, సంస్కృతి, ఆర్ట్, చరిత్ర, ఫుడ్ ఫొటోగ్రఫీ వంటి అంశాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకునే ఓ వేదిక. ప్రతి ఫొటో ఒక కొత్త కథ చెబుతోంది. అందుకే ఈ ఫొటోగ్రఫీ దినోత్సవం కేవలం ఫొటోల పండుగ మాత్రమే కాదు.. ఒక లైఫ్ స్టైల్ ఫెస్టివల్ అని చెప్పకనే చెబుతోంది. సోషల్ మీడియా పాత్ర.. ఫొటోగ్రఫీకి సోషల్ మీడియా ఒక ప్రధాన వేదికగా మారింది. ఒకప్పుడు ఔత్సాహికులు తీసిన ఫొటోలను ఇంట్లో, ఆల్బమ్స్లో చూసేవాళ్లు. ఇప్పుడు అదే ఫొటోలు నిమిషాల్లోనే ప్రపంచానికి చేరుతున్నాయి. ఇన్స్టా ‘ఫోటోగ్రఫీ డే హాష్ట్యాగ్’తో పోస్ట్ చేస్తే, అది వేల మందికి చేరుతుంది. ఫేస్బుక్లో షేర్ చేస్తే స్నేహితులు, బంధువులు లైక్స్తో ప్రోత్సహిస్తారు. ఎక్స్లో పోస్ట్ చేస్తే వెంటనే ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ స్టేటస్ ద్వారా మన స్నేహితుల సర్కిల్లో హైలైట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్నపాటి ప్రచార సాధనం ఉన్నట్లు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభను చూపించడానికే కాకుండా, నెట్వర్కింగ్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క ఫొటో ఆధారంగా అనేక మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ఫొటోలు పోస్టు చేయడం ద్వారా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల దృష్టికి చేరుతున్నారు. మోడలింగ్, ఫొటో ఎగ్జిబిషన్, బ్రాండ్ ప్రమోషన్స్ వంటి అవకాశాలు పొందుతు న్నారు. జన్–జీ స్టైల్ అండ్ క్రియేటివిటీ.. ఫొటోగ్రఫీ డే నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ ఫొటోలను కేవలం షేర్ చేయడమే కాదు.. వాటికి ప్రత్యేక ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, క్రియేటివ్ క్యాప్షన్స్ జోడించడం ద్వారా కొత్త ట్రెండ్ సృష్టించారు. లైఫ్ స్టైల్ యాప్స్ ఫొటోగ్రఫీని కేవలం హాబీ స్థాయి నుంచి ప్రొఫెషనల్ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఒక మంచి ఫొటోతీసి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే, అది స్ఫూర్తిగా మారుతుంది. నగరంలోని యువత తమ ఫొటోగ్రాఫిక్ స్కిల్స్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చారి్మనార్, హుస్సేన్ సాగర్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు కొత్త కోణంలో కెమెరా కంట పడగా, నగర ఆధునిక లైఫ్ స్టైల్ కూడా ఫ్రేమ్లో బంధీ అయ్యాయి. (చదవండి: లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు..) -
మొక్కిన చోటే 'మొలకెత్తి'..!
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణేశ నవరాత్రి పూజలు చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. గ్రీన్ గణేశ పేరిటి రీ సస్టైనబిలిటీ, 92.7 బిగ్ ఎఫ్ఎమ్లు మరో ముందడుగు వేశాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేసే సీడ్ గణేశ విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీలోని మై హోం భూజ గేటెడ్ కమ్యూనిటీలో సీడ్ గణేశ విగ్రహాల పంపిణీ వాహనాన్ని నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నటి మధుషాలిని, రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ మాలిక్ జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. నగరవ్యాప్తంగా మొత్తం 1500 ప్రతిమలను పంపిణీ చేయనున్నారు. పర్యావరణానికి మేలుచేసే ఆక్రీ యాప్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆక్రీ యాప్లో సంప్రదిస్తే శానిటరీ వేస్ట్, డైపర్స్, ప్లాస్టిక్, ఈ వేస్ట్, పేపర్ కార్డ్బోర్డ్, ఉడ్ అండ్ ఫర్నీచర్, క్లాత్స్, షూస్, మెటల్ స్క్రాప్ సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. సేకరించే చెత్తకు కొంత డబ్బులు కూడా చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో 92.7 ఎఫ్ఎం ఆర్జే శేఖర్ భాషా, ఆర్జే గ్రేస్, మై హోం భూజ అసొసియేషన్ ప్రతినిధులు రాజు మధనపల్లి, విద్యా రెడ్డి, డాక్టర్ కుమార్ పాల్గొన్నారు. (చదవండి: 82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..) -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
రెండవ భార్యకీ – తన పిల్లలకూ భర్త ఆస్తిలో, పెన్షన్లో హక్కు ఉంటుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చని΄ోయిన తర్వాత, లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండోపెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతోపాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చని΄ోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతాయి.అయితే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్ కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కానీ పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్లో ఎటువంటి హక్కూ ఉండదు. అయితే అన్ని వేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలంటూ చని΄ోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం. అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికీ, మెయింటెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికీ తేడా ఏమీ లేదని అంటూ, భర్త బతికివుండగా మొదటి భార్యకు రావలసివున్న మెయింటెనెన్స్ బకాయిలు కూడా తనకు ఇవ్వాలి అని కోర్టు పేర్కొంది. మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం పెన్షన్ రూల్స్లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్లో సమాన హక్కు ఉంటుందని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి కాబట్టి కేసు పూర్వాపరాలను బట్టి కొన్ని హక్కులు రెండవ భార్యకూ వర్తిస్తాయా లేదా అన్నది పూర్తిగా ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు చట్టాన్ని ఆశ్రయిస్తే తగిన ఉపశమనం దొరికే ఆస్కారం ఉంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)(చదవండి: Pregnant Women: బీకేర్ఫుల్.. మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!) -
మిస్ యూనివర్స్ వేదికపై అందాల ‘మణి’క
నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025పోటీలో పాల్గొనబోతున్న భారతీయ సుందరిగా మనికా విశ్వకర్మ(Manika Vishwakarma) ఎంపికైంది.రాజస్తాన్కు చెందిన మనిక విశ్వకర్మ ప్రస్తుతం పోలిటికల్ సైన్స్ చదువుతోంది. క్లాసికల్ డాన్సర్గా ప్రతిభ చూపడమే కాదు ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి పుట్టుకతోనే న్యూరో సమస్యలతో బాధపడే చిన్నారులకు సాయం చేస్తోంది మనిక. ఆమె పరిచయం.దాదాపు 100కు పైగా దేశాల సుందరీమణులు పాల్గొనే ‘మిస్ యూనివర్స్’పోటీలలో 2025 సంవత్సరానికి భారతదేశం తరఫున పాల్గొనే ప్రతినిధిగా 22 సంవత్సరాల మనిక విశ్వకర్మ ఎంపికైంది. జైపూర్లో మంగళవారం తెల్లవారుజాము వరకూ సాగిన తుది ఎంపిక వేడుకలో మనిక విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటం దక్కించుకుంది. గత సంవత్సరం ఈ టైటిల్ గెలుచుకున్న రియా సిన్హా ఆమెకు కిరీటం తొడిగింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ అప్గా, హర్యాణకు చెందిన మెహక్ ధింగ్రా రెండవ రన్నర్ అప్గా ఈపోటీలో నిలిచారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అందగత్తెలు ఈపోటీలో పాల్గొనగా రాజస్తాన్కు చెందిన మనిక విజేతగా నిలిచింది. నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న 74వ ‘మిస్ యూనివర్స్’పోటీలలో మనిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశం నుంచి సుస్మితాసేన్ (1994), లారా దత్తా (2000), హర్నాజ్ సంధు (2021) గెలుచుకున్నారు.స్త్రీ విద్య ముఖ్యమైనదిమిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత తుది ఎంపికలో జ్యూరీ అడిగిన ప్రశ్నకు మనిక ఇచ్చిన జవాబు అందరినీ ఆకట్టుకుంది. ‘స్త్రీలకు విద్య అందించే అవకాశం ఒకవైపు, పేద కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన అందించే అవకాశం మరోవైపు నీకు ఉంటే దేనిని ఎంచుకుంటావ్’ అనే ప్రశ్నకు మనిక ‘నేను స్త్రీ విద్యనే ఎంచుకుంటాను. ఎందుకంటే స్త్రీలకు విద్య నేర్పించడం వల్ల ఆమె మాత్రమే మారదు... కుటుంబాలు... తద్వారా భవిష్యత్ తరాలు మారుతాయి’ అని సమాధానం ఇచ్చింది.డాన్సర్, పెయింటర్రాజస్తాన్లోని గంగానగర్ అనే చిన్న పట్టణానికి చెందిన మనిక విశ్వకర్మ బాల్యం నుంచి క్లాసికల్ డాన్సర్. పెయింటర్ కూడా. ఆమెను లలిత కళా అకాడెమీ, జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్ సత్కరించాయి కూడా. పోలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఢిల్లీలో ఉంటూపోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే అందాలపోటీలో పాల్గొంది మనిక. ఒక సాధారణ నేపథ్యం నుంచి విజేతగా నిలిచింది. ‘అందరూ ఈ సమయంలో తాము పడ్డ కష్టాల గురించి చెబుతారు. కాని నేను నాకు దొరికిన సపోర్ట్ గురించి చెబుతాను. మా అమ్మా నాన్నలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నాకు చదువు నేర్పిన గురువులది తర్వాతి స్థానం. నా స్నేహితులు ఎంతో ్రపోత్సహించారు. వీరందరూ లేకుంటే నేను ఇక్కడి వరకూ రాను’ అని చెప్పిందామె.సామాజిక సేవలో...పుట్టుకతోనే న్యూరో సంబంధ సమస్యలతో పాల్గొనే చిన్నారుల కోసం ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించింది మనిక. డౌన్ సిండ్రోమ్, ఏడీహెచ్డీ వంటి సమస్యలతో బాధ పడే చిన్నారులకు తగిన కౌన్సెలింగ్, సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ‘మిస్ యూనివర్స్ వంటిపోటీలు గుర్తింపును ఇవ్వడం మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతాయి. ఈపోటీలలో సవాళ్లను ఎదుర్కొంటూ విజేత అయ్యాను. ఈ గుర్తింపుతో నా సామాజిక సేవను విస్తరిస్తాను. సమాజానికి ఏదో ఒకటి చేయడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత’ అంది మనిక. -
'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..
సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించిన ఎందరో బామ్మలు, ముత్తాతల స్టోరీలను చూశాం. ఒక్కొక్కరిది ఒక్కో కథ. వివిధ కారణాల రీత్యా వారంతా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు. కానీ వందేళ్లకు చేరువయ్యేటప్పటికీ.. అంత చురుగ్గా లేరు. కానీ వృద్ధాప్యాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడంలో స్ఫూర్తిని కలిగించారు. కానీ ఈ బామ్మ వందేళ్లుంటాయా..! అని ఆశ్చర్యపోయేలా ఆమె ఆహార్యం ఉంటుంది. అచ్చం సంతూర్ యాడ్ తలపించేలా భలే యాక్టివ్గా యంగ్ విమెన్లా ఉంటుంది. అంతేకాదండోయ్ చూడటానికి మంచి అందంగా కూడా ఉంటుంది ఈ బామ్మ. ఆఖరికి ఫిట్నెస్లో కూడా ఆమెకు సరిరావెవ్వరూ..!.. అన్నట్లుగా కసరత్తులు చేస్తుంది ఈ బామ్మ. ఆ బామ్మ పేరు హోస్ట్ ర్యాన్ జేమ్స్ రూత్. ఆమెకు వందేళ్లు. ఆమె స్వయంగా తన దీర్ఘాయువు రహస్యాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ..తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోని పంచుకుంది. ఆ వీడియో క్లిప్లో జిమ్లో రకరకాల మిషన్లపై ఎలాంటి వ్యాయామాలు చేయగలదో చూపించడమే గాక..ప్రతిరోజూ తప్పకుండా 4 మైళ్లు దూరం నడుస్తానని అంటోంది. అదే తనను ఇన్నాళ్లు ఆయురారోగ్యాలతో జీవించేలా చేసిందని చెబుతోంది. తాను పదవీవిరణమణ చేసినప్పటి నుంచి నాలుగు మైళ్లు దూరం నడుస్తున్నట్లు తెలిపింది. చక్కటి వ్యాయామాలు, 9.30 కల్లా కంటినిండా నిద్రపోవడం తదితరాలే తన ఆరోగ్య రహస్యమని అంటోంది. ఎక్కువగా కూరగాయలే తీసుకుంటాను, పైగా ఆరోగ్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటానంటోంది. చివరగా తాను అత్యంత ధనవంతురాలిగా పేర్కొంది. అంటే ఆయురారోగ్యాలకు మించిన ఐశ్వర్యం లేదని పరోక్షంగా ఇలా చెప్పింది ఆ బామ్మ. ఇదిలా ఉండగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..వృద్ధాప్యంలో చక్కగా వ్యాయామాలు చేస్తే రక్తపోటు, బ్రెయిన్-గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయట. అలాగే కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. పైగా బరువుని నిర్వహించగలమని, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, నెటిజన్లు ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం విని విస్తుపోవడమే కాదు..ఆమె ఈ వయసులో ఏకంగా నాలుగు మైళ్ల దూరం నడుస్తోందంటే..ఈమె సూపర్ బామ్మ. ఫిట్నెస్లో ఈమెకు సరిరెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by evry.day club (@evrydayclub) (చదవండి: Pregnant Women: బీకేర్ఫుల్.. మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!) -
400 లగ్జరీ బ్యాగ్స్, ఈ పిచ్చిలేకపోతే ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని: నటి
సెలబ్రిటీ విమెన్ అంటే లగ్జరీ బ్యాగులు, లగ్జరీ కార్లు కామన్. లగ్జరీ వస్తువుల కలెక్షన్ అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు వస్తారు. కానీ ఈ విషయంలో నేనేమీ తక్కువ కాదంటోంది బాలీవుడ్ అందాలభామ అమీషా పటేల్.అమీషా పటేల్ వద్ద వందల సంఖ్యలో లగ్జరీ బ్యాగులున్నాయి. దీంట్లో ఒక బ్యాగు ఖరీదు రూ. 70 లక్షలు. ఈ బ్యాగులు కొనకపోతే ఆ డబ్బులతో ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని అని స్వయంగా అమీషానే జోక్ చేసిందంటే వాటి విలువను అర్థం చేసుకోవచ్చు.ఫరా ఖాన్ ప్రముఖుల ఇళ్లను సందర్శించే యూట్యూబ్ షో తాజా ఎపిసోడ్లో దక్షిణ ముంబైలోని నటి అమీషా పటేల్ (ఆగస్టు 18 సోమవారం) ఇంటిని సందర్శించిన వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె రెడ్ చికెన్ థాయ్ కర్రీని కూడా వండింది, కహో నా... ప్యార్ హై షూటింగ్ ,థాయిలాండ్లో ప్రతి రాత్రి ఆ వంటకం తినడం గురించి గుర్తుచేసుకుంది.ఇంకా ఈ వీడియోలో తన ఇంటితోపాటు ,స్పెషల్ ఎడిషన్ బ్యాగులు , విలాసవంతమైన షూ కలెక్షన్లతో నిండిన బహుళ అల్మారాలను కూడా చూపించింది.400 బ్యాగులు, రూ. 70 లక్షల బ్యాగు కూడాఅమీషా అల్మారాలో బ్యాగుల ధర 5 లక్షల నుండి ప్రారంభమవుతాయనీ, డిజైన్ సేకరణను బట్టి పది లక్షల వరకు ఉంటుందని తెలిపింది. డియోర్ , బొట్టెగా వెనెటా నుండి బిర్కిన్స్ అండ్ YSL టోట్ల వరకు తన దగ్గర ఉన్న ప్రతీవిలువైన వస్తువును పరిచయం చేసింది. తన దగ్గర ‘300-400’ వరకు బ్యాగులు ఉంటాయని వెల్లడించింది. అమీషా పటేల్కు లగ్జరీ బ్యాగ్స్ అంటేచిన్నప్పటినుంచీ చాలి ఇష్టమట. తాజాగా తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్, ఖరీదైన బ్యాగ్ గురించి చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఖరీదైన బ్యాగ్ బిర్కిన్ బ్యాగ్ ధర రూ. 70 లక్షలు ఉంటుందని బయటపెట్టింది. వీటితోపాటు 365 క్లచ్లు బెల్ట్ బ్యాగులు కూడా ఉన్నాయి. అంతేకాతు తనకెంతో ఇష్టమైన పింక క్రోక్ బిర్కిన్ లెదర్ బ్యాగు గురించి ప్రత్యేకంగా చెప్పింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం కొన్నప్పుడు, లేత గులాబీ రంగులో ఉండేదట. క్రమంగా తోలు రంగు మరింత అందంగామారుతోందని చెప్పుకొచ్చింది.ఇక అమీషా షూ కలెక్షన్ విషయానికి వస్తే ఒక్కో షూ ధర రూ. 80,000 నుండి లక్ష వరకు ఉంటుంది. అలాంటివి వందల జతలు ఆమె అల్మారాలో ఉన్నాయి. అమీషా పటేల్ ముంబై ఇల్లుఆమె వ్యక్తిగతంగా తీర్చిదిద్దుకున్న అమీషా ముంబై ఇంటిలో సౌకర్యం లగ్జరీ అభిరుచి కలగలిపి దర్శనమిస్తాయి. పచ్చదనం, వెలుతురు ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాదు గోడలనిండి ఫోటోలు, అరుదైన MF హుస్సేన్ పెయింటింగ్లతో తన కళాభిమానాన్ని చాటుకుంది. అమీషా చివరిగా 2023లో హిట్ మూవీ గదర్ 2లో నటించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో సన్నీ డియోల్ ఉత్కర్ష్ శర్మ కూడా నటించారు. ఈ చిత్రం గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) కి సీక్వెల్. -
బీకేర్ఫుల్..! కాబోయే తల్లులూ..మార్నింగ్ సిక్నెస్ని లైట్ తీసుకోవద్దు!
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ కాస్త నలతగా ఉండటం అనేది సహజం. పైగా చాలామందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ప్రతి ఉదయం మూడ్ స్వింగ్స్ మారుతూ ఒక విధమైన అలసటగా ఉంటుంది. వైద్యులు, పెద్దవాళ్లు కూడా ఈ సమయంలో ఇది అత్యంత సహజం అని చెబుతుంటారు. అలా అని లైట్ తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాంతంకంగా మారిపోయి క్రిటికల్గా పరిణమిస్తుంది. అచ్చం అలానే జరిగింది ఈ బ్రిటన్కు చెందిన ఈ మహిళకు. పాపం ఆ కారణంగా ఆమె అమ్మ అను భాగ్యాన్ని కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్కి చెందిన 29 ఏళ్ల సోఫియా యాసిన్ పెళ్లైన రెండు సంవత్సరాలకు గర్భం దాల్చింది. ఆ విషయ తెలుసుకున్నప్పటి నుంచి ఆ దంపతులిద్దరి ఆనందానికి అవధులు లేవు. అయితే ప్రతి ఉదయం అలసిపోతూ, నీరసంగా ఉండేది. అదే విషయం వైద్యులకు తెలిపినా..ఇది కామన్ అని సర్ది చెప్పారు. ఇది రాను రాను మరింత ఎక్కువ అవుతుందే గానీ తగ్గేది కాదు. ఆఖరికి రాత్రుళ్లు, చెమటలు, దురద వంటి సమస్యలు కూడా ఉత్ఫన్నమయ్యేవి. ఆ తర్వాత 14 వారాల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడూ ఉన్నట్టుండి హఠాత్తు కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా.. బహశా ఆమెకు న్యూమోనియా ఉందేమోనని భావించారు వైద్యులు. అయితే పలు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు గుండెపై కణితి ఉందని, నాన్-హాడ్కిన్కు సంబంధించిన ప్రాణంతక బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్నట్లు వివరించారు. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనైంది. ఏం చేయాలో తెలియని దిగ్బ్రాంతికి గురయ్యారు. అంతేగాదు గర్భాన్ని కూడా కొనసాగించడం సాధ్యం కాదని, ఒకవేళ కొనసాగించినా..ఆ చిన్నారి కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దాంతో ఆ దంపతులు ఒక్కరోజుతో తమ సంతోషమంతా దుఃఖంగా మారిపోయిందని భోరుమని విలపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో 15 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుని ఆరు రౌండ్ల కీమోథెరపీ ట్రీటెమంట్లు తీసుకుంది సోఫియా. ఈ ఏడాది ప్రారంభంలో సోఫియా పూర్తిగా కోలుకుని యథావిధిగా ఆరోగ్యవంతురాలైంది. అంతేగాదు తనలా మరెవ్వరూ బాధపడకూడదని, లింఫోమా(బ్లడ్ కేన్సర్ చెంది)తో పోరాడి గెలిచేలా నిధులు సేకరిస్తోందామె.నాన్-హాడ్కిన్ లింఫోమా అంటే ఏమిటి?నాన్-హాడ్కిన్ లింఫోమా అనేది శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన కేన్సర్. ఇది అవయవాలు, గ్రంథులు, ట్యూబ్ లాంటి నాళాలు, శోషరస నోడ్స్ వంటి కణాల సముహాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగమైన జెర్మ్-ఫైటింగ్ కణాలు శరీరం అంతటా నియంత్రణ లేకుండా పెరిగి, కణితులనే ఏర్పరిస్తే..దాన్నినాన్-హాడ్కిన్ లింఫోమాగా నిర్థారిస్తారు వైద్యులు. సంకేతాలు-లక్షణాలు.. మెడ, చంకలు లేదా గజ్జల్లో వాపు శోషరస గ్రంథులుబొడ్డు నొప్పి లేదా వాపుఛాతీ నొప్పి, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిచాలా అలసటగా అనిపించడంజ్వరంరాత్రిపూట చెమటలు పట్టడంఆకస్మికంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలామటుకు దీన్ని అంత సులభంగా గుర్తించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ పైన చెప్పిన మార్పుల్లో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తుంటే..తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: -
పీరియడ్స్ ఆలస్యానికి పిల్స్ వాడితే ప్రాణాలే పోయాయ్, తస్మాత్ జాగ్రత్త!
పుణ్యకార్యాలు, శుభకార్యాలు, ఆచారాలు, ప్రయాణాలు ఇలా అనేక కారణాలతో పీరియడ్స్ లేదా నెలసరిని వాయిదా (delay period pills) వేయడానికి కొన్ని మందులు వాడతారు. అయితే ఋతుచక్రాన్ని వాయిదా వేసే మాత్రలవల్ల ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. అందుకే పీరియడ్స్ సురక్షితంగా ఆపడం ఎలాగో తెలుసుకోవాలి. వీటివల్ల తలెత్తే ప్రమాదాలను కూడా ముందు అర్థం చేసుకోవాలి.రీబూటింగ్ ద బ్రెయిన్ అనే ఇనస్టా పేజ్లో డాక్టర్ వివేకానంద్,డాక్టర్ శరణ్ శ్రీనివాసన్తో ఇటీవల ఒక హృదయ విదారకమైన కథను పంచుకున్నారు. దీని ప్రకారం 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి పీరియడ్ ఆలస్యానికి మందులు వాడి ప్రాణాలు కోల్పోయింది. ఒక పూజ కోసం మాత్రలు తీసుకోవడం ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఆమె పూజ అయితే పూర్తి చేసింది కానీ కాళ్ళు ,తొడ నొప్పి, తీవ్రమైన అసౌకర్యం లాంటి లక్షణాలతో ఆమె పరిస్థితి తీవ్రంగా మారింది. అస్పత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు పట్టుబట్టినప్పటికీ, తల్లి మరుసటి రోజు ఉదయం వస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆయువతి ప్రాణాలు కోల్పోయింది. క్లిష్టమైన క్షణాల్లో జాప్యం కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందంటూ బాధాకరమైన జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అసలేంటీ పిల్స్మెన్స్ట్రువల్ సైకిల్ను ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నియంత్రిస్తాయి. నెలసరిని వాయిదా వేసే మాత్రలు హార్మోన్ ప్రొజెస్టెరాన్ యొక్క సింథటిక్ రూపమైన నోరెథిస్టెరాన్ను కలిగి ఉంటాయి. View this post on Instagram A post shared by Rebooting The Brain (@rebootingthebrain)వీటి వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలువికారం లేదా జీర్ణ సమస్యలు: తేలికపాటి కడుపు నొప్పి లేదా ఉబ్బరంరొమ్ములో నొప్పి,హార్మోన్ల మార్పులు వాపు లేదా అసౌకర్యానికి కారణం కావచ్చుతలనొప్పి , తలతిరగడం: తరచుగా హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరగవచ్చు.చిరాకు, ఆందోళన లేదా తేలికపాటి నిరాశలాంటి మానసిక స్థితిలో మార్పులు సంభవించవచ్చుఎక్కువ కాలం తీసుకుంటే అధిక రక్తస్రావం. అరుదైన తీవ్రమైన ప్రభావాలురక్తం గడ్డకట్టే ముప్పు రావచ్చు. ముఖ్యంగా గడ్డకట్టే రుగ్మతలు, ఊబకాయం లేదా ధూమపాన అలవాట్లు ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువ.దద్దుర్లు, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి అలెర్జీ సమస్యలు రావచ్చు. ఇలాంటివి సంభవిస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలివైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఎక్కువ కాలం వాడటం ప్రమాదకరం కావచ్చు.ఈ మాత్రలను గర్భనిరోధకంగా ఉపయోగించకూడదు. ఇవి గర్భధారణను నిరోధించవు.సుదీర్ఘ కాలం..సాధారణంగా 5–14 రోజుల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు.సాధారణం ఈ మందు వాడటం అపివేసిన తరువాత ఈ ప్రభావాలు తగ్గిపోతాయి. అలాగే సాధారణంగా ఋతుస్రావం 2–4 రోజుల్లో తిరిగి ప్రారంభమవుతుంది. కానీ పక్షంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్టు, లాపరోస్కోపిక్ సర్జన్ డా. పూజిత సురానేని ఏమంటారంటే..ప్రిమోలుట్ఎన్ (నోరెథిస్టెరాన్ అధిక రక్తస్రావం, బాధాకరమైన పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ , ఎండోమెట్రియోసిస్ వంటి ఋతు రుగ్మతల చికిత్సలో వాడతారు. ఈ ఔషధం కృత్రిమంగా పెరిగిన ప్రొజెస్టెరాన్ స్థాయిలను నిర్వహించడం ద్వారా ఋతుస్రావాలను వాయిదా వేస్తుంది. అయితే దీన్ని ఋతుస్రావాన్ని ఆలస్యం చేయడానికి తరచుగా లేదా సాధారణం ఉపయోగించడం మంచిది కాదు ఎందుకంటే ఇది సహజ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో పీరియడ్ సైకిల్ను ప్రభావితం చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదా అధిక రక్తస్రావానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, పదేపదే వాయిదా వేయడం వల్ల తలనొప్పి, రొమ్ము నొప్పి, వికారం వంటి ప్రతికూల ప్రభావాల ప్రమాదం పెరుగుతుంది. దీర్ఘకాలిక వాడకంతో, రక్తం గడ్డకట్టడం, కాలేయ సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా థ్రాంబోసిస్, కాలేయ వ్యాధి లేదా తీవ్ర రక్తస్రావం చరిత్ర ఉన్న మహిళల్లో విరుద్ధంగా ఉంటుంది. అందుకే వీటిని వాడేముందు నిపుణులైన గైనకాలజిస్ట్ని సంప్రదించాలని కోరుతున్నారు.చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
సువర్ణావకాశం...పొందూరు ఖాదీ...శిక్షణతో ఖ్యాతి..!
శ్రీకాకుళం, పొందూరు: వేసవిలో చల్లదనం.. శీతాకాలంలో వెచ్చదనం ఇవ్వడం పొందూరు ఖాదీ వ్రస్తాల ప్రత్యేకత. ఈ దుస్తులు ఎంతో సౌకర్యవంతంగా, హుందాగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల వరకూ ప్రతి ఒక్కరూ ధరించేందుకు వీలుగా అందుబాటు ధరల్లో లభిస్తాయి. మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకుల వరకు ఎంతోమంది పొందూరు ఖాదీకి అభిమానులు ఉన్నారు. ఈ ఫైన్ ఖాదీ(సన్నఖాదీ) తయారీకి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పండించే కొండ పత్తిని ఇక్కడ ఉపయోగిస్తారు. దశాబ్ధాల కాలం నుంచి పొందూరు ఏఎఫ్కేకే సంఘం అనేది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్(కేవీఐసీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంఘాన్ని కేవీఐసీ సౌత్జోన్ డిప్యూటీ సీఈవో మదన్కుమార్ రెడ్డి ఇటీవల సందర్శించారు. దీనిలో భాగంగా సంప్రదాయ ఖాదీ వ్రస్తాల తయారీ కేంద్రం మరిన్ని కాలాలు విరజిల్లాలని ఆకాంక్షిస్తూ తన పరిధిలో హామీలనిచ్చారు. ఖాదీ ప్రమోషనల్ గ్రాంట్ నుంచి అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వర్క్òÙడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని, పొందూరు ఏఎఫ్కేకే సంఘంతో కేవీఐసీ కలిసి కొత్తగా నైపుణ్యాలపై శిక్షణా కేంద్రం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేవీఐసీ, జీఎంఆర్ సంయుక్తంగా విలేజ్ ఇండస్ట్రీస్ కింద శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ఖాదీని ముందు తరాలకు అందించేందుకు ఆ అవకాశాన్ని పొందూరు ఏఎఫ్కేకే సంఘం దక్కించుకోవాలని సూచించారు. శిక్షణతో ఉపాధి చేనేత వస్త్ర తయారీలో శిక్షణ ఇవ్వడం వలన నిరుద్యోగులకు ఉపాధి చేకూరుతుంది. నెలకు దాదాపు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. స్పిన్నింగ్, వీవింగ్లో శిక్షణ పొందిన వారంతా సంఘాలకు, సొసైటీలకు దుస్తులు నేస్తూ ఉపాధి పొందుతారు. వాస్తవానికి స్పిన్నర్లు, వీవర్లు, సంఘం ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కేవీఐసీ ఎండీఏ సిస్టంలో ఉత్పత్తిపై 35 శాతం మొత్తాన్నిప్రతీ మూడు నెలలకు ఒకసారి స్పిన్నర్లు, వీవర్లు, ఉద్యోగులకు అందిస్తుంది. ఇదేకాకుండా సంఘాలు మజూరీని అందజేస్తున్నాయి. కొత్త కార్మికులు సంఘంలో చేరి దుస్తులు నేస్తే మరింత ఆదాయం పొందే అవకాశం మెండుగా ఉంది. సొసైటీలకు సహకారం అందాలి అయితే వాస్తవానికి సొసైటీలు, సంఘాలకు దుస్తులు నేసే వారికంటే మాస్టర్ వీవర్స్ దగ్గర ఎక్కువ కార్మికులు ఉండడం గమనార్హం. మాస్టర్ వీవర్స్ నేసే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సొసైటీలు, సంఘాలకు నేసేవారికి ప్రభుత్వ సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి సౌసైటీలు, సంఘాలకు నేసే కారి్మకులకు వర్తింపజేయాలి. దుస్తులు నేసే వారికి షరతులు ఉండకూడదు. ఉదాహరణకు పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో ఏఎంసీ, ఎన్ఎంసీ వ్రస్తాలు మాత్రమే లభిస్తున్నాయి. సీమనూలుతో నేసే వ్రస్తాల తయారీ ఇక్కడ లేదు. అందువలన ఏరకమైన నూలుతోనైనా వ్రస్తాలు తయారు చేయోచ్చన్న అనుమతి కేవీఐసీ నుంచి రావాలి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కారి్మకులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారు. సమయం ఆసన్నమైంది.అంతరించిపోతున్న ప్రాచీన, సంప్రదాయ వస్త్ర తయారీ ప్రక్రియను బతికించేందుకు ఏఎఫ్కేకే సంఘం వడుకు, నేత ప్రక్రియలను నేర్పే శిక్షణా సంస్థగా అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ మేరకు ఏఎఫ్కేకే సంఘం త్వరగా కేవీఐసీ సాయంతో శిక్షణలు ఇచ్చేందుకు భాగస్వామ్యం కోసం అడుగులు వేయాలి. పొందూరులో గతంలో 1,200 మంది స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 520 మందికి చేరింది. గతంలో 300 మంది నేత కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 80 కుటుంబాలు మాత్రమే నేత కారి్మకులుగా మిగిలారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కార్మికులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తవారు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం కేవీఐసీ డిప్యూటీ సీఈవో మదన్మోహన్రెడ్డి పొందూరు ఏఎఫ్కేకే సంఘాన్ని సందర్శించి హామీలివ్వడం వాస్తవమే. కొత్తవారికి వడుకు, నేత ప్రక్రియలపై శిక్షణలు ఇచ్చేందుకు కేవీఐసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణలిచ్చేందుకు ఏఎఫ్కేకే సంఘం సిద్ధంగా ఉంది. – దండా వెంకటరమణ, సెక్రటరీ,ఏఎఫ్కేకే సంఘం, పొందూరు అనుమతులిస్తాం ఖాదీ వ్రస్తాలు తయారు చేసేందుకు పొందూరు ఏఎఫ్కేకే సంఘాన్ని కేవీఐసీతో ట్రైనింగ్ పార్టనర్గా ఉండమని సూచించాం. పొందూరు ఖాదీని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివలన కొత్తతరం వారు ఈ వృత్తిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వడుకు, నేత ప్రక్రియలో శిక్షణ ఇచ్చేందుకు పొందూరు ఖాదీ సంస్థకు దరఖాస్తు చేయమని చెప్పాను. శిక్షణ ముగించుకున్న వారికి సరి్టఫికెట్లు సైతం అందజేస్తాం. ఏ జిల్లా నుంచైనా శిక్షణలకు పొందూరుకు రావచ్చు. వడుకు, నేత పని నేర్చుకోవచ్చు. – మదన్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో,బెంగుళూరు, కేవీఐసీ -
కృత్రిమ మేధస్సుతో వినూత్నంగా కథలు, వార్తలు..!
నగరంలో ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రజల జీవనశైలితో పాటు ఆలోచనా విధానం, సమాచారాన్ని స్వీకరించే పద్ధతుల్లో సైతం కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. రీల్స్ మాదిరిగా వార్తలు కూడా వినోదంగా మారుతున్నాయి. తాజా ఉదాహరణగా కొన్ని వినూత్న తెలుగు వెబ్ అప్లికేషన్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇది సాధారణ న్యూస్ పోర్టల్లా కాకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత తెలుగు వెబ్సైట్, వార్తలను కథలుగా మార్చే విశేష వేదికలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా వార్తలు మనకు పాఠ్యరూపంలో, ఫొటోలు లేదా వీడియోలతో వస్తాయి. కానీ ఈ కొత్త అప్లికేషన్లో రీల్స్ (వీటినే కొందరు ట్రీల్స్ అని అంటున్నారు) రూపంలో అందుతాయి. నిజమైన సంఘటనలు, నిజంగా ఆ బాధను అనుభవించినవారి స్వరంలోనే, చిన్న భావోద్వేగ కథలుగా అందిస్తున్నారు. ఇవి ఒకవైపు సినిమా ట్రైలర్స్ని తలపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫారమ్, సోషల్ మీడియా స్క్రోల్ అనుభూతినీ అందిస్తున్నాయి. భావాలను పంచేలా.. ఒక రీల్లో ఒక ప్రభుత్వ అధికారి తానే కథానాయకుడవుతాడు. ఎప్పుడో అనుమతి లభించిన ప్రాజెక్ట్ కాగితం మీదే మిగిలిపోతుంది. అలా ఎందుకు జరిగిందో తన అనుభవాన్ని మనముందు ప్రదర్శిస్తాడు. మరో రీల్లో మహిళ తన బాధను మాటల్లో కాకుండా ముఖ కవళికలతో తన నిస్సహాయను తెలియజేస్తుంది. అనేక అనేక రంగాలు, అనేక సంఘటనలను రీల్స్, వార్తలు, సమాచారం, కథల రూపంలో ఏఐ ద్వారా తెలియజెప్పడం ప్రస్తుతం ట్రెండ్. ఇవన్నీ 24 గంటల్లోపే ఏఐ సాయంతో సిద్ధం చేయడం ఇందులోని ప్రత్యేకత. రీల్స్, షార్ట్స్, పాడ్కాస్ట్ వంటివి కొత్త అలవాట్లుగా మారాయి. ఇలాంటి సమయంలో ఈ కొత్త ఫార్మాట్ స్థానిక భాషలో ప్రజలకు చేరుతోంది. తెలుగులోనూ వినూత్నంగా.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వివిధ రకాల వేదికలు రూపుదాల్చుతున్నాయి. ఇలాంటి వేదికలు నగరంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రపంచంలో తొలి పూర్తిస్థాయి యాంత్రిక మేధస్సుతో (కృత్రిమ మేధస్సు) పనిచేసే తెలుగు వెబ్ అప్లికేషన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో టైమ్ కృష్ణ అనే వెబ్సైట్లో కొత్త వేదిక మెల్లిగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ చానళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇది వార్తలా కాకుండా సినిమాను తలపిస్తుంది. మొబైల్లో స్క్రోల్ చేసే సామాజిక మాధ్యమాల అనుభూతి ఇస్తుంది. సాధారణ వార్తా సైట్లా కాకుండా భావోద్వేగాలతో నిండిన చిట్టి కథలుగా ‘సత్య రీల్స్’గా మారుతున్నాయి. ఇలాంటి తెలుగు వేదికలు దేశమంతటా ప్రజలే స్వయంగా తమ కథలను పది భారతీయ భాషల్లో రూపొందించుకునే అవకాశం కల్పించబోతోంది. 4 శాతం నుంచి 21 శాతానికి... టైమ్స్ ట్రెండ్ నివేదిక ప్రకారం.. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారుల్లో 1999 నాటికి 4% నుంచి 2019 వచ్చేసరికి 21% నికి మయోపియా పెరిగింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే, విద్య, ఏకాగ్రత ఇతర భావోద్వేగ స్థితిగతులను కూడా ప్రభావితం చేసేలా పెరుగుదల ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాజ్కోట్లో, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో, 10 ఏళ్లలోపు పిల్లల్లో 81% మంది భోజన సమయంలో క్రమం తప్పకుండా స్క్రీన్లను ఉపయోగిస్తున్నారని, ఎక్కువగా కార్టూన్ చూడటానికి ఉపయోగిస్తున్నారని తేలింది. తినడం, నేర్చుకోవడం, నిద్రపోవడం వంటి దినచర్యలో డిజిటల్ పరికరాలు ఎలా చొచ్చుకుపోయాయో ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. -
టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణం మెచ్చే ఫ్యాషన్ ప్రొడక్ట్స్..
ప్యాషన్ యాక్ససరీల్లో లెదర్ బ్రాండెడ్ వస్తువులది ఒక ప్రత్యేక స్థానం. అలాంటి లెదర్ కారణంగా ఎన్నో జంతువులు చనిపోతున్నాయనే విషయం తెలిసిందే. పైగా ఇది పర్యావరణ అనుకూలమైంది కూడా కాదు. దీనికి చెక్పెట్టేలా పర్యావరణ హితంగా ఆహార వ్యర్థాలను నివారించే దిశగా ఒక సరికొత్త లెదర్ని తీసుకొచ్చారు ప్రితేష్ మిస్త్రీ. ఈ సరికొత్త ఆవిష్కరణతో లెదర్ ప్లేస్లో బయోలెదర్ని తీసుకొచ్చి..జంతువులకు హాని కలగకుండా కాపాడటమే గాక పర్యావరణ హిత ఫ్యాషన్ ఉపకరణాలకు నాంది పలికారు. ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..ముంబైకి చెందిన ప్రితేష్ మిస్త్రీకి కాలేజ్లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఈ ఆలోచన తట్టింది. అయితే తన చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా ఈ దిశగా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ ఆవిష్కరణ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆయన బయోలెదర్ కోసం టమాటా వ్యర్థాలనులను వినియోగించారు. దాని నుంచి తయారు చేసిన లెదర్తో బూట్లు, బ్యాగ్లు వంటివి కూడా రూపొందించారు. వీటిని టీబీసీ బ్రాండ్ ఉత్పత్తులుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వాటికి అత్యంత ఆదరణ లభించడమే గాక అందరి ప్రశంసలందుకుంది. అంతేగాదు 2021 పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డుల్లో కూడా ఈ టీబీసీ బయోకంపెని ఉత్పత్తులు ఉత్తమ ఆవిష్కరణగా నిలిచాయి. టమాటాలే ఎందుకు..టమాటాలను ప్రాథమిక ముడి పదార్థంగా ఉపయోగించి పాలియురేతేన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి ప్లాస్టిక్ చోటివ్వకుండా బయోలెదర్ సృష్టించాలన్నది మిస్త్రి లక్ష్యం. జంతువులకు కూడా హాని కలిగించకుండా చేయాలన్నది ప్రధాన అజెండా. ఇక అందుకోసం ఈ టమాటాలనే ఎందుకు ఎంచుకున్నారంటే..భారతదేశం ఏడాదికి 44 మిలయన్ల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం కావడంతో ఈ కూరగాయను ఎంచుకున్నాడు మిస్త్రీ. అదీగాక ఏటా వాటిలో 30 నుంచి 35% వరకు టమాటాలు వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఆ సమస్యకు చెక్పెట్టి..పర్యావరణ హితంగా బయోలెదర్ తయారు చేయాలని భావించాడు. అందులోనూ టమాటాలో స్కిన్, విత్తనాలు, పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది లెదర్ తయారీకీ అత్యంత అనుకూలం అని తెలిపారు మిస్త్రీ. అలాగే జంతువుల చర్మం నుంచి చేసే లెదర్ తయారీ ఫ్యాక్టీరీల నుంచే వచ్చే కాలుష్యాన్ని కూడా ప్రత్యక్షంగా చూడటంతో ఇలా పర్యావరణ హితంగా, ఆహార వ్యర్థాలను నివారించే బయో లెదర్ తయారు చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే తాము లెదర్ తయారు చేయగలిగాం కానీ, దాని, ఆకృతి, మనిక పరంగా నెలల తరబడి శ్రమిస్తే గానీ మంచి నాణ్యమైన బయో లెదర్కి బీజం పడలేదని వివరించారు. అలాగే సహజ రంగులనే ఉపయోగించేలా కేర్ తీసుకుంటామని చెప్పారు. తమ టీబీసీ కంపెనీ టమాటాలు బాగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలోని ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల సాయంతో పొలాల నుంచి నేరుగా టమాటా వ్యర్థాలను సేకరిస్తారట. దాన్ని లెదర్ తయారీకి వీలుగా ఉండే వనరుగా మారుస్తారట. ఆ తర్వాత మొక్కల ఆధారిత బైండర్లు, సహజ ఫైబర్ల సాయంతో మన్నికైన బయోలెదర్ని తయారు చేస్తామని తెలిపారు. ఆకృతి కోసం విషరహిత క్యూరింగ్ చేస్తామని చెప్పారు. అలా 2024 మే నాటికి బయోలెదర్తో తయారు చేసిన వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించామని తెలిపారు. ఇంటీరియర్ డిజైన్, ఆటోమెటివ్ పరిశ్రమలకు పనికొచ్చేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పైగా ఈ లెదర్ ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లుతుందని చెప్పారు. నిజంగా ఇది అలాంటి ఇలాంటి ఆవిష్కరణ కాదు కదా..పర్యావరణం మెచ్చే లెదర్ ఉత్పత్తులు కదూ..!. View this post on Instagram A post shared by Bioleather (@bioleather) (చదవండి: డిజిటల్ డ్యామేజ్..! అంతకంతకు మయోఫియా వ్యాధులు..) -
70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ!
బాలీవుడ్, హాలీవుడ్ రంగం ఏదైనాలబ్రిటీల పెళ్లిళ్లు, వయస్సు-అంతరాయాలు చర్చ సర్వ సాధారణం. తాజాగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తనకంటే పెద్దదైన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం, 51 ఏళ్ల బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా విడాకులు , మళ్లి పెళ్లి వార్తల నడుమ 70 ఏళ్ల వయసులో కబీర్ బేడి నాలుగో పెళ్లి అదీ తన కూతురువయసున్న అమ్మాయిని చేసుకున్న వార్త చర్చల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాళ్లను వివాహం చేసుకోవడంపై చర్చను మళ్ళీ లేవనెత్తింది: ప్రేమలో వయస్సు నిజంగా ముఖ్యమా, లేదా పరస్పర అవగాహన ముఖ్యమైనదా? అనే హాట్ టాపిక్గా మారింది.కబీర్ బేడి ప్రేమకథప్రముఖ నటుడు కబీర్ బేడీ తనదైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన గొప్ప నటుడు. వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలనెదుర్కొన్నాడు. 2016లో తన 70 పుట్టి రోజు సందర్భంగా తనకంటే దాదాపు 30 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్ను వివాహమాడటం ఆయన కుటుంబంలో కూడా విమర్శలకు తావిచ్చింది. అయితే పదేళ్ల పరిచయం, ప్రేమ తరువాత తామీ నిర్ణయం తీసుకున్నామని పర్వీన్ తన జీవితంలోకి రావడంఎంతో సంతషాన్నిచ్చిందనీ అందుకే పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశాడు. 2005లో వీరు తొలిసారి కలుసుకున్నారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి గడిపిన తర్వాత, కబీర్ బేడి 2011లో రోమ్ పర్యటన సందర్భంగా ప్రపోజ్ చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో 2016, జనవరి 15న ముంబై సమీపంలోని అలీబాగ్లో ఒక ప్రైవేట్ వేడుకలో వారు వివాహం చేసుకున్నారు. నటి , కబీర్ బేడీ కుమార్తె పూజా బేడి కంటే పర్వీన్ ఐదేళ్లు చిన్నది.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుప్రేమకు నిజంగా వయసు అవసరమా?ప్రేమ ఏ వయసులోనైనా వస్తుందనీ, ప్రేమకు హద్దులు లేవు; సామాజిక అంచనాలు లేదా వయస్సు తేడాలు దానిని పరిమితం చేయలేవని నిపుణులు చెబుతున్న మాట. ఇదే విషయాన్ని నటి మలైకా అరోరా ఇటీవల స్పష్టం చేసింది. పెళ్లి విషయంలో తానేమీ తలుపులు మూసుకోలేదని, జీవితం ఏ దశలోనైనా కొత్త అవకాశాం రావచ్చని స్పష్టం చేసింది.నిపుణుల ప్రకారం వయస్సు వ్యత్యాసాలు అంతర్గతంగా సమస్యాత్మకమైనవి కావు. ఒక జంట కావాల్సింది ముఖ్యమైన భావోద్వేగ, మానసిక అనుకూలత. పరస్పర అవగాహన. ఇవి లేనపుడు మాత్రమే సమస్యలు సవాళ్లు వస్తాయనేది వారు చెబుతున్న మాట. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట, మిలింద్ సోమన్- అంకితా కోన్వర్ లాంటి సెలబ్రిటీల నిజమైన ప్రేమ బంధానికి ఇదే కారణమని ఉదాహరిస్తున్నారు.పెళ్లి ఈ పునాదులపైఇద్దరి మధ్యా స్పష్టమైన కమ్యూనికేషన్నమ్మకం, పరస్పర గౌరవం భావోద్వేగ మద్దతు (emotional support)ఈ ప్రధానమైన అంశాలు, విలువల ఆధారంగా చాలా జంటలు వారి వయస్సు అంతరంతో సంబంధం లేకుండా బలమైన బంధాన్ని కొనసాగించ గలుగుతారని, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అవగాహనే ముఖ్యమని రిలేషన్షిప్ కౌన్సెలర్లు, సామాజిక, మానసిక నిపుణులు చెబుతున్నామాట. -
డిజిటల్ డ్యామేజ్..! స్క్రీన్ టైం తగ్గించాల్సిందే..
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.కఠిన పరిమితులు అవసరం.. ‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం. విద్యావేత్తలకు స్క్రీన్లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు. స్క్రీన్ టైం ప్రభావం.. ‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. ‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు. (చదవండి: వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..) -
మానవత్వమే దైవత్వం
మానవ సేవే మాధవ సేవ అంటారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని, ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాలు,అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితులలో మానవ సేవలో ధన్యులయిన వారిని స్మరించుకోవడం కోసం 2009 నుండి ఆగస్టు 19 నాడు ‘ప్రపంచ మానవత్వ దినోత్సవా’ (world humanitarian day )న్ని జరుపుకొంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ తేదీనే ఎంచుకోడానికి కారణం... బ్రెజిల్ దేశానికి చెందిన సెర్గియోడిమెల్లో. ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాల పాటూ ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) మానవతా వాద సహాయ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేశారు. చాలా దేశాల్లో యుద్ధాల మధ్య యూఎన్ఓ సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఆయన... 2003 ఆగస్టు 19న ఇరాక్లోని ఒక బాంబు పేలుడులో 21 మంది సహచరులతో సహా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి యూఎన్ఓ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం, స్థానిక సమాజాలకు సాధికారత కల్పించడం’ అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలో వందలాది మంది చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నిత్యం అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫ్రికా ఖండంలోని సోమాలియా వంటి దేశాల్లో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మానవత్వంతో, సహనంతో వ్యవహరించాలి. దయనీయ స్థితిలో కూరుకుపోయిన వారికి సహాయం అందించి ఆదుకోవాలి. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మ కాలు, విభిన్న తాత్విక దృక్పథాలు ఉంటాయి. వాటిమధ్య సహజీవన సౌగంధాన్ని సాధించినప్పుడే శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. సహనం సామా జిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్ల కల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పనిసరి.ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు– ఎం. రాం ప్రదీప్ ‘ జన విజ్ఞాన వేదిక, తిరువూరు -
కబూతర్..! ఖానా కహానీ..
ప్రేమ చిహ్నాలుగా వర్థిల్లిన పావురాలే పలు రకాల వైరస్ వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయి. నగరాల్లోనూ వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలూ, ఊపిరితిత్తుల సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో వాటికి ఆహారాన్ని అందించడాన్ని ఇటీవలే ముంబయి, పుణె వంటి నగరాలు నిషేధించాయి. నగరంలో కూడా పావురాల సంఖ్య, వాటికి ఆహారం అందించే అలవాటు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో పావురాల ఫీడింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ముంబైలోని ఒక అపార్టుమెంట్లో చోటు చేసుకున్న పావురాల సమస్య రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అనంతరం ఆ సమస్య ఏకంగా కోర్టు గడప కూడా తొక్కింది. అయితే ఆ స్థాయికి చేరకున్నా.. మన నగరంలోనూ నిత్యం ఇదే అంశంపై నగరవాసుల్లో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. పావురాల వల్ల మనుషులకు కలిగే అనారోగ్యాలపై అవగాహన పెరగడమే దీనికి కారణం. నగరంలో అలవాటుగా.. హాబీగా పావురాలకు ఆహారం వేసేవారితో పాటు మతపరమైన లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా నగరంలో పావురాల ఫీడింగ్ సర్వసాధారణంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వందలాది పావురాలు గుంపులుగా వస్తాయి. ప్రతి రోజూ ఉదయం వేళల్లో ప్రజలు ఈ పావురాలకు ఆహారం ఇవ్వడం సర్వసాధారణం. ట్యాంక్ బండ్, నాంపల్లి, సికింద్రాబాద్లోని క్లాక్ టవర్.. ఇలా పలు చోట్ల పావురాల ఫీడింగ్ నిత్యం కనిపించే అంశాలు. ఇలా ఫీడింగ్ చేసేవారి కోసం గింజలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే వారు కూడా పుట్టుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఫీడింగ్ ఏ విధంగా జరుగుతుందో. అవగాహన పెరగాలి.. ‘పావురాల విసర్జన ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం తెలియక చాలా మంది పక్షులకు ఆహారం ఇస్తారు’ అని నగరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సబా క్వాద్రి అంటున్నారు. అంతేకాదు పావురాలు, ఇతర పక్షులకు కూడా ఇది శాపంగా మారుతోంది. ‘ఇతర పక్షులను ఆకర్షించడానికి కొన్ని గింజలను బయట పెడుతాం. కానీ పావురాలు ఆ ప్రాంతాలను హైజాక్ చేసి ఇతర పక్షులకు ఉద్దేశించిన ఆహారాన్ని దక్కించుకుంటాయి’ అని సబా వెల్లడించారు. ముంబై వంటి నగరాల్లో చేసినట్లుగానే, పావురాలకు ఇష్టారాజ్యంగా ఆహారం అందించడాన్ని నివారించేందుకు జరిమానా విధించడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో పావురాలు ఉంటున్నాయి. ‘విశ్వవిద్యాలయ వీధులను శుభ్రం చేసే స్వీపర్ల నుంచి భవనాల్లో నివసించే విద్యార్థుల వరకు, చాలా మంది పావురాల బిందువుల ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది’ అని వర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఉదయం వేళల్లో పావురాలకు ఆహారం ఇవ్వొద్దని చెప్పేందుకే ఓయు ప్రత్యేకంగా ఒక భద్రతా అధికారిని నియమించిందని సదరు ఉద్యోగి వివరించారు. అంతేకాక వర్సిటీ భవనాల వెలుపల పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. విసర్జన.. విషమౌతోంది.. పావురాల ప్రభావానికి ముఖ్యంగా విసర్జనకు ఎక్కువ కాలం గురికావడం వల్ల వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయని, ఫలితంగా ఇన్ఫెక్షన్లు, పలు రకాల వైరస్లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. విసర్జనాలు ఎండిపోయినప్పుడు, అవి దుమ్ము రూపంలో గాలిలోకి ఎగిరి, ఊపిరి తీసుకునే సమయంలో గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరతాయి. ఈ క్రమంలోనే హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్కు కారణమవుతోంది. ఇది కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు పెంపుడు కుక్కలు, పిల్లుల వెంట్రుకల ద్వారా వచ్చే అలెర్జీల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటాయి. పావురాల విసర్జన ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతాయి. ఒక్కోసారి అవయవాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్.. ఎలా గుర్తించాలి? పావురాల విసర్జన వల్ల సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రారంభ దశలో నిరంతరం పొడి దగ్గు వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్, బ్రోంకోడైలేటర్లను ఉపయోగించినా ఉపశమనం దొరకదు. దగ్గు రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగిన క్రమంలో తదుపరి పరీక్షల కోసం పల్మనాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది.పలు దేశాల్లోనూ.. వెనిస్ నగరంలోని చారిత్రాత్మక చతురస్రాల్లో పావురాలకు ఆహారం నిషేధించారు. ఈ ఫీడింగ్కు సింగపూర్ భారీ జరిమానాలు విధిస్తోంది. అలాగే న్యూయార్క్, లండన్ కూడా దాణా ప్రదేశాలను నియంత్రించాయి. మన దేశంలో ముంబై, థానె, పుణెలో కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా పావురాల ఫీడింగ్ను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనుందని తెలుస్తున్న నేపథ్యంలో మన నగర పరిస్థితి ఏమిటని పలువురు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. -
వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..
‘కన్ను లేనిదే కలికాలమే లేద’ని సామెత. అయితే వ్యాధుల్లేకుండా కూడా ఈ కలికాలం లేదు. పైగా ఈ వ్యాధులన్నీ అంతటి కీలకమైన కంటిని దెబ్బతీసే అవకాశం లేకపపోలేదు. డయాబెటిస్, రక్తపోటు వంటివి కనిపించినప్పుడు ఇంకేవైనా అవయవాలు దెబ్బతిన్నాయో చూడటంతోపాటు డాక్టర్లు కంటి పరీక్షలూ విధిగా నిర్వహిస్తారు. అలాగే మైగ్రేన్ మొదలుకొని థైరాయిడ్, రక్తహీనత (అనీమియా) వరకు ఎన్నో రకాల వ్యాధులు కంటి చూపుపై తమ దుష్ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే నేరుగా కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో, వాటి వల్ల కంటికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం...ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో లేదా ఆ అవయవం ఏ వ్యవస్థదైతే ఆ వ్యవస్థకు మాత్రమే పరిమితమని అపోహ పడుతుంటాం. ఉదాహరణకు రక్తహీనత ఏర్పడిందంటే... అది రక్తం సరఫరా అయ్యే అన్ని అవయవాలతో పాటు కంటిపైనా తన దుష్ప్రభావాన్ని చూపవచ్చు. ఇక థైరాయిడ్కు ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్కు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. అలా కంటిపై ప్రభావం చూపేందుకు అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలూ, వ్యాధులు, కండిషన్స్ తాలూకు ఉదాహరణలు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్రక్తహీనత (అనీమియా) ∙కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ∙ఆటోఇమ్యూన్ డిసీజెస్ ∙కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) ∙వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల (హెరిడిటరీ) వ్యాధులు. ఇవి మాత్రమే కాదు... మనం వాడే కొన్ని రకాల మందులు, మన హార్మోన్లలో చోటుచేసుకునే అసమతౌల్యతలు... ఇవి కూడా కంటిపైన దుష్ప్రభావాలను చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు, కొన్ని మందులు తీసుకునేవారు విధిగా వాటి వల్ల తమ కంటిపై ఏదైనా చెడు ప్రభావాలు కనిపిస్తాయా అని తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి. కొన్ని జబ్బులూ... కంటిపై అవి చూపే దుష్ప్రభావాలు...డయాబెటిస్ఈరోజుల్లో ఇంటికి ఒకరికైనా ఉండే లైఫ్స్టైల్ వ్యాధి ఇది. ఈ సమస్య వచ్చినవారిలోని కనీసం 20 శాతం మందిలో దాని దుష్ప్రభావాలు కంటిపైనా పడే అవకాశాలుంటాయి. డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...డయాబెటిక్ రెటినోపతి : కంటివెనక ఉండే రెటీనా అనే తెరపై పడే ప్రతిబంబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనం చూడగలం. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడంతో రెటినాకు అందాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందకపోవడంతో రెటీనా పనితీరు క్రమక్రమంగా తగ్గే అవకాశముంటుంది. ఫలితంగా దృష్టిలోపం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలూ, కంటి నరాలు మొద్దుబారుతున్నాయా అన్న విషయాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. గ్లకోమా : డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అనే గ్లకోమా బారిన పడే ముప్పు ఉంటుంది. గ్లకోమా ఉన్నవాళ్లలో కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరిగి మనం చూసే దృష్టి విస్తృతి (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గి΄ోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్లకోమా కండిషన్ ఏమైనా వచ్చిందా అని తరచూ కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటకార్ట్ : కంట్లోని లెన్స్ తన పారదర్శకతను కోల్పోయే కండిషన్ను కాటకార్ట్ అంటారన్న విషయం తెలిసిందే. వయసు పెరగడమే (ఏజింగ్ మాత్రమే) కాకుండా డయాబెటిస్ వల్ల కూడా కాటకార్ట్ వచ్చే అవకాశమున్నందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు క్యాటరాక్ట్కు సంబంధించిన పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆప్టిక్ న్యూరోపతీ : డయాబెటస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. అన్ని నరాలతో పాటు ఆప్టిక్ నర్వ్కు కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపునిచ్చే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితమంతా చీకటయ్యే ముప్పు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ రక్తంలో చక్కెర మోతాదులను ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటూ ఉండటం క్రమం తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యులతో పాటు కంటి డాక్టర్ ఫాలో అప్లో ఉండటం.రక్తపోటు (హైపర్టెన్షన్)రక్తపోటు ఉన్నవారిలో కొందరికి అకస్మాత్తుగా చూపు కొంత మసకబారవచ్చు. లేదా దాదాపుగా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన ప్రధాన రక్తనాళం (సిర)లోగానీ లేదా ఇతరత్రా ఏదైనా చిన్న రక్తనాళం (బ్రాంచ్ ఆఫ్ బ్లడ్ వెసెల్)లోగానీ రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడి అది అడ్డుపడే ముప్పు ఉండవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి రక్తప్రవాహానికి ఆ క్లాట్ అడ్డుపడవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాలకు సంబంధించిన సమస్య రావచ్చు.కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా వచ్చే ముప్పు కూడా ఉంటుంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. డిస్లిపిడేమియారక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ వంటివి) ఉండాల్సిన మోతాదుల్లో కాకుండా హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు కంటి సమస్యలు రావచ్చు. అవి చూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... కొవ్వులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తాము తీసుకున్న కొవ్వులు దహనమయ్యేలా (బర్న్) అయ్యేలా వ్యాయాయం చేయాలి డాక్టర్లు కొవ్వుల మోతాదులను తగ్గించే మందులు సూచిస్తే వాటిని తప్పక వాడాలి. రక్తహీనత (అనీమియా)మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే దేహంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్నూ, పోషకాలను మోసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. అనేక రకాల కారణాలతో కొంతమందిలో ఈ ఎర్రరక్తకణాల సంఖ్య (ఆర్బీసీ) తక్కువగా ఉండే కండిషన్ను రక్తహీనత (అనీమియా) అంటారు. మరికొందరిలో రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్ను మోసుకు΄ోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ తన పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... అనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / ఐరన్ సప్లిమెంట్లు ఉన్న మందులు వాడటం ∙ఐరన్, ఇతరత్రా విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం. మైగ్రేన్ఇది ఒక రకం తలనొప్పి. తరచూ వస్తూ పోతూ... చాలా తీవ్రంగా బాధించే ఈ తలనొప్పి చాలామందిలో నుదుటికి ఒకవైపే రావచ్చు. అందుకే కొందరు దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. టీనేజ్ పిల్లల్లో తీవ్రంగా వచ్చి వాళ్ల చదువుపై కూడా ప్రభావం చూపే ఈ నొప్పిలో కన్ను కూడా చాలా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు కంటికి సంబంధించిన ఈ కింద లక్షణాలూ కనిపిస్తాయి. అవి... చూపు సరిగా కనిపించకుండా మసకమసగ్గా కనిపించడం నుదుటి మీద ఒకవైపున లేదా ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి ఉండటం తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...కొన్ని అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసనా లేదా అగరుబత్తీల వాసనలు మైగ్రేన్ను ప్రేరేపించి వెంటనే తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఇలా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. తమకు తలనొప్పి ఏ అంశం వల్ల వస్తుందో గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం వల్ల దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఇక మైగ్రేన్కు సంబంధించి డాక్టర్లు రెండురకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... నొప్పి తక్షణమే తగ్గేందుకు చేసే చికిత్స, రెండోది దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకు ఇచ్చే ప్రివెంటివ్ చికిత్స. ఈ రెండు రకాల ఈ మందులను బాధితులు తప్పనిసరిగా వాడాలి. గుండెజబ్బులుకొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. గుండెజబ్బుల కారణంగా కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... అకస్మాత్తుగా చూపు మందగించడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు / దృష్టిజ్ఞానానికి సహాయపడే నరానికి (ఆప్టిక్ నర్వ్కు) సంబంధించిన సమస్యలు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...అసలు సమస్యకు (అండర్లైయింగ్ హార్ట్ ప్రాబ్లమ్కు) చికిత్స తీసుకోవడం వల్ల దాని కారణంగా వచ్చే కంటి సమస్యలూ తగ్గుతాయి. అలాగే తరచూ కంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి. సోరియాసిస్సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. సొంత రోగ నిరోధకశక్తి బాధితులపై ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో...రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరాలరా ΄÷రకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంటిలో ఉండే కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...సోరియాసిస్కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒకరకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి మన కొలాజెన్ ప్రోటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్గా చెబుతారు. ఆ వ్యాధులేమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ) ∙కీళ్లనొప్పులు (జాయింట్పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు. ఎస్ఎల్ఈ (లూపస్) : లూపస్ అంటే వుల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్ఎల్ఈ) అని చెబుతారు. లక్షణాలు... ముక్కుపై నుంచి చెంపలపైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్లలా (ర్యాష్) వస్తుంది. సూర్యకాంతి (ఫోటోసెన్సిటివిటీతో) వల్ల ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. పాలిపోయినట్లుగా ఉండే చర్మం ∙కొందరిలో వెంట్రుకల మూలాలు మూసుకుపోవడం (లూపస్లో ఇది ఒక రకం). దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో ర్యాష్ చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా ర్యాష్ కూడా రావచ్చు కారణం తెలియని జ్వరం ∙బరువు తగ్గడం కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు జాయింట్స్లో వాపు; రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలోలా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇది కేవలం తాత్కాలికం. కొందరు డిప్రెషన్తో ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీళ్ల సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి– లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమోనని పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కొందరిలో జుట్టు రాలడం మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. ఇక ఈ వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్పరిణామమేమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్త΄ోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ); రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్); స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్; కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)–పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆర్నెల్లకు ఓమారు వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు : ప్రధానమైన సమస్యలైన సిస్టమిక్ లూపర్ అరిథమెటోసిస్ (ఎస్ఎల్ఈ), కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా ప్రతి ఆర్నెల్లకోమారు పరీక్షలు చేయించడం అవసరం. డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
అలా పుట్టిందే చిట్టి చిలకమ్మ పాట
అమ్మమ్మ తన చిట్టి మనవరాలిని బుజ్జగిస్తూ ... ‘చిట్టి చిలకమ్మా / అమ్మ కొట్టిందా..! ’అని చెబుతుంటే మనవరాలు కళ్లు విప్పార్చి వింటున్న అందమైన దృశ్యం మన కళ్ల ముందు నిలుస్తుంది. అమ్మ తన కూతురితో ‘పండు తెచ్చావా.. గూట్లో పెట్టావా.. గుటుక్కున మింగావా..’ అనగానే చిన్నారి కూతురు కిల కిల నవ్వే నవ్వులు తలపునకు వస్తాయి. చిలకమ్మ వచ్చేసింది.. పండు తెచ్చింది అని చిన్నారులంతా సంబరపడిపోయి పాడుకునే ఆ పాట అరవై ఏళ్లుగా తెలుగు ముంగిళ్లలో పిల్లలున్న ప్రతి ఇంట్లో వినపడుతూనే ఉంది. ఈ గేయం ఎనిమిది పదుల బల్ల సరస్వతి నోట పుట్టింది అనగానే ఆశ్చర్యంగా అందరి చూపులూ ఆమె వైపుకు మరలకుండా ఉండవు. ఎనిమిది పదుల వయసున్న బల్ల సరస్వతి స్వస్థలం జనగాం జిల్లా, బచ్చన్నపేట్ మండలం, కట్కూరు గ్రామం. ఈ పాట ఆమె నోట ఎలా పుట్టింది?! ఇదే విషయం అడిగితే ... ఆమె తన ఏడుతరాల ముచ్చటను మన ముందుంచారు.‘‘ఏడు తరాల ముచ్చట్లు చెప్పాలంటే ఒక్కజాములో అయ్యేది కాదు. నెక్కొండ బ్లాక్లో గురజాల అనే గ్రామం కింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకు ప్రైమరీ స్కూల్కి సింగిల్ టీచర్గా 1962లో వెళ్లాను. ఆ స్కూల్ ఒక గుడిసె. అందులోకి 50 మంది పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలకు చదువు చెప్పడానికి ఏ పుస్తకాలూ లేవు. అక్షరాలు దిద్దించడం, అంకెలు చెప్పడం.. ఎంతసేపూ ఇవే చెబితే పిల్లలు వినరు. రోజంతా వారిని ఎంగేజ్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించేదాన్ని. నా చిన్ననాటి నుంచి విన్న పాటలు, కథలు చెప్పాలనుకున్నా. మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన గేయాలు, పద్యాలు, కథలు మాత్రమే కాదు అప్పటికప్పుడు నేనే స్వయంగా పాటలు అల్లి పిల్లలకు చెబుతుండేదాన్ని. అన్నీ పిల్లల మెదళ్లకు చేరేవి కావు. ఇంకా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. ఆ ప్రాంతమంతా చుట్టూ చెట్లు, చేమలు. నేను ఇలా చటుక్కున చెబితే పిల్లలు లటుక్కున అందుకునేలా ఉండాలి. చిన్నారులు తాము రోజూ చూసేవాటి మీద పాట గట్టి చెప్పాలి. అలా అప్పటికప్పుడు చిలుకల మీద అల్లిన పాటే ఇది... అని చెబితే.. పిల్లలు ఆ పదాలను సులువుగా పట్టేసుకున్నారు. ఆ పాట ఆ నోటా ఈ నోటా.. అలా అలా ఎగురుతూ చాలాకాలం కిందటే ఎల్లలు దాటి అమెరికా దాకా పోయింది. ఇప్పటికీ ఎగురుతూనే ఉంది. సముద్రాలు, పర్వతాల గురించి చెబితే వారికి అర్థమయ్యేది కాదు. సరైన దృష్టి పెట్టేవారు కాదు. అందుకని ఏది చెప్పినా గేయాల రూపంలోనే. టీచర్గా రావడానికి ముందు మాకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా నాకు ఉపయోగపడింది. వినోదంగా, అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగే ప్రయత్నాలు అన్నీ చేసేదాన్ని. ఊరూరూ ప్రయాణం..1957లో అప్పటి 7వ తరగతి పాసయ్యాను. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారు పీయూసీ చదివారు. ఇద్దరం బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాం. మా ఇద్దరికీ నెల రోజుల తేడాతో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు, మావారికి పక్క పక్క ఊళ్లకు పోస్టింగులు. మూడేళ్లు చేశాక మా సొంత ఊరు కట్కూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ ఐదేళ్లు చేశాక, ఆలిన్పుర్లో రెండేళ్లు, ఆ తర్వాత మా పుట్టిన ఊరు లద్దునూరుకు ఇద్దరికీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ కట్కూరుకు.. ఇలా మొత్తం 37 ఏళ్లపాటు టీచర్గా చేసి, హెచ్.ఎం.గా రిటైరయ్యాను. ఏడుతరాల తలపోత... ఎనిమిది పదుల జీవితంలో ఎన్నో అనుభవాలు. ఏడుతరాలు చూసిన అనుభవం. నేత కార్మికుల ఇంట పుట్టి పెరిగాను. పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. మా వారి తోడబుట్టినవాళ్లు ఏడుగురు. పెళ్లికి ముందు మా అక్కాబావ హైదరాబాద్లో ఉంటే కొన్నాళ్లు అక్కడే ఉండి, హిందీ నేర్చుకున్నా. మా బంధువు, మామ సుద్దాల హన్మంతు. పెళ్లి తర్వాతే డిగ్రీ చేశాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఎంతోమంది జీవితాలు అతి దగ్గరగా ఉండి చూసిన, ఎన్నో వెతలు విన్నా. ఏ కష్టమైనా, ఆనందమైనా అంతా ఒకే కుటుంబంగా కలిసి పంచుకున్నాం. అవన్నీ కలిపి ‘కలెనేత’ అని ఏడుతరాల తలపోతగా ఆత్మకథ రాస్తే.. పిల్లలు దానిని పుసక్తంగా తీసుకువచ్చారు.శిశిర ధ్వనిపుట్టిల్లు, అత్తిల్లు.. పిల్లల పనులు, స్కూల్ పనులు.. ఎక్కడా తీరిక ఉండేది కాదు. సమావేశం అయినా, సంబరం అయినా అప్పటికప్పుడు ఓ గేయం రాయడం, పాడటం, వదిలేయడం.. అలా రోజులు వెళ్లిపోయాయి. ఆ గేయాలను భద్రపరుచుకోవాలి అనే అలోచన అప్పట్లో లేదు. 2001లో మా వారు చనిపోయారు. ఊళ్లో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు హైదరాబాద్కు వచ్చిన. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అవన్నీ వింటూ.. చూస్తూ చలించిపోయి, నాకు కలిగిన ఆవేశాన్ని, భావాలను రాసుకుంటూ ఉండేదాన్ని.‘ఒట్టు పెట్టి చెపుతున్నా ఒస్తది మన తెలంగాణ.. అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా..’ అని తెలంగాణ గురించి.. ‘రంగు రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరపిస్తవు / అచ్చులతికి అతికి అతికి, నేత నేసి నేసి, పడగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు...’ అని నేతన్నల కష్టాల గురించి.. ‘అవిశ్రాంతంగా పోరు బాటలో పయనిస్తూ, జీవనసమరాన్నీ ఛేదిస్తూ సాగిపోతాను ముందుకు, మున్ముందుకు... ’ అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల కోసం.. రాశాను. ఇలాంటివి దాదాపు ఓ యాభై కవితలను కలిపి ‘శిశిరధ్వని’ పుస్తక రూపంగా మీ ముందుకు తీసుకువచ్చాం’’ అంటూ తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ అనుభవాల విజ్ఞానగని. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: మోహనాచారి(రచయిత్రి 1962లో తన విద్యార్థుల కోసం అల్లిన పాట... ఆమె చేతివ్రాతతో..)కుటుంబ సభ్యులతో బల్ల సరస్వతి -
సోలో లేఫే బెటర్ అనుకుని దెబ్బైపోయాడు! చివరికి..
