breaking news
Lifestyle
-
పెంపుడు జంతువులకూ పోషకాహార లోపం..!
పోషకాహార లోపం మనుషులనే కాదు.. జంతువులనూ వేధిస్తోంది.. ఈ విషయాలు తాజాగా జాతీయ స్థాయిలో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. నగర జీవనశైలికి అనుగుణంగా ఆహారం అవసరం ఉంటుందని, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెంపుడు జంతువుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోందని ఆ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి పది జంతువుల్లో తొమ్మిదిట్లో ఈ తరహా లోపం కనిపిస్తోందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే సమస్యను అధిగమించొచ్చని పెట్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు జంతుప్రేమికులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టాయి. నగరంలోని పెట్ లవర్స్ని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుత నగర జీవనశైలిలో పెంపుడు జంతువులు ఓ భాగంగా మారాయి. కొందరు జంతువులపట్ల ప్రేమతో పెంచుకుంటుంటే.. మరికొందరు స్టేటస్ సింబల్ కోసం.. ఇంకొందరు బిజీలైఫ్లో కాసేపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి తోడు కోసం.. తమ భావాలను వాటితో పంచుకునేందుకు పెంచుకుంటుంటారు.. ఇందులో ముఖ్యంగా పిల్లులు, కుక్కలు, కొన్ని రకాల పక్షులు కీలకంగా మారాయి. అయితే చాలా మంది ఇంటి సభ్యులు మాదిరిగానే వాటినీ చూసుకుంటుంటారు.. వారు తినే భోజనాన్నే వాటికీ ఆహారంగా పెడుతుంటారు. ఎంతో ప్రేమతో మచి్చక చేసుకుని, వాటిని హత్తుకుంటూ వాటిని పెంచుకుంటుంటారు చాలా మంది యజమానులు. అయితే మరీ ముఖ్యమైన విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాటి పోషకాహార అవసరాలు తీరడంలేదనేది నిపుణులు చెబుతున్న మాట. సర్వే ఏం చెబుతోంది?నగరాల్లో పెంపుడు జంతువుల్లో ఇటీవల దేశంలోని పశువైద్యులను సంప్రదించి నిర్వహించిన సర్వేలో ప్రతి పది పెంపుడు జంతువుల్లో తొమ్మిదిట్లో సరైన పోషకాహారం అందడంలేదనే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూట్రిషన్ విషయంలో విశేష సేవలందిస్తున్న మార్స్ సంస్థ ‘పెట్స్ని కుటుంబంలా ప్రేమించండి.. కానీ వాటికి కావాల్సినదే ఆహారంగా పెట్టండి’ అనే సందేశంతో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారానికి సంబంధించిన వీడియోలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోని పెట్స్ యజమానుల భావోద్వేగాలకు అనుగుణంగా రూపొందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియోలు ఆయా గ్రూపుల్లోనూ, అఫీషియల్ ఫాలోవర్స్ పేజీల్లోనూ చెక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఇళ్లల్లో పెంచుకునే పెట్స్ జీవనశైలి, వాటి దైనందిన జీవితం, వాటి మనుగడకు కాస్త ప్రత్యేకమైనది. వాటికి అనువైన ఆహారం అందించకపోవడం వల్ల మనుషుల్లానే అవి కూడా పోషకాహార లోపంతో బాధపడుతున్నాయని ఇటీవలి సర్వేలో వెల్ల్లడయ్యింది. దేశంలోని పశువైద్యుల సర్వే ప్రకారం.. 91% పశువైద్యులు వాటి జీవన, జీర్ణ క్రియ ఆధారంగా రూపొందించిన ప్యాకేజ్డ్ పెట్ ఫుడ్ వాడాలనే సూచన చేస్తున్నారు. 88% మంది ఇంట్లో వండిన ఆహారం పోషకపరంగా తక్కువగా ఉందని, 86% మంది తగిన పోషకాలు లేకపోవడం వల్ల జంతువులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మసమస్యలు, అరుగుదల లోపం, శక్తిలేమి లాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరుగుతున్నాయట. సమతుల ఆహారం.. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పెడిగ్రీ, విస్కాస్ వంటి పలు బ్రాండ్ల ఆహారం, వాటి శరీర ధర్మానుసారం సమతుల పోషకాలను అందిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిని వాల్థామ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రూపొందించగా, అవి జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు పలువురు యజమానులూ, వైద్యులూ చెబుతున్నారు. ఈ కారణంగా, లైఫ్స్టైల్ కోణంలో పెంపుడు జంతువుల పోషకాహారంపై స్పష్టమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లి, కుక్కకు మనం తినేది కాకుండా, వాటికి అవసరమైనదే పెట్టాలి.., ఇది ప్రేమతో కూడిన శాస్త్రీయ సంరక్షణకు మొదటి అడుగు అని సూచిస్తున్నారు. అయితే ప్యాకేజింగ్ ఫుడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం ఉందా? అంటే.. వాటి సహజ జీవనశైలికి అనుగుణంగా ఉండే ఆహారాన్ని పెట్టినా సరిపోతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..
బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ సాధారణ నడక కంటే వేగంగా నడవడం. అంటే హృదయ స్పందన రేటును పెంచే వేగంతో నడవాలి. ఇది మితమైన తీవ్రత కలిగిన వ్యాయామం, అంటే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మాట్లాడగలరు. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలుబ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది ∙బ్రిస్క్ వాకింగ్ కేలరీలను కరిగించడానికి ఉపకరిస్తుంది. దీనిద్వారా ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ∙మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బ్రిస్క్ వాకింగ్ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. ∙ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.∙శక్తి స్థాయులను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రిస్క్వాకింగ్ ఎలా చేయాలి?మీ సాధారణ నడక వేగాన్ని పెంచండి.మీ చేతులను మీ వైపులా వదిలివేయండి, లేదా వాటిని కొద్దిగా వంచి, ముందుకు వెనుకకు ఊపండి. మీ నడకలో వేగం, దూరాన్ని పెంచండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. బ్రిస్క్వాకింగ్ ప్రారంభించడానికి చిట్కాలు. ∙మీకు నడవడం అలవాటు లేక΄ోతే, నెమ్మదిగా ప్రారంభించండి.క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచండి. ∙మీకు నచ్చిన ప్రదేశంలో నడవండి ఉదాహరణకు తోటల్లో లేదా బీచ్ వంటి ప్రదేశాలలో అన్నమాట.. దీనిని ఒక సామాజిక కార్యకలాపంగా మార్చడానికి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడవండి. -
బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!
రాగి అనేది శరీరంలోని ప్రతి కణజాలంలో కనిపించే ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇతర ఖనిజాల మాదిరిగా, శరీరం దానిని స్వంతంగా తయారు చేసుకోదు; మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది. అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పోలిస్తే, ఎక్కువ రాగి అవసరం లేదు. అలాగని రాగి లోపిస్తే మాత్రం మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల రోజూ ఆహారంలో తగినంత కాపర్ ఉండేలా చూసుకుంటే మెదడు కణజాలం చురుగ్గా పని చేస్తుంది. దానిద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. రాగి వివిధ న్యూరోహార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, జన్యు వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, పిగ్మెంటేషన్ను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహిస్తుంది. మెదడు ఆరోగ్యంలో...మెదడు అభివృద్ధికి, దాని పనితీరుకు సరైన మొత్తంలో రాగి కూడా అవసరం. మానసిక స్థితి, ప్రేరణ, శ్రద్ధ, ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడం వంటి వివిధ మెదడు విధుల్లో రాగి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అధిక రాగి స్థాయులు అల్జీమర్స్ వ్యాధికి కూడా దారితీస్తాయి. హిప్పోకాంపస్, సెరిబ్రల్ కార్టెక్స్ వంటి మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలలో న్యూరాన్ల పనితీరును అధిక స్థాయిలో రాగి ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటికి ఉపకరిస్తుంది. రాగి అత్యధికంగా ఉండే ఆహారాలు ఆర్గాన్ మీట్స్, గుల్లలు, ఇతర సముద్ర ఆహారాలు, పౌల్ట్రీ, రెడ్ మీట్ వంటి జంతువుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు. మీరు డైటరీ కాపర్ కోసం జంతు ఉత్పత్తులను తినవలసిన అవసరం లేదు. అనేక మొక్కల ఆధారిత ఆహారాలు రాగికి సురక్షితమైన వనరులు.మెదడు, ఎముకలు, కీళ్ళు, గుండె, ధమనులు, చర్మం, రోగనిరోధక వ్యవస్థ అంటే అనేక శారీరక ప్రక్రియలకు రాగి చాలా అవసరం కానీ అది లోపిస్తే ఎంత ఇబ్బందో, ఎక్కువ అయితే కూడా అంతటి హానికరం. అందువల్ల తగిన రాగి స్థాయులను నిర్వహించడం శరీర ఆరోగ్యానికి అత్యవసరం. మొక్కల ఆధారిత డైటరీ కాపర్బంగాళదుంపలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డార్క్ చాక్లెట్, టోఫు చిక్పీస్, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, అవకాడో, టర్నిప్ గ్రీన్స్, పాలకూర. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
ఆయుష్షా.. ఆరోగ్యమా..!
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం. ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు. ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
విద్యార్ధుల వేసవి సెలవులు రద్దు?
వేసవి సమయంలో తీవ్రమైన ఎండల వేడి తరచుగా రోజువారీ కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను ఇబ్బందుల పాటు చేస్తుంది. ఎండలు మండే వేళ, వడదెబ్బల వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా భావితరాన్ని రక్షించడానికి పుట్టుకొచ్చాయి సమ్మర్ హాలిడేస్. దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మొదటి సారి చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా వర్షాకాలం సైతం తన తఢాఖా చూపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజులోనే దేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో తరచుగా పాఠశాలలకు కూడా సెలవులు (Holidays) ప్రకటించడం జరుగుతోంది.నిజానికి కొందరు విద్యార్ధులైనా ఎండల నుంచి ఎసి బస్సులు, పాఠశాలల్లో ఎసిల ద్వారా అన్నా తప్పించుకోవచ్చునేమో కానీ నగరాల్లో ట్రాఫిక్, పొంగిపొర్లే నాలాలు, డ్రైనేజీలు తదితర పరిస్థతుల దృష్ట్యా చూస్తే తీవ్రమైన వర్షాల నుంచి తప్పించుకోవడానికి స్కూల్కి డుమ్మా తప్ప వేరే మార్గమే లేదు. ఈ నేపధ్యంలో అసలు వేసవి సెలవుల్ని వర్షాకాలం సెలవులుగా మారిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక కొత్త చర్చ దేశంలో మొదలైంది. ఈ చర్చకు శ్రీకారం చుట్టింది రుతుపవనాలను ఎదురేగి ఆహ్వానించే తొలి రాష్టమైన కేరళ (Kerala). తమ రాష్ట్రంలోని వేసవి సెలవులను ఏప్రిల్ మే నెల నుంచి జూన్, జూలై వర్షాకాల నెలలకు మార్చాలా? అనే చర్చ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పాటే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే భారీ వర్షపాతం వాతావరణ సంబంధిత హెచ్చరికల కారణంగా తరచుగా పాఠశాల తరగతులకు అంతరాయం కలుగుతోంది. తరచుగా తలెత్తుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కేరళ ప్రభుత్వం గరిష్ట రుతుపవన కాలంలో సెలవులను తిరిగి షెడ్యూల్ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఈ విషయంపై చర్చోపచర్చల్లో భాగంగా కొందరు ప్రత్యామ్నాయంగా మే–జూన్ నెలను కూడా సూచించారట. అయితే ‘‘ఈ మార్పు వల్ల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇది విద్యార్థుల అభ్యాసం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆచరణాత్మకంగా ఉంటుందా? మనం ఇతర భారతీయ రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోగలమా?’ అంటూ కేరళ మంత్రి శివన్ కుట్టి (Sivankutty) అడిగారు, దీనిపై ఆయన ప్రజల నుంచి సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ విషయంపై నిర్మాణాత్మక సంభాషణకు ఈ చొరవ మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,కేరళ విద్యాశాఖా మంత్రి తన పోస్ట్లోని కామెంట్స్ విభాగంలో ప్రజలు తమ అభిప్రాయాలను సిఫార్సులను పంచుకోవాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా విలువైన విద్యా సంవత్సరంలో అనేక రోజులు స్కూల్స్ మూతబడుతున్న పరిస్థితిలో ఇది చర్చనీయాంశమేనని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఆన్ మనోరమ అనే స్థానిక మీడియా సంస్థ నిర్వహించిన పోల్లో 42 శాతం మంది జూన్–జులై మధ్య సెలవుల మార్పుకు అనుకూలంగా స్పందించగా 30.6 మంది మాత్రం ఏప్రిల్–మే అనే పాత విధానాన్ని యథాతధంగా కొనసాగించాలని కోరారు. అలాగే 27.52 శాతం మంది మే నుంచి జూన్ వరకూ సెలవుల్ని సవరించాలని సూచించారు.చదవండి: బుడ్డోడి ఫైరింగ్ స్టంట్కి షాకవ్వాల్సిందే! -
Lighthouse Parenting: ఒడ్డుకు చేర్చేలా మాత్రమే..!
లైట్హౌస్ అనేది సముద్రంలోని ఓడలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు లైట్హౌస్ పేరెంటింగ్ పిల్లలకు ఒక దిశను చూపుతుంది. అదే సమయంలో పిల్లలు వారి సొంత మార్గాల్లో పయనించేలా చేస్తుంది. ఈ పేరెంటింగ్ విధానంతో పిల్లలు బాధ్యతాయుతంగా ఎదగ గలిగే అవకాశాలెన్నో ఉన్నట్లు నిపుణుల పరిశీలన. ఈ తరహా పేరెంటింగ్ పిల్లలు భవిష్యత్తులో బాధ్యతయుతంగా పెరగడానికి ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం.లైట్హౌస్ పేరెంటింగ్ అంటే పిల్లలను సక్రమ మార్గంలో పెట్టడం. పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తూనే వారిని బాలెన్స్ చేయడం. ఈ వ్యూహాన్ని అమలు చేసే వారు తమ పిల్లలకు నిజాయితీగా మాట్లాడడానికి తగిన స్వేచ్ఛను ఇస్తారు. ఈ విధానంలో పిల్లలు తమకు ఏదైనా సాయం అవసరమైతే సంకోచించకుండా తల్లిదండ్రులను అడిగేలా పిల్లలను ప్రోత్సహిస్తుంది. తద్వారా పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.ప్రయోజనాలు ఏమిటి? లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.. పిల్లల ఆత్మగౌరవంపై సానుకూల ప్రభావం చూపడం.ఆరోగ్యకరమైన హద్దులు లైట్హౌస్ పేరెంట్స్ తమ పిల్లలకు సొంతంగా ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తారు. కానీ, వారికి కొన్ని హద్దులను నిర్దేశిస్తారు. పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం వంటి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమపై పూర్తి నమ్మకం ఉంచుతున్నారని తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవటానికి వారికి శక్తి వస్తుంది.బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడంఈ పేరెంటింగ్ విధానానికి కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలు తమ తల్లిదండ్రులను విమర్శిస్తారనే భయం లేకుండా నిశ్చింతతో ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి. వారు తమ తల్లిదండ్రులను సలహాదారులుగా భావిస్తే.. ఆత్మస్థైర్య భావం పెరుగుతుంది.కోపింగ్ నైపుణ్యాలను పెంపొందించడంఈ పేరెంటింగ్ విధానం ప్రాథమికంగా పిల్లలు ఎదురుదెబ్బలను అనుభవించేలా చేస్తుంది. అవసరమైనప్పుడు సాయం కోసం అడగడంలో వారికి మద్దతునిస్తుంది. పిల్లలు తమ భావాలను, ఇబ్బందులను సొంతంగా అధిగమించగల సామర్థ్యాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే పెద్ద సమస్యలను అధిగమించేందుకు ఈ పేరెంటింగ్ ఎంతో తోడ్పడుతుంది.సవాళ్లు లైట్ హౌస్ పేరెంటింగ్ విధానంతో అనేక ప్రయోజనాలను ఉన్నప్పటికీ, ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలు ఎదుర్కొనే విషయంలో వెనుకడుగు వేయడం కష్టం. ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని తెలుసుకోవాలి. ఇందుకు చాలా సహనం అవసరం. పిల్లల ప్రత్యేక అవసరాలు, వారి పరిస్థితులపై ఆధారపడి కొంతమందికి మరింత ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం కావచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి అనేదానిపై లైట్హౌస్ పేరెంటింగ్ ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
33 ఏళ్ల తర్వాత బాద్షాకు ఆదాబ్..!
ముప్పై మూడు ఏళ్ల సుదీర్ఘ నటనానుభవం తర్వాత షారుక్ ఖాన్ను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడిగా గుర్తించింది. ‘దీవానా’ (1992) నుంచి షారుక్ ఖాన్ బాలీవుడ్లో ప్రవేశించి ‘కింగ్ ఖాన్’గా ప్రేక్షకుల అభిమానం పొందుతూ, దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందుతున్నా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మాత్రం రాలేదు. ఇన్నాళ్ల తర్వాత అదీ మన సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించిన ‘జవాన్’ సినిమాకు వరించింది. అయితే అది కూడా పూర్తి అవార్డు కాదు. సగమే. మరో సగాన్ని యువ నటుడు విక్రాంత్ మాసేతో (ట్వల్త్ ఫెయిల్ సినిమాకు) పంచుకోవాలి. అంటే ఈసారి ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరు నటులకు ప్రకటించారు. సినిమా రంగంలో ఎటువంటి ఘరానా వంశాల మద్దతు లేకపోయినా ఢిల్లీ నుంచి మధ్యతరగతి యువకుడిగా వచ్చి జెండా ఎగుర వేసిన వాడు షారుక్. తనతరం హీరోలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పోటీ పడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వేగమైన శరీర కదలికలు, వినూత్నమైన డైలాగ్ డెలివరీ, అల్లరి చిల్లరిగా కనిపిస్తూనే లోతైన భావాలు పలికించడం ప్రత్యేకతగా షారుక్ ప్రేక్షకులకు నచ్చాడు. ‘బాజీగర్’, ‘డర్’ సినిమాల్లో నెగెటివ్ కేరెక్టర్లు వేసినా యువత అతణ్ణి హీరోగానే చూసింది. ఆ తర్వాత ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995)తో పూర్తి సూపర్స్టార్గా అవతరించాడు. ‘పర్దేశ్’, ‘దిల్తో పాగల్ హై’, ‘దిల్ సే’, ‘కభీ ఖుషీ కభీ గమ్’.. అన్నీ హిట్గా నిలిచాయ్. దర్శకుడు కరణ్ జొహర్, జూహీ చావ్లాలతో చాలా హిట్స్ సాధించాడు షారుక్. దిలీప్ నటించిన ‘దేవదాసు’ పాత్రను మళ్లీ పోషించి మెప్పించాడు. ‘కల్ హోనా హో’, ‘వీర్జారా’, ‘చక్దే ఇండియా’ వంటి సినిమాలు అతడి ప్రతిభను పదేపదే నిరూపించాయి. స్టార్గా ఉండి కూడా ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లో బుద్ధిమాంద్యం ఉన్న హీరోగా నటించాడు. ‘ఓమ్ శాంతి ఓమ్’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. షారుక్కు ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిన ‘జవాన్’ను 300 కోట్లతో నిర్మిస్తే 1100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ షారుక్ బాలీవుడ్ కా బాద్షాగానే కొనసాగుతున్నాడు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
'ఊరు' పాటకు కిరీటం
జాతీయ అవార్డుల్లో తెలంగాణ పల్లె పద సౌందర్యం మెరుపై మెరిసింది. తళుక్కున వెలిగింది. ‘బలగం’ సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన పాట ‘ఊరు పల్లెటూరు’ ఆ సినిమా విడుదలైనప్పుడే తెలుగు వారందరి మనసును తాకింది. పల్లె జీవనం అందరికీ ఇష్టమే కాబట్టి, ఆ పల్లెను మిస్సయ్యి పట్నవాసం, ప్రవాసం ఉండక తప్పదు కాబట్టి పాటలోని పల్లెతనాన్ని వినగానే అందరి ప్రాణం లేచివచ్చింది. కాసర్ల రచనకు భీమ్స్ అందించిన సంగీతం, మంగ్లి–రామ్ మిరియాల అందించిన గళం, దర్శకుడు వేణు ఎల్దండి దృశ్యరూపం అన్నీ కలిసి పాటను నిలబెట్టాయి. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆ పాట గెలిచి తెలంగాణ గ్రామీణ సౌందర్యానికి అందిన వందనం స్వీకరించింది. ప్రయివేట్ గీతాల నుంచి జాతీయ పురస్కార గ్రహీతగా..‘ఊరు పల్లెటూరు’ పాటతో ఉత్తమ గేయ రచయితగా జాతీయ పురస్కారం అందుకోనున్న కాసర్ల శ్యామ్ది తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. తండ్రి మధుసూదన్ రావు రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో నటుడు కావాలనే ఆకాంక్ష శ్యామ్ చిన్నతనం నుంచే ఉండేది. అయితే సాహిత్యం పట్ల తనకున్న అభిలాషతో జానపద పాటలు రాయడం, పాడడంలో అనుభవాన్ని సంపాదించారు. వరంగల్ శంకర్, సారంగపాణి బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాలేజీ పిల్ల చూడరో.. యమ ఖతర్నాక్గుందిరో..’ శ్యామ్ రాసిన తొలి జానపద సాంగ్. ఆ తర్వాత సుమారు 50పైగా ఆల్బమ్స్కు పాటలు రాశారు. ఆ సమయంలోనే మిత్రుల సాయంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా.. ‘చంటిగాడు’(2003) సినిమాలో తొలి అవకాశం వచ్చింది. బాలాదిత్య, సుహాసిని జోడీగా బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో, సిగ్గులొలికే సీతాలు’ పాటలతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘మహాత్మ’, ‘పటాస్’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘డీజే టిల్లు ‘అల వైకుంఠపురములో’... వంటి పలు సినిమాల్లో సుమారు 800కుపైగా పాటలు రాశారు శ్యామ్. తెలంగాణ మాండలికం, యాస, మాస్తోపాటు మెలోడీ గీతాలు రాయడంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. తన అభిమాన రచయిత చంద్రబోస్ అని చెబుతుంటారాయన. ఆయన భార్య రాధిక ఆర్కిటెక్ట్. ‘బలగం’ సినిమాలోని అన్ని పాటల్నీ కాసర్ల శ్యామ్ రాయగా ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ రచయితగా తొలి జాతీయ అవార్డు అందుకోనున్నారు. (చదవండి: స్త్రీ వాణి రాణించింది..!) -
స్త్రీ వాణి రాణించింది..!
స్త్రీల జీవితాల్లోని అంతఃప్రవాహాలువారిని లైంగికంగా పీడించి ఓడిపోయిన పిశాచాలు...స్త్రీలకు స్త్రీలే తోడుగా నిలిచిన కథనాలు...శుక్రవారం ప్రకటించిన జాతీయ సినీ పురస్కారాలు2023లో వెండితెర చూపించిన మహిళా సంఘర్షణలను మరోసారి జ్ఞప్తికి తెచ్చాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాఈసారి గుర్తింపు పొందిన నటీమణులు, గాయనులువారి అభిమానులను ఆనందపరిచారు. మొత్తంగా ఈ అవార్డులు స్త్రీల దృష్టికోణంలో ప్రత్యేకమైనవి. రాణి ముఖర్జీకి ఉత్తమనటి పురస్కారం దక్కింది. ఆమె నటించిన ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రానికి గానూ ఆమెకు ఈ పురస్కారం అందింది. ‘గులామ్’ (1998) నుంచి రాణి ముఖర్జీ నటిస్తూ ఉన్నా జాతీయనటిగా గుర్తింపు దక్కడం ఇన్నాళ్లకు గాని సాధ్య పడలేదు. ఆమెకు ఈ పురస్కారం రావడం పట్ల అభిమానులే కాదు... విమర్శకులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే స్త్రీల దృష్టికోణంలో ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చాలా శక్తివంతమైన సమస్యను చర్చించింది. నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ గొప్పగా నటించిందన్న ప్రశంసలు పొందింది. జాతీయ పురస్కారం వచ్చిందన్న వార్త వెలువడగానే ‘నా ముప్పై ఏళ్ల నటనా జీవితానికి ఇది వేలిడేషన్గా భావిస్తున్నా’ అని ఆమె స్పందించింది.ఎన్నో కలికితురాయిలుబెంగాల్ నుంచి బాలీవుడ్కు వచ్చిన రాణి ముఖర్జీ ‘ఆతీ క్యా ఖండాలా’ పాట ఉన్న ఆమిర్ ఖాన్ ‘గులామ్’తో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత షారుక్తో నటించిన ‘కుచ్ కుచ్ హోతాహై’తో స్టార్డమ్కు చేరుకుంది. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘కభి ఖుషీ కభి గమ్’, ‘సాథియా’, ‘వీర్ జారా’... తదితర సినిమాలు ఆమె ప్రతిభను చాటాయి. అయితే అమితాబ్తో కలిసి నటించిన ‘బ్లాక్’ సినిమాలో తను కేవలం గ్లామర్ హీరోయిన్ కాదని, ప్రతిభ ఉన్న నటి అని నిరూపించింది. 2014లో దర్శకుడు ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంత దూరమైనా ఇటీవల ‘మర్దానీ’, ‘మర్దానీ2’, ‘హిచ్కీ’, ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ చిత్రాలతో తెరతో తన అనుబంధాన్ని కొనసాగిస్తోంది.మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వేభారతీయ తల్లులకు పిల్లలను ఎలా పెంచాలో తెలుసు. పాలు ఇచ్చే పద్ధతి, పాలబువ్వ తినిపించే పద్ధతి, నీళ్లు ΄ోయడం, జోలపాడటం... ప్రతిదీ తెలుసు. కాని ఈ పద్ధతి తప్పు అంది నార్వే ప్రభుత్వం. అక్కడి బాలల సంరక్షణ అధికారులు అక్కడ నివసిస్తున్న భారతీయ జంట అనురూప్ భట్టాచార్య, సాగరికల నుంచి వారి ఇద్దరు పిల్లలను 2011లో అధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు కారణం నార్వే బాలల సంరక్షణ చట్టాలు. అక్కడ నివసిస్తున్న పౌరుల ఇళ్లలో పిల్లలు ఉంటే వారిని క్రమ విరామాలలో పరిశీలిస్తారు అధికారులు. అలా పరిశీలనకు వచ్చిన ప్రతిసారీ భారతీయ పద్ధతులకు పెడర్థాలు తీసి అనురూప్, సాగరికల పిల్లలు ప్రమాదంలో ఉన్నారని మూడేళ్ల కొడుకును, సంవత్సరం వయసు కుమార్తెను తమ అధీనంలోకి తీసుకెళ్లారు. ఆ పిల్లల కోసం సాగరిక చేసిన పోరాటాన్ని రాణి ముఖర్జీ ‘మిసెస్ చటర్జీ వెర్సస్ నార్వే’ సినిమాలో పునఃప్రతిష్ట చేసింది.నటి ఊర్వశికి ఉత్తమ సహాయ నటి పురస్కారంతెలుగువారికి చిరపరిచితమైన నటి ఊర్వశికి 2023 జాతీయ పురస్కారాల్లో ‘ఉల్లుజుక్కు’ (అంతఃప్రవాహం) సినిమాకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది. ఇదే సినిమాకు మలయాళం నుంచి ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం కూడా లభించింది. ‘ఉల్లుజుక్కు’లో ఊర్వశి అత్తగారి పాత్రలో నటించింది. ఆమె కుమారుడు పెళ్లయిన కొన్నాళ్లకే జబ్బు వల్ల మరణిస్తాడు. కోడలు ఆ పెళ్లికి ముందే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. కాని అనివార్యమై ఈ పెళ్లి చేసుకుంటుంది. భర్త మరణించే సమయానికి ఆ ప్రాంతంలో విపరీతమైన వానలు కురిసి వరద సంభవిస్తుంది. పైకి కనిపించే ఆ వరదలో లోపలి ప్రవాహపు వేగం ఎంతో ఎవరికీ తెలియదు. అలాగే అత్తగారు, కోడలు తమ జీవితాల్లో ఏయే లోపలి గాథలతో సతమతమవుతున్నారో ప్రేక్షకులకు మెల్లగా తెలుస్తూ వస్తుంది. సినిమా ముగింపు సమయానికి కోడలు అత్తను వీడి వెళ్లే పరిస్థితి ఉన్నా చివరకు ఆమె తన ప్రియుణ్ణి కాదని అత్త వద్దకు చేరుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో అత్తగా ఊర్వశి, కోడలిగా పార్వతి తిరువోతు నటించగా ఊర్వశికి పురస్కారం దక్కింది.సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హైజాతీయ పురస్కారాలలో మనోజ్ బాజ్పాయ్ నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాకు ఉత్తమ డైలాగ్ రైటర్ పురస్కారం దక్కింది. ఈ సినిమా జాతీయ పురస్కారాల పట్టికలో కనిపించడం చాలా ముఖ్యమైన విషయం. దీనికి కారణం బాబాల చెరలో చిక్కి బలైపోతున్న చిన్నారి ఆడపిల్లల కోసం న్యాయం వైపు నిలబడితే న్యాయం దక్కి తీరుతుందని ఇందులోని కథానాయకుడు తన న్యాయవాద వృత్తి ద్వారా నిరూపిస్తాడు. ఆడపిల్లలకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో, వారి మీద లైంగిక దాడి జరిగితే ఎన్ని విధాల వొత్తిళ్లు వస్తాయో ఈ సినిమా చూపుతుంది. టీనేజ్ పిల్లలకూ, వారి తల్లిదండ్రులకూ, వారి కోసం పథకాలు రచించే కపట స్వాములకు ఈ సినిమా హెచ్చరిక. (చదవండి: 77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..) -
77 ఏళ్ల 'ఫిట్నెస్ క్వీన్'..! ఓ బామ్మ సరిలేరు మీకెవ్వరూ..
సెలబ్రిటీలు, ప్రముఖులు ఫిట్నెస్ ట్రైనర్లు, పోషకాహారుల నిపుణులు పర్యవేక్షణ వంటివి ఉంటేనే మంచి ఫిట్నెస్ని సాధించగలరు. అవన్నీ కూడా పెద్దపెద్ద వాళ్లకే మనలాంటి వాళ్లకు అలాంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి మనవల్ల కాదు అనుకుంటారు చాలామంది. కానీ ఈ బామ్మని చూస్తే ఆ విధమైన ఆలోచనతీరునే మార్చుకుంటారు. సాదాసీదాగా ఉన్నవాళ్లు కూడా తమ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టొచ్చు అని తెలుస్తుంది ఈ బామ్మని చూస్తే. వృద్ధాప్యాన్ని అత్యంత ఆనందంగా ఎలా ఆస్వాదించాలో నేర్పుతోందామె. ఆమెనే హర్యానాకు చెందిన సాబో దేవి అనే 77 ఏళ్ల బామ్మ. గ్రామీణ హర్యానాకు చెందిన సాబోదేవి..అసాధారణమైన ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్ ఆమె. చక్కటి జీవనశైలి, మంచి వర్కౌట్లతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులో అంతలా వ్యాయమాలా అని ఆశ్చర్యపోయేలా చేస్తోందామె. అంతేగాదు ఆమె ఫిట్నెస్ పట్ల ఫోకస్ని చూసి చుట్టుపక్కల వాళ్లంతా 'హర్యానా ఫిట్నెస్ క్వీన్' అని ఆమెకు కితాబు కూడా ఇచ్చారు. అంతలా ఆకర్షించేలా ఆమె ఏం చేస్తుంది అనే కదా సందేహం. ఆమె బాల్యంలో సరదాగా నేర్చుకున్న ఈత తన దినచర్యలో భాగం చేసుకుంది. ఆమె తన ప్రతి ఉదయాన్ని ఈతతో ప్రారంభిస్తారామె. ఈ ఈత నైపుణ్యంతోనే గంగానదిలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులను కాపాడి సూపర్ బామ్మ అని కూడా అనిపించుకుంది. ఈ తరాన్ని ప్రేరేపించేలా స్క్వాట్లు చేస్తుంది. తన వయసు శారీరక పరిమితులకు సంబంధం లేకుండా యువత మాదిరిగా చురుకుగా ఉంటుందామె. అందులోనూ ఆమెది గ్రామీణ నేపథ్యమే అయినా..ప్రతి ఉదయం వ్యాయమాలు, తీసుకునే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. అథ్లెట్లకు కూడా కష్టసాధ్యమైన గంగానది ఈతను అలవోకగా చుట్టొచ్చేసింది. అంతేగాదు 2024లో తన మనవడితో కలసి సాబోదేవి 'ఐస్ ఛాలెంజ్'ను స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మనవడి పక్కన మంచుతో నిండిన తొట్టిలో గంటల తరబడి ఉండి మరి అతడిని ఓడించింది.ప్రమాదవశాత్తు సోషల్ మీడియా ఐకాన్..హర్యానాలో సోనిపట్లోని సీతావాలి గ్రామంలో జన్మిచింది సాబో దేవి. హుల్లెడి గ్రామానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ కృష్ణను వివాహం చేసుకుంది. చిన్న వయసులోనే ఆమె భర్త మరణించడంతో ఆమె ఒక్కత్తే ఆ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచింది. పిల్లలందరికి వివాహలైపోగా, తన రెండో కుమారుడితో ఉంటుందామె. అతడి కొడుకు చిరాగ్ అకా ఖగత్ కారణంగా సోషల్ మీడియా ఐకాన్గా మారింది. చిరాగ్ తన బామ్మ వ్యాయామాలు, ఈత కొడుతున్న చేస్తున్న వీడియోలు నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారి ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. సాంప్రదాయ భారతీయ జీవన విధానం ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆమె ఆహార్యం అందరిని ఆకట్టుకుంటుంది. ఆవనూనె, నెయ్యి, తాజా ఆకుకూరలు, తేలికపాటి పదార్థాలనే తీసుకుంటానని చెబుతోంది. అంతేగాదు దేశీ నెయ్యి, ఆవాల నూనె, పచ్చి కూరగాయలు, గోధుమలు తదితరాలే మంచి ఆరోగ్యానికి ప్రధానమైనవని నిపుణులు సైతం సూచించడం విశేషం. అందువల్ల ఆమెను అంతా ఫిట్నెస్ క్వీన్ కీర్తిస్తున్నారు. ఆమె జీవిత విలువలకే కాదు ఫిటనెస్కు, సాంస్కృతిక పరిజ్ఞానానికి, ధైర్యానికి ఐకాన్గా నిలిచి అందరికి స్ఫూర్తిని కలిగిస్తోంది. (చదవండి: పిల్లికి హైలెవల్ సెక్యూరిటీ..! ఇంకా ఇలానా..!) -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్తో అలరించనున్నారు. బెంగాల్ ఫుడ్కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు. ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
నీ స్నేహం..ఓ సంబరం..
కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపురేఖలు వేరట.. ఊపిరొకటే చాలట.. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.. కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా.. నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి.. స్నేహమంటే రూపులేని ఊహ కాదని.. లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.. అని సిరివెన్నెల రచించిన పాట అందరికీ సుపరిచితమే.. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచి్చందంటే!.. అదే ‘ఫ్రెండ్షిప్ డే’.. ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం బహుమతులు ఇచి్చపుచ్చుకోవడం లేదా ఇన్స్టాలో కథలు చెప్పడం మాత్రమే కాదు. నిజానికి, ఈ వేడుక రేపటి జ్ఞాపకాలుగా మారే అనుభవాలకు వేదిక. ట్రెడిషన్, ట్రెండ్ను మిళితం చేసే హ్యాపెనింగ్ సిటీ అయిన మన భాగ్య నగరంలో ఆ జ్ఞాపకాల సృష్టికి అనువైన ప్రదేశాలెన్నో.. అలాంటి కొన్ని ప్రదేశాలు, ఈవెంట్ల వివరాలు, అనువైన ప్రదేశాలను కోరుకునే ఫ్రెండ్షిప్ కోసం.. ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా ఆగస్టు నెల్లో తొలి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోనున్నారు స్నేహితులు. ఇందుకు నగరంలో పలు వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇది స్నేహితులతో రోజూ మాదిరి సరదాగా కాకుండా మరింత ప్రత్యేకంగా గడపడానికి సరైన సందర్భం.. అందుకు అనువైన ప్రదేశాలెన్నో నగరంలో వేదిక కానున్నాయి. ఫ్రెండ్స్.. జంతు ప్రేమికులైతే బంజారాహిల్స్లోని పెట్ కేఫ్ లాంటివి సరైన ఎంపిక. ఇక్కడ పిల్లులను కౌగిలించుకోవచ్చు, అందమైన శునకాలను పలకరించవచ్చు. ఇది స్నేహితుల రోజువారీ ఒత్తిడిని తగ్గించడానికి అనువైన ప్రదేశం. నగరంలో మొట్టమొదటి ఆర్ట్ థెరపీ స్పాట్ జూబ్లీహిల్స్లోని లైజుర్–ఆర్ట్ కేఫ్, లైజుర్ పెయింటింగ్, టఫ్టింగ్, కుండలు, టీ–షర్ట్ పెయింటింగ్, కొవ్వొత్తుల తయారీ లాంటివెన్నో అందిస్తుంది. కళాభిమానులైన స్నేహితులు ఆర్ట్ జామింగ్ లేదా సృజనాత్మక సెషన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. బ్రష్స్ట్రోక్స్ లేదా టఫ్టింగ్ సెషన్ మధ్య కాఫీని ఆస్వాదించవచ్చు. జూబ్లీహిల్స్లోని బోర్డ్ కేఫ్లో స్క్రాబుల్ వంటి క్లాసిక్ల నుంచి తంబోలా వంటి పార్టీ గేమ్ల వరకూ 700 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. ఆటలకు కొత్తవారైతే హోస్ట్ల ద్వారా సహాయం అందుకోవచ్చు. ఇక్కడ గంటల తరబడి నవ్వుతూ, స్నేహితులతో సరదా పోటీలతో గడపవచ్చు. జూబ్లీహిల్స్లోని బేస్ కాఫీ, పికిల్ బాల్ కేఫ్.. నగరంలో కొత్త జీవనశైలిలో ఒకటైన పికిల్ బాల్ కాఫీలని విలీనం చేస్తుంది. స్నేహితులు బాల్ గేమ్స్ ఆడవచ్చు, ఆ తరువాత కోల్డ్ బ్రూలు స్నాక్స్తో రీఛార్జ్ కావచ్చు. ప్రకృతిని, ప్రశాంతతను ఇష్టపడే ఫ్రెండ్స్ ప్రప్రథమ గార్డెన్ థీమ్డ్ అర్బన్ నెమో కేఫ్ని ఎంచుకోవచ్చు. ఇది పచ్చని మొక్కలతో రిలాక్స్డ్ ఓపెన్–ఎయిర్ సీటింగ్ బొటానికల్ డెకార్ను అందిస్తుంది. ఈ కేఫ్ ఫ్రెండ్షిప్ డే కార్యకలాపాలను ప్రత్యేకంగా నిర్వహించనప్పటికీ.. పచ్చదనంతో పాటు అల్లుకున్న ప్రశాంతత నిశ్శబ్దంగా ఫ్రెండ్షిప్ డేని ఆస్వాదించడానికి సరిపోతుంది. సృజనాత్మక కో–వర్కింగ్, వర్క్షాప్లు లేదా ఈవెంట్లతో కూడిన హైబ్రిడ్ స్పేస్ మిక్సింగ్ కేఫ్ ఛార్జీ. ఇక్కడ ఓపెన్ మైక్ నైట్స్, ఇండీ బ్రాండ్ పాప్–అప్లు, రైటింగ్ సర్కిల్స్, ఆర్ట్ వర్క్షాప్లు లేదా స్టాండ్–అప్ కామెడీని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రత్యేక కార్యక్రమాలు.. కోకాపేట్లోని ది రాబిట్ లాంజ్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా డీజే కిమ్, డీజే సినాయ్లు సందడి చేయనున్నారు. లిక్విడ్ డ్రమ్స్, సాక్సాఫోన్, దర్బూకా.. వంటి వెరైటీ సంగీత పరికరాలు ఆకట్టుకోనున్నాయి. నగర శివార్లలో ఉన్న ఎమ్యూజ్మెంట్ పార్క్స్లో ఫ్రెండ్షిప్ డే వినోదభరితంగా జరగనుంది. శని, ఆదివారాలు రెండు రోజులపాటు వేడుకలు ప్లాన్ చేశారు. వేవ్ పూల్ డీజే సెట్లు, ఫోమ్ పారీ్టలు, ఇంటరాక్టివ్ గేమ్లు సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకూ కొనసాగే నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని థర్డ్ వేవ్ కాఫీలో ‘సొంత ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ తయారు చేసుకోండి’ పేరిట శనివారం వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా హిప్–హాప్ పార్టీ విత్ జినీ లైవ్ ప్రోగ్రామ్ను సోమాజిగూడలోని ఆక్వా ది పార్క్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. దీని కోసం మిజోరాంకు చెందిన ఆరి్టస్ట్ నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. (చదవండి: సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!) -
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్నైట్లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్ అవసరం.. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది. ఎయిర్ పోర్టు, మాల్స్లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్బో హార్ట్ ఇన్స్స్టిట్యూట్ -
ఆ ఆర్మీ ఆఫీసర్ నిర్మించిన ‘బేలీ' ఆ మహిళలకు అండగా మారింది..!
గత సంవత్సరం కేరళలోని వయనాడ్లో వచ్చిన భారీ వర్షాలు, విరిగి పడిన కొండచరియలు ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో వరదబాధితులకు వేగంగా సహాయం అందించడానికి ఆర్మీ ఆఫీసర్ సీతా షెల్కే 144 మంది ఆర్మీ జవానుల బృందంతో కలిసి ‘బేలీ వంతెన’ నిర్మించింది. ఆనాటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మహిళలకు ఇప్పుడు ‘బేలీ’ అండగా నిలబడింది. అయితే ఇది వంతెన కాదు. వరద బాధిత మహిళలు తమ జీవితాలను పునర్మించుకోవడానికి వచ్చిన ప్రాజెక్ట్. ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ ద్వారా ఎంతోమంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది.జిల్లా అధికార యంత్రాంగం స్వయం సహాయక బృందం ‘కుటుంబశ్రీ’ భాగస్వామ్యంతో ‘బేలీ అంబరిల్లా అండ్ బ్యాగ్స్ ప్రాజెక్ట్’ను ప్రారంభించింది. ఆనాటి వరదల్లో ‘బేలీ వంతెన’ ఎంతోమంది బాధితులను కాపాడింది. ఆ కృతజ్ఞతతోనే ఈ జీవనోపాధి ప్రాజెక్ట్కు ‘బేలీ’ అని నామకరణం చేశారు. ‘బేలీ ప్రాజెక్ట్’లోని మహిళలు తయారు చేస్తున్న రంగురంగుల గొడుగులు, బ్యాగులను కుటుంబశ్రీ స్టాల్స్, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఔట్లెట్స్లో ప్రదర్శిస్తున్నారు.‘బేలీ బ్రాండ్’ బ్యాగులు, గొడుగులకు తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వీటికి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘బేలీ ప్రాజెక్ట్’కు సంబంధించిన పని ప్రదేశం... కేవలం బ్యాగులు, గొడుగుల తయారీ కేంద్రం మాత్రమే కాదు. ‘విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడవచ్చు. మోడువారిన పరిస్థితులలోనూ కొత్తగా పునర్జీవించవచ్చు’ అని బలంగా చెప్పే ప్రదేశం. (చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్!
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్! ‘ఏరా బుజ్జికొండా, పిజ్జాలు తింటావా!’ అని తన పక్కన కూర్చున్న సింహాన్ని అడిగింది బామ్మ. ‘నువ్వు తినిపిస్తే ఎందుకు తినను’ అన్నట్లుగా చూసింది సింహం. ‘అయితే తినూ’ అంటూ సింహానికి ఆప్యాయంగా పిజ్జా తినిపిస్తూ తాను కూడా ఒక ముక్క తిన్నది బామ్మ. మటన్ ముక్కలు తినే సింహం పిజ్జా ముక్కలు తినడం ఏమిటి! అడవిలో ఉండాల్సిన సింహం బామ్మ పక్కన పిల్లిలా కూర్చోవడం ఏమిటి!!ఇది కలియుగ వింత కాదు... ఏఐ (ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన సాంకేతిక వింత. ఈ ఏఐ వీడియోలో ఎక్కడా కృత్రిమత్వం కనబడదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ సింహం– బామ్మ వీడియో వేలాది వ్యూస్తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Viral taii vlog (@taii_vloger) (చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'.) -
ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!
విక్టోరియా అనే ఓ మహిళ గుండె స్పందనలు ఆగాయి. కార్డియాక్ అరెస్ట్తో ఆ గుండె ఆగగానే ఆమె దాదాపుగా చని΄ోయిందనే అనుకున్నారందరూ! ఏకంగా 17 నిమిషాల పాటు ఆగిందామె గుండె. అయితే... అత్యంత అప్రమత్తతతో అత్యవసరంగా స్పందించిన కొందరు పారామెడిక్స్ కృషితో గుండె స్పందనలు మళ్లీ మొదలయ్యాయి. తీరా చూస్తే ఆమె గుండె అలా ఆగడానికి కారణం... ఆమెకున్నో అరుదైన జన్యుపరమైన వ్యాధి. మల్టిపుల్ హార్ట్ ఫెయిల్యూర్గా పిలిచే విక్టోరియా వ్యాధి వివరాలివి. యూకేలోని గ్లౌసెస్టర్ నగరానికి చెందిన విక్టోరియా థామస్ అనే మహిళ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. ముప్పై ఐదేళ్ల ఆమె తన ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ ఉండేది. ఎప్పటిలాగే ఆరోజునా ఆమె జిమ్లో వ్యాయామాలు చేస్తోంది. తన ఇంటెన్సివ్ వర్కవుట్ సెషన్లో భాగంగా అప్పుడే ఆమె తన వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ పూర్తి చేసుకుంది. ఇంతలో ఆమెలోని శక్తినంతా తలలోంచి బయటకు తోడిపోసిన అనుభూతి! విక్టోరియా తన చేతిలోని వెయిట్స్ రాడ్ను ఇలా పక్కకు పెట్టిందో లేదో... ఒక పక్కకు అలా ఒరిగిపోయింది. పక్కనున్నవాళ్లు హుటాహుటిన పారామెడిక్స్ను తీసుకొచ్చారు. వాళ్లు ఆమె ఛాతీని నొక్కుతూ సీపీఆర్ (కార్డియో పల్మునరీ రీససియేషన్) మొదలుపెట్టారు. కానీ గుండె స్పందనలు ఎంతకీ మొదలు కాలేదు.మరణానుభవానుభూతితో ఓ నిశ్శబ్ద శూన్యత... సెకన్లు నిమిషాల్లోకి గడిచి΄ోతున్నాయి. నిమిషాలు పదీ, పదిహేను నిమిషాల వ్యవధి దాటి పావుగంటల్లోకి దొర్లిపోతున్నాయి. కానీ సీపీఆర్తో ఎంతగా ప్రయత్నిస్తున్నా విక్టోరియా కోలుకోవడం లేదు. అలా 17 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆమె గుండె అకస్మాత్తుగా స్పందనలనందుకుంది. ఈలోపు ఆమెకు అంతటా శూన్యం. భయంకరమైన నిశ్శబ్దం. ఎటు చూసినా... చూడకున్నా అంతా చిమ్మచికటి. ఆమెలోని తన స్మృతి హేతు జ్ఞానాలన్నీ విస్మృతిలోకి వెళ్లాయి. ఇలా ఆమె ఆ 17 నిమిషాల పాటూ ‘నియర్ డెత్’ భయంకరానుభవాన్ని చవిచూసింది. ప్రాణాలు దక్కవనే అనుకున్నారు. కానీ 17 నిమిషాల తర్వాత ఆమె గుండె స్పందనలు మొదలయ్యాయి.మూడు రోజుల పాటు కోమాలోనే...ఎట్టకేలకు గుండె స్పందనలు మొదలైనా ఇంకా ఆమె కోమాలోనే ఉంది. దాంతో విక్టోరియాను ‘బ్రిస్టల్ రాయల్ ఇన్ఫర్మరీ’ అనే ఓ పెద్ద వైద్యశాలకు తరలించారు. అక్కడామె మూడు రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. తర్వాత మెల్లగా కోలుకుని కోమాలోంచి బయటకొచ్చింది.గర్భం దాల్చడంతో మొదలైన సవాళ్లు... ఇదిలా ఉండగా 2021లో విక్టోరియా గర్భం దాల్చింది. అప్పుడు చేసిన పరీక్షల క్రమంలో తెలిసిందేమిటంటే... ఆమెకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే వ్యాధి ఉందని! ‘డేనన్ డిసీజ్’ అని పిలిచే ఆ అరుదైన జన్యుపరమైన ఆ వ్యాధి కారణంగా ఇతర కండరాలతో పాటు గుండె కండరాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. అవి క్రమంగా బలహీనపడిపోవడంతో (కార్డియోమయోపతి కారణంగా) గుండె మాటిమాటికీ ఆగిపోతుంటుంది. ఆ గుండె ఆగకుండా స్పందించేందుకూ... ఒకవేళ ఆగినా మళ్లీ స్పందనలు మొదలయ్యేందుకు డీ–ఫిబ్రిలేటర్ అనే పరికరాన్ని అమర్చారు. అది చేసే పనేమిటంటే గుండె ఆగినప్పుడుల్లా ఓ ఎలక్ట్రిక్ షాక్ పంపి, గుండెను మళ్లీ కొట్టుకునేలా చేస్తుంది. చిత్రమేమిటంటే... జన్యుపరమైన వ్యాధి అయినప్పటికీ... వాళ్ల కుటుంబంలో అందుకుముందెవరికీ ఆ వ్యాధి లేదు. అది కనిపించిన మొట్టమొదటి బాధితురాలు విక్టోరియానే!!అసలే గుండె వీక్... ఆ పైన ప్రెగ్నెన్సీ!!మొదటే గుండె చాలా బలహీనం. కానీ ఆలోపు ప్రెగ్నెన్సీ రావడంతో గుండె పంపింగ్ సరిగా జరగక మాటిమాటికీ విక్టోరియా గుండె ఆగి΄ోవడాలు జరిగేవి. ఇలా తరచూ జరిగే కార్డియాక్ అరెస్టుల నేపథ్యంలోనే నెలల నిండకముందే సిజేరియన్తో బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. బిడ్డ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ పండంటి మగబిడ్డ! అదృష్టం... పరీక్షలు చేసి చూస్తే తల్లికి ఉన్న ఆ జన్యుపరమైన జబ్బు బిడ్డకు లేదు!! డాక్టర్లు 2022లో విక్టోరియాకు గుండె పరీక్షలు చేయించినప్పుడు తెలిసిందేమిటంటే... ఆమె గుండె పనితీరు కేవలం 11 శాతమేనని!! అంటే హార్ట్ ఫెయిల్యూర్ తాలూకు చివరి దశ అది. ఇకపై ఆమె బతకబోయేది కొద్ది నెలల మాత్రమేనని తేలింది. అదృష్టాలు ఒక్కోసారి ‘ఫలించి’నప్పుడు గుండెకాయ కూడా చెట్టుకాయలా దొరుకుతుంది. అలా ఆమెకు గుండె మార్పిడి చికిత్స కోసం తగిన గుండె దొరకడంతో... ఏప్రిల్ 2023 లో ట్రాన్స్ప్లాంట్ చికిత్స చేశారు. దాంతో విక్టోరియా మృత్యుముఖం నుంచి మరోసారి బయటపడింది. ‘కొత్త హార్ట్’తో తల్లి... తన ‘స్వీట్ హార్ట్’ అయిన ఆ బిడ్డ... ఇలా ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం.– యాసీన్ (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
నో ఫ్యాషన్ డైట్.. జస్ట్ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్గా నటి దీప్తి సాధ్వానీ
బరువు తగ్గేందుకు సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరు నానాప్రయాసలు పడి మరీ స్లిమ్గా మారుతున్నారు. ఆహార్యం పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలన్నదే అందరి అటెన్షన్. అయితే ఆ బరువు తగ్గే ప్రయాణం అంత ఈజీగా విజయవంతం కాదు. ఎందుకంటే..ఎక్కడ రాజీపడని దృఢ సంకల్పంతో ముందుకు సాగినవారే మంచి ఫలితాలను అందుకుని చక్కటి ఆకృతితో మన ముందుకు వస్తున్నారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ బుల్లితెర నటి తారక్ మెహతా కా ఊల్తా చాష్మా ఫేమ్ దీప్తి సాధ్వానీ కూడా చేరిపోయారు. ఎలాంటి షార్ట్కట్లు డైట్లు పాటించకుండానే ఆరోగ్యవంతంగా బరువు తగ్గి అందరిచేత ప్రశంసలందుకుంటోంది దీప్తి. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో సవివరంగా చూద్దామా..!.34 ఏళ్ల దీప్తి సాధ్వానీ తారక్ మెహతా కా ఊల్తా చాష్మాలో ఆరాధన శర్మ పాత్రతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సంపాదించుకున్న నటి. గతేడాది తన బ్యూటిఫుల్ లుక్తో ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచింది. ఇండ సడెన్గా అంతలా మెరుపు తీగలా ఎలా అని విస్తుపోయారంతా. అంతలా తన ఆహార్యాన్ని మార్చుకుంది దీప్తి. అంతేగాదు తాను ఎలా స్లిమ్గా మారిందో కూడా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారామె. తాను ఎలాంటి క్రాష్ డైట్లు ఫాలో కాలేదని, కనీసం బరువు తగ్గే మాత్రలను కూడా ఉపయోగించలేదని చెప్పుకొచ్చింది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామాలతోనే బరువు తగ్గించుకున్నానని తెలిపింది. అయితే ఏ నెల స్కిప్ చేయకుండా వెయిట్లాస్ జర్నీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అలాగే బరువు తగ్గడం ఏమంత సులువు కాదని చెబుతోంది. ఇక్కడ అంకితభావంతో డుమ్మా కొట్టకుండా పాటిస్తేనే మంచి ఫలితాలు త్వరితగతిన పొందగలమని చెబుతోంది. ముఖ్యంగా చక్కెరకు సంబంధించినవి, ప్రాసెస్ చేసిన ఆహారాలను దరిచేరనివ్వకుండా చేస్తే చాలు బాడీలోని మార్పులు త్వరితగతిన సంతరించుకుంటాయంటోంది. దీంతోపాటు రోజుకి 16 గంటలు అడపాదడపా ఉపవాసం ఉంటుందట. అలాగే మైండ్ఫుల్ కేలరీ ట్రాకింగ్ వీటన్నింటితో సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకున్నానని చెబుతోంది. ఇవి మంచివేనా అంటే..కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ జర్నల్ సైతం అడపాదడపా ఉపవాసం అనుసరించే వ్యక్తులు తక్కువ వ్యవధిలో 0.8% నుండి 13% బరువు తగ్గుతారని పేర్కొంది. అలాగే కేలరీలరట్రాకింగ్అనేది కూడా అత్యంత ఆరోగ్యకరమైన రీతిలో ఉంటే బరువు తగ్గడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఇక దీప్తి వ్యాయమాలు దగ్గరకు వచ్చేటప్పటికీ బాక్సింగ్, ఈత, వైమానిక యోగా వంటివి చేసినట్లు వెల్లడించింది. ఒకటే రొటీన్ వ్యాయమాలు కాకుండా మారుస్తూ చేస్తూ.. ఉంటే..బాడీకి స్వాంతన తోపాటు..చేయాలనే ఉత్సాహం వస్తుందని చెబుతోంది. ఇక్కడ బరువు తగ్గడం అనేది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుందనని అంటోంది దీప్తి సాధ్వానీ. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
కళ్లకు గంత..! 'ఆ కళ ఓ వింత'
కాదేదీ కవితకు, కళకు కూడా అనర్హం. కళ్లు తెరచి చూసేవారికి కనువిందు చేసే చిత్రకళ.. కళ్లకు గంతలు కట్టుకొని చిత్రకారులు సృష్టించింది అని తెలిస్తే వీక్షకులకు అదో వినూత్న అనుభూతి. అలాంటి చిత్రాలకే కాదు.. ఆ చిత్రకళకూ ఇప్పుడు నగరంలో కళాభిమానులు జై కొడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని చిత్రకారులు గీసిన చిత్రాలను చూడటానికి మాత్రమే కాదు తాము సైతం అదే కళను సాధన చేస్తూ ఓ వైపు సృజనాత్మకత పెంచుకుంటూ మరోవైపు మానసిక ప్రశాంతత పొందుతున్నారు. బ్లైండ్.. ట్రెండ్.. కొన్నేళ్లుగా బాగా ఆదరణకు నోచుకుంటున్న బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ అనేది కళాకారులు కళ్లకు కట్టు కట్టి, తమ భావోద్వేగాలను, ఊహాశక్తిని ఆధారంగా చేసుకుని పెయింటింగ్స్ రూపొందించే ఒక అరుదైన కళా ప్రక్రియ. మన దేశంలో ఈ ఆర్ట్కు సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందిన కొందరు ప్రముఖ కళాకారుల్లో రాజస్థాన్కు చెందిన మహేష్ చంద్ర శర్మ దాదాపు 6 వేల చిత్రాలను కేవలం స్పర్శ ఆధారంగా చిత్రీకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు నామినేట్ అయ్యారు. ఎన్నో సోషల్ వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కోసం తన కళను వినియోగిస్తున్నారు. మైసూరుకు చెందిన శ్రీనివాస్ బి.బ్లైండ్ ఫోల్డ్ మల్టీటాలెంటెడ్ ఆరి్టస్టుగా పేరు పొందారు. కేవలం చిత్రకళే కాదు, సంగీతం, డాన్స్ వంటి ఇతర కళారూపాల్లో కూడా కళ్లకు కట్టు వేసుకుని ప్రదర్శనలిచ్చారు. దేశవ్యాప్తంగా పలు స్కూల్స్, కళాకేంద్రాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తున్నాడు. బెంగుళూర్ నివాసి నివేదిత గౌడ టీవీ ప్రోగ్రామ్స్లో బ్లైండ్ఫోల్డ్ డ్రాయింగ్, స్కెచ్ డెమోస్ ద్వారా గుర్తింపు పొందారు. యువతలో సృజన పెంపొందించేందుకు బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. నగరంలో బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ నిపుణులుగా జె.వేణుగోపాల్ పేరొందారు. ఆయన కళ్లకు గంతలతో ‘గణేశ’ ‘ప్రపంచ ఉష్ణోగ్రత’ వంటి చిత్రాలు గీశారు. కొత్త కొత్త కళలను సాధన చేయడం పట్ల నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో క్రేజ్ పెరుగుతోంది. పలు ఇన్నోవేషన్స్కు సిటీ కేంద్రంగా మారుతున్న వేళ, ఈ తరహా వినూత్న ఆర్ట్ ఫార్మాట్లు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దాంతో బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ ట్రెండ్గా మారుతున్నాయి. కళను అనుభవించడంలో కొత్త కోణాలను అన్వేíÙంచే వారికి వీటి వర్క్షాప్లు ఆసక్తికరంగా మారడంతో పలు ఆర్ట్ స్టూడియోలు, కమ్యూనిటీ సెంటర్లు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వయసులకు అతీతంగా నగరవాసులు వీటిలో పాల్గొంటున్నారు. ఈ బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ ఈవెంట్స్, వర్క్షాప్స్ కేవలం వినూత్న కళను నేర్చుకోవడానికి మాత్రమే కాదు కాదు, చూస్తూ అనుభవిస్తూ కళను సృష్టించే ఈ కళారీతి మైండ్ఫుల్నెస్, స్ట్రెస్ రిలీఫ్, ఇన్నర్ కాని్ఫడెన్స్ పెంపొందించుకోవడంలో సహాయపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల నగరంలో ‘బ్లైండ్ఫోల్డ్ ఆర్ట్ ఛాలెంజ్’ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొనేవారు కళ్లకు గంతలు కట్టుకుని బొమ్మల్ని గీయాలి అంతేకాక అది ఏ బొమ్మో కూడా ఊహించాలి. ఎస్సిఎమ్ హైదరాబాద్ ఆర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాలెంజ్లో బహుళ రౌండ్ల తర్వాత విజేతలను ఎంపిక చేశారు. సాధారణ వ్యక్తుల కన్నా దృష్టి లోపం ఉన్నవారికి. ఇతర ఇంద్రియాల పట్ల అవగాహన వాటి శక్తుల పట్ల ఆలోచన పెంచడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు. స్ఫూర్తిని అందిస్తున్న బ్లైండ్ ఫోల్డ్ విజయాలు.. చిత్రకళ మాత్రమే కాకుండా బ్లైండ్ ఫోల్డ్ అనేది చాలా కళలకు, సాహసాలకు విస్తరిస్తోంది. నగరంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు సాధిస్తున్న విజయాలు నగరవాసులకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో.. మంగుళూర్కి చెందిన మెజిషియిన్ సమర్థ్ షెనాయ్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా 300 కి.మీ. స్కూటర్ రైడ్ను కళ్లకు గంతలు కట్టుకుని పూర్తి చేశారు. బీహార్లోని దర్భాంగా ప్రాంతవాసి అయిన మోనికా గుప్తా అయోధ్యలో రామమందిర ప్రారంభత్సవంలో కళ్లకు గంతలు కట్టుకుని రంగోలిని గీసి అందర్నీ ఆకట్టుకున్నారు. ముంబైకి చెందిన అఫాన్ కుట్టి కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్స్ క్యూబ్లను ఉపయోగించి క్రికెటర్ మొహమ్మద్ షమీ చిత్రపటాన్ని సృష్టించాడు. చెన్నైకి చెందిన శిల్పి చంద్రు స్పర్శ, విజువలైజేషన్ కళ మధ్య సంబంధాన్ని వివరిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని శిల్పాలను సృష్టించే శిల్పకారుడిగా పేరొందారు. వాయిద్య కారులు, గాయకులు సహా అందరూ కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన ఇచ్చే ముంబైకి చెందిన బ్లైండ్ ఆర్కెస్ట్రా కళాకారులు కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందమైన టాయ్ పూడుల్స్ ప్రయాణికులను సాదరంగా ఆహా్వనిస్తున్నాయి. చిరకాల నేస్తాల్లా పలకరిస్తాయి. తాకితే చాలు వచ్చి ఒడిలో వాలిపోతాయి. ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. పిల్లలు ఆడుకొనే సున్నితమైన టాయ్స్ను తలపించే ఈ శునకరాజాలు ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డాగ్ థెరపీలో భాగంగా వినూత్నంగా ఈ శునకాలను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే ప్రవేశ ద్వారాల వద్ద ఈ శునకాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. టాయ్ పూడుల్స్ శునకాలకు తర్ఫీదు సాధారణంగా ప్రయాణం అనగానే ఏదో ఒక స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్ రద్దీని ఛేదించుకొని సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోవడమే ఒక సవాల్, ఏదో ఒక విధంగా ఆ సవాల్ను అధిగమించి ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత మరోవిధమైన ఆందోళన మొదలవుతుంది. భద్రతా తనిఖీలు దాటుకొని లగేజీ బరువు సరిచూసుకొని, బోర్డింగ్ పాస్ తీసుకొనే వరకు టెన్షన్గానే ఉంటుంది. వరుసగా తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ వంటి ప్రహసనాలన్నీ ముగించుకొని టెరి్మనల్కు చేరుకొనే వరకు ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆ ఒత్తిడి నుంచి ఊరటనిచ్చేందుకు మానసిక ప్రశాంతత కలిగించేందుకు డాగ్థెరపీ దోహదం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఈ డాగ్ థెరపీ సదుపాయం అందుబాటులో ఉంది. అదే తరహాలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం నాలుగు టాయ్ పూడుల్స్ శునకాలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. అలాగే వాటి నిర్వహణ కోసం నిపుణులను కూడా అందుబాటులో ఉంచారు. ‘ఈ టాయ్ పూడుల్స్ ఎంతో మృదుస్వభావాన్ని కలిగి ఉంటాయి. పెద్దలు, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటాయి. అందరితో కలిసిపోయేవిధంగా శిక్షణనిచ్చారు.’ అని ఎయిర్పోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఒంటరిగా ప్రయాణం చేసేవారికి కొన్ని గంటల పాటు ఇవి తోడుగా ఉంటాయని చెప్పారు.సెల్ఫీ ప్లీజ్.. ఈ శునకాలను ప్రయాణికులకు తమ బాల్యాన్ని గుర్తుకు తెస్తాయి. వాటితో ఆటలాడుకోవచ్చు. ఒడిలోకి తీసుకొని నిమురుతూ కాలక్షేపం చేయొచ్చు. సెలీ్ఫలు కూడా తీసుకోవచ్చు. టాయ్ పూడుల్స్ ద్వారా పొందే అనుభూతులు ప్రయాణికులకు ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలగజేస్తాయని, డాగ్ థెరపీలో ఇది ఒక భాగమని నిర్వాహకులు తెలిపారు. వీటితో కాలక్షేపం చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ‘డాగ్ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి గురయ్యే కారి్టసాల్ హార్మోన్లను తగ్గిస్తుందని చెప్పారు. అలాగే ఆనందాన్ని కలిగించే ఆక్సిటోసిన్ను పెంచుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న 4 శునకాలు వారానికి 5 రోజులు అంటే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 6 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఈజీగా జర్నీ.. సాధారణంగా విమానప్రయాణంలో రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. విమాన ప్రయాణం పట్ల ఉండే భయం, ఆందోళనలను డాగ్థెరపీ ద్వారా అధిగమించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణాల్లో ఆలస్యంగా నడిచే విమానాల వల్ల కనెక్టింగ్ ఫ్లైట్ లభిస్తుందో లేదోననే భయం పట్టుకుంటుంది. ఆ సమయంలో ఈ శునకాలు ఒక డైవర్షన్ టెక్నిక్లా పని చేస్తాయి. (చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..
మన భారతీయ వంటకాలు ఎంతటి మహామహులనైన ఫిదా చేస్తాయి. వండే విధానం, వాటి రుచికి దాసోహం అని అనను వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా మైమరిపించే మన వంటకాల రుచికి ఓ ప్రముఖ ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ సీఈవోనే ఇంప్రెస్ అయ్యి..ఆరోగ్యకరమైన రెసిపీలంటూ ప్రశంసించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ కాలిఫోర్నియా బురిటో వ్యవస్థాపకుడు అమెరికన్ బ్రెట్ ముల్లర్..మన బెంగళూరు వంటకాల రుచికి ఫిదా అయ్యాడు. ఆయన బసవగుడిలో కామత్ శాకాహార రెస్టారెంట్లో జోలాడ రోటీ భోజనాన్ని ఆస్వాదస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ శాకాహార రెస్టారెంట్లో ఉత్తర కర్ణాటక శైలి థాలిని ఆయన ఆనందంగా ఆస్వాదించారు. తాను ఈ రెస్టారెంట్కి తన చార్టర్ అకౌంటెంట్ సిఫార్సుపై 2014లో ఇక్కడి వచ్చానని ఆ వీడియోలో తెలిపారు. అప్పట్లో ఈ నగరానికి కొత్త..అంటూ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రెస్టారెంట్లో భోజనం గురించి వివరిస్తూ..ప్లేట్లోని తాజా కూరగాయల వంటకాలు, క్రిస్పీ సలాడ్లు, ఉత్సాహభరితమైన రుచులతో ఇంప్రెస్ చేస్తుంది. జొన్న రొట్టె మీద వెన్న కరుగుతూ ఉండగా వేడివేడిగా ఉన్న గుత్తు వంకాయ కూరలో నొంచుకుని తింటే ఉంటుంది.. నా సామిరంగా ప్రాణం లేచివచ్చినట్లుగా ఉంటుంది అని చెబుతున్నాడు ముల్లర్. తాను ఈ జోలాడ రొట్టెని ఆస్వాదించాలని మూడు సార్లు ఈ బసవనగుడికి వచ్చానని అన్నారు సీఈవో. బెంగళూరు అంతటా ఇలాంటి ఆహారాలు ఉన్నా..ఇక్కడి జోలాడ రొట్టె మాత్రం అత్యంత విభిన్నంగా ఉంటుందని అన్నారు. అక్కడెక్కడ ఇలాంటి రుచి లభించదని అన్నారు. ఇది రుచికి రుచి, ఆరోగ్యం కూడా అని ప్రశంసించారు. అయితే ఇలాంటి భోజనం తిన్నాక తప్పకుండా జిమ్కి వెళ్లక తప్పదు అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన ఇక్కడ బెంగళూరు వంటకాలను మెచ్చుకున్నప్పటికీ..ఇక్కడి ట్రాఫిక్ పట్ల అత్యంత అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా త్వరత్వరగా వెళ్లేందుకు ఆటోలకే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కాగా, ముల్లెర్ 2012లో 22 ఏళ్ల వయసులో బెంగళూరు నగరం వచ్చి తన తొలి కాలిఫోర్నియా బురిటో అవుట్లెట్ను ప్రారంభించాడు. ఈ మెక్సికన్ ఫాస్ట్-క్యాజువల్ బ్రాండ్ క్రమంగా అభివృద్ధి చెంది.. భారతదేశం అంతటా సుమారు 100కు పైగా అవుట్లెట్లతో విస్తరించింది. ఇది సుమారు 20 కోట్లపైనే లాభాలను ఆర్జిస్తోంది. ఇక ఈ వ్యాపారం కూడా ఇతర బిజినెస్ల మాదిరిగానే మహమ్మారి సమయంలో ఆటుపోట్లకు గురైంది. దాని 37 దుకాణాల్లో సుమారు 19 దుకాలు మూతపడ్డాయి కూడా. కానీ ఈ బ్రాండ్కి ఉన్న ఆదరణతో మళ్లీ శక్తిమంతంగా పునరాగమనం చేసి..అచ్చం అదే తరహాలో లాభాలబాట పట్టింది. పైగా అశేష జనాదరణ పొందేలా ఇటీవలే తన వందవ స్టోర్ ప్రారంభోత్సవాన్ని కూడా జరుపుకోవడం విశేషం.California Burrito CEO x Jolad Rotti Meals pic.twitter.com/eFlhLCsjqX— Season Flake 🏗️ (@seasonflaketopg) July 29, 2025 (చదవండి: టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే! ఇలా తాగితే..) -
టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే ! ఇలా తాగితే..