మనతో ఉన్న వస్తువులు లేదా మనుషుల విలువ ఉన్నంత వరకు తెలియదు అని పెద్దలు పదేపదే నొక్కి చెబుతుంటారు. అదెందుకో ఈ కథ చదువుతుంటే తెలుస్తుంది. అన్నిసార్లు డబ్బు మన అవసరాలను తీర్చదు. అదొక్కటే చాలు అనుకున్న వాళ్లంతా అధోగతిపాలయ్యారు. తెలిసి కూడా అదే తప్పు చేస్తూ..ఒంటిరిగా మిగిలిపోయి కుమిలిపోతుంటారు ఈ వ్యక్తిలా..అసలేం జరిగిందంటే..జపాన్కి చెందిన టెట్సు యమడ, కైకో దంపతులు సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉన్నారు. వారికిద్దరు కుమారులు కూడా. వాళ్లు కూడా సెటిల్ అయిపోయారు. అయితే ఏమైందో గానీ వెర్రిగా ఆలోచించి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. అతడు ఇటీవల రూ. 3 కోట్ల పెన్షన్తో రిటైరయ్యాడు. దాంతో ఇక ఇన్నాళ్లు సంసారాన్ని మోసింది చాలు ఇకనైనా ఫ్రీడం కావాలంటూ..తన భార్యను పుట్టింటికి వెళ్లిపో విడిగా బతుకుదాం ఇకనుంచి.. అని మనసులో మాట చెప్పేశాడు యమడ. అయితే ఇన్నాళ్లు తనతో కలిసి జీవించి ఇదేంటి అనుకుందామె. నిజానికి ఆ దంపతులకు గత కొన్నేళ్లుగా కొన్ని విషయాల్లో పొసగటం లేదు. ఎలాగో రిటైరవ్వతున్నాకదా..ఆమెను వదిలించేసుకుని రిటైర్మెంట్ డబ్బుతో హాయిగా జీవించొచ్చనేది అతడి ఆలోచన. అయితే అన్నేళ్లుగా పట్టణంలో కుమారులు, భర్తతో కలిసి జీవించి ఉన్న ఆమెకు ఉన్న పళంగా తన సొంతూరు పల్లెటూరికి వెళ్లి బతకడం అనేది కష్టంగా అనిపించిందామెకు. ఆ విషయాన్నే నర్మగర్భంగా చెప్పేసింది యమడకి. అలాగే అతడి కొడుకులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దాంతో అతడు 'సోట్సుకోన్' ట్రెండ్ని అనుసరిద్దామని చెప్పాడు. ఏంటంటే ఇది..జపాన్ మహిళ రచియిత్ర రచించిన పుస్తకం కారణంగా ఈ ట్రెండ్ అక్కడ యువతలో బాగా ఊపందుకుంది. ఈ ట్రెండ్ ప్రకారం..భార్యభర్తలు ప్రెండ్లీగా విడిపోతారు..ఒకే ఇంట్లో ఉన్నా..ఎవరికి వారు హాయిగా ఉండటం లాంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ పద్ధతిలో ఫ్రెండ్లీగా విడిపోదామని చెప్పి యమడనే తన సొంత గ్రామానికి వెళ్లిపోయి జీవించాలని నిర్ణియించుకున్నాడు. ఇక అతడి భార్య, కుమారులు అక్కడే పట్టణంలో నివశించడానికి మక్కువ చూపించారు.పాపం పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి..ఇక యమడ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన అక్కడ తన పెన్షన్ డబ్బుతో ఇంటిని పునరుద్ధరించాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేద్దామనుకుంటే..అక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు భార్య అమర్చి పెడితే కష్టం తెలియకుండా పోయింది యమడకి. ఇక ఎప్పుడైతే ఒంటిరిగా జీవించడం మొదలుపెట్టాడో..రోజువారీ పనులు నిర్వహించుకోవడం చాలా కష్టమైంది. వంట చేసుకుని తినలేక తిప్పలు పడ్డాడు. ఇక రెడీమేడ్ న్యూడిల్స్, పచ్చి కూరగాయలపై ఆధారపడాల్సిన స్థితికి వచ్చేశాడు. కానీ అతడి భార్య విడిపోయాక సొంతంగా చేతి వృత్తికి సంబంధించిన వర్క్షాప్ ప్రారంభించి లాభాలు అందుకుంటూ సంతోషంగా జీవిస్తుంటే ఇక్కడ యమడ..ఒంటరి జీవితంతో నరకం అనుభవిస్తున్నాడు. అంతేగాదు తాను తీసుకున్న ఈ తెలివి తక్కువ పనికి చింతిస్తూ లబోదిబోమంటున్నాడు. అయితే తాము అప్పడప్పుడూ ఆన్లైన్ మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు యమడ. అయితే తన కొడుకులతో సంబంధం పూర్తిగా తొలిగిపోయిందని అంటున్నాడు. పాపం యమడ తన కుటుంబంతో మళ్లీ తిరిగి కలసే అవకాశం కోసం ఆశగా చూస్తున్నాడు. ప్రస్తుతం అతడి కథ నెట్టింట వైరల్గా మారి విడిపోతే నష్టం ఎవరికీ అంటూ చర్చలు ప్రారంభించారు. అంతేగాదు స్వేచ్ఛ అనేది ఎలా ఉన్నా ఆ వయసులో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు మాత్రం తప్పవనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 🚨 LONELY NOODLES AND A NEW LIFE: JAPAN’S ‘MARRIAGE GRADUATION’ TREND SPARKS DEBATETetsu Yamada thought he was stepping into a peaceful retirement when he embraced “sotsukon”—Japan’s rising trend of “marriage graduation.” Armed with a hefty 50-million-yen pension, he moved to… pic.twitter.com/0KVXZwRFzP— The Tradesman (@The_Tradesman1) August 17, 2025 (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!) -
చేయి చేయి కలిపి.. ‘చతుర్భుజ’మై..!
చేయి చేయి కలిపి చతుర్భుజమై.. కదలి వద్దాం కలను నిజం చేద్దాం.. అందరూ ఒక్కటై అడుగులేద్దాం.. అనుబంధం పెంచుదాం, ఆనందం పంచుదాం.. అన్న ఓ రచయిత మాటలను గుర్తు చేసేలా ఆ ప్రాంత మహిళా శక్తి మొత్తం ముందుకు కదిలింది.. కబ్జా దారుల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ స్థలాన్ని విడిపించారు.. అనేక ఆటుపోట్లను అధిగమించి.. బెదిరింపులు, ఇబ్బందులకు ఓర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరారు.. వారే మలక్పేటలోని శ్రీపురం కాలనీ మహిళ సంక్షేమ సంఘం వారు.. కాలనీ వాసులకు ప్రయోజనం చేకూర్చేందుకు ముందడుగేశారు.. చివరికి ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో పార్కును ఏర్పాటు చేశారు. ఒకప్పుడు అంటే 2000 సంవత్సరానికి ముందు.. ఆ ప్రాంతమంతా దుర్గంధంతో అటువైపు వెళ్లలేని పరిస్థితి ఉండేది.. అలాంటి స్థలం కొందరు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది.. కాలనీ వాసుల ప్రయోజనార్థం స్థానిక మహిళా సంక్షేమ సంఘం నాయకులు చుట్టుపక్కల వారి సహకారంతో గుండవరం వేణుగోపాల్ రావు, పద్మలు కోర్టును ఆశ్రయించి పురాతన బావితో సహా స్థలాన్ని కాపాడి చక్కటి నందనవనంగా తీర్చిదిద్దారు.. అనేక బెదిరింపులు, ఇబ్బందులకు ఓర్చి చివరికి ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో పార్కుగా అభివృద్ధి చేశారు. పార్కు ఏర్పడి నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తికావడంతో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజతోత్సవాలు జరుపుకున్నారు. పార్కు అవతరణకు సహకరించిన ఆతీ్మయులు రాజేవ్వరరావు, రాజేందర్, నరేందర్, ప్రవీణ్, స్వర్ణ, శకుంతల, అనిత, హేమ తదితరులను ఆహా్వనించి అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలనీవాసులతో నాటి విశేషాలను పంచుకున్నారు. ఆహ్లాదాన్ని పంచుతూ.. ప్రస్తుతం స్థానిక కాలనీవాసులకు పచ్చని వాతావరణంతో, చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతోంది. స్థానిక ప్రజల అవసరాలు తీర్చేలా రూపొదిద్దిన పార్కులో నడక మార్గం, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా వివిధ రకాల ఆట సామగ్రి ఇలా సకల వసతులూ ఏర్పాటు చేసుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, అలసట తగ్గించుకునేందుకు అనువుగా పచ్చటి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. (చదవండి: గ్రీన్ గణేశాయ నమః..! పండుగ పచ్చగా..ప్రకృతి మెచ్చగా..) -
గ్రీన్ గణేశాయ నమః..! పండుగ పచ్చగా..ప్రకృతి మెచ్చగా..
గణేశ చతుర్థి సమీపిస్తోంది. నగరంలో ఇప్పటికే వినాయ విగ్రహాల సందడి మొదలయ్యింది.. అయితే నగరవాసుల్లో పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన మట్టి గణపతులవైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది. పండుగ పచ్చగా.. ప్రకృతి మెచ్చగా అన్నట్లు విత్తన గణేశులు తయారీ వైపు అడుగులు వేస్తున్నాయి పలు సంస్థలు. దీనికి తోడు పలు గేటెడ్ కమ్యూనిటీలు ‘కలెక్టివ్ ఇమర్షన్’ కాన్సెప్ట్తో ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర పర్యావరణ హాని చేకూర్చే రసాయనాలు, రంగులు అద్దిన విగ్రహాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు నగరవాసులు. పండుగ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేయాలని పర్యావరణ నిపుణులు సైతం సూచిస్తున్నారు.. మట్టితో మమేకమయ్యేలా.. వినాయకుడు అంటేనే ప్రకృతి హితుడు. ప్రకృతో మమేకమయ్యి జరుపుకునే ఉత్సవమే వినాయక చతుర్థి. పండుగ అర్థం.. పరమార్థం కూడా అదే.. అందుకే వినాయకునికి పెట్టే పత్రి కూడా ప్రకృతికి సంబంధించినవే ఉంటుంది. అందుకే మట్టి గణపతులనే వినియోగించాలని గత కొన్నేళ్లుగా పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా పూర్తిగా పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) నివారించకపోయినా.. మెజారిటీ ప్రజలు మట్టి గణపతులనే ఆరాధిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. చాలా మంది పండుగ పచ్చగా.. ప్రకృతి మెచ్చగా అన్నట్లు ప్రకృతి సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆకులు, పూలతోనే అలంకరణ చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. గణేశ చతుర్థి సమీపిస్తోంది. నగరంలో ఇప్పటికే వినాయ విగ్రహాల సందడి మొదలయ్యింది.. అయితే నగరవాసుల్లో పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన మట్టి గణపతులవైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది. పండుగ పచ్చగా.. ప్రకృతి మెచ్చగా అన్నట్లు విత్తన గణేశులు తయారీ వైపు అడుగులు వేస్తున్నాయి పలు సంస్థలు. దీనికి తోడు పలు గేటెడ్ కమ్యూనిటీలు ‘కలెక్టివ్ ఇమర్షన్’ కాన్సెప్ట్తో ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర పర్యావరణ హాని చేకూర్చే రసాయనాలు, రంగులు అద్దిన విగ్రహాలకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నారు నగరవాసులు. పండుగ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా అడుగులు వేయాలని పర్యావరణ నిపుణులు సైతం సూచిస్తున్నారు.. మట్టి గణేశ విగ్రహాలు, విత్తన గణేశ విగ్రహాలకు గిరాకీ నగరంలో నిర్వహించే వేడుకల్లో అతిపెద్దది, ప్రధానమైనది వినాయక చతుర్థి. మరికొద్ది రోజుల్లో నగరంలో గణేశ ఉత్సవాల సందడి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘గ్రీన్ గణేశ’ కాన్సెప్ట్ తెరపైకి వచి్చంది. గత కొంతకాలంగా పర్యావరణహిత ఉత్సవాలపై అవగాహన పెరిగినప్పటికీ పూర్తిస్థాయి ఎకో ఫ్రెండ్లీ దిశగా నగరం ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా పర్యావరణానికి మేలు చేసేలా విగ్రహాలు, ఉత్సవాలకు సంబంధించిన ఇతర ఉత్పత్తులను, అలంకరణ సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు. ఆలోచనలు అంకురించి.. పర్యావరణం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రీత్యా పలు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మట్టితో తయారు చేసిన విగ్రహాల్లో విత్తనాలను ఉంచుతున్నారు. పండుగ పూర్తయ్యాక వీటిని బయటి చెరువుల్లో నిమజ్జనం చేయాల్సిన పనిలేకుండా పెరడులోనే ఉంచుకునే విధంగా ప్రతిమలను తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను కుండీల్లో ఉంచి నీరు పోయడం ద్వారా అందులో ముందుగానే ఉంచిన విత్తనాలు మొలకెత్తుతాయి.. ప్రకృతి ప్రేమికులకు అనుకూలంగా వారు మెచ్చే రీతిలో కావాల్సిన విత్తనాలతో వీటిని తయారుచేసి అమ్ముతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ వీటికి ఆకర్షితులవుతున్నారు. కొన్ని సంస్థలైతే వీటికి ఉపయోగించే కుండీలను కూడా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికే చెక్క, వేర్లు, ఇతర పీచుతో తయారు చేస్తున్నారు. విగ్రహంతోపాటే వీటినీ అమ్మకానికి ఉంచుతున్నారు. సామాజిక మాధ్యమాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఇప్పటికే పండుగ నిర్వహణపై ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు సామాజిక మాధ్యమాలు, మరోవైపు స్వచ్ఛంద సంస్థలు దీనికి ఊతమిస్తున్నాయి. కొన్ని సంస్థలు పాఠశాలలు, కళాశాలలు, ప్రయివేటు కార్యాలయాల్లో మట్టి ప్రతిమల తయారీపై వర్కషాపులు నిర్వహిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సైతం దీనికి సంబంధించిన వీడియోలు విస్తృతంగా చెక్కర్లు కొడుతున్నాయి. ప్రకృతి నుంచి లభ్యమయ్యే వస్తువుల నుంచి కూడా వినాయకుని విగ్రహాలు తయారీ చేసే క్రాఫ్ట్స్పైనా శిక్షణనిస్తున్నారు పలువురు ఔత్సాహిక కళాకారులు. మొత్తానికి గ్రీన్ గణేశ కాన్సెప్ట్ ప్రచారం భారీగానే జరుగుతున్నా.. అమలులో ఏమాత్రం విజయం సాధిస్తామో వేచిచూడాలి అంటున్నారు విశ్లేషకులు. కలెక్టివ్ ఇమర్షన్ వైపు అడుగులు.. నగరంలో ఏటా విగ్రహాల నిమజ్జనానికి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ పరిస్థితి వారం రోజులకు పైగా కనిపిస్తుంది.. దీన్ని సైతం నివారించేందుకు కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ‘కలెక్టివ్ ఇమర్షన్’ వైపు అడుగులు వేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లోని ఇళ్లల్లో ఏర్పాటు చేసే ప్రతిమలు మట్టివే ఉండాలని, వీటిని పండుగ పూర్తయ్యాక ఆ కమ్యూనిటీల్లోనే ఒకే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. వీరికి అనుకూలంగా స్టార్టప్స్, పర్యావరణ సంస్థలు గ్రీన్ గణేశుడి విగ్రహాల తయారీకి ముందుకొస్తున్నాయి. చారి్మనార్, కూకట్పల్లి, బేగంపేట వంటి ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు, ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫాంల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. కొన్ని ఎన్జీవోలు మట్టి ప్రతిమలను పబ్లిక్ ప్రదేశాలు, పార్కులు, మాల్స్లో ఉచితంగా అందిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆలోచనలు అంకురించి.. పర్యావరణం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన రీత్యా పలు సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మట్టితో తయారు చేసిన విగ్రహాల్లో విత్తనాలను ఉంచుతున్నారు. పండుగ పూర్తయ్యాక వీటిని బయటి చెరువుల్లో నిమజ్జనం చేయాల్సిన పనిలేకుండా పెరడులోనే ఉంచుకునే విధంగా ప్రతిమలను తయారు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను కుండీల్లో ఉంచి నీరు పోయడం ద్వారా అందులో ముందుగానే ఉంచిన విత్తనాలు మొలకెత్తుతాయి.. ప్రకృతి ప్రేమికులకు అనుకూలంగా వారు మెచ్చే రీతిలో కావాల్సిన విత్తనాలతో వీటిని తయారుచేసి అమ్ముతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ వీటికి ఆకర్షితులవుతున్నారు. కొన్ని సంస్థలైతే వీటికి ఉపయోగించే కుండీలను కూడా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికే చెక్క, వేర్లు, ఇతర పీచుతో తయారు చేస్తున్నారు. విగ్రహంతోపాటే వీటినీ అమ్మకానికి ఉంచుతున్నారు. (చదవండి: మేఘాలయ టూర్..! అంబరాన్నంటే అద్భుతం!) -
సమయపాలన.. జీవితాన్ని తీర్చిదిద్దే కళ
జీవితంలో అత్యంత అరుదైన, విలువైన బహుమతి ఏదైనా ఉందంటే అది కాలమే. ఈ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే విజయం, ఆనందం సాధించగలం. సమయం అనేది నిరంతర ప్రవాహం. దానిని సక్రమంగా వినియోగించుకుంటేనే మన జీవితం ఒక అద్భుతమైన గమ్యాన్ని చేరుకుంటుంది, అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం.కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటే వృద్ధి కలుగుతుంది. కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే క్షీణత తప్పదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రతిదీ నశించిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సూక్తి సమయపాలన అనివార్యతను, అది జీవితంలో వృద్ధికి లేదా క్షీణతకు ఎలా దారితీస్తుందో స్పష్టంగా వివరిస్తుంది.సమయం ఎవరి కోసం ఆగదు; కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతర ప్రవాహంలో, సమయపాలన అనే కళ ద్వారా మనం మన జీవితాన్ని ఒక సుందరమైన శిల్పంలా మలచుకోవచ్చు. సనాతన ధర్మంలో సమయానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి శుభకార్యానికి ఒక ముహూర్తం, ప్రతి పనికి ఒక నిర్దిష్ట కాలం కేటాయించడం దీనిలో భాగమే. వేదకాలం నుండే మన ఋషులు కాలాన్ని నిశితంగా అధ్యయనం చేసి, దాన్ని విభజించి, ప్రతి క్షణాన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలో లోకానికి బోధించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రతి కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవాలని అర్జునుడికి ఉపదేశిస్తాడు. అలాగే, రామాయణంలో లక్ష్మణుడు నిద్ర లేకుండా సీతారాములకు సేవ చేస్తూ, కాలరహిత నిబద్ధతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించి, సమయపాలనకు ఆదర్శంగా నిలిచాడు.(రూ.13 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?)సమయానికి సమానమైన మిత్రుడు గానీ, శత్రువు గానీ మరొకటి లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మనకు అత్యుత్తమ మిత్రునిగా మారి విజయాన్ని ప్రసాదిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే, అది శత్రువై మనల్ని పతన పథంలోకి నెడుతుంది. ఈ సూక్తి సమయపాలన ప్రాధాన్యతను, దానిని ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో విజయాలు ఎలా సాధించవచ్చో వివరిస్తుంది.కాలం సమస్త జీవరాశిని పరిపక్వం చేస్తుంది, కాలమే ప్రజలను సంహరిస్తుంది. అందరూ నిద్రిస్తున్నప్పుడు కూడా కాలం మేల్కొని ఉంటుంది. కాలాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ శ్లోకం కాలం అజేయ శక్తిని, దానిని గౌరవించి సద్వినియోగం చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తుంది.సమయపాలన కేవలం పనులను పూర్తి చేయడం కాదు, అది జీవితాన్ని అర్థవంతంగా, క్రమబద్ధంగా జీవించే ఒక గొప్ప కళ. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం ఉన్నత లక్ష్యాలను సాధించగలం, ఒత్తిడిని తగ్గించుకొని, అంతర్గత శాంతిని పొందగలం. జీవితాన్ని పరిపూర్ణంగా, ప్రయోజనకరంగా మలచుకోవడానికి సమయపాలన ఒక అమూల్యమైన సాధనం. ఈ కళను నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సరికొత్త ఉన్నతిని సాధించగలరు.ప్రపంచంలోని అనేకమంది విజేతలు సమయపాలనను తమ అపార విజయానికి ప్రధాన కారణం అంటారు. వారు ప్రతీ నిమిషాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించు కోవడం ద్వారానే అసాధారణ ఫలితాలు సాధించారు. ఉదాహరణకు, ఒక విద్యార్థి సకాలంలో పాఠాలు పూర్తి చేస్తే ఉత్తమ ఫలితాలు పొందగలడు. అలాగే, ఒక ఉద్యోగి గడువులోగా పనులు అప్పగిస్తేనే వృత్తిలో పురోగమిస్తాడు. కచ్చితమైన సమయపాలన తోనే రవాణా వ్యవస్థలు, ప్రాజెక్టులు సమర్థవంతంగా సాగి, లక్షలాది మంది జీవితాలకు ఆసరా అవుతాయి. ఇవన్నీ మన ధర్మంలో సమయానికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని, దాని ఆచరణ విలువను స్పష్టం చేస్తాయి. – కె. భాస్కర్ గుప్తా -
సొరకాయ, కీరదోసతో స్నాక్స్ చేసేద్దాం ఇలా..!
గోవా ప్రాన్స్ రిషాయిడోకావలసినవి: రొయ్యలు– ఒక కప్పు (శుభ్రపరిచి హాఫ్ బాయిల్ చేçసుకోవాలి)ఉల్లిపాయ– ఒకటి (చిన్నది, తరిగినది)పాలు– అర కప్పుఉప్పు, మిరియాల పొడి– రుచికి తగినంతమైదాపిండి– ఒక కప్పు పైనేనీళ్లు, నూనె– సరిపడాగుడ్లు– 2 (పగలగొట్టి, కొద్దిగా పాలల్లో కలిపి పెట్టుకోవాలి)బ్రెడ్ పౌడర్– ఒక కప్పుతయారీ: ముందుగా కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత రొయ్యలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని; మూతపెట్టి చిన్నమంట మీద బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మైదాపిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉండను పూరీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. రొయ్యల మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, కొద్దికొద్దిగా పూరీల్లో నింపుకుని చిత్రంలో చూపిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని గుడ్లు, పాల మిశ్రమంలో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.సొరకాయ మంచూరియాకావలసినవి: సొరకాయ తురుము– 1 కప్పుమైదాపిండి– 4 టేబుల్ స్పూన్లు, కార్న్ పౌడర్– 1 టేబుల్ స్పూన్ , గోధుమపిండి– 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్, కారం– 1 టీ స్పూన్ , జీలకర్ర– అర టీ స్పూన్ , ఉల్లిపాయ ముక్కలు– 1 టేబుల్ స్పూన్ (చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము, కరివేపాకు– కొద్ది కొద్దిగా (అభిరుచి బట్టి), ఉల్లికాడ ముక్కలు– కొద్దిగా, టమాటో సాస్– 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్– 2 టీ స్పూన్లు, సోయా సాస్– 1 టీ స్పూన్ , నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని; అందులో సొరకాయ తురుము, మైదాపిండి, కార్న్ పౌడర్, గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం వేసి బాగా కలపాలి. మరీ పొడిగా ఉంటే కాస్త నీళ్లు కలపొచ్చు. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. తర్వాత మరో కళాయి తీసుకుని; అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని; ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, కొత్తిమీర తురుము, కరివేపాకు వేసి కలపాలి. ముందుగా వేయించుకున్న మంచూరియాలను అందులో వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, ఉల్లికాడ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.పికిల్డ్ కుకుంబర్కావలసినవి: కీర దోసకాయలు– 3 లేదా 4 మధ్యస్థ పరిమాణంలో వెల్లుల్లి– 2 రెబ్బలు (సన్నగా తరగాలి)అల్లం– ఒక చిన్న ముక్క (సన్నగా తురుముకోవాలి)సోయా సాస్, వెనిగర్– 2 టేబుల్ స్పూన్లు చొప్పుననువ్వుల నూనె– ఒక టీ స్పూన్చిల్లీ ఫ్లేక్స్– అర టీస్పూన్పంచదార పొడి– ఒక టీస్పూన్పుల్లలు– 2–3 తయారీ: ముందుగా కీర దోసకాయలను శుభ్రంగా కడిగి, చివరలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై చిత్రంలో ఉన్న విధంగా కీర దోసకాయల తొక్కతీసి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై ఉప్పు జల్లి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత దోసకాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, పొడిగా తుడవాలి. ఈలోపు ఒక గిన్నెలో సన్నగా తరిగిన వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, సోయా సాస్, వెనిగర్, నువ్వుల నూనె, పంచదార వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బ్రష్తో కీరాలకు పూయాలి. ఇప్పుడు వాటిని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, సర్వ్ చేసుకునే ముందు వాటికి పుల్లలు గుచ్చి సర్వ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. (చదవండి: ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!) -
నార్కోలెప్సీ: స్లీప్లోకి స్లిప్!
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు. కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్గా పరిగణించాలి.నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...? నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్సైకిల్స్ కొనసాగుతుంటాయి. వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు... ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్మెంట్ ఎలాగో సూచిస్తారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్ (చదవండి: -
కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్ ప్రభావం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...స్ట్రోక్ రావడానికి ఆ సీజన్ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.బ్రెయిన్ స్ట్రోక్ అంటే... అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్ను ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 3) ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్)లాగే... ఓ పెద్ద స్ట్రోక్ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్గా పరిగణిస్తారు. ఇక స్ట్రోక్ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.వేసవిలోని వేడిమి...డీ–హైడ్రేషన్ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. వడదెబ్బ (హీట్స్ట్రోక్) : వడదెబ్బ కూడా స్ట్రోక్ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్ ఎగ్జర్షన్) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్ ముప్పు మరింతగా పెరుగుతుంది.వర్షాకాలంలో...ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్) స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్ : మాన్సూన్ సీజన్లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్ ముప్పును పెంచుతాయి.చలికాలంలో...వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్ తగ్గినా... అది స్ట్రోక్ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. వాసోకన్స్ట్రిక్షన్ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది. ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్ పెరిగేలా చేసి స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. డీ–హైడ్రేషన్ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్)తో కలిసి ‘స్మాగ్’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్ కూడా స్ట్రోక్ ముప్పును పెంచేస్తుంది. నివారణ...ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండటం. అన్ని సీజన్లలోనూ ఆయా సీజన్లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. ఏ సీజన్లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
చిన్న వయసులోనే రచయిత్రిగా స్నేహా దేశాయ్..!
ఒకవైపు మెయిన్స్ట్రీమ్ టీవీ షోలు, మరోవైపు ‘మహారాజ్’ ‘లాపతా లేడీస్’లాంటి భిన్నమైన బాలీవుడ్ చిత్రాలతో చిన్న వయసులోనే రచయిత్రిగా పెద్ద పేరు తెచ్చుకుంది స్నేహా దేశాయ్. గుజరాత్ నాటకరంగం నుంచి టీవీరంగంలోకి అడుగు పెట్టిన స్నేహ అప్పుడప్పుడు టీవీ షోలలో నటించినప్పటికీ రచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఎంతోమంది సీనియర్ రచయితల దగ్గర సహాయకురాలిగా పనిచేసింది. ‘మిసెస్ తెందూల్కర్’తో టీవీ రైటర్గా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తరువాత రాసిన ‘ఆర్కే లక్ష్మణ్ కే దునియా’ ‘బిహా హమారీ బహు కా’లాంటి టీవీ షోలతో రైటర్గా పేరు తెచ్చుకుంది. ‘టీవీ అంటే అప్పుడే కాదు నాకు ఎప్పటికీ ఇష్టమే’ అని చెప్పే స్నేహ టీవీ కోసం ప్రతి నెల 56 ఎపిసోడ్లు రాసేది. గుజరాతీ ప్రాంతీయ టీవీకి రాస్తున్న స్నేహకు ‘మహారాజ్’ సినిమా అవకాశం వచ్చింది. దీనికి కారణం ‘మహారాజ్’ అనేది గుజరాతీ నేపథ్యం ఉన్న కథ. ఈ సినిమాకు స్నేహ రాసిన స్క్రీన్ప్లే ఆమిర్ఖాన్కు బాగా నచ్చింది. దీంతో ‘లా పతా లేడీస్’కు పనిచేసే అవకాశం వచ్చింది. బిప్లబ్ గోస్వామి రాసిన కథకు స్క్రీన్ప్లే రాయల్సిందిగా ఆమిర్ఖాన్ నుంచి పిలువు వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ‘మహిళలు రాసేవి పురుషులు కూడా రాస్తారు. అయితే ఇద్దరి దృష్టి కోణం వేరుగా ఉంటుంది. మహిళగా నా అనుభవాలు, ఆలోచనలు పురుషులతో భిన్నంగా ఉండడం అనేది సహజం. లాపతా లేడీస్లో ఎన్నో స్త్రీ పాత్రలు ఉంటాయి. ఒక మహిళగా ఆ పాత్రలను అర్థం చేసుకొని రాయడం నాకు సులువు అయింది’ అంటోంది స్నేహ దేశాయ్. -
కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!
వీధికుక్కల పట్ల అమానవీయంగా ఉండే వారి కంటే మానవత్వంతో వ్యవహరించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దిల్లీకి చెందిన దేవీజీ ఒకరు. డెబ్బై నుంచి ఎనభైవరకు వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటుంది దేవీజీ. భర్త చనిపోయిన, పిల్లలు దూరమైన దేవికి శునకాలే పిల్లలు. స్ఫూర్తిదాయకమైన దేవీజీ గురించి కంటెంట్ క్రియేటర్ నీతూ బిషత్ రావత్ ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తనకు ఉన్న చిన్నస్థలంలోనే వీధి కుక్కలకు ఆశ్రయం ఇస్తున్న దేవీజీ రోజూ వాటికి ఆహారం అందించడానికి నానా కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో దేవీజీకి తోచిన సహాయం చేయాలని నెటిజనులను కోరింది నీతు. ఆమె వీడియో షేర్ చేయడానికి ముందు దేవీజీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దేవీజీ గురించి తెలుసుకున్న ఎంతోమంది ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఇన్ని కుక్కలను పెంచుకొని ఏం చేస్తావు?’ అని ఎంతోమంది దేవీజీని వెటకారంగా అడిగేవారు. దీనికి ఆమె చిరునవ్వు మాత్రమే సమాధానం అయ్యేది. అయితే అసలుసిసలు సమాధానం తరచుగా కనిపించే ఒక దృశ్యంలో దొరుకుతుంది. ఆ దృశ్యం: తల్లి చుట్టూ పిల్లలు చేరినట్లు దేవీజీ చుట్టూ శునకాలు చేరుతాయి. తన పిల్లలతో మాట్లాడినట్లుగానే శునకాలతో ప్రేమగా మాట్లాడుతూ కనిపిస్తుంది దేవిజీ. View this post on Instagram A post shared by Neetu Bisht Rawat (@iam_neetubishtrawat) (చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’) -
నత్త జిగురుతో కాంతులీనే చర్మం..!
ఈ అత్యాధునిక చర్మ సంరక్షణ పరికరం అందాన్ని కోరుకునేవారికి ఒక వరం. చర్మానికి ఎల్ఈడీ థెరపీలను అందించే డివైస్లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా, సౌందర్యప్రియులకు ఈ మెషిన్ అందించే పర్ఫెక్షనే వేరు! దీనిలోని ఫొటో–బయోమాడ్యులేషన్ టెక్నాలజీ.. ఆన్ చెయ్యగానే ఎరుపు కాంతిని విడుదల చేస్తూ, కేవలం 12 నిమిషాల్లోనే ముఖానికి కొత్త మెరుపుని అందిస్తుంది. దీని పనితీరు క్లినికల్ పరీక్షల్లో కూడా నిగ్గుతేలింది.ఈ డివైస్ ముఖాకృతిలోనే రూపొందడంతో దీని ముందు ముఖాన్ని ఉంచినప్పుడు అన్నివైపుల నుంచి లైట్ థెరపీ జరుగుతుంది. దాంతో చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ఈ డియోర్ స్కిన్ లైట్ థెరపీని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు అందుకున్న తర్వాత వయసుతో వచ్చే ముడతలు, మచ్చలు చాలా వరకూ తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారుతుంది.ఈ మాస్క్ డివైస్ అన్ని రకాల చర్మాలకు అనువైనదే. సున్నితమైన స్కిన్ టైప్ ఉన్నవారికి కూడా పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డివైస్ ఒక టేబుల్ ల్యాంప్లా అనిపిస్తుంది. దీని స్టాండ్ ఎటువైపు అయినా వంగుతూ, వాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దీన్ని ఆన్ చేసి లైట్ థెరపీ పొందేటప్పుడు, పడుకుని లేదా కూర్చుని కూడా ఈ ట్రీట్మెంట్ పొందొచ్చు.వినూత్నమైన బ్యూటీ ట్రీట్మెంట్స్లో ‘స్నెయిల్ క్రాల్ ట్రీట్మెంట్’ లేదా ‘స్నెయిల్ ఫేషియల్’ ఒక రకం! ఈ చికిత్సలో నత్తల నుంచి స్రవించే జిగురుతో చర్మంపై మసాజ్ చేస్తారు. ఈ విధానం ఎన్నో ఏళ్ల క్రితమే గ్రీస్లో ప్రారంభమైంది. తూర్పు ఆసియాలో, ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఈ నత్త జిగురుతో చర్మం తేమను పెంచడం, గాయాలను నయం చేయడం, కణాల పునరుద్ధరణ చేయడంతో పాటు కొన్ని రకాల చర్మ క్యాన్సర్లను కూడా నివారించవచ్చని నిపుణులు తేల్చారు. ఈ ట్రీట్మెంట్తో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముఖంపై గీతలు, ముడతలు తగ్గుతాయి. అలాగే గాయాలు, అలర్జీలు, దురదలు వంటి సమస్యలు కూడా నయమవుతాయి. ఈ చికిత్సలో నేరుగా నత్తను చర్మంపై వదులుతారు. లేదంటే నత్త నుంచి సేకరించిన జిగురు ముఖానికి పూస్తారు. నత్త జిగురుతో ఇప్పుడు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు కూడా తయారవుతున్నాయి. (చదవండి: ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..?
నాకు ఇటీవల హెపటైటిస్–బీ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు నేను ఎనిమిది నెలల గర్భవతిని. మా కుటుంబంలో కొంతమందికి కూడా ఇదే వ్యాధి ఉంది. ఈ విషయం డాక్టర్కు ముందుగా చెప్పాలా? నా బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా?– జ్యోతి, హైదరాబాద్ గర్భవతిగా ఉన్న మీరు ఈ హెపటైటిస్–బీ వంటి వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది రక్తం ద్వారా వ్యాపించి, మీ లివర్ను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో వైరస్ ఉంటే, బిడ్డ పుట్టే సమయంలో తల్లి రక్తంతో సంపర్కంలోకి వచ్చేటప్పుడు వైరస్ బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన విషయం. శిశువులకు వైరస్ సోకినప్పుడు దాదాపు తొంభై శాతం శాశ్వత లివర్ వ్యాధిగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే మీరు ఇప్పుడే మీ వైద్యులకు చెప్పాలి. ముందుగా సమాచారం ఉంటే తగిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించేందుకు ప్రత్యేకమైన రక్షణ చికిత్సలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన నాటికి రెండు పనులు చేయాలి. ఒక్కటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది వైరస్ను వెంటనే అడ్డుకుంటుంది. రెండు, హెపటైటిస్–బీ టీకా మొదటి మోతాదును ఇవ్వాలి. ఈ రెండు కూడా బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల చేయాలి. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరు మోతాదుల టీకా షెడ్యూలును పూర్తి చేయాలి. మొదటి మోతాదు పుట్టిన వెంటనే, రెండవ మోతాదు నాలుగు వారాల్లో, మూడవది ఎనిమిది వారాల్లో, నాల్గవది పన్నెండు వారాల్లో, ఐదవది పదహారు వారాల్లో, ఆరవది ఇరవై నెలల్లో వేయాలి. ఆరు మోతాదులు పూర్తయిన తర్వాత బిడ్డకు రక్తపరీక్ష చేయాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిందో లేదో తెలుస్తుంది. తల్లి ఈ సంగతిని వైద్యులకు ముందుగానే చెప్పడం వల్లే సాధ్యమవుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను సంపూర్ణంగా రక్షించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన సమాచారం డాక్టర్కి ఇవ్వండి. నేను గర్భధారణకు ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది రుబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెబుతున్నారు. కాని, ఇదివరకు నాకు ఈ వ్యాధి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పండి.– అనిత, రాజమండ్రిమీరు గర్భధారణ కోసం సిద్ధమవుతుంటే, రుబెల్లా వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రుబెల్లా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది దగ్గుతో, తుమ్ముతో గాలిలోకి వచ్చే జలకణాల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కాని, గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే, బిడ్డకు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు కలగవచ్చు. ఈ వ్యాధి గర్భంలో ఉన్న శిశువుకు సోకితే, చెవిటితనం, కాటరాక్ట్ వంటి కంటి లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మెదడు ఎదుగుదలపై ప్రభావం, లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ తొలి మూడు నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నివారించడానికి ముందుగా ఒక రక్త పరీక్ష చేయించుకోవాలి. రుబెల్లా ఐజీజీ అనే పరీక్ష చేసి, మీ శరీరంలో ఇప్పటికే ఈ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు. యాంటీబాడీలు ఉన్నట్లయితే, మీ శరీరానికి రక్షణ ఉంది కాబట్టి టీకా అవసరం ఉండదు. యాంటీబాడీలు లేనట్లయితే, తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎమ్ఎమ్ఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) రూపంలో ఇవ్వబడుతుంది. ఒక మోతాదుతో ప్రారంభించి, అవసరమైతే రెండో మోతాదును కొన్ని వారాల గ్యాప్లో వేయొచ్చు. అయితే, వ్యాక్సిన్ వేసిన తరువాత కనీసం రెండు నెలల పాటు గర్భం ధరించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం రక్షణ ఏర్పరచుకుంటుంది. ఇది శిశువును రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది. టీకా వల్ల కొన్నిసార్లు తేలికపాటి జ్వరం రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అనే విషయం స్పష్టంగా గుర్తులేనట్లయితే, పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. టీకా అవసరమైతే ఇప్పుడే వేయించుకుని, రెండు నెలలు గడిచిన తరువాత గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఇలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి హానికి గురికాకుండా, ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
పిడకల ధూపం.. ఆరోగ్య ధూమం
ఆవుపేడకు ఉన్న ప్రశస్తి తెలిసినదే! ఆవుపేడతో తయారు చేసిన పిడకలను ఇదివరకటి కాలంలో పొయ్యి రాజేసుకోవడానికి వంటచెరకుగా వినియోగించేవారు. ఇప్పటికీ ఆవుపేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్, అగరొత్తులు, జపమాలలు, కుండీలు, దేవుళ్ల ప్రతిమలు, ప్రమిదలు, బొమ్మలు, విభూది, పళ్లపొడి వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైతు సుబ్బరాజు ఆవుపేడకు వనమూలికలను జతచేసి, అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణే లక్ష్యంచిత్తూరు జిల్లా నగరి మండలం, రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు విలక్షణమైన పద్ధతిలో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలను సాగుచేసిన రైతుగా, పాడి రైతుగా తనకు గల అనుభవంతో పర్యావరణ రక్షణ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆయుర్వేద గ్రంథాలను అధ్యయనం చేయడమే కాకుండా, ఆయుర్వేద నిపుణులను కలుసుకొని, వారి సూచనలతో అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. ఇంటి వద్దనే ఒక పాక వేసుకుని, ఈ అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు.ఆయుర్వేద మూలికలతో... దేశవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతి, తామర మొదలైన సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాంసి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, సుగంధిపాల, గ్రంథి, చెంగల్వకోష్టు, పచ్చకర్పూరం వంటి మూలికలు, ఆయుర్వేద ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి, కావలసిన ఆకారంలో పిడకలను తయారు చేసి ఎండబెడతారు. వీటి తయారీకి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులూ అందుబాటులో ఉంటే ఒక మనిషి రోజుకు మూడువందల వరకు పిడకలను తయారుచేసి, ఎండబెట్టవచ్చు. ఈ పిడకలను హోమద్రవ్యంగా అగ్నిహోత్రంలో వినియోగించవచ్చు. అలాగే, వీటి పొగను ఇంట్లో ధూపంగా కూడా వేయవచ్చు. ఈ పిడకల నుంచి వెలువడే పొగ సుగంధభరితంగా ఉండి, ఇంట్లోని వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి పలువురు ఈ అగ్నిహోత్ర పిడకలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి ఈ పిడకలను వాడి, వాటి నాణ్యతను తెలుసుకున్నవారు మళ్లీ మళ్లీ వాటిని వినియోగిస్తున్నారు.ఆరోగ్యం కోసం చేస్తున్నా...ఆరోగ్యకరమైన పంటలను అందించడానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలాగే గాలిని కూడా వీలైనంత మేరకు ఆరోగ్యకరంగా మార్చాలనే ఆలోచనతోనే ఈ పిడకల తయారీని ప్రారంభించాను. పూర్వీకులు ఉదయాన సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ను నిర్మూలించేందుకు ఆవు పేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఇటీవలి ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్ఫోన్ ఉంచినపుడు దాని నుంచి వెలువడే రేడియేషపరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాల్లో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకుని, కొందరు ఆయుర్వేద నిపుణుల సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నాను. వీటి తయారీకి కావలసిన వస్తువులను సేకరించడం చాలా కష్టతరంగా మారింది. పది కిలోల పేడతో పిడకలు తయారు చేయాలంటే, మూడు కిలోల నెయ్యి అవసరం. వీటి తయారీకి వాడే పాలు, పెరుగు, పంచితంతో పాటు వీటిలో వేసే మూలికలు ఇక్కడ లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపులకు వెళ్లి తీసుకువచ్చా. ఇలా తయారుచేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోంది. నేను రూ. 30కే విక్రయిస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నా.– సుబ్బరాజు, పాడిరైతు, రాజులకండ్రిగ, నగరి మండలం. కోనేరి చంద్రమోహన్, నగరి(చదవండి: మట్టి నుంచి విద్యుత్తు!) -
అదితి శంకర్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
డైరెక్టర్ కూతురే అయినా, ఆమెను కెమెరా ముందు నిలిపింది కేవలం తన టాలెంటే! అందుకే, ప్రతిభను నమ్ముకుని ముందుకెళ్లే అదితి శంకర్ అందానికి కారణం కూడా ఆమె ఆత్మవిశ్వాసమేనట!నాకు బ్యూటీ సీక్రెట్లు ఏవీ లేవు! ప్రతిరోజూ స్నానం చేయడం, బాగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే! సంప్రదాయ దుస్తులు అంటే ఇష్టం. ముఖ్యంగా చీరల్లో నేను రాణిలా మెరిసిపోతుంటాను. అందుకే ప్రత్యేక సందర్భాల్లో నా మొదటి ఎంపిక చీరలే. ఇవి నాకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాయని అంటోంది అదితి శంకర్. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్ నిరాలీ, ధర రూ. 35,000, జ్యులరీ బ్రాండ్: ఎమిథిస్ట్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. డబుల్ చెయిన్... డబుల్ ఇంపాక్ట్!ఫంక్షనేమో చిన్నదే కాని, అది చాలా దగ్గరి వారిది. పెద్దగా తయారవకుండానే, ప్రత్యేకంగా కనిపించాలి. అయితే, ఒక్కసారి మెడలో ఈ డబుల్ లేయర్డ్ చెయిన్ వేసుకోండి. తళతళలాడే భారీ నగలు లేకుండానే, ఈ ఒక్క ఆభరణమే అందరి చూపులను ఆకర్షించేలా చేస్తుంది. సింపుల్ అయినా సాఫిస్టికేటెడ్, క్యూట్ అయినా కిల్లర్ లుక్కి చిరునామా డబుల్ లేయర్డ్ చెయిన్తో అందుకే దీని ప్రభావం కూడా రెట్టింపుగా ఉంటుంది. అయితే, ఈ హారం వేసుకునేటప్పుడు కొన్ని స్టయిలింగ్ చిట్కాలు గుర్తుంచుకోవాలి. చెయిన్ స్పష్టంగా మెడపై మెరిసిపోవాలంటే వీ–నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ ఉండేలా చూసుకోవాలి. పెద్ద చెవిపూసలు వేసుకుంటే ఈ చెయి తో పోటీ పడతాయి. అందుకే చిన్న స్టడ్స్ లేదా చిన్ని జుమ్కీలు సరిపోతాయి. చేతికి తక్కువ గాజులు, ముఖానికి మినిమల్ మేకప్ అంతే, సిద్ధం! జుట్టు విషయంలో కూడా సహజంగా వదిలిన లైట్ కర్ల్స్ ఉంటే మెడ బాగా కనిపిస్తుంది, చెయిన్ మరింత మెరిసిపోతుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిన్న డబుల్ చెయన్తో మీ లుక్కి ఒక డబుల్ ఇంపాక్ట్ గ్యారంటీ!. డ్రెస్..బ్రాండ్: నిరాలీధర: రూ. 35,000జ్యూలరీ:బ్రాండ్ : ఎమిథిస్ట్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గా
టీవీ షోలు, తనదైన ప్రత్యేక పాత్రలతో బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న నటి నేహా ధూపియా (Neha Dhupia) . 2018లో నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె 45 ఏళ్ల నటి ప్రసవానంతర బరువు తగ్గినప్పుడు వార్తల్లో నిలిచింది. అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలగా 23 కిలోల బరువు తగ్గినవైనం విశేషంగా నిలిచింది. తక్కువ తినడం గురించి కాదు, సరిగ్గా తినడం గురించి తెలుసుకోవాలని తెలిపింది. మరింకెందుకు ఆలస్యం నేహా ధూపియా వెయిట్లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం.నేహా ధూపియా ప్రసవానంతర బరువును ఎలా తగ్గించుకుందో మీడియాతో పంచుకుంది. నాలుగేళ్ల కాలంలో పదే పదే బరువు పెరిగాను, సన్నగా అయ్యాను. చాలా విమర్శలెదుర్కొన్నాను. అయినా సరే గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవానంతర సమయంలో ఎలా ఉన్నాను అనేది పట్టించుకోలేదు. తల్లిగా తాను తన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టాను తప్ప, బరువు తగ్గడం గురించి ఆలోచించలేదని చెప్పింది. అయితే లాక్డౌన్ సమయంలోనే తాను లో-కేలరీ డైట్పై దృష్టిపెట్టినట్టు చెప్పింది. చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీఆతరువాత ఆరోగ్య రీత్యా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారు. అదీ ఎలాంటి షార్ట్ కట్లు, క్రాష్ డైట్లూ లేకుండా. అయితే ఈ విషయంలో మొదట చాలా ఇబ్బందులు పడ్డాననీ కానీ సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా చక్కెర, వేయించిన ఆహారాలు, గ్లూటెన్ను తగ్గించుకుంది. జిమ్కు వెళ్లడం తనకు పెద్దగా ఇష్టం ఉందనీ, అందుకే పరుగు లాంటి వ్యాయామ దినచర్యను ఎంచుకు న్నానని వెల్లడించింది. అలా తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ, జీవనశైలి మార్పులు, దానికి తగ్గ ఆహారం, వ్యాయామంతో ఏడాది కాలంలో దాదాపు 24 కిలోలు బరువును తగ్గించుకుంది.ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటినేహా ధూపియా ఇంకా ఇలా పంచుకున్నారు. నిజానికి ఇందులో దీనికి షార్ట్ కట్స్ లేవు, అంత ఈజీకూడా కాదు రాకెట్ సైన్స్ కూడా లేదు, గట్టి నిలబడండి, స్థిరంగా ఉండండి, కష్టపడి పనిచేయండి. ముఖ్యంగా మీకు అస్సలు మనస్కరించని రోజుల్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండండి అని తెలిపింది. ఈ శారీరక మార్పులు తన మానసిక ఆరోగ్యానికి కూడా ఎలా సహాయపడ్డాయో కూడా వివరించింది. "ఆరోగ్యంగా ఉండటం వల్ల నా పిల్లలతో కలిసి చురుగ్గా ఉండటానికి తోడ్పడింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. మానసిక బలానికి శారీరక ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుందని కూడా వెల్లడించింది. రాత్రి 7 గంటల కల్లా పిల్లలతో కలిసి డిన్నర్ చేయడం. ఇక మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నా భర్త అంగద్తో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని మధ్యలో ఏమీ తీసుకునేదాన్ని కాదు అంటూ వెయిట్లాస్ సీక్రెట్స్ని పంచుకున్నారామె. అంతేకాదు చాలామందిలాగా క్రాష్ డైట్లు, జిమ్ కసరత్తులు లేకుండానే వ్యాయామాలతో సింపుల్ లైఫ్స్టైల్తోనే తాను అనుకున్న వెయిట్లాస్ సాధించానని తెలిపింది.కాగా నేహా ధూపియా -అంగద్ బేడీ దంపతులకు ఇద్దరు సంతానం. (కూతురు మెహ్ర్, కొడుకు గురిఖ్) మొదటినుంచీ కాస్తా బొద్దుగా ఉండే నేహా, ప్రెగ్నెన్సీ సమయాల్లో బాగా బరువు పెరిగింది. దీంతో ‘దాదీ ధూపియా, గ్రాండ్మా ‘మోటీ, తిమింగలం అంటూ ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా, అటు ఇంటిని, ఇటు కరియర్ను చక్కదిద్దుకున్న సూపర్మామ్ నేహా ధూపియా. -
సంసారం సాఫీగా ఉండాలంటే ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి: నటుడు
దాంపత్య జీవితం బాగుంటే..జీవితం సాఫిగా హాయిగా సాగిపోతుందని చెప్పొచ్చు. అంతేగాదు అటు కెరీర్ పరంగానూ, ఫ్యామిలీ పరంగా హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి. పైగా జీవితాన్ని మంచిగా లీడ్ చెయ్యొచ్చు. అయితే ఈ విషయంలో అందరు ఎక్కువగా పొరపాటులు చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరూ సమానంగా బ్యాలెన్స్ కావాలి. అప్పుడే సంసారం అనే నావా సాపీగా సాగుతుంది. ఇందులో ఎవ్వరో ఒక్కరూ తేడాగా ప్రవర్తించినా.. అంతే పరిస్థితి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ జాన్ అబ్రహం మాత్రం ఈ మూడు నియమాలు పాటిస్తే..దాంపత్య జీవితాన్ని పటిష్టంగా మార్చుకోవచ్చని చెబుతున్నాడు.జాన్ అబ్రహం వైవిధ్యభరితమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. ఆయన నటుడిగా, నిర్మాతగా ఎంత మంచి మంచి చిత్రాలు చేసినా..వ్యక్తిగత జీవితం మాత్రం అత్యంగ గోప్యంగా ఉంటుంది. అసలు పబ్లిక్గా కనిపించడం కూడా అత్యంత అరుదే. అలాంటి వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ ప్రియా రంచల్ అనే అమ్మాయిని 2014 యునైటెడ్ స్టేట్స్లో వివాహం చేసుకున్నాడు. అదికూడా ప్రైవేట్గా ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా బంధువుల సమక్షంలో చేసుకున్నారు. ఆ విషయం కూడా బయటకు పొక్కనీయలేదు జాన్. ఒక న్యూఈయర్కి శుభాకాంక్షలు చెబుతూ ప్రియా జాన్ అని సంతకం చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అదీగాక ఈ జంట పబ్లిక్గా కనిపించడం కూడా అరుదే కాబట్టి తెలిసే ఛాన్స్ తక్కువ కూడా. 11 ఏళ్ల వైవాహికబంధంలో ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఆనందంగా లైఫ్ని లీడ్ చేస్తోంది ఈ జంట. ఆయన ఇటీవల ఒక సంభాషణలో వివాహ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వైవాహిక జీవితం స్ట్రాంగ్గా ఉండాలంటే మూడు నియమాలు పాటించాలంటూ కొన్ని టిప్స్ షేర్ చేశాడు. నా సినిమాలకు, వ్యక్తిగత జీవితంతో సబంధంలేదు. అందుకే తాను మూవీ షూటింగ్ అయిపోగానే వెళ్లిపోతా..అక్కడ ఎక్కడ తన గురించి, ఫ్యామిలీ గురించి ప్రస్తావించనని అన్నారు. అలాగే నా పేరు గాసిప్స్ హెడ్లైన్కి వెళ్లేలా ఎలాంటి ప్రచారక్తరను నియమించుకోలేదని చెబుతున్నాడు. ఎందుకంటే తన షూటింగ్స్ ముగించుకుని నేరుగా తన ఇంటికి వెళ్లిపోతానని అన్నారు. అలాగే తన భార్య కూడా ఈ గోప్యతను పాటిస్తుందని చెప్పాడు. ఎక్కడ తన గురించి ప్రస్తావన చేయదు. అదే మా దాంపత్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నాడు. ఇక్కడ ఒకరంటే ఒకరికి గాఢమైన నమ్మకం..పెట్టుకున్న నియమాన్ని బ్రేక్ చేయకుండా గౌరవించడం అనేవి బంధాన్ని దృఢంగా మారుస్తుందని చెబుతున్నాడు అబ్రహం. మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ప్రైవసీని కూడా మనం కాపాడాలని, మన కెరీర్ వాళ్ల జీవితాన్ని ఇబ్బందులో పెట్టేలా చేయకూడదనేది తన ఉద్దేశ్యమని అంటున్నాడు. ఇక జాన్ భార్య ప్రియా అత్యంత విజయవంతమైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, పైగా ఆమె కూడా మీడియాకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతుందట. ఏ జంట అయిన వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచితే..ఎలాంటి చిక్కుల్లో పడరు. రిలేషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుందనేది నటుడు జాన్ చాలా చక్కగా వివరించారు.(చదవండి: స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..) -
స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లబడతాయా..? సైన్స్ ఏం చెబుతోందంటే..