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి సహాయపడుతుంది.మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది. -
బ్రహ్మాండనాయకుడి పవిత్రోత్సవాలు! ఎందుకు చేస్తారంటే..?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి శాస్త్రోక్తంగా అర్చించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కానిపని. అలాంటిది సామాన్య మానవులు జరిపే శాస్త్రోక్త విధానమైన భగవత్పూజా విధానం అతిదుస్సాధ్యమని చెప్పచ్చు. ఎందుకంటే స్వామివారికి జరిగే నిత్యపూజల్లో, ఉత్సవాలలోనూ ద్రవ్య మంత్రతంత్రాది లోపాలు అనేకం చోటు చేసుచేసుకోవడం పరిపాటి. ఇలా తెలిసీ తెలియక జరిగిన దోషనివృత్తికి ప్రత్యేకంగా ఉత్సవ రూపాల్లో ఉన్న ఒక ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉన్నది. దానికే పవిత్రారోపణం లేక పవిత్రోత్సవం అని పేరు. ఆగస్టు 3 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్న సందర్భంగా....పవిత్రోత్సవం అంటే పరమపవిత్రమైన ప్రాయశ్చిత్త మహోత్సవం. సంవత్సరానికొకసారి ఆలయ పవిత్ర వాతావరణం పునఃస్థాపితం కావడానికి జరిపే ఉత్సవమిది. ఆలయాల్లో సంవత్సర పర్యంత చేసే ఆరాధనలలో జరిగే దోషాలను నిత్య, నైమిత్తిక, కామ్య ఉత్సవాలైన నిత్యారాధనాహోమ (బలి) నివేదన, బలి సమర్పణలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జ్యేష్టాభిషేక, సహస్రకలశ స్నపన, ఆరాధనాదులు, దేశ ప్రజాజనహితార్థం ఆచరించే యజ్ఞ యాగాది క్రియలలో జరిగే మంత్ర, తంత్ర, క్రియారూప, శౌచ, అశౌచ దోషనివారణకై స్వామికి జరిపించే ఉత్సవం. ఈ పవిత్రోత్సవంలో పూసలుగా అమర్చబడిన మాలలను ప్రతిష్టించి శ్రీస్వామివారికి, ఆలయపరివార దేవతలకు సమర్పించటం ప్రధానఘట్టం. పవిత్ర సూత్రాలను పవిత్రమండపంలోని పీఠంలో ఉంచి వాటిని దర్భకొసలతో కూడిన పంచగవ్యాలతో ప్రోక్షణ చేసి ఆగమోక్త విధానంగా వాటిని ప్రతిష్టించి ఉక్తహోమం జరిపి ఉత్సవమూర్తులకు అష్టకలశ స్నపనం జరిపి ధ్వజ ఛత్ర చామర పింఛ నృత్య గేయ సమాయుక్తంగా ఆచార్యుడు ఆలయ ప్రదక్షిణం చేసి దేవదేవుణ్ణి విశేషంగా అర్చించి అష్టోత్తరశత పవిత్ర సూత్రాలను జాను పర్యంతం సమర్పించడం ఉత్తమం. చతుః పంచాశత్ (54) సూత్రములను ఊరువుల వరకు సమర్పిస్తే మధ్యమం. సప్తవింశతి (27) సూత్రాలను నాభ్యన్తం సమర్పిస్తే అధమం అని ఆగమోక్తం. వీటిలో యథాశక్తి సమర్పించాలి. పవిత్రములను ఈవిధంగా దేవ దేవునికి ఆరోపణ చేయటమే పవిత్రారోపణం. ఇదే విధంగా పరివారదేవతలకు కూడా ఒక్కొక్కరికీ సమర్పించాలి. ముందుగా అంకురార్పణ చేయాలి. ఇది దాదాపు అన్ని ప్రధాన ఆలయాలలోనూ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా జరిపించవలసిన ఉత్సవం.తిరుమలలో వేంచేసి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రితజన వత్సలుడు అయిన శ్రీమన్నారాయణునికి వైఖానసాగమోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవం భక్తితో చేయించినా, కళ్లారా దర్శించినా భక్తులు సర్వ పాపల నుంచి విముక్తి పొంది యశస్సు, సంపద, సంవత్సరార్చన ఫలం, విష్ణుసాయుజ్యం, అశ్వమేధయాగ ఫలం, సర్వోపద్రవనివారణయేగాక సర్వాభీష్టఫలాలు పొంది నిర్భీతులై, ధర్మ తత్పర నిష్టాగరిష్టులై సుఖిస్తారని భృగు సంహిత చెబుతోంది. పవిత్రోత్సవం అనే మాటకు పవిత్రీకరణ కార్యక్రమమని పేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వ్రేలికి దర్భతో చేయబడిన పవిత్రం ధరించి కార్యక్రమం జరపడం అలవాటు. దీనివల్ల కార్యక్రమానికి మానసికంగా యజమానికి నిర్మలతత్త్వం చేకూరుతుందనేది సంప్రదాయం.ఆలయాల్లో పవిత్రోత్సవం ఏడాదికొక పర్యాయం ఆలయపవిత్ర వాతావరణం పునఃస్థాపితమయ్యేందుకు జరుగుతుందని చెప్పుకున్నాం కదా... ఐతే ఇది బ్రహ్మోత్సవాది సందర్భాల్లో, అంతకు ముందు బలిపీఠాల వద్ద, మూలబేరం వద్ద జనసమ్మర్దం వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని పోగొట్టేందుకు జరిపే సంప్రోక్షణం కన్నా భిన్నమైంది. దానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని పేరు. పవిత్రోత్సవంలో మంత్ర, వేద, పురాణపారాయణాది కార్యక్రమాల ద్వారా భగవానుడే లేదా మూలమూర్తే విద్యుదుత్పాదక యంత్రంగా పనిచేయడం జరుగుతుంది.ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ రోజుల్లో శ్రీవేంకటేశ్వర స్వామి, ఆయన దేవేరులతో పాటు ఉత్సవ విగ్రహాలు ఆలయ కల్యాణ మండపంలోని యాగశాలలో ఉంచబడి ఉత్సవానంతరం పూర్ణాహుతి అయిన తర్వాత మరల ఆలయప్రవేశం గావించబడతాయి. ఈ దినాల్లో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. మొదటిరోజున పట్టుపోగులతో తులసిపూసలు లేదా తామరతూడు సరంలా కనిపించే పవిత్రాలను యాగశాలలో ఉంచుతారు. రెండవరోజున శాస్త్రోక్త మర్యాదలతో ఈ పవిత్రములను శ్రీవారి ఆలయానికి, బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి నడుమగల ప్రధాన ఇతర పరివారదేవతలకు సమర్పించటం జరుగుతుంది. మూడవరోజున పవిత్ర విసర్జనం జరుపబడి పూర్ణాహుతితో ఉత్సవం సమాప్తమవుతుంది.చారిత్రకంగా ఈ పవిత్రోత్సవం 15వ శతాబ్దంలో అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటానికి, ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల లేదా సిబ్బంది వల్ల తెలియకుండా జరిగే దోషాలను నివారించడానికి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ ఏకాదశినాడు ఉత్సవమూర్తిని తిరుమామణిమండపంలో వేంచేపు చేస్తారు. ద్వాదశినాడు తలకు, మెడకు, మణికట్టుకు తిరుపవిత్రంతో అలంకరించి దేవేరులతో కూడా ఊరేగింపు జరుపుతారు. శ్రావణ శుక్లద్వాదశి విష్ణు పవిత్రారోపణ దినంగా తులసి పెంచటానికి ఉపయోగించే భూమిలో పెరిగిన ప్రత్తి చెట్లనుండి తీసిన దారంతో ఈ పవిత్రం చేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద నివేదన తప్పకుండా జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలను ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజమాసాల్లో శుక్లపక్షంలోని పాడ్యమి, విదియ, పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమిల్లో భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, రేవతి, శ్రవణం మొదలైన నక్షత్రాల్లో ఆచరించాలని పంచరాత్రాగమం చేస్తోంది. ఈ పవిత్రోత్సవాల్లో ఉపయోగించే పవిత్రాలు బంగారు, వెండి, రాగి, మృణ్మయం, పత్తి, ముంజ గడ్డి, దర్భ, పట్టు మొదలైనవాటితో చేస్తారు. అలా చేసిన పవిత్రాలను ఆచార్యుడు స్వీకరించి, పంచగవ్యాదులతో ప్రోక్షించి, ఆ ఆలయాగమాన్ననుసరించి పవిత్రాలకు యజ్ఞ ఆరాధనాదులను పూర్తి చేస్తారు. వీటిని స్వామికి సమర్పించడంవల్ల సర్వులకూ ఆయుః క్షేమాభివృద్ధి కలుగుతుంది. శ్రీమన్నారాయణారాధనను అత్యంత భక్తిశ్రద్ధలతో సంవత్సర కాలం చేస్తే కలిగే ఫలితమంతా పవిత్రారోపణమాచరిస్తే కలుగుతుందని ప్రతీతి. చదవండి: శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?ఈ పవిత్రోత్సవం (Pavithrotsavam) మహా ప్రాయశ్చిత్తం కాబట్టి ప్రతీ సంవత్సరం చేయాలి. ఈ ఉత్సవం అలా ఆచరించకున్నా పరమాత్మకు ఆ సంవత్సరకాలం చేసిన ఆరాధనమంతా నిష్పలమవుతుంది. అందువల్ల ఈ ఉత్సవాన్ని ప్రతిసంవత్సరం ఆచరించాలని ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాల్ని యాగశాలలో ఉంచడం, ఆ తర్వాత రోజు పవిత్రాలు యాగశాలలో ఉంచడం, తర్వాత పవిత్రసమర్పణం, పూర్ణాహుతి జరిపి ఉత్సవాలకు స్వస్తి వాచకం పలుకుతారు. ఎప్పుడు ప్రారంభం...ఈ పవిత్రోత్సవాలు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజులలో మూడు రోజుల పాటు జరుగుతాయి. ఉత్సవాలకు ముందు రోజు ‘అంకురార్పణం’తో ప్రారంభమవుతాయి, ఇందులో నవధాన్యాలను మట్టి పాత్రలలో విత్తుతారు.ముఖ్య ఉద్దేశ్యం...ఏడాది పొడవునా జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
మళ్లీ భయపెడుతున్న ఒంటికన్ను శివరాసన్..!
నిజంగా కాదు లేండి. ఓటీటీ తెర మీద. రాజీవ్గాంధీ దారుణ హత్య తర్వాత దేశంలో మార్మోగిపోయిన పేరు ఒంటికన్ను శివరాసన్. పిల్లల్ని భయపెట్టాలంటే శివరాసన్ పేరు చెప్పేవారు తల్లులు. రాజీవ్ గాంధీని మానవ బాంబుతో హత్య చేసే ప్లాను రచించిన ఈ వ్యక్తి 35 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటింటా భయపెడుతున్నాడు. నగేష్ కుకునూర్ తీసిన ‘ది హంట్’ వెబ్ సిరీస్లో రాజీవ్ హంతకునిగా గతాన్ని గుర్తు చేస్తున్నాడు.తెల్లలాల్చీ, పైజామాలో ఉన్న శివరాసన్, పక్కనే చందన దండ పట్టుకు నిల్చున్న మానవ బాంబు థాను... వీరి ఫొటోను 1990ల కాలం నాటి భారతీయ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మే 21, 1991 రాత్రి తమిళనాడు శ్రీపెరంబుదూర్లో రాజీవ్గాంధీ హత్య జరిగాక మానవబాంబు అనే మాట, ఎల్టీటీఈ అనే పేరు జనసామాన్యానికి తెలిసింది. ఈ ప్లాన్ వేసిన వాడు శివరాసన్ అనే ఒంటికన్ను వ్యక్తి అని, అతను ఇంకా దేశంలోనే ఉన్నాడనే ప్రచారంతో భయపడని వారు లేరు. ఏ ఊరిలో ఏ టీ బంకు దగ్గరైనా శివరాసన్ కబుర్లే. ఆడవారు అతని పేరు తలుచుకుని ఒణికేవారు. అలాంటి శివరాసన్ ఆ ప్లానంతా ఎలా వేశాడో, ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఎలా తప్పించుకున్నాడో, ఆ తర్వాత ఎలా పోలీసుల చేతికి చిక్కబోయి మరణించాడో సవివరంగా, ఉత్కంఠగా చూపిస్తూ ‘సోనీ లైవ్’లో ‘ది హంట్– రాజీవ్గాంధీ అసాసినేషన్ కేస్’ వెబ్ సిరీస్లో చూస్తాం. తెలుగువాడైన ప్రసిద్ధ దర్శకుడు నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆనాటి రోజులతోపాటు, శివరాసన్ను కూడా తిరిగి ఇంటింటిలో చూపి భయపెడుతోంది.జాఫ్నాకు చెందిన శివరాసన్ ఎల్టీటీఈలో చేరి, దాని చీఫ్ ప్రభాకరన్కు నమ్మకస్తుడుగా మారి రాజీవ్గాంధీ హత్యను అమలుపరిచే టీమ్కు నాయకుడిగా చెన్నై చేరుకున్నాడు. అతనితో పాటు నళని, థాను, మురుగన్ తదితరులు మరో ఎనిమిది మంది వచ్చారు. వీరంతా కలిసి ప్లాన్ చేసి మానవబాంబుగా థానును తయారు చేసి రాజీవ్గాంధీ హత్యకు పాల్పడ్డారు. హత్య జరిగాక దేశం మొత్తం ఒక అంధకారంలో ఉండిపోయింది... హంతకులు ఎవరై ఉంటారనే విషయం తెలియక. ఆ సమయంలో సిట్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఆఫీసర్ కార్తికేయన్ తన టీమ్తో సాగించిన నేర పరిశోధనే ‘ది హంట్’ వెబ్ సిరీస్. దాదాపుగా అంతగా తెలియని నటులతో ఈ సిరీస్ రూపుదిద్దుకున్నా వీరందరిలో శివరాసన్గా చేసిన వ్యక్తి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అచ్చు శివరాసన్లా కనిపిస్తూ నాటి రూపానికి అతడు జీవంపోశాడు. ఆ నటుడి పేరు షఫీక్ ముస్తఫా. మలయాళం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే గుర్తింపుపొందిన పాత్రలు వేస్తున్న షఫీక్ శివరాసన్ పాత్ర అవకాశం రావడంతోటే వెంటనే అంగీకరించాడు. ‘ఇలాంటి పాత్రను పోషించడానికి చాలా పరిశోధన చేశాను. శివరాసన్ చాలా తెలివైన వ్యక్తి. అలాంటివారు ఎక్కువగా మాట్లాడరు. నేను సిరీస్లో ఆ నియమాన్ని పాటించాను’ అంటాడు షఫీక్. నాటక రంగం నుంచి వచ్చిన షఫీక్ ఇప్పుడు ఆ పాత్రకు వచ్చిన గుర్తింపుతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘శివరాసన్లా గాజుకన్ను పెట్టుకుని నటించడం కష్టమైంది’ అని చెప్పాడు. ఎప్పుడూ పెన్ను, పేపర్ పట్టుకుని కనిపించే శివరాసన్ ఈ వెబ్ సిరీస్లో మరణించే ముందు కవిత రాసి మరణిస్తాడు. ఈ సన్నివేశాల్లో షఫీక్ నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ‘కత్తి పట్టినవాడు కత్తితోనేపోతాడు’ అన్నాడు జీసస్. అహింసతో ఎంత గొప్ప విజయం సాధించవచ్చో నిరూపించారు గాంధీజీ. అసహనం, ఆగ్రహం... కారణాలు ఏవైనా హింసాత్మక వైఖరి పనికి రాదని, ఆయుధం వినాశనానికే కారణమవుతుందని నేటి యువత తెలుసుకోవడానికి ఇలాంటి పాత్రలు, వెంటాడే గతాలు తప్పక ఉపయోగపడతాయి.(చదవండి: 'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..) -
'నేరమే'.. అయినా! సుప్రీంకోర్టు సైతం..
న్యాయ విచారణలో తీర్పులెప్పుడూ బలహీనుల పక్షమే ఉండాలి... నేరానికి బలైనా, నేరం చేసినా! ఆ బలహీనుల వర్గంలో పిల్లలు, మహిళలు ముందుంటారు! అందుకే... హనీమూన్ మర్డర్ మొదలు ఆడవాళ్లు చేసినట్టుగా నమోదవుతున్న ఆ తరహా నేరాల విషయంలో వాటి వెనుకున్న సామాజిక ఒత్తిళ్ల మీద చర్చ జరగాలి.. ఆ వాతావరణాన్నివిశ్లేషించాలని సోషల్ ఇంజినీర్స్, సైకాలజిస్ట్లు అంటున్నారు. వాటిని సుప్రీంకోర్ట్ కూడా పరిగణనలోకి తీసుకుంది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు దాన్నుంచితప్పించుకోవడానికి చేసిన నేరాలను ప్రస్తావిస్తూ ఇటీవలే ఓ అభిప్రాయాన్ని వెల్లడించింది.సమాజంలోని లింగవివక్ష, సామాజిక నిబంధనలు చాలావరకు స్త్రీని పరాయిగా చూస్తూ.. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దూరం చేస్తూ ఆమెను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఈ అణచివేత, నిస్సహాయతే నేరాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంతో నేరం చేసిన స్త్రీల విషయంలో కఠినమైన శిక్షలకన్నా సంస్కరణ దృక్పథాన్ని అనుసరించాలని ఉద్ఘాటించింది సుప్రీం కోర్ట్.ఈ నిర్ణయానికి ప్రధాన నేపథ్యం.. కర్ణాటకకు చెందిన శుభ అనే కాలేజ్ స్టూడెంట్.. తన స్నేహితుడు అరుణ్ వర్మతోపాటు వెంకటేశ్, దినేశ్ అనే ఇంకో ఇద్దరు వ్యక్తులతో కలిసి తన కాబోయే భర్తను హత్య చేసింది. నిజానికి శుభకు ఆ పెళ్లి ఇష్టంలేదు. అయినా తల్లిదండ్రులు బలవంతపెట్టడంతో ఆ విషయాన్నే తన స్నేహితుడు అరుణ్కి చెప్పి, పెద్దలు నిశ్చయించిన ఆ వరుడి హత్యకు కుట్ర పన్నింది. ఈ కేస్ పూర్వపరాలను పరిశీలించిన సుప్రీంకోర్ట్.. ‘లింగవివక్ష, ఏళ్ల నుంచి పాతుకుపోయిన జెండర్ రోల్స్ వంటివన్నీ మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకెళ్లుగా మారుతూ వారిని అణచివేస్తున్నాయి. అది వాళ్లలో ధిక్కార ప్రవర్తనకు కారణమవుతోంది. ఫలితంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఆధునిక మహిళలు చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ హక్కును ఆస్వాదించాలనుకుంటున్నారు. ఉదాహరణకు.. చదువుకున్న అమ్మాయి ‘ఆశలు’ అనే రెక్కలు తొడుక్కోవాలనుకుంటుంది. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది. ఈ క్రమంలో బలవంతపు పెళ్లి తన జీవిత లక్ష్యానికి విడాకులు ఇప్పిస్తుంది. పై చదువులకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది కచ్చితంగా ప్రతి చర్యకు దారితీస్తుంది. అయితే ఈ రియాక్షన్స్ మహిళ మహిళకు మారుతుంటాయి.. వాళ్ల నేపథ్యం, స్నేహాలను బట్టి. ఉదాహరణకు మధ్యతరగతికి చెందిన అమ్మాయి.. పేదింటి లేదా ధనిక కుటుంబపు అమ్మాయిల కంటే భిన్నంగా రియాక్ట్ కావచ్చు. తీసుకునే నిర్ణయాన్ని అది ప్రభావితం చేయొచ్చు’ అని విశ్లేషించింది. నేరస్తులు అందరిపట్లా...స్త్రీలకు సంబంధించి.. నేరానికి ఉసిగొల్పిన సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నేరస్థుల సంస్కరణ దిశగా తీర్పులు ఉండాలన్న సుప్రీంకోర్ట్ అభిప్రాయం హర్షించదగ్గది. అయితే దాదాపుగా నేరాలన్నిటికీ సామాజిక పరిస్థితులే కారణాలుగా ఉంటాయి. నేరస్థుల అందరిపట్లా ఇలాంటి అప్రోచే ఉండాలి. శిక్ష తర్వాత సమాజంలోకి వచ్చిన వాళ్లను సానుకూల దృక్పథంతో చూడాలి. సహానుభూతి ఉండాలి. – ప్రొఫెసర్ బీనా చింతలపురిసంస్కరించడమే పరిష్కారంమన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడుకారణాలను పరిగణించాలి... సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు మహిళలు/అమ్మాయిల స్వేచ్ఛను అడ్డుకోవడమేకాక వాళ్లను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇవి కొన్నిసార్లు నేరాలకు దారితీయొచ్చు. కాబట్టి వారిలో పరివర్తన తీసుకురావడం ఎంత అవసరమో.. ఆ సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని వారికి క్షమాభిక్ష పెట్టడమూ అంతే అవసరమంటూ సుప్రీంకోర్టు చేసిన సిఫార్సు ఆహ్వానించదగినది. అలాగని సుప్రీంకోర్టు నేరాన్ని సమర్థించట్లేదు. నేరస్థులను చంపితే నేరం చావదని, నేరస్థుల పరివర్తన మీద దృష్టిపెట్టి.. నేర స్వభావానికి కారణమైన సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరానికీ, నిస్సహాయ స్థితిలో ఒక అమ్మాయి చేసిన నేరానికి చాలా తేడా ఉంటుంది. రెండింటిలో శిక్ష ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ, వారిలో తేవాల్సిన పరివర్తన ధోరణి, అలాగే క్షమాభిక్ష పెట్టేప్పుడు పరిగణించాల్సిన అంశాలు వేరేగా ఉండాలి.– మామిడి సుధేష్ణ, హైకోర్ట్ అడ్వకేట్సంస్కరించడమే పరిష్కారంమన దేశంలో చాలామంది మహిళలు పిల్లల కోసమో, విడాకులకు సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక΄ోవడం వల్లో, అవమానాలు, అపవాదులకు జడిసో, ఆర్థిక స్వాతంత్య్రం లేకనో వైవాహిక జీవితంలోని హింసను మౌనంగా భరిస్తూన్నారు. భరించలేని కొందరు మాత్రం విపరీత చర్యలకు ఒడిగడుతున్నారు. ఇది కలవరపరచే అంశమే! వారి ఆ చర్యలకు సామాజిక నిర్లక్ష్యం, అన్యాయం, వాళ్లను అర్థం చేసుకోకపోవడమే కారణాలుగా తోస్తున్నాయి. వెఫల్యం చెందిన వ్యవస్థలను సంస్కరించడమే దీనికి పరిష్కారం. కుటుంబం ముఖ్యంగా మగవాళ్లు అమ్మాయిల పట్ల సహానుభూతితో వ్యవహరించాలి. కెరీర్, పెళ్లి, పిల్లలు లాంటి విషయాల్లో వాళ్ల నిర్ణయాలను గౌరవించి ఆమోదించాలి. మద్దతుగా నిలవాలి.– రాజ్ రాచకొండ, సినీ దర్శకుడు (చదవండి: కండలు తిరిగిన వైద్యురాలు..! ఏకంగా 600కి పైగా..) -
మా అమ్మాయిని చాటింగ్ నుంచి బయట పడేయగలరా
మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ మధ్య ఎంతసేపు ఫోన్లోనే ఉంటోంది. చికాకుగా ఉండటం, అందరితో సరిగ్గా మాట్లాడక΄ోవడంతోపాటు తిండి కూడా బాగా తగ్గించేసింది. చదువు మీద బొత్తిగా ధ్యాస లేదు. ఈ మధ్య నేను అనుకోకుండా తన ఫోన్ చూస్తే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వేరే దేశంలోని వ్యక్తితో చాటింగ్, ఫోన్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు గమనించాను. ఇంకా తన పర్సనల్ ఫొటోలు కూడా ఆ వ్యక్తికి పంపినట్లు చూసి నేను చాలా అప్సెట్ అయ్యాను. తన నుంచి ఫోన్ తీసుకుంటే చనిపోతానని చెదిరిస్తుంది. చాకుతో చేతిమీద కోసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎవ్వరితోను చెప్పుకోలేని పరిస్థితి నాది! మా వారితో కూడా చెప్పే ధైర్యం లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఈ ఉత్తరం రాస్తున్నాను! దయచేసి సలహా చెప్పగలరు. – ఒక సోదరి, హైదరాబాద్ఇది మీరొక్కరే కాదు, ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ మధ్య కాలంలో టీనేజీ పిల్లలో ఫో, ఇంటర్నెట్ వాడటం చాలా ఎక్కువ అయింది. సోషల్ మీడియా ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మాయి విషయానికి వస్తే ఫోన్ వాడకంతో పాటు, క్షణికావేశం, తప్పుడు నిర్ణయాలు, తొందరపాటుతనం, అంతర్గత భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం కనిపిస్తోంది. కౌన్సెలింగ్ ‘బిహేవియరల్ థెరపీ’ బాగా ఉపయోగ పడుతుంది. అయితే మీరు మీ భర్తతో కూడా దీని గురించి చర్చించడం మంచిది. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్’ ద్వారా మీరు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఆమెతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకోండి. తెలియని వ్యక్తులతో చాటింగ్ వలన వచ్చే నష్టాలను వివరించండి. అదే విధంగా ఫోన్ సమయాన్ని ఎలా నిర్దేశించాలో చెప్పండి. తల్లిదండ్రులుగా మీరిద్దరూ కలిసి తనతో ప్రశాంతంగా మాట్లాడటం, వినడం మొదలు పెడితే, ఆమె కోర్కెలు, బాధలు బయటపడతాయి. మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండి మానసిక వైద్య నిపుణల సహాయంతో ఈ సమస్య నుంచి మీ అమ్మాయిని తప్పకుండా పూర్తిగా బయటికి తీసుకు రావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
Pratiksha Tondwalkar: స్వీపర్ టు ఏజీఎం!
నేను స్వీపర్గా పనిచేయడం ఏమిటి?’ అని ఆమె అహానికి పోలేదు. ‘ఇంత చిన్నజీతానికి పనిచేయడం ఏమిటి?’ అని తాను చేస్తున్న పనిని చిన్నచూపు చూడలేదు.చిన్నదో, పెద్దదో ‘పని’ చేయాలి అని గట్టిగా అనుకుంది ముంబైకి చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్. పనే ఆమెకు ‘పవర్’ అయింది. ఎస్బీఐలో స్వీపర్ స్థాయి నుంచి ఏజీఎం స్థాయికి చేరింది...పేదకుటుంబంలో పుట్టిన ప్రతీక్షకు పదిహేడు సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. ఇరవైలలో ఉన్నప్పుడు భర్త రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడం ఆమెకు చాలా కష్టమైపోయింది. అప్పటికే తనకు రెండు సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ‘ఇలా ఏడుస్తూ కూర్చుంటే పిల్లవాడి గురించి ఎవరు ఆలోచిస్తారు?’ అనుకొని ఆ దుఃఖం నుంచి బయటపడి ధైర్యం తెచ్చుకుంది.‘ఇంట్లో ఖాళీగా కూర్చుంటే కడుపు నిండదు. ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి’ అనుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ముంబై బ్రాంచ్కు వెళ్లి ‘ఏదో ఒక పని ఇప్పించండి’ అని అడిగింది. ఆమె భర్త ఈ బ్రాంచ్లో బుక్బైండర్గా పనిచేసేవాడు. ఆ మంచితనం, సానుభూతితో బ్యాంక్ వాళ్లు ఆమెకు తమ బ్రాంచీలో స్వీపర్గా పనిచేసే అవకాశం ఇచ్చారు. నెలకు అరవై అయిదు రూపాయల జీతం వచ్చేది.ఆ జీతంతోనే సర్దుకుపోయి ఉంటే ప్రతీక్ష తన భవిష్యత్ గురించి ఆలోచించేది కాదు. ఆ సమయంలోనే తాను మరచిపోయిన చదువు గురించి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనతో పాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. ‘ఈ వయసులో చదువు ఏమిటి!’ ‘ఇంట్లో బిడ్డను పెట్టుకొని కాలేజీకి వెళతావా!’... ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందేమో అని మొదట భయపడింది. ఆ తరువాత తనకు తానే ధైర్యం తెచ్చుకుంది.‘నేనేమీ తప్పు చేయడం లేదు. చదువుకోబోతున్నాను. అంతే’ అని గట్టిగా నిశ్చయించుకుంది. ఒకవైపు స్వీపర్ పనిచేస్తూనే మరోవైపు నైట్ కాలేజీలో చదువుకునేది. ఇంటర్మీడియెట్ తరువాత మరో నైట్కాలేజీలో డిగ్రీ చేసింది. స్వీపర్ నుంచి బ్యాంక్ క్లర్క్గా ప్రమోట్ అయింది. కొంతకాలానికి తిరిగి వివాహం చేసుకుంది ప్రతీక్ష. భర్త ప్రమోద్ ‘నిన్ను ఇంకా పెద్దస్థాయిలో చూడాలనుకుంటున్నాను’ అనేవాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలని ప్రోత్సహించేవాడు. అలా బ్యాంకు పరీక్షలు రాసి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏజీఎం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) స్థాయికి చేరింది ప్రతీక్ష. ‘కష్టాల్లో ఉన్నప్పుడు చదువు తప్ప నాకు మరో దారి కనిపించలేదు. చదువును నమ్ముకునేవారికి, కష్టపడేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది’ తన అనుభవ జ్ఞానంతో అంటుంది ప్రతీక్ష తోండ్వాల్కర్. ప్రతీక్ష తన విజయం దగ్గరే ఆగిపోలేదు. తన విజయంతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తోంది. ఆ రెండు అడుగులుఆ కష్టకాలాన్ని గుర్తు తెచ్చుకుంటే నాకు ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది. అయితే గతంలోనే ఉండిపోతే భవిష్యత్ను చూడలేము. నాకు మొదటి నుంచి చదువు అంటే ఇష్టం. ఆ చదువే నాకు ధైర్యాన్ని ఇచ్చి దారి చూపింది. పరిస్థితులే మనకు ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పడానికి నేనే ఉదాహరణ. తెలియని వ్యక్తుల ముందుకు వెళ్లి ‘నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి’ అని అడగడం నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు అనుకుంటాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను చదవాల్సిందే అనుకోవడం నేను ధైర్యంగా వేసిన రెండో అడుగు. ఆ రెండు అడుగులు నా జీవితాన్ని మార్చేశాయి– ప్రతీక్ష తోండ్వాల్కర్ -
వర్షకాలంలో ఫుడ్ విషయంలో జర జాగ్రత్త..!
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సమోసా, జిలేబీ వంటి స్ట్రీట్ ఫుడ్స్ హాట్ టాపిక్గా మారాయి. వీటిపై కూడా ప్రమాద హెచ్చరికలు జారీచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తర్వాత అలాంటిదేమీ లేదని, కేవలం స్ట్రీట్ ఫుడ్ విషయంలో అపరిశుభ్రత విధానాలపై హెచ్చరించడమే తమ ఆలోచనని ప్రభుత్వం స్పష్టం చేసి ఆ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల సీజన్ కావడంతో వేడి వేడి స్ట్రీట్ ఫుడ్కు ఆకర్షితులవ్వడం సహజమే. ఈ క్రమంలో ఇలాంటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగరానికి చెందిన ప్రముఖ కన్సల్టెంట్, ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ సనమంద్ర సూచిస్తున్నారు.. జిలేబీలు, సమోసాలు, బజ్జీలు, పునుగులు వగైరా స్ట్రీట్ ఫుడ్ నోటికి రుచిగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. మరీ ముఖ్యంగా చిరుతిళ్లలో మైదా శాతం అధికంగా ఉంటుందని, పైగా ఇవన్నీ పలుమార్లు వాడిన నూనెతో చేసిన వంటకాలు కావడంతో మరింత ప్రమాదకరం. తరచూ ఈ తరహా ఆహారం తినడం వల్ల జీవక్రియతో పాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అనారోగ్య కారకం.. ఈ తరహా చిరుతిండి ఎక్కువగా తినేవాళ్లలో ఒవెసిటీ, తర్వాత రక్తపోటు, ఫ్యాటీ లివర్, చెడు కొలె్రస్టాల్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. క్రమంగా ఈ అలవాట్లతో పాటు పెద్ద పెద్ద వ్యాధులుగా రూపాంతరం చెంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తప్పదు. ప్యాంక్రియాస్పై ప్రభావం.. మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. వీటిలో చర్మం కింద ఉండే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంత ప్రమాదకరం కాదు. కానీ లివర్, ప్యాంక్రియాస్, కిడ్నీలు వంటి అంతర్గత అవయవాల చుట్టూ ఉండే విసెరల్ ఫ్యాట్ పెంచుతాయి. దీంతో ఆరోగ్యానికి ప్రమాదం అధికం. ఇది శరీరంలోని వాపును పెంచి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తుంది. తద్వారా ప్యాంక్రియాస్ అధిక శాతంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది క్రమంగా డయాబెటిస్, ఇతర మెటబాలిక్ వ్యాధులకు దారితీస్తుంది.చిన్నపిల్లల్లో సమస్యలు.. చిన్నారులు స్కూలు వయసులో తీపి, ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. అలాగే 5–10 ఏళ్ల పిల్లల్లో కనిపించే సమస్యలు – మెడ దగ్గర నలుపు మచ్చలు (అకాంథోసిస్ నైగ్రికన్స్), అమ్మాయిల్లో హార్మోన్ డిజార్డర్, అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ తగ్గడం (హైపోగోనాడిజం), ప్రీడయాబెటిస్, హైబీపీ, ఫ్యాటి లివర్ వంటి సమస్యలు తప్పవు. రోడ్డు మీది ఫుడ్తో పాటు చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, జంక్ ఫుడ్ ఏదీ మంచిది కాదు. దీనికి బదులుగా ఇంటి దగ్గర వండినవి మాత్రమే పిల్లలకు ఇవ్వడం ఉత్తమం. -
బడి పాఠాలే కాదు ‘బతుకు బడి’ పాఠాలు కూడా..
పేరెంటింగ్కు సంబంధించి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ‘జోహో’ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ‘ఎక్స్’లో చేసిన అర్థవంతమైన, అద్భుతమైన పోస్ట్ నెట్లోకంలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించడానికి అవసరమైన పలు నైపుణ్యాలను గురించి ఈ పోస్ట్లో ప్రస్తావించారు వెంబు. పిల్లలు మానవత్వం మూర్తీభవించిన వ్యక్తులుగా ఎదగడానికి సృజనాత్మకత, సాంస్కృతిక అంశాలు ఎలా సహాయపడతాయో వివరించారు.‘గణితం, శాస్త్రీయ సంగీతం, వంటలు, ఆటలు... ఇష్టమైన ఏ విద్య అయినా కావచ్చు, పతకాల కోసం నేర్చుకోవద్దు. పోటీలకు సంబంధించిన ఒత్తిడికి దూరంగా ఉండాలి. గణితంపై నా ఆసక్తి సాఫ్ట్వేర్డెవలప్మెంట్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.పిల్లల భవిష్యత్ను నిజంగా మార్చేది ఏమిటనే విషయంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు దృష్టి పెట్టాలి’ అని రాశారు శ్రీధర్.‘బడి పాఠాలే కాదు బతుకు బడి పాఠాలు కూడా నేర్చుకోవాలి’ అనేది శ్రీధర్ పోస్ట్ సారాంశం. ‘కుకింగ్కు పెద్దగా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరుగానీ నిజానికి అది అత్యంత నైపుణ్యం ఉన్న పని, లైఫ్ స్కిల్. కుకింగ్ రావడం అనేది జీరో డిపెండెన్సీని సూచిస్తుంది. అందుకే వంటచేయడాన్ని పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది ఒక కళగా గుర్తించుకోవాలి’ అని స్పందించారు ఒక యూజర్. Pure mathematics, carnatic music, bharatanatyam, classical art, sculpture, chess or go, mridangam, classical poetry, fine cooking - what is common to all of them? (apart from the fact that I am not good in any of them 😁, at least I get to appreciate some of them)We need…— Sridhar Vembu (@svembu) July 22, 2025 (చదవండి: మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?) -
మనింట్లో ఇలాంటి అభిమానులున్నారా?
సినీ అభిమానం వెర్రితలలు వేసి భవిష్యత్తు నాశనం చేసుకునే విధంగాటీనేజ్ పిల్లలు తయారవుతున్నారా? కర్నాటకలో ఇలాగే జరుగుతోంది.అక్కడ హీరో దర్శన్ అభిమానులు తనపై అత్యాచారం చేస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని నటి రమ్య కేసు పెట్టారు. గతంలో దర్శన్ అభిమాని రేణుకా స్వామి ఇలాంటి మెసేజ్లే పెట్టి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో దర్శన్ నిందితుడు. ఈ నేపథ్యంలో అతడికి బెయిలు మంజూరు అవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రమ్య సుప్రీంకోర్టును మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది.దాంతో ఆమెను చంపుతామని అభిమానులు బయలుదేరారు. చదువు, ఉద్యోగాల్లో ఉండాల్సిన యువత ఇలాంటి పనుల్లో ఉంటే సరిదిద్దుతున్నామా?ఇంట్లో ఉన్న పిల్లలు బయట ఏ అస్తిత్వంతో ఉన్నారో తల్లిదండ్రులు చెక్ చేసుకుంటున్నారా? వారు ఫలానా తల్లిదండ్రుల పిల్లలు అనో, కాలేజీ పిల్లలు అనో, ఏరియా పిల్లలు అనో గుర్తింపు పొందుతున్నారా? లేదా ఫలానా హీరో ఫ్యాన్స్ అనో, రాజకీయ పార్టీ అభిమానులనో, వాట్సాప్ గ్రూప్కు సంబంధించిన యాక్టివ్ మెంబర్లనో అందరికీ తెలుస్తున్నారా?హైస్కూల్, కాలేజీ వయసు దాటాక ఇటీవల ఉద్యోగాల్లో చేరాక కూడా మెచ్యూరిటీ లేని విధంగా కేవలం ‘ఫ్యాన్స్’గా ఉంటూ సొంత/దొంగ ఐడీలతో దాడి చేసే కుసంస్కారంతో ఉంటే గనక వీరి భవిష్యత్తు ఏమవుతుందో... అనే బాధ తల్లిదండ్రులకు ఉండటం చాలా సహజం. పత్రికల్లో కనిపిస్తున్న రోజువారీ ఘటనలు ‘వెర్రి అభిమానం’ వల్ల ప్రమాదం తెచ్చుకుంటున్న యువతను చూపెడుతున్నాయి. ఇంకానా ఇకపైనైనా మారండి అని హెచ్చరిస్తున్నాయి.దర్శన్ అభిమానులు ఏం చేశారు?గత రెండు రోజులుగా కన్నడ హీరో దర్శన్ అభిమానులు అక్కడి నటి, మాజీ ఎం.పి. అయిన రమ్యను సోషల్ మీడియాలో తీవ్ర పదజాలంతో హింసిస్తున్నారు. ఆమెను చంపుతామని, రేప్ చేస్తామని ఇంకా రాయడానికి వీలుకాని భాషలో ఆమెకు క్షోభ కలిగిస్తున్నారు. దానికి కారణం ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్. దర్శన్కు గతంలో కర్నాటక హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దానిని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేస్తూనే కర్నాటక హైకోర్టు బెయిల్ ఎలా మంజూరు చేసిందనే విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా అసమంజసం అని చెప్పింది. ఈ విషయాన్నే ఉటంకిస్తూ రమ్య సోషల్ మీడియాలో ‘సుప్రీంకోర్టు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది’ అని రాసింది. అంటే దర్శన్ బెయిల్ మీద బయట తిరగడం సరి కాదు అని ఆమె ఉద్దేశం. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.దర్శన్ కేసుదర్శన్ 2024 జూన్లో అరెస్ట్ అయ్యాడు. దీనికి కారణం చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకా స్వామి హత్యలో అతని ప్రమేయం ఉందనే అభియోగం. రేణుకా స్వామి కూడా ‘వెర్రి అభిమాని’గా ఉండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. జరిగింది ఏమంటే దర్శన్కు, అతని భార్య విజయలక్ష్మికి కొంత కాలంగా సయోధ్య లేదు. అందుకు కారణం దర్శన్ గర్ల్ఫ్రెండ్ పవిత్ర గౌడ అని కొందరు అభిమానులు భావించారు. దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి దర్శన్ జీవితంలో కలత రేపిన పవిత్ర గౌడను సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయసాగాడు. అతని కామెంట్లు భరించలేని పవిత్ర ఈ సంగతిని దర్శన్ దృష్టికి తీసుకు రాగా అతను తన అభిమానులతో కలిసి రేణుకా స్వామిని హత్య చేయించాడని అభియోగం. ఈ కేసు విచారణలో ఉండగానే డిసెంబర్, 2024లో కర్నాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ ఇచ్చింది. దానిని తాజాగా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలా తప్పు పట్టడం సరైన విషయంగా రమ్య భావిస్తూ కామెంట్ చేసింది.కేసుల్లో అభిమానులురమ్యను అశ్లీల మాటలు అంటూ నానా హంగామా చేసిన దర్శన్ అభిమానులపై రమ్య పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. 47 ఇన్స్టా హ్యాండిల్స్ను పోలీసుల దృష్టికి తెచ్చింది. ఇప్పుడా ఇన్స్టా హ్యాండిల్స్ ఏ అభిమానులైతే నడుపుతున్నారో వారంతా ప్రమాదంలో పడినట్టు. నేరం రుజువైతే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అభిమానం సినిమా చూసేంత వరకూ ఉండాలి కాని ఇలా నటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి వారికి వత్తాసు పలుకుతూ తీవ్ర చర్యలు చేపట్టేంతగా మాత్రం ఉండకూడదు. ఈ బూతులు తిట్టిన అభిమాని ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఈ సంగతే తెలియకవచ్చు. రేపు అరెస్ట్ అయితే వారి పరిస్థితి ఏమిటి? రమ్యకు మద్దతుగా కన్నడ ఇండస్ట్రీ నిలబడింది. అంతే కాదు కర్నాటక మహిళా కమిషన్ సూమోటోగా కేసును తీసుకుని నిందితులను పట్టుకోమని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఒక నటుడి వ్యక్తిగత జీవితంలో అనవసరంగా తల దూర్చడం వల్ల ఇప్పటికే ఒక అభిమాని హత్యకు గురయ్యాడు. ఇప్పుడీ కేసు వల్ల ఎందరు అభిమానులు నష్టపోతారో?! తల్లిదండ్రులూ బహుపరాక్. తెలుగు నాట కూడా ఇలాగే అభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి. ఫోన్ చేతిలో ఉంది కదా అని హద్దు మీరిన వ్యాఖ్యలు చేస్తే అవి నేరాభియోగానికి ఆధారాలవుతాయి. శిక్షకు సాక్ష్యాలవుతాయి. పిల్లల్ని హెచ్చరించండి. వారు ఏ వయసు వారైనా సరే. (చదవండి: ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ! ఏకంగా 20 ఏళ్లకు పైగా పక్షవాతం..) -
పాస్పోర్ట్ సమస్య జటిలమే కానీ..పరిష్కారం ఉంది
మా కూతురు అమెరికాలో వుంటుంది. అక్కడ గ్రీన్ కార్దు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటోంది. సమస్య ఏమిటంటే, తన బర్త్ సర్టిఫికెట్లో పుట్టిన తేదీ 22–10–1999 అని ఉంది. కానీ పాస్పోర్టు – విద్య సర్టిఫికెట్లు అన్నిట్లో 22–10–1998 అని ఉంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే బర్త్ సర్టిఫికెట్లో ఉన్న పుట్టిన తేదీ – పాస్పోర్ట్లో ఉన్న తేదీ ఒకటే అయి ఉండాలి, లేకపోతే కుదరదు అంటున్నారు. మా అమ్మాయి ఇవి మార్పించమని అడుగుతోంది. పాస్పోర్టులో పుట్టిన తేదీ మార్చుకోవటం కుదురుతుందా? – పూర్ణిమ, చిత్తూరుమీరు అడిగిన ప్రశ్న చిన్నదిగా అనిపించినప్పటికీ పరిష్కారం అంత సులభమైనదేమీ కాదు. ఐతే కొంచెం కష్టం అయినప్పటికీ పరిష్కారం ఉంది. పాస్పోర్టులో పుట్టిన తేదీ మార్చుకోవడం సాధారణ పరిస్థితులలో వీలుపడదు. పుట్టిన తేదీని మార్చడానికి గల కారణాలు చాలా బలమైనవిగా, నిర్దిష్టంగా ఉండాలి. అలా మార్చుకోవడానికి గల కారణాలను వివరిస్తూ తగిన రుసుము చెల్లించి పాస్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మేజర్ అయిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుని ఉన్నట్లయితే, పాస్పోర్ట్ పొందిన ఐదు సంవత్సరాల లోపు ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మైనర్ గా ఉన్నప్పుడు తీసుకున్న పాస్పోర్ట్ అయితే, తిరిగి రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా మార్చుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలోని గడువు దాటి΄ోతే, ఇక పాస్పోర్ట్లోని పుట్టిన తేదీ మార్చడం కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కుదరదు. కానీ కేవలం పాస్పోర్ట్ మార్చుకున్నంత మాత్రాన మీ అమ్మాయి సమస్య తీరదు. ఎందుకంటే, పాస్పోర్ట్ లోని వివరాలను అమెరికా వెళ్లేటప్పుడు వీసా కోసం, పై చదువుల కోసం, లేదా ఉద్యోగం కోసం కూడా ఇచ్చి ఉంటారు కాబట్టి, ఆ రికార్డులు అన్నీ కూడా మార్చవలసి వస్తుంది. అలా కాకుండా కేవలం పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ మాత్రమే చూస్తార్లే అని తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త!మీ అమ్మాయి రికార్డులలో వ్యత్యాసం ఉంటే ప్రస్తుతం ఉన్న వీసా సమస్య ఇంకా జటిలం అవ్వచ్చు. గ్రీన్ కార్డు కోసం చేసుకునే ఐ–495 దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారుల ద్వారా వారి పూర్వవీసాలు, డాక్యుమెంట్లు, ధ్రువీకరణలు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిట్లో ఒకే సమాచారం లేకపోతే లేదా ముందస్తు సంజాయిషీ ఇచ్చి ఉండకపోతే కొత్త సమస్య మొదలై, ఉన్న వీసా కూడా పోవచ్చు. అంతేగాక, అన్ని సర్టిఫికెట్లలో 1998 ఉంది అని చెప్పారు కాబట్టి, అవన్నీ కూడా మార్చాల్సి వస్తుంది కదా... అందుకే, పాస్పోర్ట్లో మార్పు చేసుకున్న తర్వాత CI (అమెరికా పౌరసత్వ – ఇమ్మిగ్రేషన్ సేవ) – USDHS (అమెరికా అంతర్గత భద్రతా విభాగం) వంటి సంస్థలకు స్వతహాగా, స్వచ్ఛందంగా అన్ని అంశాలను తెలియజేయటం మంచిది. అవసరమయితే మీ జిల్లాలో సివిల్ కోర్టును ఆశ్రయించి కూడా డిక్లరేషన్ కోరే అవకాశం లేకపోలేదు. అలా డిక్లరేషన్ పొందిన తర్వాత రికార్డులలో సవరణలు చేసే వీలుంటుంది. ముందుగా అమెరికాలోని ఒక మంచి ఇమ్మిగ్రేషన్ లాయర్ను కలిసి ఏ రికార్డు మారిస్తే మంచిది, లేక బర్త్ సర్టిఫికెట్ లేకుండా మరేదైనా ఉసాయం ఉందేమో తెలుసుకోండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
డీజే బీట్స్.. రోడియో నైట్స్..
యువతను ఆకర్షించే రీతిలో హైదరాబాద్ నగరంలో మరోసారి సరికొత్త సంస్కృతికి బీజం పడింది. ప్రతిష్టాత్మక ‘రాయల్ ఛాలెంజ్ అమెరికన్ ప్రైడ్ రోడియో నైట్స్’కు నగరం వేదికైంది. అమెరికా తరహా కల్చర్లో భాగమైన కాక్టెయిల్స్, దేశీ డీజే బీట్స్ మేళవింపుతో ఈ నైట్ను బోల్డ్ లైఫ్స్టైల్ ఎక్స్ప్రెషన్గా సోమాజిగూడలోని ఆక్వా పార్కులో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. నగరంలో మొదలైన ఈ ఉత్సవం.. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనుంది. లైఫ్స్టైల్ వేదికగా అమెరికన్ స్పిరిట్, ఫ్రీడమ్, అడ్వెంచర్ థీమ్లతో బ్రాండ్ అనుభవాన్ని మరింత బలంగా ట్యాప్ చేయనుంది. ఈ ఈవెంట్ ప్రధానంగా అమెరికానా వైల్డ్ వెస్ట్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. డెనిమ్ స్టైల్తో అలంకరించిన డిజైన్, ఇంటరాక్టివ్ గేమ్స్, ఏ ఆర్ ఫొటో మూమెంట్స్ వంటి అనేక అనుభూతులను కలిపి లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా రూపొందించారు. ఇందులో భాగంగా లాసో ఛాలెంజ్లు, హ్యామర్ స్లామ్లు, హ్యాండ్ పెయింటెడ్ డీఐవై జోన్ వంటి క్రియేటివ్ స్పేస్తో యువతను కొత్తరకంగా భాగస్వాములను చేసింది. ఈ వేదికపై ప్రత్యేకంగా క్యూరేటెడ్ అమెరికన్ బైట్స్, సిగ్నేచర్ కాక్టెయిల్స్, ఎనర్జీ ఫుల్ డీజే బీట్ అహూతులను ఉత్సాహపరిచాయి. ఆధునిక జీవనశైలి.. ‘ఇది సంగీతం, స్వేచ్ఛ, సంస్కృతిని కలిపిన ఆధునిక జీవన శైలికి ప్రతిబింబం’ అని డియాజియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ వరుణ్ కూరిచ్ అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, ఐడెంటిటీని ప్రతిబింబించే ఈవెంట్లను కోరుతోంది. ఈ రోడియో నైట్స్ అలాంటి అవకాశాన్ని అందించిన తొలి వేదికని తెలిపారు. -
జస్ట్ 15 వారాల్లో 50 కిలోలు ..! కానీ ఆ వ్యాధి కారణంగా..
బోనీ కపూర్, మోనా శౌరీ కపూర్ల తనయుడు అర్జున్ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎలా ఉండేవాడు తెలిస్తే విస్తుపోతారు. చక్కటి ఫిజిక్తో హీరో లుక్లో కనిపించే అర్జున్ బాల్యంలో చాలా బొద్దుగా ఉండేవాడట. జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టంగా లాగేంచేవాడట. దాంతో టీనేజ్ వయసులో 140 కిలోల అధిక బరువుతో ఉండేవాడు. బాలీవుడ్లోకి అడుగుపెట్టేమందే తన రూపు రేఖలను అందరు ఇష్టపడేలా మార్చుకున్నాడు అర్జున్. అతడి న్యూ లుక్ చూసి ఇంట్లో వాళ్లే ఆశ్చర్యపోయారట కూడా. మరి అంత అధిక బరువుని అర్జున్ ఎలా తగ్గించుకున్నాడో ఆయన మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఇషాక్జాదే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే తన లుక్ని పూర్తిగా మార్చుకున్నాడట. పూర్తి ఫిట్నెస్తో స్మార్ట్గా మారాకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారట అర్జున్. తన వెయిట్ లాస్ జర్నీలో మంచి మార్పు తీసుకువచ్చింది మాత్రం వాకింగ్ అని చెబుతారు అర్జున్. ఇది తనను శారీరకంగా చురుకుగా ఉండేలా చేస్తుందని అన్నారు. బరువు తగ్గాలనుకుంటే ముందు వాకింగ్కే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు కపూర్. తను మంచి ఆహారప్రియుడునని, జంక్ ఫుడ్ అంటే మహా ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే తాను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చక్కెర కలిగిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. తాజా పండ్లు, కూరగాయలు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలనే తీసుకుంటానని చెప్పారు. తన రోజు వారి డైట్ ఎలా ఉంటుందో కూడా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన బ్రేక్ఫాస్ట్లో గుడ్లు వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు అధికంగా ఉంటాయిని చెప్పారు. భోజనంలో టర్కిష్ కబాబ్లు, పుదీనా చట్నీ, కూరగాయల సలాడ్లు వంటివి తప్పనిసరి అని అన్నారు. అలాగే జిమ్లో సర్క్యూట్ ట్రైనింగ్, క్రాస్ ఫిట్ ట్రైనింగ్, కార్డియో వంటి వ్యాయామాలు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యాధి కారణంగా మళ్లీ అధిక బరువు బారిన పడ్డానంటూ నాటి చేదు జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు అర్జున్. 2024లో అర్జున్ హషిమోటోస్ థైరాయిడిటిస్ వ్యాధి నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇది జీవక్రియను నెమ్మదించి, బరువు పెరిగేలా చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితి అని తెలిపారు. దీని వల్ల అధిక బరువుని ఎదుర్కొనక తప్పదని తెలుసుకుని చాలా నిరాశకు లోనయ్యానంటూ నాటి బాధను గుర్తుతెచ్చుకున్నారు. అయితే తాను ఆ వ్యాధితో పోరాడలి లేదా అధిక బరువుతో ఉండాలి అనే రెండు ఆప్షన్లే తన ముందు కనిపించాయంటూ భావోద్వేగంగా మాట్లాడారు. దాంతో తాను ఎలాగైన ఆ వ్యాధిని జయించేలా ఫిట్గా ఉండాలని నిర్ణయించుకుని..తన వెయిట్లాస్ జర్నీని కొనసాగించానని చెప్పుకొచ్చారు. తాను ఎదుర్కొంటున్న వ్యాది తన అమ్మ మోనా శౌరీ కపూర్, సోదరి అన్షులా కపూర్కి కూడా ఉందని అన్నారు. అయితే ఆ వ్యాధి పెడుతున్న ఇబ్బందిని అధిగమిస్తూ..ఆరోగ్యంగా ఉండేలా కేర్ తీసుకోవడంతో బరువుని అదుపులో ఉంచుకున్నానని చెప్పుకొచ్చారు. తన వెయిట్ లాస్ జర్నీకి బ్రేక్ ఉండదని..అది అలా సాగుతుందని నవ్వుతూ చెప్పారు అర్జున్. అంతేగాదు అందరిని ఆరోగ్యంగా ఉండండి, ఏదైనా అనారోగ్యం బారిన పడితే కుంగిపోవద్దు..ఎలా బయటపడాలో ఆలోచించండి అని సూచిస్తున్నాడు అర్జున్ కపూర్. (చదవండి: పరాఠా విత్ నెయ్యితో 'జీరో సైజ్ ఫిగర్'..! నటి కరీనా కపూర్ కూడా..) -
సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..!
ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఓ ట్రెండే.. అది ఫ్యాషన్ అయినా.. లైఫ్ స్టైల్ అయినా.. పేర్లు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఆసక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.. వాడే వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా తమ భావాన్ని వ్యక్తికరించాలనే తపనలో ప్రస్తుత తరం యువత ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలోని డైలాగ్ గుర్తుందా..! ‘పుష్ప అంటే పేరుకాదు పుష్ప అంటే బ్రాండ్’ అన్నట్లు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. అయితే ఇందులోనూ ఎవరి ట్రెండ్ వారిదే.. ఎవరి బ్రాండ్ వారిదే.. ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం అందాన్ని పెంచేదో, ఆధునికతను చూపించేదో మాత్రమే కాదు. తమ తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘తమ గురించి తాము చెప్పుకునే’ ఫ్యాషన్ ట్రెండ్. ఇప్పుడు నగరంలో ఈ తరహా ట్రెండ్ ఊపందుకొంది. వ్యక్తిగత అభిరుచిని బట్టి అలాంటి సెల్ఫ్–ఎక్స్ప్రెషన్ స్టైల్స్ విభిన్న రకాలుగా ఉంటున్నాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పలు బ్రాండ్లు సైతం వినూత్న ఫ్యాషన్లను ఆవిష్కరిస్తున్నాయి. కఫ్ లింక్స్ పై పేర్లు.. ఇటీవల తమ పేరు లేదా వ్యక్తిగత గుర్తింపుతో కూడిన కఫ్ లింక్స్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న అలంకరణలతో, చేతి చివర్లలో ధరించే ఈ కఫ్ లింక్స్లో పేరు, ఇంకేమైనా ప్రత్యేకమైన డిజైన్లు చెక్కించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ ఫార్మల్ వేర్లో భాగంగా మాత్రమే వినియోగించే హ్యాండ్మేడ్ – కస్టమ్ – డిజైన్ బంగారం, వెండి లాంటి మెటల్స్తో తయారవుతున్నాయి. పేర్లు, లక్షణాల ప్రాతిపదికన డిజైన్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే వీటిని బహుమతులుగానూ వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా యువతలో, పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ పేరు లేదా ఇనీíÙయల్స్తో ప్రత్యేకత చూపించాలనుకునే వారి వల్ల బాగా పాపులర్ అవుతోంది. ఫ్యాషన్ రంగ నిపుణులు కూడా ఈ ట్రెండ్ను ‘పర్సనలైజ్డ్ ఎలిగెన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు, సంప్రదాయ ఆధునికతల కలయికగా మన నగరంలో మారుతున్నాయని చెబుతున్నారు. కేవలం కఫ్లింక్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత గుర్తింపును ఫ్యాషన్లో కలిపే ట్రెండ్స్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. సొంత/ఇంటి పేరుతో లేదా మొదటి అక్షరంతో డిజైన్ చేసిన గొలుసులు. నేమ్ నెక్లెస్ / ఇసీíÙయల్ పెండెంట్స్, రింగ్స్ వంటివి సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ లాంటి మెటల్స్లో లభ్యం అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో, ప్రేమ జంటల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. జాకెట్లు/శాలువాలు : షర్ట్, జాకెట్స్(బ్లేజర్స్)పై పేరు లేదా చిన్న మెసేజ్ను ఎంబ్రాయిడరీతో బ్రాండెడ్ లోగో తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డ్రెస్కి ఓ వ్యక్తిగత టచ్ ఇచ్చేలా చేస్తుంది. కస్టమ్ మేడ్ టి–షర్ట్స్, ప్రింట్ చేసిన పేరు, ఫేవరెట్ కోట్, బర్త్డేట్ లేదా క్యారెక్టర్ డ్రాయింగ్తో కూడిన డిజైన్లు, గ్రూప్ ఈవెంట్స్, బర్త్డేలు, ట్రావెల్ వంటి సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సొంత పేర్లను కాకపోయినా, తమ భావోద్వేగాలు ప్రతిబింబించే పదాలు, సంకేతాలు టాటూలుగా వేయించుకోవడం కూడా సెల్ఫ్–ఎక్స్ప్రెషన్లో భాగమే. పేర్లు, ఇనీషియల్స్తో కూడిన స్నీకర్స్, లేదా ఫేవరెట్ డిజైన్తో ఉండే పాదరక్షలు, షూ డిజైన్లుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘నైక్’ వంటి బ్రాండ్లు కూడా కస్టమైజేషన్కు అవకాశం ఇస్తున్నాయి. ఇండియన్ వెడ్డింగ్ డ్రెస్లపై పేర్లు కాడలుగా అల్లడం పెళ్లి కూతురు లేదా వరుడు దుస్తుల్లో తన పేరు లేదా జంట పేరు అల్లించుకోవడం ట్రెండ్గా మారుతోంది. అలాగే బ్యాగ్స్, వాలెట్స్, ట్రావెల్ పౌచ్లు తదితర పర్సనల్ ఐటమ్స్పై మోనోగ్రామ్లు, నేమ్ ఇనీషియల్స్తో ఉన్న హ్యాండ్బ్యాగ్స్ కూడా విరివిగా వాడుతున్నారు. ఇవి లగ్జరీ బ్రాండ్స్ (లూయిస్ విటన్, గూచి) నుంచి చిన్న ఆర్టిసన్ స్టోర్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..! లేదంటే వర్షపు వ్యాధుల ముప్పు..) -
జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..!
ఈ వానాకాలంలో గత కొన్నాళ్లుగా... ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వానాకాలపు సీజన్లోఎంత వర్షం పడిందో తెలిపే సెంటీమీటర్లూ... అలాగే జ్వరం తీవ్రత తెలిపే థర్మామీటర్ల రీడింగులూ పోటాపోటీగా పెరుగుతూపోతుంటాయి. ఎందుకంటే... వర్షం రాబోయే పంట సీజన్కు మంచి పంటలనే కాదు వర్తమానంలో జ్వరాలు, ఇన్ఫెక్షన్ల తంటాలనూ ప్రామిస్ చేస్తుంది. అందుకే ఓ పక్క మోద ప్రమోదాలతోపాటు మరో పక్క ఖేద ప్రమాదాలను తెచ్చిపెట్టే రెయినీ సీజన్ పెచ్చరిల్లజేసే వానల వ్యాధుల గురించి తెలుసుకుందాం. వర్షపు వ్యాధుల ముప్పులనుంచి కాపాడుకోవడమెలాగో అవగాహన పెంచుకుందాం...వానల్లో హాయిగా పకోడీలు తింటూ, కిటికీలోంచి చినుకులను చూసే అదృష్టం కొద్దిమందికే ఉంటుంది. చాలామంది రెయిన్కోట్ తొడుక్కునో లేదా గొడుగు పట్టుకునో... అవేవీ లేనివాళ్లు తడుస్తూనైనా వర్షాల్లో తమ పనులకూ / ఆఫీసులకూ వెళ్లి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో తడవడంతో వచ్చే అనారోగ్యాలతో పాటు... ఈ సీజన్లోనే పెరిగే వ్యాధుల గురించి తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరముంది. చిన్నారులు తమ ఆటలో భాగంగా వానలో తడిసేందుకు ఆసక్తి చూపుతారు. అలా వాళ్లు జలుబూ, జ్వరాలు తెచ్చిపెట్టుకుంటారు. ఇక వృద్ధులకు ఈ సీజన్ ఓ ప్రమాదకారిలా అనేక ముప్పులు తెచ్చిపెడుతుంది. వాన వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవడంతో వాటిని చాలావరకు నివారించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వర్షాలు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. మొదటిది నేరుగా తడవడం వల్ల వచ్చే జలుబూ, జ్వరాలు ఒక తరహావి. ఇక ఈ సీజన్లో నీటిగుంటల్లో చేరే నీరు కారణంగా దోమల ప్రత్యుత్పత్తి (బ్రీడింగ్)తో వాటి సంఖ్య విపరీతంగా పెరగడం, దాంతో అవి వ్యాప్తి చేసే వ్యాధులు మరో తరహావి అయితే... ఇదే సీజన్లో ముసురుకునే ఈగలు వ్యాప్తి చేసే జబ్బులూ... వెరసి ఇవన్నీ అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇక ఇంకో తరహా ముప్పు ఏమిటంటే... వాన నీరు భూమి ఉపరితలాన్ని తడిపేయడంతో ఎలకలు తమ బొరియల్లోంచి పైకి వచ్చి, ఇళ్లలోని కిచెన్ ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న ఆహారాలను కలుషితం చేయడంతో వచ్చే లెప్టోస్పైరోసిస్ లాంటి జ్వరాలను తెచ్చిపెట్టడం మరో ముప్పు. వృద్ధుల్లాంటి వారు బురదలో కాలుజారి ఎముకలకు ప్రమాదాలు తెచ్చిపెట్టుకోవడం వంటి ట్రామా కేసులకూ ఈ సీజన్ కారణమవుతుంటుంది. ఇలా ఒక్కో తరహా ముప్పుల తీరుతెన్నులను పరిశీలిద్దాం...నీరు కలుషితం కావడం కారణంగా... వర్షాల సీజన్లో నీరు కలుషితం కావడం (వాటర్ కంటామినేషన్) వల్ల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే ప్రధాన వ్యాధులు...టైఫాయిడ్ : సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. తగిన మందులతోనూ, సెప్టిసీమియాలో ప్రత్యేకంగా చేయాల్సిన చికిత్సలతోనూ వైద్యులు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు.కలరా : విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. తీవ్రమైన నీళ్ల విరేచనాలు, వాంతులు వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడి΄ోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అందుకే ప్రత్యేకంగా ఈ లక్షణాన్ని ‘రైస్ వాటర్ స్టూల్స్’ అని కూడా చెబుతారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే మూత్రపిండాలు పాడైపోవడం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుని, ఒక్కోసారి ఆ పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశముంటుంది. స్టూల్ కల్చర్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్తో వైద్యులు దీన్ని అదుపు చేస్తారు.షిజెల్లోసిస్ : జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి మొదలైనవి ఈ వ్యాధి తాలూకు లక్షణాలు. షిజెల్లోసిస్లో పేగులో ఇన్ఫెక్షన్తో వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్తోపాటు... రక్తంలో యూరియా మోతాదులు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోవడవం; రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకం అయ్యేందుకు అవకాశం ఉంది.ఈ-కొలై : నీళ్ల విరేచనాల ఎక్కువగా అయ్యే ఈ కండిషన్కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణం. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్రం కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దోమలతో వ్యాప్తిచెందే వ్యాధులు...డెంగీ : వానాకాలంలో మునపటి కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ వ్యాధికి ఏడిస్ ఈజిప్టై అనే రకం దోమలు కారణమవుతాయి. జ్వరం, తీవ్రమైన తలనొప్పితోపాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి రావడంతో దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయావాల్లో రక్తస్రావం కూడా జరగవచ్చు. మామూలుగా వచ్చే డెంగీ వ్యాధిని ‘క్లాసికల్ డెంగీ’ అంటారు. అయితే తీవ్రమైన అంతర్గత రక్తస్రావం వల్ల వచ్చే పరిస్థితిని ‘డెంగీ హేమరేజిక్ ఫీవర్’ అంటారు. ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్కు గురికావచ్చు. ఈ తరహా డెంగీని దీన్ని ‘డెంగీ షాక్ సిండ్రోమ్’ అంటారు. దోమలు వ్యాప్తి చేసినప్పటికీ డెంగీ వైరస్తో వచ్చే వ్యాధి ఇది. దీనికి ప్రత్యేకంగా చికిత్స ఉండదు. కనిపించే లక్షణాలను బట్టి చికిత్స అందించే సింప్టమేటిక్ ట్రీట్మెంట్తో దీనికి చికిత్స చేస్తారు. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ... ఒకసారి డెంగీ బారిన పడ్డవారు మరోసారి దీని బారిన పడితే పరిస్థితి చాలా తీవ్రంగానూ, విషమంగానూ ఉంటుంది కాబట్టి ఒకసారి డెంగీ బారిన పడ్డవారికి వ్యాక్సిన్ ఇస్తుంటారు. చికన్ గున్యా : ఇది కూడా ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్లనే వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా ఇది వస్తుంది. ఏడిస్ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తుంటుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఈ కీళ్లనొప్పులు భరించలేనంతగా ఉంటాయి. ఇది కూడా వైరల్ జ్వరం కావడంతో లక్షణాలను బట్టి ఇచ్చే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ అందిస్తారు.మలేరియా : ఇది కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉండే తీవ్రమైన జ్వరం. అనాఫిలస్ అనే రకం దోమ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా రకానికి చెందిన ఏకకణ సూక్షజీవి వల్ల మలేరియా జ్వరాలు వస్తాయి. ఇందులో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో రకాన్ని బట్టి జ్వరాలు నిర్దిష్టంగా కొంత కొంత వ్యవధిలో మాటిమాటికీ వస్తుంటాయి. ఈ వ్యాధిలో ఒక రకం (స్పీషీస్) వల్ల సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్డీఎస్), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి జరగవచ్చు.ఈగలతో వచ్చే వ్యాధులు...వానల సీజన్ మొదలవ్వగానే ఈగలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఈగలతో దాదాపు వంద రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి పరిశుభ్రత లేని చోట్ల ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరాలూ వెళ్లగలవు. సాధారణంగా పగటివేళ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రాత్రివేళ విశ్రాంతి తీసుకుంటుంటాయి. ఈగల లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను ‘మైయాసిస్’ అంటారు. ఈగల కారణంగా వ్యాప్తి చెందే వ్యాధులు సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు.ఇవీ ఈగలతో వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ్ర΄ోటోజోవన్ పరాన్న జీవులనూ, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్ వర్మికులారిస్ వంటి నులిపురుగులనూ, ΄ోలియో, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ అండ్ ఈ) వంటి వైరస్లనూ ఈగలు వ్యాప్తి చేస్తాయి. ఈ కింద పేర్కొన్నవి ఈగలు వ్యాప్తి చేసే ముఖ్యమైన వ్యాధుల్లో కొన్ని మాత్రమే.అమీబియాసిస్ : ఇవి ప్రొటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములు. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా తేలిగ్గా గుర్తించవచ్చు.జియార్డియాసిస్ : ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ స్మూక్షక్రిములు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి సోకినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. తిన్న ఆహారం ఒంటికి పట్టక΄ోవడం (మాల్ అబ్జార్ప్షన్) కూడా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తుంటుంది. అమిబియాసిస్తో పాటు జియార్డియాసిస్ వంటి అనారోగ్యాలు కనిపించినప్పుడు గట్ ఎన్విరాన్మెంట్ను నార్మల్గా ఉంచుతూ హానికరమైన సూక్ష్మజీవులను బయటికి పంపే కొన్ని రకాల ΄పౌడర్లు, మెడిసిన్స్తోపాటు అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఎలుకల వల్ల...వర్షాలకు బొరియల్లో ఉండే ఎలుకలు బయట నుంచి ఇళ్లలోకి వస్తాయి. ఎలుకల్లో పెరిగే లె΄్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా లె΄్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోవడంతో లెప్టోస్పైరోసిస్ జ్వరాలు వస్తాయి. ఈ సీజన్లో ఎలుకలు ఎక్కువగా ఉండే బురద నీళ్లలో ఎక్కువగా తిరిగే వారికీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడమూ జరుగుతుంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్తో డాక్టర్లు లె΄్టోస్పైరోసిస్కు చికిత్స అందిస్తారు.వర్షాకాలం వ్యాధుల నివారణ ఇలా... ఈ సీజన్లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చాక వడపోసి తాగడం అన్నిటికంటే ప్రధానం. కుండల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగవద్దు. వాటర్ను డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది. ఈ సీజన్లో బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినేయాలి. ఈ సీజన్లో చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినడం అంత మంచిది కాదు. మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ వ్యాధులు మాంసాహారం కారణంగా వ్యాప్తిచెందవు. కాకపోతే శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ప్రాసెస్ చేసే క్రమంలో ఈగలు బాగా ముసరడానికి అవకాశం ఎక్కువ. సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పును తప్పించుకోవచ్చు. ఈ సీజన్లో పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలి. నీళ్లు నిల్వ ఉండటానికి అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు కారణమవుతాయి. నీటి చేరడానికి అవకాశమిచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైన పెచ్చులు ఊడిపోయిన సన్షేడ్కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి (బ్రీడింగ్) చేస్తాయి. కాబట్టి మీ ఇళ్లలో, ఇంటి పరిసర్రప్రాంతాల్లో దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించాలి. రాత్రిళ్లు పడుకునే సమయంలో మంచం చుట్టూ దోమ తెరలు వాడటం వల్ల దోమల కారణంగా వ్యాప్తి చెందే అనేక వ్యాధులు నివారితమవుతాయి.ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ఇంటి కిటికీలకు మెష్లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే అయినప్పటికీ ఇప్పుడు కిటికీలకు అంటించడానికి రెడీగా ఉండే మెల్క్రో వంటి ΄్లాస్టిక్ మెష్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల దోమలతో వచ్చే అనేక వ్యాధులు నివారితమవుతాయి. వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి అలర్జీలు ఉంటే పొగవేసే ఇలాంటి చిట్కాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు దూరంగా ఉన్న కుండీలలో వేస్తుండాలి. వీధిలో ఉండే కుండీలను పారిశుద్ధ్య సిబ్బంది క్రమంతప్పకుండా శుభ్రం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి.కొందరు నేల మీది మట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయంలో సబ్బు లేదా బూడిద వూత్రమే వాడాలి. వానలో అతిగా తడిసిన సందర్భాల్లో అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడే వారిలో నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్త వహించాలి.చివరగా... ఈ సీజన్లో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేతులు ఎక్కువగా కడుక్కోవడం వల్ల చాలా రకాల జబ్బులను... మరీ ముఖ్యంగా వర్షాల సీజన్లో వచ్చే అనేక వ్యాధులను సమర్థంగా నివారించవచ్చు. డాక్టర్ నవీన్ కుమార్ సీనియర్ ఫిజీషియన్ (చదవండి: World Hepatitis Day: ఐబ్రోస్ థ్రెడింగ్తో ఇంత ప్రమాదమా..! ఏకంగా కాలేయంపై..) -
ఆ అమ్మ చర్మం బిడ్డ బుగ్గలపై చిగురించింది..
తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు. గతనెల 12న అహమ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్ కపిల్ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్ ఇంట్లో ఉన్నారు. విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్ ను పీడియాట్రిక్ ఐసియులో చేర్చి వెంటిలేటర్పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చారు. ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా. కేడీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్ దేశాయ్ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు. (చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..) -
టైగర్ ప్రిన్సెస్
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు ఇవి. ‘అయ్యో పులి’ అనుకునే రోజులు. పులుల మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో వాటి పరిరక్షణకు నడుం కట్టిన అగ్రగణ్యులలో దిల్లీకి చెందిన లతికానాథ్ ఒకరు. ‘టైగర్ ప్రిన్సెస్’గా పేరు తెచ్చుకున్న లతిక చూడని అడవి లేదు. తన కెమెరా కన్ను ప్రపంచంలోని ఎన్నో పులుల విషయాలను, విశేషాలను, విషాదాలను ఆవిష్కరించింది.చిన్నప్పుడు లతికను తల్లిదండ్రులు నేషనల్ పార్క్కు తీసుకువెళ్లడం వల్ల ఆమెలో జంతువులపై ఆసక్తి, ప్రేమ పెరుగుతూ వచ్చాయి. జంతు పరిరక్షణ ఉద్యమ విశేషాలు వినడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం లతిక కన్జర్వేషన్ ఎకాలజిస్ట్, ఫోటోగ్రాఫర్గా రూపుదిద్దుకోవడానికి కారణం అయింది.‘పులుల పరిరక్షణకు సంబంధించి మీరు చేసిన కృషిని డాక్యుమెంట్ చేయండి’ అంటూ లతికను సంప్రదించిన నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ నిర్వాహకులు ఆమెకు ‘టైగర్ ప్రిన్సెస్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ‘డిస్కవరీ’ చానెల్ కోసం లతిక చేసిన ‘వైల్డ్ థింగ్స్’ డాక్యుమెంటరీ పాపులర్ అయింది. మన దేశంలో పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్పై పరిశోధన చేసిన తొలి భారతీయురాలిగా లతిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.పులుల ఉనికి, సంరక్షణకు సంబంధించిన అరకొర సమాచారం ఒక పరిమితిగా ఉండేది. ఆ పరిమితిని లతిక పరిశోధనలు అధిగమించాయి. డా. జార్జ్ షాలర్ తరువాత ఆ స్థాయిలో పులులపై పరిశోధన చేసిన వ్యక్తిగా లతికకు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పులుల పరిరక్షణ, మేనేజ్మెంట్కు సంబంధించి అధ్యయనాలు ఎక్కువగానే జరుగుతున్నాయి.‘గతంలో పోల్చితే పులుల పరిరక్షణపై ఎక్కువగా అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, పరిశోధన, అధ్యయనం అనేవి ఇప్పటికీ అంత సులభంగా ఏం లేవు. కావు. వైల్డ్లైఫ్ బయాలజిస్ట్, ఫొటోగ్రాఫర్గా చెప్పుకోదగ్గ స్థాయిలో జీవించడం కష్టంగా ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పులుల సంరక్షణకు సంబంధించి అధ్యయనాన్ని ప్రోత్సహించాలి’ అంటుంది లతిక.ప్రయాణాలు అంటే ఇష్టపడే లతిక యాభైకిపైగా దేశాలకు వెళ్లింది. ఎన్నో అడవులలో పులులతో సహా ఎన్నో జంతువుల ఫోటోలు తీసింది. ‘ప్రతి ఫోటోగ్రాఫ్కు ఒక కథ ఉంది. నేను చూసిన ప్రతి పులి నా మనసులో ముద్రించుకుపోయింది. ప్రతి పులి తనకు సంబంధించి ఒక కథ చెబుతున్నట్లుగానే ఉంటుంది. అవి క్షేమంగా ఉండాలని ఎప్పుడూ ప్రార్థించేదాన్ని’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళుతుంది లతిక.లతిక తీసుకువచ్చిన ఫొటోగ్రాఫ్స్ కలెక్షన్ ‘హిడెన్ ఇండియా’ సమస్త జంతుజాలాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకానికి వాడిన ముఖచిత్రం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. అడవిలో ఒక శిథిల వృక్షం వెనకాల నుంచి భయంగా చూస్తూ ఉంటుంది పులి. ఆ పులి కళ్లు చెప్పకనే ఏవో బాధలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. పిల్లల కోసం లతిక రాసిన ‘తక్దీర్ ది టైగర్ క్లబ్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై భాషలలోకి అనువాదం అయింది.‘మనుషుల మనుగడ జంతువుల మనుగడతో ముడిపడి ఉంది. స్వల్పకాల స్వార్థప్రయోజనాల కోసం వాటికి హాని చేయడం అంటే భవిష్యత్ కాలంలో మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవడమే’ అంటున్న లతికానాథ్ అకాడమిక్ రిసెర్చ్ నుంచి కన్జర్వేషన్ ప్రాజెక్ట్లకు సంబంధించి కన్సల్టెన్సీ వరకు పులుల పరిరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.వాటిని చూడడం అదృష్టంనేను పులులకు సమీపంలో ఉన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉందా, చల్లగా ఉందా? అసౌకర్యంగా ఉందా? ఆకలిగా ఉందా? అనే స్పృహ ఉండదు. పులులు మాత్రమే నాకు కనిపిస్తాయి. పిట్ట కావచ్చు, పులి కావచ్చు వాటిని చూడడం అదృష్టంగా భావిస్తాను. వాటిని చూసినప్పుడల్లా వాటి పరిరక్షణకు ఇంకా ఏదైనా చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది.– లతికానాథ్ -
రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్ఫుల్నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి. అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్ఫుల్నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు. మంచి జోష్తో నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ లిమిట్గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట. ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి. View this post on Instagram A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)) -
OTT సబ్స్క్రిప్షన్ కంటే తక్కువ ఖర్చుతో పెళ్లి!
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. అంటూ వర్ణించారు మనసు కవి ఆత్రేయ. ఈ కాలపు పెళ్లిళ్లలో సందడి కంటే షో ఎక్కువగా కనబడుతోంది. సంప్రదాయాల కంటే హంగామా ఎక్కువవుతోంది. ఫలితంగా పెళ్లి ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఓ మాదిరి స్థాయిలో వివాహ వేడుక నిర్వహించాలంటే తక్కువులో తక్కువ 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. జీవితంలో ఒకేసారి జరిగే వేడుక అంటూ స్థాయిమించి లగ్గాలకు వెచ్చిస్తున్నారు. దీంతో పెళ్లి ఖర్చు అంటనే మిడిల్ క్లాస్ (Middle Class) పేరెంట్స్ పరేషాన్ అవుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ జంట సింపుల్గా పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది.ఏడాది OTT సబ్స్క్రిప్షన్ కంటే తక్కువ ఖర్చుతో పెళ్లి జరిగిందంటే నమ్ముతారా? అవును ఇది నిజంగా నిజం. ఓ జంట కేవలం రూ. 1,592తో పెళ్లి చేసుకుంది. జోకులేయకండి సార్.. ఈ డబ్బుతో ఒక జత బట్టలు కూడా కొనలేం, ఏకంగా పెళ్లా? అంటూ నోరెళ్లబెట్టకండి. అయితే రాజస్థాన్కు (Rajasthan) చెందిన కమల్ అగర్వాల్, అతని చిరకాల స్నేహితురాలు రుచి పెళ్లి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కళ్లు చెదిరే సంగీత్లు, ఆర్భాటపు గ్రాండ్ బఫేలు, ఊరంతా ఫంక్షన్ హాల్ లేకుండా వీరిద్దరూ సింపుల్ వెడ్డింగ్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసేశారు.సింపుల్ వెడ్డింగ్ తన పెళ్లికథను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'రెడిట్' (Reddit) లో పంచుకున్నాడు కమల్. తన అన్నయ్య పెళ్లి ఆర్భాటంగా చేయడం వల్ల డబ్బు, సమయంతో పాటు తమ కుటుంబం అనుభవించిన యాతనను కళ్లారా చూసి.. నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కమల్. మే 28న రిజిస్ట్రార్ కార్యాలయంలో కమల్, రుచి వివాహం చేసుకున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఏప్రిల్ 17న రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వధూవరుల ఆధార్కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, కొన్ని స్టాంప్ పేపర్లతో పెళ్లి తంతు సింపుల్గా ముగిసింది. బారాత్ (Baraat) వంటి హంగామా లేకుండా పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. మ్యారేజ్ సర్టిఫికెట్తో రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చారు.పెళ్లి ఖర్చులు ఇలా..తన పెళ్లికి వెచ్చించిన డబ్బు వివరాలు కూడా కమల్ వివరించాడు. స్టాంప్ పేపర్లకు రూ. 320, పబ్లిక్ నోటరీకి రూ. 400, అత్యవసర ఫోటోలకు రూ. 260, డిక్లరేషన్ ఫారమ్ ప్రింటింగ్ కోసం రూ. 290, స్టేషనరీ, ప్రింటింగ్, ప్రభుత్వ రుసుములకు రూ. 322 వరకు ఖర్చచేసినట్టు వెల్లడించాడు. మీ దగ్గర ఇప్పటికే ఫోటోలు ఉండి ఉంటే, ఇంట్లో ప్రింట్ తీసుకునే వీలుంటే, నోటరీ చేయడానికి తెలిసినవారు ఎవరైనా ఏంటే.. పెళ్లి ఖర్చు రూ.వెయ్యిలోపే ఉంటుందని వివరించాడు.నెటిజనులు ఏమన్నారంటే..కమల్, రుచి సింపుల్ వెడ్డింగ్ను నెటిజనులు (Netizens) ప్రశంసిస్తున్నారు. తాము ఇలాగే నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు కొంతమంది మనలో మాట బయటపెట్టారు. ఎటువంటి ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకోవడంతో కమల్, రుచి నెట్ వర్త్ వెంటనే రూ. 10 లక్షలు పెరిగిందని ఓ నెటిజన్ చమత్కరించారు. మరికొందరు నూతన వధూవరులను అభినందిస్తూనే.. క్యాటరింగ్, ఆభరణాల వంటి పరిశ్రమలను నిలబెట్టడానికి లావిష్ వెడ్డింగ్స్ సహాయపడతాయని పేర్కొన్నారు. విలాసవంతమైన వేడుకలు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాయన్నారు. చదవండి: అంతిమ క్షణాల్లో 'విల్' పవర్!దీనికి కమల్ అగర్వాల్ స్పందిస్తూ.. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఖర్చు విషయంలో రాజీ పడలేదని, తమది చైతన్యవంతమైన నిర్ణయమని అన్నాడు. హంగు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ వెడ్డింగ్ (Simple Wedding) చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నెటిజనులు వ్యక్తం చేయడం గమనార్హం. మరి మీరేమంటారు? -
ముద్దుల తనయకు గణపతి బప్పా ఆశీర్వాదం : న్యూ డాడ్ సిద్ధార్థ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ముద్దుల కుమార్తె కోసం ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేసి గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకున్నారట. తన తల్లి రిమ్మా మల్హోత్రాతో సిద్ధి వినాయకుణ్ణి సందర్శించారు. దీనికి సంబంధించినొకవీడియో నెట్టింట ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది.ఆలయ సందర్శనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్లైన్లో కనిపించాయి. ఒక ఛాయాచిత్రకారుడు షేర్ చేసిన క్లిప్లో, సిద్ధార్థ్ నీలిరంగు కుర్తా ,బ్లాక్డెనిమ్ ధరించి సిద్దార్థ్, పింక్ సూట్లో తల్లి రిమ్మా గణపతిని దర్శించుకున్నారు. భక్తితో చేతులు జోడించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పూజారి దేవుని పాదాల దగ్గరి పూమాలను వారికి ఇచ్చారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)s="text-align-justify"> కాగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో కనిపించిన కియారా, ఇటలీలోని రోమ్లో సిద్ధార్థ్ మల్హోత్రా తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. షేర్షా సినిమా షూటింగ్ సమయంలో డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2023, ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో వివాహం జరిగింది. ఈ జంట జూలై 16న తమ తొలి సంతానానికి (ఆడబిడ్డ) జన్మనిచ్చారు. -
ఐబ్రోస్ చేయించుకుంటున్నారా?.. ఇది మీకోసమే.. కాలేయంపై ఎఫెక్ట్?
బ్యూటీ పార్లర్కి వెళ్లి ఐబ్రోస్ని అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది చాలామంది మహిళలు చేయించుకునే సాధారణ సౌందర్య చికిత్స. దీన్ని రెండు నెలలకొకసారి చేయించుకుంటుంటారు. తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మార్చుకునే కొద్దిపాటి సౌందర్య ప్రక్రియ ఇది. దీంతో ఆరోగ్య సమస్యలు ఏం ఉంటాయని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇంది ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అసలు ఐబ్రోస్ థ్రెడింగ్తో ఎలా అనారోగ్యానికి గురవ్వుతారు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి సంక్రమణం, కాస్మెటిక్ విధానాల వల్ల కూడా ఇది సోకుతుందా వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.!.ఇటీవల ఓ 28 ఏళ్ల మహిళ ఇలాంటి సమస్యను ఎదుర్కొవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెన కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్న తర్వాత కాలేయ ఇన్ఫెక్షన్కి సంబంధించిన హెపటైటిస్ బీ బారిన పడిందని వైద్య పరీక్షల్లో తేలింది. శతాబ్దాల నాటి బ్యూటీషియన్ విధానం ఇది. పైగా ప్రతి రెండు నెలలకోసారి చేయించుకుంటుంటారు. చాలా సరసమైన ధరలో ముఖాకృతి అందంగా మార్చుకుని ఈ సౌందర్య చికిత్స సదరు మహిళకు ప్రాణంతకంగా మారిందని వెల్లడించారు వైద్యులు. ఆ యువతికి థ్రెడింగ్ ద్వారా హెపటైటిస్ బి వ్యాపించిందని చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తదనంతరం..అలసట, వికారం, పసుపు కళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ థ్రెడ్డింగ్ కారణంగా ఆమె శరీరంలోకి హెపటైటిస్ బి లేదా సి వైరస్లు రక్తప్రవాహంలోకి ప్రవేశించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Dr. Aditij Dhamija | Health Educator | MBBS (@drdhamija)అసలు హెపటైటిస్కు ఎలా దారితీస్తుంది...కొన్ని పార్లర్లలో కనుబొమ్మల ఆకృతి కోసం చేసే థ్రెడింగ్ దారం సాధారణంగా అందరికి ఉపయోగించే దాన్నే వినియోగిస్తుంటారు. అక్కడ వాళ్లు కాస్త పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని అన్నారు. ఒకరికి ఉపయోగించని దారం మరొకరికి వినియోగించడంతో ఆ థ్రెడ్డ్ కనుబొమ్మలను కట్ చేస్తున్నప్పుడే ఈ హెపటైటిస్ బి, సీ వైరస్లు సులభంగా సక్రమింస్తాయట. ఒక్కోసారి దీని వల్లే హెచ్ఐవీ బారీన కూడా పడే ప్రమాదం ఉందట.డబ్ల్యూహెచ్ఓ సైతం..ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టాటూ వేయించుకోవడం, రేజర్లను షేర్ చేసుకోవడం, థ్రెడింగ్ చేయించుకోవడం వంటి కాస్మెటిక్ విధానాల వల్ల హెపటైటిస్ బి బారినపడ్డ పలు కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ హెపటైటిస్ బి వైరస్ చిన్న కలుషితమైన వాటి ఉపరితలాలపై రోజుల తరబడి జీవించి ఉంటుందట. ఇది కేవలం రక్తం వల్ల సంక్రమించదని, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక్క దారం చాలు సులభంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎంత వ్యవధి పడుతుందంటే..వ్యాధి నిరోధక శక్తి బాగున్నంత వరకు ఈ వైరస్తో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యానికి గురవ్వడం లేదా వీక్ అవుతామో అప్పుడు ఈ వైరస్ విజృంభణ మొదలవ్వుతుందట. తీవ్రమైన హెపటైటిస్ బి ఆరునెలల వరకు ఉంటుందట. ఈ టైంలో వైరస్ శరీరమంతా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఒక్కోసారి క్రియాశీల హెపటైటిస్ బారిన పడితే..సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులోనే సాధారణ హెపటైటిస్ బారిన పడితే..ప్రమాదం తక్కువగా ఉంటుంది. వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడగలరని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..ఒక్కోసారి ఈ హెపటైటిస్ బి అనేది ఎలాంటి సంకేతాలు చూపకుండానే దాడి చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా చాలామటుకు అందరిలోనూ ఒకేలా ఈ కింది సంకేతాలు కనిపిస్తాయి..కడుపు నొప్పిఅలసటజ్వరంకీళ్ల నొప్పులుఆకలి లేకపోవడంవికారం, వాంతులుముదురు రంగు మూత్రంలేత లేదా మట్టి రంగు మలంచేతులు, కాళ్లు వాచినట్లు లేదా ఉబ్బినట్లుగా నీరి చేరి ఉండటంచర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలుఅందువల్ల సాధ్యమైనంత వరకు కాస్మెటిక్కి సంబంధించిన వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. పార్లర్లో సరైన పరి శుభ్రత ఉందో లేదో నిర్థారించుకున్నాక..ఎలాంటి సౌందర్య చికిత్సా విధానానికైనా ముందుకెళ్లడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!) -
ఫ్యాషన్ ఫ్రమ్ నేచర్.. డిజైనింగ్తో స్టోరీ టెల్లింగ్..
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి. భారతీయ సంప్రదాయ, వివాహ కోచర్లో తన నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందిన అమోగ్.. వారసత్వ హంగులను ఆధునిక ఫ్యాషన్తో సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ‘యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ బిరుదును సైతం పొందారు. ఈ ప్రయాణంలో భాగంగానే నగరంలోని హెచ్ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు. డిజైనింగ్తో స్టోరీ టెల్లింగ్.. మన ఊహకందని నూతన ఫ్యాషన్ ఫార్ములాతో సమ్మిళితమై రూపొందించారు. ఆ సౌందర్యం ఒక్కొక్క లేయర్లా నిరంతరం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అమోగ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. నోవోటెల్ వేదికగా చిన్నారులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్లో అమోగ్ రూపొందించిన డిజైనింగ్ వేర్ ప్రకృతిని ప్రతిబింబించాయి. ప్రకృతిలోని వర్ణాలు, అరణ్యంలోని అందాల నుంచి ప్రేరణ పొందాయి. ఆకారాల కవిత్వమే ఈ వనమ్ కలెక్షన్ అని అమోగ్ పేర్కొన్నారు. ప్రకృతి అందాలే ఈ డిజైన్లను రూపొందించడానికి ప్రేరేపించాయన్నారు. క్రియేటివిటీని హైదరాబాద్లో ప్రారంభించి దేశంతో పాటు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. ఈ కలెక్షన్లోని ప్రతి డిజైన్ ఒక కథను చెబుతుంది. వినూత్న పద్ధతుల్లో ఆధునిక ఫ్యాషన్ హంగులతో సంప్రదాయ హస్తకళలను సమన్వయం చేయడంతో ఫ్యాషన్ ప్రియులను అలరించాయి.(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్గా మెరుద్దాం ఇలా..!) -
ఫుడ్ అండ్ ఫ్యాషన్ టిప్స్ : వర్షంలో హాయి..హాయి
వెన్నెల్లో హాయి.. హాయి.. మల్లెల్లో హాయి హాయి.. వరాల జల్లే కురిసే.. తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి.. ఇవ్వాళ మనసే మురిసే.. మే నెల్లో ఎండ హాయి ఆగష్టు లో వాన హాయి.. జనవరిలో మంచు హాయి.. హాయి రామ హాయి.. హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో.. సరైన ప్రణాళికతో జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ అంతే హాయిగా ఉంటుందంటున్నారు నిపుణులు.. భాగ్యనగరంలో ప్రస్తుతం వర్షాలు ముసురుకున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి.. – సాక్షి, సిటీబ్యూరోగజిబిజి నగర జీవన శైలి.. వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవైపు ముసురుకున్న వర్షాలతో తేమ బురద వాతావరణం. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు.. వీటికి మించి ఆరోగ్య సమస్యలు.. ఈ నేపథ్యంలో చక్కని చిట్కాలు పటిస్తే వీటి నుంచి ఇట్టే పరిష్కారం లభిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని ఓ సమస్యగా కాకుండా జీవనశైలిలో భాగంగా మార్చుకుంటే శ్రేయస్కరం.. ఇందులో భాగంగా నగరవాసులకు పలు చిట్కాలు.. ట్రావెల్ అండ్ వర్క్ లైఫ్.. నగరంలో వర్షాకాలం అనగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వర్షపు నీరు, వాహనాల బ్రేక్డౌన్లు సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలతో పాటు వర్షం తడవాల్సిన పరిస్థితి ఉండదు.. పైగా సమయం కూడా ఆదా అవుతుందిఇంటి పరిసరాలపై శ్రద్ధ : వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టూ నిరు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. పైప్లైన్లు బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేసుకోవాలి. మేడపై కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే డెయ్రిన్లలోని చెత్తను తొలగించుకోవడం ఉత్తమం. దీంతోపాటు విద్యుత్ వైర్లు, మీర్ల వద్ద తేమ లేకుండా చూసుకోవాలి. ఇన్వర్టర్లు, టార్చ్లైట్లు, బ్యాటరీ బ్యాకప్ప్ చెక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు పవర్ బ్యాంక్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ ఎంత మేరకు నివారిస్తే అంత మంచిది.సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత..: వీధిపక్కన దొరికేకే ఆహారానికి దూరంగా ఉండాలి.. ఇంట్లో చల్లని వాతావరణానికి తగినట్లు వేడివేడిగా వెజ్ సూప్స్, ఉల్లిపాయ పకోడి, అల్లం టీ వంటి హీటింగ్ ఫుడ్స్ వల్లఆ హ్లాదంతో పాటు ఆరోగ్య సొంతం. నీరు తాగడంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వేడి నీరు, శుద్ధి చేసిన నీటిని తాగడం మంచిది. వర్షాకాలంలో తీసుకునే ఆహారం చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపుతాయి. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. వర్షా కాలపు ఫ్యాషన్ టిప్స్.. : వర్షంలో మన ఫ్యాషన్ కూడా మారాలి. స్టైలిష్ ఉండే సమయంలో ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి.. వర్ష నిరోధక/వాటర్ ఫ్రూఫ్ షూస్, అనువుగా ఉండే రబ్బరు చెప్పులు సౌకర్యవంతంగా ఉంటాయి. సింథటిక్ లేదా డ్రై–ఫిట్ డ్రెస్సులు వేసుకుంటే తడవడం, ఆరిపోవడం తేలిక. లెదర్ బ్యాగ్స్కు బదులుగా వాటర్ప్రూఫ్ బ్యాగ్స్ ఎంచుకోవాలి. ల్యాప్టాప్ బ్యాక్స్కి కూడా వాటర్ప్రూఫ్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించాలి.ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేని వారు ఎంఎంటీఎస్, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయించడం ఉత్తమం.ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో సంబంధం లేకుండా వాహనాల్లో రెయిన్ కోట్స్, గొడుగు, అదనపు మాస్క్, టవల్ క్యారీ చేయడం మంచిది. మైండ్ఫుల్ లివింగ్.. వర్షం మనసుకు ప్రశాంతతను, నూతనోత్సాహాన్ని తెస్తుంది. వర్షాన్ని కాఫీ కప్పుతో ఆస్వాదిస్తూ బుక్స్ చదవడం, ఇంట్లో గేమ్స్ ఆడడం, ఫ్యామిలీతో టైమ్ గడపడం లాంటి చిన్న విషయాలు జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుతాయి. ఒక రకంగా వర్షాలు వరద బీభత్సాలే.. కాకుండా ఒక్కసారిగా పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి. ఫలితంగా ప్రకృతి ప్రదేశాలకు పచ్చదనాన్ని అందుతాయి. అయితే సరైన జాగ్రత్తలు లేకపోతే సమస్యలే ఎక్కువ ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా హైదరాబాదీయులు ఈ వర్ష కాలాన్ని ఒక లైఫ్స్టైల్ ఫెస్టివల్గా మార్చుకుంటే.. ఈ కాలమెంతో మధురంగా మారుతుంది. ఇదీ చదవండి: నో జిమ్, ఓన్లీ చాట్జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గిన మెరుపు తీగ -
తెలంగాణాలో ఫెర్టిలిటీ రేటు క్షీణతపై సంతానోత్పత్తి నిపుణుల ఆందోళన
వరంగల్ : తెలంగాణలో మొత్తం సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న పరిస్థితిపై వరంగల్లోని నోవా IVF సంతానోత్పత్తి నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సంతానోత్పత్తి జంటలలో వంధ్యత్వ కేసులలో స్థిరమైన పెరుగుదలను డాక్టర్ల దృష్టకి వస్తోంది.ఇలా వంధ్యత్వం పెరుగుతున్న సంఘటనలపై వరంగల్, పరిసరగ్రామీణ ప్రాంతాల్లో, 10 మంది పురుషులలో 8 మంది అసాధారణ వీర్య పారామితులను చూపిస్తున్నారని నోవా IVF వరంగల్వైద్యులు తెలిపారు. పురుషుల సంతానోత్పత్తిలో ఇదొక సవాల్ అని పేర్కొన్నారు.తెలంగాణ అంతటా విధాన నిర్ణేతలు మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఇది ఇప్పుడు 1.5 - 1.7 మధ్య ఉంటుందని అంచనాఅన్ని వయసుల స్త్రీపురుషులను వంధ్యత్వం సమానంగా ప్రభావితం చేస్తుంద న్నారు. అయితే 25-45 సంవత్సరాల వయస్సు పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ చురుగ్గా లేకపోవడం లాంటివి ఆందోళన కలిగిస్తోందన్నారు. వరంగల్ ప్రాంతంలో, 20 యేళ్ల వయసు యువకుల్లో కూడా పేలవమైన స్పెర్మ్,కౌంట్ తక్కువగా ఉంటోందని పదనిర్మాణం మరియు నిదానమైన స్పెర్మ్ చలనశీలతతో పేలవమైన స్పెర్మ్ వరంగల్లోని నోవా IVF ఫెర్టిలిటీలోని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అనిత అడబోయిన అన్నారు. " దీర్ఘకాలిక ఒత్తిడి, సూక్ష్మ కాలుష్య కారకాలకు గురికావడం, మైక్రోప్లాస్టిక్లు, ఎక్కువ పని గంటలు, ధూమపానం, మద్యపానం ,నిశ్చల జీవనశైలి, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, ఆధునిక జీవనశైలి మార్పులు, వైద్య రుగ్మతలు, అనారోగ్యకరమైన అలవాట్లు దీనికి కారణమన్నారు.నోవా IVFలో ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫెర్టిలిటీ తరచుగా వృద్ధాప్య వయస్సు గల మహిళలు గర్భధారణ ప్రణాళికలో ఆలస్యం చేయడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), తక్కువ అండాశయ నిల్వ, ఎండోమెట్రియోసిస్ మరియు వివరించలేని వంధ్యత్వం వంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. వీటిలో వివరించలేని వంధ్యత్వం 25-30% కేసులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలు 35 ఏళ్లు పైబడిన మహిళలను మాత్రమే కాకుండా 20 ఏళ్ల చివరిలో ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తాయి. జీవనశైలి మార్పులు మరియు పర్యావరణ కాలుష్య కారకాలకు గురికావడం, హార్మోన్ల అసమతుల్యత, మునుపటి శస్త్రచికిత్సలు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, తెలియని కారణాలు వంటి కారణాలు దోహదపడే మహిళలు.అయితే జంటలు కలిసి సంతానోత్పత్తి పరీక్షలు, అంటే సాధారణ వీర్య విశ్లేషణ , మహిళలకు ప్రాథమిక కటి స్కాన్ ద్వారా కారణాలను విశ్లేషించుకుని చికిత్స తీసుకోవాలని ఆమె అన్నారు. వంధ్యత్వం కూడా మధుమేహం లేదా గుండె జబ్బుల లాంటిదే. సకాలంలో చికిత్స విజయవంతమైన గర్భధారణను సాధించే అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చన్నారు. -
ఈ 4 నెలలు లగ్గాలే..లగ్గాలు : రెండు నెలల ముందే ప్లాన్
మెదక్ జిల్లా, దుబ్బాక : సరిగ్గా 80 రోజుల విరామం తర్వాత మళ్లీ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు వచ్చాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రావణమాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడంతో నేటి నుంచి నవంబర్ 26 వరకు 35 మంచి ముహూర్తాలు ఉండటంతో జోరుగా లగ్గాలు జరగనున్నాయి. వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జరగనున్నాయి. మే 25 నుంచి జులై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం శుభ ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి శోభ సంతరించుకొంది. నేటి నుంచి నవంబర్ 26 వరకు.. నేటి నుంచి నవంబర్ 26 వరకు 4 నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 26, 27, 30, 31తోపాటు ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20 తేదీల్లో, సెప్టెంబర్లో 24, 26, 27, 28వ తేదీల్లో, అక్టోబర్లో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31వ తేదీల్లో, నవంబర్లో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మొత్తం నాలుగు నెలల్లో 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా లక్షా 10 వేలకు పైగా వివాహాలు జరగనున్నాయి. సిద్దిపేటలో 40 వేలు, సంగారెడ్డిలో 45 వేలు, మెదక్ జిల్లాల్లో 25 వేలకు పైగా పెళ్లీలు జరగనున్నాయని వేదపండితులు తెలిపారు. చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!బ్యాండ్, డెకరేషన్, ఫొటోగ్రాఫర్లకు డిమాండ్వివాహాలు జరగుతుండటంతో పంతుళ్లు, బ్యాండ్ మేళాలు, టెంట్ హౌస్లు, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రాఫర్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇతర చోట్ల నుంచి తగిన సామగ్రిని, మనుషులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. పెళ్లి చేసేవారు వీటికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారు. ఇక పంతుళ్లు సైతం గ్రామాలు , పట్టణాల్లో ఎక్కువగా పెళ్లీ ముహూర్తాలు పెట్టడంతో ఇతర గ్రామాల్లోని వారి బంధువులను రప్పించుకుంటున్నారు.ముహూర్తాలను దృష్టిలో పెట్టుకుని..నాలుగు నెలల పాటు పెళ్లీలు జరగుతుండటంతో ఫంక్షన్హాల్స్కు డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పెండ్లీ ముహూర్తాలు నిర్ణయించుకున్న పెళ్లి చేసే కుటుంబాలు 2 నెలల ముందరే ఫంక్షన్హాల్స్ బుక్ చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రైవేట్ ఫంక్షన్హాల్స్ 3500కు పైగా ఉండగా ప్రభుత్వ(టీటీడీ), కమ్యూనిటీ హాల్స్ మరో 5000 కు పైగా ఉన్నాయి. దీంతో చాలా మందికి ఫంక్షన్హాల్స్ దొరక్కపోవడంతో ఇండ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో వివాహాలు చేయనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. శ్రావణమాసం ప్రారంభం కావడంతో నేటి నుంచి నవంబర్ 26 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా లక్షా 10 వేలకు పైగానే జంటలు ఒకటి కానున్నాయి. ఇప్పటికే 300 లకు పైగా పెళ్లీలకు ముహూర్తాలు పెట్టాను. 80 రోజుల విరామం తర్వాత 4 నెలలకు పైగా శుభ ముహూర్తాలు ఉండటంతో వేల కొత్త జంటలు వివాహంతో ఒక్కటవుతున్నాయి.- వేలేటి జయరామశర్మ, వేద పండితులు, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులుఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలురెండు నెలల ముందే బుక్ పెళ్లిళ్లకు ఫంక్షన్హాల్స్ రెండు నెలల ముందే బుక్ అయ్యాయి. జులై, ఆగష్టు,సెపె్టంబర్లో జరిగే వివాహాలకు ముందు జాగ్రత్తగా చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇంకా ఫంక్షన్హాల్స్ కావాలని వస్తున్నారు. కానీ, ఇప్పటికే బుక్ అయ్యాయని చెబుతుండటంతో ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. – కోమటిరెడ్డి రజనికాంత్రెడ్డి,ఫంక్షన్హాల్ యజమాని,దుబ్బాకటెంట్హౌస్లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్హౌస్ సామగ్రిని బుక్ చేసుకుండ్రు. ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. సుమారు 80 రోజులు శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం పెళ్లీ ముహూర్తాలు ఉండటంతో టెంట్హౌస్లకు గిరాకీ ఉంది. – దయాకర్రెడ్డి, టెంటుహౌస్ యజమాని -
ఇంటర్ పిల్లల్ని లొకేషన్ షేర్ చేయమంటే ఎలా? అర్థం చేసుకోరు!