చాలామందికి, టీ, కాపీ, కొన్ని రకాల పానీయాలను సేవించడంతో దంతాలు పసుపురంగులోకి మారిపోతుంటాయి. అయితే స్ట్రాబెర్రీలు వంటి వాటితో తెల్లగా మార్చేయొచ్చంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా చాలామంది దీన్ని గట్టిగా నమ్ముతున్నారు కూడా. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు వైద్య నిపుణులు. డెంటిస్ట్ని సంప్రదించకుండానే స్ట్రాబెర్రీలతో దంతాలు తెల్లగా మార్చుకోవచ్చనేది నిజం కాదని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ సైన్సు ఏం అంటోందో చూద్దామా..!స్ట్రాబెర్రీలు దంతాలను తెల్లగా మారుస్తాయని చెప్పే శాస్త్రియ ఆవిష్కరణ లేదని చెబుతున్నారు పరిశోధకులు. ఇది దంతాలపై ఉపరితల మరకలను తొలగించినప్పటికీ అది శాశ్వతంగా కాదని చెబుతున్నారు. పరిశోధనల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. వాణిజ్య ఉత్పత్తుల కంటే మెరుగ్గా ఈ స్ట్రాబెర్రీలు సహజంగా దంతాల రంగు మార్చేస్తాయనేది వాస్తవం కాదని చెప్పారు. అధ్యయనంలో స్ట్రాబెర్రీలు దంతాల రంగును మార్చడం చూశాం. అయితే దీనిలో 100% గాఢత కలిగిన స్ట్రాబెర్రీ సారం 2-4 రోజుల్లో దంతాల్లో ప్రభావవంతమైన మార్పు చూపిస్తోంది గానీ..శాశ్వతమైన తెల్లటి రంగుని ఇవ్వదని తెలిపారు. అది గణనీయమైన మార్పులను కూడా ఏమి ఇవ్వదని చెప్పారు. పైగా దీనివల్ల ప్రమాదాలు ఉంటాయని అన్నారు.ఎందుకు మంచిది కాదంటే..స్ట్రాబెర్రీలు ఆమ్లంగా ఉంటాయి. ఆమ్లం దంతాలపై ఉన్న రక్షణపొర అయిన ఎనామెల్ను దెబ్బతీస్తుందిఎనామిల్ పలుచబటం మొదలైతే మళ్లీ యథావిధిగా దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు. ఇందులో ఉండే సహజ చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాను తినేస్తాయి. అంతేగాదు కుహారాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.ప్రయత్నించాలనుకుంటే..ఇలా వెంటనే తెల్లగా అవ్వడం కావాలి అనుకుంటే..దంతాలపై స్ట్రాబెర్రీల యాసిడ్, చక్కెరను పూర్తిగా తొలగించాలి. ఎనామిల్ దెబ్బతినకుండా బ్రష్ చేసేందుకు కనీసం 30 నిమిసాలు వేచి ఉండండిసురక్షితమైన మార్గాలు..కాఫీ, టీ, వైన్ వంటి పానీయాలను పరిమితం చేయండిక్రమం తప్పకుండా బ్రష్ చేయండి. దంతవైద్యుడు ఆమోదించిన వైటెనింగ్ టూత్పేస్ట్ లేదా స్ట్రిప్స్ను ఉపయోగించండిబ్లీచింగ్ లేదా ఇన్-క్లినిక్ వైటెనింగ్ వంటి ప్రొఫెషనల్ చికిత్సలు మేలు View this post on Instagram A post shared by Cheryl Hickey (@cherylhickey) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం (చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్టాపిక్గా ఊబకాయం..) -
"నిశ్శబ్ద సంక్షోభం"గా ఊబకాయం: ప్రధాని మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని మోదీ యువతకు, ప్రజలకు ఎన్నో వరాలజల్లు కురిపించేలా పథకాలను అందించడమే కాకుండా ప్రజా ఆరోగ్యంపై కూడా మాట్లాడారు. ఈమేరకు ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రజలంతా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యపై కీలక వ్యాఖ్యలతోపాటు కొన్ని సూచనలు కూడా అందించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సుమారు 103 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో లక్షలాది మంది పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ..జీవనశైలిలో వస్తున్న మార్పులు, సరైన ఆహారపు అలవాట్ల లేమి, తగిన శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎలా పెరిగిపోతోందో నొక్కి చెప్పారు. అంతేగాదు రాబోయే సంవత్సరాల్లో ఊబకాయం మన దేశానికి పెద్ద సవాలుగా మారవచ్చు అని కూడా అన్నారు. ప్రతి కుటుంబంలో నూనె వాడకాన్ని సుమారు 10% తగ్గిస్తే ఇది దేశ ఆరోగ్యానికే మేలు చేస్తుందని చెప్పారు. వంటనూనెతో వ్యాధుల కనెక్షన్..ప్రధాని మోదీ నూనె వాడకం గురించి ఇచ్చిన పిలుపు నిజంగా సరైనదేనా..అంటే..ముమ్మాటికి కరెక్టేనని చెబుతున్నారు నిపుణులు. అధిక నూనె వినియోగం వల్ల సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలో అధికమై బరువు పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. అలాగే ఈ అధిక కొలెస్ట్రాల్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాని పెంచేస్తుందని పోషకాహారా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మోదీ భారతీయులు తక్కువ నూనెను ఉపయోగించే సాంప్రదాయ వంట పద్ధతులను స్వీకరించడం తోపాటు ఆవిరి పట్టడం, వేయించడం, ఉడకబెట్టడం, వంటి వాటిపై ఆధారపడాలని, మొక్కల ఆధారిత పదార్థాలను చేర్చుకోవాలని ప్రజలకు హితవు పలుకుతున్నారు. జీవనశైలిపై దృష్టి సారించాలి..ఒత్తిడి, ఆందోళనతో యువత బాధపడటానికి కారణం, యోగా ధ్యానం వంటి అలవాట్ల లేమి కారణమని చెబుతున్నారు మోదీ. కనీసం నడక, సైక్లింగ్, కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని సూచించారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు దరిచేరనీయకుండా తృణధాన్యాలు, కూరగాయలు, కాలానుగుణ పండ్లను తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకంగా భారత్ అనుసరించే సమతుల్య సాంప్రదాయ ఆహార జ్ఞానానికి మళ్లీ తిరిగి రావాలని ఆ ప్రసంగంలో కోరారు.ఎందకు ఈ హెచ్చరికలు అంటే..ఈ ఊబకాయం ప్రస్తుతం నగరాలకే పరిమితం కాలేదు. భారతదేశంలో 24% మంది మహిళలు, 23% మంది పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఈ పరిస్థితి మరి ఎక్కువగా ఉంది. బాధకరం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండటమేనని అన్నారు మోదీ. అందుకు ప్రధాన కారణం కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగమేనని చెప్పారు.ఇక 136 మిలియన్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ ఉంది. అందులో ఎక్కువ భాగం ఊబకాయం కారణంగా ఈ వ్యాధి బారినపడినవే.బడి వయసు పిల్లలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఊబకాయం కారణంగా వచ్చే వ్యాధుల ప్రమాదం..ఊబకాయం బహుళ దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..టైప్ 2 డయాబెటిస్రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులురొమ్ము, పెద్దప్రేగు కేన్సర్తో సహా కొన్ని రకాల కేన్సర్లుకీళ్ల ఒత్తిడి కారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ తదితరాలు వస్తాయి.దీన్ని గనుక ఆదిలోనే అదుపులో ఉంచే ప్రయత్నం చేయకపోతే 2035 నాటికి, ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటీ సమాఖ్య అంచనా వేసింది.ఆరోగ్యం కోసం జాతీయ మిషన్..ఊబకాయంపై వ్యతిరేకంగా పోరాడటాన్ని వ్యక్తిగత బాధ్యత, సమిష్టి లక్ష్యంగా రూపొందించారు మోదీ. నిజానికి చమురు వినియోగాన్ని 10% తగ్గించాలనే ఆయన సూచన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు..పైగా అందరూ సులభంగా ఆచరించదగినదే. తర్వాతి తరాలకి ఆరోగ్యకరమైన దేశాన్ని బహుమతిగా ఇవ్వాలన్న ఆకాంక్షతో మోఈ ప్రజలకు ఈ ఆరోగ్య సూచనలిచ్చారు. ఆ నేపథ్యంనే మోదీ ఫిట్ ఇండియా ఉద్యమం, పోషన్ అభియాన్ వంటి ప్రచార కారక్రమాలను చేపట్టారు.ఆచరణలోకి తీసుకురాగలమా అంటే..ప్రధాని మోదీ పిలుపుని ఆచరణలో పెట్టేందుకు ఏమంత కష్టపడిపోవాల్సిన పనిలేదు..జస్ట్ ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..వంట చేసే మందుకు నూనెను కొలత ప్రకారం ఉపయోగిస్తే చాలు. కంటైనర్ నుంచి నేరుగా కాకుండా ఒక స్పూన్ లేదా కొలతగా పెట్టుకున్న మరేదైనా చాలు. ఆరోగ్యకరమైన నూనెలు ఎంచుకోండి. అంటే ఆవాలు, వేరుశెనగ, బియ్యం ఊక నుంచి వచ్చే ఆయిల్ వంటి వాటిని ఎంచుకోండి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. రోజుకు 30 నిమిషాలు నడక లేదా కొద్దిపాటి వ్యాయమాలకి కేటాయించే ప్రయత్నం చేయండి చాలు.గమనిక: ఇది కేవలం అవగామన కోసంమ మాత్రమే ఇచ్చాం. పూర్తి వివ్రాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
షేరెంటింగ్ ముప్పు...పేరెంట్స్ పారాహుషార్
సోషల్ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి విస్తృతి కలిగిన సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్లైన్లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించ లేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్ఫింగ్తో మహా ప్రమాదంపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటా న్ని ‘షేరెంటింగ్’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్లైన్ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.అన్నీ చెప్పేసుకుంటే ముప్పుపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు.దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు షేర్ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.పేరెంట్స్.. పారాహుషార్కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.భవిష్యత్తుపై ప్రభావం : కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్లో తిప్పేవారు ఉంటారు. చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు. (Independence day ఫ్యాషన్ క్లిక్.. మువ్వన్నెల వస్త్రాలు)వేటాడే కళ్లకు చిక్కినట్లే! పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్ అవుతుంటాయి. సైబర్ క్రిమినల్స్లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్సైట్లకు షేర్ చేసే ప్రమాదం ఉంటుంది.ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్ను సృష్టించి అన్లైన్లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. వేధింపులు – బెదిరింపులు!ఆన్ లైన్లో : షేర్ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్ చేయవచ్చు. మరెవరికైనా షేర్ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవా రుంటారు. కొందరు మీమ్స్ కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి. పోస్ట్లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవారూ ఉంటారు. ఇదీ చదవండి: జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా? -
ఆర్ట్.. అదిరేట్టు..!
మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీ యువ కళాకారుల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. చిత్రకారులు, ఫొటో గ్రాఫర్ల ప్రతిభను వెలికితీసేలా ఏడాది పొడవునా ఏదో ఒక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు పలు వర్క్షాపులు కూడా నిర్వహిస్తోంది. ఆర్ట్.. అదిరేట్టు అన్న రీతిన చిత్రప్రదర్శనలు నగర సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శన రాత్రి 7 గంటల వరకూ కొనసాగుతోంది. గణేశ చతుర్థి నేపథ్యంలో 22న పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చిత్ర ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది.. హైదరాబాద్ నగరంలో చిత్రకళా ప్రదర్శనలకు వేదికగా మారుతోంది మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీ. ప్రముఖ చిత్ర కళాకారులు మొదలు.. యువప్రతిభవంతుల వరకూ తమ కళా ప్రతిభను ప్రదర్శించేందుకు చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీని వేదికగా చేసుకుంటున్నారు. దాదాపు 10కి పైగా గ్యాలరీలు కళాకారులకు అందుబాటులో ఉన్నాయి. గ్యాలరీలనే కాకుండా అడిటోరియాన్ని కూడా నిర్వాహకులు అద్దెకిస్తున్నారు. పిల్లల కోసం చిత్రలేఖన తరగతులు, శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఏడాదిలో దాదాపు 80 ప్రదర్శనల వరకూ జరుగుతాయి. గణేశ చతురి్థ, బతుకమ్మ, ఉమెన్స్ డే, ఆర్ట్ గ్యాలరీ వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. కళాకారులకు కావాల్సిన వర్క్షాపులు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే కళాకారులకు కావాల్సిన అన్ని వసతులూ కల్పిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్ర, ఫొటో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆలిండియా ఆర్ట్ కాపిటేషన్, ఎగ్జిబిషన్ ఇండియన్ ఫొటో ఫెస్ట్ ప్రతి ఏటా నవంబర్ 20వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకూ నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలో భాగస్వాములవుతున్నారు. గణేశ పెయింటింగ్ కాంపిటీషన్.. ఈనెల 22న ఆర్ట్ గ్యాలరీలో గణేశ్ చతుర్థి 2025 పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున అందించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రీ ఫీజు రూ.500లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 90309 04040, 91000 22958, 76618 72327లలో సంప్రదించవచ్చు. ఆకట్టుకుంటున్న బియాండ్ బౌండరీస్.. 53 మంది చిత్ర కళాకారులు వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 21వ తేదీ వరకూ ఈ ప్రదర్శన సందర్శకులకు అందుబాటులో ఉంటున్నాయి. బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్.. కళాకారుడు వేసిన చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో బిట్వీన్ వాచ్ అండ్ విట్నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఫొటోగ్రఫీ చిత్రప్రదర్శనను గురువారం ప్రారంభించారు. కళాకారుడు శరత్ ముపుడు తీసిన 120 ఫొటోగ్రఫీ చిత్రాలను అందుబాటులో ఉంచారు. ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. గ్యాలరీ బుకింగ్.. సోలో ఎగ్జిబిషన్ రూ.4,500. గ్రూప్ ఎగ్జిబిషన్ రూ.6000లుగా నిర్ణయించారు నిర్వాహకులు. చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా శిక్షణ తరగతులు, పుస్తకావిష్కరణ తదితర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను సందర్శకులు తిలకించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. (చదవండి: యస్...ఇది గణేష్ బండి!) -
యస్... ఇది గణేష్ బండి!
‘అవసరమే ఆవిష్కరణకు దారి చూపిస్తుంది’ అనే మాట తెలంగాణ రాష్ట్రం ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాకు చెందిన లకావత్ గణేశ్ విషయంలోనూ నిజమైంది. పుట్టుకతో పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడిపోయిన గణేశ్ ఎనిమిదో తరగతి వరకు చదివాడు. సెల్ఫోన్ రిపేరును సొంతంగా నేర్చుకొని ఇంట్లోనే షాపు పెట్టుకున్నాడు. ప్రభుత్వం ద్వారా వచ్చిన మూడు చక్రాల బండి తరచూ రిపేరుకు రావడం, ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేక పోవడంతో గణేశ్ ఇబ్బంది పడ్డాడు. విడిభాగాలు కాలిపోవడంతో బండిని మూలన పడేశాడు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మరొకరు సాయం చేసే వారు. కొన్నిసార్లు ఎవరూ సాయం రాకపోవడంతో గణేశ్ ఆలోచన మూడు చక్రాల బండిపై పడింది. దీంతో ఒక సైకిల్ కొని దానికి బ్యాటరీ, మోటర్ బిగించాడు. కొన్ని విడిభాగాలను ఆన్లైన్లో, మరికొన్నింటిని ముస్తాబాద్లో కొనుగోలు చేశాడు. వాటిని సైకిల్కు బిగించి బ్యాటరీతో సులభంగా నడిచేలా ప్రయోగం చేశాడు. అది విజయవంతం కావడంతో ఆ బ్యాటరీ సైకిల్పై తిరుగుతూ తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు గణేశ్.– అవదూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్ (చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..) -
స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..
స్వేచ్ఛా జీవితం అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం మాత్రమే కాదు తమ అభిరుచులను కూడా నైపుణ్యంగా మలుచుకునే స్వేచ్ఛను కలిగి ఉండటం అంటోంది నేటి యువత. తమ భావి జీవన నిర్మాణాన్ని బాధ్యతగా మలుచుకోవడమూ దేశభక్తే అని చెబుతోంది. వివిధ రంగాలలో రాణిస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు. ముంబైలో ఉంటూ నటిగా, మోడల్గా నిరూపించుకుంటోంది దియా సీతేపల్లి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ, జెండర్ ఈక్వాలిటీకి కృషి చేస్తోంది ఢిల్లీ శ్రీరామ్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న శ్రీహిత. ‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన కాకినాడ శ్రీదేవి సైకాలజీ చేస్తానంటోంది. డిగ్రీ చేస్తూ నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంటున్న హరిణి, క్యారమ్స్లో ఇంటర్నేషనల్ ప్లేయర్గా రాణించి, యూకే యూనివర్శిటీ నుంచి మాస్టర్స్లో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న హుస్నా సమీర.. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతటి కష్టమైనా...జూనియర్ ఇంటర్ టైమ్లోనే మోడలింగ్ ఫ్రీలాన్స్ చేశాను. ఏజెన్సీతో కలిసి పనిచేశాను. హైదరాబాద్లోని లేడీస్ బ్రాండ్స్కి మోడలింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద బాగా ఇష్టం. లాక్డౌన్ టైమ్లో ‘ప్రేమకథ’ సినిమా చేశా. తమిళ సినిమాకు వర్క్ చేశాను. ముంబైలో ఉంటూ మోడలింగ్గా నా కెరియర్ను కొనసాగిస్తున్నాను. ఆడిషన్స్ చేస్తుంటాను. నా ఇష్టాన్ని అమ్మనాన్నలు కాదనలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముంబై వంటి మహానగరంలో మనవాళ్లు ఎలా నిలదొక్కుకుంటారు, అమ్మాయిలు కదా... లాంటి అనుమానాలేవీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కటే. మన వర్క్ని ఎంత బెస్ట్గా ఇవ్వగలుగుతున్నాం అనే దానిపైన దృష్టి ఉండాలి. సక్సెస్ కోసం ఎంతటి కష్టమైనా ఎదుర్కోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. – దియా సీతేపల్లి, నటి, మోడల్అభిరుచులకు మద్దతుక్యారమ్స్లో అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడి వరల్డ్ రికార్డ్ సాధించాను. యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కాలీగ్రఫీ, మ్యాథమేటిక్స్లో అవార్డులు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. వ్యాపారవేత్తగా రాణించాలని, క్యారమ్స్లోనూ మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తున్నాను. నా ఇష్టాలకు, అభిరుచులకు అమ్మనాన్నలు చాలా సపోర్ట్ నిచ్చారు. చిన్నప్పటి నుంచి ఇలా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి వారిచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. – హుస్నా సమీరజెండర్ ఈక్వాలిటీకి కృషినేను టెన్త్ క్లాస్లోనే శాస్త్రీయ నృత్యంలో సర్టిఫికెట్స్ తీసుకున్నాను. కూచిపూడి నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తుంటాను. ఫుట్బాల్ ప్లేయర్ని. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. మ్యాథ్స్, సైన్స్ వైపు కాకుండా పొలిటికల్ సైన్స్ వైపు వచ్చాను. యూపీఎస్సీలో ర్యాంకు సాధించాలనేది నా లక్ష్యం. ఢిల్లీ శ్రీరామ్ కాలే జ్ ఫర్ ఉమెన్లో బీఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చేస్తున్నాను. కాలేజీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఎడిటోరియల్ టీమ్కు సబ్ హెడ్గా ఉంటూనే, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లో జెండర్ ఈక్వాలిటీ కోసం కృషి చేస్తున్నాను. ఒక లక్ష్యంతో పాటు అభిరుచికి తగిన స్కిల్ను నేర్చుకోవాలి. అంతేకాదు సమాజానికి మన వంతు భాగస్వామ్యాన్ని, సేవను అందించాలి. అందుకు మనల్ని మనం ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలి. – శ్రీహిత నీలి మల్టిపుల్ స్కిల్స్ మస్ట్స్కూల్ టైమ్లోనే హిందీ పండిట్ కోర్సు చేశాను. సంగీతం అంటే ఇష్టం ఉండటంతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ, సంగీత విశారద డిగ్రీ కోర్సు పూర్తిచేశాను. వాలీబాల్ స్టేట్లెవల్ కాంపిటీషన్లో పాల్గొన్నాను. ఈమధ్య బీటెక్ అవుతూనే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. కర్ణాటక సంగీతంలో కచేరీలు ఇస్తుంటాను. మలేషియాలో తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో అక్కడ కచేరీలో పాల్గొన్నాను. మ్యూజిక్ క్లాసులు కూడా తీసుకుంటాను. జాబ్ చేస్తూనే సింగర్గానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పడు యోగాలో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేస్తున్నాను. సాంకేతికపరంగా ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక చదువు మాత్రమే ఉంటే సరిపోదు. ఇలా విభిన్న రంగాలలో నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల మనల్ని మనం మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచులను కూడా స్కిల్స్గా డెవలప్ చేసుకుంటే మన వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. లైఫ్ అంతా ఉపయుక్తంగా మార్చుకుంటూ వెళితే చాలా హ్యాపీగా ఉంటాం. – హరిణి ఆనంద్ చెరుకూరిసైకాలజీ స్టార్‘కోర్టు’ సినిమా నటిగా నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ చేస్తున్నాను. జూనియర్ ఇంటర్ పూర్తయ్యింది. సైకాలజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. జెన్ జి తరం చాలా ఆందోళన, డిప్రెషన్తో లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని గందరగోళంలో ఉంటున్నారు. అందుకే, సైకాలజీ చేసి, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్సను అందించాలనుకుంటున్నాను. డ్యాన్స్, కుకింగ్ నా ఫేవరేట్స్. యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్నా ఇలా సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. రీల్స్ చేయడం ద్వారా పేరొచ్చింది. మూవీలో అవకాశం వచ్చింది. అమ్మ ఓకే అంది. అలా జాలీగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మంచి నటిగా పేరు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటాను. – కాకినాడ శ్రీదేవి, నటి (చదవండి: -
స్వాతంత్య్రదినోత్సవ థీమ్...! ఒక్కొక్కరు ఒక్కొలా దేశభక్తి..
థీమ్ అనేది అలంకార్రప్రాయం కాదు. మన భవిష్యత్ లక్ష్యాల గురించి బలంగా చెప్పే... సంక్షిప్త సందేశం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ, కొత్త శక్తులతో ముందడుగు వేసినప్పుడే కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఈ భావాన్ని ప్రతిబింబించేలా ‘నయా భారత్’ అని ఈ స్వాతంత్య్ర దినోత్సవం థీమ్ను నిర్ణయించారు.డాలీగారి దేశభక్తి‘దేశభక్తి మీకేనా? నాకు కూడా ఉంది’ అని చెప్పకనే చెప్పింది డాలీ. పెయింటర్ డాగ్గా పాపులర్ అయిన డాలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా త్రివర్ణ పతాకం పెయింట్ వేసి ‘ఆహా’ అనిపించేలా చేసింది డాలీ. ‘శునక రాజమా... నీ దేశభక్తికి జోహార్లు’ అంటున్నారు నెటిజనులు.ఈ అమెరికన్ మన జాతీయగీతం అద్భుతంగా ఆలపిస్తాడు!పదిహేడు సంవత్సరాల అమెరికన్ గేబ్ మెరిట్ ఆలపించిన మన జాతీయగీతం ‘జన గణ మన’ సోషల్మీడియాలో వైరల్ అయింది. ‘ఓ మై గాడ్... నా హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోయింది’ అనే కాప్షన్తో ఈ వీడియోను షేర్ చేసింది దిశ అనే నెటిజన్. ‘ఎన్నో దేశాల జాతీయగీతాలు పాడినప్పటికీ గేబ్కు మన జాతీయగీతం ఆలపించడం అంటే ప్రత్యేక అభిమానం’ అని రాసింది దిశ.తండ్రి పేరు వందేమాతరం..!‘పేరులో పవర్ ఉంటుంది’ అంటారు. కొన్ని పేర్లు వింటే ‘నిజమే!’ అనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఈ కుటుంబసభ్యుల పేర్లలో దేశభక్తి ధ్వనిస్తుంది. తండ్రి పేరు వందేమాతరం ప్రహ్లాద్ నాయక్, కుమారుడి పేరు తిరంగా ప్రియదర్శన్, కూతురు పేరు జైహింద్ జగ్యన్సేని. ‘మతాన్ని ప్రతిఫలించే పేర్లు కాకుండా దేశభక్తిని ప్రతిఫలించే పేర్లు అంటే నాకు ఇష్టం’ అంటున్న వందేమాతరం స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. వందేమాతరం ఇంటిలోని గదులు జాతీయజెండాలోని మూడు రంగులతో అలంకరించి ఉంటాయి.అంటార్కిటికాలో వందేమాతరంఅంటార్కిటికాలోని పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆగస్ట్ పదిహేను పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయజెండా ఎగరేయడానికి సన్నద్ధం అవుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘మేము సైతం’ అంటూ జాతీయపతాకావిష్కరణకు సన్నద్ధం అవుతున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. ఉద్యోగులు మంచుపెకిలిస్తుంటే, నేపథ్యంలో ‘వందేమాతర గీతం’ వినిపిస్తుంటుంది. (చదవండి: ఒక్కొక్కరం ఒక్కో రంగు) -
వేరుశెనగల్ని ఇలా తింటే వృద్ధాప్యం దూరం..! న్యూ స్టడీ
అందరికీ అందుబాటులో ఈజీగా తినగలిగే నట్స్ ఏవంటే వేరుశెనగనే చెప్పాలి. టైం పాస్గా, స్నాక్స్గా తినే ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. తాజాగా ఆ విషయాన్ని శాస్త్రీయ పూర్వకంగా నిర్థారించారు పరిశోధకులు. అంతేగాదు అధ్యయనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..శాస్త్రవేత్తలు ఈ వేరుశెనగ గింజల వల్ల కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్లు, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, వాపుతో పోరాడటానికి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడతాయని తేలింది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శారీరకంగా చురుకుగా ఉండగలరని అంటున్నారు. అలాగే ఒమెగా-3 కొవ్వులు, ఫైటోకెమికల్స్, కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయని, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటామని చెబుతున్నారు. అలాగే దీనిలోని సెల్యులార్ వృద్ధాప్యాన్ని మందగించేలా శక్తిమంతమైన యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెబుతున్నారు. అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..అందుకోసం 59 మంది యువకులపై మూడు వేర్వేరు సముహాలుగా విభజించి అధ్యయనం చేశారు. ఆరునెలల పాటు ప్రతిరోజూ ఒక సముహానికి 25గ్రాముల వేరుశెనగ గింజలు, 32 గ్రాముల వేరుశెనగ వెన్న లేదా క్రీమ్ మరో సముహంకు ఇచ్చారు. ఆ తర్వాత వారందరిలోని టెలోమీర్ పొడవుని కొలవగా..గింజలు తిన్నవారిలో టెలోమీర్ పొడవు మెరుగ్గా ఉంది. వేరుశెనగ క్రీమ్ తీసుకున్నవారికంటే గింజల రూపంలో తిన్నవారిలోనే ఈ పొడువు కాస్త మెరుగ్గా ఉండటం విశేషం. అయితే ఆ ఇరు సముహాల్లోనూ మరీ అంతా వ్యత్యాసాలు లేవని..అయితే ఈ వేరుశెనగ తినడం వల్ల టెలోమీర్ పొడవు తరిగిపోదనే విషయం మాత్రం హైలెట్ అయ్యిందని చెబుతున్నారు. టెలోమీర్ పొడవు అంటే..టెలోమీర్ అనేది క్రోమోజోమ్ చివరన ఉన్న ఒక రక్షణ నిర్మాణం, ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఇది కుంచించుకుపోవడాన్ని పూర్తిగా ఆపలేం. కానీ అవి కుంచించుకుపోయే రేటును తగ్గించడం సాధ్యమవుతుందట. ఇది గనుక వేగంగా కుచించుకుపోతే వ్యాధి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు లెక్క అని చెబుతున్నారు. చివరగా బిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ రోజుకు 100 సప్లిమెంట్లను తీసుకుంటూ, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి ఒక్క కేలరీని లెక్కవేస్తూ దీర్ఘాయువు కోసం పాటుపడుతున్నారు. కానీ ఈ అధ్యయనం మంచి పోషకాహారాన్ని సరైన విధంగా తీసుకోవడం అనేది ప్రధానమని, దాంతో దీర్ఘాయువుని పొందడం, వృద్ధాప్యాని నెమ్మదించగలమని హైలెట్ చేసిందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! న్యూట్రిషనిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్) -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు..! కష్టసాధ్యమైన ఆ పదింటిని..
బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలంటే అంతఈజీ కాదు కూడా. కానీ పోషకాహార నిపుణురాలు(Nutritionist) ఆ భారమైన అధిక బరువుని జస్ట్ నాలుగు నెలల్లో మాయం చేసింది. అంత త్వరిగతిన బరువు తగ్గడం ఎలా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుందామె. ఎంతో బాధకరమైన త్యాగాలు చేయడం వల్ల వెయిట్లాస్ జర్నీ విజయవంతమైందని అంటోంది.భారాన్ని తగ్గించుకోవాలంటే బాధను కలిగించే ఇష్టమైన వాటన్నింటిని తృణప్రాయంగా వదులుకోవాల్సిందేనని అంటోంది. మరి అవేంటో చూద్దామా..పోషకాహార నిపుణురాలు అమాకా(Amaka) బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడూ మొదట్లో చాలా ఇబ్బందిపడ్డానంటోంది. అమ్మో మన వల్ల కాదు అనిపించింది. ఎందుకంటే కచ్చితమైన మంచి ఫలితాలు త్వరితగతిన రావాలంటే కష్టసాధ్యమైన ఆ పదింటిని చాలా స్ట్రాంగ్గా వదులుకోవాలి. దాంతో తనకు నరకంలా అనిపించిందని, ఆ తర్వాత బరువు తగ్గుతున్న మార్పులను చూసినప్పుడూ విజయం సాధించానన్న ఆనందం ముందు ఇదేమంతా కష్టం కాదనిపించిందని అంటోంది అమాకా. అందువల్లే జస్ట్ నాలుగు నెల్లలో ఏకంగా 25 కిలోలు వరకు తగ్గాగలిగానని అదికూడా ఆరోగ్యకరమైన రీతీలోనే అని చెబుతోంది పోషకాహార నిపుణురాలు అమాకా. ఇంతకీ ఆమె వదులుకున్న ఆ పది ఇష్టమైనవి ఏంటో చూద్దామా..!.నో కంఫర్ట్ ఫుడ్స్: అమాకా మనకు ఎంతో ఇష్టమైన జంక్ ఫుడ్ లాంటి ఆహారాలన్నింటిని దూరం చేసుకోవడం అంత ఈజీ కాదని అంటోంది. ఎంత బలంగా జంక్కు నో చెప్పగలుగుతాం అంత తొందగా మంచి ఫలితాలు అందకోగలమని చెబుతోంది. ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్: వ్యాయామం చేయడానికి బెస్ట్ టైం ఉదయమేనని చెబుతోంది. అదీకూడా కష్టమైనదే. తెల్లవారుజామున నిద్ర ఎంత మధురంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. దాన్ని వదలించుకుని బెడ్మీద నుంచి లేగాలంటే కష్టమే అయినా బరువు కోసం త్యాగం చేయక తప్పదని అంటోంది అమాకా. అడపాదడపా ఉపవాసం:వారానికి రెండు మూడు రోజులు అడపాదడపా ఉపవాసం బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలా చేయాలంటే ఎంతో కఠినమైన నిబద్ధతోనే సాధ్యమని అంటోంది.రాత్రుళ్లు పార్టీలు, డిన్నర్లకు దూరంగా ఉండటం..ఫిజీ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అన్నింటికీ దూరంగా ఉండాలి. బయట తినాలనే కోరికను బలంగా నివారించాలి. బయట తింటే మనం అనుసరించే డైట్ ఒక్కసారిగా వృధా అయిపోతుందని హెచ్చరిస్తోంది.సమయాపాలన..టైంకి తినేలా చూసుకునేదాన్ని. మరీ ఆకలి వేసేంత వరకు వేచి ఉండకుండా కేర్ తీసుకునేదాన్ని అంటోంది. దాని వల్ల అతిగా తినేస్తామని చెబుతోంది.మానసికంగా దృఢంగా ఉండటం..బరువు తగ్గడం అనే ప్రక్రియం కష్టతరమైనది కాబట్టి మానసికంగా మనల్ని మనం బలోపేతం చేసుకునేందుకు యోగా వంటి వాటితో ప్రయత్నించాల్సిందే. మనస్సు మన అధీనంలో ఉంటేనే నచ్చినవన్నింటిని తినేయాలనే ఆలోచనను నియంత్రించగలమని చెబుతోంది.తింటున్న ఫుడ్ని ట్రాక్ చేయడం..ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నా..శరీరంలో ఎంత ేమేర ేకేలరీలు, ప్రోటీన్లు తీసుకుంటున్నాం అనే దానిపై మంచి అవగాహన ఉంటుంది. పైగా అతిగా తినడాన్ని నివారిస్తుంది.క్రమం తప్పకుండా వ్యాయామాలు..వర్షం, చలి కారణంగా వ్యాయామాలు వద్దు అనిపిస్తుంది. దాన్ని అధిగమించాలి. ఈ విషయంలో క్రమశిక్షణతో ఉంటే సత్ఫలితాలు త్వరిగతిన పొందగలం అని అమాకా చెబుతోంది.మార్పులను గమనించడం..శరీరంలో వస్తున్న మార్పులను గమనించడం. ఒక వేళ్ల అనుకున్నట్లుగా మంచి ఫలితం రాకపోతే నిరాశ పొందడం మానేసి ఇంకేలా సత్ఫలితాలు అందుకోగలం అనే దానిపై దృష్టి సారించాలి.స్ట్రాంగ్గా ఉండటం..ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడ వీక్ అవ్వకుండా బలంగా ఉండేలా సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. స్వీట్స్ తినాలనే కోరికను అదుపులో ఉంచడం, కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం తదితరాలపై దృఢంగా ఉండాలే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని అని చెబుతోంది అమాకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Independence Day: 107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్రే..) -
107 ఏళ్ల నాటి షెర్బత్ దుకాణం..నాటి సమర యోధులు నేతాజీ, సత్యజిత్రే..
చరిత్రలో దాగున్న కొన్ని ఐకానిక్ దుకాణాలు ఎన్నో విషయాలను వివరిస్తాయి. తరాలు మారుతున్న కొత్తదనంతో తన క్రేజ్ని చాటుతూ ఇప్పటకీ కొనసాగుతున్న కొన్ని ప్రసిద్ధ దుకాణాలు మను ముందు దర్శనమిస్తుంటాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దుకాణాన్ని రన్ చేసే తీరు ఉంటేనే ఏళ్ల తరబడి ఒకే వ్యాపారాన్ని చేసేలా నిలబెట్టుకోగలుగుతాం. అందుకు ఉదాహరణే ఇలాంటి ఐకానిక్ దుకాణాలు. అలాంటి ప్రసిద్ధ షాపే ఈ షెర్బత్ దుకాణం. నాటి సమరయోధులకు సమావేశ స్థలంగా, రక్షణ కవచంగా అలరారిన ఈ దుకాణంలో ఎన్నో మధురానుస్మృతులకు కేరాఫ్ అడ్రస్. మరీ ఆ ఆసక్తికర విషయాలు గురించి సవివరంగా చూద్దామా..!.షెర్బత్కి పర్యాయపదంగా నిలిచిన ఈ దుకాణం కోల్కతాలో ఉంది. దీన్ని 1918లో నిహార్ రంజన్ మంజుదర్ స్థాపించారు. స్వతంత్ర భారతదేశానికి పూర్వం నుంచే ఈ ఐకానిక్ దుకాణం ఇంది. శతాబ్దానికి పైగా కస్టమర్ల దాహార్తిని తీరుస్తూ..ఎందరో అభిమానులను సంపాదించుకుంది. సరిగ్గా 1900ల కాలం బ్రిటష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకున్న కీలక సమయం అది. ఆ సమయంలో ఈ కూడా ఈ చిన్న రెస్టారెంట్ మద్యం దుకాణానికి మించిన కస్టమర్లతో కిటకిటలాడేది. చెప్పాలంటే నాటి స్వతంత్ర సమరయోధుల నిరసనలకు, రహస్య సమావేశాలకు అడ్డగా ఉండేది. అందులోనూ ఈ రెస్టారెంట్ వ్యవస్థాపకుడు మజుందర్ బెంగాల్ అంతటా పనిచేసే విప్లవాత్మక సముహం అనుశీలన్ అను సమితి బారిసల్ శాఖలో సభ్యుడు కావడంతో సమరవీరులకు ఇది భద్రతా స్థలంగా మారింది. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారికి స్నేహహస్తాన్ని అందించి అందర్నీ ఒక్కతాటిపై నడిచేలా చేసిన గొప్ప ప్రదేశంగా కీర్తి గడించింది ఈ దుకాణం. ఇవాళ పాలరాయితో ఆధునిక హంగులతో మరింత సుందరంగా మారిన ఈ రెస్టారెంట్లో బల్లలు, బెంచీల స్థానంలో అత్యాధునిక సోఫాలు, టేబుల్స్ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఈ షెర్బత్లను దుకాణం యజమాని ఇంట్లో స్వయంగా తయారు చేసి మంచి రుచితో అందించడంతోనే ఎన్ని కొంగొత్త రెస్టారెంట్లు, షాపులు వచ్చినా.. దీని క్రేజ్ తగ్గలేదు. నాటి విప్లవకారులకు ఈ పానీయం చలదనాన్న అందించి మంచి ఆలోచనలకు పురికొల్పొన అద్భుత పానీయంగా పేరుతెచ్చుకుంది కూడా. ఇక్కడ తాజా కొబ్బరి నీరు, డాబ్ షెర్బత్, కొబ్బరిమలై వంటి రిఫ్రెషింగ్ పానీయాలకు పేరుగాంచింది. ఇక్కడ సీజన్లకు అనుగుణంగా షెర్బత్లు అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. చలికాలంలో కుంకుమపువ్వు క్రీమ్తో కూడిన కేసర్ మలై షెర్బత్ని అందిస్తుంది. ఇది స్వాతంత్ర్య సమరయోధుల తోపాటు, కాలేజ్ స్ట్రీట్ విద్యార్థులు, కవులు, కళాకారులు కలుసుకునే బ్యూటీఫుల్స్పాట్గా మారింది. ఒకప్పుడు నిరసనలు చర్చలతో వేడిక్కిపోయే ఈ దుకాణం ఇప్పుడు రాజకీయాలు, క్రికెట్, కళలకు సంబంధించిన చర్చలకు కేంద్రంగా మారింది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ.. ఈ షెర్బత్ రుచి, స్ఫూర్తిలలోనూ ఎట్టి మార్పు లేకపోవడమే విశేషం. ముఖ్యంగా నేతాజీబోస్, సౌరవ్ గంగూలీ, సత్యజిత్రే వంటి సమరయోధులు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడే తమ చర్చలు, సమావేశాలు జరుపుకునేవారని స్థానికులు చెబుతున్నారు.(చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!) -
శ్రావణం స్పెషల్ ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్
హైదరాబాద్ నగరంలోని వీ హబ్ వేదికగా నిర్వహించిన వినూత్న కార్యక్రమం ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంప్రదాయం, సృజనాత్మకత, మహిళా వ్యవస్థాపకత– ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వీ హబ్ ఆధ్వర్యంలో శ్రావణం స్పెషల్గా ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ను నిర్వహించింది. మహిళా వ్యవస్థాపకులకు విలువైన అమ్మకాల అవకాశాలు, ప్రత్యక్ష మార్కెట్ లింకేజీలను అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులకు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి దాదాపు 30 మంది మహిళా వ్యవస్థాపకులు, స్థానిక చేతివృత్తుల వారు ఒకచోట చేరి వారి కళాత్మక, సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా అద్భుతమైన చేనేత, హస్తకళలు, పండుగ దుస్తులు, నగలు, ప్రామాణికమైన తెలంగాణ ఆహారాలు, స్నాక్స్–స్వీట్లు, గృహాలంకరణ వస్తువులను ఇక్కడ ఉంచారు. వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది మహిళల సంస్థ, మహిళా శక్తి. ఈ సంస్కృతి సమాజ స్ఫూర్తికి ఒక వేడుక అని తెలిపారు. ప్రతి మహిళా వ్యవస్థాపకురాలు తన నేపథ్యం లేదా స్థానంతో సంబంధం లేకుండా ఈ కమర్షియల్ మార్కెట్లకు ప్రాప్యత పొందేలా చూసుకోవడమే తమ లక్ష్యమన్నారు. (చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!) -
జిమ్ ఎంపికలో బీకేర్ఫుల్..!
జీవితం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.. వ్యాయామం అంటే సరైన జిమ్ను ఎంచుకోవాలి. లేదంటే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. జీవితమే కోల్పోవాల్సి రావొచ్చు.. సిటీ యూత్లో పెరుగుతున్న ఫిట్నెస్ క్రేజ్ను వాడుకుని లాభార్జనే ధ్యేయంగా ఎటువంటి అవగాహన లేకుండా జిమ్లు నెలకొల్పుతున్న వారూ ఉన్నారు.. సో బీకేర్ ఫుల్.. జిమ్ ఎంపికలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు.. వ్యాయామాలు చేయడానికి ఎంచుకునే జిమ్ వీలైనంత వరకూ ఇంటికి దగ్గరగానే ఉండాలి. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా, రెగ్యులారిటీ అలవాటై డుమ్మాలు కొట్టే అవకాశం తగ్గుతుంది. నగరంలో ఇపుడు వీధికో జిమ్ ఉంది. ఏరియాకో ఫిట్నెస్ సెంటర్ ఉంది. అయితే అన్నీ మన అవసరాలను తీర్చేవి కాకపోవచ్చు. కొన్నింటిలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే జిమ్ని ఎంచుకునేటప్పుడు కొన్ని సందేహాలను తప్పనిసరిగా నివృత్తి చేసుకోవాలి. సదరు జిమ్/ఫిట్నెస్ సెంటర్ గత చరిత్ర ఏమిటి? అక్కడ మెంబర్లుగా ఉన్న ఇతరుల అభిప్రాయాలూ సేకరించాలి. అంతేకాకుండా వర్కవుట్స్ చేసే ప్రాంగణం సరిపడా విస్తీర్ణంలో ఉందా? లేదా? ఏసీ జిమ్ అయితే లోపలి గాలి బయటకు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా? వంటివి సరిచూసుకోవాలి.శిక్షణ అందించే కోచ్లకు సరైన సర్టిఫైడ్ అర్హతలు ఉన్నాయో లేదో వాకబు చేయాలి. పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే విడిగా మాట్లాడుకోవాలని పలు జిమ్స్ సూచిస్తుంటాయి. సదరు జిమ్లో మెంబర్ల సంఖ్య ఎంత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే సామర్థ్యానికి మించి మెంబర్లను చేర్చుకుంటే అక్కడి ఎక్విప్మెంట్ను ఉపయోగించుకోవడానికి మనం క్యూలో నిలుచునే దుస్థితి కూడా తలెత్తవచ్చు.కొన్ని జిమ్లు చూడటానికి ఆర్భాటంగా ఉండి, శిక్షణ పరంగా అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. కొన్ని చూసేందుకు సాధారణంగా ఉన్నా.. మంచి ట్రాక్ రికార్డు ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ లుక్కు.. పడిపోవద్దు. జిమ్లో సభ్యత్వం తీసుకునేటప్పుడు నిర్వాహకుల తీయటి పలుకుల మాయలో పడిపోవద్దు. వీలున్నంత వరకూ లైఫ్ మెంబర్షిప్ల జోలికి పోవద్దు. ఏడాది లోపున మాత్రమే పరిమితం కావాలి. అప్పుడే మధ్యలో మీకేమైనా అసౌకర్యం కలిగినా, జిమ్ నచ్చకపోయినా మారేందుకు ఇబ్బంది ఉండదు.జిమ్లో దుస్తులు మార్చుకునేందుకు, మన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకునేందుకు సరైన వసతులు ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలి.చాలా వరకూ జిమ్లలో యువతీ యువకులకు ప్రత్యేక సమయాలు ఉంటాయి. ఇది గమనించి అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి.ఒకసారి వర్కవుట్ టైమ్ ఎంచుకున్న తర్వాత అది వెంట వెంటనే మార్చుకోవడానికి జిమ్లో నిబంధనల ప్రకారం వీలుండకపోవచ్చు. కాబట్టి, రోజూ ఎక్సర్సైజ్లు చేసేందుకు అనువైన సమయాన్ని ఒకటికి రెండుసార్లు ముందుగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎంసీహెచ్ గ్రౌండ్స్లో అధికారికంగా నిర్వహిస్తున్న వ్యాయామ కేంద్రాలలో సాధారణ స్థాయిలోనే నెలవారీ రుసుము వసూలు చేస్తున్నారు. తక్కువ్చ ఫీజు చెల్లించగలిగిన వారికి ఇవి నప్పుతాయి.స్టార్ హోటల్స్, క్లబ్స్, రిసార్ట్స్.. అన్నీ జిమ్లను నిర్వహిస్తున్నాయి. రూమ్స్లో బస చేసిన అతిథులతో పాటు కేవలం జిమ్ మాత్రమే ఉపయోగించుకునే నగరవాసులకూ తమ సేవలను ఇవి అందిస్తున్నాయి. కొన్ని బ్రాండెడ్ జిమ్స్ ప్రొటీన్ షేక్ల విక్రయంతో మొదలుపెట్టి సభ్యులకు రకరకాల ఆకర్షణలు చూపిస్తూ డబ్బులు గుంజాలని చూస్తుంటాయి. అలాంటివి ఎంచుకునేటప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. స్వల్పకాలిక ఫలితాల మీద ఆశతో స్టెరాయిడ్స్ జోలికి మాత్రం అస్సలు పోవద్దు. కొన్ని జిమ్లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్లు ఇంటర్నేషనల్ మెంబర్షిప్లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని జిమ్లలో మనకు కేటాయించిన సమయంలో అదనపు రుసుము చెల్లించగలిగితే.. మనకు మాత్రమే పరిమితమై వ్యక్తిగత సేవలు అందించే కోచ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలి దశలోనే పర్సనల్ ట్రైనింగ్ కోసం డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం చేశాక.. మన వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని జిమ్లు అందిస్తున్న ప్రత్యేక సభ్యత్వం తీసుకుంటే సదరు జిమ్కు నగరంలో అన్ని ప్రాంతాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంస్థలలో కూడా దానిని ఉపయోగించుకునే వీలుంటుంది. తరచూ ఇళ్లు మారేవారికి, ఇతర ఊర్లకు, వేరే ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారికి ఈ తరహా సభ్యత్వం బాగా ప్రయోజనకరం. ఒకటీ అరా జిమ్లు ఇంటర్నేషనల్ మెంబర్షిప్లను కూడా అందిస్తున్నాయి. ఈ జిమ్స్లో మెంబర్షిప్ తీసుకుంటే విదేశాల్లో కూడా ఆ సభ్యత్వాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నగరంలోని జిమ్ల మెంబర్షిప్ వివరాలు.. టాప్క్లాస్ కేటగిరిలోకి వచ్చే ‘స్పా’లలో ఎక్సర్సైజ్లు చేసే అవకాశంతో పాటు మసాజ్, స్టీమ్బాత్, సోనాథెరపీ, పార్లర్.. వంటి అదనపు సౌకర్యాలూ ఉంటాయి. ఇంటి తరహాలో కొన్ని గంటల పాటు ఇక్కడ గడిపేందుకు వీలుంది. సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.25వేలు.మూడో కేటగిరీలోకి వచ్చే జిమ్స్లో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. జిమ్ మొత్తానికి ఒకరిద్దరు మించి ట్రయినర్లు ఉండరు. వీటికి రుసుము ఏడాదికి రూ.8వేలు ఆపైన. ఆ తర్వాత కేటగిరిలోకి వచ్చే ఫిట్నెస్ సెంటర్లలో అత్యాధునిక జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే స్టీమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, ప్రత్యేకంగా ఫిట్నెస్ డ్యాన్స్ ఫ్లోర్స్.. వగైరా వసతులుంటాయి. వీటి సభ్యత్వ రుసుము ఏడాదికి రూ.15వేలు ఆపైన. (చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నా ఐనా..! స్టేజ్ 4 కేన్సర్ బాధితురాలి అవేదన..!) -
ఆరోగ్యకరమైన ఆహారం అనారోగ్యాన్ని ఆపలేదు..!
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం కదా మనకేంటి అనుకుంటాం. ఇద సహజం. కానీ ఆ ఆలోచనే ముమ్మాటికి తప్పట. ఆరోగ్యకరమైన ఆహారంతోనే బాగుంటాం అనుకోవడం అనేది అవాస్తవమట. దాంతో బాడీకి కావల్సిన శారీరక శ్రమ తప్పనిసరి అట. పాపం ఇలాంటి అపోహతోనే చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకోని బాధపడుతోంది ఓ కేన్సర్ బాధితురాలు. తనలాంటి తప్పిదాలు చేయొద్దంటూ బాడీ చెప్పే సంకేతాలను వినండి..అద చెబుతున్నట్లుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను షేర్చేసుకుంటూ ఆరోగ్య స్పృహను కలిగిస్తోందామె. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే అనుసరిస్తున్నాం కదా అనారోగ్యం దరిచేరదు అనుకుంటే పొరబడినట్టేనని అంటోంది 29 ఏళ్ల మోనిక చౌదరి. తాను పోషకవంతమైన ఆహారాన్ని తీసుకునేదాన్ని తను మంచి ఆహారపు అలవాట్లనే అనుసరించానని అయినప్పటికీ స్టేజ్ 4 కేన్సర్తో పోరాడుతున్నని వాపోయింది. అందుకు కారణాలేంటో కూడా ఆమె వివరించింది. ఒత్తిడి ఆరోగ్యాన్ని ఎలా చిత్తు చేసిందంటే..తాను మంచి ఫుడ్నే తీసుకునేదాన్ని అని అంటోంది. వేయించిన పదార్థాలు, జంక్ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. అయితే వృత్తిరీత్యా ఎక్కువగంటలు స్క్రీన్ సమయం, పనిభారం తనకు తెలియకుడానే ఒత్తిడిని పెంచేసి శారీరకంగా ప్రభావితం చేశాయంటోంది. ఇంతకుముందు సాయంత్రాలు చేసే జాగింగ్ వంటి దినచర్యలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చెప్పాలంటే పెద్దగా కదలికలు లేదు, శారీరక శ్రమ అనే దినచర్య పూర్తిగా లేకుండాపోయింది. అక్కడికి తన బాడీ సంకేతాలు ఇస్తునే ఉందని, కానీ తాను మాత్రం ఇది పని ఒత్తిడి వల్లే అనుకుంటూ లైట్ తీసుకుందట. సాధ్యమైనంత తొందరలో ఇదివరకటి జీవనశైలిని అనుసరించి వ్యాయామాలు చేద్దా అనుకుంటూనే ఉండేదాన్ని తప్ప..ఎప్పుడూ ఆచరణలోకి తీసుకురాలేకపోయానని వాపోయింది. అలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చానని చెప్పుకొచ్చారామె. ఫలితంగా అలిసిపోవడం, అసౌకర్యంగా ఉండటం వంటి కొద్దిపాటి సంకేతాలు వస్తూనే ఉన్నా..ఆ..! అదంతా పని ఒత్తిడి, నిద్రలేక వచ్చేవే కామన్ అనుకుని పెద్దగా సీరియస్గా తీసుకోలేదని చెబుతోంది మోనిక. అప్పుడే ఒకరోజు ఉన్నటుండి స్ప్రుహ తప్పి పడిపోవడం..ఇక అలా బెడ్కే పరిమితమయ్యేలా స్టేజ్ 4 కొలొరెక్టల్ కేన్సర్ నిర్థారణ అయ్యిందని తెలిపింది. ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కంపించిపోతున్నట్లుగా.. చెప్పలేని ఏదో బాధ గుండెల్లోంచి పొంగుకొచ్చిందంటూ కన్నీటి పర్యంతమైంది. శారీరక వ్యాయమాల పట్ల చూపిన నిర్లక్ష్యం, అశ్రద్ధ ఫలితానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నానని నెమ్మది నెమ్మదిగా అర్థమవ్వడం ప్రారంభమైందంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. కష్టపడటంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనూ రాజీకి తావిస్తే..నిర్థాక్షిణ్యంగా అనారోగ్యం కోరల్లో చిక్కుకుపోతామని హెచ్చరిస్తోంది మోనికా. సాధ్యమైనంతవరకు మన బాడీ సంకేతాలతో కోరే శ్రద్ధపై ఫోకస్ పెట్టి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నింట్లకంటే విలువైనది, వెల కట్టలేని సంపద ఆరోగ్యమేనని, అదే మహాభాగ్యం అని అంటోంది కేన్సర్ బాధితురాలు మోనిక. View this post on Instagram A post shared by CancerToCourage (@cancertocourage) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
డీఆర్టీలో వేలానికి వచ్చిన ఇల్లు కొనచ్చా?
ఇటీవలే ఒక జాతీయ బ్యాంకు వారు జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఇల్లు వేలంపాట ద్వారా అమ్మకానికి పెడుతున్నట్లు చూశాను. అందులో ఏవేవో కేసు నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్లి చూడగా మాకు బాగా నచ్చింది. ఆ ఇంటి పూర్వ యజమాని లోను కట్టలేకపోవటం వలన బ్యాంకు వారు డీఆర్టీలో కేసు వేయడం ద్వారా ఇల్లు వేలానికి వచ్చిందని తెలిసింది. ఇలాంటి ఇంటిని వేలంపాటలో కొంటే ఏమైనా సమస్యలు వస్తాయా? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? – కిషోర్ కుమార్, వరంగల్ మీరు చూసిన ప్రకటన డీఆర్.టీ (డెట్ రికవరీ ట్రిబ్యునల్) కేసుకు సంబంధించి అయి ఉండవచ్చు. ఎవరైనా ఇంటి లోను/ఆస్తిపై లోను తీసుకొని తిరిగి కట్టలేని పక్షంలో దశలవారీగా బ్యాంకు వారు తగిన నోటీసులు జారీ చేసి, అప్పటికి కూడా బకాయిలు చెల్లించకపోతే ఆస్తి/ఇంటి పొజిషన్ తీసుకోవడానికి చర్యలు చేపడతారు. అక్కడ చట్టం ప్రకారం పొజిషన్ తీసుకోవడానికి సైతం బ్యాంకు వారికి ఎటువంటి కోర్టు ఆర్డర్ అవసరం లేదు. పొజిషన్ పొందిన బ్యాంకు వారు వేలంపాట వరకు వస్తే, అలాంటి ఆస్తిని/ఇంటిని వేలంపాటలో పాల్గొని, కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను, కోర్టు ఉత్తర్వులను, బ్యాంకు వారి పొజిషన్ విధానం మొదలైన వాటిని క్షుణ్ణంగా చూసుకొని కొనుక్కున్నవారికి సాధారణంగా ఎటువంటి ఆటంకాలు రాకపోవచ్చు. వేలంపాట సమయంలోనే మీరు బ్యాంకు సూచించినంత (సుమారు 25%) డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. మిగతా డబ్బులు చెల్లించడానికి మీకు గరిష్టంగా మూడు నెలల సమయం వరకు ఇవ్వవచ్చు. అయితే ఇలాంటి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన కొన్ని అంశాలు...1) ఇంకా ఏమైనా కోర్టు కేసులు – ముఖ్యంగా డీ.ఆర్.టీ. లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా 2) బ్యాంకు వారికి పూర్తి పొజిషన్ ఉందా లేక సింబాలిక్ పొజిషన్ ఉందా 3) కొనుగోలు దారునికి పొజిషన్ ఎన్నాళ్ళకు ఇవ్వవచ్చు?4) ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా సదరు ఆస్తిపై ఇంకెవరికైనా హక్కులు ఉన్నాయా లేదా 5) ఏదైనా సంస్థకు ఆస్తి పన్ను, బిల్లులు వంటివి ఏమైనా బకాయిలు ఉన్నాయా 6) ఆస్తి/ఇంటి పై అనుమతులు లేని కట్టడాలు / మార్పులు ఏమైనా చేశారా? (చేస్తే బ్యాంకు వారి తగిన మార్పులు, సవరణలు చేసి ఇవ్వాలి) పైన సూచించిన అంశాలు మాత్రమే కాకుండా ఇంటి పత్రాలను, కోర్టుపత్రాలను, బ్యాంకు లావాదేవీ పత్రాలను, పత్రికా ప్రకటనలను కూడా మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన ఒక లాయర్ గారి దగ్గరికి తీసుకువెళ్లి అభిప్రాయం తీసుకుంటే మంచిది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకు వారిని అదనపు పత్రాలు ఇవ్వవలసిందిగా కోరవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాద మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMýSకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఎవరీ'లేడీ టార్జాన్'? ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం..) -
అధిక బరువని పొరపడి వర్కౌట్లతో కుస్తీ..కానీ చివరకు..
సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం. ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి . అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్(Jameka Mauldin) అనే సింగిల్ మదర్ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు. చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు. సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకునేది. దాంతోపాటు ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్లు, ఖరీదైన జిమ్లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది కూడా. తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.(చదవండి: చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!) -
చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!
ఏఐ కారణంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఉండవు అంటూ సర్వత్రా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఎంతటి ఏఐ సాంకేతికత అయినా..మానవుని శక్తిమంతమైన పని ముందు అల్పమైనవిగానే మిగిలిపోతున్నాయి. ఏ సాంకేతికతైన కొంత వరకు మానవులు అవసరాన్ని తగ్గిస్తుందేమో గానీ పూర్తిస్థాయిలోమాత్రం కానే కాదు అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ఇక్కడొక వ్యక్తి చాట్జీపీటీని నమ్మి చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్జీపీటీ సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తూచాతప్పకుండా పాటించి ఆస్పత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన వ్యక్తి ఎలాంటి మానసిక, అనారోగ్య చరిత్ర లేని వ్యక్తిగా గుర్తించారు వైద్యులు. అతడు కేవలం ఏఐ చాట్బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు నిర్థారించారు. ఆ చాట్జీపీటీలో టేబుల్ సాల్ట్ ప్రతికూలతలను, ఆరోగ్య ప్రభావాల గురించి కూలంకషంగా తెలుసుకుని దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్తో భర్తి చేయొచ్చని చాట్జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి ఈ సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్లాగానే ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా పారిశ్రామిక శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పవని వెల్లడించారు వైద్యులు. ఇక ఆ వ్యక్తి ఆ కారణంగానే జస్ట్ 24 గంటల్లోనే ఆస్పత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేగాదు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యక్తికి ఎలక్ట్రోలైట్లు, యాంటీసైకోటిక్స్తో చికిత్స అందిచడం, సైక్రియాట్రీక్ పర్యవేక్షణ తదితరాలతో మెరుగయ్యేలా చేశారు. దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతను కాలేజ్లో న్యూట్రిషన్ ఫుడ్పై అధ్యయనం చేస్తున్నాడని అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చాట్జీపీటీ వంటివి సమాచారం ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదని కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అది ఇచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించి కికిత్స తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇక ఔషధంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే..అధిక మోతాదులో తీసుకుంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపి..తలనొప్పి, మానసిక ఆందోళన, మత్తు వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయిచర్మంపై అలెర్జీ, వాపు వంటి సమస్యలువాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడంమూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రాణపాయం వంటివి సంభవిస్తాయి. అందువల్ల దీన్ని ఉప్పుగా వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధంగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.(చదవండి: హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..! ఎందుకంటే..) -
హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..!