సార్థక్ ఫ్రెండ్స్తో డిన్నర్కు వెళ్లాలి. వాళ్లు ఏదో కేఫ్ పేరు చెప్పారు. సాయంత్రం 7కు కలవాలి. వచ్చేసరికి తొమ్మిదిన్నర కావచ్చు. ఆ మాటే ఇంట్లో చెప్పాడు. ఇంటర్ పూర్తిచేసి బి.టెక్. జాయిన్ కాబోతున్నాడు సార్థక్.‘అయితే లైవ్ లొకేషన్ పెట్టు’ అన్నాడు తండ్రి. వాట్సప్లో లైవ్ లొకేషన్ పెడితే సార్థక్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తూ ఉంటుంది. అలా పెట్టడానికి సార్థక్కు అభ్యంతరం ఏమీ లేదు. కాని అది పెట్టినప్పటి నుంచి ప్రతి పది నిమిషాలకు దానివైపే చూస్తూ వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాక్ చేస్తూ, చెప్పిన చోట నుంచి లొకేషన్ కాస్త కదిలినా ఆందోళన పడుతూ పదేపదే తండ్రి ఫోన్లు చేస్తాడు. అదే విసుగు సార్థక్కు.‘నాన్నా... నేను చిన్నపిల్లాణ్ణా?’ అంటాడు. తండ్రి భయం తండ్రిది. నగరాల్లో తిరిగేటప్పుడు సేఫ్టీ ముఖ్యం. వాళ్లను ఒక కంట కనిపెడుతూ ఉండాలనే తప్ప సార్థక్ తప్పు పనులు చేస్తాడని కాదు. తండ్రి మనసు కొడుక్కు అర్థం కాదు. కొడుకు కోరుకుంటున్నది తండ్రికి అర్థమైనా నిస్సహాయుడు. ఇలాంటి వ్యవహార శైలే ఆడపిల్లలతో తల్లులది ఉంటుంది. వారు బయటకు వెళుతుంటే లొకేషన్ పెట్టమనడమే కాదు క్యాబ్లు, ఆటోలు తమ ఫోన్ నుంచి బుక్ చేసి ట్రాక్ చేస్తూ ఉంటారు కూడా.ఇంటర్ వయసు పూర్తయ్యిందంటే పిల్లలు పూర్తిగా తమ జాగ్రత్తలు తాము తీసుకోదగ్గ వయసుకు వచ్చినట్టే. బాధ్యత లేకుండా అతి నిర్లక్ష్యంగా ఉండే పిల్లలు తప్ప మిగిలిన అందరు పిల్లలూ జాగ్రత్తగా బయటకు వెళ్లి వద్దామనే అనుకుంటారు. ఏదైనా అవసరం వస్తే తప్పక తల్లిదండ్రుల సాయం అడుగుతారు. కాని ప్రతిసారి ప్రతి ఔటింగ్కు తల్లిదండ్రులు వెంటపడటం వారికి ఇబ్బంది కలిగించవచ్చు. లేదా సొంతగా తామే సందర్భాలను ఎదుర్కొని ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడంలో ఆలస్యం కావచ్చు. అందుకే టీనేజ్ పిల్లలను సంయమనంతో అర్థం చేసుకోవాలి.భద్రతా? లేదా స్వేచ్ఛ?భద్రత ముఖ్యం అని తల్లిదండ్రులు అనుకుంటారు. స్వేచ్ఛ ఉండాలని పిల్లలు అనుకుంటారు. రెండూ ఉంటే బాగుండని ఇరుపక్షాలు అనుకుని ఏం చేయాలో ఆలోచించడం అన్ని విధాలా మేలు. ఇవాళ రేపు నగరాల్లోనే కాదు టౌన్లలో పల్లెల్లో కూడా టీనేజ్ అబ్బాయిలతో, అమ్మాయిలతో అపరిచితులు గాని, అసాంఘిక శక్తులు గాని ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుసు. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని పిల్లలకు చె΄్పాలి. అదే సమయంలో భద్రత కోసమని తల్లిదండ్రులు చేసే హంగామా పిల్లలకు ఏమాత్రం మంచిది కాదని ఇటీవల యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రుల ఆందోళన చూసి పిల్లలు కూడా ఆందోళన పడతారని, కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు వారిలో తలెత్తుతాయని ఆ అధ్యయనం హెచ్చరించింది.రిస్క్ లేనిది ఎక్కడ?ఈ విషయమై భారతీయ సైకియాట్రిస్ట్ డాక్టర్ శుక్లా ఏమంటారంటే ‘పిల్లలు బయటకు వెళ్లి మంచి చెడు వారికై వారే తెలుసుకోనివ్వండి. రిస్క్ కొద్దిగా తీసుకుంటే మంచిదే. రిస్క్ లేనిది ఎక్కడ? ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. రిస్క్ను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో వారికి నేర్పడం తల్లిదండ్రుల విధి’ అంటారాయన. అందుకే తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండటం కంటే పిల్లల్లో చైతన్యం నింపడం, వారికి బయటి పరిస్థితులు విశదపరచడం, ధైర్యంగా వ్యవహరించడం నేర్పాలి.∙పిల్లలకు సామాజిక స్థితిగతులు అర్థం చేయించాలి. వారిచేత న్యూస్ పేపర్లు చదివించడం, వార్తలు చూపించడం చేయాలి. తద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారికి అర్థం చేయించాలి.పిల్లలు ఎక్కడికైనా వెళ్తామన్నప్పుడు మొండిగా వద్దనకూడదు. ముందుగా వివరాలన్నీ కనుక్కొని, అక్కడికి వారు ఎందుకు వెళ్తున్నారో, పనేమిటి, ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. అన్నీ విని, వెళ్లడం మంచిదే అనిపిస్తే పంపించాలి. కాదనిపిస్తే అది వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లలు ఏది చెప్పినా కొట్టిపారేయడం, వారి మీద అరవడం, చేయి చేసుకోవడం చేయ కూడదు. దానివల్ల భయం ఏర్పడి, తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. వారు చెప్పేది పూర్తిగా విని, వారితో స్నేహంగా మెలుగుతూ మంచీచెడూ చెప్పాలి.చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పే చిత్రాలు చూపించాలి. విజేతల ఆత్మకథలు, సమాజాన్ని అర్థం చేయించే పుస్తకాలు చదివించాలి. అందులోని అంశాలను వారితో చర్చించాలి. పిల్లలు బయటకు వెళ్తే ఏదో ప్రమాదం జరిగి΄ోతుందన్న ఊహ చేయకుండా, వెళ్లేచోట ఎలా మెలగాలో వారికి శిక్షణ అందించాలి. ఆడ, మగ తేడా లేకుండా అందరికీ స్వీయరక్షణ పద్ధతులు నేర్పించాలి.పిల్లల అనుమతి లేకుండా వాళ్ల ఫోన్లు చెక్ చేయడం, వారి వస్తువులు సోదా చేయడం చేయకూడదు. ఏదైనా అనుమానం ఉంటే వారిని అడిగి, వారి ముందే అలాంటివి చేయాలి తప్ప వారిని బయటివారిగా భావించి నిలదీయడం మొదలుపెడితే, వారు మరింత జాగ్త్రత్త పడి చెడుదారులు తొక్కుతారు.పిల్లల స్నేహితులెవరో, వారి తల్లిదండ్రులెవరో తెలుసుకుంటూ ఉండాలి. వారు మీ పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారో అంచనా వేస్తూ ఉండాలి. బయటెక్కడో కాకుండా మీ ఇంట్లోనే వారు ఎక్కువగా కలిసే ఏర్పాటు చేయాలి. దీనివల్ల పిల్లలకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. పిల్లల్ని అందరిముందూ అవమానించడం, అనుమానించడం, ఎందుకూ పనికి రావంటూ తిట్టడం చేయకూడదు. ఇతరులతో పోలిక తెచ్చి వారిని తక్కువ చేయకూడదు. వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో ఎదగనివ్వాలి. చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలువయసురీత్యా పిల్లల్లో వచ్చే మార్పులను గమనించి, వారితో ఆ విషయాలు నిర్భయంగా చర్చించాలి. తామూ ఆ దశ దాటి వచ్చామని చెప్తూ తమ అనుభవాలు వివరించాలి. దీనివల్ల వారిలో ఉండే అయోమయాలు దూరమవుతాయి. -
కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ (Anil Ambani) ఆస్తులపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన ప్రేమ కథ మరోసారి వార్తల్లో నిలిచింది. 1991లో అప్పటి బాలీవుడ్ నటి టీనా మునిమ్ను (Tina Munim) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాహం వెనుక పెద్ద స్టోరీనే నడించిందట. మొదట్లో అనిల్, టీనా ప్రేమకథను అంబానీ కుటుంబం (Ambani family) అంగీకరించ లేదట. అవును.. వివరాలు తెలుసుకుందాం.కేవలం నటి అన్న కారణంగానే టీనాను ఇంటి కోడలిగా తెచ్చుకునేందుకు తమ చిన్న కొడుకు అనిల్ అంబానీ -టీనాను ప్రేమను తొలుత తల్లిదండ్రులు ధీరూభాయ్ , కోకిలాబెన్ అంబానీ వ్యతిరేకించారట. కానీ ఒపిగ్గా ఎదురు చూసి, తల్లిదండ్రులను ఒప్పించుకుని మరీ తమ ప్రేమను గెలిపించుకున్నారు అనిల్ అంబానీ -టీనా మునిమ్. అంతేకాదు అన్యోన్య దాంపత్యంతో తమ ప్రేమ అమరమని నిరూపించుకున్నారు. అనిల్ టీనాను తొలుత ఎక్కడ చూశాడంటే1983లో వార్టన్లో MBA పూర్తి చేసిన తర్వాత, అనిల్ మొదటిసారిగా టీనాను ఒక వివాహంలో తొలిసార చూశాడు. తొలి చూపులోనే ఆమెపై ప్రేమ చిగురించింది. సాంప్రదాయ హిందూ వివాహంలో బ్లాక్ సారీలో ప్రత్యేకంగా కనిపించిన టీనాను అనిల్ను దృష్టిని ఆకర్షించింది. కానీ అప్పుడు వారిద్దరూ మాట్లాడుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఒక పరస్పర స్నేహితుడు వారిని ఫిలడెల్ఫియాలో పరిచయం చేశాడు.అపుడు టీనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1986లో మరోసారి టీనా మేనల్లుడు ద్వారా అనిల్ టీనా కలయిక వీరి జీవితాలను మలుపు తిప్పింది. అనిల్ ప్రపోజల్ ప్లాన్, ముఖేష్ అంబానీ ఏం చేశారంటేఅనిల్ అంబానీ పెళ్లి ప్రపోజల్ ప్లాన్తో టీనా మునిమ్ను తన తల్లిదండ్రులు ధీరూభాయ్, కోకిలాబెన్ అంబానీలకు పరిచయం చేశాడు. ఈ సందర్బంలోనే ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ అనిల్ అలా బయటికి వెళ్లగానే అక్కడే వున్న సోదరుడు ముఖేష్ టీనాకు ఆ రహస్యాన్ని చెప్పడంతో ప్రపోజల్ ప్లాన్ చెడిపోయిందట. (Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)అటు తమ చిన్న కుమారుడు ఒక నటితో ప్రేమలో ఉన్నాడని తెలిసి అంబానీ కుటుంబం ఆ సంబంధాన్ని వ్యతిరేకించింది. దీంతో అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ వేరే దారిలేక అనిల్ టీనా విడిపోవాల్సి వచ్చింది.టీనా ఇంటీరియర్ డిజైనర్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయింది. అనిల్తో సంబంధాలు దాదాపు కట్ అయిపోయాయి. ఇక్కడ అనిల్ మాత్రం ఎన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా, అన్నింటినీ తిరస్కరిస్తూ వచ్చాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయాయి. అయితే లాస్ ఏంజిల్స్లో భూకంపం రావడంతో అనిల్ పరిగెత్తుకుంటూ ప్రియురాలికి దగ్గరికి వెళ్లిపోయాడు.చదవండి: జిమ్కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్లుక్ వైరల్ మరోవైపు టీనాను వివాహం చేసుకునేందుకు అనిల్ కుటుంబం ఎట్టకేలకు ఒప్పుకుంది. కానీ టీనా అనిల్ను పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో అనిల్ గట్టిగా పట్టుబట్టడంతో ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న టీనా రెక్కలు కట్టుకుని మరీ ఇండియాలో వాలిపోయింది. అలా కుటుంబ ఆమోదంతో 1991, ఫిబ్రవరి 2న సాంప్రదాయ గుజరాతీ పద్ధతిలో వివాహం జరిగింది. ఇపుడు కోకిలాబెన్కు టీనా కూడా ఇష్టమైన కోడలు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు అనిల్-టీనా చూపించిన ఓర్పు, పట్టుదల వారి అమర ప్రేమకు చిహ్నంగా నిలిచింది. అలా మూడు దశాబ్దాలకు పైగా అనిల్-టీనా వైవాహిక జీవితం కొనసాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, జై అన్మోల్ ,జై అన్షుల్ ఉన్నారు. -
క్రీడలలో ఎథిక్స్ & లీడర్షిప్ 7వ ప్రపంచ సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం
వరల్డ్ ఫోరమ్ ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ - WFEB (World Forum for Ethics in Business)నిర్వహించిన క్రీడలలో నైతికత, నాయకత్వంపై 7వ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో శ్రీ శ్రీ రవిశంకర్ కీలకోపన్యాసం చేశారు.7వ వరల్డ్ సమ్మిట్ ఆన్ ఎథిక్స్ అండ్ లీడర్షిప్ ఇన్ స్పోర్ట్స్ సమ్మిట్లో విలువలు రాజీపడితే విజయం నిజంగా కొనసాగుతుందా లేదా అనే దానిపైనా, తీవ్ర ఒత్తిడి ఉన్న ప్రపంచంలో సమగ్రతతో గెలవడానికి ఏమి అవసరమో అనే దానిపై ఆలోచనాత్మక ఆలోచనల మార్పిడిలో క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం, విద్యాసంస్థలు, NGOలు , థింక్ ట్యాంక్ల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురితో చర్చించింది.క్రీడలలో, మీరు గెలుస్తారు లేదా మీరు ఇతరులను గెలిపించుకుంటారు" అని రవిశంకర్ తన ముఖ్యోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ రోజుల్లో యుద్ధాలు క్రీడలుగా, క్రీడలు యుద్ధాల్లా జరుగుతున్నాయని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఆటల్లో జయాపజయాలను రెండింటినీ స్వీకరించాలన్నారు. ఆట అనే చర్య ఆనందాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం సహజంగానే క్రీడలలో నైతికంగా ఉంటాం ,లేదంటే క్రీడా రంగాలు హింసాత్మకంగా మారిపోతాయన్నారు.బిడ్డ నడవడం ప్రారంభించినంత సహజంగా క్రీడలుంటాయిని మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని పడవేస్తాయన్నారు. క్రీడలు ,సంగీతం ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది ఒంటరిగా, నిరాశ, అసంతృప్తులతో బాదపడుతున్నారని ఇది ఆలోచించాల్సిన విషయమని రవిశంకర్ గుర్తు చేశారు మనం మొత్తం జీవితాన్ని ఒక క్రీడగా తీసుకోగలిగితే, ప్రపంచంలో యుద్ధం ఉండదు, గుండెల్లో మంటలు ఉండవు, అపనమ్మకం ఉండదు అని గురుదేవ్ అన్నారు"ఫుట్బాల్ నాకు స్వేచ్ఛగా మారింది," అని ఫలస్తీనియన్ మహిళల ఫుట్బాల్ జట్టు సహవ్యవస్థాపకురాలు హనీ తల్జీహ్ పంచుకున్నారు. "అది కేవలం ఆట కాదు, అది ఓ ప్రకటన. ఇది కదలడానికి, మాట్లాడడానికి, కలలు కనడానికి ఓ హక్కు.అడ్డంకులను ఛేదించడంలో , అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో క్రీడలు పోషించగల పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాలస్తీనా మహిళా ఫుట్బాల్ జట్టు మొదటి కెప్టెన్ హనీ థాల్జీ ఇలా వ్యాఖ్యానించారుఈ మధ్య కాలంలో రికార్డులు నెలకొల్పడం, ఖ్యాతిని సాధించడం అనే లక్ష్యాల్లో నైతిక ఉల్లంఘనలు తీవ్రమైన అంశంగా మారాయి. వీటి వల్ల ప్రేక్షకుల విశ్వాసం దెబ్బతింటోంది. అదే సమయంలో, క్రీడాస్ఫూర్తి, క్రీడా నైపుణ్యం మరియు నైతికత ఒక ఆట యొక్క స్ఫూర్తిని ఎలా ఉద్ధరిస్తాయి, మొత్తం తరాన్ని ఏకం చేస్తాయి మరియు ప్రేరేపిస్తాయి అనేదానికి తగినంత ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.క్రీడలు శాంతిని నెలకొల్పడానికి ఒక సాధనంగా, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, గరిష్ట పనితీరు మరియు దీర్ఘాయువు మరియు క్రీడలలోనే కాకుండా జీవితంలో మరియు నాయకత్వంలో ఉత్తమంగా ఉండటానికి ఏమి అవసరమో అనే దానిపై సమ్మిట్లో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి. ఫెయిర్ ప్లే, టీమ్ స్పిరిట్ ,ఓర్పు వంటి రంగాల నుండి పాఠాలు రాజకీయాలు మరియు వ్యాపారంలో నైతిక నాయకత్వాన్ని ఎలా రూపొందిస్తాయో కూడా సదస్సులో చర్చకు వచ్చింది.ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన 17 ఏళ్ల కామ్య కార్తికేయన్; ఒలింపిక్ బంగారు పతక విజేత, 400 మీటర్ల హర్డిల్స్లో మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్ కెవిన్ యంగ్; ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులైన స్వ్యటోస్లావ్ యురాష్; పాలస్తీనా ఫుట్బాల్ మార్గదర్శకుడు హనీ థాల్జీ; యూరో '96 ఛాంపియన్, టీవీ పర్సనాలిటీ థామస్ హెల్మెర్; ఆసియా క్రీడలలో స్వర్ణం గెలుచుకున్న భారతదేశపు తొలి మహిళా గుర్రపు స్వారీ దివ్యకృతి సింగ్ ఇతర ప్రముఖ వక్తలలో ఉన్నారు.క్రీడా స్ఫూర్తి మరియు నైతికతలో ఒక ప్రమాణాన్ని నిర్దేశించే ప్రదర్శనలను ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డులతో సత్కరించింది. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ జెర్డాన్ షకీరికి 'క్రీడ ద్వారా ఏకీకరణ, న్యాయబద్ధత, అంతర్ సాంస్కృతిక సంభాషణకు అతని దీర్ఘకాల నిబద్ధత' కోసం అత్యుత్తమ వ్యక్తిగత అవార్డును ప్రదానం చేశారు. క్రీడలలో మానసిక ఆరోగ్యానికి అత్యుత్తమ సహకారం మానసిక ఆరోగ్యం, క్రీడలో న్యాయబద్ధత , యువ మహిళా అథ్లెట్లకు మద్దతు కోసం ఆమె వాదనకు గాను ఎలైట్ స్విస్ రోవర్ జీనిన్ గ్మెలిన్కు లభించింది.ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగిన వరల్డ్ ఫోరం ఫర్ ఎథిక్స్ ఇన్ బిజినెస్, రెండు దశాబ్దాలకు పైగా నైతిక వాదనలో ముందంజలో ఉంది. శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికత ప్రకారం, విలువలు పనితీరు విరుద్ధమైనవి కావు.అవి విడదీయరాని మిత్రులు అనే సందేశాన్ని ప్రచారం చేయడానికి WFEB యూరోపియన్ పార్లమెంట్, FIFA, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ మరియు జెనీవాలోని UN వంటి ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉందని నిర్వాహకులు ప్రకటించారు. -
World IVF Day 2025: ఐవీఎఫ్ అంటే..? ఎలాంటప్పుడు ఈ చికిత్స..
వివాహమైన ప్రతీ స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే ఆ యోగ్యత కొందరికి మాత్రం లభించడం లేదు. ఇందుకు ఆమెలో కొన్ని అనారోగ్య కారణాలు, లేదా భర్తలో ఏదైనా లోపమైనా ఉండొచ్చు. వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తూ మహిళలు గర్భం దాలుస్తున్నారు. అమ్మ కల నెరవేర్చుకుంటున్నారు. ఐవీఎఫ్ విధానం ద్వారా చికిత్స తీసుకుంటున్నారు. నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.పెరుగుతున్న సంతానలేమి సమస్య ఇటీవల ఉమ్మడి జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆసంఖ్య 20శాతం వరకు ఉంటోంది. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని గర్భం దాలుస్తున్నారు. కొందరు మాత్రం మూఢ నమ్మకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కాలానుగుణంగా ఇప్పుడు వైద్యంపై అవగాహన పెరిగింది. గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతాన సాఫల్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో కూడా అలాంటి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో మహానగరాల్లో అందించే వైద్యసేవలు ఇక్కడ అందిస్తున్నారు. కరీంనగర్లో పదికి పైగా ఫెర్టిలిటీ కేంద్రాలు (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం రోజూ 30 నుంచి 40 మందిదాకా చికిత్స కోసం వస్తుంటారు. సంతానలేమికి కారణాలివే.. ఇటీవల యువతీ యువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీంతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, మహిళల్లో పీసీఓడీ (అండాశయంలో తిత్తులు), రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం తదితర కారణాలతో సంతానలేమి సమస్య కలుగుతుంది. ఐవీఎఫ్ అంటే..చాలామంది సంతానం లేనివారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఐవీఎఫ్ పద్ధతి గురించి వారికి అవగాహన ఉండదు. ఈ పద్ధతిలో బిడ్డను జన్మనివ్వాలి అనుకునే దంపతులు ముందుగా దాని గురించి అవగాహన ఉండాలి. అప్పుడే భవిష్యత్లో వారి మధ్య అపోహలు తలెత్తకుండా ఉంటాయి. సాధారణంగా స్త్రీ గర్భధారణ కలగాలంటే మగవారి వీర్యకణాలు ఆడవారి అండంతో కలవాలి. అది పిండంగా రూపాంతరం చెందుతుంది. ఈ విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఐవీఎఫ్ విధానంలో ల్యాబ్లో అండకణాలను సంగ్రహించడం చేసి స్పెర్మ్ నమూనాను మెరుగుపరుస్తారు. ఐవీఎఫ్ ఎప్పడు అవసరమంటే..సాధారణంగా సంతానం లేనివారికి ఐవీఎఫ్ అవసరం లేదు. ముందుగా వైద్యులను సంప్రదించి సమస్యను వివరించాలి. దీన్ని బట్టి ముందుగా సహజసిద్ధంగా గర్భం దాల్చేలా తగిన చికిత్స, ఔషధాలు అందిస్తారు. సహజ సిద్ధంగా గర్భధారణ కలిగేందుకు అవకాశం లేకుండా ఉన్నవారికి మాత్రమే ఐవీఎఫ్ చికిత్స ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఆడవారిలో ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినప్పుడు, అండకణాలు తక్కువగా ఉన్నప్పుడు, అండాశయ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారికి, క్యాన్సర్ రోగులు, మగవారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా, పూర్తిగా లేనప్పుడు ఐవీఎఫ్ చికిత్స అవసరం ఉంటుంది.అపోహలు వద్దు1978 జులై 25న ఇంగ్లండ్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అనే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో జన్మించిన మొదటి బిడ్డ లూయీస్ బ్రౌన్ అయ్యారు. ఈ విజయానికి గుర్తుగా ఏటా జులై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డేగా జరుపుతారు. ఇప్పటికీ చాలామందికి ఐవీఎఫ్ అంటే తెలియని భయం. సంతానం కలిగేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తాం.– డాక్టర్ రేఖారాణి, రేఖాసాగర్ ఐవీఎఫ్ సెంటర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 30 ఏళ్లు దాటిన మహిళలకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 8 మిలియన్ల మందికి పైగా జన్మించారు. అయితే ఐవీఎఫ్పై చాలామందికి అపోహలున్నాయి. ఐవీఎఫ్లోనూ ఐసీఎస్ఐ, ఐవీఎం, ఎగ్ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, ప్రీ ఇంప్లాంటేషన్, జనటిన్ టెస్ట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. ఐవీఎఫ్లో ఇచ్చే మందులతోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. – డాక్టర్ రజని ప్రియదర్శిని, రజని ఫెర్టిలిటీ సెంటర్(చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!) -
తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!
సాధారణంగా ఏడో నెల్లోనే శిశువులు పుట్టడం గురించి వినే ఉంటాం. వాళ్లను ప్రి మెచ్యూర్ బేబీలుగా పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సాధారణంగా 32 నుంచి 37 వారాల మధ్య పుడితే ప్రిమెచ్యూర్ అంటారు. అదే 28 నుంచి 32 వారాల మధ్య అయితే వెరీ ప్రిమెచ్యూర్ అంటారు. ఇవేమి కాకుండా అంతకు మించి.. 28 వారాలకు ముందుగానే ప్రసవించిన శిశువుని ఎక్స్ట్రీమ్ ప్రిమెమెచ్యూర్ బేబి అంటారు. ఇలాంటి శిశువులు చాల రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వాళ్లని కాపాడటం వైద్యులకు అత్యంత సవాలుగా ఉంటుంది. అలా పుట్టి బతికి బట్టకట్టి రికార్డు నెలకొల్పి సెలబ్రిటీ హోదాను అందుకున్నాడు ఈ వండర్ కిడ్. అంతకుమునుపు ఉన్న శిశువు పేరిట రికార్డుని ఒక్క రోజు తేడాతో బ్రేక్ చేసీ ఈ ఘనతను అందుకున్నాడు. అమెరికాలోని అయోవా నగరంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అయోవ నగరంలో జూలై 05, 2024లో మోలీ, రాండాల్ కీన్ అనే దంపతులకు నాష్ కీన్ అనే మగ శిశువు జన్మించాడు. ప్రసవ తేదీకి ముందుగా 133 రోజులు అంటే సుమారు 19 వారాల ముందు జన్మించాడు. తల్లిదండ్రుల సైతం అతడి అనూహ్య జననానికి నివ్వెరపోయారు. తమ బిడ్డ బతుకుతాడా లేదా అన్న ఆశ నిరాశల మధ్య తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు. ఆ చిన్నారి పుట్టినప్పడు కేవల 10 ఔన్సులు బరువుతో జన్మించాడు. చెప్పాలంటే ద్రాక్షపండంతా పరిమాణం. నాష్ పొటాటోగా పిలిచే ఆ శిశువుకి అయోవా చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉంచి అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించింది. అక్కడే ఆరు నెలల వైద్య సంరక్షణలో ఉన్నాడు. పాపం ఆ తల్లిదండ్రలు తమ బిడ్డ తమకు దక్కుతాడా లేదా అన్న భయంతో కాలం వెళ్లదీశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి వారి బిడ్డ బతికిబట్టకట్టడమే గాక ఈ ఏడాది తొలిపుట్టిన రోజు జరుపుకున్నాడు. అప్పటి వరకు ఆ శిశువు ఆస్పత్రిలో మానిటర్లు, వైర్లు మధ్యే గడిపాడు. ఈ చిన్నారి నాష్ 20 వారాల ప్రినేటల్ చెకప్ అనంతరం డెలివరీ చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడిందని నాటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది తల్లి మోలీ. అలా మొత్తం ఆరు నెలల చికిత్స అనంతరం 2025 జనవరి ప్రారంభంలో ఇంటికి వెళ్లేందుకు అనుమతి లభించినట్లు తెలిపారామె. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటుం సాధారణ చిన్నారిలా రూపుదిద్దుకున్నాడని అన్నారు. అయినప్పటికీ..ఆ శిశువుకి ప్రత్యేక వైద్య సహాయం తప్పనిసరి. ఎందుకంటే అతనకు ఇంకా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, స్వల్ప వినికిడి సమస్య, ఫీడింగ్ ట్యూబ్ ఉంది. ప్రతి నెల ప్రత్యేక వైద్య డేకేర్కి వెళ్లి చికిత్స తీసుకుంటుంటాడు. "అసలు ఇలా ఇంతముందు జన్మించాడే అనే ఆ రోజు తల్లడిల్లా. బహుశా అదే వాడికి సెలబ్రిటీ హోదాని అచ్చి అందరి ఆశీర్వాదం పొందేలా చేసిందని భావోద్వేగంగా చెబుతోంది". ఆ చిన్నారి తల్లి. కాగా, 2020లో అలబామాలో 21 వారాల్లో జన్మించి ఒక చిన్నారి గిన్నిస్ రికార్డులకి ఎక్కగా..దాన్ని కేవలం ఒక్క రోజు తేడాతో ఈ చిన్నారి నాష్ బ్రేక్ చేసి రికార్డునే తిరగరాశాడు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్ మనదేశంలోనే..! రోజుకి ఏకంగా..) -
పూల సాగు.. ఆదాయం బాగు
సంప్రదాయ పంటలతో నిత్యం నష్టపోతున్న రైతులు ఇప్పుడు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. కొత్తరకం పూలసాగులో అధిక లాభాలు వస్తుండడంతో వీటిపై రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఆడి నెలల్లో మార్కెట్లో పూలకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు పూల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చెరుముందరకండ్రిగ గ్రామంలో విరివిగా పూలు సాగు చేస్తున్నారు. –పాలసముద్రంచెరుముందరకండ్రిగ గ్రామంలో 200 పైగా కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలు కష్టపడి పంటలు సాగు చేసి ముందుకు ఎదుగుతున్నారు. రైతులు వరి, చెరకు పంటలు సాగు చేసి అప్పుల పాలైపోయారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడి భూముల్లో వివిధ రకాల పూల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బంతి, నాటు చామంతి, మల్లిపూలు, కనకాబరం సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది హైబ్రీడ్ వెల్వెట్, హైబ్రీడ్ చామంతి, కొత్తగా పసుపు, తెలుపు రంగుల గులాబీ పూలను సాగు చేస్తున్నారు. ఉదయం తోటలోని పూలను కూలీలతో కోసుకుని తమిళనాడులోని తిర్తుతణి, వేలూరు, చైన్నై మార్కెట్లకు తీసుకెళ్లుతున్నారు. ఇలా చేయడంతో పూలకు మంచి గిరాకీ ఉన్నప్పుడు వ్యాపారస్తులే తోట వద్దకు వచ్చి ముందుగా అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు. ఇలా మండల పరిధిలో శుభ కార్యాలయాలకు కూడా ఇక్కడకు వచ్చి పూలను తీసుకెళ్తున్నారు. పూల సాగుతోనే చెరుముందరకండ్రిగ గ్రామ రైతులు లాభాల బాటలో నడుస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఇక్కడ సాగు చేసిన పూలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పండుగ సీజన్లో బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులే ఇక్కడికి వస్తున్నారు. తోటల వద్దనే కొనుగోలు చేసి తీసుకెళ్లుతారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో మరిన్ని కొత్తరకం పూలు సాగు చేయడానికి గ్రామంలో రైతులు ఆసక్తి చూపుతున్నారు.మార్కెట్లో మంచి గిరాకీ ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న పూలనే ఎంచుకుని సాగు చేస్తున్నారు. హెబ్రీడ్ చామంతి, వెల్వెట్ సాగుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. మ్యారీగోల్డ్, మ్యారీ పింక్ సాగుకు ఎకరానికి రూ.90 వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఎకరా భూమికి 10 నుంచి 12 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేలు నుంచి రూ.29 వేలు, బాడుగతో సహా రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఎరువులు, దుక్కులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు కలుపుకుంటే గరిష్టంగా రూ.50 వేల నుంచి రూ.90 వేలు వరకు ఖర్చు అవుతుంది. మంచి దిగుబడి వస్తే ఎకరానికి ఐదు టన్నుల పూలు కాస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో హైబ్రీడ్ చామంతి, గులాబీ పూల ధరలు కిలో రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మల్లెలు, కాకడ పూలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది, కనకాంబరం కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ధరలు పలుకుతున్నాయి. దీపావళి, ఆడి నెల, కార్తీక మాసాల్లో పూల ధరలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్లో కిలో పూలు రూ.150 వరకు పలుకుతాయి. మల్లెల సాగుతో లాభాలు చెరుముందర కండ్రిగలో ఎకరా మల్లెపూల తోట సాగు చేశాను. ఖర్చు రూ.50 వేలు అవుతుంది. ఆదాయం లక్షన్నర వస్తుంది. ప్రతి రోజు పూల తోటలో పూలు కోసుకుకెళ్లి తిరుత్తణి, చెన్నై మార్కెట్కు ఎగుమతి చేస్తున్నాను. కిలో మల్లెమొగ్గలు రూ.65 నుంచి రూ.75 ధర పలుకుతాయి. రోజుకి సుమారు 25 కిలోల పూలు తీసుకెళ్లుతాను. రోజు కూలీకి పోను రూ. వెయ్యి వస్తుంది.–వడివేలురెడ్డి, చెరువుముందర కండ్రిగ మ్యారీగోల్డ్, గులాబీ సాగు చేస్తున్నాం మాకున్న భూముల్లో మ్యారీగోల్డ్, గులాబీ పూల తోట సాగు చేస్తున్నాను. రెండు బోర్లు వేశాను. నీరు రాకపోవడంతో వరి, చెరకు సాగు చేయకుండా ఉన్న తక్కువ నీటిలోనే ఎకరాకు పైగా పూలు సాగు చేస్తున్నా. ఆదాయం బాగానే వస్తుంది. కొత్తరకం పూలు సాగు చేస్తే తోట వద్దకే వ్యాపారులు వచ్చి పూలను తీసుకెళ్లుతారు. మాగ్రామంలో ప్రతి ఒక్కరు పూల సాగుపైగా ఆధారపడి ఉన్నాం. –మత్యాలురెడ్డి, చెరువుముందరకండ్రిగపూల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం మండలంలో అన్ని గ్రామాల్లో పూల తోటల సాగుపై హారి్టకల్చర్, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. అయితే చెరుముందరకండ్రిగ గ్రామంలోని రైతులు పూలతోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా వివిధ రకాల పూలతోటలు సాగు చేసి, ఆదాయం పొందుతున్నారు. –ఢిల్లీప్రసాద్, మండల వ్యవసాయాధికారి -
ఇదో నిజాయితీ పెట్టె కథ!
పిల్లలకు మనం చిన్నప్పుడు ఏది మంచిదని చెబితే దాన్నే పాటిస్తారు. విలువలు నేర్పితే మంచి పౌరులుగా ఎదగి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్ద సామెత చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన నిజాయితీ పెట్టె ద్వారా పిల్లలు నిజాయితీగా, నైతిక విలువలతో మసలుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల బడిలో ఓ నిజాయితీ పెట్టె ఉంది. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, రేజర్లు, చాక్లెట్లు, నోట్బుక్స్ ఉంటాయి. అవరసమైన పిల్లలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని దానిపై నిర్ణయించిన ధర చెల్లించాలి. నిజాయితీతోపాటు లెక్కలు వస్తాయి ఈ పెట్టె కారణంగా చిన్నప్పటి నుంచే పిల్లలు విలువలతో పాటు లెక్కలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడింది. బడిలో చోరీ చేయాల్సిన పని లేకుండా పోయింది. వారు కొనుక్కున్న వస్తువులకు ఎంత డబ్బు చెల్లించాలి, ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలింది అనే విషయం వారు అనుభవంతో తెలుసుకుంటారు. తద్వారా నిజ జీవితంలోనూ అవసరమై లెక్కలు నేర్చుకుంటున్నారు. పెట్టెలోని వస్తువులను డబ్బు లేకున్నా పొంది ఆపై ఉన్నప్పుడు డబ్బు కట్టవచ్చు. దీంతో లావాదేవీలు నీతిగా ఉండాలనే తలంపు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడుతోంది.టీచర్ విన్నూత్న ఆలోచనతో సాకారం ఇదే బడికి చెందిన తులసీనాథం నాయుడు అనే టీచర్ రూ.2 వేలు పెట్టి పిల్లలకు అవరసమైన వస్తువులను ఈ పెట్టెలో పెట్టారు. ఆపై ఇందులోని అవసరమైన వస్తువులను పిల్లలు కొనడం మొదలు పెట్టారు. ఇలా నెలంతా వసూలైన మొత్తంతో ఆ టీచర్ మళ్లీ వస్తువులను బాక్సులో నింపడం చేస్తున్నారు.పరాయి సొమ్ము పామువంటిదని తెలిసింది మా స్కూల్లో నిజాయితీ పెట్టె ఉంది. మాకు అవరసమైన వస్తువులను తీసుకుని నిర్ణయించిన ధర మేరకు డబ్బును సార్కు ఇస్తున్నాం. దీంతో బడిలో ఎలాంటి చోరీలు లేకుండాపోయాయి. మాకు లెక్కలు బాగా అర్థమవుతున్నాయి. పరుల సొమ్ము పాము వంటిందని బాగా తెలిసింది. డబ్బులు లేకున్నా కావాల్సిన వస్తువులను పెట్టెలో తీసుకుని ఆపై డబ్బును ఇవ్వడం కూడా నిజాయితీనే కదా అనే విషయం అర్థమైంది. – భానుప్రియ, నాలుగో తరగతి విద్యార్థినిమొక్కై వంగనిది మానై వంగునా.. చిన్నప్పటి నుంచి పిల్లలకు మానవ విలువలు, నీతి, నిజాయితీ గురించి చెబితే పెద్దయ్యాక కూడా అలాగే నడుస్తారు. నేను తొలుత ఇదే మండలంలోని కంచిరెడ్డిపల్లి బడిలో నిజాయితీ పెట్టెను ఏర్పాటుచేశాను. పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో నేను ఏ బడికి వెళ్లినా అక్కడ నిజాయితీ పెట్టెను పెడుతున్నా. తద్వారా పిల్లల్లో నిజాయితీ, మంచితనం అలవాటుగా మారింది. పెద్దలు చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా.. – తులసీనాథం నాయుడు, టీచర్ -
900 రకాల మొక్కలు, పక్షులతో ఆ ఇల్లు సస్యరాశుల పొదరిల్లు
సాక్షి,బళ్లారి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్కలు నాటి చెట్లు పెంచాలని పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వం కూడా ఎన్నో ఏళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే నేటికీ ఇంటింటా చెట్ల పెంపకం మాట నోటి మాటలకే పరిమితం అవుతోండగా దావణగెరె నగరంలో ఓ వ్యక్తి ఏకంగా 900 వరకు వివిధ రకాల మొక్కలు, చెట్లు, పూలు, పండ్ల చెట్లు పెంచుతూ ఆ ఇంటిని నందనవనంగా, పచ్చదనం వెల్లివెరిసే స్వర్గసీమగా తీర్చిదిద్దాడు. ఆ ఇల్లు పూలు, పండ్ల మొక్కలుతో అలరాలుతున్న అద్భుతమైన పచ్చదనం, ఆహ్లాదం, వినోదం కలిగించే ఇల్లుగా కీర్తి పొందింది. రాష్ట్రంలోనే కాకుండా బహుశా దేశంలో ఓ ఇంట్లో ఇంత పెద్ద స్థాయిలో చెట్లు, మొక్కలు, పూలు, పక్షులు పెరుగుతున్న ఇల్లు ఇదే అన్నా ఆశ్చర్యపోనక్కర లేదేమో. ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టిన వెంటనే ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇంటి ఆవరణ ఒకటే అనుకుంటే పొరపాటే. ఇంటి ఆవరణ నుంచి మొదలుకొని హాలులోకి అడుగుపెట్టిన తర్వాత తలుపు చుట్టూ పచ్చదనమే. ఎక్కడ చూసినా పచ్చదనమే హాలులో ఎక్కడ చూసినా పూలమొక్కలు, వివిధ రకాలైన చెట్లు ఉన్నాయి. హాలే కాదు వంట గదిలో కూడా పచ్చదనమే, వంటగదే కాదు, పడక గది, పై అంతస్తులోకి వెళ్లే మెట్లు ప్రతి అడుగు తీసి అడుగు వేసినప్పుడు ఒక్కో మెట్టు వద్ద వివిధ రకాలైన పూలకుండీలు, సువాసన వెదజల్లే పూలను తాకుకుంటూ పైగదికి వెళ్లాల్సిందే. అలాగే చివరకు వాష్రూం కూడా పచ్చదనంతో కనిపిస్తుందంటే ఆయన ఆ ఇంటిని ఎలా పచ్చదనంతో కాపాడుకుని వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దావణగెరె నగరంలోని ఎస్ఎస్ లేఅవుట్ ఏ బ్లాక్లో ప్రొఫెసర్ శిశుపాల్ ఇల్లు అంటే ఆ వీధిలోనే కాదు దావణగెరెలోనే పేరుగాంచింది. దావణగెరె బెణ్ణెదోసెకు కర్ణాటక వ్యాప్తంగా ఏవిధంగా పేరుగాంచిందో అదే తరహాలో కర్ణాటకలో ప్రొఫెసర్ శిశుపాల్ ఇల్లు కూడా పచ్చదనంతో వెల్లివిరుస్తోందనే చర్చ సాగుతోంది. ఇంటి బయట పెద్ద పెద్ద చెట్లను పెంచుతుండగా, ఇంటి ఆవరణ, లోపల వివిధ గదుల్లో ఆయా గదులకు అనుగుణంగా మొక్కలు, పూల చెట్లు పెంచుతున్నారు. పూల చెట్లు, వివిధ రకాల మొక్కలతో పాటు పక్షులు కూడా ఆ ఇంట్లో పెరుగుతున్నాయి. వివిధ రకాల పక్షులకూ ఆవాసం వివిధ రకాలైన 20కి పైగా జాతుల పక్షులు నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం వేశాయి. పక్షులకు కావాల్సిన పండ్లు, పూలు, ఆహారం ఇంటి ఆవరణ, లోపల దొరుకుతుండటంతో పక్షులు కూడా ఎంతో ఆనందంగా ఉంటూ చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుండం విశేషం. సువాసలు వెదజల్లే లిల్లి, మల్లెపూలు, గులాబీ, సంపంగి, పారిజాత, చామంతి, చెండుపూలు తదితర 120కి పైగా పూల మొక్కలను పెంచుతున్నారు. పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు అక్కడే పూల తోట కూడా పెరుగుతుండటంతో వాటితోనే పూజలు చేస్తున్నారు. ఆ ఇంట్లో చెట్లు, మొక్కలను కాపాడుకునేందుకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు వృథాగా పోకుండా పెద్ద ట్యాంకు ఏర్పాటు చేసి వాటిని నిల్వ చేసి మొక్కలకు సరఫరా చేస్తుండటం ద్వారా పచ్చదనాన్ని సంరక్షిస్తున్నారు. పనివేళలు ముగిసిన తర్వాత ఆయన ఆ ఇంటి పచ్చదనాన్ని కాపాడు కోవడానికి పూర్తి సమయం కేటాయిస్తారు. ప్రొఫెసర్ శిశుపాల్తో పాటు ఆయన సతీమణి పద్మలత కూడా పూర్తి సహకారం అందించడంతో ఆ ఇంటిని స్వర్గధామంగా మలిచారు. చదవండి : Sravana Masam 2025 రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే పర్యాటక కేంద్రంగా మారిన వైనం ఆ ఇంట్లో వారికే కాకుండా విద్యార్థులకు, సందర్శకులకు పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున వచ్చి వీక్షించి వెళుతుంటారు. జనంతోపాటు విద్యార్థులకు అదొక మంచి సందర్శన, పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సెలవు రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు అక్కడికి వచ్చి గంటల తరబడి ఆ చెట్లు, మొక్కలు, పూలతోటలను వీక్షించి వాటి పేర్లు రాసుకుని, ఎక్కడ నుంచి తెప్పించుకుని ఇలా పెంచారన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికుడుగా గుర్తింపు పొందిన శిశుపాల్ ఎంతో శ్రమించి తీర్చిదిద్దిన ఇల్లు దావణగెరెకే వన్నె తెస్తోంది. ఈసందర్భంగా స్థానికులు, విద్యార్థులు మాట్లాడుతూ శిశుపాల్ ఇంటిని చూసిన తర్వాత తాము కూడా తమ ఇంటి వద్ద కనీసం అందులో ఒక శాతమైన పచ్చదనం పెంపొందించు కోవాలని భావిస్తున్నామన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తే ఇంటింటా చెట్లు కాదు, ఊరంతా నందనవనంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం -
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్ మనదేశంలోనే..! రోజుకి ఏకంగా..