గుండె పోటు (హార్ట్ అటాక్) గురించి ఆలోచన రాగానే... మనకు కనిపించే దృశ్యం... మధ్య వయస్కుడైన పురుషుడు అలా తన ఛాతి పట్టుకుని ఒరిగి΄ోతున్నట్లుగామన కళ్ల ముందుకు వస్తుంది. కానీ అసలైన చేదు నిజం ఏమిటంటే... భారతదేశంలో గుండెజబ్బులు పురుషులతోపాటు మహిళల ప్రాణాలను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే... బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ప్రెగ్నెన్సీ సంబంధిత మరణాల కంటే గుండె జబ్బులే మహిళల ప్రాణాలను ఎక్కువగా హరిస్తున్నాయి. ఇది కేవలం ప్రాణాలను తీసుకోవడానికే పరిమితం కావడం లేదు...వాళ్లల్లో వచ్చే గుండెజబ్బులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, సరిగా నిర్ధారణ చేయలేకపోవడం, తగిన చికిత్స అందించలేకపోవడానికీ దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల్లో వచ్చే గుండెజబ్బులు సాధారణం కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటున్నాయో తెలుసుకునేందుకే ఈ కథనం. భారతీయ మహిళల్లో దురదృష్టకరమైన అంశమేమిటంటే... పాశ్చాత్య మహిళలతో పోలిస్తే వీళ్లలో గుండెజబ్బులు దాదాపు పదేళ్లు ముందుగానే వస్తున్నాయి. ఇటీవల వయసు పరంగా తమ ముప్ఫైలలో, లేదా నలభైలలో ఉన్న మహిళలు గుండెపోటుతో ఆసుపత్రికి రావడం మునపటి కంటే చాలా ఎక్కువైంది. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో గుండె΄ోటుకు గురయ్యే వారిలో చాలా తక్కువ వయసున్న వాళ్లే! వీళ్లలోనూ 40 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉండేవారు 25 శాతం వరకు ఉంటారు. వీళ్లలోనూ మహిళల సంఖ్య గణనీయంగానే ఉంది. పాశ్చాత్య దేశాల్లో మెనోపాజ్ వరకు హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ రక్షణగా పనిచేస్తుంది. కానీ భారతీయ మహిళలకు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి సమస్యలు, సమాజంలోని నిర్లక్ష్యం కలగలిపి ఇది ముందే రావడానికి కారణమవుతున్నాయి. అయితే... ఇది కేవలం ఐస్బర్గ్కి తాలూకు పైకి కనిపిస్తున్న టిప్ మాత్రమే. అసలు మూలాలు ఇంతకంటే చాలా లోతుగా ఉంటాయి. పురుషుల గుండెపోటు లక్షణాలు సాధారణంగా ఛాతీలో ఎడమవైపున తీవ్రమైన నొప్పితో కుదేలై΄ోయేలా చేస్తుంది. ఆ నొప్పితో ఎడమ చేతికి పాకుతూ ఉండటం వంటివి చాలా మామూలుగా కనిపించే లక్షణమైతే మహిళల్లో మాత్రం కాస్త భిన్నంగా కనిపించవచ్చు. ఆ లక్షణాలివి... అస్థిమితంగా, ఇబ్బందిగా ఉండటం (అనీజీనెస్) ఛాతీ నొక్కుకు పోయినట్లుగా/ఛాతీలో ఇబ్బందిగా ఉండటం దవడ, భుజాలు, కొన్నిసార్లు వీపులో నొప్పి తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట ఊపిరి అందకపోవడం, ఆయాసం వికారం, వాంతులు చెమటలు పట్టడంచాలామంది మహిళలు ఈ లక్షణాలను తమ తీవ్రమైన ఒత్తిడికీ, గ్యాస్ సమస్యకూ, ఇంట్లోని పనుల ఒత్తిడికీ ముడిపెడుతుంటారు. కుటుంబ సభ్యులూ ఇదే అనుకుంటారు. చివరికి చాలామంది డాక్టర్లు కూడా ఇలాగే అపోహపడుతుండటం మామూలే. ఇవన్నీ దాటి వారు హాస్పిటల్లోకి వచ్చేనాటికి... విలువైన పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. మహిళల్లోఈ ముప్పుఎందుకంటే? ఈ విషయం తెలుసుకోవాలంటే... జీవశాస్త్రపరంగా లేదా విజ్ఞానశాస్త్రపరంగా కేవలం వాళ్ల శరీర నిర్మాణానికే పరిమితమైతే సరిపోదు. ఇంకా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. భారతీయ మహిళకు కనిపించని సవాళ్లెన్నో ఉంటాయి. ఉదహరణకు బయటకు కనిపించకుండానే వాళ్లల్లో పొట్టచుట్టు కొవ్వు పెరగడాన్ని (మరీ ముఖ్యంగా ప్రసవాల తర్వాత) అది సహజం అనుకుంటారు తప్ప పెద్దగా ఎవరూ సీరియస్గా తీసుకోరు. వాళ్లుకూడా తమ రోజువారీ పనుల్లో పడిపోవడం, ఇంటి పని, పిల్లల సంరక్షణల తర్వాతే తమ సొంత ఆరోగ్యం అంటూ తమను తాము మోసగించునే తప్పుడు అపోహల్లో ఉండిపోవడం వంటివి ఓ ఒత్తి వెలిగించిన బాంబు చివరన మహిళలు ఉండటమంతటి తీవ్రమైన ముప్పునకు గురిచేస్తున్నాయి. ఎట్టకేలకు వాళ్లు ఇలా తమ ఇంటిపనుల సంస్కృతిలో మునిగిపోయి మౌనంగా ఉండిపోతున్నారు. వీటిల్లో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, పురుషులతో పోలిస్తే... అప్పుడప్పుడైనా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలకు మహిళలు దూరంగా ఉండటం, కనీసం దగ్గర్లో ఉండే క్లినిక్కూ వెళ్లకపోవడం వంటి అంశాలు వారిని ఆరోగ్యానికి దూరం చేస్తూ, గుండెజబ్బులకు దగ్గర చేస్తున్నాయి. ఆ సూచనలు వాళ్ల గర్భధారణసమస్యలకే కాదు... గుండె తాలూకు ముప్పునకూ చిహ్నాలు... కొన్ని సూచనలను మహిళల తాలూకు జెండర్కూ, వాళ్లకు మాత్రమే సంబంధించిన గర్భధారణ వంటి అంశాల తాలూకు సమస్యలు అనుకుంటారు తప్ప అవి గుండెకూ వర్తిస్తాయని అనుకోరు. ఉదాహరణకు... గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగే రక్త΄ోటు (ప్రీ–ఎక్లాంప్సియా), గర్భిణిగా ఉన్నప్పుడు కనిపించే డయాబెటిస్ (జెస్టేషనల్ డయాబెటిస్), నెలలు నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ డెలివరీ) అనేవి గర్భవతికి వచ్చే ముప్పులుగా పరిగణిస్తారు. కానీ చాలామంది మహిళలు తమ ప్రసవం తర్వాత... అన్ని సూచనలనూ హాయిగా మరచి΄ోతారు. కానీ... నిజానికి అవి మున్ముందు రాబోయే గుండెజబ్బులకు సూచనలుగా చూడాల్సిన అంశాలు. అయితే ఇక్కడ కూడా మహిళలు తమ చేతులు కాలాకే ఆకుల కోసం చూస్తారు. అంటే నివారణకు అవకాశమున్నప్పుడే జాగ్రత్త పడకుండా దాన్ని చికిత్స వరకూ తీసుకొస్తారు. మరింత అప్రమత్తంగాఉండాలని సూచించే ఆసక్తికరమైన ప్రత్యేకాంశాలు ఏమిటంటే... తొలిసారి గుండెపోటు తర్వాత ఏడాదిలోపు చని΄ోయే కేసుల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య దాదాపు రెట్టింపు. టకోట్సుబో కార్డియోమయోపతి (దీన్నే వాడుక భాషలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్) అనేది మహిళల్లోనే ఎక్కువ. ఇది అచ్చం గుండెపోటు లక్షణాలను కనబరుస్తుంది. అయితే దీని చికిత్స మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. తప్పుడు లక్షణాలతో వ్యక్తం కావడంతో వారికి అందాల్సిన చికిత్స సరిగా అందకపోవడం. ఇక ఇటీవల కోవిడ్ (కరోనా వైరస్) దెబ్బ, లాక్డౌన్ తర్వాత మన భారతీయ మహిళల్లో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగినట్లు అధ్యయన ఫలితాల డేటా వెల్లడిస్తోంది. వాళ్లలో పెరుగుతున్న ఒత్తిడీ, బరువు పెరగడం, తరచూ చెకప్స్కు వెళ్లక΄ోవడం వంటి అంశాలు ఈ ముప్పును మరింతగా పెంచేస్తున్నాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి..? జరగాల్సిందేమిటంటే... ముందుగా మహిళల్లో అవగాహన పెరగాలి. గుండెజబ్బులూ లేదా గుండె΄ోటు అనేది కేవలం పురుషుల సమస్య మాత్రమే కాదు... అది మహిళల్లోనూ వచ్చే అవకాశం అంతే ఉందనీ, కొన్నిసార్లు వాళ్లకంటే ఎక్కువేనన్న అవగాహనను మహిళలు పెంచుకోవాలి. తమ సమస్యలైన రక్తపోటు, డయాబెటిస్, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) వంటి స్క్రీనింగ్ పరీక్షలు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఏదో మధ్యవయసుకు వచ్చాక మొదలుపెట్టడం కంటే ఈ పరీక్షలను ముందునుంచే చేయించుకుంటూ ఉండటం మేలు. గర్భధారణ, ప్రసవం సమయాల్లో కనిపించే లక్షణాలను ఆ తర్వాత విస్మరించకూడదు. మున్ముందు రాబోయే గుండె తాలూకు ముప్పులకు సూచికగా పరిగణించి, వాటి గురించి మీ డాక్టర్తో చర్చించాలి. ఈ ముప్పుల గురించి డాక్టర్లకు కూడా.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఉండే డాక్టర్లూ, గ్రామీణ ప్రాంతల్లో సేవలందించే ప్రైమరీ కేర్ డాక్టర్లకు కూడా వీటి పట్ల అవగాహన పెంచాలి. మహిళల స్వావలంబన, అవగాహన అనేది వైద్యవిజ్ఞానం, వైద్యచికిత్సల విషయంలోనూ పెరగాలి. తమకు కనిపిస్తున్న లక్షణాల గురించి, తమ ఆరోగ్య ప్రాధాన్యం గురించి వాళ్లు ఇంటిపనులను పక్కనబెట్టి నిర్మొహమాటంగా మాట్లాడుతుండాలి. నిజానికి మహిళలకు అందే చికిత్స సరైనదేనా? వాస్తవానికి కాదనే జవాబే చాలాసార్లు వస్తుందీ ప్రశ్నకు! గుండెజబ్బు ఉండి హాస్పిటల్కు వచ్చే వాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే థ్రాంబోలైసిస్కూ, యాంజియోప్లాస్టీ వంటికి చికిత్సలకూ... అంతెందుకు గుండెపోటుగా అనుమానించినప్పుడు ఇచ్చే చాలా బేసిక్ మందు ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా వాళ్లకు అందడం కష్టమే. వాళ్ల లక్షణాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. వాళ్ల ఈసీజీని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కలగలిసి వాళ్ల ముప్పు అనూహ్యంగా పెరుగుతుంది. ఈ ముప్పును మరింతగా పెంచే మరో అంశమేమిటంటే... ఇటీవల మనం వాడుతున్న మార్గదర్శకాలన్నీ పాశ్చాత్య దేశాలనుంచి తీసుకున్నవే. అవి మన దేశీయ మహిళల శరీర నిర్మాణాన్ని బట్టి పాశ్చాత్యులతో పోలిస్తే మన మహిళల్లో రక్తనాళాలు ఒకింత సన్నగా ఉండటం, ఇక్కడ డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉండటం, పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయ మహిళల దేహాల్లో కొవ్వు పేరుకుపోయే చోట్లు వేరుగా ఉండటం వంటి మన తాలూకు ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకోక΄ోవడం వంటివి మహిళల్లో గుండెజబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి. ‘ఇంటికి మూలం ఇల్లాలే’... ‘ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది’... ‘ఇల్లాల్ని చూసి ఇంటిని చూడమన్నారు... ‘ఇంటికి ఇల్లాలే గుండెకాయ’... లాంటి భావోద్వేగపరమైన సూక్తులను మనం చాలా ఎక్కువే చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా వైద్యచికిత్స విషయానికి వచ్చేప్పటికీ వాటిని తెలియకుండానే విస్మరిస్తుంటాం. మహిళకు వచ్చే గుండెజబ్బు అనేది కేవలం ఆమె ఒంటికి మాత్రమే పరిమితం కాదు.. అది సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే పురుషుల గుండెజబ్బులతో సమానంగా... మరీ చె΄్పాలంటే అంతకంటే ముఖ్యంగా పరిగణిస్తే కుటుంబ హృదయస్పందనలు సజావుగా జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి.ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: -
సామాన్యులు కారు 'యువ సైనికులు'
వీరు సామాన్యులు కారు. నెత్తురు మండే, శక్తులు నిండే యువ సైనికులు. రానీ, రానీ వస్తే రానీ కష్టాల్, నష్టాల్ అంటూ లక్ష్యం వైపు దూసుకెళ్లి విజయకేతనం ఎగరేసిన ధీర యువత.ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రంగాలలో ‘నంబర్వన్’గాఅంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు ఈ యువ మహిళలు...అందంఅందం... ‘శాంతి బనారస్’ బ్రాండ్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఖుషీ షా. బనారస్ (వారణాసి)లో పుట్టి పెరిగిన ఖుషీకి నేత ప్రపంచం గురించి తెలియని విషయం అంటూ లేదు. ‘చిన్న వయసులోనే మార్కెటింగ్ పల్స్ పట్టుకున్నాను’ అని నవ్వుతూ చెప్పే ఖుషీ న్యూయార్క్లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎఫ్ఐటీ)లో చదువుకుంది. గ్లోబల్ మార్కెట్, టెక్స్టైల్కు సంబంధించి సాంకేతిక విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ చదువు ఖుషీకి ఉపయోగపడింది. ‘శాంతి బనారస్’ కాన్సెప్టువలైజేషన్, బ్రాండ్ ఐడెంటిటీ డెవలప్మెంట్, మార్కెటింగ్లలో ఖుషీ కీలక పాత్ర పోషించింది. సంప్రదాయ బనారస్ చీరలకు భిన్నంగా తమ బ్రాండ్ను తీర్చిదిద్దింది. ‘రియల్ జరీ’ కాన్సెప్ట్తో ‘శాంతి బనారస్’ బ్రాండ్ను విజయవంతం చేసింది. చీరె కొన్నవారికి ‘అథెంటిసిటీ సర్టిఫికెట్’ ఇచ్చే విధానానికి రూపకల్పన చేసింది.ఆరోగ్యంఆరోగ్యం... మన దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రుతుస్రావ కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. పేదరికం వల్ల ఎంతోమంది రుతుక్రమ పరిశుభ్రత (మెనుస్ట్రువల్ హైజీన్)కు సంబంధించిన సౌకర్యాలకు దూరం అవుతున్నారు. సౌకర్యాల లేమీ వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సౌమ్య డబ్రీవాల్, ఆరాధన రాయ్ గుప్తా సోషల్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ ‘బాల’కు శ్రీకారం చుట్టారు. ‘బాల’ ద్వారా పేదింటి మహిళలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన మెనుస్ట్రువల్ ప్రొడక్ట్స్ను అందిస్తున్నారు. మన దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు నేపాల్, ఘనా, టాంజానియా దేశాలలో ‘బాల’ ఉత్పత్తులను అమ్ముతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్లో ఎకనామిక్స్లో డిగ్రీ చేస్తున్న రోజుల్లో సౌమ్యకు ‘బాల’ ఆలోచన వచ్చింది. తన చిన్ననాటి స్నేహితురాలు, కార్నెల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్న ఆరాధనా రాయ్ గుప్తాతో కలిసి తన ఆలోచనను పట్టాలకెక్కించి విజయం సాధించిందిసాంకేతికంసాంకేతికం... టెక్ ప్రొడక్ట్స్కు సంబంధించి డిజైనింగ్, విజువలైజేషన్లో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్న సిమౌల్ ఆల్వా ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్లాక్చైన్ టెక్నాలజీ కంపెనీ ‘రిపుల్’లో విజువల్ డిజైన్ టీమ్కు నాయకత్వం వహిస్తోంది. సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ పెరిగిన ఆల్వాకు ఊహలకు ఉండే శక్తి ఏమిటో అనుభవంలోకి వచ్చింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్’ స్టూడెంట్గా అబుదాబీలో జరిగిన ‘వరల్డ్స్కిల్స్ కాంపిటీషన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది. ΄్యాకేజింగ్ డిజైన్, ఎడిటోరియల్, విజువల్ ఐడెంటిటీకి సంబంధించి ముప్పై దేశాలకు చెందిన విద్యార్థులతో ΄ోటీపడి ఆల్వా విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని ప్రసిద్ధ క్రియేటివ్ ఏజెన్సీ ‘అండ్ వాల్ష్’లో క్రియేటివ్ డైరెక్టర్ జెసికా వాల్ష్ బృందంతో పనిచేసే అవకాశం ఆల్కాకు వచ్చింది. ‘అండ్ వాల్ష్’లో పర్యావరణహిత సంస్థ ‘గెల్టర్’కు సంబంధించిన ప్రాజెక్ట్ను లీడ్ చేసింది. ఈ ప్రాజెక్ట్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమెజాన్, యాపిల్, ఆడోబ్లాంటి దిగ్గజ సాంకేతిక సంస్థల ప్రాజెక్ట్లు చేసింది. ‘ఎలాంటి పరిమితులు లేకుండా విశాల దృష్టితో ఆలోచిస్తూ ప్రాజెక్ట్లను విజయవంతం చేస్తోంది. అంకితభావానికి సృజనాత్మకత తోడైతే వచ్చే శక్తి ఏమిటో ఆమె పని విధానంలో కనిపిస్తుంది’ అని ఆల్కాను ప్రశంసించారు ‘అండ్ వాల్ష్’ ఫౌండర్, క్రియేటివ్ డైరెక్టర్ జెస్సిక వాల్ష్.ఆత్మవిశ్వాసంఆత్మవిశ్వాసం... ఆ ΄ోటీకి ముందు ప్రీతిపాల్ మనసు కల్లోల సముద్రంలా ఉంది. భయంగా ఉంది. ఆ ఉద్రిక్త సమయంలో కోచ్ మాటలను గుర్తు తెచ్చుకుంది. ‘΄ోటీలో నువ్వు కొత్తగా ఏమీ చేయబోవడం లేదు. ట్రైనింగ్లో చేసినదాన్ని అక్కడ రిపీట్ చేస్తున్నావు. అంతే’... అప్పుడు ప్రీతికి ఎంతో ధైర్యం వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని హషిమ్పూర్కు చెందిన ప్రీతి పాల్ గత ఏడాది పారిస్లో జరిగిన పారాలింపిక్స్లో చరిత్ర సృష్టించింది. మహిళల 100, 200–మీటర్ల రేస్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది. పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్న వయసులోనే సెరిబ్రల్ పాల్సీకి గురైంది ప్రీతి. పారా అథ్లెట్ ఫాతిమా ఖూతూన్ను కలుసుకోవడంతో ప్రీతి జీవితం కొత్త మలుపు తీసుకుంది. ప్రీతి నోటి నుంచి వచ్చిన ‘రన్నింగ్ రేస్’ అనే మాట విని కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. సైన్యంలో పనిచేసే గజేంద్రసింగ్ ప్రీతికి కోచ్గా మారాడు. శిక్షణ ఇవ్వడానికి ముందు ఒక షరతు పెట్టాడు. ‘ఈ ఒక్కరోజు ట్రైనింగ్ వద్దు అని ఏ ఒక్కరోజు నీ నోటి నుంచి మాట వినబడినా ఇక ఎప్పుడూ శిక్షణ ఇవ్వను’ అయితే ప్రీతిపాల్ నోటి నుంచి ‘సాధన’ అనే మాట తప్ప ‘విశ్రాంతి’ అనే మాట ఎప్పుడూ వినిపించలేదు. అదే ఆమె విజయరహస్యం.సామాజికంసామాజికం... ‘కంటెంట్ క్రియేటర్’ అంటే కాలక్షేప కంటెంట్ క్రియేటర్లు మాత్రమే కాదని నిరూపించింది కావ్య కర్నాటక్. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్య, నీటి, పారిశుధ్య సమస్యలను వెలుగులోకి తీసుకువస్తోంది. తన యూట్యూబ్ చానల్ ‘కేకే క్రియేట్’ ద్వారా సంప్రదాయ మార్గాన్ని తోసిరాజని ‘ఇలా కూడా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు (అని నిరూపించింది కావ్య. ఎన్నో సామాజిక సమస్యలపై ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు చేసింది. ఆమె చానల్కు రెండు మిలియన్ల సబ్స్రైబర్లు ఉన్నారు. ఉత్తరాఖండ్లోని నైనితాల్కు చెందిన కావ్య కర్నాటక్ ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’లో మీడియా అండ్ కల్చర్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ముంబై ఆరే ఫారెస్ట్, ఆదివాసీ తెగలపై డాక్యుమెంటరీ తీసింది. కావ్య, ఆమె బృందం కెమెరాలతో దిల్లీలోని ఘాజీపూర్లో అతిపెద్ద చెత్తడంప్ను చిత్రీకరిస్తున్నప్పుడు వారిపై దాడి జరిగింది. ఇలాంటి దాడులు ఎన్నో జరిగినా కావ్య వెనక్కి తగ్గలేదు. అదే ఆమె బలం. (చదవండి: first space wedding: భూమ్మీద వధువు..అంతరిక్షంలో వరుడు..) -
పది కిలోలు బరువు తగ్గిన భారత్పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!
భారతదేశపు అతిపెద్ద ఏకీకృత యూపీఐ క్యూర్ కోడ్ ప్రోవైడర్ భారత్పే సహ వ్యవస్థాపకుడు, సీఈవో అష్నీర్ గ్రోవర్(Ashneer Grover) స్లిమ్గా మారిపోయారు. ఆయన సోనీ టీవి వ్యాపార రియాలటీ టెలివిజన్ సీరీస్ షార్క్ ట్యాంక్ సీజన్ 1లో న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను మోటా వాలా షార్క్గా అని పిలుస్తున్నారు. బహుశా ఆ క్రేజ్ అతడిని ఫిట్నెస్పై దృష్టిసారించేలా చేసి పదికిలోలుమేర బరువు తగ్గేందుకు దారితీసింది. ఆయన ఈ కొత్త లుక్లో యంగ్ ఆష్నీర్గా ఆకర్షణీయంగా ఉన్నారు. అందుకు రెండే రెండు ప్రిన్స్పల్స్ హెల్ప్ అయ్యాయట. మరి అవేంటో తెలుసుకుందామా..!.'క్రమశిక్షణ', 'సంకల్పం' వంటి రెండు సూత్రాలను గట్టిగా అనుసరిస్తే భారమైన బరువుని సులభంగా వదిలించుకోగలమని చెబుతున్నారు అష్నీర్. ఇవి రెండు ఎప్పుడూ వినే సాధారణ సూత్రాలే అయినా..ఎందులోనైనా పూర్తి స్థాయిలో విజయం సాధించాలంటే ఇవి అత్యంత కీలకం అనే విషయం గ్రహించాలి. ఇక అష్నీర్ బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది పోషకాహారం. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య భోజనమేనని చెబుతున్నారు. దీంతోపాటు వ్యాయమం కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యిందని చెప్పుకొచ్చారు. దీన్ని బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా పేర్కొన్నారు. కేలరీలు బర్న్ చేయడానికి, లీన్ కండరాలను నిర్మించడానికి, బొడ్డు కొవ్వుని తగ్గించుకోవడానికి, మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, స్థిరమైన ఫలితాలు ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ 43 ఏళ్ల వ్యాపారవేత్త వెయిట్ లాస్ అవ్వడంలో ఆహారం, సుదీర్ఘ నడక, అంగుళం నుంచి కిలో గ్రాముల బరువు తగ్గేందుకు దారితీస్తుందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. అంతేగాదు ఆరోగ్యకరమైన ఆహారం బరవు తగ్గడంలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటని న్యూట్రిషన్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో పేర్కొంది. ప్రోటీన్ , కార్బోహైడ్రేట్ ఆహారాలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వడమేగాక, అదుపులో ఉంచుకోగలుగుతామని పలు అధ్యయనాల్లో తేలింది. దీనికి కావల్సిందల్ల క్రమశిక్షతో కూడిన జీవనశైలి, వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లేనని ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ తన స్వీయానుభవంతో వెల్లడించారు. (చదవండి: హాలీవుడ్ మోడల్గా ఈ-రిక్షాడ్రైవర్..!) -
'వైకింగ్స్ డైట్' అంటే..! ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా రకాల డైట్లు గురించి విన్నాం. ఇదేంటి 'వైకింగ్స్ డైట్(Viking Diet)'. పేరే ఇలా ఉంది. ఇక డైట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ..!. అదేం లేదండి అసలు అలా పిలవడానికి పెద్ద కథే ఉంది. ఆలస్యం చేయకుండా అదేంటో చకచక చదివేయండి మరి..'వైకింగ్స్' అంటే ఎనిమిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు స్కాండినేవియా నుంచి వచ్చిన సముద్రయాన ప్రజల(Scandinavian people)ను వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లు దాడిదారులు లేదా సముద్రదొంగలు అని కూడా అంటారు. వలసదారులుగా ఐరోపా వచ్చి అక్కడ స్థానిక వ్యాపారాలపై దాడుల చేసి స్థిరపడ్డ ప్రజలను ఇలా వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లంతా డెన్మార్క్, నార్వే, స్వీడన్ నుంచి వలస వచ్చిన వారు. అలా వలస వచ్చేటప్పుడూ స్థానికంగా దొరికే వాటినే తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'వైకింగ్స్ డైట్'. అయితే ఇది ఆరోగ్యకరమైనది, పైగా అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతుండటం విశేషం. అలాగే ఈ డైట్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరి ఆ డైట్లో ప్రజలు ఏం తినేవారో చూద్దామా..!.'వైకింగ్స్ డైట్' అంటే?దీన్ని 'నార్డక్ డైట్' అని కూడా పిలుస్తారు. ఇది బౌగోళిక స్థానం, సామాజిక స్థితి, సీజన్ ఆధారంగా తీసుకునే ఆహారపదార్థాలను కలిగి ఉంటుంది. తీర ప్రాంతాల్లో నివశించేవారికి చేపలు ప్రదాన ఆహారం. కాబట్టి వాళ్లంతా వైకింగ్స్ కాడ్, హెర్రింగ్, ఈల్ వంటి చేపలను తింటుంటారు. వీటి తోపాటు మస్సెల్స్, ఓస్టర్స్ వంటి సముద్ర ఆహారాన్ని తీసుకునేవారు. అలాగే బెర్రీలు, ఆపిల్స్, ఫ్లమ్స్ వంటి పండ్లుఉ, కాబ్యేజీ, క్యారెట్లు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కూడా తమ డైట్లో భాగం చేసుకునేవారు. ఆవులు, మేక, గొర్రెల నుంచి పాలు, జున్ను వంటివి తీసుకునేవారు. పైగా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఉప్పు వేయడం లేదా కిణ్వన ప్రక్రియ వంటి పద్ధతులను వినియోగించేవారు. మంచిదేనా..?ఈ డైట్లో అందుబాటులో ఉన్న ఆహారానికే పరిమితం అవ్వుతూ..ఆరోగ్యకరమైన పోషక పదార్థాలనే తీసుకోవడంతో ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు, పేగు ఆరోగ్యానికి మద్దుతిస్తాయి. పైగా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్లతో సహా వివిధ జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దుష్ప్రభావాలు..అయితే ఈ డైట్లో కొన్ని పోషకపరమైన నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్తో గణనీయమైన మొత్తంలో మాంసం, జంతువుల కొవ్వు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అధిక కొవ్వు పదార్థం ఆ ప్రజలకు శీతకాలన్ని తట్టుకునేందుకు సహాయపడుతుంది గానీ ఆ సంతృప్త కొవ్వు హృదయ సంబంధ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ డైట్ని అనుసరించేవాళ్లు ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండి, అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.(చదవండి: మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్?) -
మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్' ?
ఉదయాన్నే నిద్రలేవడం, ఉత్సాహంగా రొటీన్ వర్క్లోకి దూకేయడం... ప్రతిరోజూ ఏమోగానీ, సోమవారం మాత్రం అంత వీజీ కాదు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా... సోమవారం ముంచుకొచ్చే బద్ధకం.. మండే అంటే ఒళ్లు మండేలా చేస్తోంది. ఇదే మండే బ్లూస్కి కారణమవుతోంది. ‘మండే బ్లూస్ అనే పదం సాధారణంగా సోమవారం రోజు పని లేదా చదువులను మొదలు పెట్టాల్సిన తప్పనిసరి అవసరం వల్ల కలిగే అలసట, నిరుత్సాహం వంటి భావాలకు అద్దం పడుతోంది. కొంతకాలంగా లెక్కలేనన్ని మీమ్స్, ట్వీట్లు కాఫీ మగ్ నినాదాలకు ‘మండే బ్లూస్‘అనేది ఒక పంచ్లైన్. ఆ పాపం వీకెండ్ దే... వారాంతంలో 2 రోజులపాటు సెలవులు అనే కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాపించడం ఈ మండే బ్లూస్కి ప్రధాన కారణమవుతోంది. వారంలో ఐదురోజుల పని ముగుస్తుండగానే శుక్రవారం సాయంత్రానికే వీకెండ్ ఉత్సాహం పుంజుకుంటుండగా, శనివారం, ఆదివారం సెలవులు పూర్తయ్యాక సోమవారం మళ్లీ రొటీన్ వర్క్ లేదా స్కూల్/కాలేజ్కు వెళ్లాల్సిన పరిస్థితి మండే బ్లూస్ని సృష్టిస్తోంది. సాధారణంగా సోమవారం ఆలస్యంగా లేచే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం వీకెండ్ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడమే. పని మొదలు పెట్టే రోజు కాబట్టి సోమవారం పట్ల మానసిక విరక్తి, పని పట్ల ప్రతికూల భావన ఏర్పడుతోంది. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయ్... వారంలో తొలి నిరుత్సాహకర ప్రారంభం అనేది కేవలం మన ఆలోచనలపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, అది మన శారీరక ధర్మాలను కూడా ప్రభావితం చేస్తోందని వైస్ (వీఐసీఇ) రిపోర్ట్ పేరిట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. ఒత్తిడిని అనుభవిస్తున్న వ్యక్తుల్లో కార్టిసాల్ స్థాయిలు ఇతర ఏ రోజు ఒత్తిడిని నివేదించిన వారి కంటే సోమవారాల్లో 23 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ తరణి చందోలా నేతృత్వంలో 3,500 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ‘సోమవారం వ్యక్తుల’లో గణనీయంగా పెరిగినట్టు కనిపెట్టింది. మానసికమే కాదు, అంతకు మించి... కార్టిసాల్ దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడానికి కీలకమైన బయోమార్కర్ అని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు ముప్పు లేదా ప్రమాదాన్ని గ్రహించినప్పుడు కలిగే ప్రతిస్పందన ఈ హార్మోన్. అంతేకాదు కార్టిసాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా దారితీస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సోమవారం భయం మానసిక స్థితిని దెబ్బతీయడం కంటే మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. అది వ్యక్తుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. పరిష్కారం..సైకాలజిస్ట్ల కొన్ని సూచనలు.. ప్రణాళికాబద్ధంగా పనిని విభజించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. వారాంతపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అతి మార్పు చేర్పులు చేయవద్దు. శుక్రవారం రోజే సోమవారం నాటి పనులను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం వర్క్ ప్రెషర్ను దూరం చేస్తుంది. ప్రతీ సోమవారం ఏదైనా కొత్త రకం వ్యాయామం, కొత్త రూట్లో వాకింగ్ వంటివి ప్లాన్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది. మరోవైపు.. సోమవారాల్లో గుండె సంబంధిత సంఘటనలు పెరగడాన్ని వైద్యులు చాలాకాలంగా గమనిస్తున్నారు. దీన్ని ‘‘మండే ఎఫెక్ట్’’అని పిలుస్తారు. వారంలోని మొదటి రోజున గుండెపోటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గణాంకాల పరంగా గుర్తించారు. ఈ ధోరణికి తరచూ వారాంతపు విశ్రాంతి నుంచి ఆకస్మిక పని వైపు మళ్లిన ఆలోచనలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాలను అనుసరించి ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడటం అవసరం. -
ఉత్సాహం ఉరిమేలా.. వ్యాధిని తరిమేలా..!
రయ్ రయ్ మంటూ వచ్చారు.. రన్ రన్లో ఉరికారు.. ఉత్సాహం ఉరిమేలా కదిలివచ్చారు.. వ్యాధులను తరిమికొట్టేలా.. అవగాహన కల్పించేలా.. సాగారు. ఆ ప్రాంతంలో ర్యాలీలే ర్యాలీలు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం ఉత్సాహవంతులతో సందడిగా మారింది. జన్యుపరమైన లోపాలతో వచ్చే స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ‘రన్ ఫర్ ఎస్ఎంఏ–2025’నిర్మించారు. నేషనల్ టెర్మరిక్ బోర్డు సెక్రెటరీ భవానిశ్రీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 21కే, 10కే, 5కే టైమ్డ్, 5కే నాన్టైమ్డ్ విభాగాల్లో రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, విప్రో సర్కిల్ నుంచి తిరిగి స్టేడియం వరకు రన్లు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులపట్ల ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్యూర్ ఎస్ఎంఏ సహ వ్యవస్థాపకురాలు శ్రీలక్ష్మీ నలం మాట్లాడుతూ స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ బారిన పడ్డ చిన్నారుల్లో కండర శక్తి, కదలిక సామర్థ్యం ప్రభావితం అవుతుందన్నారు. దేశంలో ఈ వ్యాధి బారినపడ్డ రోగులకు చేయూతనిచ్చేందుకు కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయం అవసరమన్నారు. కార్యక్రమంలో పీడియాట్రిస్ట్, రెయిబో చి్రల్డన్స్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ రాధా రమాదేవి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, గ్లోబల్ సీఈఓ మయూర్ పటా్నల, తెలంగాణ గ్రూపు సోషల్ ఇంపాక్ట్ డైరెక్టర్ అర్చన సురేష్, సోమిరెడ్డి సత్తి, విజయ్ వావిలాల, సత్య వేమూరి, నైపర్డీన్ డాక్టర్ శ్రీనివాస్ నండూరి, డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అందమైన ముఖాకృతికి ఈ ఫేషియల్ మేలు..!) -
ఆదర్శం అంటే...
‘‘ఇది చేయాలనుకొంటున్నాను, అది చేయాలను కొంటున్నాను.’’ అని అంటూ ఉంటారు చాలా మంది. ఒక సారి చేసిన తరవాత చేయాలి అనుకోటానికి అవకాశం కానీ, అవసరం కాని ఏముంది? జీవితంలో ఫలానాది సాధించటం నా ఆదర్శం, ఎప్పటికైనా నేను ఆ విధంగా అవాలి అనుకుంటున్నాను – ఇటువంటి మాటలు యువత నుండి తరచుగా వినపడుతూ ఉంటాయి. అంటే, ఆ విధంగా ఉండటం వారికి ఇష్టం. కాని, ఉండే ప్రయత్నం మాత్రం చేయరు. వారికి ఏదైనా కావాలి అంటే మాత్రం వెంటనే వచ్చేయాలి. దానికి శ్రమ పడేది తాము కాదు కదా! అమ్మనో, నాన్ననో సతాయించి సాధించుకుంటారు. తాము చేయవలసిన వాటిని ఆదర్శం పేరిట గోడ మీద రాస్తారు ‘‘రేపు’’ అని. ఆ రేపు ఎప్పటికీ రాదు. వెళ్ళిపోయింది నిన్న. వచ్చి మనకి అందుబాటులో ఉన్నది ఈ రోజు. ఆచరించాలి, లేదా ప్రయత్నం చేయాలి, లేదా మొదలు పెట్టాలి అంటే – ఇప్పుడే, ఈ క్షణమే సరి అయింది. పరిస్థితులు అనుకూలించినప్పుడు, నాకు వీలైనప్పుడు అనుకుంటే కుదరదు. ఎందుకంటే బద్ధకించే వారికి వాయిదా వేయటానికి ఏదో ఒక వంక దొరుకుతుంది. అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేస్తాను అని ఒడ్డున కూర్చొన్నట్టు ఉంటుంది. అంటే ఆదర్శాలు ఉండకూడదా? అనే ప్రశ్న వస్తుంది. ఉండాలి. చిన్న పిల్లవాడికి ఐఏఎస్ అవాలన్నది ఆదర్శం. ఈ క్షణాన అవలేడు కదా! దానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా శిక్షణ తీసుకోవాలి. ఇప్పటినుండి ఎందుకు? డిగ్రీ అయినాక చూద్దాం, అనుకుంటే కుదరదు కదా! ఆదర్శం వాస్తవంగా మారటానికి తగిన కృషి చేయాలి. ఉన్నతమైన ఆదర్శాలు ఉండటం మంచిదే. నిజానికి ఉండాలి కూడా. ఆదర్శాలు వల్లెవేయటానికి బాగుంటాయి కాని, అవి ఆకాశ హర్మ్యాలు కాకూడదు. తన శక్తి సామర్థ్యాలకు తగినట్టు ఉండాలి. మృత్యువును జయించటం, బొందితో స్వర్గానికి వెళ్ళటం వంటి అసాధ్యమైనవి సాధించటం నా ఆదర్శం అనటం హాస్యాస్పదం. అవి సాధించటం కుదరదు కనుక ప్రయత్నం చేయటం వృథా అని మానేయటానికి ఒక వంక చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అద్దాన్ని ఆదర్శం అంటారు. ఆదర్శాలు అద్దం లాంటివి. దానిలో ప్రతి బింబాలు మాత్రమే కనపడతాయి. బింబం కాదు. అయితే, ప్రతిబింబం బింబాన్ని సరిచేయటానికి పనికి వస్తుంది. చెదిరిన బొట్టు దిద్దుకోటానికో, చెరిగిన జుట్టుని సద్దుకోటానికో అద్దంలోని ప్రతి బింబం సహాయం చేస్తుంది. అందులో చూసి ముఖాన్ని సరి చేసుకోవచ్చు. ప్రతిబింబంలో సరి చేయటం కుదరదు. అద్దంలో ప్రతిబింబానికి బొట్టు పెడితే ముఖం మీదకి రాదు కదా! రాసి పెట్టుకున్న ఆదర్శాలు అద్దంలో ప్రతిబింబాల వంటివి. ఆచరణ ముఖం లాంటిది. అక్కడ చూస్తూ ఇక్కడ తగిన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఆదర్శాలని గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందాలి. ఆదర్శం వ్యక్తులు అయితే వారి వలె ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ స్థాయికి రావటానికి వారు ఏవిధంగా శ్రమించారో దానిని ఆదర్శంగా తీసుకోవాలి కాని, ఇప్పుడు వారు అనుభవిస్తున్న సుఖాన్ని, వైభవాన్ని కాదు. దురదృష్టవశాత్తు చాలామంది రెండవ దానినే ఆదర్శంగా తీసుకోవటం జరుగుతోంది. ఆదర్శం ఆచరణగా పరిణమించాలి. ఆదర్శాలను వాస్తవాలుగా పరిణమింప చేసుకోటానికి శక్తి మేరకు కృషి చేయాలి. ఒకవేళ అది ఫలించక పోయినా పరవాలేదు. ప్రయత్నం ప్రధానం. తన ఆదర్శాన్ని సాకారం చేయటానికి జీవిత మంతా వెచ్చించారనే ఖ్యాతి మిగులుతుంది. – డా.ఎన్. అనంతలక్ష్మి -
రక్షా బంధన్కి అసలైన అర్థం ఈ అక్కా తమ్ముళ్లు..
రక్షా బంధన్ అనగానే రకరకాల రాఖీలు అన్న లేదా తమ్ముడి చేతికి కట్టి సంబరంగా జరుపుకుంటుంటారు అక్క/చెల్లి. ఇద్దరిలో ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా తోడుంటానని, ధైర్యంగా ఉండు అని చెప్పే ఈ పండుగ రక్తసంబంధం మైత్రికి, తోబుట్టువుల గొప్పదనానికి ప్రతీక. అలాంటి ఈ సంబరానికి అర్థం పట్టే ఓ కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రక్షా బంధన్ అసలైన అర్థం ఇదే కథ అనిపించేలాంటి గాథే ఇది.గుజరాత్లోని గాంధీనగర్కి చెందిన 60 ఏళ్ల కిరణ్ భాయ్ పటేల్ రెండు కిడ్నీలుపాడైపోయాయని వైద్యులు చెప్పడంతో అతడి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. భరూచ్లోని ఓ ఎరువుల కంపెనీ పనిచేసే ఆయన దాత కోసం ఎదురుచూస్తున్నారు. అదీగాక సమస్య తీవ్రమై డయాలసిస్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది ఆయనకు. అతడి కుమారుడు, కుమార్తె, భార్య ఆయనను ఎలా రక్షించుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కుమార్దె కిడ్నీ దానం చేద్దామని ముందుకొచ్చినా..రక్తపోటు కారణంగా కిడ్నీలు దానం చేయలేదని తేల్చారు వైద్యులు. భార్య, కొడుకివి అతడికి మ్యాచ్ కాలేదు. ఇంకెలా ఆయన్ను రక్షించుకోవాలో తెలియని ఆందోళనలో సతమతమవుతుండగా ఆయన నలుగురు తోబుట్టువులు కిడ్నీలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మూడవ చెల్లికి పరీక్షల సమయంలో ఒకటే కిడ్నీ ఉందని తెలిసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరో చెల్లికి కాలులో పాక్షికంగా వైకల్యం ఉండటంతో ఆమె అనర్హురాలని చెప్పారు వైద్యులు. ఆఖరికి అక్క సుశీలాబెన్ కిడ్నీ కిరణ్ భాయ్కి మ్యాచ్ అవ్వడమేగాక ఆమె ఇచ్చేందుకు ముందుకు వచ్చారు కూడా. అందుకు ఆమె భర్త, అత్తమామలు కూడా సమ్మతించడం విశేషం. కిరణ్ బావ భూపేంద్రభాయ్ దగ్గరుండి అతడి సోదరి అని వైద్యపరీక్షలు చూసుకున్నారు. అహ్మదాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. ఆ సర్జరీ జరిగి సరిగ్గా ఇప్పటికీ ఒకటిన్నర సంత్సరాలు. ప్రస్తుతం కిరణ్ ఆరోగ్యం మెరుగవ్వడమే గాక హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు కూడా. ఈ మేరకు సుశీలాబెన్ మాట్లాడుతూ..సోదరుడు కష్టంలో ఉంటే ఏ అక్క చూస్తూ ఉండగలదు. కష్టాల్లో, కన్నీళ్లలో మేమున్నాం అంటూ అండగా ఉన్నప్పుడే కథ రక్తసంబంధానికి, తోబుట్టువుల బాంధవ్యానికి అసలైన అర్థం అంటుందామె. ఈ రక్షా బంధన్ పండుగను సంబంరంగా జరుపుకోవడమే కాదు..సంకటపరిస్థితుల్లో కూడా ఆ బంధానికి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చి బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పకనే చెబుతోంది ఈ కథ.(చదవండి: Plastic Man Of India: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే..!) -
ఈ చిరుజల్లుల్లో టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసేద్దాం ఇలా..!
మిల్క్ కేక్ బిట్స్కావలసినవి: చిక్కటి పాలు– రెండు లీటర్లు, పంచదార లేదా బెల్లం కోరు– అర కప్పు, నిమ్మరసం– ఒక టీ స్పూన్, బాదం పేస్ట్– పావు కప్పు (బాదం నానబెట్టి, తొక్క తీసి మిక్సీ పట్టుకోవాలి), దాల్చినచెక్క పొడి– కొద్దిగాతయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక పాత్రలో పాలు పోసి, చిన్న మంట మీద బాగా మరిగించి సగం అయ్యేలా చేసుకోవాలి. కాసేపటి తర్వాత నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి, మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. ఒకేసారి పోస్తే పాలు విరిగిపోతాయి అందుకే స్లోగా వెయ్యాలి. అనంతరం బాదం పేస్ట్, దాల్చిన చెక్క పొడి వేసి పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార లేదా బెల్లం కోరు కలపాలి. తర్వాత కూడా కోవాలా అయ్యే వరకు మరిగించాలి. కోవాలా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి లేదా రెండు అంగుళాలు లోతున్న బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ కోవా మిశ్రమాన్ని వేసుకుని, చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.జపనీస్ యాకిమోచికావలసినవి: బియ్యప్పిండి– ఒక కప్పు (కొత్తబియ్యం తీసుకోవాలి), పంచదార పొడి– పావు కప్పు+2 టేబుల్ స్పూన్లు, నీళ్లు– ఒక కప్పు, బటర్– ఒక టీ స్పూన్, కార్న్ పౌడర్– కొద్దిగా (నీళ్లు లేదా పాలు పోసుకుని క్రీమ్లా చేసుకోవాలి), సోయాసాస్– కొద్దిగాతయారీ: ముందుగా బియ్యం నానబెట్టి, కాసేపటికి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం, నీళ్లు పోసుకుని, దానిలో బటర్ వేసుకుని, చిన్నమంటపై ఉడికించుకోవాలి. కాస్త పలుకు ఉన్న సమయంలో తీసి మిక్సీలో వేసుకోవాలి. పావు కప్పు పంచదార పొడి, కార్న్ మిశ్రమం వేసుకుని బాగా మెత్తగా సాగేట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ ట్రేలో వేసుకుని, ఓవెన్లో ఉడికించుకుని, నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద సోయాసాస్, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, కొద్దిగా నీళ్లు వేసుకుని పాకంలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కేక్ ముక్కలకు కొద్దిగా మైదాపిండి అద్ది, గ్రిల్ లేదా ఓవెన్ మీద బేక్ చేసుకోవాలి. అనంతరం వాటిని సోయాసాస్ మిశ్రమంలో ముంచుకుని తింటే చాలా రుచిగా ఉంటాయిఆనియన్ భక్రీకావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు, పెద్ద ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి– ఒకటి (చిన్నగా తరగాలి), కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు– ఒక టీస్పూన్ (వేయించినవి), పసుపు– అర టీస్పూన్, కారం– తగినంత ఉప్పు, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, నువ్వులు, పసుపు, తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పడు దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల వరకూ ఆ ముద్దను బాగా పిసకాలి. అనంతరం 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని, నిమ్మకాయంత ఉండలు చుట్టుకుని, చపాతీలా కాకుండా, కొద్దిగా మందంగా ఉండేలా, గుండ్రంగా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసుకుని, కొద్దికొద్దిగా నూనె వేసుకుని, వాటిని దోరగా వేయించుకుంటే సరిపోతుంది. (చదవండి: బ్రహ్మజెముడు మొక్కతో ప్లాస్టిక్ తయారీ..!) -
మార్క్స్ వర్సెస్ మైండ్సెట్..! గెలిచేదెవరు..?
‘‘సర్, మా అబ్బాయికి 75 శాతం మార్కులు మాత్రమే వస్తున్నాయి. 95 శాతం వచ్చేలా మీరు ట్రైనింగ్ ఇవ్వగలరా?’’‘‘సర్, మా అమ్మాయిని బెస్ట్ కోచింగ్ సెంటర్లో చేర్పించాం. కాని, అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ లేదు. ఎలాగైనా నీట్లో సీట్ వచ్చేలా మైండ్ సెట్ మార్చగలరా?’’ ఇలా చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసి అడుగుతుంటారు. కొంతమంది సెషన్లో అడుగుతుంటారు. ‘‘మీ బిడ్డ ఎగ్జామ్లో సక్సెస్ అయితే చాలా లేక లైఫ్లో కూడా పాసవ్వాలని అనుకుంటున్నారా?’’ అని అడుగుతా. ‘‘లైఫ్లో పాసవ్వాలంటే మంచి మార్కులు రావాలి కదా సర్?’’ అని అడుగుతుంటారు అమాయకంగా. చాలామంది తల్లిదండ్రుల్లో ఇలాంటి అభిప్రాయమే ఉంది. మార్కుల విలువ... ఐఐటీ, ఎన్ఐటీ, నీట్లలో సీటు రావాలంటే మార్కులు కావాల్సిందే! కాని, ఒక బిడ్డ ప్రతిభకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. మార్కులు విద్యార్థి నేర్చుకున్న విషయాలలో రాసే సామర్థ్యం, మీ జ్ఞాపకశక్తిని కొలుస్తాయి. కాని, మీ బిడ్డలోని సృజనాత్మకత, నాయకత్వం, భావోద్వేగ ప్రజ్ఞ, నిర్ణయ సామర్థ్యం, ఇన్నోవేషన్లను కొలవలేవు. ఇప్పుడు ప్రపంచం ఈ నైపుణ్యాలనే కోరుకుంటుంది.ఐక్యూ వల్లనే సక్సెస్ రాదని హార్వర్డ్ పరిశోధన కూడా చెబుతోంది. విజయంలో తెలివితేటలు 15 శాతం పాత్ర పోషిస్తే, సోషల్ స్కిల్స్ 85 శాతం పాత్ర పోషిస్తాయని ఆ పరిశోధనలో తేలింది.సైన్స్ ఏం చెబుతోంది?స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు డాక్టర్ కరోల్ డ్వెక్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ప్రకారం రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయి. 1. ‘నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను’, ‘నాకు ఇన్నే మార్కులు వస్తాయి’ అనుకునే ఫిక్స్డ్ మైండ్ సెట్. 2. ‘ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు’, ‘తప్పుల వల్ల నష్టంలేదు, నేర్చుకోవచ్చు’ అనుకునే గ్రోత్ మైండ్ సెట్.. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని, లాంగ్ టర్మ్ సక్సెస్ సాధిస్తారు. మైండ్ సెట్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో, ఆత్మవిశ్వాసంలో 40 శాతం మెరుగుదల చూపించారు. మైండ్ సెట్తోనే అసలైన విజయంకొన్నేళ్ల కిందట ఓ విద్యార్థి కోచింగ్ కోసం వచ్చాడు. అతను ఇంటర్మీడియట్లో 60 శాతం మాత్రమే సాధించాడు. దాంతో పేరెంట్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. కాని, అతనిలో నాకు కసి, ఉత్సుకత కనిపించాయి. దాంతో అతనికి జీనియస్ మైండ్ సెట్ కోచింగ్ మొదలు పెట్టా. ఇప్పుడతను బెంగళూరులో ఒక స్టార్టప్ ఫౌండర్. ఐఐటీల్లో చదివినవాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకంటే అతనికి నేర్పించింది సిలబస్ కాదు, సెల్ఫ్–బిలీఫ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జీనియస్ మైండ్ సెట్. జీనియస్ పుడతాడనేది భ్రమ, జీనియస్ డెవలప్ అవుతాడనేది సైన్స్2030లో క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాప్ స్కిల్స్గా ఉంటాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెబుతోంది. ఉత్తమ ఉద్యోగుల్లో కమ్యూనికేషన్, కొలాబరేషన్, అడాప్టబిలిటీ ముఖ్యమైన లక్షణమని గూగుల్ చేసిన ప్రాజెక్ట్ ఆక్సిజన్ రీసెర్చ్లో కూడా వెల్లడైంది. జీనియస్ మేట్రిక్స్ కోచింగ్లో నేర్పేవి ఇవే!పేరెంట్స్ ఏం చేయాలి..ఐక్యూ కాకుండా ప్రాసెస్ను ప్రశంసించండి. ‘నువ్వు స్మార్ట్’ అని కాకుండా ‘నువ్వు కష్టపడి ప్రయత్నించిన తీరు నచ్చింది’ అని చెప్పండి. దీనివల్ల పిల్లల్లో ప్రేరణ కలుగుతుంది. మెదడులో కొత్త మార్గాలు ఏర్పడుతాయి. తప్పు చేసినప్పుడు శిక్షించకుండా ‘ఈ తప్పు నీకు ఏం నేర్పింది?’ అని అడగండి. తప్పులను నార్మలైజ్ చేయండి. ‘నేను లెక్కలు చేయలేను’ అని కాకుండా, ‘నేను ఇప్పటికీ లెక్కలు చేయలేను’ అని చెప్పండి. ఈ చిన్న పదం అద్భుతం చేస్తుంది. మీ పరాజయాలను, వాటి నుంచి ఏం నేర్చుకున్నారో, ఎలా తిరిగి నిలదొక్కుకున్నారో పిల్లలతో పంచుకోండి. మీ పిల్లలు దాన్ని పాటిస్తారు. ‘‘ఎన్ని మార్కులు వచ్చాయి?’’ అని కాకుండా, ‘‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’’, ‘‘ఈ తప్పు నీకు ఏం నేర్పించింది?’’ అని అడగండి. మార్కుల గురించి కాదు, ప్రయత్నం ఆపేయడంపై టెన్షన్ పడండి. సెల్ఫ్ బిలీఫ్ ఉన్నవాడు ఎక్కడైనా గెలుస్తారు. మార్కులు మాత్రమే ఉన్నవాడు మైండ్ సెట్ లేకపోతే ఆగిపోతారు. (చదవండి: డాల్ డామినేషన్! ఈ బొమ్మ ధర తెలిస్తే షాకవ్వుతారు) -
అందమైన ముఖాకృతికి ఈ ఫేషియల్ మేలు..!
ఆకట్టుకునే సౌందర్యానికి మృదువైన చర్మంతో పాటు ఎద ఆకృతి అవసరమే అని నమ్ముతారు చాలామంది మహిళలు. అలాంటి వారి కోసమే ఈ ‘బ్రెస్ట్ ఎన్హాన్సర్ మసాజర్ బ్రా’! పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత, వయసు పెరుగుతున్న క్రమంలో వక్షోజాల్లో వచ్చే మార్పులను సరి చేసుకోవడానికి ఈ డివైస్ సహకరిస్తుంది. ఈ మసాజర్ చార్జింగ్ బేస్, పవర్ అడాప్టర్లతో పాటుగా లభిస్తుంది. దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా మసాజ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఇది చాలా స్పీడ్ మోడ్స్తో పని చేయగలదు. దాంతో వినియోగదారులు నచ్చిన విధంగా మసాజ్ వేగాన్ని సర్దుబాటు చేసుకోగలరు. ఈ డివైస్ ముందువైపు ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి. చిత్రంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ చెస్ట్ మసాజర్– మృదువైన సిలికాన్ హెడ్స్తో చర్మానికి ఎలాంటి హాని కలిగించని విధంగా రూపొందింది. అలాగే ఇది వాటర్ప్రూఫ్ డిజైన్ కావడంతో వీటిని శుభ్రపరచుకోవడం కూడా సులభమే. దీనిలో వార్మింగ్ ఆప్షన్ కూడా ఉంది. దాంతో దీన్ని పీరియడ్స్ సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దాని వల్ల ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ డివైస్ రొమ్ము కణజాలాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో ఆ భాగం ఆరోగ్యవంతంగా మారుతుంది. అలాగే ఈ మసాజర్తో స్త్రీలు తమ ఫిట్నెస్కు తగినవిధంగా చక్కటి పరిమాణాన్ని, ఆకృతిని పొందవచ్చు. కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఈ డివైస్ ఎవరికి తగ్గట్టుగా వాళ్లు అడ్జట్స్ చేసుకునే వీలుంటుంది. అందుకు అనువైన విధంగా, బ్రా వెనుకవైపు హుక్ స్ట్రిప్ ఉంటుంది. దాంతో దీన్ని టైట్గా లేదా లూజ్గా ధరించొచ్చు. క్వాలిటీని బట్టి, మోడల్స్ని బట్టి ఈ మెషిన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.కళాకాంతులు సొంతం‘చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా కాపాడుకోవాలంటే గాల్వానిక్ క్లీన్–అప్ ఫేషియల్ చేయించుకుంటే మేలు’ అంటున్నారు చాలామంది బ్యూటీషియన్స్. ఇది ఒక అధునాతన పద్ధతి. సాధారణ ఫేషియల్స్ కంటే లోతైన శుభ్రతను, మెరుగైన పోషణను అందిస్తుంది. ఈ ప్రక్రియను కొన్నిరకాల ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ సాయంతో చేస్తారు. దీనిలో డిసిన్క్రస్టేషన్, అయోంటోఫోరెసిస్ అనే రెండు ప్రక్రియలు ఉంటాయి. మొదటి ప్రక్రియలో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి దుమ్ము, ధూళి, జిడ్డు, మృతకణాలను తొలగిస్తారు. రెండవ ప్రక్రియలో పోషకాలు సమృద్ధిగా ఉన్న సీరమ్లను చర్మానికి పట్టిస్తారు. ఇంకా ఈ ఫేషియల్తో రక్త ప్రసరణ మెరుగై, చర్మం కాంతిమంతంగా మారుతుంది. మొటిమలు, బ్లాక్హెడ్స్ తగ్గుతాయి. చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గుతాయి. నిపుణుల పర్యవేక్షణలోనే ఈ చికిత్స జరగడం సురక్షితం. గర్భవతులు, చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఫేషియల్కి దూరంగా ఉండాలి. (చదవండి: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే..!) -
‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!
‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత చాలామంది చాలారకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పలువురు మహిళలు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు, దానికి తోడు అసాధారణ రక్తస్రావంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్ల కారణంగా పలువురు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అధిక రక్తస్రావం సమస్య తలెత్తుతోందని లండన్లోని వైద్య నిపుణులు ఇటీవల గుర్తించారు. ఈ సమస్యపై వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ అధ్యయన వివరాలను ‘క్లినికల్ సైన్స్’ జర్నల్లో ప్రచురించారు. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో దాదాపు 33.8 శాతం మహిళలకు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు ఏర్పడ్డాయి. 26 శాతం మహిళల్లో అస్తవ్యస్తమైన రుతుక్రమంతో పాటు అధిక రక్తస్రావం సమస్య ఏర్పడింది. 19.7 శాతం మహిళల్లో రుతుక్రమంలో అస్తవ్యస్తతలు లేకున్నా, అధిక రక్తస్రావం సమస్య తలెత్తింది. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!) -
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ఇది ప్రమాదకరమా..
నేను రెండోసారి గర్భవతిని. ఇప్పుడు స్కాన్లో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తేలింది. ఇది ప్రమాదకరమా? ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాలా?– మధు, విశాఖపట్నంస్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక అరుదైన గర్భధారణ సమస్య. ఇది సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడుతుంది. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య. ప్రస్తుతం సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరగడం, స్కానింగ్ పరికరాల మెరుగుదల వలన స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సకాలంలో గుర్తించడం సాధ్యమవుతోంది. కానీ, ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. గర్భం పెరిగే కొద్దీ కుట్టుపై ఒత్తిడి పెరిగి అది తెరుచుకోవచ్చు. ఇది ప్రాణాపాయ పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన ప్లాసెంటా గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీనిని ప్లాసెంటా అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు. ఇది గర్భధారణ చివర్లో తీవ్రమైన రక్తస్రావానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ప్లాసెంటా మూత్రాశయానికి కూడా అతుక్కుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని పూర్తిగా తీసేయాల్సి రావచ్చు. ఇవన్నీ ముందుగా గుర్తించడం కష్టం. చాలా సందర్భాల్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రసవ సమయంలో కూడా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్రమైన రక్తస్రావం సంభవించవచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ఐసీయూలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే అత్యంత జాగ్రత్తగా, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న చోట ప్లాసెంటా అతుక్కుపోతే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి, తగిన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తారు. దీనికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి: చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేసి గర్భాన్ని తొలగించడం. ఈ సమయంలో గత కుట్టు భాగాన్ని బలపరచే చర్యలు కూడా తీసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్లీ కలుగకుండా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఉంటే, మిథోట్రెక్సేట్ అనే ఔషధాన్ని గర్భాశయంలోకి నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి, గర్భాన్ని ఆపవచ్చు. ఇది గర్భం చాలా చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. చివరిగా, డి అండ్ సి (డైలటేషన్ అండ్ క్యూరెటేజ్) అనే చిన్న శస్త్రచికిత్స ద్వారా కూడా గర్భాన్ని తొలగించవచ్చు. కాబట్టి, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రసూతి నిపుణులను కలసి, గర్భాన్ని కొనసాగించాలా లేక తొలగించాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో సురక్షితమైన గర్భధారణ కోసం ఇది చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?)∙ -
శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?
మనం చేసే అన్ని పనులకూ మెదడు, నాడీ వ్యవస్థ నుంచే ఆదేశాలు అందుతూ ఉంటాయి. అలాంటి ఆ మెదడు నుంచి జీవక్రియలకు సంబంధించిన ఆదేశాలన్నీ పలు అవయవాలకూ సక్రమంగా అందడానికి ఉపయోగపడే కీలకమైన పోషకం ‘విటమిన్–బి12’. ఇది మెదడు కార్యకలాపాలకోసం మాత్రమే కాకుండా రక్తం ఉత్పత్తికీ, కణంలో డీఎన్ఏ ఆవిర్భవించడానికి, మెటబాలిజమ్లో పాలుపంచుకునే అమైనో యాసిడ్స్ కార్యకలాపాలకూ చాలా కీలకం, ఎంతో అవసరం! శాకాహార వనరుల్లో విటమిన్ బి12 బాగా తక్కువ. వాళ్లలో ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేసుకోవడమెలాగో చూద్దాం. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కారణం... ఈ విటమిన్కు మాంసాహారం మంచి వనరు. దాంతో శాకాహార నియమాన్ని కఠినంగా పాటించేవారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటి వారు ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడమెలాగో తెలుసుకుందాం. శాకాహారుల్లో ఎందుకు తక్కువంటే... విటమిన్ బి12ను మొక్కలూ లేదా జంతువులూ ఇవేవీ సృష్టించలేవు. కేవలం కొన్ని బ్యాక్టీరియాతోపాటు ఆర్కియా అనే ఒక రకం ఏకకణ జీవులు మాత్రమే ఈ విటమిన్ను సృష్టించగలవు. ఆర్కియా ఎంత చిన్న జీవి అంటే... ఇది ఏకకణజీవికంటే కూడా చాలా చిన్నది. ఈ ఏకకణజీవికి న్యూక్లియస్ (కేంద్రకం) కూడా ఉండదు. దాంతో ఇది ఒక కణమనీ, కణంలోని భాగాలని వివిధ భాగాలంటూ చెప్పడానికి కూడా వీలు కానంత చిన్న కణమిది. అయితే... బ్యాక్టీరియా, ఆర్కియా వెలువరించే కొన్ని రకాల ఎంజైముల కలయికతో ఈ సృష్టిలో విటమిన్–బి12 నేచురల్గా తయారవుతుంది. జంతువులకు మేలు చేసే బ్యాక్టీరియా మనుగడ సాగించే చోట... అంటే... జంతువుపై ఆధారపడిన బ్యాక్టీరియాలోనూ, ఆ బ్యాక్టీరియా నుంచి వెలువడే పదార్థాల్లోనూ ఇది ఉంటుంది. అందుకో కారణం ఉంది. జీవుల్లో ఉంటూ... ఆ జీవుల నుంచి తమకు అవసరమైనవి తీసుకుంటూ... వాటికి విటమిన్ బి–12 ఇస్తూ ఉండే క్రమంలో విటమిన్ బి–12 వెలువడుతుంది. ఇలా జీవుల మాంసం, ఉత్పాదనల్లోనుంచి వెలువడుతుంది కాబట్టి శాకాహార పదార్థాల్లో ఇది తక్కువ కావడంతో శాకాహారులలో ఈ లోపం రావడానికి అవకాశాలెక్కువ.ఇంకా ఎవరెవరిలో తక్కువ...సాధారణంగా 75 ఏళ్లకు పైగా వయసు పైబడిన వారిలో పుట్టుకతో వచ్చే జబ్బు అయిన ‘పెర్నీషియస్ అనీమియా’ అనే కండిషన్ ఉన్నవారిలో. ఈ కండిషన్ ఉన్నవారిలో ఒక ప్రోటీన్ లోపం వల్ల జీర్ణమైన ఆహారం నుంచి విటమిన్ బి12 ను తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. దాంతో ఈ సమస్యతో బాధపడే కుటుంబ చరిత్ర ఉన్న వారిలో, 60 ఏళ్లు దాటిన మహిళల్లో ఇది ఎక్కువ పొట్ట లోపలిపార పలచబారిన వారిలోనూ ఇది తక్కువ ∙పొట్టలో అల్సర్స్ ఉన్నవారిలో పొట్టలోని కొంతభాగాన్ని సర్జరీ ద్వారా తొలగించిన వారిలో ∙జీర్ణవ్యవస్థ తాలూకు దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారిలో చాలాకాలంగా అజీర్తి మందులు (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ –పీపీఐ) వాడుతున్నవారిలోనూ విటమిన్ బి12 మోతాదులు తక్కువగా ఉండే అవకాశముంది. నిర్ధారణ: సాధారణ రక్తపరీక్ష ద్వారా విటమిన్ బి12 తగ్గడంతోపాటు... ఆ పరీక్షతో తెలిసే ఎర్రరక్తకణాల సైజ్ను బట్టి ఈ విటమిన్ లోపాన్ని తెలుసుకుంటారు.నివారణ .. సాధారణంగా మాంసాహారంతో పాటు గుడ్లు, సముద్రపు చేపల్లో విటమిన్ బి12 ఎక్కువ. అయితే మాంసాహారం తీసుకోని వారందరూ. ఇవి తీసుకోవచ్చు. పాలు, పాల ఉత్పాదనలు.. అందునా విటమిన్ బి12తో నింపిన (అంటే... విటమిన్ బి12 ఫోర్టిఫైడ్) బాదం సాల (ఆల్మండ్ మిల్క్)లో; విటమిన్ బి12 ఫోర్టిఫైడ్ కొబ్బరిపాలలో; విటమిన్ బి12 ఫోర్టిఫైడ్ సోయాపాలలోనూ ఇది ఎక్కువ త్వరగా పులిసిపోడానికి అవకాశమున్న పిండితో చేసిన ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తక్షణం తినగలిగే తృణధాన్యాలు (సిరేల్స్)లో ∙తక్కువ కొవ్వు కలిగిన పాలను తోడబెట్టడంతో వచ్చే పెరుగు (యోగర్ట్)లో పాలలోనూ, చీజ్లోనూ, వెనిలా ఐస్క్రీమ్లోనూ విటమిన్ బి12 ఎక్కువ. చికిత్స ఇలా... రక్తపరీక్షలో విటమిన్ బి12 మోతాదులు మరీ తక్కువగా ఉన్నాయని తేలితే... వాళ్లకు సాధారణంగా ఆరు బి12 ఇంజెక్షన్లతో ఈ లోపాన్ని భర్తీ చేస్తారు. ఇది రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున నాలుగు రోజులకు ఒకటి మోతాదులో ఈ ఇంజెక్షన్ చేస్తుంటారు. ఇలా ఇచ్చిన విటమిన్బి12 కాలేయంలో నిల్వ ఉండిపోయి దేహానికి అవసరమైన జీవక్రియలకోసం ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ పెర్నీషియస్ అనీమియా కారణంగా విటమిన్ బి12 లోపం ఉన్నవారైతే... డాక్టర్లు చెప్పిన మోతాదుల్లో జీవితకాలం పాటు విటమిన్ బి12ను తీసుకుంటూనే ఉండాలి. ఇలా విటమిన్ బి12 తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఒకవేళ ΄ోషకాహారలోపం వల్ల విటమిన్ బి12 లోపం ఏర్పడితే అప్పుడు ఇంజెక్షన్ రూపంలో కాకుండా సైనకోబాలమైన్ టాబ్లెట్ల రూపంలోనూ దీన్ని శరీరానికి అందిస్తారు. చివరగా... విటమిన్–బి12 టాబ్లెట్లను, ఇంజెక్షన్లను ఎవరికి వారుగా తీసుకుంటూ సొంతవైద్యం చేసుకోకూడదు. కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఎందుకంటే... ఈ ఇంజెక్షన్లనూ, మాత్రలనూ తీసుకునేవారు తమ ఇతరత్రా ఆరోగ్య సమస్యల కోసం వేరే మందులు వాడుతుంటే వాటి కార్యకలపాలకు ఈ విటమిన్ బి12 ఇంజెక్షన్లూ, మాత్రలూ అడ్డురాకుండా ఉండేలా డాక్టర్లు వాటి మోతాదు నిర్ణయిస్తారు. అందుకే ఈ విటమిన్ను డాక్టర్ల పర్యవేక్షణలోనే, వారు సూచిస్తేనే వాడాలి.లక్షణాలు... విటమిన్ బి12 లోపం ఉన్నవాళ్లలో నీరసం, నిస్సత్తువ, అలసట చాలా ఎక్కువ. ఒక్కోసారి ఊపిరి సరిగా అందక ఆయాసం అన్ని అవయవాలకూ ఆక్సిజన్ను తీసుకెళ్లేందుకు అవసరమైన ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కారణంగా వచ్చే రక్తహీనతను ‘విటమిన్–బి12 డెఫిషియెంట్ అనీమియా’ అంటారు. ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏర్పడే పరిస్థితిని ఎదుర్కొనేందుకు శరీరం చాలా పెద్దసైజు ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటినే మెగాలోబ్లాస్టిక్, మ్యాక్రోసైటిక్ ఆర్బీసీ ఉంటారు. ఇవి ఆక్సిజన్ మోసుకెళ్లాల్సిన పనిని సక్రమంగా చేయలేవు ∙తరచూ తలనొప్పి, చెవుల్లో హోరు వినిపించడం, ఆకలి లేపోకవడం. బీ 12 లోపంతో మరింత నిర్దిష్టంగా కనిపించే మరికొన్ని లక్షణాలు చర్మం పసుపుపచ్చరంగులోకి మారడం నాలుక పూత, నోట్లో పుండ్లు ∙చర్మం కొన్ని ప్రదేశాల్లో స్పర్శజ్ఞానం కోల్పోవడం నొప్పి ఎక్కువగా తెలియకపోవడం నడుస్తూ నడుస్తూ పడిపోవడం చూపు సరిగా లేక స్పష్టంగా కనిపించకపోవడం క్షణక్షణానికీ మూడ్స్ మారిపోవడం, డిప్రెషన్కు గురికావడం, మతిమరుపు. (చదవండి: ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?) -
ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?
ఆలనాపాలనా లేకుండా శిథిలమైన ఆ భవనం భూత్బంగ్లాను తలపించి భయపెడుతుంది. ఎవరూ పట్టించుకోని ఈ భవనం ఒకప్పుడు కష్టాల్లో ఉన్న ఎంతోమంది అమ్మాయిలను పట్టించుకుంది. ఆశ్రయమిచ్చి దారి చూపింది.మద్రాస్కు చెందిన వైద్యురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి, బ్రిటిష్ ఇండియాలో తొలి మహిళా శాసనసభ్యురాలైన డా. ముత్తులక్ష్మికి చెందిన ఆ విశాలమైన ఇల్లు ఎంతోమంది పేదింటి అమ్మాయిలకు నీడను ఇచ్చింది. ఆ ఇంట్లో ఆశ్రయం పొంది చదువుకున్న అమ్మాయిలు నర్స్లు, టీచర్లు అయ్యారు. 1942లో అడయార్ నది దగ్గర బ్రిటిష్ సైనికులు క్యాంప్ వేశారు. వారు తన ఇంట్లో ఉంటున్న అమ్మాయిలను వేధిస్తున్నారనే విషయం తెలిసి చేతిలో దుడ్డు కర్రతో పహారా కాసేది ముత్తులక్ష్మి (Muthulakshmi). అంతేకాదు స్థానిక బ్రిటిష్ కమాండెంట్ దగ్గరకు వెళ్లి... ‘మా అమ్మాయిలకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత మీదే’ అని హెచ్చరించింది.తాజా విషయానికి వస్తే....మహిళలకు డా. ముత్తులక్ష్మి చేసిన సేవలు, ఇచ్చిన స్ఫూర్తికి చిహ్నంగా ఆ ఇంటిని పునురుద్ధరించి స్మారకకేంద్రంగా మార్చనున్నారు. ఉచిత వైద్యసేవలు అందించే కేంద్రంగా, మహిళలకు వివిధ వృత్తులలో శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఈ ఇంటిని తీర్చిదిద్దనున్నారు. లైబ్రరీ (Library) ఏర్పాటు చేయనున్నారు. ‘ది రిమార్కబుల్ టేల్ ఆఫ్ డా. ముత్తులక్ష్మి’ పేరుతో ముత్తులక్ష్మి జీవితచరిత్ర రాసింది వీఆర్ దేవిక.చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన ప్యాలెస్.. మన దేశంలోనే.. -
ఉమెన్ సెక్యూరిటీ ‘క్యూఆర్ కోడ్స్’
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త విధానాన్ని అనుసరించారు మహారాష్ట్రలోని నాగ్పుర్ పోలీసులు. నగరంలో నేరాలకు ఆలవాలంగా ఉన్న 330 ప్రదేశాలను గుర్తించి క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్లు, సేఫ్టీ రిసోర్స్కు సంబంధించి త్వరగా యాక్సెస్ కావడానికి ఆపదలో ఉన్న మహిళలకు ఈ క్యూ ఆర్ కోడ్లు ఉపయోగపడతాయి. నేరాలను బట్టి మరిన్ని ప్రాంతాలకు ఈ క్యూఆర్ కోడ్లను విస్తరిస్తారు. ‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం’ అంటున్నారు సీపీ రవీందర్ సింఘాల్. మహిళల భద్రతకు సంబంధించిన ‘దామిని స్క్వాడ్స్’ కోసం అయిదు ప్రత్యేకమైన ఆల్–ఉమెన్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్లో 19 మంది మహిళా అధికారులు ఉన్నారు. ‘మా బృందాలలోని సభ్యులు ప్రతి స్కూల్కు వెళ్లి బాలికల భద్రతకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలకు వారి హక్కుల గురించి తెలియజేయడం తోపాటు అవసరమైన సమయాలలో సహాయం ఎలా తీసుకోవాలి... వంటి విషయాల గురించి వివరిస్తున్నారు’ అంటున్నారు ‘భరోసా సెల్’ హెడ్ సీమా సుర్వే. (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..) -
సంతాన నియంత్రణకు మేల్ పిల్!
పురుషులు నోటి ద్వారా తీసుకునే ఈ సంతాన నియంత్రణ మాత్రలను ప్రస్తుతం ‘వైసీటీ –529’ అని పిలుస్తున్నారు. ‘పిల్స్’ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న ఆ మాత్రల విషయమేమిటో చూద్దాం.వైసీటీ – 529 ప్రత్యేకత ఏమిటంటే... ‘యువర్ ఛాయిస్ థెరప్యూటిక్స్’ సంస్థ ఆధ్వర్యంలోకి రాబోతున్న ఈ సంతాన నియంత్రణ పిల్స్ను సంక్షిప్తంగా ‘వైసీటీ – 529’ అని పిలుస్తున్నారు. ఇదొక డైలీ పిల్. అంటే తమకు సంతానం వద్దనుకున్నంత కాలం పురుషుడు నోటి ద్వారా తీసుకోవాల్సిన మాత్ర ఇది. గతంలోనూ పురుషులకూ సంతాన నియంత్రణ మాత్రల తయారీ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే అవన్నీ పురుష హార్మోన్ అయిన ‘టెస్టోస్టెరాన్’ పై పనిచేసేలా రూపొందించడంతో చాలా ప్రతికూలతలు కనిపించాయి. దాంతో అవన్నీ విఫలమయ్యాయి. ఆ అనుభవాల దృష్ట్యా రూపొందించిన ఈ మాత్రలు టెస్టోస్టెరాన్పై పనిచేయకుండా...ఇవి తెలివిగా మరో మార్గంలో పనిచేస్తాయి. అంటే వీర్యకణాలను పుట్టించేందుకు తోడ్పడే ‘రెటినాయిడ్ యాసిడ్ రెసె΄్టార్ ఆల్ఫా’ అనే ప్రొటీన్ను మాత్రమే ఇవి అడ్డగిస్తాయి. ఫలితంగా పురుషుడి వృషణాలలో వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. దీనివల్ల ఆ మాత్ర ప్రభావం ఉన్నంతసేపు తాత్కాలికంగా వీర్యకణాలు తయారుకావు. అంతేతప్ప... ఈ పిల్ వల్ల పురుషుడిలో వాంఛలూ, కోరికలూ, సామర్థ్యాలు అన్నీ యథాతథంగా ఉంటాయి. పురుషులలో స్రవించే హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ ఉండవు.పురుషుల్లో కుటుంబ నియంత్రణ పిల్ రావడాన్ని ఎందుకు విప్లవాత్మకమైన మార్పుగా చూస్తున్నామంటే... ఇప్పటివరకూ యుటెరస్లో అమర్చే ఇంట్రా యుటిరైన్ డివైస్ (ఐయూడీ)లైనా, నోటి ద్వారా తీసుకునే పిల్స్ అయినా, హార్మోన్ ఇంజెక్షన్లయినా లేదా ఇతరత్రా ఏ మార్గాలైనా అవి మహిళల కోసమే తయారయ్యాయి / తయారవుతున్నాయి. మహిళల్లో చాలా సంక్లిష్టమైన ప్రక్రియల్లో జీవక్రియలు నిర్వహించే హార్మోన్లను ఈ కాంట్రసెప్టివ్స్ ప్రభావితం చేస్తుండటం వల్ల అవి మహిళల్లో అనేక రకాల ప్రతికూల ప్రభావాలను చూపుతుంటాయి. వాటి ప్రభావంతో కొందరు మహిళలు బరువు పెరగడం, వాళ్ల మూడ్స్ వేగంగా మారిపోతూ ఉండటం (మూడ్ స్వింగ్స్), జీవక్రియల్లో మార్పులతో ఇతరత్రా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తుంటాయి. ఇక పురుషులకూ కండోమ్, వ్యాసెక్టమీ అనే కుటుంబ నియంత్రణ మార్గాలు ఉన్నప్పటికీ కండోమ్ పూర్తిగా నూరు పాళ్లూ నమ్మదగినది కాదు. తెలియకుండానే ఏ టైమ్లోనైనా అది చిరగడం లాంటి అనర్థాలు జరిగినప్పుడు పార్ట్నర్కు అవాంఛిత గర్భం వచ్చే ప్రమాదం ఉంది. దాంతో తన ప్రమేయమూ, తప్పూ లేకుండానే మహిళా పార్ట్నర్పై గర్భధారణ భారం పడుతుంది. ఇక వ్యాసెక్టమీ అనేది కుటుంబ నియంత్రణకు పూర్తిగా శాశ్వత ప్రత్యామ్నాయం. పైగా పురుషులందరిలోనూ అది నూరు పాళ్లూ సక్సెస్ కాకపోవచ్చు. అందుకే పురుషుల్లో వారి లైంగిక ప్రేరణలకు కారణమయ్యే టెస్టోస్టెరాన్కు ఏ భంగమూ రాకుండా పిల్ తయారైతే... అది నూరుపాళ్లూ సేఫ్గా ఉండటంతో పాటు మహిళపైన ఉద్వేగపరమైనవీ, యాంగై్జటీ వంటి మానసికమైనవి అయిన ఎన్నోరకాల భారాలను సంపూర్ణంగా తొలగిస్తుంది. అందుకే పురుషుల కోసం కూడా పూర్తిగా సురక్షితమైనదీ, నమ్మదగినదీ అయిన పిల్ కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు అదిప్పుడు దాదాపుగా సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.తర్వాతి పరిశోధనలేమిటి...? ఇప్పుడీ 16 మందిపై జరిగిన పరిశోధనలు పూర్తిగా విజయవంతం కావడంతో... ఇకపై మరో 50 మందిపై పరిశోధనలు నిర్వహించనున్నారు. ‘లార్జ్ ఫేజ్ 1బి / 2ఏ’ అనే ఈ అధ్యయనాలను ఈసారి వ్యాసెక్టమీ చేయని పురుషులపై నిర్వహిస్తారు. ఈసారి కొంత ముందుకెళ్లి ఈ రోజువారీ పిల్ను వాడినప్పుడు అది ఏ మేరకు స్పెర్మ్కౌంట్ను పూర్తిగా అదుపు చేసి గర్భం రాకుండా చూస్తుందనే అంశాన్ని పరిశీలిస్తారు. నిజానికి ఈ పిల్ తర్వాత రెండు రోజుల పాటు రక్షణ దొరికే అవకాశాలున్నప్పటికీ గర్భం రావడాన్ని నూరు పాళ్లు నివారించేందుకు ప్రతిరోజూ వాడాల్సి ఉంటుంది. తర్వాత్తర్వాత దీని ప్రభావాన్ని మరింత పెంచుతూ... రానురానూ మరిన్ని పరిశీలనల తర్వాత దీన్ని రెండు రోజులకోసారి తీసుకోవాలా, మూడు రోజులకోమారు వాడాలా అనేది నిర్ణయిస్తూ, పిల్ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలనేది పరిశోధకుల ఉద్దేశం. చివరగా... ఇది కేవలం ఒక సరికొత్త పిల్ మాత్రమే కాబోదు. మహిళలూ, పురుషుల మధ్య సమానత్వానికి సంకేతం. మహిళల ఆరోగ్యాలను కాపాడుతూ, వాళ్లలోని హార్మోనల్ అసమతౌల్యాలను నివారిస్తూ... భవిష్యత్తులో మరెంతో మంది మైండ్సెట్నూ, దృష్టికోణాలనూ సమూలంగా మార్చబోయే ఓ అద్భుతమైన ఔషధం కాబోతోంది ఈ పిల్. పరిశోధన పూర్వరంగమేమిటీ, ఏ మేరకు పిల్ ప్రభావవంతం?మానవులపై ప్రయోగించడానికి ముందర ‘వైసీటీ–529’ పిల్ను కోతులపైనా, ఎలుకలపైనా ప్రయోగించి చూశారు. పిల్ వాటిల్లో 99 శాతం ప్రభావవంతంగా పనిచేస్తూ వీర్యకణాలు పూర్తిగా లేకుండా చేసింది. తమ పురుష పార్ట్నర్తో కలిసిన ఆడ కోతులూ, ఆడ ఎలుకలకు గర్భం రాలేదు. పిల్స్ మానేశాక మళ్లీ కొద్ది వారాల్లోనే సంతానోత్పత్తి యధావిధిగా జరగడం మొదలైంది. ఏ లోపమూ రాలేదు.కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నఆశారేఖ ఇది... పరిశోధనల్లో ఈ తదుపరి దశలూ విజయవంతమైతే... రానున్న కొన్నేళ్లలోనే... వీలైతే కొన్నాళ్లలోనే పురుషులకూ నమ్మదగిన, సురక్షితమైన, ఒక సింపుల్ పిల్ సంతాన నియంత్రణ కోసం చాలా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దాంతో ఇక కాంట్రసెప్టివ్ భారమనేది పూర్తిగా మహిళపైనే పడకుండా... ఇకపై మహిళలతో పాటు పురుషలూ ఆ భారాన్ని సమంగా పంచుకోనున్నారు. ఎంత వరకు సురక్షితం? పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇదెంతో సురక్షితమైన పిల్. ఇప్పటివరకూ నిర్వహించిన వైద్యపరీక్షలూ, చేసిన ట్రయల్ రన్స్... వీటన్నింటిలోనూ ఇదెంతో సేఫ్ అని తేలింది. డిసెంబరు 2003 నాటి నుంచి జూన్ 2025 దాదాపు ఈ ఏడాదిన్నర కాలంలో ఆరోగ్యవంతులైన వ్యాసెక్టమీ చేయించుకున్న 16 మంది యువకులపై దీన్ని ప్రయోగించి చూశారు. (తమ పార్ట్నర్కు అవాంఛిత గర్భం రాకుడదనే ఉద్దేశంతో వ్యాసెక్టమీ అయిన పురుషులను తొలి అధ్యయనాల కోసం ఎంపిక చేసుకున్నారు). వాళ్లకు పిల్ను 180 ఎంజీ మోతాదులో ఇస్తూ వాళ్లలో వీర్యకణాలను నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. తేలిన అంశమూ... వినవచ్చిన శుభవార్త ఏమిటంటే... వాళ్లలోని వాంఛలకూ, డ్రైవ్కూ, ఉత్సాహానికీ, మూడ్స్కూ ఎలాంటి లోపమూ రాలేదు. అంతా నార్మల్. అన్నీ బాగా ఉండటంతో పాటు అనుకున్న ఫలితమూ వచ్చింది. వాళ్లందరిలో వీర్యకణాల సంఖ్య సున్నా అయ్యింది. – యాసీన్ -
విజేతకు.. విజయమూ ప్రత్యర్థే!
చిన్న గెలుపు కూడా పెద్ద సంతోషాన్నిస్తుంది. అదే పెద్ద గెలుపైతే! అదికూడా – ప్రపంచాన్నే జయించినంత గొప్ప గెలుపైతే! లోకం మొత్తం ఏకమై జయజయధ్వానాలు చేస్తుంది. పూల వర్షం కురిపిస్తుంది. విజేతను కీర్తి సింహాసనంపై కూర్చోబెడుతుంది. చిన్న వయసులోనే జగదేక వీరులైన వారినైతే ముద్దు చేస్తుంది. మురిపాలు కురిపిస్తుంది. వరాలు, వరహాలు కుమ్మరిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్, సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, పీవీ సింధు (PV Sindhu).. ఇలా ఒక్క స్పోర్ట్స్లోనే కాదు, ప్రపంచ పోటీలు జరిగే ప్రతి రంగంలోనూ దివి నుంచి భువికి దిగినట్లుగా విజేతలపై ఒక్కసారిగా మహోజ్వలమైన వెలుగు ప్రసరిస్తుంది. మరి అంతటి వెలుగును తట్టుకోవటం అందరికీ చేతనవుతుందా? చిన్న వయసులోనే స్టార్డమ్ సంపాదించినవారికి అసలే సాధ్యమవుతుందా?భారతదేశ చదరంగ వినీలాకాశంలో సరికొత్త ధ్రువతార 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ (Divya Deshmukh) ప్రస్తుతం ఒక అపరిచిత ప్రత్యర్థితో రేయింబవళ్లూ తలపడుతూ ఉంది! ఆ ప్రత్యర్థి పేరు ‘గెలుపు!’ జార్జియాలోని బాటుమిలో జరిగిన ఫిడె మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దివ్య, ఆ గెలుపును తట్టుకుని నిలబడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. ఆలోచించి మరీ ‘ఆనందాల పావులను’ కదుపుతోంది. వినేందుకు ఇది విచిత్రంగా ఉండొచ్చు. కానీ, ఓటమిని తట్టుకోవటం ఎంత కష్టమో, గెలుపును తడబడకుండా పట్టుకుని నిలబడటమూ అంతే కష్టం.ఉక్కిరి బిక్కిరిఫిడే ప్రపంచ కప్పును, గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించిన తర్వాత నాగ్పూర్కు తిరిగి వచ్చిన ఈ టీనేజర్కు భారీ స్వాగతం లభించింది. ‘జన ఘన సందోహం’ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి, బాటుమిలో ‘ట్రోఫీ’ చేతికి అందిన క్షణం నుంచే గెలుపుతో దివ్యా దేశ్ముఖ్ ‘సమస్యలు’ మొదలయ్యాయి! తొలి సమస్య... ఇన్స్టాగ్రామ్లో తన ట్రోఫీతో ఎలా ఫోజు ఇవ్వాలి అన్నదే! ఇంటర్వ్యూలుఅర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) వరల్డ్ కప్ ట్రోఫీని హత్తుకుని పడుకున్న ఫొటోలకు ఇన్స్టాగ్రామ్లో 5 కోట్ల లైక్లు రావటం దివ్యకు గుర్తుంది. ‘నేను కూడా అలాగే చేయాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ, అలసటతో నిద్రపట్టేసింది’ అని దివ్య ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నవ్వేసింది. గెలుపు అలసటను మాత్రమే కాదు, ఇంటర్వ్యూలను కూడా తీసుకొస్తుంది. టీనేజ్ జగజ్జేతలకు ఈ సంతోషాన్ని తట్టుకోవటం కాస్త కష్టమైన వ్యవహారమే.ప్రముఖుల సందేశాలు‘విజేత’ అనే టైటిల్ దివ్యకు మరో పరీక్ష పెట్టింది! ఆమె విజయంలో పాలు పంచుకోవాలని యావద్దేశం ఉవ్విళ్లూరింది. ‘మనమ్మాయి’ అని ఉప్పొంగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఆమెకు వీడియో కాల్ చేశారు. అంతటి మహామహులు తనకు ఫోన్ చేసి, స్క్రీన్పై తన కళ్ల ముందు ప్రత్యక్షమై అభినందనలు తెలుపుతుంటే ఏడు గుర్రాలపై విజయ విహారం చేయటమే. అక్కడితో అయిపోలేదు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి దేశ రాజధానికి దివ్యను ఆహ్వానించారు. ఇక ఆమె ఫోన్కు వస్తున్న సందేశాలకైతే లెక్కేలేదు. ఆ వరదలో దివ్య మునకలేస్తోంది. అంతమందికి ఒక్కొక్కరిగా కృతజ్ఞతలు ఎప్పటికి చెప్పగలను అని సతమతం అవుతోంది. అంతేనా, నాగపూర్లో మహా పట్టాభిషేకం, వరుసగా సన్మానాలు, ఇంటికి వచ్చి వెళుతున్న శ్రేయోభిలాషులు!చిన్నారులకు ఆదర్శంటైటిల్ గెలుచుకుని నాగ్పూర్లో అడుగుపెట్టినప్పుడు, అంతమంది జనాన్ని, ముఖ్యంగా పిల్లలను చూడటంతో దివ్య తబ్బిబ్బయింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఆమెను సత్కరించే కార్యక్రమంలో కనీసం 50 శాతం మంది పిల్లలే ఉన్నారు. ఆ చిన్నారుల్లో ఒక చిన్నారిగా దివ్య కలిసిపోయింది. అక్కడి కేరింతలకు ఆమెకు కన్నీళ్లొచ్చినంత పనైంది. అయినా హుందాగానే ఆ పరిస్థితిని ఎదుర్కొంది.విజయాన్ని తట్టుకోవటానికి 5 మెట్లు!1. ఒక్కసారిగా వచ్చిన కీర్తి దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. చిన్నపిల్లలు, టీనేజర్లకైతే అంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మొదటి అడుగుగా మౌనం, చిరునవ్వే వారిని గట్టెక్కిస్తాయి.2. విజయోత్సాహం దినచర్యలను క్రమరహితం చేసే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఎప్పటిలా ఆహారం, వ్యాయామం, నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి.3. ప్రతి ప్రశంసకూ, మీడియా సంధించే ప్రశ్నలకు స్పందించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులే తమ చిన్నారి విజేతకు సహాయంగా ఉండి, వారి ఒత్తిడిని తగ్గించేలా చూడాలి.4. విజేతలు కొన్నిసార్లు తమ వస్త్రధారణ, శరీరాకృతి విషయమై సోషల్ మీడియాలో విమర్శలకు గురికావచ్చు. వాటిని తేలిగ్గా తీసుకోవాలి. మాటకు మాట చేటు తెస్తుంది.5. గెలుపు గుర్తింపునే కాదు, గుర్తించలేని శత్రువులను కూడా వెంట తీసుకొస్తుంది. కొందరు మాట్లాడటం మానేస్తారు. కొందరు చాటుగా ఏదో అంటున్నారని తెలుస్తుంది. వాళ్ల నుంచి చిన్నారి విజేతల్ని వారి కోచ్లు, పేరెంట్స్ కాపు కాచుకోవాలి.అంత సులభం కాదుఆట అనే కాదు.. ఒక పాటల కార్యక్రమం, డ్యాన్స్ ప్రోగ్రామ్.. ఇలా రాష్ట్ర లేదా జాతీయ స్థాయి కార్యక్రమంలో విజేతలుగా రాణిస్తున్న చిన్నారులు మన కళ్ల ముందే ఎంతోమంది ఉన్నారు. ఆ చిన్న మనసులకు ఆ గెలుపు ఎంతో కిక్కునిస్తుంది. ఆ తరువాత వచ్చే ప్రశంసలు, జరిగే సన్మానాలు వారిని మునగచెట్టు ఎక్కిస్తాయి. అక్కడే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు, అంత ఎత్తునుంచి జారిపడే ప్రమాదం ఉందని, పడితే నడుం విరుగుతుందని! చదవండి: రెప్పల లోపల ఇసుకను భరించని కళ్లు లేవుగెలుపు రుచి చూసిన తమ పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆ మత్తు వారి తలకెక్కకుండా.. చదువు పక్కదారి పట్టకుండా.. స్నేహితులను దూరం చేసుకోకుండా చూసుకోవాలి. నిజానికి దివ్య వ్యవహరించిన శైలి ఎంతోమందికి ఆదర్శం. సచిన్, విశ్వనాథన్ ఆనంద్ లాంటి మహామహులు.. దివ్య ఇప్పుడున్న దశను దాటిన తరువాత వ్యవహరించిన తీరు దివ్యకు ఆదర్శం కావాలి. - సాక్షి, స్పెషల్ డెస్క్ -
బంధం..బంధనం ఏదైనా..ఒకరికొకరం.. అంతేగా!
బంధం ఏదైనా... బంధనం ఏదైనా..ఒకరికొకరం నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు, నేను.. మాకు, మీరు, మీకు మేము, ఒకరికొకరం మనమే మనము!చదవడానికే ఇంత బావుంటే, క్రియారూపంలో ఇంకెంత బావుంటుంది?ఈ రోజు రాఖీ పండుగ కాబట్టే కాదు, మొన్న అంతర్జాతీయ స్నేహ దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, దంపతుల దినోత్సవం, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే.. వగైరా వగైరాలు జరుపుకుంటూనే ఉంటాం కదా!ఇవన్నీ ఎందుకు? ఒక రోజుకే సంబంధించిన అంశాలు కావు ఇవి. ఒక రోజంటూ నిర్ధారించుకుని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆత్మీయతలను కలబోసుకోవడానికి, రాబోయే రోజులను ఆ అనుబంధాలను భద్రపరచుకోవడానికి, వాటి గాఢతను ప్రోది చేసుకోవడానికి వాడుకుంటాము. రాఖీ పండుగ గురించి మైథాలజీ చెప్పే కథ ఏదైనా కావచ్చు, ఈ కాలంలో ప్రతి మనిషి ఒకరికి ఒకరు అనుకోవాలి. అనుబంధాలు పలుచన అయిపోతున్నాయి అని అనుకోవడం కాదు, మనం ఆ అనుబంధాలను కొనసాగించడం, నిలుపుకోవడం తెలుసుకోవాలి. ఒకప్పుడు అక్కాచెల్లెళ్ల బాధ్యత అన్నదమ్ములది అనే వారు. ఆడపిల్లను రక్షించడం, బాధ్యతగా చూసుకోవడం, కష్ట సమయాల్లో ఆదుకోవడం అన్నీ అన్నదమ్ముల బాధ్యత. ఈ పరిస్థితి అప్పటి కాలానిది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో పరిస్థితులు వేరు. నిజానికి మైథాలజీలోని కథను చూసినా, ద్రౌపది ముందు కృష్ణుడి చేతి వెలి గాయానికి తన చీర చించి కట్టు కట్టింది. ఆ ప్రేమ, ఆ అక్కరకు బద్ధుడైన కృష్ణుడు ఆమెకు రక్షగా ఉంటాను అంటాడు. ఇదీ చదవండి: పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?అసలు ఈ కాలంలో ఒకరికి ఒకరు కట్టుకోవాలి రాఖీ. కష్టంలో, సుఖంలో తోబుట్టువులు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అక్కలు, చెల్లెళ్లు అన్నదమ్ముల బాధ్యత మాత్రమే కాదు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ బాధ్యత కూడా. అందుకే ఒకరికి ఒకరు. భారతదేశంలో ముడి అనేది ఒక కనెక్షన్ కి చిహ్నం. ఆ ముడిలో ఒక అనుబంధానికి ఇష్టబంధనం కాబడతామేమో. మా పెళ్లి సమయంలో మా ఆయన మాత్రమే తాళి ఎందుకు కట్టాలి? నేను కూడా ఆయనకు ఒక తాళి కడతాను అని పేచీ పెట్టాను నేను. నా నేస్తాలు నన్ను బ్రతిమాలి ఆపారు. అప్పుడేమిటి? ఇప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడతానని నన్ను రెబెల్ అంటారు. కానీ నేను అనే దాంట్లో తప్పేముంది?రాఖీ కావచ్చు, ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కావచ్చు, పెళ్లిలో వేసే తాళి కావచ్చు, అన్నీ అనుబంధానికి చిహ్నాలు, ప్రతీకలుగా భావిస్తాము కాబట్టే కదా! ఈ ముడులు లేకపోయినా మానసిక బంధాల విలువ గొప్పది. ఒకరికి ఒకరం చేసుకునే చిన్న చిన్న పనులు గొప్పవి. ఒకరికే బాధ్యత ఆపాదించడం ఈ కాలానికి, భవిష్యత్ కాలానికి కూడా సరికాదు. నాకు ఇష్టమయినవి, నా అవసరాలు నా చెల్లికి, తమ్ముడికి తెలియాలి. వాళ్ళకు ఇష్టమయినవి, వాళ్ళ అవసరాలు నాకు తెలియాలి. అలాగే భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులూ.. అందరం.. ఒకరికి ఒకరం అన్నట్టే ఉండాలి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పనిప్రపంచంతో పరుగుపందెం వేసే ఈ కాలంలో మనతో పాటు మనవాళ్ళూ ఉండాలి. మనం వాళ్ళతో ఉండాలి. చిన్న చిన్న సంతోషాలను, సందర్భాలను పంచుకోవాలి. ఎవరినీ ఎవరూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా సహాయం, సౌభ్రాతృత్వం చేతులు మారి, జీవితాలను చేరాలి. అన్నీ కథలే...ఏ హృదయాన్ని కదిలించినా వ్యధలే...అన్ని సమపాళ్ళలో జీవన రసాలు ఇపుడసలు లేవుఉగాది పచ్చడి రుచులు నిజజీవితాల్లో లేవుఅడగకూడదిక ఎవర్నీ....నువ్వెలా ఉన్నావని!కదిలించకూడదిక ఎవర్నీ....ఏమిటి విశేషాలని!దీన గాథలను చేతుల్లో మొయ్యని ఆత్మలు లేవురెప్పల లోపల ఇసుకను భరించని కళ్ళు లేవు అన్నీ చప్పటి వెలితికి చిహ్నాలే...అన్నీ ఉప్పటి నీటికి బానిసలే...స్పర్శించాలిక అందర్నీ...కాస్త ధైర్యాన్నివ్వడానికి!హత్తుకోవాలిక ఆ చూపుల్ని...వెలుగు ఎంతో దూరం లేదని చెప్పడానికి!మనం ఒకరికి ఒకరం అని నిబద్ధతగా నిలబడడానికి!! - విజయభాను కోటే, ప్రభుత్వ ఉపాధ్యాయిని వైజాగ్ -
సారా టెండూల్కర్ కొత్త చాలెంజ్ క్రియేటివ్ వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రత్యేకతే వేరు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన కమ్ అండ్ సే ‘జీ’డే రూ.1137 కోట్ల భారీ ప్రచారానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.చిన్న చిన్న క్రియేటివ్ మూమెంట్స్తో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఇన్స్టాలో సందడి చేస్తోంది. ఆత్మ , మనస్సు రెండింటినీ ఉత్తేజపరుస్తూ కొత్త అభిరుచిని కనుగొంది. ‘‘ఫైండ్ సారా ఎ న్యూ హాబీ" అనే ఇన్స్టాగ్రామ్ సిరీస్లో సారా టెండూల్కర్ తన ఖాళీ సమయంలో ఉత్తేజకరమైన మానసిక శ్రేయస్సును మెరుగుపరిచే హాబీని ప్రదర్శించింది.సారా రగ్ టఫ్టింగ్లో తన టాలెంట్ను పరీక్షించుకుంది. ఆకుపచ్చ రంగు నూలును ఎంచుకుని టఫ్టింగ్ ద్వారా పావ్ ప్రింట్ రగ్ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. టఫ్టింగ్ పూర్తైన తరువాత జిగురుతో అంటించింది కూడా. రగ్ టఫ్టింగ్ పూర్తి చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట్ సందడిగా మారింది.చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) రగ్ టఫ్టింగ్ అంటే ఏమిటిటఫ్టింగ్ అనేది ఒక టెక్స్టైల్ టెక్నాలజీ. టఫ్టింగ్ గన్ను ఉపయోగించి నూలుతో కాన్వాస్ మీద కుట్టడం. వివిధ రకాల మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల, టఫ్టింగ్ ప్రక్రియలో సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, నూలు చిక్కుకుపోవడం, లేదా కాన్వాస్ చిరిగిపోవడం వంటివి జరగవచ్చు. టఫ్టింగ్ తర్వాత, రగ్గును శుభ్రపరచడం, అంచులు కత్తిరించడం, ఇతర మెరుగులు పెట్టడం కూడా ముఖ్యమైనవి. ఇందులో విభిన్న అల్లికలు, మోడల్స్ ఉంటాయి.టఫ్టింగ్ ప్రక్రియ ఒక ఫౌండేషన్ ఫాబ్రిక్ను ఫ్రేమ్పై గట్టిగా సాగదీయడంతో ప్రారంభమవుతుంది. ఆపై ఒక డిజైన్ ఫాబ్రిక్పైకి మారుస్తారు. కావలసిన డిజైన్స్ కట్స్ చేస్తారు. చివరగా, రగ్ వెనుక భాగంలో రబ్బరు పాలు జిగురుతో అంటిస్తారు. టఫ్టింగ్కు అవసరమైన కొన్నిప్రాథమిక సాధనాల్లో టఫ్టింగ్ గన్, నూలు, టఫ్టింగ్ ఫ్రేమ్,బ్యాకింగ్ ఫాబ్రిక్, అంటుకునే, చెక్కే సాధనాలు, షీరింగ్ కోసం కత్తెర తదితర టూల్స్ అవసరం.ఇదీ చదవండి: ఒకే ఒక్క టిప్తో స్లిమ్గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం -
ఒకే ఒక్క టిప్తో స్లిమ్గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం
నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినపుడు బొద్దుగా ముద్దుగా ఉన్న కీర్తి సురేష్ ఉన్నట్టుండి సన్నగా మారి అభిమానులను అశ్చర్యపర్చింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ మలయాళ కుట్టి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించు కుంది. ఇక ఆ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది.2018లో మహానటి సావిత్రిలాగా కాస్త బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఆ తరువాతమహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారి వారి పాట చిత్రంలో స్లిమ్గా కనిపించింది. 2018-19లో వేగంగా బరువు తగ్గింది. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలను షేర్ చేసింది. అప్పట్లో కేవలం షూటింగ్కి వెళ్లి వచ్చి తినేసి నిద్రపోయేదాన్ని, అందుకే మరీలావుగా కాకపోయినా కొద్దిగాబొద్దుగా కనిపించానని చెప్పుకొచ్చింది. కానీ తరువాత ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి పెట్టానని ఈక్రమంలో కేవలం 9 నెలల్లో 8 నుంచి 9 కిలోలు బరువు తగ్గానని వెల్లడించింది. కేవలం కార్డియో ద్వారా తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అయ్యానని గుర్తు చేసుకుంది. రోజుకు కనీసం గంట సేపు కార్డియో వ్యాయామాలు చేసేదట. కార్డియోలో చేసినపుడు మజిల్ లాస్ ఉంటుంది. ఎలాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ లేకుండానే కార్డియో చేసా త్వరగా బరువు తగ్గాను అని చెప్పింది. దీంతోపాటు, సింపుల్ డైట్ ఫాలో అయ్యానని తద్వారా తొమ్మిది కిలోల బరువు తగ్గానని తెలిపింది. అయితే తన ఇన్స్టాలో యెగా,ధ్యానం చేస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది కీర్తి సురేష్.నిపుణులేమంటున్నారంటే..అయితే నిపుణులు ఏమంటారంటే కార్డియో కేలరీలను బర్న్ చేయడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, దానిపై మాత్రమే ఆధారపడటం వల్ల కాలక్రమేణా కండరాల నష్టానికి దారితీస్తుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోకపోతే కండరాలు బలహీనపడవచ్చు , దీర్ఘకాలంలో మొత్తం ఫిట్నెస్ తగ్గవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్థిరంగా బరువు తగ్గడ , మెరుగైన ఫిట్నెస్ సాధించడాని రెండు కీలక అంశాలపై దృష్టి పెట్టాలి.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లుమొదటిది ఎంత, ఏమితింటున్నారో పరిగణనలోకి తీసుకోవాలి. కేలరీలపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. రెండవది వ్యాయామం.కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ ఈ రెండింటి కలయిక ఆరోగ్యకరమైంది, మెరుగైన ఫలితాలను నిర్ధారిస్తుంది. ఇది కండర ద్రవ్యరాశిని నిర్మించడమే కాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది. బాడీ షేప్నకు, దీర్ఘకాలిక ఫిట్నెస్కు సపోర్ట్ చేస్తుందనేది నిపుణుల మాట. -
హైస్కూల్ రోజుల నుంచే స్టార్టప్ ఐడియాలు!
యూనివర్శిటీ, కాలేజీ విద్యార్థుల స్టార్టప్ల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు యూనివర్శిటీ, కాలేజీల నుంచి మాత్రమే కాదు ఉన్నత పాఠశాలలు కూడా స్టార్టప్ ఐడియాలకు కేంద్రం అవుతున్నాయి. ఇటీవల దిల్లీ–ఎన్సీఆర్ విద్యార్థి సదస్సులో పాల్గొన్న విద్యార్థులు డెమో యాప్ల గురించి వివరించడంతోపాటు తమ ఫ్యూచర్ స్టార్టప్లకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వారి మాటల్లో ఉత్సాహం మాత్రమే కనిపించలేదు. నిర్మాణాత్మక ప్రణాళిక కనిపించింది.నో–కోడ్ టూల్స్, ఏఐ అసిస్టెంట్స్, గ్లోబల్ బ్యాంక్ రిసోర్స్ ఇన్స్టంట్ యాక్సెస్... మొదలైన కారణాల వల్ల గతంతో పోల్చితే స్టార్టప్ ఆలోచన పట్టాలు ఎక్కించడం సులభం అయింది. స్టార్టప్లను ఎలా నిర్మించాలి, అస్థిరపరిస్థితులను ఎలా అధిగమించాలి, ఇతరులతో ఎలా కలిసి పనిచేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురైతే దానిని అధిగమించి తిరిగి ఎలా వెనక్కి రావాలి... మొదలైన విషయాల గురించిపాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకోనప్పటికీ వాటిపై హైస్కూల్ స్థాయి విద్యార్థులకు తగినంత అవగాహన ఉండడం విశేషం. చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లుతమ కలలను సాకారం చేసుకోవడానికి స్కూల్లో నిర్వహించే ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు, పర్యావరణహిత ఆలోచనల ఆధారంగా స్టార్టప్ ఆలోచన చేస్తోంది యువతరం.ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్బాక్స్ రిటన్ గిఫ్ట్స్ -
70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి సంగ్వాన్ డైట్ సీక్రెట్..!
చాలామంది ప్రముఖుల డైట్ సీక్రెట్ల గురించి విన్నాం. అలా చేస్తే మనం కూడా స్మార్ట్గా మారిపోవచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంటాయి అవి. కానీ అలా ఏదీ పడితే అది ఫాలో కావొద్దని చెబుతోంది ఈ 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్. శరీరం మాట వినండి, అందరికీ ఒక విధమైన డైట్ ఎట్టిపరిస్థితిలో సరిపడదని కూడా సూచిస్తోంది. ఈ వయసులో కూడా చురుగ్గా బరువులు ఎత్తే ఆమె తన డైట్ సీక్రెట్ని షేర్ చేసుకోవడమే గాక ఎలా ఆహారం తీసుకుంటే మంచిదో కూడా సూచించారు. రోష్ని దేవి సంగ్వాన్ 68 సంవత్సరాల వయస్సులో వెయిట్లిఫ్టింగ్ ప్రారంభించి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్గా మారారు. ఆమె ఆర్థరైటిస్తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారామె. అంత లేటు వయసులు బరువులు ఎత్తడం మొదలు పెట్టినా..అంతలా ఎనర్జీగా చేసేందుకు ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందంటే..రోజు పది బాదంపప్పులు, ఎండుద్రాక్ష తీసకుంటుందట. సాయంత్రం పెసరపప్పుతో చేసే అట్లు, పనీర్, ఒక కప్పు పాలు తీసుకుంటానని అన్నారు. చాలా తక్కువ మోతాదులో రైస్ తీసుకుంటానని చెప్పారామె. భారతీయ వంటకాలు శరీరానికి మంచి రిప్రెష్ని అందిస్తాయని అంటున్నారామె. పప్పు, బియ్యం, పెరుగు, ఓట్స్, బాదం, మూంగ్ చిల్లా, పనీర్లను కలిగి ఉన్న ఈ డైట్ ప్లాన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మిశ్రమాన్ని అందిస్తుంది. శరీరం నెమ్మదిగా జీర్ణమయ్యే శక్తిని, మెరుగైన ప్రేగు ఆరోగ్యం తోపాటు రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలు ఉండేలా చేసే పోషకమైన ఆహారం ఇది. ఇక్కడ పెసరపప్పు, బాదం, పనీర్ వంటి పదార్థాలు జీవక్రియ, కండరాల మరమతఉకు మద్దతు ఇచ్చే అద్భుతమైన శాకాహార ప్రోటీన్ వనరులు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే వెయిట్ లిఫ్టర్ రోష్ని దేవి ఈ ఆహారాలన్నీ ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ..తినే క్వాండిటీ అనేది అత్యంత ప్రధానం అని చెబుతోందామె. ఉదహారణకు నట్స్, పనీర్ పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తీసుకునే క్వాండిటి ప్రధానం. అలాగే ఈ ఆహారాలు అందరికీ సరిపడకపోవచ్చని అంటున్నారామె. ఎందుకంటే కొందరికి లాక్టోస్ పడకపోవచ్చు, అలాగే వీటిలో కొన్ని పీసీఓడీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తీసుకోకూడనివి కూడా అయి ఉండొచ్చని అమె చెబుతున్నారు. ఇన్సులిన్, ధైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువ ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు అవసరం కావొచ్చు. అందువల్ల ఈ డైట్ని ఫాలో కావొద్దని చెబుతున్నారు రోష్ని దేవి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఆన్లైన్ కంటెంట్ ఆధారంగా ఆహారంలో మార్పులు చేయడం కంటే మంచి డైటీషియన్ని సంప్రదించి అనుసరించడమే మంచిదని సూచించారామె. చివరగా ఆమె ఒక్క విషయానికి తప్పక కట్టుబడి ఉండండని అంటున్నారామె. భారతీయ భోజనం సదా శక్తిమంతంగా ఉంటుంది, వ్యక్తిగతమైనది కూడా అనేది గ్రహించండని అంటోందామె. ఒక వ్యక్తికి బాగా పనిచేసిన ఆహారం మరొకరికి ఇబ్బందికరంగా ఉండొచ్చని అన్నారు. అన్నింట్లకంటే మన శరీరం చెప్పింది వినాలని అన్నారామె. సో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి శరీరానికి సరపడా డైట్ తీసుకుని ఫిట్గా ఉందామా మరి.. View this post on Instagram A post shared by Ranveer Allahbadia (@ranveerallahbadia) (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..) -
తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..
ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా ఎంతో కొంత ప్రతిభ దాగి ఉంటుంది. అయితే ఉప్పొంగేలా బయటకు రావాలంటే..బలమైన గాయం లేదా ఎదురదెబ్బ తగిలినప్పుడే కసితో బయటకు వస్తుంది. లేదా ఎవ్వరైనా..మనల్ని విమర్శిస్తూ ఇచ్చే సలహాలు జీవితాన్ని అనుహ్యంగా మలుపుతిప్పుతాయి. అలా తండ్రి కారణంగా మంచి యూటర్న్ తీసుకుంది ఆమె జీవితం. ప్రపంచం ముందు ఓ గొప్ప హోదాలో ఉన్న ప్రముఖ వ్యక్తిగా నిలిచేలా చేసింది. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కూడా. ఆమెనే యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్. ఆమె ఏమి వారసత్వంగా కంపెనీకి సీఈవోగా అయిపోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ మారుమూల పట్టణం నుంచి క్లర్క్గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టి తన అపారమైన ప్రతిభ పాటవాలతో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి సీఈవో అయ్యిందామె. ఈ విజయం తన తండ్రి సపోర్ట్ వల్లే వచ్చిందని చెబుతుంటారామె. కారు పెయింటర్, ఆర్మీ వ్యక్తి అయినా ఆమె తండ్రి జూలీకి డబ్బు సంపాదన గురించి తరుచుగా చెబుతుండేవాడు. ఒకరోజు ఆ తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ కూతురు జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. ఆ విషయాన్ని సీఈవో జూలీ స్వీట్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఒక డిబేట్ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఓటమిని చవిచూశానని నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. ఆ డిబేట్ పోటీలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడి కుమార్తె విజేతగా నిలిచింది. దాంతో తాను తన తండ్రితో తన బాధను పంచుకున్నట్లు చెప్పుకొచ్చింది జూలీ.ఆమె లయన్స్ క్లబ్ కుమార్తె కాబట్టేగా ఫస్ట్ ఫ్రైజ్ ఇచ్చారు అంటూ తన నిరాశాసను వ్యక్తం చేసింది తండ్రి దగ్గర. దానికి అతడి తండ్రి నుంచి వచ్చిన శక్తిమంతమైన ప్రతిస్పందన జూలీ మనసుని బలంగా తాకింది. "నువ్వు ఎప్పటికీ లయన్స్ క్లబ్ కుమార్తెవి కాలేవన్నది నిజం. అంటే ఇక్కడ నువ్వు మెరుగ్గా ఉండేలి అదే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. ఈ ప్రపంచం న్యాయం గురించి మాట్లాడదు..అచంచలమైన టాలెంట్ ఉన్నవాడికి ఫిదా అవుతుంది. అదే గుర్తుపెట్టుకో ఈ క్షణం నువ్వు మెరుగ్గాలేవు అందువల్లే గెలవలేకపోయావు. విజేత కావాలనుకుంటే అనుక్షణం నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటేనే వెనుకబడవు." అని తండ్రి సూచించాడు. ఆ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. దాంతో ఆమె వెనుకబడటం అన్న మాట దరిచేరనీయకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. అలా తన ప్రతిభను సానబెట్టుకుంటూ టీనేజ్ వయసులో ఒక క్లర్క్గా ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ..న్యాయ సంస్థ క్రావత్ స్వైన్ & మూర్ నుంచి యాక్సెంచర్ జనరల్ కౌన్సెల్ సీఈవో స్థాయికి ఎదిగేలే చేసింది. బలహీనతలను జయిస్తూ..తన చుట్టూ ఉన్న ప్రపంచం కంటే మెరుగ్గా ఉండటంపై శ్రద్ధ పెట్టింది, నేర్చుకోవడం అనేదాన్ని ఎన్నటికి వదలిపెట్టలేదు. అదే తన సక్సెస్ మంత్ర అని సగర్వంగా చెప్పింది జూలీ. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్ పాఠం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటమిని నిజాయితీగా అంగీకరించేలా చేస్తూ..తనలో ఆత్మవిశ్వాసాన్ని చైతన్యవంతం చేయాలి.విజయం కోసం ఏం చేస్తే మంచిది అనేది సూటిగా చెప్పాలి. ఆ మాటలు పిల్లవాడిలో ఓటమికి చెక్ చెప్పేలా తయారయ్యేలా ఉండాలి. అంతేతప్ప ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా, ఇతరులతో పోల్చి చులకనభావం కలిగించేలా ఉండకూడదు. తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట పిల్లవాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందనేందుకు ఈ యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ కథే ఉదాహరణ.(చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..) -
55 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా డాక్డర్..!
‘దీర్ఘకాల రోగాలతో రోగులు నా తలుపు తట్టని రోజునే నేను వైద్యుడిగా విజయం సాధించినట్టు’ అంటున్నారు నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డా.సుదీర్కుమార్. రోగులు రావాలని కాకుండా.. రోగాలు రాకూడదని కోరుకునే మంచి వైద్యుడిగా మాత్రమే కాదు రోగాల బారిన పడకుండా ఏం చేయాలి? అనే దానికి కూడా ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అధిక బరువుతో, దీర్ఘకాలిక వ్యాధితో పోరాడిన ఆయన వాటిని మందులతో కాకుండా జీవనశైలి మార్పులతో జయించవచ్చని నిరూపించారు. వైద్యుడిగా బిజీ అయిపోయాక ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. నాకు 49 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి దాదాపు 100 కిలోల బరువుకు చేరుకున్నా. అలాగే ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి కూడా ఇబ్బంది పెట్టేంది అంటూ గుర్తు చేసుకున్నారు జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో సీనియర్ న్యూరాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సుదీర్ కుమార్. ఆ పరిస్థితిని తాను అధిగమించిన తీరు, స్ఫూర్తిదాయక ట్రాన్స్ఫార్మేషన్ విశేషాలను సాక్షితో పంచుకున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. లాస్ గుర్తు చేసిన లాక్డౌన్ కోవిడ్–19 లాక్డౌన్ అందించిన ఖాళీ సమయం నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం అందించింది. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుని జాగింగ్ ప్రారంభించాను. రోడ్లు ఖాళీగా ఉండటం కాలుష్యం లేకపోవడం.. నా ప్రయత్నాలకు ఊతమిచ్చింది. అయితే మొదటిసారి 400 మీటర్లు మించి పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు, నాకు ఊపిరి ఆడలేదు. కానీ ఆపడానికి బదులుగా దాన్ని నడకగా మార్చి కొనసాగించాను. పట్టు విడవకుండా ప్రయచి రోజూ 5–10 కి.మీ నడక, అలా పరుగుకు చేరుకున్నా. ‘ఎటువంటి శిక్షణ లేకుండా మారథాన్ల సమయంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పరిగెత్తేవాడిని కాలక్రమేణా నగరంతో పాటు లడఖ్ తదితర చోట్ల మారథాన్లలో పాల్గొని మొత్తం 14,000 కిలోమీటర్లకు పైగా రన్ చేశా. వాటిలో 10కి.మీ పరుగులు 822, హాఫ్ మారథాన్లు 133 ఉన్నాయి. వెయిట్ లాస్.. మజిల్ మిస్.. నిర్విరామ నడక, పరుగు, డైట్లతో రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే 30 కిలోల బరువు తగ్గి 69 కిలోలకు చేరాను. అయితే, మజిల్ లాస్ (కండరాల నష్టాన్ని) కూడా గమనించా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో చేరి 4.5 కిలోల కండర(మజిల్ మాస్) సముదాయాన్ని తిరిగి పొందాను. శారీరక శ్రమ, ప్రొటీన్ రిచ్ ఫుడ్ పెంచడం వంటి మెరుగైన ఆహారపు అలవాట్లు, తగినంత నిద్ర వంటివి ఈ సక్సెస్లో ఇమిడి ఉన్నాయి. అత్యంత క్రమశిక్షణతో కూడిన దినచర్య కూడా అనారోగ్యకరమైన ఆహారం వలన కలిగే నష్టాన్ని భర్తీ చేయలేదని గుర్తుంచుకోవాలి. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాలను పూర్తిగా మానేశా.. పని గంటలు తగ్గించుకుని 7–8 గంటలకు నిద్ర సమయాన్ని పెంచుకున్నా అంటూ వివరించారు డా.సు«దీర్కుమార్. రోగాలకు చికిత్స చేయడం కాదు చికిత్స చేసే అవసరం రాకుండా చేయడం కూడా వైద్యుల బాధ్యతే అంటున్న ఆయన అందుకు తనను తానే నిదర్శనంగా మలుచుకున్న తీరు స్ఫూర్తిదాయకం. How an extremely busy Hyderabad doctor lost 30 kg weight. He started his fitness journey at 50 then completed 133 half marathons"For Dr. Sudhir Kumar, a senior neurologist at Apollo Hospital, Jubilee Hills, Hyderabad, fitness wasn’t a priority—until it became one. In 2020, at… https://t.co/q1sqombu5P— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) July 23, 2025 (చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..) -
నాన్నగారి కొలను..!
చార్టర్డ్ ఎకౌంటెంట్ వికాస్ కుమార్ తన బాల్యజ్ఞాపకాల్లోకి వెళ్లినప్పుడల్లా కొంగల రెక్కల చప్పుడుతో ఊరి చెరువు ప్రత్యక్షమయ్యేది. ఆ చెరువులో తాను ఎన్నో సార్లు ఈత కొట్టాడు. అలాంటి అద్భుతమైన అనుభవం ఈతరం పిల్లలకు దూరం కావడం అతడికి బాధగా ఉండేది. ఆ బాధలో నుంచి పుట్టిందే... ఎకో ఫ్రెండ్లీ కొలను! కోయంబత్తూరులో ఉంటున్న వికాస్ సమీపంలోని చెరువుల్లో తన పిల్లాడికి ఈత నేర్పించాలనుకున్నాడు. అయితే మురికి, రసాయనాలతో కూడిన చెరువులు అతడిని భయపెట్టాయి. అలా అని ఆయన ఊరకే ఉండిపోలేదు. పాల్లాచ్చిలోని తన స్వంత వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్–క్లీనింగ్ పాండ్ను నిర్మించాడు. దీనికి ముందు యూరప్లో ప్రసిద్ధి పొందిన ఎకో–ఫ్రెండ్లీ బయో స్విమ్ పాండ్స్ గురించి అధ్యయనం చేశాడు. తన వ్యవసాయక్షేత్రంలో సెల్ఫ్–క్లీనింగ్ పాండ్ను నిర్మించడానికి మాత్రమే పరిమితం కాలేదు వికాస్. మన దేశ వాతావరణం, జీవనశైలికి అనుగుణంగా బయో స్విమ్మింగ్ కొలనులను నిర్మించడానికి ‘బయోస్పియర్’ అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ సహజసిద్ధమైన జలపాతాలు, కొలనులకు రూపకల్పన చేస్తోంది. ‘మాకు మీలాంటి కొలను ఒకటి కావాలి’ అని తమ పిల్లలతో తల్లిదండ్రులు వచ్చినప్పుడు వికాస్కు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ సంతోషం తన కంపెనీకి వచ్చే లాభాల గురించి కాదు. పర్యావరణ హిత, రసాయన రహిత కొలనుల గురించి వారు ఆలోచన చేస్తున్నందుకు! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..) -
రంగు మానేశాక స్వేచ్ఛ లభించింది.. ! నటి రత్నా పాఠక్ మనోగతం..
వెండి తెర నటీమణులు తమ వయసును దాచుకోవాలి. వయసును దాచాలంటే జుట్టుకు రంగు వేయాల్సిందే. అయితే బహుశా దేశంలో జుట్టుకు రంగు వేయడం మానేసిన తొలినటి రత్నా పాఠక్. స్త్రీ ఏ రంగంలోనైనా రాణించాలంటే రూపం కంటే కూడా ప్రతిభ, శరీరానికి ఇచ్చే తర్ఫీదు, దృష్టి ముఖ్యమని అంటారామె. రంగు వేయడం మానేశాక అవకాశాలు తగ్గినా వయసును యాక్సెప్ట్ చేయడంలో స్థిమితం ఉందంటున్నారామె. తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...‘నేను నటిగా కెరీర్ మొదలైన రోజుల్లో స్త్రీలకు వయసు ఉన్నంత కాలమే పాత్రలు ఉంటాయి. తర్వాత వారు తెరమరుగు అవడమే అనుకునేదాన్ని. కాని నన్ను నటిగా కలకాలం నిలబెట్టేది నా నటనా నైపుణ్యమే తప్ప రూపం, వయసు కావు అని అర్థం కావడానికి చాలా కాలం పట్టింది’ అంటారు రత్న పాఠక్.బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ తెలిసిన దీనా పాఠక్ కుమార్తె రత్న పాఠక్ టీవీ, సినిమా రంగంలో పని చేస్తున్నారు. ఆమె నటించిన ‘సారాభాయ్ వెర్సస్ సారాబాయ్’ టీవీ సీరియల్ విశేష ఆదరణ పొందింది. ‘లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా’. ‘థప్పడ్’,‘ధక్ధక్’ సినిమా ల్లో ఆమె నటన అందరికీ గుర్తుంటుంది. సుప్రియ పాఠక్, రత్న పాఠక్ అక్కచెల్లెళ్లు. నసీరుద్దిన్ షాను వివాహం చేసుకున్న రత్నపాఠక్ విలక్షణమైన పాత్రలతో దేశ విదేశాల్లో అవార్డులెన్నో పొందారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, స్త్రీల గురించి మాట్లాడారు.ఆడపిల్లలే: ‘మా అమ్మ దీనా పాఠక్కు మేము ఇద్దరమే ఆడపిల్లలం. మా నానమ్మ మా ఇద్దరినీ చూసి– పాఠక్ వంశాన్ని ముందుకు తీసుకెళ్లే మగ నలుసే లేదే అని నెత్తి కొట్టుకునేది. అయితే నేను, సుప్రియా నటనా రంగంలో రాణించి పాఠక్ వంశ ఘనతను కాపాడాం. మా అమ్మ, నాన్న ఫలానాది చేయొద్దు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆడపిల్ల అనే కారణాన అడ్డుకోలేదు. చదువులో, కెరీర్లో ఎంత దూరం వెళ్లగలిగితే అంత దూరం వెళ్లనిచ్చారు. చిన్నప్పటి నుంచి మాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. మా నాన్న ఢిల్లీ నుంచి కార్లు తెచ్చి ముంబై లో అమ్మేవారు. ఆయన కార్ల కోసం బయలుదేరినప్పుడల్లా మేము కూడా వెళ్లేవాళ్లం. ఆ ప్రయాణాలు కూడా మాకు మంచి చదువును ఇచ్చాయి’ అంటారామె. నటన అంటే: ‘నటనలో నాకు గురువు మా అమ్మ. అయితే ఆమె ప్రతిభకు తగ్గ పాత్రలు రాలేదనే అనుకుంటాను. నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో మూడేళ్లు నటన నేర్చుకున్నాను. ఒక నటికి కావాల్సింది మనసును, మెదడును డైలాగ్కెలా సిద్ధం చేయాలో తెలియడమే. మంచి రూపం బోనస్ కావచ్చు కాని అదే నటనకు అర్హత కాదు. మంచి నటి తన శరీరాన్ని కూడా ఎక్స్ప్రెసివ్గా మారుస్తుంది. ఆంగికాభినయం ముఖ్యం. నటి అందంగా కంటే దృఢంగా ఉండాలి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను శరీరాన్ని మరింత దృఢంగా ఉంచుకోవడంలో నిర్లక్ష్యం చేశానని. నటులకు ఈ నిర్లక్ష్యం పనికి రాదు’. అని చెప్పారు రత్నా పాఠక్.జుట్టుకు రంగు మానేశాక: ‘నటీమణులు తెల్లజుట్టులో కనిపించడానికి ఇష్టపడరు. నేనూ ఇష్టపడను. కాని తలకు రంగు వేయడం అనేది ఒక ప్రహసనం. రంగు వేసి వేసి శారీరక ధర్మాల నుంచి ఎంతకాలం దూరం వెళ్లగలం అనిపించింది. నసీరుద్దీన్ షా కూడా రంగు మానేసి చూడు... నిన్ను నీలా యాక్సప్ట్ చెయ్ హాయిగా ఉంటుంది అని ప్రోత్సహించాడు. రంగు మానేశాను. తెల్లటి జుట్టుతో కనిపిస్తుంటే ముందు మార్కెట్ పోతుంది... నాక్కూడా పోయింది. ఎందుకంటే నాతో నటించే నా వయసు మగ నటులు కూడా రంగు వేసుకుంటున్నారు. అయినా సరే నాకొచ్చే పాత్రలు నాకొచ్చాయి. నేను రంగు నుంచి స్వేచ్ఛ పొందాను. మనకు ప్రతిభ ఉంటే రూపం అడ్డు నిలవదు. ఆధునికత అంటే ఎదుటివారిని ఎలా చూస్తున్నావు, ఎలా అర్థం చేసుకుంటున్నావు అనే సంస్కారం పెరగడమే. అలాగే ఈ కాలపు కుర్రకారు మాటలు అప్పుడప్పుడు చెవిన పడుతుంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి మాటలో బూతులు మాట్లాడుతున్నారు. ఇది ఆధునికత అయితే నాకు గతకాలమే మేలు అనిపిస్తుంది. కాసింత మర్యాద, గౌరవం, పద్ధతీ పాడూ వద్దా ఈ కాలం పిల్లలకు?’ అని ముగించారామె.(చదవండి: స్టుపిడ్ కాదు సూపర్ కపుల్! ఆ జంట లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..) -
స్టుపిడ్ కాదు సూపర్ కపుల్!
మాది ‘జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్’ అంటారు కావ్య, సంగీత్ దంపతులు. ఈ మాట చాలామందికి కొత్త, వింత. కొందరైతే ‘ఈ దంపతులకు మతి చెడింది’ అని గుసగుసగా అనుకొని ‘స్టుపిడ్ కపుల్’ అని నామకరణం చేశారు. అయితే కావ్య, సంగీత్ల జీవనశైలిని వివరంగా తెలుసుకున్నాక మాత్రం వారిని అభినందించకుండా ఉండలేకపోయారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలనుకున్నారు. ఇంతకీ ఏమిటీ జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్? కావ్య, సంగీత్ దంపతులు కట్టుకున్న ఇంటి పేరు... జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్! ఇది ఇంటిపేరు మాత్రమే కాదు...వారి ఆదర్శవంతమైన జీవనశైలిని సూచించే పేరు. స్వయం సమృద్ధిగా తమ ఇంటిని తీర్చిదిద్దుకున్నారు. కూరగాయలు తామే పండించుకుంటారు. కొలనులో చేపలు పెంచుతున్నారు. గుడ్ల నుంచి పాలు, తేనె వరకు బయటికి వెళ్లాల్సిన అవసరమే వారికి ఉండదు. ‘వ్యర్థం నుంచి ఇంధనం’ అనే కాన్సెప్ట్లో భాగంగా బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక గదిలో ప్రత్యేకంగా పుట్టగొడుగులు పెంచుతున్నారు. కూరగాయలు, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు....మొదలైన వాటి అమ్మకం ద్వారా ఎంతో కొంత డబ్బు కూడా సంనాదిస్తున్నారు. ‘హోమ్ విత్ జీరో కాస్ట్ ఆఫ్ లివింగ్’ కాప్షన్తో కావ్య, సంగీత్ దంపతులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. 33 లక్షల లైక్లు, 19,000 కామెంట్స్, 33 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Sangeeth & Kavya | 4x4 Overlanding | Lifestyle (@lifeonroads__) (చదవండి: ఒకప్పుడు... ఎటు చూసినా చెత్తే ఇప్పుడు... ఎటు చూసినా పచ్చదనమే!) -
ఒకప్పుడు... ఎటు చూసినా చెత్తే ఇప్పుడు... ఎటు చూసినా పచ్చదనమే!
ఒకప్పుడు యూపీలోని నోయిడాలో డంపింగ్ గ్రౌండ్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇన్నీ అన్నీ కావు. అపరిశుభ్రత రాజ్యమేలే ఆ ప్రదేశాల సమీపంలో నడవాలంటే దుర్వాసన భరించడం కష్టంగా ఉండేది. చెత్తపడేసేవాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు ఎప్పుడూ ఏవో తగాదాలు జరుగుతూనే ఉండేవి. ఈ పరిస్థితిలో సమూలంగా మార్పు తీసుకురావడానికి సేఫ్ (సోషల్ యాక్షన్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్) అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సమూల మార్పు తీసుకువచ్చాడు విక్రాంత్ టోంగాడ్. ‘ఈ స్థలం ఇక ఎందుకు పనికి రాదు’ అనుకున్న స్థలాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేశాడు. దీనికి ముందు ఘజియాబాద్లో వ్యర్థాలు పడేసే ప్రదేశాలను ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా మార్చాడు. స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యం, సీఎస్ఆర్(కార్పోరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండింగ్తో చెత్త వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనుకున్న పది ఎకరాల స్థలంలో వ్యర్థాలు లేకుండా చేశాడు. వందల కిలోల ప్లాస్టిక్ను రీసైకిల్కు ఉపయోగించాడు. ప్లాస్టిక్ బెంచీలు తయారుచేయించాడు. మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. రెండు మూడు సంవత్సరాల వ్వవధిలో ఎక్కువ చెట్లు పెంచేలా జపనీస్ ‘మియావాకీ మెథడ్’ను అనుసరించాడు. ‘ఒక్కడే కష్టపడుతున్నాడు’ అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు విక్రాంత్ పరిస్థితి. అయితే స్థానికులు అతడికి తోడయ్యారు. దీంతో విక్రాంత్ పని సులువు అయింది. ఒకప్పుడు ‘ఎటు చూసినా చెత్తే’ అన్నట్లుగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు ‘ఎటు చూసినా పచ్చదనమే’ అన్నట్లు మారాయి. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) (చదవండి: ఈ పక్షుల విడాకుల గురించి ముందే తెలిసిపోతుంది!) -
మగ్గం వెనుక ఆమె శ్రమ
చేనేత రంగంలో 70 శాతం శ్రమ మహిళలదే. బ్లీచ్ చేయడం, ఆసుపోయడం, డిజైన్ కట్టడం, రంగులద్దడం, ఆసు మిషన్ మీద దారాలను అమర్చడం, చిటికి కట్టడం, కండె చుట్టడంతోపాటు వార్ప్ వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. మగ్గం మీద నేత ప్రధానంగా మగవాళ్లు చేస్తారు. ఆసక్తి ఉన్న మహిళలు కూడా నేస్తారు. మహిళ సహాయం లేనిదే మగ్గం మనుగడ సాగదు. నేతకారులకు సహాయకులుగా, స్వయంగా నేతకారులుగా, డిజైనర్లుగా, బిజినెస్ విమెన్, కమ్యూనిటీ లీడర్లుగా కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇది స్కిన్ ఫ్రెండ్లీసంప్రదాయ చేనేతను మోడరన్ బిజినెస్గా మారుస్తూ చేనేతరంగానికి దోహదం చేస్తున్న మహిళల్లో స్వాతి మఠం ఒకరు. ఐఐటీ బాంబేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డెలాయిట్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగం చేసిన స్వాతి ప్రస్తుతం చేనేతరంగంలో కెరీర్ను విజయవంతం చేసుకున్నారు. తన పాపాయికి ఒంటికి మెత్తగా ఉండే దుస్తులు కావాలి, వాటికి ఫంక్షన్ లుక్ ఉండాలి, బ్రైట్గా కలర్ఫుల్గా ఉండాలి. ఎన్ని షాపులు తిరిగినా ఈ లక్షణాలన్నీ ఒక డ్రస్లో దొరకకపోవడంతో సొంతంగా నారాయణపేట్ మెటీరియల్తో స్వయంగా డిజైన్ చేశారామె. ఆ ప్రయత్నమే ఆమెను ఎంటర్ప్రెన్యూర్ను చేసింది. హ్యాండ్లూమ్ ప్రమోటర్గా గుర్తింపునిచ్చింది. చేనేత వస్త్రాలను ఫ్యాషనబుల్ డిజైనర్వేర్గా తీర్చిదిద్దడం ఆమె ప్రత్యేకత. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన కొత్తతరం యువతులు ఆమెతో పని చేస్తున్నారు. క్రియేటివ్ డిజైన్కు చేనేతను మించిన ఫ్యాబ్రిక్ మరొకటి ఉండదని చెబుతున్నారీ యువతులు. శ్రీకాళహస్తి కలంకారీ పనితనాన్ని ప్రపంచదేశాలకు విస్తరింపచేస్తున్నారు వాళ్లు. మిస్ ఇండియా పోటీలకు హైదరాబాద్కు వచ్చిన బ్యూటీ పాజంట్లకు చేనేత డ్రెస్లు డిజైన్ చేశారు.మన చేనేతకు ప్రశంసలుఏడేళ్ల కిందట హైదరాబాద్లో డిజైనర్ వేర్ యూనిట్ను ముగ్గురితో ప్రారంభించాను. కొన్నాళ్లకు దానికి సిస్టర్ ఆర్గనైజేషన్గా చేనేతలతో క్యాజువల్ వేర్ యూనిట్ ప్రారంభించాను. ఇప్పుడు 90 మందికి జీతాలిస్తున్నాను. ఒకప్పుడు చేనేత అంటే చిన్నచూపు ఉండేది, కానీ ఇప్పుడు చేనేత దుస్తులు ధరించడానికి సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. రెండు యూనిట్స్కి అవసరమైన రా మెటీరియల్ కోసం నెలకు ఆరేడు లక్షల రూపాయలు చేనేతకారులకు ఇస్తున్నాం. చేనేతను విశ్వవ్యాప్తం చేయడంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది.– స్వాతి మఠం, హ్యాండ్లూమ్ ప్రమోటర్మగ్గం ఇంజనీరింగ్ అద్భుతంమగ్గంతో ఇంద్రధనస్సులాంటి రంగుల జీవితాన్ని ఎంచుకున్న వాళ్లలో తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లికి చెందిన నవనీత ఒకరు. ఆమె తొలిసారి మగ్గాన్ని చూసింది అత్తవారింట్లో. మగ్గం వెనుక హిడెన్ ఇంజనీరింగ్ ఉంది. పాదంతో తొక్కితే ఒక కదలికకు అనుబంధంగా ఆరు చోట్ల కదులుతూ దారం వస్త్రంగా రూపుదిద్దుకుంటుంది. ఆసక్తిగా అనిపించి భర్త దగ్గర నేత పని నేర్చుకున్నారామె. గత తరం మహిళలు ఇంటి నాలుగ్గోడల మధ్య సహాయకపనులకే పరిమితమయ్యారు. ఈ తరం నేతకార మహిళలు వస్త్రాలను వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాలో మార్కెట్ చేస్తున్నారు. రీటైలర్స్, బొటిక్ నిర్వహకులతో సమన్వయం చేసుకుంటున్నారు. చీర మగ్గం మీద ఉండగానే ఫొటోలు అప్లోడ్ చేయడంతో చీర పూర్తయ్యేలోపు కొనేవాళ్లు సిద్ధంగా ఉంటున్నారు.బ్యూటీ పాజంట్స్కు దుపట్టా‘‘వియ్హబ్లో సభ్యత్వం తీసుకోవడంతో నా ఉత్పత్తులకు మంచి కూడలి లభించింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన బ్యూటీ పాజంట్లకు బహూకరించడానికి పాతిక ఇకత్ దుపట్టాలిచ్చాను. ప్రభుత్వం ఈ కళను ఒక కోర్సుగా రూ΄÷ందించి కొత్తతరం చేనేతకారులకు శిక్షణనిస్తే ఈ కళను మరింత సమగ్రంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా మామయ్యకు తెలిసిన కళలో నా భర్త నేర్చుకున్నది సగమే. తరానికీ తరానికీ జ్ఞానం లుప్తమై పోకుండా మరింతగా విస్తరింపచేయాలి.’’ – నవనీత, వీవర్స్ క్లబ్ హ్యాండ్లూమ్స్అత్త నేర్పించిందితెలంగాణ, నారాయణపేట జిల్లా పుల్లంపల్లికి చెందిన శృతిక... తన అత్తగారి దగ్గర మగ్గం పని నేర్చుకున్నారు. గతంలో చేనేత ఏ మాత్రం గిట్టుబాటు అయ్యేది కాదు. చేనేతను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తర్వాత పరిస్థితులు మెరుగయ్యాయి. ఆన్లైన్ క్లాసులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లతో చేనేతకారులు మెళకువలు నేర్చుకుంటున్నారు. చీరల దగ్గరే ఆగిపోకుండా చుడీదార్, లంగాఓణీ సెట్లు డిజైన్ చేస్తున్నారు.నెలకు 30 వేలుచేనేతను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఎగ్జిబిషన్లను నిర్వహిస్తోంది. మహిళాశక్తి బజార్ మాకు ఉపయోగంగా ఉంది. ఎగ్జిబిషన్లో స్టాల్, బస ఉచితం. నేను ఢిల్లీ, కోల్కతా, ముంబయిలో కూడా స్టాల్ పెట్టాను. ఇల్లు దాటి బయటకు రావడం చేతకాని మాలాంటి వాళ్లకు ఈ సౌకర్యాలు బాగా ఉపయోగపడుతున్నాయి. మంచి చీర నేస్తే మాకు పదివేలు మిగులుతాయి. గట్టిగా పని చేస్తే నెలకు మూడు చీరలు నేయవచ్చు. సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతున్నాం. మాకు పని కల్పించడం కోసం... ప్రభుత్వం ప్రముఖులకు సత్కారం చేసే శాలువాల ఆర్డర్లు కూడా భారీగానే ఇస్తోంది.– శృతిక, చేనేతకారిణి, శ్రీ భక్త మార్కండేయ టెక్స్టైల్స్– వాకా మంజులారెడ్డి -
గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...