కట్టెలు లేవు, కిరోసిన్ లేదు, ఎల్పీజీ లేదు కేవలం సూర్యుడి శక్తి తప్ప. ఒక్క చుక్క గ్యాస్ లేదా విద్యుత్తును ఉపయోగించకుండా ఆ కిచెన్ ఏకంగా 50 వేల మందికి వంట చేస్తోంది. అసాధ్యం అనిపిస్తుందా? అదేదో విదేశాల్లోనో, అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలలోనో కాదు. మన ఇండియాలోనే జరుగుతోంది. మన దేశంలోని ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఇది ప్రతిరోజూ కనిపించే దృశ్యం. అక్కడ ఏర్పాటు చేసిన సౌరశక్తి ఆధారిత వంటగది ప్రపంచ స్థాయిలో రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచానికి క్లీన్ ఎనర్జీ సత్తాను చాటుతోంది. .బ్రహ్మ కుమారీల శాంతివన్ కాంప్లెక్స్లోని ఆరావళి కొండలలో ఎత్తయిన చోట ఏర్పాటు చేసిన ఈ భారీ సెటప్ వేల సంఖ్యలో వేడి, పోషకమైన, శాఖాహార భోజనాలను వండడానికి సూర్యుని శక్తిని ఉపయోగిస్తుంది. ఈ వంటగది సౌర ఫలకాలతో కాకుండా సౌర ఉష్ణ శక్తిపై నడుస్తుంది. అంటే సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి బదులుగా, ఇది సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి వేడిని ఉత్పత్తి చేయడానికి అద్దాలను ఉపయోగిస్తుంది. చాలా వరకు రిఫ్లెక్టర్లు రోజంతా సూర్యుడిని అనుసరించే తిరిగే ఫ్రేమ్లపై అమర్చబడి ఉంటాయి. ఈ కదలిక వారికి పొద్దుతిరుగుడు పువ్వుల మాదిరిగానే గరిష్ట సౌర శక్తిని సంగ్రహించడానికి సహాయపడుతుంది!ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది..సూర్యకాంతి రిఫ్లెక్టర్ కేంద్ర బిందువును తాకినప్పుడు, ఉష్ణోగ్రతలు 800డిగ్రీల వరకు పెరగవచ్చు – అది సీసం కరిగించేంత వేడిగా ఉంటుంది!. ఈ తీవ్రమైన వేడిని ఆవిరిగా మార్చి ఉపయోగిస్తారు. అదే వంటగదికి శక్తినిస్తుంది. ప్రతి రిఫ్లెక్టర్ సాంద్రీకృత కాంతి ప్రత్యేకంగా రూపొందించిన 42 స్టీల్ రిసీవర్లపైకి మళ్ళించబడుతుంది. ఇవి వేడిని గ్రహించి నీటిని ఆవిరిగా మారుస్తాయి. దాంతో ప్రతిరోజూ 3,500 కిలోగ్రాములకు పైగా ఆవిరి ఉత్పన్నమవుతుంది.ఆహారం ఎలా వండుతారంటే...ఆవిరిని ఆరు ఇన్సులేట్ చేసిన హెడర్ పైపుల ద్వారా సేకరించి సెంట్రల్ స్టీమ్ డ్రమ్లోకి పంపుతారు. ఇక్కడి నుంచి, ఇది వంటగది లోపల ఉన్న భారీ వంట పాత్రలలోకి పంపిణీ అవుతుంది అలా బియ్యం, పప్పులు, కూరలు వండేందుకు ఇక్కడ ఇది ఉపకరిస్తుంది. ఎటువంటి నిప్పు ఉద్గారాలు లేకుండా పాత్రలను కడగడం క్రిమిరహితం చేయడం ఇలా ప్రతిదీ శుభ్రంగా సమర్ధవంతంగా జరుగుతుంది. ఇది కేవలం అద్దాల ప్యాచ్వర్క్ కాదు. మొత్తం వ్యవస్థ సెమీ–ఆటోమేటెడ్. ప్రతి సాయంత్రం ఫోటోవోల్టాయిక్–శక్తితో పనిచేసే మోటారు టైమర్ సిస్టమ్ రిఫ్లెక్టర్లను రీసెట్ చేస్తుంది. కాబట్టి అవి మరుసటి రోజు మళ్ళీ సూర్యుడిని ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. డీజిల్ బ్యాకప్ వ్యవస్థ (వర్షాకాలంలో మాత్రమే ) వల్ల మేఘావృతమైన రోజులు వర్షంలో కూడా, వంటగది ఆగదు. ఈ వ్యవస్థ 1998లో మొదటిసారి పూర్తిగా ప్రారంభించబడినప్పుడు, రోజుకు 20,000 భోజనాలను వండడానికి అనేది ఉద్ధేశ్యం కాగా మౌలిక సదుపాయాలను విస్తరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరిన్ని మాడ్యూల్లను జోడించడం ద్వారా ఇది త్వరగా అంచనాలను అధిగమించింది. నివాసితులు, స్వచ్ఛంద సేవకులు, అతిథులు విద్యార్థులు ఇలా విభిన్న వర్గాలకు కలిపి ఈ వంటగది ఇప్పుడు ప్రతిరోజూ 50,000 మందికి సేవలు అందిస్తుంది. అది ప్రతిరోజూ సూర్యకాంతితో మొత్తం స్టేడియంకు ఆహారం ఇవ్వడంతో సమానం అందుకే దీనిని బిబిసి వరల్డ్ సర్వీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వంటగదిగా పేర్కొంది.(చదవండి: 17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు..! ఎలాంటి శిక్షణ లేదు కేవలం..) -
‘ఇక్సీ’తో.. ఇన్ఫెర్టిలిటీ ఫిక్స్..!
ఫెర్టిలిటీ సమస్యలకు ప్రత్యామ్నాయం టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇది మానవ జీవితాన్ని గట్టిగానే ప్రభావితం చేస్తోంది. మానవ మనుగడకు తోడ్పాటునందిస్తోంది.. కాలుష్యం, రసాయనాల ప్రభావంతో పాటు తీవ్ర ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంతానోత్పత్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. దీనికి పరిష్కారంగా అనేక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగినది ఐవీఎఫ్ పద్ధతి. చదువులు, ఉద్యోగాలు, భారీ జీతాల కోసం భారీ లక్ష్యాలతో వివాహ వయసు దాటిపోతోంది. దీంతో గతంలో మహిళలనే ఇబ్బంది పెట్టిన ఇన్ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా సగటున 50 శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్త వయసులోనే పురుషులు శుక్ర కణాలను, మహిళలు అండాలను భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చేసింది. మారుతున్న కాలంలో పాటే అధునాతన చికిత్సలు అందుబాలోకి వచ్చేశాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి వేధించే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారంగా ఎంబ్రియో ఫ్రీజింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన మన నగరంలోనూ ఈ వెసులుబాటు వచ్చేసింది. శుక్ర కణాలు, ఎగ్ (జీవ కణం) క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులూ లేనివారు యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటిని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని ఐదు నుంచి పదేళ్లలో ఎప్పుడైనా గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. దీంతో విద్య, ఉద్యోగం వంటి కారణాలతో అనేక మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఐవీఎఫ్ కేంద్రాలకు క్యూ కట్టేవారు.. దీనికి పరిష్కారంగా అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడంతో ఫ్రీజింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 40 శాతం దంపతుల్లో సంతాన సమస్యలు..ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడి, సంపాదన, లైఫ్స్టైల్, కుటుంబ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, మైక్రో ప్లాస్టిక్, హార్మోన్ల సమతుల్యత, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, రక్త సంబందీకులను పెళ్లి చేసుకోవడం, జన్యుపరమైన, ఇతర సమస్యలతో సుమారు 40 శాతం కొత్తగా పెళ్లైన జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో పురుషుల్లో 50 శాతం మందిలో, 45 శాతం మంది స్త్రీలల్లో పునరుత్పత్తి సమస్యలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలోనూ సమస్యలు ఉన్న జంటలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం ఉంటున్నాయి. ఈ సమయంలో కొంత మంది మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. 30 ఏళ్లు వయసుగల వారిలో ఐవీఎఫ్ పద్దతులు సుమారు 60 శాతం నుంచి 70 శాతం సక్సస్ రేటు ఉండగా, ఆపై వయసున్న వారిలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. జీవ కణం పదేళ్లు..ఆరోగ్య రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతున్న హైదరాబాద్ సంతాన సమస్యలకు చెక్ పెట్టే అధునాతన పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కంటే అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచి్చంది. దంపతుల నుంచి సేకరించిన ఎగ్స్, శుక్రకణాలను ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద పిండాన్ని (జీవ కణం) తయారు చేస్తారు. ఐదు నుంచి ఆరు రోజుల్లో పిండం సిద్ధమైపోతుంది. ఇలా తయారు చేసిన పిండాన్ని పదేళ్లలోపు ఎప్పుడైనా మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైరల్ మార్కర్ టెస్టులు.. పెళ్లికి ముందు, లేదా వివాహం నిశ్చయించుకున్న జంటలు ముందుగా వైరల్ మార్కర్, ఏఎంహెచ్ వంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ముందుగానే వాటికి చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతల్లో పనిచేసే వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. మహిళల్లో 25 ఏళ్ల లోపు ఎగ్ రిలీజ్ బాగుంటుందని, తరువాత తగ్గిపోతుందని చెబుతున్నారు. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వివాహానికి ముందే చేసుకుంటే మంచిది. ఏడాది వరకూ సహజంగానే ట్రై చేసుకోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్..పట్టణ ప్రాంతాల్లో జీవన శైలి, ఇతర అలవాట్లతో సంతాన సమ్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో కొందరు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శుక్రకణాలు, అండం, పిండాన్ని ఫ్రీజ్ చేయడం, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీజర్లు కొనసాగుతున్నాయి. శుక్ర కణాలు, ఎగ్స్ ఎంబ్రియాలజీ ల్యాబ్లో మైక్రో స్కోప్ కింద కలిపి పిండం (జీవకణం) తయారు చేస్తాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. మహిళకు నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్లో పూర్తయిపోతుంది. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. – పీ.స్వాతి, రీప్రొడక్టివ్ మెడిసిన్, కన్సల్టెంట్ రైన్బో హాస్పటల్స్ (చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!) -
Cycling: అనారోగ్యాన్ని ‘తొక్కేద్దాం’!
సైకిల్ పట్ల నగరవాసుల్లో ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతోంది. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా చాలా మంది సైకిల్ వినియోగం పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పర్యావరణ ప్రేమికులు, ఐటీ నిపుణులు పలు కారణాలతో సైకిల్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ మంచిదని, అనారోగ్య సమస్యలు దూరమవ్వాలంటే సైకిల్ తొక్కడం ఓ మార్గం అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మధ్యవయస్కులు, పెద్దలు విరివిగా సైకిల్ వినియోగిస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్లో గిరాకీ పెరిగిందని పలువురు చెబుతున్నారు. – జవహర్నగర్ ప్రపంచీకరణ నేపథ్యంలో ఆధునిక పోకడలు, ప్రాశ్యాత్య సంస్కృతి పెరిగిపోయింది. యువతతో పాటు మధ్య వయసు్కలు సైతం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే సాధనలో పడిపోతున్నారు. దీంతో మార్కెట్లో యంత్రాల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫలితంగా శారీరక శ్రమ తగ్గిపోయి అనారోగ్యాల బారినపడుతున్నారు. మరోవైపు ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఉబకాయంతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. శారీరక శ్రమ తగినంత లేకపోవడమే దీనికి కారణమని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. రోజులో కనీసం గంట సేపైనా వ్యాయామం చేయాలని, లేందటే కనీసం సైకిల్ వినియోగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ వినియోగించే వారి సంఖ్య నగరంలో గణనీయంగా పెరుగుతోంది. నగర ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై కరోనా తర్వాత వచ్చి మార్పుతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు రోజు రోజుకూ మెట్రో నగరాల్లో దెబ్బతింటోన్న పర్యావరణ సమతుల్యత, కాలుష్యం గాడిన పడాలంటే సైకిళ్ల వినియోగమూ ఓ పరిష్కారమని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెరుగుతున్న వాడకం.. పట్టణాల్లో పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, వ్యయాలు, ఆరోగ్య పరిరక్షణ కూడా సైకిల్ వైపు మళ్లడానికి ఓ కారణమని ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వే చెబుతోంది. నగరంలో ట్రాఫిక్ కారణంగా ఇంధన ఖర్చులు పెరుగుతున్నాయని, అవసరానికి మించి ఇంధనం ఖర్చవుతోందని, దీని ఫలితంగా కాలుష్యం కూడా పెరుగుతోందని ఫలితాలు చెబుతున్నాయి. ఈ కారణంగా కూడా కొందరు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సైకిళ్లవైపు దృష్టిసారిస్తున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. యువతలోనూ పెరిగిన ఆసక్తి.. నగరాలతో పోలిస్తే నగర శివారు ప్రాంతాల్లో నివాసముండే యువత సైకిల్ వినియోగం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యార్థులు దగ్గర్లోని పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లడానికి, లోకల్లో పనులు చక్కబెట్టుకోడానికి సైకిల్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. నగరంలో అయితే ఫిట్నెస్పై దృష్టిసారించేవారు, ఆరోగ్య సమస్యలను దూరంచేసుకోవాలనుకునే వారు వీటిని వాడుతున్నారు. సైకిళ్ల గిరాకీ పెరిగింది.. గతంలో కంటే ఇప్పుడు సైకిల్ కొనే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అమ్మకాలు బాగున్నాయి. అన్ని వయసుల వారికీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ధరలను తగ్గించుకునేందుకు కొందరు, డాక్టర్ల సలహా మేరకు కొందరు వాడుతున్నారు. – జ్ఞాన్రాం, సైకిల్షాపు యజమాని, జవహర్నగర్ ఆరోగ్యానికి మేలు.. సైకిల్ వినియోగం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. రోజూ కనీసం పది కిలోమీటర్లు సైకిల్ వినియోగిస్తా. – బొంకూరి రమేష్, కరాటే మాస్టర్ వ్యాధులకు దూరంగా.. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. రక్తపోటు, మధుమేహం, కొవ్వు వంటి సమస్యలుకు చక్కని పరిష్కారం. రోజుకు గంటపాటు సైకిల్ తొక్కితే మంచిది. దీనిద్వారా జీర్ణశక్తి మొరుగుపడుతుంది. – డాక్టర్ అశోక్, జవహర్నగర్ (చదవండి: నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు) -
నేచురల్ హెయిర్ జెల్..! జుట్టు పెరగడమే కాదు..
జుట్టు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా మాత్రం పని చేసే అవకాశాలు అధికం. ఎందుకంటే... ఈ చిట్కా కోసం వాడే పదార్థాలు పోషకాలతో నిండినవి. అవేంటంటే చియా గింజలు, గంజి. ఈ చిట్కా పాటించాలంటే ముందుగా అరకప్పు బియ్యం నానబెట్టిన నీళ్లు లేదా లేదా గంజిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ చియా సీడ్స్, రెండు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరగబెట్టాలి. దాదాపుగా ఇవి జెల్లా మారిపోతాయి. అప్పుడు దించి, చల్లారిన తర్వాత రోజ్ మేరీ లేదా లావెండర్ ఆయిల్ కలిపి, వడపోయాలి. ఈ లిక్విడ్ని ఓ గ్లాస్ జార్ లేదా బాటిల్ లోకి పోసుకుని కనీసం వారం రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. ఆ తరవాత దీనిని తీసుకుని ఎక్కుడైతే జుట్టు పలచబడిందో అక్కడ కాస్త ఎక్కువగా అప్లై చేసి మాడంతా మృదువుగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత గోరు వెచ్చని నీటితో జుట్టుని శుభ్రం చేసుకోవాలి. వారానికి కనీసం రెండు మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు బట్టతలపై కూడా వెంట్రుకలు వచ్చే అవకాశాలుంటాయి. (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం..జస్ట్ ఏడువేల అడుగులు..!: న్యూ స్టడీ) -
సముద్రగర్భంలో..మహిళా స్కూబాడైవర్లు..!
పర్యావరణానికి హాని కలిగించే విధంగా అంతకంతకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను దృష్టిలో పెట్టుకొని అండమాన్ నికోబార్లోని నార్త్ బే దీవిలో 24 మంది స్కూబాడైవర్లు ‘మెరైన్ క్లీనప్ డ్రైవ్’ నిర్వహించారు. వీరిలో పదిమంది మహిళలు ఉన్నారు. ‘ఉమెన్స్ డైవ్ డే 2025’ బ్యానర్పై పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.‘మహిళల కోసం ప్రత్యేకమైన డైవింగ్ కార్యక్రమాలు చేపట్టాం. నార్త్ బే, స్వరాజ్ ద్వీప్, షాహీద్ ద్వీప్లలో డైవర్ టీమ్లు అండర్వాటర్ క్లీనప్ మిషన్లో భాగమై పర్యావరణ సంరక్షణపై తమ నిబద్ధతను చాటుకున్నాయి’ అని వివరించారు టూరిజం సెక్రెటరీ జ్యోతి కుమారి. ఈ డైవ్లో పాల్గొన్నవారిలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కమాండెంట్ నిహారిక భట్ ఒకరు.‘గత సంవత్సరం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్కు సంబంధించి బేసిక్, అడ్వాన్స్ డైవింగ్ కోర్సులు పూర్తి చేశాను. అండమాన్ నికోబార్ దీవులలో ప్రపంచంలోనే అత్తున్నతమైన డైవింగ్ డెస్టినేషన్లు ఉన్నాయి. డైవింగ్ అనేది ఉల్లాస పరిచే నీటి ఆట మాత్రమే కాదు సముద్ర పరిరక్షణపై అవగాహన కలిగిస్తుంది’ అంటుంది నిహారిక భట్. (చదవండి: నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు) -
నాన్నే... ఎలాగోలా ఇల్లు చేరుకుంటాడు
పనయ్యాక నాన్న ఇల్లు చేరుకుంటాడు. ఆ రోజంతటినీ ముగించి, ఆ రోజును అంతటితో చాలించి. ఉదయం వెళ్లేప్పుడు బయటకు చెప్పని హామీ ఇచ్చి వెళతాడు– సాయంత్రానికి ఇల్లు చేరుకుంటానని. మరి ఏం జరిగినా సరే... తుఫాను గొంతు చించుకున్నా సరే... భూమి నిట్ట నిలువునా చీలినా సరే... నాన్న... ఇల్లు చేరుకుంటాడు.చీకటి పడితుంది... రాత్రి ఎనిమిదైపోతుంది... తొమ్మిదీ పదీ కూడా కావచ్చు... గ్రీజు మరకలు, ఆయిల్ వాసనా, గడ్డినూగు నస, చాక్పీస్పొడి రాలిన తల, గుండెన గుచ్చుకు వేళ్లాడుతున్న చీవాట్లు, ఆవేళ్టికి సరిపడా అవమానాలు, ఓవర్ డ్యూటీ ముఖము, కూచుని కూచుని పడి΄ోయిన నడుము... సరి చేసుకుని, సవరించుకుని... నాన్న... ఇల్లు చేరుకుంటాడు.కొన్ని ద్రాక్షపళ్లు తెద్దామనుకుంటాడు. కాసింత మిఠాయి తీసుకెళ్లకుంటే ఎలా అనుకుంటాడు. అరటిపండ్లకూ ఇంటి సభ్యులకైతే జత సరిగ్గా కుదురుతుంది. మరునాడు పిల్లలు పెన్సిల్ కొనేందుకు చేయిపెడితే చిల్లర వరకైనా తగిలేలా జేబును భద్రం చేసుకుంటేగాని కదలడు. ఖాళీ జేబును భార్య అర్థం చేసుకుంటుంది. పిల్లలకు నాన్న జేబు ఎప్పుడూ హుండీయే.నాన్న ఇల్లు చేరుకుంటాడు. దారిలో స్కూటర్ కుర్రాడు టక్కర్ ఇస్తే పడి, లేచి, ఎవరో ఇచ్చిన నీరు తాగి, మరేం పర్లేదని– నేరుగా ఇల్లు చేరుకుంటాడు. ఆ సంగతి ఎప్పటికీ ఇంట్లో చెప్పడు. పాత బాకీవాడు కూసిన నానా కూతలూ చెప్పడు. దగ్గరి బంధువొకరు గతిలేక గోజాడితే ఆ కాసింత సర్దుబాటు చేయలేనందుకు మనసున మూగెండ పట్టిందని ఎవరితోనైనా చెప్పగలడా ఏమి?పని ఉంటేనే నాన్న సెలవు పెడతాడు. పని లేకున్నా పెట్టొచ్చని అంటే భయపడిపోతాడు. నాన్న ఇంటికి యజమానో... పాలేరో. నాన్నను ఆ రోజంతా నాన్న మనుషులు ఏమేమి అన్నారో ఎన్నెన్ని అనుకున్నారో... నాన్నకు చుట్టూ ఉన్న జనం ఏమేమి పేర్లు పెట్టారో... ఎన్నెన్ని బిరుదులిచ్చారో... మంచివారి మంచి వల్ల బతుకుతున్నాడో... చెడ్డవారి చెడ్డను ఎదుర్కొనేందుకు ఊపిరి తిరగేస్తున్నాడో...ఇంటికొచ్చి నాలుగు మెతుకులు తిని నడుం వాల్చిన నాన్నను చూస్తే ఉదయం లేవడానికి పడుకున్నట్టు సాయంత్రం ఇల్లు చేరడానికి పడుకోనివ్వండన్నట్టు ఉంటాడు. నాన్న యుగాలుగా ఇల్లు చేరుకుంటున్నాడు. యుగాల పాటు ఇలాగే ఇల్లు చేరుకుంటాడు. ఆ రోజుకి కాసింత నవ్వాడో లేదో– ఇంటికొచ్చాక నవ్వేలా ఉంచగలమో లేదో– మొత్తానికి నాన్న ఇల్లైతే చేరుకున్నాడు.– ఖదీర్(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!) -
మెరుగైన ఆరోగ్యం కోసం..జస్ట్ ఏడువేల అడుగులు..!
ఇంతకు మునుపు పదివేల అడగులు నడిస్తే..దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదు జస్ట్ ఏడు వేల అడుగులతో కూడా అనారోగ్య సమస్యల తోపాటు అకాల మరణాన్ని కూడా నివారించొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆ కొంచెం నడకతోనే చాలమటుకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతోంది అధ్యయనం. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!.మంచి ఆరోగ్యానికి పదివేల అడుగులని ప్రామాణికంగా చెప్పాయి గత అధ్యయానాలు..కానీ తాజా పరిశోధనలు అంత కష్టపడాల్సిన పనిలేదంటోంది. ఏడు వేల అడుగులతోటే గుండె జబ్బులు, చిత్త వైకల్యం, అకాల మరణాన్ని నివారించొచ్చు. అందుకోసం దాదాపు 35 వేల జనసముహాలపై 57 అధ్యయనాలు నిర్వహించారు పరిశోధకులు. ఆ అధ్యయనంలో ఎక్కువగా నడవడం వల్ల ఆరోగ్యానికి మంచిదనే తేలింది. అయితే అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గించడానికి దాదాపు ఏడు వేల అడుగులు చాలని నిర్థారించారు. దాంతోనే పలు ప్రయోజనాలు పొందగలమని తెలిపారు పరిశోధకులు. రోజుకి రెండు వేల అడుగులు మాత్రమే నడిచిన వ్యక్తులతో పోలిస్తే..ఏడు వేల అడుగులు నడిచిన వారు ఎలాంటి ప్రయోజనాలు పొందగలరో సవివరంగా వెల్లడించింది కొత్త అధ్యయనం. అవేంటంటే..ఏ కారంణ చేతనైనా ముందుగా చనిపోయే ప్రమాదం 47% కంటే తక్కువగుండె జబ్బు వచ్చే ప్రమాదం 25% తక్కువగుండె జబ్బుతో చనిపోయే ప్రమాదం 47% తక్కువకేన్సర్తో చనిపోయే ప్రమాదం 37% తక్కువఅల్జీమర్స్ వచ్చే ప్రమాదం 38% తక్కువడిప్రెషన్ ప్రమాదం 22% తక్కువటైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 14% తక్కువకాలు స్లిప్ అయ్యి చనిపోయే ప్రమాదం 28% తక్కువఆ లెక్క ఏంటంటే..డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి తగినంత వ్యాయామం లేదు. మంచి కదలిక లేకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం కారణంగా గుండెపోటు, స్ట్రోక్, కేన్సర్తో సహా 8% సంక్రమిత వ్యాధుల బారినపడుతున్నట్లు డబ్యూహెచ్ఓ తెలిపింది. ఈ అనారోగ్య సమస్యల కారణంగా ఏటా బిలియన్ల కొద్ది డబ్బు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది. అలాంటి సమస్యలన్నింటిని సింపుల్ చక్కటి నడకతో చెక్ పెట్టొచ్చన్న దిశగా పరిశోధనలకు నాంది పలికామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ నేపథ్యంలోనే ప్రామాణికంగా ఎన్ని అడుగులు వేస్తే ప్రజలు అత్యంత సౌలభ్యకరంగా తమ ఆరోగ్యాన్ని రక్షించుకోగలరు అనే దానిపై పలు అధ్యయనాలు నిర్వహించామని వెల్లడించారు. అందరికి జిమ్ సౌలభ్యం ఉంకపోవచ్చు లేదా వెళ్లగలిగే సామర్థ్యం లేకపోవచ్చని అన్నారు. అదే వాకింగ్ అయితే సామాన్యుడి సైతం చేయగలిగేదే గాక మెరుగైన ఆరోగ్యాన్ని చాలా సులభంగా పొందగలుగుతాడని పరిశోధకులు చెబుతున్నారు.(చదవండి: బరువు తగ్గడానికి ఉపయోగపడే అద్భుత పానీయాలు..!) -
బరువు తగ్గించే అద్భుత పానీయాలు ఇవే..!
బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్లు, వర్కౌట్లు చేస్తుంటారు. వాటి తోపాటు బాడీలోని చెడు కొలస్ట్రాల్ని తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ఈ పానీయాలను కూడా జోడించినట్లయితే బరువు తగ్గడం మరింత సులభమవుతుంది. అందుకోసం అల్లాన్ని తప్పనిసరిగా మన రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి. మరి అదెలాగో తెలుసుకుందామా..!.అధిక బరువుకి చెక్ చెప్పే అద్భుత పానీయాలివే..గోరు వెచ్చిని అల్లం లెమెన్ వాటర్.. గోరువెచ్చని అల్లం నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి పరగడుపునే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే బాడీలోని చెడు కొలస్ట్రాల్ని తగ్గించి త్వరితగతిన బరువు తగ్గేలా చేస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత నిమ్మకాయను జోడించి తీసుకుంటే చాలు. కావాలనుకుంటే దాల్చిన చెక్క లేదా నల్లమిరియాలు కూడా జోడించొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా అల్లం షాట్: ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలా తయారు చేయాలంటే: ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్కు అరటీస్పూన్ అల్లం రసం జోడించాలి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీరు జోడించాలి. రోజుకు ఒకసారి భోజనానికి ముందు తాగాలి. ఇది దంతాల సంరక్షణకు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దోసకాయ అల్లం డీటాక్స్: దీన్ని రిఫ్రెషింగ్ డ్రింగ్గా పిలుస్తారు. రోజంతా ఈ నీటిని సిప్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అనవసరమైన చిరుతిండిని అరికట్టడంలో సహాయపడుతుంది. తయారీ విధానం: దోసకాయ, ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా ఆకులు వేసి కొన్ని గంటలు లేదా రాత్రంత నానబెట్టాలి. ఈ వాటర్ని ఒక బాటిల్లో పోసుకుని కూడా హాయిగా తీసుకువెళ్లొచ్చు. అల్లం గ్రీన్ టీ: ఇది శరీరంలో కొవ్వుని సులభంగా కరిగిస్తుంది. భారీ భోజనాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తయారీ విధానం: వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్ని ఉంచి, అల్లం జోడించాలి. తాగాడానికి కొన్ని నిమిషాలు ముందు చేసుకుంటే చాలు. వ్యాయమానికి ముందు ఆస్వాదిస్తే..సులభంగా బరువు తగ్గుతారు.పసుపు అల్లం లాట్టే (గోల్డెన్ మిల్క్)మంచి నిద్రకు సరైనది ఇది. చలికాలంలో మంచి వెచ్చదనాన్ని అందించి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం, పసుపు మిశ్రం శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట జీర్ణక్రియకు మద్దతిస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని ఒక కప్పు బాదం లేదా ఓట్మిల్క్లో తాజా అల్లం లేదా అలం పొడిని కలపాలి. చిటికెడు నల్లమిరాయాలు, దాల్చిన చెక్క కలపి మరిగించండి. అవసరమైతే తేనెతో తాగండి. ఈ పానీయాలు డైట్లో చేర్చుకుంటే ఆకస్మికంగా అద్భుతమైన మార్పులు రాకపోయినప్పటికీ, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే సమతుల్యం ఆహారాన్ని మెయింటైన్ చేయడంలో ఉపకరించడమే గాక సులభంగా బరువు తగ్గేందుకు దారితీస్తుంది.(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!) -
మనవాళ్లతో ఉండటమే అసలైన ఇంటీరియర్ డిజైన్..! యువరాజ్ సింగ్
పెద్ద పెద్ద స్టార్లు, సెలబ్రిటీల ఇళ్లు ఎలా ఉంటాయో తెలిసిందే. కోట్లు ఖరీదు చేసే ఆ లగ్జరీ ఇళ్లు కళ్లు చెదిరే హంగులతో అత్యంత ఆర్భాటంగా ఉంటాయి. కొందరు కళలకు నిలయంలా, మరికొందరు పచ్చదనానికి పెద్దపీట వేసేలా తీర్చిదిద్దుకుంటారు. అది సహజం. కానీ ఈ సార్ట్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం ఇంటీరియర్ డిజైన్కి అసలైన అర్థం ఇచ్చేలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన కలల సౌధం చూస్తే..ఇది కదా ఇల్లంటే అని అంటారు.చండీగఢ్లో యువరాజ్ అందమైన ఇల్లు కొలువుదీరి ఉంది. ఆయన తన ఇంటిని క్రీడా స్ఫూర్తికి, అచంచలమైన ప్రేమకు నిలయంగా అద్బుతంగా తీర్చిదిద్దుకున్నాడు. సూర్యకాంతి ఇంటిలోపలకి ప్రవేశించేలా పూర్తి వెంటిలేషన్తో ఉంటుంది. కేవలం విలాసవంతమైన ఫర్నీచర్, లగ్జరీ వస్తువుల నిలయంగా కాదు. కుటుంబ విలువలకు, ఇంటి ఉండే ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఇచ్చేలా తీర్చిదిద్దుకున్నారు యువరాజ్. ఆ విషయాన్ని స్వయంగా యువరాజ్సింగే ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఇల్లు అంటే ఎంత ఖరీదైనది..అందులో ఎంత డబ్బు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేశామన్నది కాదు. మన వాళ్లతో అంటే.. తల్లి, భార్య..ఇలా అందరూ కలిసి ఉండగలిగే అదృష్టం దొరకడమే అంటున్నారు. ఇంటిని అమ్మకు, భార్యకు సెపరేట్ అంతస్థులు కేటాయించి.. వారికి నచ్చినట్లు అందంగా డిజైన్ చేయడం కాదు. అందరం ఒకే చోట కలిసి ఉంటూ..అందరి అభిప్రాయంతో నిర్మించుకుంటే..అది అత్యంత విలువైనది అంటూ కుటుంబ విలువల గురించి ఈ జనరేషన్ తెలుసుకునేలా అద్భుతంగా చెప్పాడు. ఎంత పెద్ద ఇల్లు కట్టినా..అది ఖాళీగా ఉంటే నిరుపయోగమే అని చెబుతున్నాడు యూవీ. అలాంటి ఇంటిలో ఉన్నా.. లేకపోయినా ఒకటేనని, కుటుంబమే మన ఇల్లు అనే విషయం మరవకండి అంటూ అనుబంధాల ప్రాముఖ్యత గురించి హైలెట్ చేశాడు యూవీ. ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అది మన కుటుంబ సభ్యులందరితో ఉండగలిగేలా నిర్మించుకున్నప్పుడే అది మరింత అందంగా కనిపిస్తుందని చెబుతున్నాడు. ఇల్లు అనేది మన బాల్యపు జ్ఞాపకాలు, మన వివాహం, పిల్లల జననం వరకు ప్రతిది కళ్లముందు మెదిలాడేలా చేసే జ్ఞాపకాల మూటగా అభివర్ణించాడు. జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా..ఇక తన రోజుని టేబుల్టెన్నిస్తో ప్రారంభిస్తాడట, అందుకే ఆ ఆట తన ఇంటి ప్రాంగంణంలో ఉంటుందని చెబుతున్నాడు. ఆ స్పూకర్ టేబుల్ తన బాల్యాన్ని గుర్తు చేస్తుందట. అలాగే ఫిట్నెస్ కోసం జిమ్..ఇది తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వమని గుర్తుచేస్తుందట. ఇక ఆయన ఇంటిలోని వాల్ ఆఫ్ ఫ్రేమ్గా ఆరు సిక్సెల బ్యాట్ ఉంటుంది. ఇది తాను కేన్సర్ని ఓడించి ఎలా 150 పరుగుల స్కోరు సాధించానో గుర్తుచేస్తుందట. పైగా అది తనకు అత్యంత ప్రత్యేకమైన జ్ఞాపకమని అంటున్నాడు యువరాజ్ సింగ్. "కుంగదీసే వ్యాధిని జయించేందుకు ధైర్యం ఒక్కటే ఆయుధం. అది ఉంటే ఏది మనల్ని విచ్ఛిన్నం చేయలేదు. అదే నేను విశ్వసిస్తా. ఆ చేదు ఘటన తాలుకా జ్ఞాపకం తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని సగర్వంగా చెబుతున్నాడు". యువరాజ్ సింగ్. అందమైన పర్వతాల మధ్య ఉన్న తన ఇల్లు, చుట్టూ ఉన్న వ్యూ తనకు అత్యంత ఇష్టమైన టూరిస్ట్ స్పాట్గా పేర్కొన్నాడు. చివరగా ఇంటికి ఎలాంటి రంగులూ, ఎంత ఖరీదైన సీలింగ్లు, ఫర్నీచర్లు పెట్టించామన్నది కాదు..భార్య, పిల్లలు, తల్లితో కలిసి నివశించగలగడం..వారి ఇష్టంతో ఇల్లు అందంగా రూపుదిద్దుకోవడమేనని అంటున్నాడు. అలాంటి ఇంటిలో ఉండే ఏ భర్త/కొడుకు సదా అదృష్టమంతుడే అంటూ ఇల్లు అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్. కాగా, యూవీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అనే టీ20 టోర్నమెంట్లో ఆడుతున్నాడు. (చదవండి: పనస పండు ఎంత పనిచేసింది..? బ్రిత్ అనలైజర్ రీడింగ్నే ఫూల్ చేసిందగా..!) -
పనస పండు ఎంత పనిచేసింది..? పాపం ఆ డ్రైవర్లను పట్టుబడేలా చేసింది..!