దేశంలో పర్యాటకుల్ని అత్యధిక సంఖ్యలో ఆకర్షించే రాష్ట్రం గోవా...అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పర్యాటకులను కూడా ఇక్కడ బీచ్లను సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహరాజ పోషకులుగా ఉన్నారు. అంతేకాదు గోవాలో క్యాసినోలు సహా అనేక వ్యాపారాలు నడిపేవారిలోనూ తెలుగువారి వాటా పెద్దదే. దాంతో గోవా కు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగు వారు కూడా తప్పక తెలుసుకుని గుర్తుంచోవాల్సిన విషయంగా మారింది.మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రం పర్యాటక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది. ఈ తరహాలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది. దీని కోసం గోవా బయోడిగ్రేడబుల్ చెత్త (నియంత్రణ) చట్టం, 1996 కు సవరణను చేసింది. నదులు, సరస్సులు కాలువలు వంటి సున్నితమైన నీటి వనరులతో సహా ప్రభుత్వ ప్రైవేట్ ప్రదేశాలలో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం, చెత్తను వేస్తూ పట్టుబడిన వ్యక్తులు మొదటి నేరానికి రూ. 200 నుంచి ప్రారంభమయ్యే జరిమానా తదుపరి ఉల్లంఘనలకు పెంచుకుంటూ పోతారు. అలా అలా ఏకంగా రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను పర్యవేక్షించడానికి అక్రమ డంపింగ్లో పాల్గొన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకి అధికారం ఇస్తుంది. సవరించిన చట్టం ప్రకారం బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాలను కాలువలు, వెంట్లు, మురుగు కాలువలు, క్వారీ షాఫ్ట్లు లేదా పర్యావరణాన్ని కలుషితం చేసే లేదా మురుగునీటి వ్యవస్థలకు ఆటంకం కలిగించే ప్రదేశాలలో వేయడం నిషేధం.చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి తెలియజేయడానికి స్థానిక సంస్థలు ఇప్పుడు బాధ్యత వహిస్తాయి. ఆస్తి యజమానులు, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు బ్రాండ్ యజమానులతో సహా అందరూ అధీకృత వ్యర్థాల ఏజెన్సీలను ఉపయోగించి వారి ప్రాంగణాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సరైన రీతిలో నిర్మూలించాలి. బల్క్ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, సేకరించేవారు, రీసైక్లర్లు కో–ప్రాసెసర్లు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి గెజిట్–నోటిఫైడ్ విధానాల ప్రకారం అధికారాన్ని పొందాలి.రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు ఇది. సరైన అనుమతలు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయమని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రాంతాలలో మద్యం సేవించడం లేదా రోడ్లపై, బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాలలో వంట చేయడం, చెత్త వేయడం, నియమించబడని మండలాల నుంచి వాటర్ స్పోర్ట్స్ లేదా టిక్కెట్ల అమ్మకాలు నిర్వహించడం, అనధికార హాకింగ్, భిక్షాటన చేయడం లేదా బీచ్లలో వాహనాలను నడపడం రాష్ట్రం వెలుపలి ప్రదేశాలకు అనుమతి లేకుండా పర్యాటక సేవలను విక్రయించడం వంటి పలు నిషేధిత అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వినోదం కోసమో, వ్యాపారం కోసమో..గోవాకు ఏ కారణంతో వెళ్లేవారైనా తాజా నిబంధనల గురించి అవగాహన పెంచుకుని వెళ్లడం బెటర్. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు..సో బహుపరాక్..(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..) -
ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్
ఒంటరితనంతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో మంచి సత్సంబంధాలు నెరపలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు కొందరు. అలాగని మనం చొరవగా ఉన్నా.. మన సన్నిహితులు మనతో ఎంజాయ్ చేయలేనంత బిజిబిజీ పనులతో సతమతమవుతుంటారు. దాంతో తెలియని ఒంటిరితనం ఆవరిస్తుంటుంది. అది ఒక్కోసారి డిప్రెషన్కి దారితీస్తుంది కూడా. దానికి సరైన మందు రిటైల్ ధెరపీ అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. అసలేంటి థెరపీ..?, ఎలా పనిచేస్తుందంటే..ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలతో మంచి సక్సెస్ని అందుకున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. ఆయన కాస్ట్యూం డిజైనర్, రచయితగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్తో ప్రేక్షఖులను అలరించి ఎన్నో అవార్డులను అందుకున్నారుడా. అంతటి విజయాన్ని అందుకుని కూడా ఒక్కోసారి దారుణమైన ఒంటరితనం అనే సమస్యను ఫేస్ చేస్తుంటారట కరణ్. స్వయంగా ఆ విషయాన్ని సోల్ సఫర్ విత్ భావ్ అనే పాడ్కాస్ట్ సంభాషణలో కరణ్ వెల్లడించారు. తాను కూడా భావోద్వేగా సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా ఫీలవుతుంటానని అన్నారు. దాన్ని అధిగమించేందుకు షాపింగ్ చేస్తుంటానని అన్నారు. దీన్ని రిటైల్ థెరపీ అంటారని చెప్పారు కరణ్. సక్సెస్ అందుకుంటే ఆనందం వస్తుందని చాలామంంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు, విచారం, ఒంటరితనం ఆవరించినప్పుడూ ధెర్యంగా నిలబడి ఎదర్కొన్నప్పుడూ కలిగే ఆనందమే వేరెలెవల్ అని అంటున్నారు కరణ్. ఈ విచారం, ఒంటిరితనానికి తాను రిటైల్ ధెరపీతో చెక్పెడతాని అన్నారు. ఆ థెరపీలో భాగంగా ఆయన షాపింగ్ చేస్తుంటారట. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసేందుకు షాపింగ్ చేస్తుంటానని చెప్పారు. నా భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా షాపింగ్ పేరుతో వస్తువును కొని ఆ వ్యాధిని అధిగమిస్తానని అన్నారు. కొనుగోలు చేస్తున్నప్పుడూ ఎంత ఖరీదు వస్తువు కొంటున్నామనే దానిపై ధ్యాస..ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై అటెన్షన్తో ఈ ఒత్తిడి, విచారం, ఒంటరితననాన్ని తెలియకుండానే దూరం చేసుకుంటామని చెబుతున్నారు కరణ్. View this post on Instagram A post shared by Soul Safar with Bhaav (@soulsafarwithbhaav) మంచిగానే పనిచేస్తుందా..?రిటైల్ థెరపీ అంటే..నిరాశనిస్ప్రుహలకు లోనైనప్పుడూ లేదా ఒత్తిడికి గురైనప్పుడు షాపింగ్ చేయడాన్ని రిటైల్ థెరపీ అంటారట. మానసిక స్థితిని పెంచేలా వస్తువులు కొనుగోలు చేయడమే రిటైల్ థెరపీ అట. అధ్యయనాలు కూడా మానసిక స్థితిని మెరుగ్గా ఉంచాడానికి ఇది సరైన థెరపీగా పేర్కొన్నాయి. నిజానికి ఇది తాత్కాలిక పరిష్కారం కాకపోయినా..అప్పటికప్పుడూ ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేసేందుకు షాపింగ్ని ఉపయోగిస్తే..ఆటోమెటిగ్గా మానసికంగా మెరుగ్గా ఉండే వీలు ఏర్పడుతుందట. వ్యక్తిగతంగా ఈ థెరపీ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని ఎదుర్కొనేలా సహాయపడకపోయినా.. మన మానసిక స్థితి అప్పటికప్పుడూ సవ్యంగా సాధారణ స్థితికి తీసుకువస్తుందట. ఇది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల ప్రొఫెషనల్ థెరపీ మాత్రం కాదట. కేవలం ఆ సమయంలో మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలకు చెక్పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చేసే రెడీమేడ్ పరిష్కారంగా ఈ రిటైల్ థెరపీని పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
ట్రావెల్ థెరపీ.. ఒంటికి ఆరోగ్యం.. మనసుకు ఉత్సాహం..
ఒంట్లో బాలేనపుడు.. మనసుకు ముసురు పట్టినపుడు డాక్టర్లు రకరకాల చికిత్స విధానాలు చెబుతుంటారు.. వాటర్ థెరపీ.. ఫిజియోథెరఫీ. .. ఆయిల్ పుల్లింగ్ .. మడ్ బాత్.. ఇవన్నీ ఒకలాంటి థెరఫీలే.. ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా.. ప్రాణాయామం.. ఇలా రకరాలకు ఉంటాయి మరి.. ఎవరివీలును బట్టి వాళ్ళు ఆయా చికిత్సా విధానాలు పాటిస్తారు.. ఇయన్నీ ఒకెత్తు..ఒక్కోసారి.. మనసుకు ముసురుపడుతుంది.. ఎదురుగా ఏముందో కనిపించదు.. ఏం జరుగుతుందో వినిపించదు.. ఒక్కోసారి జీవితం చాన్నాళ్లుగా మూత విప్పని పచ్చడి బాటిల్ మాదిరి నిల్వ వాసన వస్తుంది.. కరకరలాడాల్సిన బిస్కెట్లు మెత్తబడినట్లు ఫీల్. .. జీవితం అంటే ఉద్యోగం.. వ్యాపారం.. తిండి.. నిద్ర.. అంతే ఉంటుంది.. ఎందుకు బతుకుతున్నామో తెలియదు.. అసలిది ఒక బతుకేనా అనే సందేహం.. జీవితం అనే బండి మనం నడుపుతున్నట్లు వెళ్తుందా.. ఆటో మోడ్ లో పెట్టేస్తే అది తనకు నచ్చినట్లు వెళ్తుందా అనే సందేహం కూడా వస్తుంది. అలాంటపుడు పైన చెప్పిన అన్ని థెరఫీలకన్నా ఈ ట్రావెల్ థెరపీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. దీనికి ఏ డాక్టర్ అక్కర్లేదు.. మనమే ప్రాక్టీస్ చేయొచ్చు.. లేదా తోడుగా ఎవరైనా ఉంటే మంచిదే.. ఇదెలా ప్రాక్టీస్ చేయాలి... అన్ని రకాల చికిత్సా విధానాల మాదిరిగానే ఈ ట్రావెల్ థెరపీ కూడా ప్రత్యేకంగా మనసుకు ప్రత్యేకం. .. ముసురుపట్టిన మనసుకు దుమ్ము వదిలిస్తుంది... మసకబారిన కళ్ళకు స్పష్టత ఇస్తుంది.. శరీరానికి ఉత్సాహాన్ని.. కిక్కును ఇస్తుంది.. ఇది సాధన చేయడం కూడా సులువే... పెద్దగా ఏం లేదు.. ముందుగా ఏదో ఒక ఊరు.. ఒక లోకేష్ సెలెక్ట్ చేసుకుని ట్రైన్/ బస్సు/ ఫ్లయిట్ టిక్కెట్లు తీసుకుని ఒక జబ్బ సంచిలో రెండు మూడు జతల బట్టలు.. గట్రా గట్రా కుక్కుకుని వెళ్లిపోవడమే. ట్రైన్ వేగంగా ముందుకు దూసుకువెళ్తుంటే మన సమస్యలు.. చికాకులు అదే వేగంతో వెనక్కి వెళ్లిపోతున్నా ఫీలింగ్. .. కో ప్యాసింజర్లను ..వారి నడవడిక.. తీరు .. చూస్తుంటే ఏదో కొత్త విషయం చూస్తున్న భావన... సరికొత్త ప్రదేశాలు చూస్తుంటే ఏదో నేర్చుకుంటున్న ఫీల్.. చిన్నపుడు జాగ్రఫీలో విన్న పేరున్న ఊరికి వెళ్తే అబ్బా నేనూ ఒక సాహసికుడినే అన్న కించిత్ గర్వం.. సోషల్ పుస్తకంలో చదివిన నదిలో మునకేస్తే వయసు హఠాత్తుగా పాతికేళ్ళు తగ్గిపోవడం తథ్యం.హిస్టరీ మాష్టర్ చెప్పిన చారిత్రక కట్టడాన్ని నేరుగా చూస్తే దాన్ని మనమే కట్టినంత సంబరం... లోకంలో మన ఊరే కాదు.. చాలా ఊళ్ళున్నాయి.. మన చుట్టూరా ఉన్న జనాలే కాదు చాలా మంది ఉన్నారు.. ఈ విషయం నేను కొత్తగా కనిపెట్టాను అనే భావన.. పఠనం.. పయనం .. ఈ రెండూ మనసుకు ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయి.. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ రెండూ మానొద్దు.. డబ్బుల్లేవని చికిత్స మానేయలేం.. డబ్బుల్లేవని ఆస్పత్రికి వెళ్లడం ఆపలేం.. సెలవుల్లేవని చికిత్సను ఆపలేం.. అలాగే డబ్బుల్లేవని ప్రయాణాలు కూడా మానొద్దు.. అప్పుచేసైనా ఆస్పత్రికి ఎలా వెళ్తామో ప్రయాణానికి కూడా వెళ్లాల్సి.. నేను బిజీ అనే భ్రమల్లోంచి రావాలి. .. సెలవుల్లేవు .. నేను బిజీ అనే ఆలోచనలలైన్లను డిలీట్ చేయాలి.. మిత్రులను కలవడం.. వారితో కబుర్లు..ముచ్చట్లు.. ఇవన్నీ మనసుకు ఔషధాలే .. కాదనలేని సత్యంసైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మరి అన్ని వైద్యవిధానాలకు ఉన్నట్లే ఈ ట్రావెల్ థెరఫీకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.. కాకుంటే అవి మన శరీరం నుంచి కాకుండా మన సైడ్ ఉన్న బంధుమిత్రుల నుంచి వస్తాయి.. వీడికి ఇల్లు సంసారం తిన్నగా ఉండదు.. పైగా చేతిలో అప్పులున్నాయి కానీ షికార్లకు లోటుండదురా ... అబ్బా వీడికి మూణ్నెళ్లకు ఒక టూర్ ఉండాల్సిందే... వీడికి తడి తక్కువ.. తమాషా ఎక్కువ.. మమ్మల్ని తీసుకెళ్లచ్చుగా .. ఏదైనా నీలాగా బతకడం కష్టం మామా.. ఇలా రకరకాల కామెంట్ల రూపంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి .. అలాగని మన పయనం ఆగొద్దు.. ఎవరికీ సమాధానం చెప్పొద్దు.. మెడిసిన్ కూడా అంతేగా... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదాని మందులు మానేయలేం.. అలాగే మనసుకు థెరఫీ కావాలంటే ప్రయాణాలు చేయాలి.. కాస్త డబ్బుల పరిస్థితి చూసుకుని తరచూ చిన్నదో పెద్దదో టూర్ వేస్తుండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. కొప్పెర గాంధీ ట్రావెల్ థెరఫిస్ట్ -
నో ఫోన్ అవర్..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నో ఫోన్ అవర్’ అనే సరికొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. నో ఫోన్ అవర్ ఒక సాధారణ ప్రచారం మాత్రమే కాదు.. నేటి అధునాతన జీవనశైలిలో స్వేచ్ఛను అన్వేషించుకునే ఆత్మీయ పిలుపు అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ హోం అప్లయన్స్ బ్రాండ్ కెన్స్టార్ ఆధ్వర్యంలో ఈ ‘నో ఫోన్ అవర్’లో భాగంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆ సమయాన్ని గడపాలని పిలుపునిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి, నిజమైన ఆనందాన్ని, అనుబంధాన్ని మళ్లీ ఆస్వాదించేలా కెన్స్టార్ ఆహ్వానిస్తోంది. కెన్స్టార్ సీఈఓ సునిల్ జైన్ మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరులుగా మన మూలాలను గుర్తుచేసుకుంటూ, ముఖ్యమైన వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. ఈ డిజిటల్ యుగంలో మనకు వేలాది ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నా, మనుషులతో కలిసుండాలన్న కోరిక ఇంకా బతికే ఉంది. ‘నో ఫోన్ అవర్’ ఆ కోరికను తీర్చగలిగే సరికొత్త ప్రయత్నమని తెలిపారు. ఈ అనుభవాలను సోషల్ మీడియాలో # NoPhoneHour హ్యాష్ట్యాగ్తో కథలు, వీడియోలు, ఆడియో సందేశాల రూపంలో పంచుకోవాలని పేర్కొన్నారు. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ' : నటి లిసా రే
‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్ ఆఫ్ లిసా రే’ పేరిట బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటరాక్టివ్ సెషన్ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు. మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు. రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..) -
సై అంటూ సత్తా చాటుతూ..!
డబ్బులు పొదుపు చేయడం, రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు గ్రామీణ మహిళా సంఘాలు. పెట్రోల్ బంక్ల నిర్వాహణ నుంచి ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని నడపడం వరకు తమ సత్తా చాటుతున్నారు. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు.’పెట్రోల్ బంక్’ అనగానే ‘పురుషులు మాత్రమే’ అన్నట్లుగా ఒక చిత్రం మదిలో ముద్రితమై ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మార్చేస్తున్నారు గ్రామీణ మహిళలు. ‘మేము సైతం’ అంటూ పెట్రోల్బంక్ల నిర్వాహణలో సత్తా చాటుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా’ గ్రామైక్య సంఘం మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకు వచ్చారు.రాష్ట్రంలోనే మూడోది...మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల బంక్ ఇటీవల నారాయణపేట జిల్లాలో మొదటిసారి ్ర΄ారంభమైంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. రాష్ట్రంలో మూడో పెట్రోల్ బంక్ లింగన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ్ర΄ారంభమైంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో గ్రామైక్య సంఘానికి నెలవారీ స్థిర ఆదాయం లభించనుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాలుసిరిసిల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సంఘాలు పొదుపు చేయడం, రుణాలు పొందడానికే పరిమితం కాకూడదని జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా భావించారు. ‘ఇందిరా క్రాంతి’ పథం ద్వారా మహిళా సంఘాలకు ఆరు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. 192 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించగా 20లక్షల 25వేల 252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి శభాష్ అనిపించుకున్నారు. రూ.6.80 కోట్ల ధాన్యం కమీష¯Œ ను సాధించారు.రైతుల ముంగిట్లోకి ఎరువులువానకాలం సాగులో రైతుల ముంగింట్లోకే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మహిళలకు ఎరువుల దుకాణాలను అప్పగించారు. ఇలా 23 కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ప్రారంభించారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున ఎరువుల దుకాణాలను మహిళా సంఘాలకు అప్పగించారు.అద్దెకు ఆర్టీసీ బస్సులుమహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీకి సిరిసిల్ల జిల్లా నుంచి తొమ్మిది బస్సులను అందించారు. 9 మండలాల సమాఖ్యల ద్వారా రూ.6 లక్షల వాటా ధనంతో రూ.30 లక్షలతో ఒక్కో ఆర్టీసీ బస్సును మహిళలు అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల క్రితం మొదలైన అద్దె బస్సులతో ప్రతి నెల రూ. 50వేల అద్దెను తొమ్మిది సమాఖ్యలు పొందుతున్నాయి.ఇక సోలార్ పవర్పెట్రోల్ బంక్లే కాదు సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ముష్టిపల్లి, ధర్మారంలో భూసేకరణ పూర్తిచేయగా, జిల్లా సమాఖ్య ద్వారా రూ.3కోట్ల పెట్టుబడితో సోలార్ ΄్లాంట్లను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. – అవధూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్లఉపాధి పొందుతున్నాంమేము నాలుగు నెలల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశాం. మా వీవోకు రూ.4.29లక్షల కమిషన్ వచ్చింది. పదిమందికి పని లభించింది. ‘కుట్టు’తో స్వశక్తి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గత ఏడాదిగా స్వశక్తి మహిళలు జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. మా ఊళ్లో కూడా యూనిఫామ్స్ కుడుతున్నాం. ఇప్పుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాం.– పందిర్ల సునీత, ఆవునూర్ఎంతో గర్వంగా ఉందిపెట్రోల్ బ్యాంక్ల నిర్వహణ అనేది మా సంఘానికి సంబంధించి పెద్ద మలుపు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మేము గృహిణులుగా ఇంటికే పరిమితమయ్యాం. పెట్రోల్ బంక్ నిర్వహణను సవాల్గా తీసుకొని విజయవంతంగా కొనసాగిస్తామనే ధీమాతో ఉన్నాం. – సుభద్ర, అధ్యక్షురాలు, శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం, లింగన్నపేటమహిళా శక్తిని చాటారుఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాలు, ఆర్టీసీ బస్సులు ్ర΄ారంభించాం. త్వరలో రైస్మిల్లులు, సోలార్ ΄్లాంట్లను మహిళలకు అందజేస్తాం. – సందీప్కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ -
ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..
మా తల్లిదండ్రుల నలుగురు సంతానంలో నేను మూడవ వాడిని. వారు కొనుగోలు చేసిన ఆస్తులను మా నలుగురి పేరిట పెడుతూ వచ్చారు. మా అన్నయ్య ఒకరు దాదాపు 15 ఏళ్ల క్రితం, అతనికి 19 ఏళ్ళ వయసులో కనపడకుండా పోయారు. ఆయనకి మతిస్థిమితం లేదు. అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. మా అన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తులు పలు జిల్లాలలో ఉన్నాయి. అందులో నుంచి వచ్చే ఆదాయాన్ని మా అమ్మగారు తీసుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మా తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ మిగిలిన ముగ్గురికి ఇవ్వాలని మా అమ్మగారు అనుకుంటున్నారు. కానీ కనపడకుండా పోయిన మా అన్నయ్య ఆస్తులను మాత్రం తన జీవితకాలం మొత్తం ఇవ్వను అంటున్నారు. ఒకవేళ తన పెద్ద కొడుకు తిరిగి వస్తే అతనికే చెందేలా చేస్తాను అంటున్నారు. ఆ ఆస్తుల్లో మాకు భాగం వుండదా?– గౌతం, హైదరాబాద్ మీ అమ్మానాన్నల పేరుతో ఉండే ఆస్తులు వారు ఎవరికి కావాలంటే వారికి... ఏ ప్రాతిపదికన.. ఎంత ఇవ్వాలనేది వారి నిర్ణయం మాత్రమే! కనబడకుండా పోయిన మీ అన్నయ్య ఆస్తి కూడా మీ అమ్మానాన్నలు కలిసి సంపాదించారు అని చెప్తున్నారు కాబట్టి అందులో మీకు ఎటువంటి వాటా ఉండదు. ఏది ఏమైనా, కనపడకుండాపోయిన ఒక వ్యక్తి ఆస్తి తన ఫస్ట్ క్లాస్ లీగల్ హేర్ (అంటే, తన భార్య, సంతానం, తల్లి గారు)కు మాత్రమే ఉంటుంది. మీ కేసులో, కనపడకుండా పోయిన తన కొడుకు ఆస్తిపై కేవలం మీ తల్లి గారికి మాత్రమే హక్కు ఉంది. ఒక వ్యక్తి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కనపడకపోతే, భారతీయ సాక్ష్య అథినయం సెక్షన్ 111 (పూర్వం సెక్షన్ 108, ఇండియన్ ఎవిడెయాక్ట్) ప్రకారం చట్టం ఆ వ్యక్తిని ‘‘చట్టపరంగా మరణించిన వ్యక్తి’’గా పరిగణిస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులు ఎలాగైతే పంచుతారో అలాగే ఈ ఆస్తులను కూడా పంచవలసి ఉంటుంది. మీ తల్లిగారు బతికే ఉన్నారు కాబట్టి, తప్పిపోయిన అన్నయ్యకు పెళ్లి కాలేదు కాబట్టి, అలాగే ఆ ఆస్తి పూర్వీకుల నుంచి సంక్రమించినది కాదు కాబట్టి, ఆ ఆస్తి మీద పూర్తి హక్కు మీ అమ్మగారికి మాత్రమే ఉంటుంది. ముందుగా ఏదో ఒక ఆస్తి ఉన్న పరిధిలోని సివిల్ కోర్టును ఆశ్రయించి, కనబడకుండాపోయిన తన కొడుకును చట్టపరంగా మరణించిన (సివిల్ డెత్) వ్యక్తిగా పరిగణించాలి అని కోరుతూ, తన ఆస్తులు అన్నిటికీ కూడా తల్లిగారు మాత్రమే వారసురాలు అని కేసు నమోదు చేయాలి. సివిల్ కోర్టు నుంచి డిక్రీ పొందిన తర్వాత ఆ ఆస్తులను తన పేరుకు మార్చుకొని, తనకు కావలసిన సమయంలో లేదా ఒక వీలునామా ద్వారా ఆ ఆస్తులను ఎవరికి ఎలా పంచాలి అనే అంశంపై తన ఇష్టపూర్వక నిర్ణయం తీసుకోవచ్చు. (చదవండి: మూడు నెలల్లో పదికిలోలు తగ్గి..మెడిసిన్ వాడకుండానే డయాబెటీస్ క్యూర్!) -
బరువు తగ్గి.. డయాబెటిస్ నుంచి బయటపడింది..!
బరువు తగ్గించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని పలువురు నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలో చాలామంది బరువుతగ్గే ప్రయత్నానికి పూనుకుంటున్నారు కూడా. అయితే ఈ మహిళ మాత్రం తన అధిక బరువుని తగ్గించుకోవడమే ఆమెకు వరంగా మారింది. జస్ట్ 90 రోజుల్లో మధుమేహ సమస్యకు చెక్పెట్టి ఔరా అనిపించుకుంది. మరి ఇంతకీ ఇదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.40 ఏళ్ల నార్మా లియోన్స్కు, అధిక బరువుతో ఉండటంతో ఆమె రూపు రేఖలన్నీ బొద్దుగా ఉండేవి. దీంతో అధిక ఒత్తిడికి గురై డయాబెటిస్ బారిన పడింది. తరుచుగా తన ఆహార్యాన్ని చూసుకుని కుంగిపోతూ ఉండేది. దాంతో ఆమె ఈ దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం కోసం బరువు తగ్గాల్సిందే అని ఫిక్స్ అయ్యింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన నార్మాలియోన్స్కు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల నడుమ తనపై ఫోకస్ పెట్టడం కుదురేది కాదు. ఆ నిర్లక్ష్యంగా కారణంగానే నార్మాలియోన్స్ అధిక బరువు సమస్యలను ఎదుర్కొందామె. దాంతో ఆమె తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టి బరువు తగ్గాలని పట్టుదలతో ప్రయత్నించింది. అలా ఆ తల్లి కేవలం 90 రోజుల్లో..డైట్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తన బరువులో గణనీయమైన మార్పలను అందుకుంది నార్మాలియోన్స్. ఫలితంగాఆ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చేశాయి. ఎలాంటి మెడిసిన్ వాడకుండానే డయాబెటిస్ నుంచి బయటపడింది నార్మాలియోస్. దాదాపు రెండు దశాబ్దల తర్వాత ..ఆ 60 ఏళ్ల తల్లి జస్ట్ ఆహారం, ఆరోగ్యంలో మార్పులు చేసుకోడంతో గణనీయమైన బరువు తగ్గి, తన అనారోగ్యాన్ని స్వయంగా నయం చేసుకుంది. ప్రీ డయాబెటిస్ అంటే..ఇక్కడ నార్మా ప్రీ డయాబెటిస్తో బాధపడుతోంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితి. కానీ టైప్2 డయాబెటిస్ని నిర్థారించినట్లుగా..దీన్ని ముందుగా గుర్తించడం అంత ఈజీ కాదుఈ ప్రీడయాబెటిస్ని ఆహారం, వ్యాయమాలు, చక్కటి జీవనశైలి తరితదరాలతో నిర్వహించడమే గాక తిప్పికొట్టొచ్చు. వైద్యులు ఆమెకు ఈ షుగర్ వ్యాధి కోసం నోటి ద్వారా తీసుకునే మెట్ఫార్మిన్ ఇచ్చినప్పటికీ..ఆమె వాటిని వేసుకునేందుకు తిరస్కరించింది. ఇలా చేయొద్దని వైద్యులు హెచ్చరించారు కూడా. చివరికి ఆమె మెడిసిన్ వాడనని మొండిపట్టుపట్టడంతో సరే నీ అదృష్టం అని వైద్యులు వదిలేశారు.అందుకోసం ఏం చేసిందంట..నార్మా లియోన్స్ చాలా అధ్యయనం చేసి కీటో డైట్ అనుసరించింది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లును దరిచేరనీయకుండా కేర్ తీసుకుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకునేది. ప్రతిరోజూ ఉదయం గుడ్లు, బేకన్, చీజ్, చికెన్ సలాడ్, లీన్ మాంసం తదితరాలను తీసుకున్నట్లు వివరించింది. ఈ కఠినమై డైట్తో నార్మాలియోన్స్ కేవలం మూడు నెలల్లో పది కిలోలు తగ్గి..రక్తంలోని చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చేసింది. ప్రస్తుతం ఆమె ప్రీ డయాబెటిక్ పేషెంట్ కాదని వెల్లడించారు వైద్యులు. పట్టుదలతో బరువు తగ్గింది అనారోగ్యం నుంచి కూడా బయటపడింది. ఇక్కడ కావాల్సింది ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే చాలు ఎలాంటి వ్యాధినైనా తిప్పికొట్టచ్చు అనేందుకు నార్మాలియోన్స్ వెయిట్లాస్ స్టోరీనే ఉదాహారణ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్నెస్ కోచ్) -
భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025 -
జయహో జకీయుద్దీన్..! సైకిల్పై ట్రాఫిక్ పోలీసు విధులు
అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రభుత్వం కేటాయించిన బ్యాటరీ సైకిల్పై విధులు నిర్వహిస్తూ సికింద్రాబాద్ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. సంధులు, గల్లీల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎండీ జకీయుద్దీన్. 2014 బ్యాచ్కు చెందిన జకీయుద్దీన్ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్, పాట్ మార్కెట్, ఓల్డ్గాస్ మండీ తదితర ప్రాంతాల్లో సైకిల్పై విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం బ్యాటరీ సైకిళ్లను అందజేసింది. అయితే చాలా స్టేషన్లలో వీటిని మూలనపడేశారు. విధుల కోసం డిపార్టుమెంట్ ప్రతి నెలా ఇచ్చే 25 లీటర్ల పెట్రోల్తో బైక్స్ వినియోగిస్తుంటారు.. అయితే ఇంధనం ఆదా చేయడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే తాను బ్యాటరీ సైకిల్ వినియోగిస్తున్నానని జకీయుద్దీన్ చెబుతున్నాడు. తాను క్రీడాకారుడిని కాబట్టి సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ ఉపయుక్తమవుతుందని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని సాక్షితో పంచుకున్నాడు. (చదవండి: ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..) -
ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..
60 ఏళ్లు దాటిని సీనియర్ సిటీజన్లంతా జీవిత చరమాంకంలో తమ జీవితాన్ని ఎలా గడుపుతారో తెలిసిందే. రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బామ్మ మాత్రం ఈ జనరేషన్ అవాక్యయ్యేలా జీవిస్తోంది. ఈ ఏజ్లో యువత మాదిరిగా చురుగ్గా ఉంటూ అన్ని వ్యాయమాలు చేస్తోంది. జిమ్లో ఆమే చేసే వ్యాయామాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవలే వందేళ్ల వయసుకుకి చేరుకుంది. అయితే ఆమె అందరిలో కాకుండా విభిన్నంగా తన పుట్టినరోజుని చేసుకుంది. ఆఖరికి తన జీవన విధానం సైతం అందరి వృద్ధుల్లా కాకుండా..యంగ్ ఏజ్లో ఉండే వ్యక్తుల్లా అత్యంత యాక్టివ్గా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా 120 ఏళ్లు జీవించాలనుకుంటున్నా అని అత్యంత ధీమాగా చెబుతోంది ఈ బామ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..యునైటెడ్ స్టేట్స్ కనెక్టికట్లోని నార్వాక్కు చెందిన మేరీ కరోనియోస్ అనే బామ్మ ఇటీవలే సెంచరీ వయసులోకి చేరుకుంది. అయితే ఆమె తన వందో పుట్టిన రోజుని అందరిలా కేకులు, చాక్లెట్లు, మిఠాయిలతో కాకుండా జిమ్లో చేసుకుంది. జిమ్లో చేసుకోవడం ఏంటి అనుకోకండి. ఈ బామ్మ స్పెషాలిటీ అందులోనే కాదు ఆమె జీవిన విధానంలోనూ ఉంది. ఎందుకంటే అందరి వృద్ధుల్లా కాకుండా డైనమిక్గా ఉంటుంది ఈ బామ్మ. ఆమె జిమ్లో హుషారుగా బరువులు ఎత్తుతు..తన వందో పుట్టిన రోజుని జరుపుకుంది. తానింకా వృద్ధురాలిని కాదు యంగ్ అని చెప్పేందుకే ఇలా విభిన్నంగా తన పుట్టినరోజుని జరుపుకుందామె. అంతా ఆ బామ్మను జిమ్ మేయర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. దీర్ఘాయువుతో ఉండాలని, తన వృద్ధాప్యం భారంగా సాగకూడదనే మంచి ఆహారపు అలవాట్లను అనుసరిస్తోందట. వ్యక్తిగత ట్రైనర్లతో కలిసి జిమ్లో ఇతరులకు శిక్షణ కూడా ఇస్తుందట కూడా. అంతేగాదు అక్కడకు వచ్చే వారు ఈ వందేళ్ల బామ్మ ట్రైనింగ్ చూసి స్ఫూర్తి పొందుతారట. జీవతాన్ని ఆస్వాదించడం అంటే ఇదే కదా అని ఆ బామ్మని చూసి అనుకుంటుంటారట. ఆ బామ్మ కూతురు ఎథీనా సైతం ఆమె దినచర్య, ఆహరపు అవాట్లకు ఫిదా అవుతుంటుందట. తనకు దీర్ఘాయువుతో రికార్డులు బ్రేక్ చేయడమ తన లక్ష్యం కాదని, మానసిక పరిమితులను బద్దలు కొట్టేలా జీవించడమే తన ధ్యేయం అని ఆమె కూతురు ఎథీనా చెబుతోంది. ఈ బామ్మ నేపథ్యం..లైఫ్స్టైల్..మాజీ ఉపాధ్యాయురాలైన కరోనియోస్ వృద్ధుల సంప్రదాయ జీవన విధానాన్ని విడిచిపెట్టి ఆధునిక జీవిన విధానానికి అడాప్ట్ అయ్యింది. సీనియర్ కేంద్రాల కంటే జిమ్కు వెళ్లేవారితో కలిసే యత్నం చేసేది. ఆమె ఈ ఏజ్లోనూ యువకులతో వేళాకోలం ఆడుతూ..హుషారుగా ఉంటుందట. ఆమె వయసుకి జిమ్ అనేది అతిపెద్ద శారీరక శ్రమ అయినా..ఆ అనితర సాధ్యమైన వర్కౌట్లు, బరువుల ఎత్తడం అంటేనే ఆమెకు ఇష్టమట. ఆరోగ్యానికి మదద్దుతి ఇచ్చే వ్యాయామాలన్నింటిని అలవోకగా చేసేస్తుందట. అలాగే సమాజంతో మంచి సత్సంబంధాలను నెరుపుతుందట. బంధువులు, కుటుంబ సభ్యుల అందరితోనూ సానూకూల దృక్పథంలో వ్యవహరిస్తుందట. ఇవే తన ధీర్ఘాయువుకి కారణమని నమ్మకంగా చెబుతోంది కరోనియస్ బామ్మ. హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. దీర్ఘాయువుకి సంబంధించి.. నిపుణులు సైతం..ఆమె ఆహారపు అలవాట్లను ప్రశంసిస్తున్నారు. ఆమె అత్యంత మితంగా భోజనం, మొక్కల ఆధారిత పోషకాహారం, బాడీకి సరైన కదలికలు ఉండేలా చేసే వ్యాయామాలు తదితరాలన్నీ మంచి అలవాట్లకు దగ్గరగా ఉండే సూత్రాలుగా పేర్కొన్నారు పోషకాహార నిపుణులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా పర్లేదు కానీ 120 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని ఆ బామ్మ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం ఆమె హైపర్ ధైరాయిడిజంకి సంబంధించిన మందులు ఒక్కటే తీసుకుంటున్నారు. ఈ విధమైన మంచి జీవన విధానానికి కీలకం తన గ్రామీణ నేపథ్యమేనని అంటోందామె. పెన్సిల్వేనియా గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె తన తోబుట్టువులు ఐదుగురిలో ఈ బామ్మే పెద్దదట. ఈత నుంచి చెట్లు ఎక్కడం, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి అన్ని ఆటలను హాయిగా ఆడేదాన్ని అని చెబుతోంది. అంతేగాదు తనలా జీవితానికి పరమార్థం ఉండేలా ఏదో ఒకటి సాధించేలా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని సూచిస్తోంది ఈ కరోనియోస్ బామ్మ.(చదవండి: Weight Loss: బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగో ఐదు చిట్కాలు!: ఫిట్నెస్ కోచ్) -
ఇలా చేస్తే.. జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోల బరువు..!
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ అమకా.బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు. ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె. ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్గా డైట్ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్నెస్ కోచ్ అమకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్) -
పాలిటిక్స్ కన్నా.. పిజ్జాయే మిన్న
పాలిటిక్స్ కంటే పిజ్జా గురించే మన వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారని ‘ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్’ పేరిట సెంటర్ ఫ్రెష్ యూ గోవ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా జాతీయ స్థాయిఅధ్యయనం వెల్లడైంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఓవర్ థింకింగ్లో ముందున్న మన దేశవాసులు రాజకీయాల కంటే పిజ్జా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు తేలింది. దేశవాసుల ఆలోచనల్లోనూ, రోజువారీ జీవనశైలిలోనూ అతి ప్రభావితం చేస్తోందని, సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అత్యంత సాధారణమైన విషయాలకు సంబంధించిన నిర్ణయాల్లోనూ, ఆలోచనల్లోనూ అతి కనిపిస్తోందని ఈ నివేదిక చెబుతోంది. 81 శాతం మందిలో.. దేశంలో 81 శాతం మందికి రోజుకి మూడు గంటలకు పైగా ఓవర్థింకింగ్ అలవాటైంది. వాట్సాప్ మెసేజ్కి ఎలా స్పందించాలో, భోజనానికి ఏం తినాలో, లేదా ఇన్స్ట్రాగామ్లో ఏ ఫొటో పోస్ట్ చేయాలో అనేటటువంటి ప్రతి చిన్న విషయంలోనూ ప్రజలు ఆలోచనల ఊబిలో మునిగిపోతున్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. రెస్టారెంట్లో డిష్ ఎంపిక చేయడం అనేది రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంకన్నా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తోందని 63% మంది చెప్పడం విశేషం. (చదవండి: అరచేతిలో అనర్థం..! మొబైల్ ఫోబియాపై నిపుణులు ఆందోళన..) -
అరచేతిలో అనర్థం..!
అరచేతిలో అద్భుతాన్ని చూపించే స్మార్ట్ఫోన్లు.. అనర్థాలకు దారితీస్తోంది.. ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచి్చన టెక్నాలజీ.. చివరికి మనల్నే తన గుప్పిట్లో బం«దీగా చేస్తోంది. రోజువారీ అవసరాలు తీర్చడంతోపాటు.. రోజువారీ సమస్యలనూ తెచి్చపెడుతోంది.. సరదాగా కాలక్షేపం కోసం మొదట్లో వినియోగంలోకొచ్చి.. ఇప్పుడు అదే కాలక్షేపంగా మారిపోయింది.. అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి సమయాన్ని ఆదా చేస్తుందనుకున్న మొబైల్ నేడు మన సమయాన్ని వృథా చేస్తోంది.. నెమ్మదిగా దానికి బానిసలుగా మార్చేసుకుంటోంది.. మొబైల్ వినియోగించకుండా ఉండలేకపోవడాన్ని సైంటిఫిక్గా నోమోఫోబియా అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోబియాకు గురవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కేవలం సమాచారానికి, అవసరమైన కమ్యూనికేషన్కు మాత్రమే ఉపయోగించుకున్న మొబైల్ ఫోన్లు.. ఇప్పుడు మన జీవితాల్లో ప్రధాన భాగమైపోయాయి. సోషల్ మీడియా, గేమ్స్, షార్ట్ వీడియోలు, అరచేతిలో టిక్ టిక్ మంటూ వచ్చే నోటిఫికేషన్లతో.. అసలు మొబైల్ను మనమే పట్టించుకోవడం లేదు.. అది మనల్ని పట్టేసింది! ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం.. హైదరాబాద్లోని విద్యార్థుల్లో 62% మందికి పైగా రోజుకు సగటున 6–8 గంటలు మొబైల్లో గడుపుతున్నారని తేలింది. అయితే వ్యసనంలా మారిన ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. నగర యువతపై ప్రభావం.. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. టెక్ జాబ్స్, మెట్రో జీవితం, ఒంటరి అపార్ట్మెంట్ కల్చర్ తదితర కారణాలతో మొబైల్ను ఓ సాధనంగా కాకుండా ఒక సహజీవిగా మార్చేశాయి. ప్రత్యేకించి 15–30 ఏళ్ల వయసులో ఉన్న యువతలో ఇది తీవ్రమైన డిజిటల్ డిపెండెన్సీగా మారింది. ముఖ్యంగా రాత్రిపూట స్క్రోల్ చేస్తూ నిద్రపోయే వరకూ ఫోన్ చూస్తుండటం వల్ల నిద్రలేమి, తలనొప్పి, ఏకాగ్రత లోపం, డిప్రెషన్ వంటి మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. సర్వేలు ఏమంటున్నాయంటే.. నిమాన్స్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) చేసిన అధ్యయనంలో దాదాపు 40% మందికి ‘నో మొబైల్ ఫోబియా’ (నోమోఫోబియా) ఉందని వెల్లడైంది. తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం, 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నారని తేలింది. హైదరాబాద్లోని విద్యాసంస్థలు తాము నిర్వహించిన అంతర్గత సర్వేల్లో విద్యార్థులు చదువుపై ఫోకస్ కోల్పోతున్నారని స్పష్టంగా పేర్కొన్నాయి. చిన్నారుల్లో దీని ప్రభావం.. పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవాల్సిన వయసులో మొబైల్ స్క్రీన్కి అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు తాత్కాలికంగా వారి తలనొప్పి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మొబైల్ అందిస్తుంటే.. అది శాశ్వతంగా పిల్లల అభివృద్ధికి అడ్డుగోడవుతోంది. స్పీచ్ డిలే, అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు పిల్లల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయి. విముక్తి మార్గాలు.. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ : ప్రతి వారం ఒక రోజు లేదా ప్రతి రోజు ఒక నిరీ్ణత సమయం మొబైల్కి బ్రేక్ ఇవ్వడం. ఆఫ్లైన్ హాబీస్ : పుస్తక పఠనం, ఆర్ట్, గార్డెనింగ్, యోగా వంటి కార్యకలాపాలు మొబైల్ డిపెండెన్సీని తగ్గించడంలో సహాయపడతాయి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ : సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడం కాదు, వాటిని ‘లిమిటెడ్ యూజ్’ మోడ్లో పెట్టడం, నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ వెల్ బీయింగ్ యాప్స్ : స్క్రీన్ టైమ్ ట్రాకింగ్, రిమైండర్లు ఇవ్వగల యాప్స్ ఉపయోగించడం. ఫ్యామిలీ టైమ్..: ప్రతి రోజు 1–2 గంటలు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయతి్నంచాలి. హైదరాబాద్ స్పెషల్ ఇన్షియేటివ్స్.. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు నెల్లో ఒక్కరోజు ‘నో మొబైల్ డే’ పాటిస్తున్నారు. బంజారాహిల్స్లోని ఓ స్కూల్ ‘టెక్ ఫ్రీ అవర్’ అంటూ రోజుకు ఒక పిరియడ్ను స్క్రీన్ లేని యాక్టివిటీలకు కేటాయిస్తోంది. సైకలాజికల్ వెల్ బీయింగ్ సెంటర్స్ ఆధ్వర్యంలో మొబైల్ డిపెండెన్సీకి కౌన్సెలింగ్ ప్రోగ్రామ్లు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ యూజ్.. ప్రస్తుత అధునాతన జీవన శైలిలో టెక్నాలజీని వదిలేయమనడం సాధ్యం కాదు.. కానీ మనమే నియంత్రించలేకపోతే అది మనల్ని నియంత్రించడం ఖాయం. మొబైల్ అనేది ఓ సాధనం మాత్రమే, జీవితం కాదు. ప్రత్యేకించి యువత.. కెరీర్, మానసిక ఆరోగ్యం, రిలేషన్షిప్స్ అన్నింటినీ తారుమారు చేసే ఈ డిజిటల్ బానిసత్వం నుంచి బయటపడితేనే నిజమైన ‘స్మార్ట్ యూజ్’ అవుతుంది. (చదవండి: తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్) -
తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్
తరచుగా తుమ్ములు రావడం, ఛాతీ అంతా నొక్కేసినట్టుగా అనిపించడం చాలామంది ఎదుర్కొనే సమస్య. సాధారణంగా అలెర్జీలు, జలుబు వంటివి వచ్చినప్పుడు తుమ్ములు ఓ లక్షణంగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు తుమ్ములు చాలా మామూలు విషయమే గానీ... మరికొన్నిసార్లు అవి మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఓ సూచన కావచ్చు. ఈ నేపథ్యంలో తరచూ కనిపించే తుమ్ములు ఎందువల్ల వస్తాయో, ఏయే సమయాల్లో అవి తీవ్రమైన సమస్యలకు సూచికగా ఉంటాయో అలాంటప్పుడు అవసరమైన సాధారణ ఇంటి చిట్కాలు మొదలుకొని... పెద్ద సమస్యలకు అవసరమైన చికిత్సలేమిటన్న అనేక అంశాలపై అవగాహన కలిగించే కథనమిది...ఆవలింతకు అన్న ఉన్నాడుగానీ... తుమ్ముకు తమ్ముడు లేడని ఓ వాడకమాట. అంటే ఒకరు ఆవలించగానే మరొకరికి ఆవలింత వస్తుంది... కానీ తుమ్ము అలాకాదు... సోలోగా వస్తుందని అర్థం. తుమ్ము ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో చూద్దాం...అలెర్జీలు, పుప్పొడి, ధూళిలో ఉండే అతి చిన్న డస్ట్మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (పెట్ డ్యాండర్), బూజు వంటివి ఊపిరితిత్తులను ప్రేరేపించి తుమ్ములొచ్చేలా చేస్తాయి.జలుబు అలాగే ఫ్లూ (కామన్ కోల్డ్ అండ్ ఫ్లూజ్వరం)లో : వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంతో ముక్కు కారుతుండే సమయంలో; దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో పాటు తుమ్ములూ వస్తుంటాయి. నాన్–అలెర్జిక్ రైనైటిస్: ఈ సమస్య ఉన్నప్పుడు అలెర్జీని ట్రిగర్ చేసే కారకాలు లేకుండానే వచ్చే తుమ్ములూ, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఉంటాయి. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల వాసనలు, మసాలాలు ఇందుకు కారణమవుతుంటాయి. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యాలు (డస్ట్ అండ్ పొల్యూషన్) : వాతావరణంలోని దుమ్ము, పొగ, వాయుకాలుష్యం వంటి అంశాలు ముక్కులోని అతి సున్నితమైన పొరలను ఇరిటేట్ చేయడం ద్వారా తుమ్ములొచ్చేలా చేస్తాయి. బాగా ఘాటుగా ఉండే వాసనలు (స్ట్రాంగ్ సెంట్స్) : కొన్ని రకాల సెంట్లూ, పెర్ఫ్యూమ్లూ, శుభ్రం చేయడానికి వాడే సువాసనగల క్లీనింగ్ ఉత్పత్తులు లేదా కొన్ని రకాల రసాయనాల తాలూకు ఘాటు వాసనలు తుమ్ములను తెప్పిస్తాయి.ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపించేలా చేసే ఈ కారణాలన్నీ తుమ్ములతో సంబంధం ఉన్నవే. చాలాసార్లు తుమ్ములు వస్తున్నప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతున్నట్లుగానూ, ఛాతీ బాగా బిగదీసుకుపోయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇలా ఏయే సమయాల్లో జరుగుతుందో తెలుసుకుందాం. తరచుగా వచ్చే దగ్గుతో (ఫ్రీక్వెంట్ కాఫ్ వల్ల) : తుమ్ములతోపాటు తరచూ వచ్చే దగ్గు వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అలెర్జిక్ ఆస్తమా : అలెర్జీ సమస్య ఉన్న కొందరిలో అదేపనిగా తుమ్ములు వస్తుండటంతోపాటు వాళ్ల శ్వాసనాళాలూ, ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలూ సంకోచించి సన్నబారిపోతుంటాయి. దాంతో గాలి సాఫీగా ప్రవహించడానికీ / ప్రసరించడానికీ తగినంత స్థలం లేకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం (ఆస్తమా) జరగవచ్చు. ఆ శ్వాసనాళాలన్నీ సన్నబారి ఊపిరితీసుకోవడం కష్టంగా మారడంతో ఛాతీలోనూ బిగుతుగా అనిపిస్తుంది. పిల్లికూతలతోపాటు ఇలా శ్వాస తీసుకోవడం కష్టం కావడాన్నే ఆస్తమాగా పేర్కొంటారు. సైనస్తో పెరిగే ఒత్తిడి (సైనస్ ప్రెషర్): ముఖం ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలను సైనస్ అంటారు. తుమ్ములు, జలుబు లేదా అలెర్జీల వల్ల సైనస్లలో ఇన్ఫెక్షన్ (అంటే వాపు వచ్చి) ఆ కారణంగా ఛాతీపై పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. ఇలా సైనస్లలో పేరుకు΄ోయిన శ్లేష్మం... ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది.కండరాల నొప్పి (మజిల్ స్ట్రెయిన్): తరచుగా తుమ్మడం వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుండటం వల్ల ఆ కారణంగా నొప్పిగానూ, ఛాతీ బిగుతుగా అనిపించవచ్చు.తుమ్ములతో ఊపిరితిత్తులపై పడే ప్రభావమిలా...సాధారణంగా తుమ్మడమనే ప్రక్రియ... ముక్కు లేదా శ్వాసనాళాల్లో అడ్డుగా ఉండి చికాకు కలిగించే కొన్ని వ్యర్థాలనూ, కణాలను బలంగా బయటకు పంపడానికి శరీరం అసంకల్పితంగా చేసే ఓ రక్షణాత్మకమైన ప్రక్రియ. అయితే, తరచుగా, అలాగే తీవ్రంగా, అదేపనిగా తుమ్ములు వస్తున్న కొన్ని సందర్భాల్లో అవి ఊపిరితిత్తులపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఊపిరితిత్తుల కండరాలపై ఒత్తిడి (స్ట్రెయిన్ ఆన్ లంగ్ మజిల్స్)తుమ్మిన ప్రతిసారీ కడుపును రెండు భాగాలుగా విభజించి, ఊపిరితిత్తులనూ, కడుపు తాలూకు జీర్ణవ్యవస్థలోని భాగాల్ని వేరు చేసే డయాఫ్రమ్ అనే పొర, ఛాతీ కండరాలూ సంకోచిస్తాయి. ఇలా మరీ ఎక్కువగానూ, శక్తిమంతంగానూ తుమ్ములు వస్తున్నప్పుడు అక్కడి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో ఛాతీలో నొప్పి, అక్కడి కండరాలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులపైన నేరుగా ప్రభావం పడదుగానీ... శ్వాసప్రక్రియకు సహాయపడే కండరాలపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దాంతో శ్వాస సరిగా ఆడకపోవడం, ఆయాసం రావడం జరుగుతాయి. దీన్నే వాడుక భాషలో ఉబ్బసంగా చెబుతుంటారు. శ్వాసనాళాల్లో ఇబ్బంది (ఇరిటేషన్), వాపు (ఎయిర్ వే ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్)తుమ్మినప్పుడు గాలి అకస్మాత్తుగా చిమ్మినట్టుగా చాలా వేగంగా బయటకు వస్తుంది. ఇది శ్వాసనాళాల లోపలి పొరల్లో ఇబ్బంది (ఇరిటేషన్) కలిగిస్తుంది. అలాగే అలెర్జీలూ, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వల్ల తరచుగా తుమ్ములు వస్తున్నట్లయితే, ఈ ఇబ్బంది (ఇరిటేషన్) కాస్తా దీర్ఘకాలిక వాపునకు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) దారితీసే అవకాశముంది. ఈ ఇన్ఫ్లమేషన్ కాస్తా శ్వాసనాళాలను మరింతగా కుంచించుకు΄ోయేలా చేసి, గాలి సాఫీగా ప్రసరించడాన్ని ఆటంకపరుస్తుంది. ఫలితంగా హాయిగా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.ఆస్తమాను ప్రేరేపించడం లేదా తీవ్రతరంచేయడం(ట్రిగరింగ్ / వర్సెనింగ్ ఆస్తమా) : ఆస్తమా సమస్య ఉన్నవారిలో తుమ్ములు ఆస్తమా అటాక్ను ప్రేరేపించగలవు... అంటే ట్రిగర్ చేయగలవు. అలెర్జీని కలిగించే అంశాలను (అలర్జెన్స్ను) దేహం ఎదుర్కొన్నప్పుడు యధేచ్ఛగా తుమ్ములు వస్తూ అవి శ్వాసనాళాలను కుంచించుకుపోయేలా / బిగుసుక΄ోయేలా చేస్తాయి. దాంతో ఛాతీ బిగదీసుకుపోవడం ఆస్తమా లక్షణాలు తీవ్రతరం కావడం జరగవచ్చు. అప్పుడు శ్వాసనాళాలు సన్నబారడంతో దగ్గు, ఆయాసం, ఎగశ్వాస, ఛాతీ బిగదీసుకుపోవడం వంటి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి లేదా వాటిని తీవ్రతరం చేస్తాయి కూడా. తుమ్ములు మరింత ఎక్కువగా వస్తూ, దగ్గు కూడా తోడైనప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి బాగా పెరిగి, ఆస్తమా ఉన్నవారికి అది మరింత కష్టంగా పరిణమించవచ్చు.ఇన్ఫెక్షన్ వ్యాప్తి (స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్):జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల తుమ్ములు వస్తున్నప్పుడు, అలా తుమ్మినప్పుడు వెలువడే అతి సన్నటి తుంపర్లలతో వైరస్లు ఉంటాయి. ఆ తుంపర్ల కారణంగా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందడంతో పాటు, కొన్నిసార్లు శ్వాసనాళాల లోపల మరింత లోతుకు విస్తరించి బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలా జరగడం చాలా సాధరణం.గాలి గదులు ధ్వంసం కావడం లేదా న్యూమోథొరాక్స్ : ఇది చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ప్రమాదం. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, అంటే మరీ ముఖ్యంగా ముఖ్యంగా ఊపిరితిత్తులలోని అంతర్గత సమస్యలు (ఉదాహరణకు ఎంఫసిమా వంటి సమస్యలు) ఉన్నవారిలో, తుమ్ములు చాలా బలంగా లేదా తీవ్రంగా వస్తున్నప్పుడు ఊపిరితిత్తులలోని అతి చిన్న గాలి గదులు (బ్లెబ్స్ అండ్ బ్యుల్లే) ఫటేల్మంటూ పగిలినట్టుగా అయ్యే ముప్పు ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. అయితే ఇది జరిగితే దీనివల్ల ఊపిరితిత్తీ అలాగే ఛాతీ గోడకు మధ్యన గాలి లీక్ అయి, న్యుమోథొరాక్స్ (కొలాప్స్డ్ లంగ్) అనే తీవ్రమైన కండిషన్కు దారి తీస్తుంది. ఇది చాలా అత్యవసరంగా వైద్యచికిత్స అందించాల్సిన పరిస్థితి.... అంటే మెడికల్ ఎమర్జెన్సీ.వైద్యచికిత్స ఎప్పుడంటే... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవి... గాలి పీల్చడంలో తీవ్రమైన ఇబ్బంది; శ్వాస సరిగా తీసుకోలేక΄ోవడం, ఊపిరి అందక΄ోవడం / ఊపిరాడకపోవడం ఛాతీ బిగుసుకు΄ోవడం / ఛాతీలో తీవ్రమైన నొప్పి ఒక పట్టాన తగ్గని తీవ్రమైన జ్వరం శ్లేష్మం / కఫం పసుపురంగులో లేదా ఆకుపచ్చరంగులో ఉండటం ఇక్కడ పేర్కొన్న ఈ లక్షణాలు కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకుండా ఉండటం లేదా మరింత తీవ్రతరమైతే తక్షణం డాక్టర్ను సంప్రదించడం అవసరం.కొన్ని ఇతర వైద్యపరమైన సమస్యలతో కనిపించే లక్షణాలు : గుండె సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర / వైద్య చరిత్ర (హెల్త్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు బాగా ఛాతీలో ఇబ్బంది లేదా ఛాతీ బిగుసుకు΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు. తరచుగా తుమ్ములు, ఛాతీలో బాగా బిగదీసుకుపోయి ఛాతీలో ఒత్తిడి ఉన్నట్లుగా అనిపిస్తుండటం (ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భాల్లో సమస్య చాలా సాధారణంగా కనిపిస్తున్నా లేదా అంత తీవ్రమైన సమస్య కానప్పటికీ ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం అవసరం.చివరగా... తరచుగా తుమ్ములు రావడమన్నది దాదాపుగా అందరిలోనూ తమ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చే సమస్య. అయితే ఇలా తుమ్ములు పదేపదే కనిపిస్తుంటే మాత్రం ఒకసారి డాక్టర్ను సంప్రదించడం మంచిది.తుమ్ముల నివారణా... అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలు నివారణకు అనుసరించాల్సిన సూచనలు : అలెర్జీకి కారణమయ్యే కారకాల (అలర్జెన్స్)ను గుర్తించడం, వాటికి దూరంగా ఉండటం. (అంటే మనకు ఏ కారణంగా అలెర్జీ వస్తుందో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం, అవి ఎదురుకాకుండా చూసుకోవడం; ఇంట్లో అలెర్జెన్స్ లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం; దుమ్మూ ధూళి లేకుండా జాగ్రత్తపడటం; పెంపుడు జంతువులూ, వాటి వెంట్రుకల నుంచి దూరంగా ఉండటం. డాక్టర్లు సూచించిన మేరకు అలర్జీలను నివారించే నేసల్ స్ప్రేలు వాడటం లేదా యోగా ప్రక్రియలో కొమ్ముతో ఉండే చిన్న భరిణె లాంటి ఉద్ధరిణి సహాయంతో ‘నేతి’ అనే యోగప్రక్రియతో ముక్కు రంధ్రాల్ని శుభ్రం చేసుకోవడం (ఈ నేతి ప్రక్రియ కారణంగా ముక్కులోని అలెర్జీ కారకాలు (అలర్జెన్స్). శ్లేష్మం కొట్టుకుపోయి ముక్కు శుభ్రంగా ఉండటంతో అలెర్జీ, ఆస్తమా నివారితమవుతాయి). ఆవిరి పీల్చడం (స్టీమ్ ఇన్హెలేషన్) : వేడినీటి ఆవిరి పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గడంతోపాటు శ్వాస తేలిగ్గా అందుతుంది. నీరూ, ద్రవపదార్థాలూ ఎక్కువగా తీసుకోవడం (హైడ్రేటెడ్గా ఉండటం) : నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వల్ల శ్లేష్మం (స్ఫుటమ్) పల్చబడి అది తేలిగ్గా బయటకు వస్తుంది. (ఈ శ్లేష్మం ఊపిరితిత్తుల్లోనూ, గొంతులోనూ ఇరుక్కుని ఉన్నప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, ఊపిరితీసుకోడానికి అది అడ్డుపడటం వల్ల చికాకుగా ఉండటం వంటివి చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే). ఇంటి చిట్కాలుతేనె అల్లం కలిపిన పానియాలు : తేనె (హనీ), జింజర్ (అల్లం) కలిపి చేసుకున్న పానియాల వల్ల గొంతు నొప్పి తగ్గడం, దగ్గు నుండి ఉపశమనం కలగడం వంటి ఫలితాలుంటాయి. తుమ్ములూ తగ్గుతాయి.తగినంత విశ్రాంతితో : శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవ్వడంతోపాటు త్వరగా కోలుకోవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం : పొగతాగడం, పొగకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇక పోగ ఎక్కువగా వస్తున్నచోట ఉంటే ఊపిరిసలపనట్టుగా అనిపిస్తుండటం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. అందుకే పొగ అలవాటుకూ, పొగకూ దూరంగా ఉండటం మేలు. (చదవండి: Beauty Tip: మేకప్ లేకున్నా...అందంగా కనిపించాలంటే..!) -
మేకప్ లేకున్నా...!
ముఖం కేవలం మేకప్ వేసినప్పుడే మిలమిలా అదిరిపోయేలా ఉండకూడదు. లేనిప్పుడూ కూడా సహజ సౌందర్యంతో అందంగా కనిపించాలి. అందుకోసం ఏం చేయాలంటే..ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు సహజసిద్ధమైన లేదా తేలికపాటి క్లెన్సర్స్, ఫేస్ వాష్లను వాడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడే గాక, బయట నుంచి ఇంటికి వచ్చాక కూడా ముఖాన్ని శుభ్రంగా కడిగితే మొటిమలు లేకుండా ముఖం తేటగా కనిపిస్తుంది.వారానికి రెండుసార్లు సున్నిపిండి, స్క్రబ్బర్లను వాడడం ద్వారా ముఖం మీద పేరుకు΄ోయిన మృత కణాలు వదిలి΄ోయి ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది.ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. చుండ్రు రాకుండా జుట్టుని కాపాడుకోవాలి. జుట్టు మృదువుగా, మెరిసిపోవడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్) -
అమృత ఘడియలవి!
వ్యాధులు దరిచేరకుండా శిశువులకు వ్యాక్సిన్లు వేయించడం తెలిసిందే. ప్రసవం అయిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టడం అంటే శిశువుకు మొదటి వ్యాక్సిన్ వేయించినట్టే అని చెబుతుంది భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రసవం తర్వాత మొదటి గంట ఎంత కీలకమైనదో తల్లికి– బిడ్డకి ఎన్ని విధాల మేలు చేస్తుందో తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడమనేది కాబోయే తల్లులు తప్పక తెలుసుకోవాల్సినదే.అమ్మపాలే తన బిడ్డకు ఇచ్చే అమృతం. ఔషధం కూడా. నవజాత శిశువులకు మొదటి గంటలోనే రొమ్ము పాలు పట్టించడాన్ని ఓ మంచి ప్రారంభంగా చెప్పవచ్చు. తల్లిపాలు పిల్లలకు సహజ పోషకాహారం, సురక్షితమైనవి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు తాగడం లేదు అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లల ఆరోగ్యకరమైన భావి జీవితం సమస్యాత్మకంగా ఉంటుందనేది ఆ నివేదికల సారాంశం. తల్లిపాలు తాగని పిల్లల్లో అనారోగ్యం, ఆకస్మిక మరణం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యుక్తవయస్సులో ఆరోగ్య సమస్యల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి బహుమతిముర్రుపాలుగా పిలిచే మొదటి పాలను కొలెస్ట్రామ్ అంటారు. ‘ప్రీ మిల్క్’ అనే ఈ పాలలోని పోషకాలు యాంటీబాడీలుగా శిశువుకు మొదటి సహజ టీకాగా పనిచేస్తాయి. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను ఏకకాలంలో అందజేస్తాయి. అంతేకాదు, ప్రసవం అయిన మొదటి గంటలో తల్లి హృదయానికి హత్తుకున్న బిడ్డ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల పిల్లల చర్మంలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది, తల్లీ–బిడ్డల బంధాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వాలని, మొదటి గంట మరీ కీలకం అని యునిసెఫ్, డబ్ల్యూహెచ్వో తో పాటు ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. ప్రసూతి అనారోగ్య భారం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాల సృష్టికి మూలం అవుతుంది. బిడ్డకు అందమైన భవిష్యత్తును కానుకగా ఇవ్వాలని తపించే ప్రతి తల్లి మొదటగా అందివ్వాల్సింది తల్లిపాలే.మరెన్నో ప్రయోజనాలు→ ప్రసవం అయిన కొన్ని రోజుల వరకే కొలొస్ట్రామ్ ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ రోజుల్లో తప్పక పాలు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా పుట్టిన మొదటి గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ మనుగడ అవకాశాలు 14 రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయి.→ తల్లిపాలలో ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి, చురుకైన పనితీరుకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా, చక్కెరపాళ్లు తక్కువగా ఉండే తల్లి పాలు శిశువుకు మొదటి ఆరు నెలలు పూర్తి ఆహారం. → తల్లిపాలు కాకుండా ఇతర ఆహారాన్ని అంటే.. చాలా వరకు ప్రసవం అయ్యాక శిశువుకు తేనె నాకించడం, డబ్బా పాలు పడుతుంటారు. ఈ విధానం చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల తల్లిలోనూ పాల ఉత్పత్తి ఆలస్యం కావచ్చు. బిడ్డకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవి ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యుమోనియా వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి శరీర వేడి ద్వారా బిడ్డను రక్షించడమే కాకుండా తల్లీ బిడ్డ మధ్య బంధం బలపడుతుంది.ఆరు నెలలు... ఆ తర్వాత...ఆరు నెలల తర్వాత ఇంట్లో వండిన పోషకాలు ఉండే మెత్తని ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే, వయస్సుకు తగిన విధంగా, పోషకాలు ఉండే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అదే సమయంలో రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వరకు కూడ తల్లిపాలు ఇవ్వచ్చు. బిడ్డ క్రమంగా ఘన, ద్రవ, వైవిధ్యమైన ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోగలుగుతుందా లేదా అని దృష్టి పెట్టాలి. బిడ్డ తొలినాళ్ల నుంచే తీసుకున్న శ్రద్ధ ఆ బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి పునాది వేస్తుంది. తొలి బాల్య దశలోనే బిడ్డ ఏం నేర్చుకుంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది.. అనే వాటిని నిర్ణయిస్తుంది. జీవితంలో విజయాలు సాధించేలా వారి సామర్థ్యాన్ని ఆ తొలిదశే నిర్ణయిస్తుంది. పిల్లల మనుగడ, ఆరోగ్యకరమైన అభివృద్ధికి తల్లిపాలు కీలకపాత్ర పోషిస్తాయి. మొదటి గంటలో తల్లి తన బిడ్డకు ఇచ్చే ప్రతి పాల చుక్క అనారోగ్యకారకమైన బాక్టీరియాతో పోరాడే శ్రక్తి ప్రదాయిని. సాధారణ, సిజేరియన్ ఏ ప్రసవం అయినా మొదటి తల్లిపాలు శిశువుకు తప్పక ఇవ్వాలి. ఈ విషయాన్ని తల్లికాబోయే ప్రతి ఒక్కరికీ చెబుతుంటాం. పాలు ఎలా పట్టాలి, శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు వృద్ధి చెందడానికి ఎలాంటి పోషకాలు గల ఆహారాన్ని తీసుకోవాలో వివరిస్తాం. ప్రతీ తల్లి తన బిడ్డ ఆరోగ్య భవిష్యత్తుకు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఇదే. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం లో తప్పనిసరి అవగాహన పెంచుకోవాలి. తల్లికి తగినంత మద్దతునివ్వాలి. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్∙ -
యోగా, డైట్తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్గా మోనాసింగ్
బరువు తగ్గడంలో ఎందరో ప్రముఖుల, సెలబ్రిటీలు స్ఫూర్తిగా నిలిచారు. అయినప్పటికీ అత్యంత కష్టసాధ్యమైన ఈ టాస్క్ని వ్యసనంలా చేస్తే ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. అలా పూర్తి ఫోకస్ పెట్టి చేస్తేనే..కచ్చితంగా త్వరిత గతిన బరువు తగ్గిపోతారట. అదీగాక చూస్తుండగానే వేగవంతంగా మనలో వస్తున్న మార్పులను చూసి ఆత్మవిశ్వాసంగా ఫీలవుతామని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి మోనాసింగ్. అదెలాగో సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ టెలివిజన్ సీరియల్తో జస్సీ జైస్సీ కోయి నటి మోనాసింగ్ పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చివరగా ముంజియా అనే మూవీలో కనిపించారు. గత కొంత కాలం మూవీలకు దూరంగా ఉన్నా ఆమె పాన్ పర్దా సర్దా అనే గ్యాంగ్ స్టర్ సిరీస్ కోసం బరువు తగ్గాలని నిర్మాతలు కోరడంతో వెయిట్ లాస్ అయ్యేందుకు సద్ధమైనట్లు తెలిపింది. వాస్తవానికి ఆమె కూడా గత కొన్నాళ్లుగా బరువు తగ్గాలని అనకుందని గానీ కుదరలేదు. కొత్త ఏడాది సందర్భంగా కూడా బరువు తగ్గే ప్రయత్నం చేయాలనకున్నా సాధ్యం కాలేదు. కానీ ఆ సిరిస్లో తన పాత్ర కోసం బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వెంటనే కసరత్తులు ప్రారంభించింది. నిజానికి బరువు తగ్గడం అనగానే నచ్చిన ఆహారం త్యాగం చేయడం అని ఫీలవుతుంటారు. కానీ ఫలితాలు మంచిగా వస్తున్నప్పుడల్లా అదేమంతా భారమైన పని కాదని అదిమలనో భాగమయ్యేలా వ్యసనంలా మారిపోతుందని అంటోంది మోనాసింగ్. బరువు తగ్గడం అంటే..మంచి ఆకృతిలోకి మారి అందంగా కనిపించడం అనుకుంటే ఏమంత కష్టం కాదట. తాను వెయిట్ లాస్కి ఉపక్రమిస్తున్నా అనగానే..తినే ఆహరంపై స్పష్టత కలిగి ఉండటం, వ్యాయామాలు చేయడమని ఫిక్స్ అయ్యానంటోంది. తన యోగా గురువు చెప్పిన అద్భత ట్రిక్ ఫాలో అవ్వడంతోనే కేవలం ఆరునెలల్లో ఏకంగా 15 కిలోలు తగ్గానని అంటోంది. "రోజుకి ఒకపూట తింటే ఆరోగ్యం, అదే రెండు పూటలా తింటే అనారోగ్యం, అలా కూడా కాకుండా మూడు పూటలా తింటే రోగి" అని ఆదే ఆరోగ్య సూత్రమని చెప్పుకొచ్చింది. తాను ఆరోగ్యకరమైన జీవనశైలితోనే ఇంతలా బరువు తగ్గినట్లు వివరించింది. రాత్రి 9.30 కల్లా నిద్రపోతే సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటోంది. మనకోసం మనం సమయం కేటాయించు కోవాలని సూచించింది. ఇన్నాళ్లు సోమరితనం కారణంగానే దీన్ని సాధించలేకపోయాని చెప్పింది. ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడమే కష్టం తప్ప బరువు తగ్గడం కష్టం కాదంటోదామె. ఆరోగ్య నిపుణుల సంరక్షణలో మంచి జీవనశైలిని పాటిస్తే త్వరితగతిన మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది మోనాసింగ్.(చదవండి: ఆ మట్టి'..మెళియాపుట్టి..! ఔరా అనిపిస్తున్న కళాకారులు..) -
'ఆ మట్టి'..మెళియాపుట్టి..!
ఆ మట్టికి సాష్టాంగ నమస్కారాలు పెడతారు. అదే మట్టిని మండపంలో పెట్టి పూజలు చేస్తారు. ఫల పుష్పాదులు సమర్పించి పండగ చేస్తారు. ఆ మట్టి.. మెళియాపుట్టి. ఇక్కడ ఇరవై ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక చవితి, దసరా సీజన్ వచ్చిందంటే ప్రతిమల కోసం అంతా ఈ ఊరికి క్యూ కడతారు. విగ్రహాలతో పాటు దీపాలు ఇతర మట్టి సామగ్రిని కూడా తయారు చేయడం వీరి ప్రత్యేకత. మెళియాపుట్టి: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కా వడానికి ఇంకా కొద్దిరోజులే ఉంది. మెళియాపుట్టిలో అప్పుడే సందడి మొదలైపోయింది. ఇక్కడ మట్టితో విగ్రహాలు, పూజా సామగ్రి తయారుచేస్తూ కళాకారులు బిజీగా బిజీగా గడుపుతున్నారు. మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ ప్రాంతంలో నివాసముంటు న్న కొన్ని కుటుంబాలు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తాయి. ఏటా చిన్న విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద విగ్రహాల తయారీలో వారికి మంచి పట్టుంది. వీరు తయారు చేసిన ప్రతిమలను చూస్తే ప్రతిభను కొనియాడకుండా ఉండలేం. చుట్టుపక్కల మండలాల నుంచి సైతం విగ్రహాలకు అడ్వాన్సులు ఇస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. ధరలు తక్కువగా ఉండడంతో పాటు విగ్రహాలు కూడా అందంగా..రంగురంగుల్లో ఆకర్షణీ యంగా తయారు చేయడంతో ఎక్కువగా మెళియాపుట్టిలోనే విగ్రహాలు కొనుగోలు చేస్తామని కొనుగోలు దారులు చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా మట్టి విగ్రహాలు తయా రు చేయడంతోనే వీరికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. కొంత మంది యువత వారికి కావాల్సిన విధంగా గణపతి విగ్రహాలు తయారు చేయించుకుంటారని విక్రయదారులు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ను వినియోగించి తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం కలుగుతుందని, అందుకే మట్టితోనే చేస్తున్నామని వారు చెబుతున్నారు. విగ్రహ తయారీలో కర్రలు, మట్టి, వరిగడ్డి, కొన్ని తాళ్లను మాత్రమే వారు వాడుతారు. 20 ఏళ్లుగా వీరు వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఏటా కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సహకారం కావాలి మట్టితోనే విగ్రహాలు తయారు చేయడంతో సంతృప్తి చెందుతు న్నాం. మట్టితో విగ్రహాలు తయా రు చేయడం చాలా కష్టం. తయారు చేసిన తర్వాత చాలారోజులు ఉంచి అప్పుడు రంగులు వేయాలి. వాటిని భద్రపరచడారనికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నాం. రేకుల షెడ్లు వేసుకోవడానికి ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలి. – బూరగాన సవరయ్య, విగ్రహ తయారీ దారుడు, మెళియాపుట్టి గ్రామం మట్టి ప్రమిదలకు గిరాకీ ఎక్కువ మట్టి ప్రమిదలు నిత్యం తయా రుచేస్తూనే ఉంటాం. వినాయక ఉత్సవాలకు అత్యధిక మండపాల్లో దీపారాధన చేస్తారు. వేల సంఖ్యలో ప్రమిదలు కొనుగోలు చేస్తారు. వినాయక చవితి వస్తే ఇంటిల్లిపాదీ నిమగ్నమై పనులు చేస్తాం. – రేఖాన ఉమ, మెళియాపుట్టి గ్రామం (చదవండి: 'నాన్న' అని పిలవలేం ..! పాపం అంజలి, అవినాష్..) -
అప్పుడు శత్రువు..ఇవాళ జీవిత భాగస్వామి..! ఇంట్రస్టింగ్ లవ్స్టోరీ..
కొన్ని ప్రేమకథలు ఫన్నీగా వెరైటీగా ఉంటాయి. అసలు వీళ్లద్దరికి ఎలా కుదిరిందిరా బాబు అనేలా ఉంటాయి వారి లవ్స్టోరీలు. టామ్ అండ్ జర్నీలా కొట్టుకునేవాళ్లే భార్యభర్తలైతే వామ్మో అని నోరెళ్లబెడతారు అంతా. అచ్చం అలాంటి లవ్స్టోరీనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఆమెకు అతడు పరమ శత్రువు..ఇవాళ ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.ఫ్రెండ్షిప్డే రోజున నెట్టింట వైరల్ అవుతున్న ఈ లవ్స్టోరీ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆంచల్ రావత్ ఒకప్పుటి శత్రవు తన జీవిత భాగస్వామిగా ఎలా అయ్యాడో వివరిస్తూ సోషల్ మీడియాలో తన ప్రేమకథను షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ తన భర్తతో తన కథ ఎలా ప్రారంభమైందో చెప్పుకొచ్చారు. పాఠశాల చదువుకునే రోజుల్లో తన భర్త క్లాస్మేట్ అని తెలిపింది. అయితే తాను స్కూల్డేస్లో అబ్బాయిలంటే ఇష్టపడని అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. వారితో స్నేహానికి కూడా నో ఛాన్స్ అన్నట్లుగా ఉండేదాన్ని అని నాటి తన బాల్యాన్ని గుర్తుచేసుకుందామె. అయితే తన క్లాస్లో అత్యంత సిగ్గుపడు ఒక క్లాస్మేట్ తనతో భోజనం షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాడట. దాంతో తనకు చిర్రెత్తికొచ్చి తన లంచ్ బాక్స్ని విరగొట్టేసిందట. ఆ రోజు దాదాపు అతడిని ఏడిపించేంత పనిచేశానంటూ నాటి ఘటనను గుర్తుచేసుకుంది. ఆ సంఘటనతో అతడు తనతో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదట. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒక మ్యారేజ్ వెబ్సైట్ ఆ క్లాస్మేట్ని చూసిందట. అలా ఇద్దరు కలుసుకున్నారట. అప్పుడు అతడు తన ఫస్ట్ మెసేజ్లో ఆమెకు నా టిఫిన్ బాక్స్ కొనిస్తావా అని టెక్స్ట్ పంపించాడట. అలా మళ్లీ ఇరువురు కలుసుకుని పెళ్లితో ఒక్కటయ్యారట. అలా నాటి శత్రువు తన భర్తగా మారాడంటూ తన ప్రేమకథను పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేగాదు హ్యపీ ఫ్రెండ్షిప్ డే పతి దేవ్ అంటూ క్యాప్షన్ కూడా జోడించిందామె. నెటిజన్లు కూడా నాటి వైరం ప్రేమగా చిగురించిందని మాట అంటూ ఆ జంటను ప్రశంసించగా, మరికొందరూ ఊహించని విధంగా ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో చెప్పలేం అని కొందరూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..! అలనాటి ఆటల మజా..) -
ఆడేద్దామా..'అష్టాచెమ్మ'..!
వైకుంటపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. పులి–మేక.. ఈ పేర్లన్నీ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన నేటితరానికి అప్పటి ఆటల్లో ఉన్న మజా.. అసలే తెలియకపోవచ్చు. అలాంటి ఆటల పట్ల బాలలకు ముచ్చటగొలిపేలా కృషి చేస్తోంది.. ‘క్రీడ’ సంస్థ. వీరితోపాటు పెద్దలకు సైతం గత స్మృతులను గుర్తుచేసే ప్రయత్నం చేస్తోంది.. ఈ ఆటలు ఆడిన నగరానికి చెందిన కొందరు పెద్దలు చాలా కాలం తర్వాత ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు. నగరీకరణలో భాగంగా మనలో చాలా మంది ఆర్టిఫీషియల్ లైఫ్కి అలవాటుపడిపోయారు. ఎంత వరకూ ఉద్యోగాలు, వ్యాపారాలు, సమాజిక మాధ్యమాలు ఇవే తప్ప సహజసిద్ధమైన ఆటలను మర్చిపోతున్నారు. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆనందానికి దోహదపడే అచ్చతెలుగు ఆటలైన వైకుంఠపాళి.. అష్టాచెమ్మా.. వామనగుంట.. వంటి పేర్లన్నీ వింటుంటే 1970–80 కాలం నాటి రోజులు తప్పకుండా గుర్తుకొస్తాయి.. మైక్రో ఫ్యామిలీలుగా మారిపోతున్న కల్చర్లో నానమ్మలు, తాతయ్యల వద్ద పెరిగే వారే లేరంటే అశ్చర్యపోవాల్సిన పని. ఒకవేళ ఉన్నా.. టెక్నాలజీ మోజులో పడి పులిని చూసి నక్క వాతబెట్టుకున్న చందాన ఆన్లైన్ గేమ్స్ అలవాటు చేసి.. ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి కుటుంబాలకు దూరమైన కొందరు ఒంటరితనాన్ని తగ్గించుకునేందుకు సామాజిక మాధ్యమాల చట్రంలో ఇరుక్కుపోయి వాటికి పూర్తిగా బానిసలవుతున్నారు. నగరంలోని ‘క్రీడ’ సంస్థ ఈ ఆటలపట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12 లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆవరణలో నాటితరం ఆటలను నేటి తరానికి పరిచయం చేస్తోంది. అందుకు తగిన ఏర్పాటను సైతం చేసింది. పిల్లలు పెద్దలు చక్కగా ఆటలోని మజాను ఆస్వాదిస్తున్నారు. క్రీడ సంస్థ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన వారు కూడా.. అలనాటి ఆటలు ఈ తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయగా.. అప్పటి తరంలోని కొందరు.. 80 ఏళ్లకు పైబడిన వారు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పులి–మేక, దాడీ, అచ్చంగిల్ల వంటి ఆటలను ఆడించడమే కాదు.. నాటి, నేటి తరానికి చెందిన కొందరికి ఈ ఆటలను ఎలా ఆడాలో నిర్వాహకులే నేర్పిస్తున్నారు.. పిల్లలు, పెద్దలు కూడా ఈ ఆటలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. మెదడుకు పదును.. ఈ ఆటలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయని, వీటిని ఆడటం వల్ల మెదడుకు పదును పెరుగుతుందని, పైగా దీనివల్ల దు్రష్పభావాలు కూడా ఏమీ ఉండవని, ఒత్తిడిని సైతం జయించవచ్చని పలువురు నిపుణులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇటువంటి ఆటల వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని, పైగా క్రీడాస్ఫూర్తి కూడా పెరుగుతుందని, ఓటమిని సైతం తట్టుకునే శక్తి వస్తుందని, పైగా పరిచయాలు బలపడతాయని చెబుతున్నారు. మెల్లమెల్లగా కనుమరుగవుతున్న ఇటువంటి ఆటలను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వెలుగులోకి తీసుకురావడం మంచి పరిణామమని చెబుతున్నారు. నేటి తరం కోసం.. నాకు మా అమ్మమ్మ అష్టాచెమ్మాతో పాటు వామనగుంట, వైకుంఠపాళి, సోలాసీబీ వంటి ఆటలను నేరి్పంచింది. మా అమ్మకు ఈ ఆటలన్నీ రావు. నాకు నేర్చుకోవాలని ఉన్నా చెప్పేవారు లేరు. పిల్లలకు వీటి గురించి చెప్పేవారే కరువయ్యారు. అందుకే క్రీడ అనే సంస్థ ద్వారా నెలలో 25 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నాను. ఇది పూర్తిగా ఉచితం. చిన్నా పెద్దా అందరూ వచ్చి ఆడుకోవచ్చు. వీటి గురించి నేరి్పంచడమే కాకుండా ఆడిస్తాం. ఇక్కడ రోజుకు 200 మంది వరకూ వస్తున్నారు. – వినీత సిద్ధార్థ, క్రీడ సంస్థ నిర్వాహకులుఇదో మంచి ప్రయత్నం.. మా దగ్గర అలనాటి ఆటల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషమేసింది. ఈ ఆటల గురించి తెలియని వారికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను కూడా సరదాగా ఆడుకున్నా. ఈ ప్రయత్నం అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయిస్తాం. పిల్లలు, పెద్దలు ఇందులో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొద్దిసేపు నేను కూడా ఆడుకుని నాటి రోజులను గుర్తుచేసుకున్నా. – విజయలక్ష్మి, సీసీటీ సభ్యురాలు (చదవండి: Masaba Gupta Weight Loss Tips: డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్) -
వర్చువల్ ఫ్రెండ్.. సోషల్ ట్రెండ్..
రంగురంగుల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్.. వెరైటీ గ్రీటింగ్ కార్డ్స్.. గ్రూప్ గ్యాథరింగ్స్.. ఇది ఒకప్పటి మాట.. ఫ్రెండ్షిప్ డే అంటే వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది.. ఎవరికి బ్యాండ్ కట్టాలి.. ఏం మెసేజ్ ఉన్న గ్రీటింగ్ ఇవ్వాలి.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి.. అనే మీమాంస కొనసాగేది.. అయితే నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ స్నేహితుల దినోత్సవాన్ని కూడా కొత్తరాగం తీయిస్తోంది.. వర్చువల్ ఫ్రెండ్.. సోషల్ ట్రెండ్ అన్నట్లు గతకాలపు జ్ఞాపకాలతో కూడి రీల్స్, లైక్స్, షేర్స్, వాట్సాప్ స్టేటస్ల హోరుతో సెలబ్రేషన్స్ నడిచాయి.. మారిన మానవుని లైఫ్స్టైల్ స్నేహితుల దినోత్సవాన్నీ ప్రభావితం చేస్తోంది.. భౌతిక మిలాకత్లకు దూరంగా.. వర్చువల్ పరామర్శలకే పరిమితమైంది. స్నేహితులతో సరదాగా తాము తిరిగిన ఫేవరెట్ ప్రదేశాల్లో గడపాల్సిన సమయాన్ని స్క్రీన్ టైం మింగేసిందా? అన్నట్లు నడిచింది. మునుపటి మధుర స్మృతులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సినిమా పాటలకు మిక్స్ చేస్తూ.. మరోసారి ఆ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఖండాలను దాటి.. డిజిటల్ కాలంలో స్నేహం.. కొత్తగా చిగురులను తొడుగుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వీడియో కాల్స్తో కనెక్ట్ అవుతున్నారు. అర్రే నా మిత్రులను కలవలేకపోతున్నానే అనే భావనను, బాధను చెరిపేస్తూ..ఫేస్బుక్, ఇన్స్టా వంటి వేదికలు వేల మంది స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది. కొత్తవారిని సైతం పరిచయం చేస్తోంది. నేరుగా కలవకున్నామనే బాధను తొక్కిపెట్టి.. అంతకుమించిన ఆనందాన్ని పంచుతోంది. (చదవండి: అరకు విహారం..ఘుమ ఘుమల కాపీ సేవనం..!) -
అరకు విహారం.. ఘుమ ఘుమల కాపీ సేవనం..!
అరకు టూర్ అంటే అరకొరగా ఉండదు. జీఐ ట్యాగ్ సొంతమైన కాఫీ రుచిలా ఉంటుంది. చక్కటి పచ్చదనం మధ్య కాఫీ తోటల్లో విహారం. చిక్కటి కాఫీ ఘుమఘుమల మధ్య ప్రకృతి వీక్షణం. గాలికొండ నుంచి నేలమ్మకు వందనం చేయడం. బొర్రా గుహల రాతి శిలల శిల్పచాతుర్యం. ఆదివాసీ మ్యూజియం చెప్తున్న నాటి జీవనశైలి...అందుకే దీనిని తూర్పు కనుమల రత్నం అన్నారు. వీటన్నింటినీ చూపిస్తుంది అరకులోయ పర్యటన.విశాఖపట్నం నుంచి అరకుకు సాగే ప్రయాణమే ఓ అద్భుతం. కేరళలోని వయనాడు ప్రయాణం పశ్చిమ కనుమల సౌందర్యానికి అద్దం పడుతుంది. తూర్పు కనుమల లాలిత్యానికి అరకు ప్రయాణం దర్పణమవుతుంది. ఈ కాఫీ రుచి కొలమానం ప్రపంచస్థాయి అవార్డే. జీఐ ట్యాగ్ అందుకున్న కాఫీ ఇది. కాఫీ గింజలు ఓ రకమైన కమ్మదనాన్ని గాల్లో మోసుకొస్తుంటాయి. తోటల్లో విహరిస్తున్నప్పుడు చెట్ల ఆకులు ఒంటిని తాకుతూ కలిగించే గిలిగింతను మాటల్లో వర్ణించలేం. కాఫీ చెట్ల లేత ఆకులు ముదరు కాఫీ గింజ రంగులో ఉంటాయి. లేత కాఫీ గింజలు పచ్చగా ఉంటుంది. ముదిరే కొద్దీ చిక్కటి ఎరుపుదనం సంతరించుకుంటాయి. ఎండిన తర్వాత నల్లగా మారుతాయి. కాఫీ తోటల విహారం తర్వాత ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్క ప్రదేశమూ మినిమమ్ గ్యారంటీ ఆహ్లాదాన్నిస్తాయి.ట్రైబల్ మ్యూజియంఅరకు బస్ స్టేషన్ నుంచి కేవలం పావుకిలోమీటరు లోపే ఉంటుంది మ్యూజియం. తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యం ఈ విజిట్లో ప్రత్యేక ఆకర్షణ. అరకు, విశాఖపట్నం పరిసరాల్లో 19 రకాల ఆదివాసీ జాతుల వాళ్లు నివసించేవారు. ట్రైబల్ కల్చర్, అందులోని వైవిధ్యతను పరిరక్షించే ఉద్దేశంతో దీనిని 1996లో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఆదివాసీలు ప్రాచీన కాలం నుంచి ఉపయోగించిన వస్తువులు, ధరించిన ఆభరణాలు, దుస్తులు, వేటాడే సాధనాలు, వంట సామగ్రి, వారి పెళ్లి వేడుక ఫొటోలు ఉన్నాయి. ఆదివాసీలు రూపొందించిన చిత్రలేఖనాలు, కళారూపాలను కూడా చూడవచ్చు. వారి మయూర నృత్యం, ధింసా నృత్యం (dhimsa dance) శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎర్రమట్టితో నిర్మించి తెల్లటి అంచులతో ఈ భవనం ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఈ మ్యూజియం ఉదయం పది గంల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియం కావడంతో టికెట్ నామమాత్రమే. పెద్దవాళ్లకు పది రూపాయలు, పిల్లలకు ఐదు రూపాయలు.పద్మపురం గార్డెన్స్ఇది అరకు బస్ స్టేషన్ (Araku Bus Station) నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన గార్డెన్ ఇది. పాతిక ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గార్డెన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలన కాలంలో 1942లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పండిన కూరగాయలు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల కోసం వెళ్లేవని చెబుతారు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ గార్డెన్ని హార్టికల్చర్ నర్పరీ, మొక్కల పెంపకంలో శిక్షణ కేంద్రంగా మార్చారు. ఇక్కడి వృక్ష శిల్పాలు కనువిందు చేస్తాయి. చెట్టుని శిల్పం ఆకారంలో మలిచి పెంచడానికి కొన్నింటికి దశాబ్దాలు పడుతుంది. ఈ గార్డెన్ మొత్తం తిరిగి చూడడానికి టాయ్ ట్రైన్ ఎక్కాలి. ఈ గార్డెన్లో ట్రీ టాప్ హట్స్ ఉన్నాయి. అంటే చెట్టు మీద గుడిసెలన్నమాట. టూరిస్టులు రాత్రి బస కోసం బుక్ చేసుకోవచ్చు. వీటిని హ్యాంగింగ్ కాటేజ్ అంటారు. ఈ గార్డెన్స్లో రోజ్ గార్డెన్ ఉంది. పద్మపురం గార్డెన్స్కి ఎంట్రీ టికెట్ పది రూపాయలు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి.కుర్సురా మ్యూజియంఇది దేశ భద్రత కోసం 31 సంవత్సరాల΄ాటు నిర్విరామంగా సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న సబ్ మెరైన్. ఇండో– పాక్ యుద్ధంలో ఈ సబ్మెరైన్ అరేబియా సముద్రంలో గస్తీ కాసింది. ఆ తర్వాత అండమాన్ దీవులలో సేవలందించి తన సర్వీస్ కాలంలో 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించిన ఈ సబ్మెరైన్ 2001 నుంచి విశ్రాంతిలో ఉంది. ఇంతటి సమగ్రమైన సబ్మెరైన్ను ప్రభుత్వం 2002 లో ప్రదర్శనశాలగా మార్చింది. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా వినోదభరితంగా జ్ఞానాన్ని పంచే అధ్యయన కేంద్రం. దీని నిర్వహణకు ప్రభుత్వానికి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. అయితే ఈ సబ్మెరైన్ వీక్షణానికి వచ్చే పర్యాటకుల ఎంట్రీ టికెట్ల మీద ఏడాదికి కోటి రూపాయలను సంపాదిస్తోందీ సబ్మెరైన్. రోజుకు ఐదారు వందల మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంటుంది. విశాఖపట్నానికి వచ్చిన వాళ్ల రామకృష్ణ బీచ్ని, అందులో ఉన్న సబ్మెరైన్ మ్యూజియాన్ని చూడకుండా రారంటే అతిశయోక్తి కాదు.కైలాసగిరిఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో ఆరువందల అడుగుల ఎత్తున్న కొండ. సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకోపార్కు ఇది. రోప్వేలో కొండమీదకు వెళ్లడం పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా జాయ్ఫుల్గా ఉంటుంది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవార్డు అందుకున్న పర్యాటక ప్రదేశం ఇది. స్థానికులు, బయటి వాళ్లు అంతా కలిసి కైలాసగిరిని రోజుకు మూడు వేల మందికి పైగా సందర్శిస్తారు.గాలికొండ వ్యూపాయింట్ఈ టూర్లో తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యాన్ని అనంతంగా ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం– అరకు రీజియన్లో ఎత్తైన ప్రదేశం గాలికొండ. 4,320 అడుగుల ఎత్తు ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంలో షేడ్స్ను లెక్కపెట్టాలంటే ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తున్నంత సేపూ కనురెప్ప వేయకుండా చూడాలి. ఇక బొర్రా గుహలు (Borra Caves) ఓ ప్రకృతి అద్భుతం. గుహల పై కప్పు నుంచి స్టాలగ్మైట్ ధారలు ధారలుగా కారుతూ వాతావరణంలో మార్పులతో గడ్డకట్టి΄ోయి ఉంటుంది. అమరనాథ్ లో మంచు శివలింగం రూపం సంతరించుకున్నట్లు ఇక్కడ స్టాలగ్మైట్తో ఏర్పడిన శివలింగం రూపానికి పూజలు చేస్తారు. అమర్నాథ్ మంచులింగం ఏటా కరిగిపోతూ కొత్తగా రూపుదిద్దుకుంటుంది. బొర్రా గుహల్లోని స్టాలగ్మైట్ శివలింగం స్థిరంగా ఉంటూ ఉంటుంది.చందనోత్సవ సింహాచలంశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఏడాదంతా చందనలేపనంతో ఉంటాడు. ఏడాదికోసారి చందనోత్సవం జరుగుతుంది. ఈసందర్భంగా పాత చందన లేపనాన్ని తొలగించి కొత్తగా చందనలేపనం చేస్తారు. స్వామి దేహం నుంచి తీసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలో కప్పస్తంభం అని ఉంటుంది. అది కప్పం అనే పదం నుంచి వచ్చింది. రాజుకు కప్పం కట్టని ఉద్యోగులను ఆ స్తంభానికి కట్టేసి శిక్షించేవారని స్థానిక కథనం. ఇప్పుడు భక్తులను ఆ స్తంభానికి కట్టేసి, తాడుతో సున్నితంగా రెండు దెబ్బలు వేస్తారు. ఆ స్తంభాన్ని కౌగలించుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని ఒక విశ్వాసం. సంతానాన్ని కోరుకునే వారు. పుట్టిన సంతానాన్ని దేవుని దర్శనానికి తీసుకువచ్చి మొక్కు తీర్చుకునే వారు. దాంతో కప్పస్తంభాన్ని కౌగలించుకుని కోరుకుంటే సంతానం కలుగుతుందనే అభిప్రాయం వాడుకలోకి వచ్చింది. సింహాచలంలో సంపెంగ పూలు ప్రసిద్ధి. చందనం రంగులో పొడవుగా ఉండే ఈ పూలను అటవీ ప్రదేశం నుంచి ఆదివాసీలు సేకరించి తెస్తారు. వాటిని మాలలుగా కట్టి అమ్ముతారు. ఈ టూర్ గుర్తుగా ఓ దండ కొనుక్కుని తలకు అలంకరించుకోవచ్చు లేదా మెడలో మాలగా వేసుకుని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.అన్నవరంశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతటి ప్రసిద్ధి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పురాణాల్లో ఉదహరించిన రత్నాచలం అనే ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ ఆలయం ఉన్న కొండ పేరు రత్నగిరి. ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అరకు టూర్లో రైలు, రోడ్డు రవాణా సంస్థలు నిర్వహిస్తున్న ఈ రెండు ప్యాకేజ్లలో ఉన్న ప్రధానమైన తేడా అన్నవరం, సింహాచలం ఆలయాల విషయంలోనే. తెలంగాణ టూరిజమ్ బస్సు టూర్లో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ టూర్లో వెళ్తే సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన పర్యాటక ప్రదేశాలు రెండు టూర్లలోనూ ఒకే విధంగా ఉంటాయి. బస్ టూర్లో థింసా నృత్యం అదనం.జ్యూవెల్ ఆఫ్ ఈస్ట్కోస్ట్ ఐదు రోజుల టూర్లో విశాఖపట్నం, అరకు కవర్ అవుతాయి. అరకులో పర్యటించడానికి సెప్టెంబర్ నుంచి అనువైన సమయం. దసరా సెలవులకు ప్లాన్ చేసుకుంటే కాఫీ తోటల సౌందర్యాన్ని ఆస్వాదించడంతోపాటు పిల్లలకు సబ్ మెరైన్ నేవీ యుద్ధ నౌకను చూపించవచ్చు.ఐఆర్సీటీసీ టూర్ ఇలా ఉంది!మొదటి రోజు: గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు 12728 నంబర్ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది.రెండవ రోజు: శుక్రవారం ఉదయం 5.55 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఐఆర్సీటీసీ టూర్ నిర్వహకులు పర్యాటకులను రిసీవ్ చేసుకుని హోటల్కు తీసుకెళ్తారు. చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీ టూర్. కాళీమాత ఆలయం, సబ్మెరైన్ మ్యూజియం వీక్షణం తర్వాత హోటల్కు వచ్చి లంచ్ చేయడం. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి సందర్శనం, రిషికొండ బీచ్ విహారం. రాత్రి బస విశాఖపట్నం హోటల్లో.మూడవ రోజు: బ్రేక్ఫాస్ట్ తర్వాత రోడ్డు మార్గాన అరకుకు ప్రయాణం. టైడా జంగిల్ బెల్స్ ఎకో టూరిజమ్ రిసార్ట్లో సేదదీరడం, పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం విజిట్ తర్వాత లంచ్ విరామం. మధ్యాహ్నం తర్వాత గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల విహారం తర్వాత సాయంత్రానికి తిరిగి విశాఖపట్నంలోని హోటల్కు చేరడం, రాత్రి బస.నాలుగవ రోజు: బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. దారిలో సింహాచలం దేవస్థానం, రామకృష్ణ బీచ్లో విహారం తర్వాత నాలుగు గంటలకు విశాఖపట్నంలో స్టేషన్లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ట్రైన్ నంబర్ 12727 గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.ఐదవ రోజు: ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ధరలివి: కంపర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ), సింగిల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 28 వేల రూపాయలవుతాయి. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 17 వేలవుతాయి. ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా ఉంటుంది.స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్) సింగిల్ షేరింగ్లో 26 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్లో 15 వేలకు పైగా, ట్రిపుల్ షేరింగ్లో 11 వేలకు పైగా అవుతుంది.ప్యాకేజ్లో మూడు బ్రేక్ఫాస్ట్లు, ఒక లంచ్, రెండు డిన్నర్లుంటాయి.ఇది వీక్లీ టూర్. గురువారం మాత్రమే ఉంటుంది. ఇవి వర్తించవు: ప్యాకేజ్లో సూచించిన భోజనాలు తప్ప ఇతర భోజనాలు పర్యాటకులు సొంతంగా భరించాలి. రైల్లో కొనుక్కున్న తినుబండారాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్రైడింగ్ వంటి ఇతర టికెట్లు వగైరాలు ప్యాకేజ్లో వర్తించవు.టూర్ కోడ్: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR027తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్నరోడ్ ప్యాకేజ్ ఇలా ఉంది!మొదటి రోజు: సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని పర్యాటక భవన్ (బేగంపేట, గ్రీన్ల్యాండ్స్) నుంచి తెలంగాణ టూరిజమ్ బస్ బయలుదేరుతుంది. అదే బస్సు ఆరున్నరకు బషీర్బాగ్ సీఆర్వో ఆఫీసు చేరుతుంది. ఆ స్టాప్కు సమీపంలో ఉన్న వాళ్లు అక్కడే ఎక్కవచ్చు. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.రెండవ రోజు: ఉదయం ఆరు గంటలకు బస్సు విశాఖపట్నం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీటూర్. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం విజిట్, బీచ్ విహారం తర్వాత హోటల్కు చేరడం, రాత్రి బస.మూడవ రోజు: ఉదయం ఆరు గంటలకు అరకుకు ప్రయాణం. ట్రైబల్ మ్యూజియం విజట్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్లో విహారం, బొర్రా గుహల వీక్షణం, ధింసా నాట్యాన్ని ఆస్వాదించడం ఆ రాత్రికి అరకులో బస.నాలుగవ రోజు: అరకు నుంచి అన్నవరానికి ప్రయాణం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత బస్సు ప్రయాణం హైదరాబాద్కు సాగుతుంది.ఐదవ రోజు: ఉదయం ఏడు గంటలకు బస్సు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.బస్ ప్యాకేజ్ ఇలా...తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్న అరకు టూర్ ప్యాకేజ్లో పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 6,999 రూపాయలు, పిల్లలకు 5,599 రూపాయలు.ప్యాకేజ్లో నాన్ ఏసీ బస్సు ప్రయాణం, వైజాగ్లో ఏసీ బస, అరకులో నాన్ ఏసీ బస ఉంటాయి.ఆహారం, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్లు, బోటింగ్ వంటివేవీ వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి చదవండి: వైష్ణోదేవి దర్శనం.. హిమాలయాల వీక్షణం..! -
డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..! మసాబా గుప్తా హెల్త్ టిప్స్
బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా దంపతులు గతేడాది అక్టోబర్లో పండంటి బిడ్డకు స్వాగతం పలికారు. ఓ తల్లిగా బిడ్డతో బిజీ బిజీగా లైఫ్ సాగిపోతున్నా.. ఆమె తన ఫిట్నెస్పై ఫోకస్ని పెట్టడమే కాదు అదనపు బరువుని కూడా తగ్గించుకున్నారు. సాధారణంగా ప్రతి మహిళ ప్రెగ్నెన్నీలో బరువు పెరగడం సహజం. అయితే ప్రసవానంతరం ఆ బరువుని తగ్గించుకోవడం అనేది అంత ఈజీ కాదు. అయితే మసాబా మాత్రం దాన్ని ఈజీగానే సాధించారు. పైగా డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తూ..టిప్స్ కూడా షేర్ చేసుకున్నారు. అవేంటంటే..ప్రసవానంతరంలో ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే బరువు తగ్గడం సులభం అని అంటోంది. తాను ప్రసవానంతరం ఆరు నెలలు బాదం పాలు, వేయించిన కూరగాయలు, కాల్చిన చేప, ఎల్లప్పుడూ తేనె బాల్సమిక్ వెనిగ్రెట్(క్రంచింగ్ కోసం విత్తనాలు) తీసుకున్నట్లు తెలిపారు. వాటి తోపాటు గుడ్లు, వేరుశెనగ, వెన్నటోస్ట్, బీట్రూట్, చికెన్, ఓట్స్ అంజూర పండ్లు, తదితరాలు తీసుకునేదాన్ని. తల్లిగా బిడ్డకు పాలిచ్చేలా, తన బరువు బ్యాలెన్స్ చేసుకునేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్నే తీసుకునేదాన్ని అని ఆమె వివరించారు. అలాగే కుదిరినంతలో తేలికపాటి వ్యాయామాలు, కెటిల్బెల్ సెషన్ వ్యాయామాలు తదితరాలు చేశానని చెప్పుకొచ్చారు. ఇవి కండరాల కదలికలకు, ఫ్యాట్ని కరిగించడంలో సమర్థవంతంగా ఉంటాయని అన్నారు. అలా తాను పదికిలోలు బరువు తగ్గినట్లు వివరించారామె. స్ట్రాంగ్ ఫోకస్ ఉంటేనే బరువు తగ్గడం సాధ్యమవుతుందని అంటోంది మసాబా గుప్తా.(చదవండి: అరుదైన స్ట్రోక్తో..మెడుల్లాపై దాడి!) -
స్నేహం..ఆరోగ్యం..మహాభాగ్యం..
‘నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే.. నీతూ, రీతూ, కాదు కాదు శ్వేత.. అంటూ ఇప్పుడు కొందరు అమ్మాయిలు/అబ్బాయిలు తల బద్ధలు కొట్టుకోవడం లేదు.. మై మమ్/ డాక్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఠక్కున సమాధానం చెబుతున్నారు. అవును మరి జిమ్లో వెయిట్స్ లేపాలన్నా, పబ్లో ఛీర్స్ చెప్పాలన్నా కఠినమైన ట్రెక్కింగ్కి వెళ్లాలన్నా, కాలక్షేపంగా కార్డ్స్ ఆడాలన్నా.. ఇప్పుడు బయటకు వెళ్లి ఫ్రెండ్స్ని వెదుక్కోవాల్సిన పనిలేదు. నిన్న కనీ పెంచిన తల్లిదండ్రులే నేడు కంటి ముందున్న స్నేహితులుగా మారిపోతున్నారు. పిల్లలు కూడా భయంతో వణికిపోకుండా.. ప్రతిదీ తల్లిదండ్రులకు షేర్ చేసుకుంటూ.. దునియా మెచ్చే దోస్తీ అనిపించుకుంటున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో పలువురి నగరవాసుల మనోగతం.. ‘అంతకు ముందేమో గానీ మా నాన్న వయసు 70 అంటే ఇప్పుడు అస్సలు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆయన నాకన్నా యంగ్ అండ్ యాక్టివ్..’ అంటూ చెప్పారు సింధు. రిటైర్ అయిన తర్వాత తండ్రికి కాలక్షేపం కోసం ట్రెక్కింగ్ పరిచయం చేశా అనుకున్న ఈ యువతి.. ఆ తర్వాత ఆయన తనతోనే పోటీపడే ట్రెక్కింగ్ ఫ్రెండ్గా మారతారు.. అని అప్పట్లో అనుకోలేదు మరి. ‘ఇప్పుడు ఏ అడ్వెంచర్ చేయాలన్నా నా దృష్టిలో ఫస్ట్ గుర్తుకొచ్చే ఫ్రెండ్ మా నాన్నే’ అంటున్నారీమె. గత కొంత కాలంగా అడ్వెంచర్ యాక్టివిటీస్లో తరచూ పాల్గొంటున్న మణికొండ నివాసి సింధు. తండ్రితో కలిసి జాగింగ్ నుంచి జిమ్ వరకూ, సైక్లింగ్ నుంచి ట్రెక్కింగ్ వరకూ కలిసి పంచుకుంటారు. ‘షి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్’ అంటున్నారు ఆమె తండ్రి.. పిల్లలతో కలిసి ఫ్రెండ్స్గా ఉంటేనే నేటి ట్రెండ్స్ తెలుస్తాయనేది నగరంలోని పలువురు తల్లిదండ్రుల అభిప్రాయం. ప్రస్తుతం పిల్లల ఆలోచనాధోరణులు, వాళ్లను ఆకర్షిస్తున్న కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే తమ పిల్లలకి స్నేహితులుగా మారడాన్ని మించిన మార్గం లేదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ‘మా అబ్బాయి శశాంక్కి షాపింగ్ సహా ప్రతి విషయంలోనూ నేను తోడుండాల్సిందే’ అని గర్వంగా చెబుతున్నారు నగర వాసి సుమన్ కృష్ణ. తనకి యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచే ఒక తల్లిలాగా కాకుండా ఓ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ వచ్చానని ఇటీవలే తన కొడుకుతో కలిసి ఓ ఫారెస్ట్ ట్రెక్ పూర్తి చేసిన సుమన్ అంటున్నారు. నగరవాసి ముంతాజ్ పటేల్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తె తారిణ్ పటేల్తో కలిసి డియోరియేటల్ చంద్రశిల అనే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసి తిరిగొచ్చిన అనుభవాలు మరచిపోలేనివి అంటున్నారామె. నేను యంగ్గా మారిపోయా.. సోషల్ మీడియా సాక్షిగా వన్ ఆఫ్ ది స్టైలిస్ట్ ఫాదర్ అంటూ ప్రశంసలు అందుకునే అలీ సాగర్..నేను యంగ్గా మారిపోయా అంటూ చెబుతున్నారు. ఫ్యాషన్ విషయంలో తన కుమారుడు అమ్మార్కి కూడా టిప్స్ అందిస్తుంటారు. గాగుల్స్ ధరించడం దగ్గర నుంచి థ్రిల్స్లో పాల్గొనడం వరకూ ఈ ఫాదర్ అండ్ సన్ ఇద్దరూ పోటా పోటీగా రెడీ అవుతుంటారు. తరచూ బైక్ రైడ్స్ వేసే తామిద్దరి మధ్య మాట్లాడుకోకూడనివేవీ లేవని, అసలు సీక్రెట్స్ అనేవే లేవని సగర్వంగా చెబుతారు అలీ సాగర్. ‘మా పిల్లలు మా మాట వినడం లేదండీ’, ‘అసలు వాళ్ల లోకంలో వాళ్లుంటున్నారు. ఇలాగైతే ఏమైపోతారో’. ‘ఎంత చెప్పినా వినడం లేదు. అసలు మమ్మల్ని లెక్కే చేయడం లేదు’ ఇలాంటి కంప్లెయింట్స్తో తమను రోజూ పదుల సంఖ్యలో కలుస్తున్న తల్లిదండ్రులకు తాము చెప్పే ఏకైక సలహా.. పిల్లలతో స్నేహం చేయడమే.. అంటున్నారు నగరానికి చెందిన సైకాలజిస్ట్స్. టెక్ యుగంలో చాలా త్వరగా పిల్లలు పేరెంట్స్ మధ్య గ్యాప్ పెరిగిపోవడం సహజమని, ఇప్పుడిప్పుడే కొందరు తల్లిదండ్రుల్లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ స్వాగతించదగ్గ పరిణామమని, ఈ తరహా పరిస్థితి మరింతగా బలోపేతం కావాల్సి ఉందని అంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ కావాలంటే..పిల్లలతో గడిపే సమయంలో వ్యక్తిగత వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. పిల్లలతో మాట్టాడేటప్పుడు తరచూ నేను నీ నాన్నని/అమ్మని అనే మాట పదే పదే గుర్తు చేయకూడదు. పిల్లల ప్రతి మూడ్నీ షేర్ చేసుకోవాలి. అది మనకు ఎంత నచ్చకున్నా వారికి ఇష్టమైన దేనినీ పదే పదే విమర్శించవద్దు. వాకింగ్, జిమ్ వర్కవుట్స్, డ్యాన్స్.. లాంటి పనుల్లో తరచూ వారితో మమేకం అవ్వాలి. వారికి నచ్చిన ఫ్రెండ్స్ని, వారి అభిమాన క్రీడాకారుల్ని వీలైనంత వరకూ మనమూ ప్రశంసిస్తుండాలి. వండిపెట్టాలి, ఇంటిని సర్ధాలి.. ఇలా తల్లిదండ్రుల పనులు అని విభజించకుండా అన్ని పనులూ అందరివీ అనే భావన వారిలో కలిగేలా చేయాలి. వారి ఫెయిల్యూర్స్ సమయంలో తప్పనిసరిగా పక్కనే అండగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా వారితో కమ్యూనికేట్ అవ్వాలి. అయితే అదేదో వారిపై నిఘా ఉంచిన భావన రానీయకుండా చేయాలి అని నగరానికి చెందిన పలువురు సైకాలజిస్టులు పేరెంట్స్కి సూచిస్తున్నారు. (చదవండి: ఉద్యమ స్నేహం..!) -
ఉద్యమ స్నేహం
ఉద్యమ నేపథ్యమే వారి స్నేహానికి విత్తనమయింది. వృక్షం అయింది. స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్కు తోటి ఉద్యమకారులు మలాలా యూసఫ్జాయ్, వెనెస్సా నకేట్లతో మంచి స్నేహం ఉంది. ఉద్యమకారులైనంత మాత్రాన గంభీరంగా ఉండాలని ఏమీ లేదు. ఈ ముగ్గురు మరికొందరు యాక్టివిస్ట్లు చాలా సరదాగా ఉంటారు. బాల్యజ్ఞాపకాల నుంచి సోషల్ మీడియా సరదాల వరకు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటారు. ‘చైతన్యం మూర్తీభవించిన స్నేహితురాలు’ అని ఉగాండ పర్యావరణ ఉద్యమకారిణి వెనెస్సా నకేట్ గురించి గొప్పగా చెబుతుంది గ్రేటా థన్బర్గ్. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని లేడీ మార్గరెట్ హాల్లో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లిన గ్రేటా థన్బర్గ్కు తన నేస్తం మలాలాతో కలిసి బోలెడు ముచ్చట్లు చెప్పుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘షీ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్...’ అనే కాప్షన్తో గ్రేటాతో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది మలాలా. (చదవండి: Friendship Day: 'హార్ట్' ఆఫ్ 'లివింగ్') -
అరుదైన స్ట్రోక్తో..మెడుల్లాపై దాడి!
స్ట్రోక్ అంటే మనకు తెలిసింది మెదడుకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్. అయితే చిన్నప్పట్నుంచీ మనం చదువుకున్న మెదడులోని భాగాలైన పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లా అబ్లాంగేటాలలో... మెడుల్లా అనే భాగానికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశముంది. ఆ భాగానికి స్ట్రోక్ వచ్చినప్పుడు కలిగే కొన్ని నరాల మార్పుల (న్యూరలాజికల్ కండిషన్స్) వల్ల దేహంలోని ఓ పక్క భాగం (అంటే లాటరల్ భాగం) అచేతనమైపోయే అవకాశం ఉంది. ఇలా మెదడులోని మెడుల్లా అనే భాగానికి వచ్చే స్ట్రోక్ వల్ల కలిగే మార్పుల కారణంగా కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం (డిజ్జీనెస్), సరిగా నిలబడలేక΄ోవడం, గుటక వేయలేకపోవడం వంటి లక్షణాలతో కనిపించే ఈ అనారోగ్యాన్ని ‘ల్యాటరల్ మెడుల్లరీ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.ల్యాటెరల్ మెడుల్లరీ సిండ్రోమ్ అనే ఈ సమస్య... సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరెబెల్లార్ ఆర్టరీ (పీఐసీఏ)లో రక్తప్రవాహం ఆగడం వల్ల వస్తుంది. దాంతో మెడుల్లా (బ్రెయిన్ స్టెమ్)లోని ఒక పక్క భాగం (పార్శ్వం) ప్రభావితమవుతుంది. ఇవీ లక్షణాలు... బాధితులకు నొప్పి, వేడిమి, ఉష్ణబాధలు తెలియకపోవడం బాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు సరైన రీతిలో నడవలేకపోవడం (గెయిట్ సరిగా లేకపోవడం) ∙తల, కళ్లు తిరుగుతుండటం ∙గుటకవేయలేక΄ోవడం, గొంతు బొంగురుపోవడం, మాట ముద్దముద్దగా రావడం. (మెదడులోని మింగే వ్యవస్థనూ, మాట్లాడే కేంద్రాన్ని నియంత్రించే ‘న్యూక్లియస్ యాంబిగస్’ అనే భాగం ఆయా వ్యవస్థలపై అదుపు కోల్పోవడంతో ఈ పరిణామం సంభవిస్తుంది) కనురెప్ప దానంతట అదే వాలిపోవడం, కనుపాప దగ్గరగా ముడుచుకోవడం (ప్యూపిల్ కన్స్ట్రిక్షన్), కొన్నిసార్లు కళ్లు (నల్లగుడ్డు) వాటంతటవే కదుతుండటం కొందరిలో వికారం, వాంతులు, ఎక్కిళ్లు.కారణాలు... మెదడులోని కొన్ని భాగాలకు రక్తం అందించే ధమనులు గట్టిబారి΄ోయి సన్నబడటం లేదా ఆ గోడల్లో పగుళ్లు రావడం వల్ల మెడను సరిగా ఉపయోగించకుండా రఫ్గా వాడినప్పుడు అక్కడి వర్టెబ్రల్ ఆర్టరీస్లో పగుళ్లు రావడం వల్ల లేదా మార్ఫన్స్ సిండ్రోమ్, ఎహ్లెర్–డ్యాన్లస్ సిండ్రోమ్, ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా (రక్తనాళాల లోపలివైపున కణాలు పెరగడం వల అవి సన్నబారిపోవడం) వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. అయితే మిగతా కారణాలతో పోలిస్తే ఈ అంశాలు చాలా అరుదు.నిర్ధారణ... మెదడు ఎమ్మారై ద్వారా అలాగే లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో నిర్ధారణ సరిగా జరగక... ఈ సమస్యను ఇతర సమస్యగా పొరబడటం జరుగుతుంటుంది. ప్రధానంగా వికారం, వాంతులు, తలతిరగడం, కళ్లుతిరగడం వంటి లక్షణాలను బట్టి దీన్ని ఈఎన్టీ సమస్యగా పొరబడుతుంటారు. చికిత్స... స్ట్రోక్ అనేది ఈ తరహాదైనప్పటికీ దానికి అత్యంత త్వరగా చికిత్స అందడం అవసరం. అప్పుడే వీలైనంత తక్కువ నష్టం జరుగుతుంటుంది. ఈ తరహా స్ట్రోక్ మొదలుకొని అది ఎలాంటిదైనప్పటికీ వీలైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకురావాలి. బాధితుల్ని కనీసం మూడు నుంచి నాలుగు గంటల లోపు తీసుకొస్తే డాక్టర్లు థ్రాంబోలిటిక్ థెరపీ (అంటే ధమనుల్లో రక్తసరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజెక్షన్ ద్వారా మందును ఇచ్చే చికిత్స)ని బాధితులకు అందించడానికి ప్రయత్నిస్తారు. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొందరికి ‘మెకానికల్ థ్రాంబెక్టమీ’ అనే (రక్తనాళాల్లో పేరుకుపోయిన క్లాట్ను తొలగించడానికి చేసే) శస్త్రచికిత్సతో పరిస్థితిని చక్కబరుస్తారు. ఇటీవల ఈ సమస్యపట్ల కొంత అవగాహన పెరగడంతో మునపటిలా కాకుండా సంబంధిత చికిత్సలు సత్వరమే జరుగుతున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా థ్రాంబోలిటిక్ థెరపీ చేయడానికి అవకాశం లేకుండా కాస్తంత ఆలస్యంగా వచ్చినవారికి క్లాట్స్ ఏర్పడకుండా ఉంచేందుకు రక్తం గడ్డకట్టి ఉండలుగా మారకుండా యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ను ఇవ్వడం, రక్త΄ోటు (బీపీ) అదుపులో ఉంచడం, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను తగ్గించడం, రక్తాన్ని పలచబర్చేలా యాంటీ కోయాగ్యులెంట్స్ ఇవ్వడం వంటి మేనేజ్మెంట్ చికిత్సలూ అవసరమవుతాయి.రీ–హ్యాబిలిటేషన్... ఇక్కడ పేర్కొన్నవే కాకుండా బాధితులు కోలుకునేందుకు వీలుగా ఫిజియో వంటి ‘రీ–హ్యాబిలిటేషన్’ వంటి కాస్త సుదీర్ఘ చికిత్సలతో పాటు బ్యాలెన్స్డ్గా నడక ప్రాక్టీస్ చేయించడం, మాట ముద్దగా వస్తున్నవారికి స్పీచ్ థెరపీ వంటివి కూడా అవసరమవుతాయి. భవిష్యత్తు ఆశారేఖలివి... ఇప్పుడున్న మందులు కాకుండా న్యూరో ప్రొటెక్టివ్ మెడిసిన్, స్టెమ్సెల్ చికిత్సల వంటి వాటిపైనా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లక్షణాలతో స్ట్రోక్ను గుర్తించి వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్కు తరలించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు.(చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
'హార్ట్' ఆఫ్ 'లివింగ్'
అదేదో సినిమాలో ‘‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారీ’’ అంటూ బ్రహ్మానందం విష్ చేయగానే ‘‘నేను మీకు ఫ్రెండేమిటి గురువుగారూ’’ అంటాడు జూ. ఎన్టీఆర్ కాస్తంత గురుగౌరవ భావంతో. దానికి బ్రహ్మానందం మళ్లీ ‘‘ఫ్రెండ్షిప్కు ఏజ్ లిమిటేదీ ఉండదురా’’ బదులిస్తాడు. అవును. ఫ్రెండ్షిప్కు వయసుపరంగా చిన్నా పెద్దా అనే ఏజ్ లిమిటు లేనట్టే... సైజు పరంగా కూడా చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే శ్రీరాముడంతటి వాడికి భక్తితో ఉడత హెల్ప్ చేస్తే... ‘‘నాకే హెల్ప్ చేశావంటే నీ ఫ్రెండ్షిప్ మామూలుది కాదూ... నీ ఫ్రెండ్షిప్పూ, నా ఫ్రెండ్షిప్పూ లోకానికి ఎప్పటికీ తెలియాలం’’టూ దానికి వీపు మీద పర్మనెంట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ను వదిలాడు. అదేంటోగానీ శ్రీరామచంద్రుడికి టాప్ టు బాటమ్... సుగ్రీవుడు మొదలుకొని ఉడత వరకు ఎందరో ఫ్రెండ్సు. పాపం... అంత ఫ్రెండ్షిప్ చేస్తే అర్జునుడికి భగవద్గీత... ఒక్కటే ‘గీత’! కానీ చిన్న హెల్ప్తో పెద్ద క్రెడిట్ కొట్టేసిన ఉడుతగారికి మాత్రం మర్యాదాపురుషోత్తముడి నుంచి మాంచి మార్కింగ్లైన్స్ ‘మూడు గీతలు’!! స్నేహం గొప్పదనాల ఉదంతాలకూ... స్నేహం ఔన్నత్త్యాల గురించి ‘నేస్తమ... నేస్తమా’ లాంటి పాటలకూ... కర్ణ సుయోధన, కృష్ణకుచేల, పార్థుడూ ఆయన సారథీలాంటి స్నేహ తార్కాణాలకు కొదవేవీ లేదు. స్నేహభావన గొప్పది కాబట్టే మొదట... తెలివితేటల కంటే ముందుగా ‘చెలిమి’చేతలనూ... నెనరు–నెయ్యాలనూ... కూరిమి–పేరిమిలనూ, మమతా–మైత్రీ భావాలను జీవుల పరిణామానికి ముందునుంచే సృష్టించి పెట్టిందేమో ప్రకృతిమాత! అదెలాగంటారా... ఆక్సిజనూ... కార్బన్ డై యాక్సైడ్ ఇచ్చిపుచ్చుకుంటూ మొక్కలూ, జంతువులూ... పండ్లూ ఫలాలూ ఇచ్చుకుంటూ చెట్టుచేమలూ... ఫారెస్టు యానిమల్సూ... పూల తేనెతేటల ఊటలు పంచుకుంటూ హనీబీలూ–బటర్ఫ్లైసూ.. ఇలా ప్రకృతి నిండా బడ్సీస్ అండ్ ‘బ్రో’లే! పురాణాలూ... ప్రకృతీ వదిలేసి పిక్చర్లూ మూవీలకు వద్దాం. ఎందుకంటే... పురాణాలూ ప్రకృతీ లాంటి సీరియస్ వ్యవహారాలు కాస్త భారంగా ఉంటాయి కాబట్టి... జనాల ట్రెండును నిర్దేశించేవీ, సమాజానికి అద్దం పట్టేవైన సినిమాలతోనే మొదలుపెట్టాం కాబట్టి... వాటితోనే ముగిద్దాం. అప్పట్లో... మిస్సమ్మ మొగుడు ఎన్టీ రామారావు పక్కనే రేలంగీ... అడవిరాముడి పక్కనే ఉండి నవ్విస్తుండే రాజబాబూ... సినీ మధ్యయుగాన... అనేక మంది హీరోల స్క్రీన్మేటు బ్రహ్మానందం... ఇప్పటి ట్రెండుకు తగ్గట్టు మహేశ్బాబు ‘మహర్షి’ అయితే పాల్ అల్లరి నరేషూ అదే మహేషు ‘శ్రీమంతుడై’΄ోతే పక్కనుండే ఫ్రెండే వెన్నెల కిషోరూ... అంతెందుకు... ఎర్ర గంధపు చెక్క పుష్పరాజ్ గాడి వెంట ఎప్పుడూ వెన్నంటి ఉండే మంచి ఫ్రెండ్షిప్పు తురుపు ముక్క కేశవ... సినిమాలో ఫ్రెండనే ఫార్మూలా సూపర్ డూపర్ బంపర్ హిట్ అయితే... జీవితంలో ఫ్రెండ్సంటే కామన్మేన్ కరేజ్కు తోడుండే పెద్ద జట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
ఈ సండే టేస్టీ..టేస్టీ..అమెరికా హలపేన్యో పాపర్స్ చేయండిలా..!
చాక్లెట్ రైస్ కేక్కావలసినవి: అన్నం– 2 కప్పులు (మరీ మెత్తగా ఉడికించకూడదు)కొబ్బరికోరు– 2 టేబుల్ స్పూన్లుఅరటిపండు గుజ్జు– 4 టేబుల్ స్పూన్లుకొబ్బరి పాలు– పావు లీటరుపంచదార– ఒక కప్పునెయ్యి– 1 లేదా 2 టీ స్పూన్లుదాల్చినచెక్క పొడి, చాక్లెట్ క్రీమ్, పీనట్ బటర్– గార్నిష్ కోసంతయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు, కొబ్బరికోరు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి, కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్లో ఉండే చిన్నచిన్న బౌల్స్ తీసుకుని, వాటికి అడుగున నెయ్యి రాసి, ఈ రైస్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని, సమాంతరంగా చేత్తో ఒత్తుకుని, గట్టిపడేలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో రైస్ కేక్ మీద పీనట్ బటర్ పూసి, పైన దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఆపైన చాక్లెట్ క్రీమ్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని, క్రీమ్ ఆరిన తర్వాత, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని, సర్వ్ చేసుకోవచ్చు.అమెరికా హలపేన్యో పాపర్స్కావలసినవి: హలపేన్యో (పెద్ద పచ్చిమిర్చీలు)– 10 (సగానికి నిలువుగా కట్ చేసి, విత్తనాలు తీసేసి పెట్టుకోవాలి)చీజ్ క్రీమ్– 200 గ్రాములుమాంసం ముక్కలు– పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం జోడించి, నూనెలో దోరగా వేయించాలి), వెల్లుల్లి– 3 (తురుములా చేసుకోవాలి), ఉప్పు, మిరియాలు, ఆలివ్ నూనె, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పర్మేసన్ చీజ్ తురుము– కొద్దికొద్దిగాబ్రెడ్ పౌడర్– 2 టేబుల్ స్పూన్లు (నూనెలో దోరగా వేయించుకోవాలి)తయారీ: ముందుగా ఒక పాత్రలో చీజ్ క్రీమ్, వెల్లుల్లి తురుము, తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఆలివ్ నూనె, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలు, వెల్లుల్లి మిశ్రమాన్ని హలపేన్యో ముక్కల్లో నింపుకోవాలి. ఇప్పుడు ప్రతి హలపేన్యో ముక్కపైన కొద్దికొద్దిగా పర్మేసన్ చీజ్ తురుము వేసుకోవాలి. ఆపైన వేయించిన బ్రెడ్ పౌడర్ పరచుకుని, ఆ హలపేన్యో ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ట్రేను ఓవెన్లో పెట్టుకుని, వాటిని బేక్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.ఫరాలీ సూరన్ ఖిచిడీకావలసినవి: కంద తురుము– 2 కప్పులుసగ్గుబియ్యం లేదా మరమరాలు లేదా అటుకులు– ఒక కప్పు (కడిగి, నీళ్లు పోయేలా వడకట్టులో వేసి పెట్టుకోవాలి)నెయ్యి– సరిపడావేరుశెనగలు– ఒక కప్పు (దోరగా వేయించి పొడి చేసుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము– కొద్దికొద్దిగాకరివేపాకు, జీలకర్ర– తాలింపు కోసంనిమ్మరసం– సరిపడాఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక పాన్లో నెయ్యి వేసి వేడి చేసుకుని, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కంద తురుము వేసి, మూతపెట్టి చిన్నమంట మీద బాగా మగ్గనివ్వాలి. దానిలో కొద్దిగా నీళ్లు, వేరుశెనగ పొడి, సగ్గుబియ్యం లేదా మరమరాలు లేదా అటుకులు కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, మధ్యమధ్యలో గరిటెతో తప్పితూ మూతపెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. చివరగా, ఒక ప్లేట్లోకి తీసుకుని, పైన తగినంత నిమ్మరసం, కొత్తిమీర తురుము, కొబ్బరికోరు వంటివి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఖిచిడీ. (చదవండి: బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!) -
చిరునవ్వే సిగ్నేచర్ లుక్!
ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్ముఖ్. ఎప్పుడూ క్లాసిక్ అందాన్ని కంఫర్ట్తో కలిపి, ఫ్రెష్ ఫ్యాషన్తో మెరిసిపోతుంది. ఆ యూనిక్ చార్మ్ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది. జ్యూలరీ బ్రాండ్: షాచీ ఫైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చీర బ్రాండ్: యాష్డెన్, ధర: రూ. 98,000నాకు స్టయిల్ అంటే సింప్లిసిటీ. ట్రెండ్ కంటే కంఫర్ట్ ముఖ్యం. చిన్న చోకర్, లైట్ ఇయర్ రింగ్స్, సాఫ్ట్ లిప్గ్లోస్, ఇదే నా సిగ్నేచర్ లుక్. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మేకప్ లేకపోయినా, ముఖం ఆటోమేటిక్గా మెరిసిపోతుందని చెబుతోంది జెనీలియా.రిబ్బన్స్ రీ ఎంట్రీ!ఒకప్పుడు జడకే పరిమితమైన ఈ నాజూకైన పట్టీ, రిబ్బన్స్. ఇప్పుడు మెడ మీద మెరిసేలా ఓ కొత్త స్టయిల్ స్టేట్మెంట్ను సృష్టిస్తోంది. జడల చివర అలముకునే ఈ చిన్నదానికి ఇప్పుడు ఫ్యాషన్లో పెద్ద స్థానం దక్కుతోంది. ఇది వచ్చినప్పటి నుంచీ పొడవైన హారాల జమానా కాస్త వెనక్కి వెళ్లిందనే చెప్పాలి. మధ్యలో ఓ చిన్న పెండెంట్, చుట్టూ సన్నని రిబ్బతో వచ్చే ఈ చోకర్ వేసుకొని, అద్దం ముందు నిలబడగానే ‘ఇంత అందంగా నేనేనా?’ అన్న ఆశ్చర్యంతో మురిసిపోతారు! చీరా, లెహంగా, కుర్తా ఏదైనా సరే, ఈ రిబ్బన్స్ చోకర్ మెడమీద పడితే లుక్కి కొత్త శోభ చేకూరుతుంది. హెయిర్ స్టయిల్ బ్రేడ్ అయినా, బన్ అయినా, ఏదైనా మెడ భాగం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. మేకప్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ టచ్ ఇచ్చినా సరే, చోకర్ ముఖాన్ని హైలైట్ చేయగలదు. ఇది వేసుకున్నాక, ఇంకొక హారం అవసరం లేదు. ఎందుకంటే, ఈ ఒక్కదానికే పొడవైన హారాల గర్వాన్ని తగ్గించేంత స్టయిల్, పవర్ ఉంది. చిన్నదిగా కనిపించినా, గొప్పగా మెరిసిపోతుంది. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నేను ఇద్దరు పిల్లల తల్లిని. వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?– శాంత, విజయవాడ.మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన వస్తుంది. ఇది లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ఇన్ఫెఫెక్షన్. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మన రోగనిరోధక వ్యవస్థ చాలాసార్లు దీన్ని తట్టుకోగలుగుతుంది. కాని, కొన్నిసార్లు హైరిస్క్ వైరస్లు పదహారు నుంచి పద్దెనిమిది రకాలు శరీరంలో ఉండిపోతే, గర్భాశయ కణాల్లో మార్పులు వస్తాయి. ఇవి కాలక్రమంలో క్యాన్సర్కి దారితీయవచ్చు. ఇలా క్యాన్సర్గా మారటానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్కే కాకుండా జననాంగ క్యాన్సర్, మలద్వారం, నోటి, గొంతు క్యాన్సర్లు, పురుషుల్లో పురుషాంగ క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది పెళ్లికి ముందే తీసుకుంటే. ఎందుకంటే లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన పదమూడు రకాల వైరస్ల వలన క్యాన్సర్ రావచ్చు. అయితే, ఈ టీకా వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల నుంచే రక్షణ ఇస్తుంది. అందుకే టీకాతో పాటు కండోమ్ వాడటం, అవసరమైనప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది నిర్ధారించాలంటే ప్యాప్ టెస్ట్, వైరస్ టెస్ట్ అనే రెండు పరీక్షలు చేయించాలి. ఇవి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందే చూపిస్తాయి. అవసరమైతే వెంటనే చికిత్స తీసుకుని క్యాన్సర్ దశకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. వైరస్ టెస్ట్ ద్వారా హైరిస్క్ వైరస్లు ఉన్నాయా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా వలన సర్వైకల్ క్యాన్సర్, మొటిమలు వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే టీకా తీసుకోవడం ఎంతో అవసరం. టీకా తీసుకున్నాక కూడా ప్రతి మూడేళ్లకోసారి లేదా ఐదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వవచ్చు. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వయస్సు కలిగినవారికి రెండు డోసులు వేస్తారు. మొదటి డోసు తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల్లో రెండవ డోసు వేయాలి. పదిహేను నుంచి నలభై ఐదేళ్లవారికి మూడు డోసులు అవసరం. మొదటి డోసు తర్వాత రెండు నెలల్లో రెండవ డోసు, ఆరు నెలల్లో మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకాతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సురక్షితమైంది. కాబట్టి డాక్టర్ను సంప్రదించి వారి పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోండి. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
చిలకపచ్చ పావురం..!
పావురాలు ఎక్కువగా కాసింత నీలిఛాయ కలగలసిన బూడిద రంగులో ఉంటాయి. తెల్ల పావురాలు కూడా సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని పావురాలు గోధుమరంగులో ఉంటాయి. ఇంకొన్ని ఇవన్నీ కలగలసిన రంగుల్లో ఉంటాయి. వీటికి భిన్నంగా చిలకపచ్చ రంగులో ఉన్న పావురం ఒకటి ఇటీవల ఇంగ్లండ్లోని నార్తాంప్టన్ పట్టణంలో కనిపించి, స్థానికులను అబ్బురపరచింది. ఈ అరుదైన పావురాన్ని చూడగానే కొందరు ఔత్సాహికులు దీనిని తమ స్మార్ట్ఫోన్ కెమెరాల్లో బంధించారు. కొద్ది వారాలుగా ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ వీథుల్లో మిగిలిన పావురాల గుంపుతో కలసి చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కువగా నార్తాంప్టన్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆల్ సెయింట్స్ చర్చ్ ప్రాంగణంలోను, ఆ పరిసరాల్లోని వీథుల్లో ఉన్న ఇళ్ల వద్ద కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొందరు దీని వీడియోలను ‘టిక్టాక్’లో పోస్ట్ చేస్తే, అవి వైరల్గా మారాయి. మొదటిసారిగా ఈ పావురాన్ని తన ఇంటి ముందున్న తోటలో జూన్ 28న చూసినట్లు రాబిన్ హింక్మాట్ అనే స్థానికులు చెప్పారు. ఆయన దీని ఫొటోలు, వీడియోలు తీశారు. మరికొందరు స్థానికులు కూడా దీని ఫొటోలు, వీడియోలు తీసి ఆన్లైన్లో పెట్టారు. మొత్తానికి ఈ ఆకుపచ్చ పావురం నార్తాంప్టన్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. (చదవండి: ప్రాణం తీసిన ఫ్లాస్కు) -
పెంపుడు జంతువులకూ పోషకాహార లోపం..!
పోషకాహార లోపం మనుషులనే కాదు.. జంతువులనూ వేధిస్తోంది.. ఈ విషయాలు తాజాగా జాతీయ స్థాయిలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. నగర జీవనశైలికి అనుగుణంగా ఆహారం అవసరం ఉంటుందని, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెంపుడు జంతువుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోందని ఆ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి పది జంతువుల్లో తొమ్మిదిట్లో ఈ తరహా లోపం కనిపిస్తోందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే సమస్యను అధిగమించొచ్చని పెట్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు జంతుప్రేమికులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాయి. నగరంలోని పెట్ లవర్స్ని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుత నగర జీవనశైలిలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారాయి. కొందరు జంతువులపట్ల ప్రేమతో పెంచుకుంటుంటే.. మరికొందరు స్టేటస్ సింబల్ కోసం.. ఇంకొందరు బిజీలైఫ్లో కాసేపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి తోడు కోసం.. తమ భావాలను వాటితో పంచుకునేందుకు పెంచుకుంటుంటారు.. ఇందులో ముఖ్యంగా పిల్లులు, కుక్కలు, కొన్ని రకాల పక్షులు కీలకంగా మారాయి. అయితే చాలా మంది ఇంటి సభ్యులు మాదిరిగానే వాటినీ చూసుకుంటుంటారు.. వారు తినే భోజనాన్నే వాటికీ ఆహారంగా పెడుతుంటారు. ఎంతో ప్రేమతో మచి్చక చేసుకుని, వాటిని హత్తుకుంటూ వాటిని పెంచుకుంటుంటారు చాలా మంది యజమానులు. అయితే మరీ ముఖ్యమైన విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాటి పోషకాహార అవసరాలు తీరడంలేదనేది నిపుణులు చెబుతున్న మాట. సర్వే ఏం చెబుతోంది?నగరాల్లో పెంపుడు జంతువుల్లో ఇటీవల దేశంలోని పశువైద్యులను సంప్రదించి నిర్వహించిన సర్వేలో ప్రతి పది పెంపుడు జంతువుల్లో తొమ్మిదిట్లో సరైన పోషకాహారం అందడంలేదనే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూట్రిషన్ విషయంలో విశేష సేవలందిస్తున్న మార్స్ సంస్థ ‘పెట్స్ని కుటుంబంలా ప్రేమించండి.. కానీ వాటికి కావాల్సినదే ఆహారంగా పెట్టండి’ అనే సందేశంతో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెట్స్ యజమానుల భావోద్వేగాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియోలు ఆయా గ్రూపుల్లోనూ, అఫీషియల్ ఫాలోవర్స్ పేజీల్లోనూ చెక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఇళ్లల్లో పెంచుకునే పెట్స్ జీవనశైలి, వాటి దైనందిన జీవితం, వాటి మనుగడకు కాస్త ప్రత్యేకమైనది. వాటికి అనువైన ఆహారం అందించకపోవడం వల్ల మనుషుల్లానే అవి కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయని ఇటీవలి సర్వేలో వెల్ల్లడయ్యింది. దేశంలోని పశువైద్యుల సర్వే ప్రకారం.. 91% పశువైద్యులు వాటి జీవన, జీర్ణ క్రియ ఆధారంగా రూపొందించిన ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ వాడాలనే సూచన చేస్తున్నారు. 88% మంది ఇంట్లో వండిన ఆహారం పోషకపరంగా తక్కువగా ఉందని, 86% మంది తగిన పోషకాలు లేకపోవడం వల్ల జంతువులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మసమస్యలు, అరుగుదల లోపం, శక్తిలేమి లాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరుగుతున్నాయట. సమతుల ఆహారం.. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెడిగ్రీ, విస్కాస్ వంటి పలు బ్రాండ్ల ఆహారం, వాటి శరీర ధర్మానుసారం సమతుల పోషకాలను అందిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిని వాల్థామ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించగా, అవి జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు పలువురు యజమానులూ, వైద్యులూ చెబుతున్నారు. ఈ కారణంగా, లైఫ్స్టైల్ కోణంలో పెంపుడు జంతువుల పోషకాహారంపై స్పష్టమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లి, కుక్కకు మనం తినేది కాకుండా, వాటికి అవసరమైనదే పెట్టాలి.., ఇది ప్రేమతో కూడిన శాస్త్రీయ సంరక్షణకు మొదటి అడుగు అని సూచిస్తున్నారు. అయితే ప్యాకేజింగ్ ఫుడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే.. వాటి సహజ జీవనశైలికి అనుగుణంగా ఉండే ఆహారాన్ని పెట్టినా సరిపోతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..
బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ సాధారణ నడక కంటే వేగంగా నడవడం. అంటే హృదయ స్పందన రేటును పెంచే వేగంతో నడవాలి. ఇది మితమైన తీవ్రత కలిగిన వ్యాయామం, అంటే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మాట్లాడగలరు. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలుబ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది ∙బ్రిస్క్ వాకింగ్ కేలరీలను కరిగించడానికి ఉపకరిస్తుంది. దీనిద్వారా ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ∙మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బ్రిస్క్ వాకింగ్ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. ∙ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.∙శక్తి స్థాయులను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రిస్క్వాకింగ్ ఎలా చేయాలి?మీ సాధారణ నడక వేగాన్ని పెంచండి.మీ చేతులను మీ వైపులా వదిలివేయండి, లేదా వాటిని కొద్దిగా వంచి, ముందుకు వెనుకకు ఊపండి. మీ నడకలో వేగం, దూరాన్ని పెంచండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. బ్రిస్క్వాకింగ్ ప్రారంభించడానికి చిట్కాలు. ∙మీకు నడవడం అలవాటు లేక΄ోతే, నెమ్మదిగా ప్రారంభించండి.క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచండి. ∙మీకు నచ్చిన ప్రదేశంలో నడవండి ఉదాహరణకు తోటల్లో లేదా బీచ్ వంటి ప్రదేశాలలో అన్నమాట.. దీనిని ఒక సామాజిక కార్యకలాపంగా మార్చడానికి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడవండి. -
బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!
రాగి అనేది శరీరంలోని ప్రతి కణజాలంలో కనిపించే ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇతర ఖనిజాల మాదిరిగా, శరీరం దానిని స్వంతంగా తయారు చేసుకోదు; మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది. అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పోలిస్తే, ఎక్కువ రాగి అవసరం లేదు. అలాగని రాగి లోపిస్తే మాత్రం మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల రోజూ ఆహారంలో తగినంత కాపర్ ఉండేలా చూసుకుంటే మెదడు కణజాలం చురుగ్గా పని చేస్తుంది. దానిద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. రాగి వివిధ న్యూరోహార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, జన్యు వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, పిగ్మెంటేషన్ను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహిస్తుంది. మెదడు ఆరోగ్యంలో...మెదడు అభివృద్ధికి, దాని పనితీరుకు సరైన మొత్తంలో రాగి కూడా అవసరం. మానసిక స్థితి, ప్రేరణ, శ్రద్ధ, ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడం వంటి వివిధ మెదడు విధుల్లో రాగి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధిక రాగి స్థాయులు అల్జీమర్స్ వ్యాధికి కూడా దారితీస్తాయి. హిప్పోకాంపస్, సెరిబ్రల్ కార్టెక్స్ వంటి మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలలో న్యూరాన్ల పనితీరును అధిక స్థాయిలో రాగి ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటికి ఉపకరిస్తుంది. రాగి అత్యధికంగా ఉండే ఆహారాలు ఆర్గాన్ మీట్స్, గుల్లలు, ఇతర సముద్ర ఆహారాలు, పౌల్ట్రీ, రెడ్ మీట్ వంటి జంతువుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు. మీరు డైటరీ కాపర్ కోసం జంతు ఉత్పత్తులను తినవలసిన అవసరం లేదు. అనేక మొక్కల ఆధారిత ఆహారాలు రాగికి సురక్షితమైన వనరులు.మెదడు, ఎముకలు, కీళ్ళు, గుండె, ధమనులు, చర్మం, రోగనిరోధక వ్యవస్థ అంటే అనేక శారీరక ప్రక్రియలకు రాగి చాలా అవసరం కానీ అది లోపిస్తే ఎంత ఇబ్బందో, ఎక్కువ అయితే కూడా అంతటి హానికరం. అందువల్ల తగిన రాగి స్థాయులను నిర్వహించడం శరీర ఆరోగ్యానికి అత్యవసరం. మొక్కల ఆధారిత డైటరీ కాపర్బంగాళదుంపలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డార్క్ చాక్లెట్, టోఫు చిక్పీస్, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, అవకాడో, టర్నిప్ గ్రీన్స్, పాలకూర. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
ఆయుష్షా.. ఆరోగ్యమా..!
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం. ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు. ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
విద్యార్ధుల వేసవి సెలవులు రద్దు?
వేసవి సమయంలో తీవ్రమైన ఎండల వేడి తరచుగా రోజువారీ కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను ఇబ్బందుల పాటు చేస్తుంది. ఎండలు మండే వేళ, వడదెబ్బల వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా భావితరాన్ని రక్షించడానికి పుట్టుకొచ్చాయి సమ్మర్ హాలిడేస్. దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మొదటి సారి చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా వర్షాకాలం సైతం తన తఢాఖా చూపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజులోనే దేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో తరచుగా పాఠశాలలకు కూడా సెలవులు (Holidays) ప్రకటించడం జరుగుతోంది.నిజానికి కొందరు విద్యార్ధులైనా ఎండల నుంచి ఎసి బస్సులు, పాఠశాలల్లో ఎసిల ద్వారా అన్నా తప్పించుకోవచ్చునేమో కానీ నగరాల్లో ట్రాఫిక్, పొంగిపొర్లే నాలాలు, డ్రైనేజీలు తదితర పరిస్థతుల దృష్ట్యా చూస్తే తీవ్రమైన వర్షాల నుంచి తప్పించుకోవడానికి స్కూల్కి డుమ్మా తప్ప వేరే మార్గమే లేదు. ఈ నేపధ్యంలో అసలు వేసవి సెలవుల్ని వర్షాకాలం సెలవులుగా మారిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక కొత్త చర్చ దేశంలో మొదలైంది. ఈ చర్చకు శ్రీకారం చుట్టింది రుతుపవనాలను ఎదురేగి ఆహ్వానించే తొలి రాష్టమైన కేరళ (Kerala). తమ రాష్ట్రంలోని వేసవి సెలవులను ఏప్రిల్ మే నెల నుంచి జూన్, జూలై వర్షాకాల నెలలకు మార్చాలా? అనే చర్చ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పాటే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే భారీ వర్షపాతం వాతావరణ సంబంధిత హెచ్చరికల కారణంగా తరచుగా పాఠశాల తరగతులకు అంతరాయం కలుగుతోంది. తరచుగా తలెత్తుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కేరళ ప్రభుత్వం గరిష్ట రుతుపవన కాలంలో సెలవులను తిరిగి షెడ్యూల్ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఈ విషయంపై చర్చోపచర్చల్లో భాగంగా కొందరు ప్రత్యామ్నాయంగా మే–జూన్ నెలను కూడా సూచించారట. అయితే ‘‘ఈ మార్పు వల్ల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇది విద్యార్థుల అభ్యాసం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆచరణాత్మకంగా ఉంటుందా? మనం ఇతర భారతీయ రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోగలమా?’ అంటూ కేరళ మంత్రి శివన్ కుట్టి (Sivankutty) అడిగారు, దీనిపై ఆయన ప్రజల నుంచి సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ విషయంపై నిర్మాణాత్మక సంభాషణకు ఈ చొరవ మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,కేరళ విద్యాశాఖా మంత్రి తన పోస్ట్లోని కామెంట్స్ విభాగంలో ప్రజలు తమ అభిప్రాయాలను సిఫార్సులను పంచుకోవాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా విలువైన విద్యా సంవత్సరంలో అనేక రోజులు స్కూల్స్ మూతబడుతున్న పరిస్థితిలో ఇది చర్చనీయాంశమేనని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఆన్ మనోరమ అనే స్థానిక మీడియా సంస్థ నిర్వహించిన పోల్లో 42 శాతం మంది జూన్–జులై మధ్య సెలవుల మార్పుకు అనుకూలంగా స్పందించగా 30.6 మంది మాత్రం ఏప్రిల్–మే అనే పాత విధానాన్ని యథాతధంగా కొనసాగించాలని కోరారు. అలాగే 27.52 శాతం మంది మే నుంచి జూన్ వరకూ సెలవుల్ని సవరించాలని సూచించారు.చదవండి: బుడ్డోడి ఫైరింగ్ స్టంట్కి షాకవ్వాల్సిందే! -
Lighthouse Parenting: ఒడ్డుకు చేర్చేలా మాత్రమే..!
లైట్హౌస్ అనేది సముద్రంలోని ఓడలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు లైట్హౌస్ పేరెంటింగ్ పిల్లలకు ఒక దిశను చూపుతుంది. అదే సమయంలో పిల్లలు వారి సొంత మార్గాల్లో పయనించేలా చేస్తుంది. ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు బాధ్యతాయుతంగా ఎదగ గలిగే అవకాశాలెన్నో ఉన్నట్లు నిపుణుల పరిశీలన. ఈ తరహా పేరెంటింగ్ పిల్లలు భవిష్యత్తులో బాధ్యతయుతంగా పెరగడానికి ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం.లైట్హౌస్ పేరెంటింగ్ అంటే పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడం. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూనే వారిని బాలెన్స్ చేయడం. ఈ వ్యూహాన్ని అమలు చేసే వారు తమ పిల్లలకు నిజాయితీగా మాట్లాడడానికి తగిన స్వేచ్ఛను ఇస్తారు. ఈ విధానంలో పిల్లలు తమకు ఏదైనా సాయం అవసరమైతే సంకోచించకుండా తల్లిదండ్రులను అడిగేలా పిల్లలను ప్రోత్సహిస్తుంది. తద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.ప్రయోజనాలు ఏమిటి? లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.. పిల్లల ఆత్మగౌరవంపై సానుకూల ప్రభావం చూపడం.ఆరోగ్యకరమైన హద్దులు లైట్హౌస్ పేరెంట్స్ తమ పిల్లలకు సొంతంగా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. కానీ, వారికి కొన్ని హద్దులను నిర్దేశిస్తారు. పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమపై పూర్తి నమ్మకం ఉంచుతున్నారని తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి వారికి శక్తి వస్తుంది.బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడంఈ పేరెంటింగ్ విధానానికి కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రులను విమర్శిస్తారనే భయం లేకుండా నిశ్చింతతో ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి. వారు తమ తల్లిదండ్రులను సలహాదారులుగా భావిస్తే.. ఆత్మస్థైర్య భావం పెరుగుతుంది.కోపింగ్ నైపుణ్యాలను పెంపొందించడంఈ పేరెంటింగ్ విధానం ప్రాథమికంగా పిల్లలు ఎదురుదెబ్బలను అనుభవించేలా చేస్తుంది. అవసరమైనప్పుడు సాయం కోసం అడగడంలో వారికి మద్దతునిస్తుంది. పిల్లలు తమ భావాలను, ఇబ్బందులను సొంతంగా అధిగమించగల సామర్థ్యాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలను అధిగమించేందుకు ఈ పేరెంటింగ్ ఎంతో తోడ్పడుతుంది.సవాళ్లు లైట్ హౌస్ పేరెంటింగ్ విధానంతో అనేక ప్రయోజనాలను ఉన్నప్పటికీ, ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలు ఎదుర్కొనే విషయంలో వెనుకడుగు వేయడం కష్టం. ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని తెలుసుకోవాలి. ఇందుకు చాలా సహనం అవసరం. పిల్లల ప్రత్యేక అవసరాలు, వారి పరిస్థితులపై ఆధారపడి కొంతమందికి మరింత ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం కావచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అనేదానిపై లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
33 ఏళ్ల తర్వాత బాద్షాకు ఆదాబ్..!
ముప్పై మూడు ఏళ్ల సుదీర్ఘ నటనానుభవం తర్వాత షారుక్ ఖాన్ను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడిగా గుర్తించింది. ‘దీవానా’ (1992) నుంచి షారుక్ ఖాన్ బాలీవుడ్లో ప్రవేశించి ‘కింగ్ ఖాన్’గా ప్రేక్షకుల అభిమానం పొందుతూ, దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందుతున్నా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మాత్రం రాలేదు. ఇన్నాళ్ల తర్వాత అదీ మన సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించిన ‘జవాన్’ సినిమాకు వరించింది. అయితే అది కూడా పూర్తి అవార్డు కాదు. సగమే. మరో సగాన్ని యువ నటుడు విక్రాంత్ మాసేతో (ట్వల్త్ ఫెయిల్ సినిమాకు) పంచుకోవాలి. అంటే ఈసారి ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరు నటులకు ప్రకటించారు. సినిమా రంగంలో ఎటువంటి ఘరానా వంశాల మద్దతు లేకపోయినా ఢిల్లీ నుంచి మధ్యతరగతి యువకుడిగా వచ్చి జెండా ఎగుర వేసిన వాడు షారుక్. తనతరం హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పోటీ పడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వేగమైన శరీర కదలికలు, వినూత్నమైన డైలాగ్ డెలివరీ, అల్లరి చిల్లరిగా కనిపిస్తూనే లోతైన భావాలు పలికించడం ప్రత్యేకతగా షారుక్ ప్రేక్షకులకు నచ్చాడు. ‘బాజీగర్’, ‘డర్’ సినిమాల్లో నెగెటివ్ కేరెక్టర్లు వేసినా యువత అతణ్ణి హీరోగానే చూసింది. ఆ తర్వాత ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995)తో పూర్తి సూపర్స్టార్గా అవతరించాడు. ‘పర్దేశ్’, ‘దిల్తో పాగల్ హై’, ‘దిల్ సే’, ‘కభీ ఖుషీ కభీ గమ్’.. అన్నీ హిట్గా నిలిచాయ్. దర్శకుడు కరణ్ జొహర్, జూహీ చావ్లాలతో చాలా హిట్స్ సాధించాడు షారుక్. దిలీప్ నటించిన ‘దేవదాసు’ పాత్రను మళ్లీ పోషించి మెప్పించాడు. ‘కల్ హోనా హో’, ‘వీర్జారా’, ‘చక్దే ఇండియా’ వంటి సినిమాలు అతడి ప్రతిభను పదేపదే నిరూపించాయి. స్టార్గా ఉండి కూడా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లో బుద్ధిమాంద్యం ఉన్న హీరోగా నటించాడు. ‘ఓమ్ శాంతి ఓమ్’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. షారుక్కు ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిన ‘జవాన్’ను 300 కోట్లతో నిర్మిస్తే 1100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ షారుక్ బాలీవుడ్ కా బాద్షాగానే కొనసాగుతున్నాడు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
'ఊరు' పాటకు కిరీటం
జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లె పద సౌందర్యం మెరుపై మెరిసింది. తళుక్కున వెలిగింది. ‘బలగం’ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ‘ఊరు పల్లెటూరు’ ఆ సినిమా విడుదలైనప్పుడే తెలుగు వారందరి మనసును తాకింది. పల్లె జీవనం అందరికీ ఇష్టమే కాబట్టి, ఆ పల్లెను మిస్సయ్యి పట్నవాసం, ప్రవాసం ఉండక తప్పదు కాబట్టి పాటలోని పల్లెతనాన్ని వినగానే అందరి ప్రాణం లేచివచ్చింది. కాసర్ల రచనకు భీమ్స్ అందించిన సంగీతం, మంగ్లి–రామ్ మిరియాల అందించిన గళం, దర్శకుడు వేణు ఎల్దండి దృశ్యరూపం అన్నీ కలిసి పాటను నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆ పాట గెలిచి తెలంగాణ గ్రామీణ సౌందర్యానికి అందిన వందనం స్వీకరించింది. ప్రయివేట్ గీతాల నుంచి జాతీయ పురస్కార గ్రహీతగా..‘ఊరు పల్లెటూరు’ పాటతో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం అందుకోనున్న కాసర్ల శ్యామ్ది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. తండ్రి మధుసూదన్ రావు రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో నటుడు కావాలనే ఆకాంక్ష శ్యామ్ చిన్నతనం నుంచే ఉండేది. అయితే సాహిత్యం పట్ల తనకున్న అభిలాషతో జానపద పాటలు రాయడం, పాడడంలో అనుభవాన్ని సంపాదించారు. వరంగల్ శంకర్, సారంగపాణి బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాలేజీ పిల్ల చూడరో.. యమ ఖతర్నాక్గుందిరో..’ శ్యామ్ రాసిన తొలి జానపద సాంగ్. ఆ తర్వాత సుమారు 50పైగా ఆల్బమ్స్కు పాటలు రాశారు. ఆ సమయంలోనే మిత్రుల సాయంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా.. ‘చంటిగాడు’(2003) సినిమాలో తొలి అవకాశం వచ్చింది. బాలాదిత్య, సుహాసిని జోడీగా బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో, సిగ్గులొలికే సీతాలు’ పాటలతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘మహాత్మ’, ‘పటాస్’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘డీజే టిల్లు ‘అల వైకుంఠపురములో’... వంటి పలు సినిమాల్లో సుమారు 800కుపైగా పాటలు రాశారు శ్యామ్. తెలంగాణ మాండలికం, యాస, మాస్తోపాటు మెలోడీ గీతాలు రాయడంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తన అభిమాన రచయిత చంద్రబోస్ అని చెబుతుంటారాయన. ఆయన భార్య రాధిక ఆర్కిటెక్ట్. ‘బలగం’ సినిమాలోని అన్ని పాటల్నీ కాసర్ల శ్యామ్ రాయగా ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ రచయితగా తొలి జాతీయ అవార్డు అందుకోనున్నారు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
స్త్రీ వాణి రాణించింది..!
స్త్రీల జీవితాల్లోని అంతఃప్రవాహాలువారిని లైంగికంగా పీడించి ఓడిపోయిన పిశాచాలు...స్త్రీలకు స్త్రీలే తోడుగా నిలిచిన కథనాలు...శుక్రవారం ప్రకటించిన జాతీయ సినీ పురస్కారాలు2023లో వెండితెర చూపించిన మహిళా సంఘర్షణలను మరోసారి జ్ఞప్తికి తెచ్చాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాఈసారి గుర్తింపు పొందిన నటీమణులు, గాయనులువారి అభిమానులను ఆనందపరిచారు. మొత్తంగా ఈ అవార్డులు స్త్రీల దృష్టికోణంలో ప్రత్యేకమైనవి. రాణి ముఖర్జీకి ఉత్తమనటి పురస్కారం దక్కింది. ఆమె నటించిన ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రానికి గానూ ఆమెకు ఈ పురస్కారం అందింది. ‘గులామ్’ (1998) నుంచి రాణి ముఖర్జీ నటిస్తూ ఉన్నా జాతీయనటిగా గుర్తింపు దక్కడం ఇన్నాళ్లకు గాని సాధ్య పడలేదు. ఆమెకు ఈ పురస్కారం రావడం పట్ల అభిమానులే కాదు... విమర్శకులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే స్త్రీల దృష్టికోణంలో ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చాలా శక్తివంతమైన సమస్యను చర్చించింది. నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ గొప్పగా నటించిందన్న ప్రశంసలు పొందింది. జాతీయ పురస్కారం వచ్చిందన్న వార్త వెలువడగానే ‘నా ముప్పై ఏళ్ల నటనా జీవితానికి ఇది వేలిడేషన్గా భావిస్తున్నా’ అని ఆమె స్పందించింది.ఎన్నో కలికితురాయిలుబెంగాల్ నుంచి బాలీవుడ్కు వచ్చిన రాణి ముఖర్జీ ‘ఆతీ క్యా ఖండాలా’ పాట ఉన్న ఆమిర్ ఖాన్ ‘గులామ్’తో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత షారుక్తో నటించిన ‘కుచ్ కుచ్ హోతాహై’తో స్టార్డమ్కు చేరుకుంది. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘కభి ఖుషీ కభి గమ్’, ‘సాథియా’, ‘వీర్ జారా’... తదితర సినిమాలు ఆమె ప్రతిభను చాటాయి. అయితే అమితాబ్తో కలిసి నటించిన ‘బ్లాక్’ సినిమాలో తను కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని, ప్రతిభ ఉన్న నటి అని నిరూపించింది. 2014లో దర్శకుడు ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంత దూరమైనా ఇటీవల ‘మర్దానీ’, ‘మర్దానీ2’, ‘హిచ్కీ’, ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రాలతో తెరతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వేభారతీయ తల్లులకు పిల్లలను ఎలా పెంచాలో తెలుసు. పాలు ఇచ్చే పద్ధతి, పాలబువ్వ తినిపించే పద్ధతి, నీళ్లు ΄ోయడం, జోలపాడటం... ప్రతిదీ తెలుసు. కాని ఈ పద్ధతి తప్పు అంది నార్వే ప్రభుత్వం. అక్కడి బాలల సంరక్షణ అధికారులు అక్కడ నివసిస్తున్న భారతీయ జంట అనురూప్ భట్టాచార్య, సాగరికల నుంచి వారి ఇద్దరు పిల్లలను 2011లో అధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు కారణం నార్వే బాలల సంరక్షణ చట్టాలు. అక్కడ నివసిస్తున్న పౌరుల ఇళ్లలో పిల్లలు ఉంటే వారిని క్రమ విరామాలలో పరిశీలిస్తారు అధికారులు. అలా పరిశీలనకు వచ్చిన ప్రతిసారీ భారతీయ పద్ధతులకు పెడర్థాలు తీసి అనురూప్, సాగరికల పిల్లలు ప్రమాదంలో ఉన్నారని మూడేళ్ల కొడుకును, సంవత్సరం వయసు కుమార్తెను తమ అధీనంలోకి తీసుకెళ్లారు. ఆ పిల్లల కోసం సాగరిక చేసిన పోరాటాన్ని రాణి ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ సినిమాలో పునఃప్రతిష్ట చేసింది.నటి ఊర్వశికి ఉత్తమ సహాయ నటి పురస్కారంతెలుగువారికి చిరపరిచితమైన నటి ఊర్వశికి 2023 జాతీయ పురస్కారాల్లో ‘ఉల్లుజుక్కు’ (అంతఃప్రవాహం) సినిమాకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. ఇదే సినిమాకు మలయాళం నుంచి ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం కూడా లభించింది. ‘ఉల్లుజుక్కు’లో ఊర్వశి అత్తగారి పాత్రలో నటించింది. ఆమె కుమారుడు పెళ్లయిన కొన్నాళ్లకే జబ్బు వల్ల మరణిస్తాడు. కోడలు ఆ పెళ్లికి ముందే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. కాని అనివార్యమై ఈ పెళ్లి చేసుకుంటుంది. భర్త మరణించే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతమైన వానలు కురిసి వరద సంభవిస్తుంది. పైకి కనిపించే ఆ వరదలో లోపలి ప్రవాహపు వేగం ఎంతో ఎవరికీ తెలియదు. అలాగే అత్తగారు, కోడలు తమ జీవితాల్లో ఏయే లోపలి గాథలతో సతమతమవుతున్నారో ప్రేక్షకులకు మెల్లగా తెలుస్తూ వస్తుంది. సినిమా ముగింపు సమయానికి కోడలు అత్తను వీడి వెళ్లే పరిస్థితి ఉన్నా చివరకు ఆమె తన ప్రియుణ్ణి కాదని అత్త వద్దకు చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో అత్తగా ఊర్వశి, కోడలిగా పార్వతి తిరువోతు నటించగా ఊర్వశికి పురస్కారం దక్కింది.సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైజాతీయ పురస్కారాలలో మనోజ్ బాజ్పాయ్ నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాకు ఉత్తమ డైలాగ్ రైటర్ పురస్కారం దక్కింది. ఈ సినిమా జాతీయ పురస్కారాల పట్టికలో కనిపించడం చాలా ముఖ్యమైన విషయం. దీనికి కారణం బాబాల చెరలో చిక్కి బలైపోతున్న చిన్నారి ఆడపిల్లల కోసం న్యాయం వైపు నిలబడితే న్యాయం దక్కి తీరుతుందని ఇందులోని కథానాయకుడు తన న్యాయవాద వృత్తి ద్వారా నిరూపిస్తాడు. ఆడపిల్లలకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో, వారి మీద లైంగిక దాడి జరిగితే ఎన్ని విధాల వొత్తిళ్లు వస్తాయో ఈ సినిమా చూపుతుంది. టీనేజ్ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ, వారి కోసం పథకాలు రచించే కపట స్వాములకు ఈ సినిమా హెచ్చరిక. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్నెస్ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె. ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్నెస్ పట్ల ఫోకస్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం. ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..హర్యానాలో సోనిపట్లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్గా మారింది. చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది. అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!) -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్తో అలరించనున్నారు. బెంగాల్ ఫుడ్కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు. ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
నీ స్నేహం..ఓ సంబరం..
కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపురేఖలు వేరట.. ఊపిరొకటే చాలట.. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.. కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా.. నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి.. స్నేహమంటే రూపులేని ఊహ కాదని.. లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.. అని సిరివెన్నెల రచించిన పాట అందరికీ సుపరిచితమే.. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచి్చందంటే!.. అదే ‘ఫ్రెండ్షిప్ డే’.. ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం బహుమతులు ఇచి్చపుచ్చుకోవడం లేదా ఇన్స్టాలో కథలు చెప్పడం మాత్రమే కాదు. నిజానికి, ఈ వేడుక రేపటి జ్ఞాపకాలుగా మారే అనుభవాలకు వేదిక. ట్రెడిషన్, ట్రెండ్ను మిళితం చేసే హ్యాపెనింగ్ సిటీ అయిన మన భాగ్య నగరంలో ఆ జ్ఞాపకాల సృష్టికి అనువైన ప్రదేశాలెన్నో.. అలాంటి కొన్ని ప్రదేశాలు, ఈవెంట్ల వివరాలు, అనువైన ప్రదేశాలను కోరుకునే ఫ్రెండ్షిప్ కోసం.. ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా ఆగస్టు నెల్లో తొలి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోనున్నారు స్నేహితులు. ఇందుకు నగరంలో పలు వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇది స్నేహితులతో రోజూ మాదిరి సరదాగా కాకుండా మరింత ప్రత్యేకంగా గడపడానికి సరైన సందర్భం.. అందుకు అనువైన ప్రదేశాలెన్నో నగరంలో వేదిక కానున్నాయి. ఫ్రెండ్స్.. జంతు ప్రేమికులైతే బంజారాహిల్స్లోని పెట్ కేఫ్ లాంటివి సరైన ఎంపిక. ఇక్కడ పిల్లులను కౌగిలించుకోవచ్చు, అందమైన శునకాలను పలకరించవచ్చు. ఇది స్నేహితుల రోజువారీ ఒత్తిడిని తగ్గించడానికి అనువైన ప్రదేశం. నగరంలో మొట్టమొదటి ఆర్ట్ థెరపీ స్పాట్ జూబ్లీహిల్స్లోని లైజుర్–ఆర్ట్ కేఫ్, లైజుర్ పెయింటింగ్, టఫ్టింగ్, కుండలు, టీ–షర్ట్ పెయింటింగ్, కొవ్వొత్తుల తయారీ లాంటివెన్నో అందిస్తుంది. కళాభిమానులైన స్నేహితులు ఆర్ట్ జామింగ్ లేదా సృజనాత్మక సెషన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బ్రష్స్ట్రోక్స్ లేదా టఫ్టింగ్ సెషన్ మధ్య కాఫీని ఆస్వాదించవచ్చు. జూబ్లీహిల్స్లోని బోర్డ్ కేఫ్లో స్క్రాబుల్ వంటి క్లాసిక్ల నుంచి తంబోలా వంటి పార్టీ గేమ్ల వరకూ 700 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. ఆటలకు కొత్తవారైతే హోస్ట్ల ద్వారా సహాయం అందుకోవచ్చు. ఇక్కడ గంటల తరబడి నవ్వుతూ, స్నేహితులతో సరదా పోటీలతో గడపవచ్చు. జూబ్లీహిల్స్లోని బేస్ కాఫీ, పికిల్ బాల్ కేఫ్.. నగరంలో కొత్త జీవనశైలిలో ఒకటైన పికిల్ బాల్ కాఫీలని విలీనం చేస్తుంది. స్నేహితులు బాల్ గేమ్స్ ఆడవచ్చు, ఆ తరువాత కోల్డ్ బ్రూలు స్నాక్స్తో రీఛార్జ్ కావచ్చు. ప్రకృతిని, ప్రశాంతతను ఇష్టపడే ఫ్రెండ్స్ ప్రప్రథమ గార్డెన్ థీమ్డ్ అర్బన్ నెమో కేఫ్ని ఎంచుకోవచ్చు. ఇది పచ్చని మొక్కలతో రిలాక్స్డ్ ఓపెన్–ఎయిర్ సీటింగ్ బొటానికల్ డెకార్ను అందిస్తుంది. ఈ కేఫ్ ఫ్రెండ్షిప్ డే కార్యకలాపాలను ప్రత్యేకంగా నిర్వహించనప్పటికీ.. పచ్చదనంతో పాటు అల్లుకున్న ప్రశాంతత నిశ్శబ్దంగా ఫ్రెండ్షిప్ డేని ఆస్వాదించడానికి సరిపోతుంది. సృజనాత్మక కో–వర్కింగ్, వర్క్షాప్లు లేదా ఈవెంట్లతో కూడిన హైబ్రిడ్ స్పేస్ మిక్సింగ్ కేఫ్ ఛార్జీ. ఇక్కడ ఓపెన్ మైక్ నైట్స్, ఇండీ బ్రాండ్ పాప్–అప్లు, రైటింగ్ సర్కిల్స్, ఆర్ట్ వర్క్షాప్లు లేదా స్టాండ్–అప్ కామెడీని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు.. కోకాపేట్లోని ది రాబిట్ లాంజ్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా డీజే కిమ్, డీజే సినాయ్లు సందడి చేయనున్నారు. లిక్విడ్ డ్రమ్స్, సాక్సాఫోన్, దర్బూకా.. వంటి వెరైటీ సంగీత పరికరాలు ఆకట్టుకోనున్నాయి. నగర శివార్లలో ఉన్న ఎమ్యూజ్మెంట్ పార్క్స్లో ఫ్రెండ్షిప్ డే వినోదభరితంగా జరగనుంది. శని, ఆదివారాలు రెండు రోజులపాటు వేడుకలు ప్లాన్ చేశారు. వేవ్ పూల్ డీజే సెట్లు, ఫోమ్ పారీ్టలు, ఇంటరాక్టివ్ గేమ్లు సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకూ కొనసాగే నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని థర్డ్ వేవ్ కాఫీలో ‘సొంత ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ తయారు చేసుకోండి’ పేరిట శనివారం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హిప్–హాప్ పార్టీ విత్ జినీ లైవ్ ప్రోగ్రామ్ను సోమాజిగూడలోని ఆక్వా ది పార్క్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. దీని కోసం మిజోరాంకు చెందిన ఆరి్టస్ట్ నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. (చదవండి: సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!) -
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్నైట్లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్ అవసరం.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది. ఎయిర్ పోర్టు, మాల్స్లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్బో హార్ట్ ఇన్స్స్టిట్యూట్ -
ఆ ఆర్మీ ఆఫీసర్ నిర్మించిన ‘బేలీ' ఆ మహిళలకు అండగా మారింది..!
గత సంవత్సరం కేరళలోని వయనాడ్లో వచ్చిన భారీ వర్షాలు, విరిగి పడిన కొండచరియలు ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో వరదబాధితులకు వేగంగా సహాయం అందించడానికి ఆర్మీ ఆఫీసర్ సీతా షెల్కే 144 మంది ఆర్మీ జవానుల బృందంతో కలిసి ‘బేలీ వంతెన’ నిర్మించింది. ఆనాటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మహిళలకు ఇప్పుడు ‘బేలీ’ అండగా నిలబడింది. అయితే ఇది వంతెన కాదు. వరద బాధిత మహిళలు తమ జీవితాలను పునర్మించుకోవడానికి వచ్చిన ప్రాజెక్ట్. ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ ద్వారా ఎంతోమంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది.జిల్లా అధికార యంత్రాంగం స్వయం సహాయక బృందం ‘కుటుంబశ్రీ’ భాగస్వామ్యంతో ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ను ప్రారంభించింది. ఆనాటి వరదల్లో ‘బేలీ వంతెన’ ఎంతోమంది బాధితులను కాపాడింది. ఆ కృతజ్ఞతతోనే ఈ జీవనోపాధి ప్రాజెక్ట్కు ‘బేలీ’ అని నామకరణం చేశారు. ‘బేలీ ప్రాజెక్ట్’లోని మహిళలు తయారు చేస్తున్న రంగురంగుల గొడుగులు, బ్యాగులను కుటుంబశ్రీ స్టాల్స్, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఔట్లెట్స్లో ప్రదర్శిస్తున్నారు.‘బేలీ బ్రాండ్’ బ్యాగులు, గొడుగులకు తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వీటికి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘బేలీ ప్రాజెక్ట్’కు సంబంధించిన పని ప్రదేశం... కేవలం బ్యాగులు, గొడుగుల తయారీ కేంద్రం మాత్రమే కాదు. ‘విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడవచ్చు. మోడువారిన పరిస్థితులలోనూ కొత్తగా పునర్జీవించవచ్చు’ అని బలంగా చెప్పే ప్రదేశం. (చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్!
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్! ‘ఏరా బుజ్జికొండా, పిజ్జాలు తింటావా!’ అని తన పక్కన కూర్చున్న సింహాన్ని అడిగింది బామ్మ. ‘నువ్వు తినిపిస్తే ఎందుకు తినను’ అన్నట్లుగా చూసింది సింహం. ‘అయితే తినూ’ అంటూ సింహానికి ఆప్యాయంగా పిజ్జా తినిపిస్తూ తాను కూడా ఒక ముక్క తిన్నది బామ్మ. మటన్ ముక్కలు తినే సింహం పిజ్జా ముక్కలు తినడం ఏమిటి! అడవిలో ఉండాల్సిన సింహం బామ్మ పక్కన పిల్లిలా కూర్చోవడం ఏమిటి!!ఇది కలియుగ వింత కాదు... ఏఐ (ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన సాంకేతిక వింత. ఈ ఏఐ వీడియోలో ఎక్కడా కృత్రిమత్వం కనబడదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ సింహం– బామ్మ వీడియో వేలాది వ్యూస్తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Viral taii vlog (@taii_vloger) (చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'.) -
ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!
విక్టోరియా అనే ఓ మహిళ గుండె స్పందనలు ఆగాయి. కార్డియాక్ అరెస్ట్తో ఆ గుండె ఆగగానే ఆమె దాదాపుగా చని΄ోయిందనే అనుకున్నారందరూ! ఏకంగా 17 నిమిషాల పాటు ఆగిందామె గుండె. అయితే... అత్యంత అప్రమత్తతతో అత్యవసరంగా స్పందించిన కొందరు పారామెడిక్స్ కృషితో గుండె స్పందనలు మళ్లీ మొదలయ్యాయి. తీరా చూస్తే ఆమె గుండె అలా ఆగడానికి కారణం... ఆమెకున్నో అరుదైన జన్యుపరమైన వ్యాధి. మల్టిపుల్ హార్ట్ ఫెయిల్యూర్గా పిలిచే విక్టోరియా వ్యాధి వివరాలివి. యూకేలోని గ్లౌసెస్టర్ నగరానికి చెందిన విక్టోరియా థామస్ అనే మహిళ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. ముప్పై ఐదేళ్ల ఆమె తన ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ ఉండేది. ఎప్పటిలాగే ఆరోజునా ఆమె జిమ్లో వ్యాయామాలు చేస్తోంది. తన ఇంటెన్సివ్ వర్కవుట్ సెషన్లో భాగంగా అప్పుడే ఆమె తన వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ పూర్తి చేసుకుంది. ఇంతలో ఆమెలోని శక్తినంతా తలలోంచి బయటకు తోడిపోసిన అనుభూతి! విక్టోరియా తన చేతిలోని వెయిట్స్ రాడ్ను ఇలా పక్కకు పెట్టిందో లేదో... ఒక పక్కకు అలా ఒరిగిపోయింది. పక్కనున్నవాళ్లు హుటాహుటిన పారామెడిక్స్ను తీసుకొచ్చారు. వాళ్లు ఆమె ఛాతీని నొక్కుతూ సీపీఆర్ (కార్డియో పల్మునరీ రీససియేషన్) మొదలుపెట్టారు. కానీ గుండె స్పందనలు ఎంతకీ మొదలు కాలేదు.మరణానుభవానుభూతితో ఓ నిశ్శబ్ద శూన్యత... సెకన్లు నిమిషాల్లోకి గడిచి΄ోతున్నాయి. నిమిషాలు పదీ, పదిహేను నిమిషాల వ్యవధి దాటి పావుగంటల్లోకి దొర్లిపోతున్నాయి. కానీ సీపీఆర్తో ఎంతగా ప్రయత్నిస్తున్నా విక్టోరియా కోలుకోవడం లేదు. అలా 17 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆమె గుండె అకస్మాత్తుగా స్పందనలనందుకుంది. ఈలోపు ఆమెకు అంతటా శూన్యం. భయంకరమైన నిశ్శబ్దం. ఎటు చూసినా... చూడకున్నా అంతా చిమ్మచికటి. ఆమెలోని తన స్మృతి హేతు జ్ఞానాలన్నీ విస్మృతిలోకి వెళ్లాయి. ఇలా ఆమె ఆ 17 నిమిషాల పాటూ ‘నియర్ డెత్’ భయంకరానుభవాన్ని చవిచూసింది. ప్రాణాలు దక్కవనే అనుకున్నారు. కానీ 17 నిమిషాల తర్వాత ఆమె గుండె స్పందనలు మొదలయ్యాయి.మూడు రోజుల పాటు కోమాలోనే...ఎట్టకేలకు గుండె స్పందనలు మొదలైనా ఇంకా ఆమె కోమాలోనే ఉంది. దాంతో విక్టోరియాను ‘బ్రిస్టల్ రాయల్ ఇన్ఫర్మరీ’ అనే ఓ పెద్ద వైద్యశాలకు తరలించారు. అక్కడామె మూడు రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. తర్వాత మెల్లగా కోలుకుని కోమాలోంచి బయటకొచ్చింది.గర్భం దాల్చడంతో మొదలైన సవాళ్లు... ఇదిలా ఉండగా 2021లో విక్టోరియా గర్భం దాల్చింది. అప్పుడు చేసిన పరీక్షల క్రమంలో తెలిసిందేమిటంటే... ఆమెకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే వ్యాధి ఉందని! ‘డేనన్ డిసీజ్’ అని పిలిచే ఆ అరుదైన జన్యుపరమైన ఆ వ్యాధి కారణంగా ఇతర కండరాలతో పాటు గుండె కండరాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. అవి క్రమంగా బలహీనపడిపోవడంతో (కార్డియోమయోపతి కారణంగా) గుండె మాటిమాటికీ ఆగిపోతుంటుంది. ఆ గుండె ఆగకుండా స్పందించేందుకూ... ఒకవేళ ఆగినా మళ్లీ స్పందనలు మొదలయ్యేందుకు డీ–ఫిబ్రిలేటర్ అనే పరికరాన్ని అమర్చారు. అది చేసే పనేమిటంటే గుండె ఆగినప్పుడుల్లా ఓ ఎలక్ట్రిక్ షాక్ పంపి, గుండెను మళ్లీ కొట్టుకునేలా చేస్తుంది. చిత్రమేమిటంటే... జన్యుపరమైన వ్యాధి అయినప్పటికీ... వాళ్ల కుటుంబంలో అందుకుముందెవరికీ ఆ వ్యాధి లేదు. అది కనిపించిన మొట్టమొదటి బాధితురాలు విక్టోరియానే!!అసలే గుండె వీక్... ఆ పైన ప్రెగ్నెన్సీ!!మొదటే గుండె చాలా బలహీనం. కానీ ఆలోపు ప్రెగ్నెన్సీ రావడంతో గుండె పంపింగ్ సరిగా జరగక మాటిమాటికీ విక్టోరియా గుండె ఆగి΄ోవడాలు జరిగేవి. ఇలా తరచూ జరిగే కార్డియాక్ అరెస్టుల నేపథ్యంలోనే నెలల నిండకముందే సిజేరియన్తో బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. బిడ్డ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ పండంటి మగబిడ్డ! అదృష్టం... పరీక్షలు చేసి చూస్తే తల్లికి ఉన్న ఆ జన్యుపరమైన జబ్బు బిడ్డకు లేదు!! డాక్టర్లు 2022లో విక్టోరియాకు గుండె పరీక్షలు చేయించినప్పుడు తెలిసిందేమిటంటే... ఆమె గుండె పనితీరు కేవలం 11 శాతమేనని!! అంటే హార్ట్ ఫెయిల్యూర్ తాలూకు చివరి దశ అది. ఇకపై ఆమె బతకబోయేది కొద్ది నెలల మాత్రమేనని తేలింది. అదృష్టాలు ఒక్కోసారి ‘ఫలించి’నప్పుడు గుండెకాయ కూడా చెట్టుకాయలా దొరుకుతుంది. అలా ఆమెకు గుండె మార్పిడి చికిత్స కోసం తగిన గుండె దొరకడంతో... ఏప్రిల్ 2023 లో ట్రాన్స్ప్లాంట్ చికిత్స చేశారు. దాంతో విక్టోరియా మృత్యుముఖం నుంచి మరోసారి బయటపడింది. ‘కొత్త హార్ట్’తో తల్లి... తన ‘స్వీట్ హార్ట్’ అయిన ఆ బిడ్డ... ఇలా ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం.– యాసీన్ (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్గా నటి దీప్తి సాధ్వానీ
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్కట్లు డైట్లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్తో ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె. తాను ఎలాంటి క్రాష్ డైట్లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. ఇవి మంచివేనా అంటే..కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
కళ్లకు గంత..! 'ఆ కళ ఓ వింత'
కాదేదీ కవితకు, కళకు కూడా అనర్హం. కళ్లు తెరచి చూసేవారికి కనువిందు చేసే చిత్రకళ.. కళ్లకు గంతలు కట్టుకొని చిత్రకారులు సృష్టించింది అని తెలిస్తే వీక్షకులకు అదో వినూత్న అనుభూతి. అలాంటి చిత్రాలకే కాదు.. ఆ చిత్రకళకూ ఇప్పుడు నగరంలో కళాభిమానులు జై కొడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని చిత్రకారులు గీసిన చిత్రాలను చూడటానికి మాత్రమే కాదు తాము సైతం అదే కళను సాధన చేస్తూ ఓ వైపు సృజనాత్మకత పెంచుకుంటూ మరోవైపు మానసిక ప్రశాంతత పొందుతున్నారు. బ్లైండ్.. ట్రెండ్.. కొన్నేళ్లుగా బాగా ఆదరణకు నోచుకుంటున్న బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ అనేది కళాకారులు కళ్లకు కట్టు కట్టి, తమ భావోద్వేగాలను, ఊహాశక్తిని ఆధారంగా చేసుకుని పెయింటింగ్స్ రూపొందించే ఒక అరుదైన కళా ప్రక్రియ. మన దేశంలో ఈ ఆర్ట్కు సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందిన కొందరు ప్రముఖ కళాకారుల్లో రాజస్థాన్కు చెందిన మహేష్ చంద్ర శర్మ దాదాపు 6 వేల చిత్రాలను కేవలం స్పర్శ ఆధారంగా చిత్రీకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు నామినేట్ అయ్యారు. ఎన్నో సోషల్ వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కోసం తన కళను వినియోగిస్తున్నారు. మైసూరుకు చెందిన శ్రీనివాస్ బి.బ్లైండ్ ఫోల్డ్ మల్టీటాలెంటెడ్ ఆరి్టస్టుగా పేరు పొందారు. కేవలం చిత్రకళే కాదు, సంగీతం, డాన్స్ వంటి ఇతర కళారూపాల్లో కూడా కళ్లకు కట్టు వేసుకుని ప్రదర్శనలిచ్చారు. దేశవ్యాప్తంగా పలు స్కూల్స్, కళాకేంద్రాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తున్నాడు. బెంగుళూర్ నివాసి నివేదిత గౌడ టీవీ ప్రోగ్రామ్స్లో బ్లైండ్ఫోల్డ్ డ్రాయింగ్, స్కెచ్ డెమోస్ ద్వారా గుర్తింపు పొందారు. యువతలో సృజన పెంపొందించేందుకు బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. నగరంలో బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ నిపుణులుగా జె.వేణుగోపాల్ పేరొందారు. ఆయన కళ్లకు గంతలతో ‘గణేశ’ ‘ప్రపంచ ఉష్ణోగ్రత’ వంటి చిత్రాలు గీశారు. కొత్త కొత్త కళలను సాధన చేయడం పట్ల నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో క్రేజ్ పెరుగుతోంది. పలు ఇన్నోవేషన్స్కు సిటీ కేంద్రంగా మారుతున్న వేళ, ఈ తరహా వినూత్న ఆర్ట్ ఫార్మాట్లు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దాంతో బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ ట్రెండ్గా మారుతున్నాయి. కళను అనుభవించడంలో కొత్త కోణాలను అన్వేíÙంచే వారికి వీటి వర్క్షాప్లు ఆసక్తికరంగా మారడంతో పలు ఆర్ట్ స్టూడియోలు, కమ్యూనిటీ సెంటర్లు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వయసులకు అతీతంగా నగరవాసులు వీటిలో పాల్గొంటున్నారు. ఈ బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్, వర్క్షాప్స్ కేవలం వినూత్న కళను నేర్చుకోవడానికి మాత్రమే కాదు కాదు, చూస్తూ అనుభవిస్తూ కళను సృష్టించే ఈ కళారీతి మైండ్ఫుల్నెస్, స్ట్రెస్ రిలీఫ్, ఇన్నర్ కాని్ఫడెన్స్ పెంపొందించుకోవడంలో సహాయపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల నగరంలో ‘బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ ఛాలెంజ్’ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొనేవారు కళ్లకు గంతలు కట్టుకుని బొమ్మల్ని గీయాలి అంతేకాక అది ఏ బొమ్మో కూడా ఊహించాలి. ఎస్సిఎమ్ హైదరాబాద్ ఆర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాలెంజ్లో బహుళ రౌండ్ల తర్వాత విజేతలను ఎంపిక చేశారు. సాధారణ వ్యక్తుల కన్నా దృష్టి లోపం ఉన్నవారికి. ఇతర ఇంద్రియాల పట్ల అవగాహన వాటి శక్తుల పట్ల ఆలోచన పెంచడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు. స్ఫూర్తిని అందిస్తున్న బ్లైండ్ ఫోల్డ్ విజయాలు.. చిత్రకళ మాత్రమే కాకుండా బ్లైండ్ ఫోల్డ్ అనేది చాలా కళలకు, సాహసాలకు విస్తరిస్తోంది. నగరంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు సాధిస్తున్న విజయాలు నగరవాసులకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో.. మంగుళూర్కి చెందిన మెజిషియిన్ సమర్థ్ షెనాయ్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా 300 కి.మీ. స్కూటర్ రైడ్ను కళ్లకు గంతలు కట్టుకుని పూర్తి చేశారు. బీహార్లోని దర్భాంగా ప్రాంతవాసి అయిన మోనికా గుప్తా అయోధ్యలో రామమందిర ప్రారంభత్సవంలో కళ్లకు గంతలు కట్టుకుని రంగోలిని గీసి అందర్నీ ఆకట్టుకున్నారు. ముంబైకి చెందిన అఫాన్ కుట్టి కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్స్ క్యూబ్లను ఉపయోగించి క్రికెటర్ మొహమ్మద్ షమీ చిత్రపటాన్ని సృష్టించాడు. చెన్నైకి చెందిన శిల్పి చంద్రు స్పర్శ, విజువలైజేషన్ కళ మధ్య సంబంధాన్ని వివరిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని శిల్పాలను సృష్టించే శిల్పకారుడిగా పేరొందారు. వాయిద్య కారులు, గాయకులు సహా అందరూ కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన ఇచ్చే ముంబైకి చెందిన బ్లైండ్ ఆర్కెస్ట్రా కళాకారులు కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందమైన టాయ్ పూడుల్స్ ప్రయాణికులను సాదరంగా ఆహా్వనిస్తున్నాయి. చిరకాల నేస్తాల్లా పలకరిస్తాయి. తాకితే చాలు వచ్చి ఒడిలో వాలిపోతాయి. ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. పిల్లలు ఆడుకొనే సున్నితమైన టాయ్స్ను తలపించే ఈ శునకరాజాలు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డాగ్ థెరపీలో భాగంగా వినూత్నంగా ఈ శునకాలను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే ప్రవేశ ద్వారాల వద్ద ఈ శునకాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. టాయ్ పూడుల్స్ శునకాలకు తర్ఫీదు సాధారణంగా ప్రయాణం అనగానే ఏదో ఒక స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్ రద్దీని ఛేదించుకొని సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోవడమే ఒక సవాల్, ఏదో ఒక విధంగా ఆ సవాల్ను అధిగమించి ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత మరోవిధమైన ఆందోళన మొదలవుతుంది. భద్రతా తనిఖీలు దాటుకొని లగేజీ బరువు సరిచూసుకొని, బోర్డింగ్ పాస్ తీసుకొనే వరకు టెన్షన్గానే ఉంటుంది. వరుసగా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ వంటి ప్రహసనాలన్నీ ముగించుకొని టెరి్మనల్కు చేరుకొనే వరకు ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆ ఒత్తిడి నుంచి ఊరటనిచ్చేందుకు మానసిక ప్రశాంతత కలిగించేందుకు డాగ్థెరపీ దోహదం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఈ డాగ్ థెరపీ సదుపాయం అందుబాటులో ఉంది. అదే తరహాలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నాలుగు టాయ్ పూడుల్స్ శునకాలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. అలాగే వాటి నిర్వహణ కోసం నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ‘ఈ టాయ్ పూడుల్స్ ఎంతో మృదుస్వభావాన్ని కలిగి ఉంటాయి. పెద్దలు, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటాయి. అందరితో కలిసిపోయేవిధంగా శిక్షణనిచ్చారు.’ అని ఎయిర్పోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఒంటరిగా ప్రయాణం చేసేవారికి కొన్ని గంటల పాటు ఇవి తోడుగా ఉంటాయని చెప్పారు.సెల్ఫీ ప్లీజ్.. ఈ శునకాలను ప్రయాణికులకు తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి. వాటితో ఆటలాడుకోవచ్చు. ఒడిలోకి తీసుకొని నిమురుతూ కాలక్షేపం చేయొచ్చు. సెలీ్ఫలు కూడా తీసుకోవచ్చు. టాయ్ పూడుల్స్ ద్వారా పొందే అనుభూతులు ప్రయాణికులకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలగజేస్తాయని, డాగ్ థెరపీలో ఇది ఒక భాగమని నిర్వాహకులు తెలిపారు. వీటితో కాలక్షేపం చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ‘డాగ్ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి గురయ్యే కారి్టసాల్ హార్మోన్లను తగ్గిస్తుందని చెప్పారు. అలాగే ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్ను పెంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న 4 శునకాలు వారానికి 5 రోజులు అంటే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఈజీగా జర్నీ.. సాధారణంగా విమానప్రయాణంలో రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. విమాన ప్రయాణం పట్ల ఉండే భయం, ఆందోళనలను డాగ్థెరపీ ద్వారా అధిగమించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఆలస్యంగా నడిచే విమానాల వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ లభిస్తుందో లేదోననే భయం పట్టుకుంటుంది. ఆ సమయంలో ఈ శునకాలు ఒక డైవర్షన్ టెక్నిక్లా పని చేస్తాయి. (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..
మన భారతీయ వంటకాలు ఎంతటి మహామహులనైన ఫిదా చేస్తాయి. వండే విధానం, వాటి రుచికి దాసోహం అని అనను వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా మైమరిపించే మన వంటకాల రుచికి ఓ ప్రముఖ ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ సీఈవోనే ఇంప్రెస్ అయ్యి..ఆరోగ్యకరమైన రెసిపీలంటూ ప్రశంసించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ కాలిఫోర్నియా బురిటో వ్యవస్థాపకుడు అమెరికన్ బ్రెట్ ముల్లర్..మన బెంగళూరు వంటకాల రుచికి ఫిదా అయ్యాడు. ఆయన బసవగుడిలో కామత్ శాకాహార రెస్టారెంట్లో జోలాడ రోటీ భోజనాన్ని ఆస్వాదస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ శాకాహార రెస్టారెంట్లో ఉత్తర కర్ణాటక శైలి థాలిని ఆయన ఆనందంగా ఆస్వాదించారు. తాను ఈ రెస్టారెంట్కి తన చార్టర్ అకౌంటెంట్ సిఫార్సుపై 2014లో ఇక్కడి వచ్చానని ఆ వీడియోలో తెలిపారు. అప్పట్లో ఈ నగరానికి కొత్త..అంటూ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రెస్టారెంట్లో భోజనం గురించి వివరిస్తూ..ప్లేట్లోని తాజా కూరగాయల వంటకాలు, క్రిస్పీ సలాడ్లు, ఉత్సాహభరితమైన రుచులతో ఇంప్రెస్ చేస్తుంది. జొన్న రొట్టె మీద వెన్న కరుగుతూ ఉండగా వేడివేడిగా ఉన్న గుత్తు వంకాయ కూరలో నొంచుకుని తింటే ఉంటుంది.. నా సామిరంగా ప్రాణం లేచివచ్చినట్లుగా ఉంటుంది అని చెబుతున్నాడు ముల్లర్. తాను ఈ జోలాడ రొట్టెని ఆస్వాదించాలని మూడు సార్లు ఈ బసవనగుడికి వచ్చానని అన్నారు సీఈవో. బెంగళూరు అంతటా ఇలాంటి ఆహారాలు ఉన్నా..ఇక్కడి జోలాడ రొట్టె మాత్రం అత్యంత విభిన్నంగా ఉంటుందని అన్నారు. అక్కడెక్కడ ఇలాంటి రుచి లభించదని అన్నారు. ఇది రుచికి రుచి, ఆరోగ్యం కూడా అని ప్రశంసించారు. అయితే ఇలాంటి భోజనం తిన్నాక తప్పకుండా జిమ్కి వెళ్లక తప్పదు అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన ఇక్కడ బెంగళూరు వంటకాలను మెచ్చుకున్నప్పటికీ..ఇక్కడి ట్రాఫిక్ పట్ల అత్యంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా త్వరత్వరగా వెళ్లేందుకు ఆటోలకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ముల్లెర్ 2012లో 22 ఏళ్ల వయసులో బెంగళూరు నగరం వచ్చి తన తొలి కాలిఫోర్నియా బురిటో అవుట్లెట్ను ప్రారంభించాడు. ఈ మెక్సికన్ ఫాస్ట్-క్యాజువల్ బ్రాండ్ క్రమంగా అభివృద్ధి చెంది.. భారతదేశం అంతటా సుమారు 100కు పైగా అవుట్లెట్లతో విస్తరించింది. ఇది సుమారు 20 కోట్లపైనే లాభాలను ఆర్జిస్తోంది. ఇక ఈ వ్యాపారం కూడా ఇతర బిజినెస్ల మాదిరిగానే మహమ్మారి సమయంలో ఆటుపోట్లకు గురైంది. దాని 37 దుకాణాల్లో సుమారు 19 దుకాలు మూతపడ్డాయి కూడా. కానీ ఈ బ్రాండ్కి ఉన్న ఆదరణతో మళ్లీ శక్తిమంతంగా పునరాగమనం చేసి..అచ్చం అదే తరహాలో లాభాలబాట పట్టింది. పైగా అశేష జనాదరణ పొందేలా ఇటీవలే తన వందవ స్టోర్ ప్రారంభోత్సవాన్ని కూడా జరుపుకోవడం విశేషం.California Burrito CEO x Jolad Rotti Meals pic.twitter.com/eFlhLCsjqX— Season Flake 🏗️ (@seasonflaketopg) July 29, 2025 (చదవండి: టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే! ఇలా తాగితే..)