డ్రైవర్లు లేదా వాహనాలు నడిపేవాళ్లు ఈ పండు తిన్నారో అంతే సంగతులు. చుక్క మందు తాగకపోయినా..అన్యాయంగా ఇరుక్కుపోతారు. తమాషా కాదు..నమ్మశక్యం కానీ పచ్చి నిజం. ఏంటిదంతా అనుకోకండి. పాపం ఇలానే కేరళ డ్రైవర్లు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్లో పట్టుబడి చిక్కుల్లోపడ్డారు. చివరికి అధికారులే అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పండలం మండలంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది అక్కడ డ్రైవర్లకు రొటీన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అవాక్యయ్యారు ఆ ఉద్యోగులు. ఒక్క చుక్క మందు తాగకుండానే ఇదేంటని విస్తుపోయారు. పాపం వాళ్లంతా తాము మద్యం సేవించలేదని మమ్మల్ని నమ్మండి మహాప్రభో అంటూ మొరపెట్టుకోవడంతో..అధికారులు వారికి ఒక్క అవకాశం ఇచ్చారు. తాము కొల్లం జిల్లాలో వస్తువులు రవాణా చేసేటప్పుడు పనసపండు కొన్నామని అది తప్ప ఇంకొకటి తాము తినలేదని చెప్పారు. అయితే మీరు చెప్పింది నిజమే అయితే మరొక సిబ్బంది ఈ పనస పండు ఇచ్చి వాస్తవం నిర్థారిస్తామని ఆ డ్రైవర్లోతో అధికారులు అన్నారు. అన్నట్లుగానే తదుపరి పరీక్ష నిర్వహించారు. ఒక సిబ్బందికి ఇలాంటి పనసండు పెట్టి బ్రిత్ అనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించినట్లుగా పాజిటివ్ చూపించింది. అది చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. పనసపండు ఇంతలా బ్రీత్ అనలైజర్ను కన్ఫ్యూజ్ చేసేలా తప్పుదారిపట్టిస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సదరు డ్రైవర్లు మద్యం సేవించలేదని నిర్థారించి వారిని వదిలేశారు అధికారులు. పనపండు తింటే మద్యం సేవించినట్లేనా అంటే..కేరళకు చెందిన ఈ సుగంధభరిత పనసపండు. అసాధారణమైన తేనెలాంటి తీపి రుచిని కలిగి ఉంటుంది. పైగా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. అయితే అతిగా పండిన ఈ పనసపండులోని సహజ కిణ్వప్రక్రియ కారణంగా ఆల్కహాల్ని కలిగి ఉంటుందట. ఎప్పుడైతే దీన్ని తింటామో అది శరీరంలోకి వెళ్లగానే ఇథనాల్ని ఉత్పత్తి చేస్తుందట. దాంతో ఈ పనసపండు తిన్న వెంటన్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆల్కహాల్ సేవించినట్లుగా చూపిస్తుందట. ముఖ్యంగా బాగా ముగ్గిన పనస పండు తీసుకుంటే ఇది మరింత స్పష్టంగా ఆల్కాహాల్ సేవించినట్లు చూపిస్తుందట బ్రిత్ అనలైజర్ రీడింగ్లో. ఇందుకు ప్రధాన కారణం బాగా పండిన పండ్లు ఇథనాల్ను తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడమేనని చెబుతున్నారు నిపుణులు.ఇలా తప్పుదారి పట్టించేవి ఇవే..అతిగా పండిన అరటిపండు, మామిడిపండు కిమ్చి, సౌర్క్రాట్, ఇడ్లీఆల్కాహాల్ లేని బీర్ లేదా మౌత్వాష్వెనిగర్ అధికంగా ఉండే వంటకాలు లేదా ఆల్కహాల్తో వండిన ఆహారాలుచక్కెర ఆల్కహాల్లు లేదా కిణ్వ ప్రక్రియ ఉపఉత్పత్తులను కలిగి ఉన్న ప్రోటీన్ బార్లు లేదా ఎనర్జీ డ్రింక్స్(చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఫుఫు డిష్.. పోషకాలు ఫుల్..!
ఫుఫు డిష్.. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా.. ప్రస్తుతం నగరంలో ఈ డిష్ ప్రాచుర్యం పొందుతోంది.. ఫుఫు అనేది పశ్చిమ ఆఫ్రికా దేశస్తుల ఫేవరెట్ ఆహారం.. ఆ దేశంలో పుట్టిన ఈ సాధారణ ఆహారం.. కాసావా (కర్రపెండలం), యమ్ లేదా ఆకుపచ్చని అరటి వంటి దుంప కూరగాయలతో తయారు చేస్తారు. ప్రధానంగా కాసావాని యుకా/మానియోక్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికాతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది ప్రధాన ఆహారంగా ఉపయోగంచే పిండి పదార్థాలు కలిగిన దుంప కూరగాయ. దీని శాస్త్రీయ నామం మనిహోట్ ఎసు్కలెంటా. ప్రస్తుతం ఈ వంటకం హైదరాబాద్ నగరంలో ఆఫ్రికా వాసులు నివాసముండే పలు ప్రాంతాల్లోని రెస్టారెంట్లలో ఆహారప్రియులను అలరిస్తోంది. ఫుఫు అనే వంటకాన్ని యమ్/ ఆకుపచ్చని అరటి వంటి దుంపను తొక్క(వెరడు) తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్చేసి నానబెడతారు.. అనంతరం బాగా ఉడకబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.. దీనిని మిక్సీలో మెత్తగా పిండిచేసి మృదువైన, సాగే ముద్దగా తయారుచేస్తారు.ఈ మిశ్రమాన్ని పెనంమీదపోసి రుచికి సరిపడా ఉప్పువేసి ఉడికిస్తారు. ఈ వేడివేడి మిశ్రమాన్ని రాగిముద్దలా చేసి చికెన్, మటన్ గ్రేవీ, ఫిష్ గ్రేవీలతో పాటు వెజిటబుల్ గ్రేవీలతోనూ.. సాధారణ సూప్లు, సాస్చ చిక్కుళ్లు లేదా ఇతర వంటకాలతో పాటు సైడ్ డిష్గానూ తింటారు. పోషక విలువలు... ఆఫ్రికన్ వాసులకు ఎంతో ఇష్టమైన ఈ ఫుఫు డిష్లో అనేక పోషక విలువలు దాగివున్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాయం, విటమిన్–సీ తో కూడిన అనేక విటమిన్లు, ఖనిజాలతో పాటు క్యాలరీలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరగడం, జీర్ణక్రియ, రక్త ప్రసరణకు సహాయపడుతుందట. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి ప్రయోజనకారంగా ఉంటుందట. అయితే కాసావాలో సైనోజెనిక్ గ్లూకోసైడ్లు ఉంటాయి. దీనిని సరిగ్గా ఉడికించకపోతే సైనైడ్ను విడుదల చేస్తుందట. పూర్తిగా ఉడికించడం వల్ల ఇందులోని టాక్సిన్లు పూర్తిగా నశించి ఆరోగ్యప్రయోజనాలను అందజేస్తుంది. (చదవండి: -
అలా కుందేలు ఓడిపోయింది... ఆ తరువాత..?
రన్నింగ్ రేస్లో తాబేలుతో పోటీ పడి అతి ఆత్మవిశ్వాసంతో ఓడిపోయిన కుందేలు కథ గురించి మనకు తెలిసిందే. మరి ఆ తరువాత ఏం జరిగింది?’ కుందేలులో ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందా? తాబేలులో వోవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందా?‘అసలు ఆ తరువాత ఏం జరిగింది?’ అనే పాయింట్పై వచ్చిన నాటకం....సూపర్ టార్టైస్, సూపర్ రాబిట్. హాంగ్ సెంగ్హీ దర్శకత్వం వహించిన ఈ కొరియన్ నాటకాన్ని ఇటీవల బెంగళూరులో ప్రదర్శించారు. ‘ఒకసారి వచ్చిన ఫలితంతో వ్యక్తులను నిర్ణయించలేము అని చెప్పడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ నాటకం ఉపయోగపడుతుంది’ అంటున్నాడు హాంగ్. కొరియన్ డ్రామా కంపెనీ ఈ నాటకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది.‘భారతీయ ప్రేక్షకుల ముందు నటించాలనే నా కల నెరవేరింది’ అంటున్నాడు కిమ్ మిన్–కి అనే ఆర్టిస్ట్. హాస్యాన్ని, సందేశాన్ని మిళితం చేస్తూ సాగే ఈ నాటకంలో సంగీతం, రిథమ్స్ ప్రత్యేక ఆకర్షణ.నాటకంలో అత్యంత ఆకట్టుకునే ఘట్టం? డైరెక్టర్ హాంగ్ ఇలా అంటున్నాడు...‘చివరి ఘట్టం. నేనేమిటి? నేను నిజంగా కోరుకునేది ఏమిటి? అని నాటకంలో ప్రతి క్యారెక్టర్ తనను తాను తెలుసుకుంటుంది’. (చదవండి: ఎవరీ మీరా మురాటీ..? టెస్లా టు థింకింగ్ మెషిన్ ల్యాబ్..) -
విడాకులు మీ సమస్యకు పరిష్కారం కాదు!
నా పెళ్లయి సంవత్సరం అవుతోంది. నేనూ నా భర్త, బెంగళూరులో ఉంటాం. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా అమ్మా నాన్నలకు ఒక్కదాన్నే కూతురిని. నన్ను మా ఇంట్లో ఒక రాకుమారి లాగా పెంచారు. కానీ మా అత్త గారింట్లో నన్నెవరూ పట్టించుకోవడం లేదు! నా భర్త వాళ్ళ అమ్మ మాటకే విలువ ఇస్తాడు. నామాట అసలు వినడు. అత్తగారు అక్కడి నుంచే మా ఆయనకి డైరెక్షన్ ఇస్తుంది. మా ఆయన సంపాదించే డబ్బులు ఖర్చు పెట్టుకునే స్వాతంత్య్రం నాకు లేదు. ఆయన కూడా ఏదైనా కొనమంటే... ఉన్నదానితో సర్దుకోమంటాడు. మా అత్తగారింటికి వెళితే నాకు ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. ఆమె టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. ఈ విషయం గురించి కూడా మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాకు ఇంక వేరే సమస్యలు ఏం లేవు. మా అమ్మ వాళ్ళేమో విడాకులు తీసుకుని వచ్చేయమని అంటున్నారు. నా భర్త మంచివాడు, తనంటే నాకు చాలా ఇష్టం. నా భర్తని నేను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పి నా కాపురాన్ని నిలబెట్టండి! – ప్రత్యూష, బెంగుళూరుఇది మీ ఒక్కరి సమస్యే కాదు! చాలా కుటుంబాల్లో అత్త – కోడలు మధ్య ఈ రకమైన ఒత్తిళ్లు, మనస్పర్థలు సర్వసాధారణం! కొడుక్కి గడ్డాలు, మీసాలు వచ్చినా తన వేలు పట్టుకుని నడిపించాలి అనుకుంటారు చాలా మంది తల్లి తండ్రులు. ఆ ఆలోచనలతోనే వారి జీవితాల్లో అతిగా జోక్యం చేసుకుంటారు. ఇవన్నీ పెళ్లికి ముందు బాగానే ఉన్నా, పెళ్లి తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. పిల్లల జీవితంలో ఒక భాగ స్వామి వచ్చాక వారి నిర్ణయాలను వారే తీసుకునే స్వాతంత్య్రం ఇవ్వాలి తల్లిదండ్రులు! ఒక తల్లి తన కోడలిని బయట నుంచి వచ్చిన అమ్మాయిలా కాకుండా, తన కొడుకుతో జీవితాంతం తోడుండే, ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించాలి, అలాగే భర్త కూడా తన కుటుంబాన్ని వదిలి వచ్చిన భార్యని గౌరవించడం కనీస బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి.. ఇక్కడ మనం గమనించాల్సంది. ‘సంసారం అంటే ఒకరినొకరు నియంత్రించుకోవడం కాదు, ఒకరి నొకరు అర్థం చేసుకోవడం‘. మీ భర్త తన తల్లిని గౌరవించడం తప్పు కాదు. కానీ అదే సమయంలో మిన్ముల్ని చిన్నచూపు చూడడం కూడా తగదు. మీరు మీ భర్తను పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకోవాలనుకోవడం కూడా సరైనది కాదు. మీ తల్లితండ్రులు మీకు విడాకులు తీసుకోమని సలహా ఇస్తున్నా, అది ఈ సమస్యకి పరిష్కారం కానే కాదు! మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ భర్తని గెలవాలంటే ముందు మీరు మీ అత్తగారిని గెలవాలి. అది ద్వేషంతో కాదు, ప్రేమతో, మీ మృదువైన మాటలతో కాస్త తెలివిగా ఆలోచించి, ఆమెతో మాట్లాడితే ఆమె కూడా కొన్ని విషయాల్లో మారతారు. నిదానంగా ఆమె కూడా మీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను కోపంతో, ఆవేశంతో కాకుండా ఓపికతో, చాకచక్యంగా ఎదుర్కొంటే మీ సమస్య పరిష్కారమవుతుంది. మీ భర్తతో మీరు ప్రశాంతంగా ఈ అంశం గురించి మాట్లాడండి. ఏదైనా అవసరం అయితే మీకు సహాయం చేయడం కోసం మానసిక నిపుణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!.(చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..) -
మనకు మనమే స్పెషల్...
మనల్ని మనం ప్రేమించుకోకపోతే.. లోకం కూడా ప్రేమించదు! ఇదే సెల్ఫ్కేర్.. ఇదేమీ సెల్ఫిష్ థింగ్ కాదు..అత్యవసరంగా ఆచరించాల్సిన అంశం!దీని మీద అవగాహన కల్పించడం కోసమే ఏటా జూలై 24న ఇంటర్నేషనల్ సెల్ఫ్కేర్ డేగా ప్రకటించింది ఇంటర్నేషనల్ సెల్ఫ్కేర్ ఫౌండేషన్. ఈ సందర్భంగా...వర్కింగ్ విమెన్తో పాటు గృహిణులు కూడా తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుటుంబ బాగోగుల మీద శ్రద్ధ పెడుతుంటారు. అలాంటి వాళ్లు ఒక్కసారిగా అనారోగ్యంతో మంచం ఎక్కితే.. మంచినీళ్లు అందించే దిక్కు ఉండదు. అందుకే అందరి గురించి ఆలోచించే ముందు తమ గురించి తాము ఆలోచించుకోవడం ముఖ్యం. సెల్ఫ్కేర్ సెల్ఫిష్ థింగ్ కాదు.. అత్యంత శ్రద్ధ పెట్టాల్సిన అంశం. దాని మీద అవగాహన కల్పించడానికే ఇంటర్నేషనల్ సెల్ఫ్కేర్ ఫౌండేషన్ 2011లో జూలై 24ను ఇంటర్నేషనల్ సెల్ఫ్కేర్ డేగా ప్రకటించింది. నెలల్లో జూలై ఏడో నెల.. తేదీ 24.. ఇది 24/7ను సూచిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏడాదికి ఈ ఒక్కరోజు కాకుండా 24 గంటలూ తమ మానసిక, శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధపెడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుకరించాలని దీని అర్థం.. స్ఫూర్తి కూడా! అందుకే జూన్ 24 నుంచి జూలై 24 వరకు సెల్ఫ్కేర్ మంత్నూ సెలబ్రేట్ చేస్తోందీ సంస్థ. దీనితో సెల్ఫ్కేర్ ప్రయోజనాల మీద అవగాహన కల్పిస్తూ,సెల్ఫ్కేర్ ప్రాక్టీసెస్ను ప్రోత్సహిస్తోంది.థీమ్... సెల్ఫ్కేర్ అనేది కేవలం శారీరక, మానసిక ఆరోగ్య క్రమశిక్షణే కాదు ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, పర్యావరణ క్రమశిక్షణ కూడా అంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం ఆరింటికి మొదలై రాత్రి ఒంటిగంటకు ముగిసే రోజులో కూడా అందరూ ముఖ్యంగా స్త్రీలు తమకోసం తగినంత సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో మహిళలు బాగుంటేనే ఇంట్లో వాళ్లు క్షేమంగా ఉంటారు. ఇల్లు క్షేమంగా ఉంటే సమాజ సంక్షేమం ఖాయం!దేశంలో వివాహితలు వారంలో సగటున 44 గంటల కంటే ఎక్కువ సమయాన్నే జీతభత్యాలు, కనీసం గుర్తింపు కూడా లేని ఇంటిపనుల కోసం వెచ్చిస్తున్నారని న్యూస్రీల్ ఆసియా నివేదిక చెబుతోంది. అదే పెళ్లయిన మగవాళ్లు మాత్రం వారానికి అయిదు గంటలే వెచ్చిస్తున్నారట. ఈ లెక్కన సంసార బాధ్యతల్లో ఉన్న పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు రోజుకు కనీసం గంటన్నర కూడా వ్యక్తిగత శ్రద్ధ కోసం కేటాయించట్లేదట. వ్యక్తిగత శ్రద్ధ లోపించడం వల్ల అది మహిళల్లో ఒత్తిడి, అలసటను పెంచి.. వాళ్లు నలుగురితో కలిసే కార్యక్రమాల్లో ΄ాలుపంచుకోకుండా చేస్తోందని, అది మహిళల మానసిక, శారీరక ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపెడుతుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. (చదవండి: పాము ఉందంటే పరిగెత్తుకొస్తుంది.. 800కి పైగా స్నేక్స్..!) -
డుగ్గు డుగ్గుమని... బుల్లెట్ బండి మీద డాడీ వచ్చిండు!
‘నాన్నా... కొత్త బుల్లెట్ కొన్నాను. ఎలా ఉంది?’ తండ్రిని అడిగాడు కొడుకు. ‘చాలా బాగుందిరా’ అన్నాడు నాన్న. ‘ఇది నా కోసం కాదు నీ కోసం’ అని కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి కళ్లు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. పద్నాలుగు సంవత్సరాల క్రితం కేరళలోని కొచ్చికి చెందిన అశ్విన్ తండ్రి బుల్లెట్ కొనాలని బలంగా అనుకున్నాడు. అయితే ఆర్థిక కష్టాలు కూడా అంతే బలంగా ఉండడంతో బుల్లెట్ బండి కొనలేకపోయాడు. పద్నాలుగు సంవత్సరాల తరువాత తండ్రి కోరికను నిజం చేశాడు చేతికి అందివచ్చిన కొడుకు అశ్విన్. అశ్విన్ తన తండ్రికి బ్రాండ్–న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ కీ అందించడం, తల్లిదండ్రులు ఆ బండిని చూసి మురిసిపోవడం... ఇలాంటి దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఎంత చేసినా తక్కువే’ ‘ఈ తరం పిల్లలు ఆశ్విన్ను ఆదర్శంగా తీసుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. ఇదీ చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే! -
ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..!
ఒకప్పుడు హిందూ సంప్రదాయంలో భాగమైన ఆ ఆచారమే ఇవాళ ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. బహుశా సాధారణ వ్యక్తులు ఆచారంగా చేస్తే..అతి పెద్ద ఫ్యాషన్ కాదు. అదే ఏ సెలబ్రిటీనో లేక పెద్ద స్టారో ట్రెడిషన్ని అనుసరిస్తే..అది స్టైలిష్ యాక్సెసరీగా మారిపోతుంది. అందుకు ఉదాహరణ ఈ కాలా ధాగా. ఏంటిది అనుకుంటున్నారా..?అదేనండి మన సినీ ప్రముఖులు, పెద్ద స్టార్లు, సెలబ్రిటీల చేతి మణికట్టు వద్ద స్టైలిష్గా ఓ నల్లదారం కనిపిస్తుందే దాన్నే హిందీలో కాలా ధాగా అంటారు. సాధారణంగా ఏ కాశీ క్షేత్రానికో, తిరుపతి వంటి పుణ్య కేత్రాలకు వెళ్లినప్పుడూ అక్కడ ఉండే మార్కెట్లో ఈ నల్ల తాడులనే కాశీ తాడులుగా దర్శనమిస్తుంటాయి. ఆయా క్షేత్ర సందర్శనం అనంతరం ఇంటికి చేరుకుని తమ బంధువులకు, స్నేహితులకు ప్రసాదం తోపాటుగా ఈ కాశీతాడుల, ఎరుపు రంగు తాడులను ఇస్తుంటారు. వీటిని రక్షగా ధరిస్తుంటారు. అలాంటి తాడే ఈ కాలా ధాగా. మన హిందూ సంప్రదాయంలో దీన్ని చెడు దృష్టికి రక్షగా ధరిస్తారు. దీన్ని ధరిస్తే కనుదిష్టి పోతుందని భక్తుల నమ్మకం. అది నేడు ఈ ఐటీ గర్ల్స్ పుణ్యామా అని ఫ్యాషన్ యాక్సెసరీగా మారింది. మరి ఈ కాలా ధాగాను ధరించే సెలబ్రిటీలు ఎవరంటే..ఈ సెలబ్రిటీలు ఈ సంప్రదాయన్ని ధైర్యంగా పాటించడమే కాదు, రెడ్ కార్పెట్ వద్ద అయినా, లేదా వాళ్ల వర్క్ పరంగా స్టైలిష్ కనిపించాల్సి వచ్చినా చేతికి ఈ కాలాధాగా ఉండాల్సిందే. అంతలా ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. సిగ్నేచర్ లుక్గా..నల్లదారం లేకుండా కనిపించని నటి ఎవరైనా ఉన్నారంటే అది జాన్వీకపూర్. ఆమె రెడ్ కార్పెట్ లుక్స్ లేదా క్యాజువల్ వార్డ్ రోబ్ అయినా ఈ కాలా ధాగా ఉండాల్సిందేనట. ఇది లేకుండా కనపించదు. సరికొత్త ఫ్యాషన్ వేర్లో ఉన్నా..ఇది మణికట్టుకి ఉండాల్సిందేనట.అనన్య పాండే సైతం దీన్న ధరిస్తుందట. ఇటీవల ఈ జెన్ జెడ్ ఐకాన్ హనుమాన్ ఆలయంలో కనిపించారు. ఆమె అందమైన పసుపు సల్వార్ సూట్ తోపాటు ఈ కాలాధాగాను కూడా జత చేసింది. కేవలం బాలీవుడ్ నటులే కాదు అంబానీలు కూడా ఈ పవిత్ర నల్లదారాన్ని గట్టిగా విశ్వసిస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే రాధిక మర్చంట్ తన పెళ్లికూతరు లుక్స్లో ఈ థ్రెడ్తో స్టైలిష్గా కనిపించింది. ఇక ఇషా అంబానీ సైతం దీన్ని ధరిస్తారు. ఈ సంప్రదాయన్ని వాళ్లంతా తన రొటీన్ జీవితంలో భాగం చేసుకునేలా ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఉండగా ఉండగా..ఇది కాస్తా అదెదో ఫ్యాషన్ ట్రెండ్లా మారిపోతుందేమో!. (చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
అంతిమ క్షణాల్లో.. 'విల్' పవర్!
మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు? ఏమిటి పిచ్చి ప్రశ్న అంటూ ఫైర్ అవకండి. మనం ఎలా చనిపోవాలో ఎంచుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నమ్మలేకపోతున్నారా! దీనికి మనం చేయాల్సిందల్లా వీలునామా రాయడమే. చివరి మజిలీని ఎలా ముగించాలనుకుంటున్నామో తెలుపుతూ ముందుగానే వీలునామా రాసిపెట్టుకుంటే చాలు. అయితే ఇది ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, దీనికి ఏమేం కావాలనే వివరాలు తెలుసుకోవాలంటే ముంబైలోని పీడీ హిందుజా నేషనల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. దాని కంటే ముందు 'లివింగ్ విల్' అంటే ఏంటో చూద్దాం.'లివింగ్ విల్' అంటే?మనిషి ఎంత హాయిగా బతికాడన్నది కాదు, ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు మన పెద్దలు. ఇలాంటి ఆలోచన నుంచే లివింగ్ విల్ (living will) కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. నయం కాని రోగాలతో మంచాన పడి మరణం ముంగిట నిలుచున్నప్పుడు లివింగ్ విల్ క్లారిటీ ఇస్తుంది. చివరి క్షణాల్లో వైద్య సహాయం కావాలా, వద్దా అనేది ఎవరి వారే నిర్ణయించుకోవచ్చు. అఖరి గడియల్లో వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవాలా, వద్దా అనేది కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే రాసే వీలునామానే లివింగ్ విల్ లేదా అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్గా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే.. మన చావు ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం. చివరి రోజుల్లో మంచాన పడి జీవచ్ఛవంగా నరకయాతన అనుభవించకుండా సునాయాస మరణం పొందేందుకు ముందుగానే మనం చేసుకునే ఏర్పాటుగా దీన్ని భావించొచ్చు.సుప్రీం తీర్పు ఆధారంగా..మనిషి ఎలా చనిపోవాలనుకుంటున్నాడో తెలుపుతూ ముందుగానే రాసే వీలునామా (లివింగ్ విల్)ను సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా 2018లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. లివింగ్ విల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో 2023లో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి జోక్యం చేసుకుంది. లివింగ్ విల్ నమోదు విధానాన్ని సులభతరం చేస్తూ కొన్ని సడలింపులు ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా కొన్ని విషయాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వీలునామాలను ఎక్కడ భద్రపరుస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి బాంబే హైకోర్టు (Bombay High Court) పరిష్కారం చూపించింది. వీలునామాలను భద్రపరచడానికి, సులువుగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేయాలని బాంబే హైకోర్టు 2024లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇప్పటివరకు 40 మంది..న్యాయస్థానాల ఆదేశాల మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఈ వీలునామాల నమోదు ప్రారంభించింది. 24 వార్డుల్లో ఇప్పటివరకు 40 మంది లివింగ్ విల్ సమర్పించారు. ఇందులో 10 మంది మహిళలు ఉండడం గమనార్హం. 50, 60, 70 ఏళ్ల వారి నుంచి ఈ వీలునామాలు వచ్చాయి. 83 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నారు. ఈ పత్రాలకు నగరంలోని 24 వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్లు సంరక్షకులుగా ఉంటారు. వీరి వివరాలు బీఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూపేంద్ర పాటిల్ తెలిపారు. ఆన్లైన్లోనూ వీలునామాలు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.లివింగ్ విల్ క్లినిక్మహిమ్ ప్రాంతంలోని హిందుజా ఆస్పత్రి.. లివింగ్ విల్ క్లినిక్ను జూన్ నెలలో ప్రారంభించింది. గౌరవంగా చనిపోవడం (డైయింగ్ విత్ డిగ్నిటీ) పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రూప్ గుర్సహాని చొరవతో లివింగ్ విల్ వీక్లీ క్లినిక్ ప్రారంభమైంది. పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ స్మృతి ఖన్నా దీన్ని నిర్వహిస్తున్నారు. లివింగ్ విల్పై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు వీలునామా (veelunama) రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను తమ క్లినిక్ చేస్తుందని డాక్టర్ స్మృతి ఖన్నా తెలిపారు. భవిష్యత్తులో ఊహించని ఉత్పాలను తాము ఎలా ఎదుర్కొవాలనే దాని గురించి వీలునామాలో ప్రస్తావించొచ్చని తెలిపారు. ఆకస్మిక ప్రమాదాలు, నయం కాని వ్యాధులు బారిన పడి చివరి గడియల్లో ఉన్నప్పుడు తాము ఏం కోరుకుంటామో.. ముందుగానే లివింగ్ విల్లో రాసుకోవచ్చు.'లివింగ్ విల్ క్లినిక్ (Living Will Clinic) ప్రారంభమైప్పటి నుంచి ఇక్కడి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో 40 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్లు ఉన్నారు. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. కొంత మంది మాత్రం ఒంటరిగా వస్తున్నారు. నయం కాని దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నవారికి అన్ని సందర్భాల్లో ఐసీయూ ఆధారిత వైద్యసేవలు సహాయకపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని పొడిగించడం కంటే కూడా బాధల నుంచి విముక్తి కల్పించడం అవసరమన్పిస్తుంద'ని డాక్టర్ స్మృతి ఖన్నా పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఎవరైనా.. ఆరోగ్యంగా ఉన్నా, లేకున్నా లివింగ్ విల్ రాయొచ్చన్నారు. 'జీవితం అనూహ్యమైనది, కానీ మీ వైద్య ఎంపికలు అలా ఉండనవసరం లేదు. మీరు వాటిని స్వయంగా వ్యక్తపరచలేకపోయినా, మీ చికిత్సా ప్రాధాన్యతలను తెలుసుకుని, వాటిని అనుసరించేలా లివింగ్ విల్ సహాయపడుతుంది. మీ ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేయడానికి, మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది సరళమైన, అర్థవంతమైన మార్గం' అంటూ అవగాహన కల్పిస్తోంది హిందుజా ఆస్పత్రి.లివింగ్ విల్ క్లినిక్ ఏం చేస్తుంది?వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, సీపీఆర్ వంటి అత్యవసర చికిత్స తీసుకుంటున్న సందర్భాల్లో మెడికల్ కౌన్సిలింగ్ ఇస్తుంది.సుప్రీంకోర్టు ఆమోదించిన పార్మాట్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో లీగల్ డాక్యుమెంటేషన్ చేస్తుంది.లివింగ్ విల్ అమలు చేయడానికి అవసరమైన పత్రాలు తయారు చేస్తుంది. (నఖలు పత్రాలను కుటుంబ సభ్యులు, డాక్టర్లతో పాటు పేషంట్ల చిరునామా ఆధారంగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు పంపిస్తారు)లివింగ్ విల్ సేవలకు అవుట్ పేషంట్స్ డిపార్ట్మెంట్(ఓపీడీ) ధరల ప్రకారం ఫీజు తీసుకుంటారు. అవసరమైన వారికి ఉచితంగా కూడా పని చేసి పెడతారు.లివింగ్ విల్ ఎప్పుడు అమలు చేస్తారు?బతికుండగానే రాసిన వీలునామాను ఎప్పుడు అమలు చేస్తారనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిబంధనల మేరకు ఈ వీలునామాను వైద్యులు, ప్రభుత్వ అధికారుల బృందం పర్యవేక్షణలో అమలు చేస్తారు. ఆఖరి రోజుల్లో రోగి తనకు తానుగా నిర్ణయం తీసుకోలేనప్పుడు లివింగ్ విల్ ఆధారంగా ముందుకెళతారు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమం అని లేదా ఇక కోలుకోలేరని కనీసం 2 మెడికల్ బోర్డులు ధృవీకరించిన తర్వాతే లివింగ్ విల్ ప్రకారం చర్యలు చేపడతారు.ఎవరెవరు రాశారు?ముంబైకి చెందిన పలువురు లివింగ్ విల్ రాసిపెట్టుకున్నారు. డాక్టర్ నిఖిల్ దాతర్(55), చార్టెడ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురాణిక్ (60), డాక్టర్ లోపా మెహతా(78), యశ్వంత్ కజ్రోల్కర్ (83) తదితరులు లివింగ్ విల్ రాసిన వారిలో ఉన్నారు. గైనకాలిస్ట్గా పనిచేస్తున్న నిఖిల్ దాతర్.. లివింగ్ విల్ మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సులభతరం చేసిన వెంటనే.. 2023, ఫిబ్రవరిలో వీలునామా రాశారు. అయితే ఈ వీలునామాను ఎవరికి ఇవ్వాలనే సమస్య ఆయనకు ఎదురైంది. దీంతో ఆయన బాంబే హైకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో చివరకు మహారాష్ట్ర ప్రభుత్వం వైద్య అధికారులకు ఈ వీలునామా సంరక్షణ బాధ్యతలు అప్పగించింది. వీలునామా రాయడం పెద్ద విషయం కాదు. సమయం వచ్చినప్పడు మనం రాసిన వీలునామాను ఎంత వరకు అమలు చేస్తారనేదే ముఖ్యమని డాక్టర్ నిఖిల్ దాతర్ అన్నారు.సహజ మరణం కోరుకుంటున్నాఅఖరి గడియల్లో తనకు వైద్య సహాయం అవసరం లేదని శివాజీ పార్క్ ప్రాంత నివాసి డాక్టర్ లోపా మెహతా అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించినప్పుడు వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్తో అందించే చికిత్స తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు. చివరి క్షణాల్లో తమ వారికి కాపాడుకునేందుకు ప్రయత్నించి ఆర్థికంగా, మానసికంగా నలిగిపోయిన ఎన్నో కుటుంబాలను చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ''చివరి రోజుల్లో నన్ను ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వస్తే.. నేను పనిచేసిన కింగ్ ఎడ్వార్డ్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకెళ్లండి. అక్కడ అనవసరమైన జోక్యం ఉండదని నేను నమ్ముతున్నాను" అని ఆమె పేర్కొన్నారు.అమ్మ బాధ చూసిన తర్వాత..మనం చనిపోతామని తెలిసినప్పుడు దాన్ని ఎందుకు ఆలస్యం చేయాలని ప్రశ్నిస్తున్నారు ఎయిరిండియా మాజీ ఉద్యోగి యశ్వంత్ కజ్రోల్కర్. పార్కిస్సన్ వ్యాధితో తన తల్లి అనుభవించిన నరకయాతన చూశాక, అలాంటి అవస్థ తనకు రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని ప్రఫుల్ పురాణిక్ వ్యక్తం చేశారు. బ్లడ్ క్యాన్సర్తో తన వదిన ఎంతో వేదన పడ్డారని, ఆమె బాధ చూసిన తర్వాత అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మనవాళ్లను కాపాడుకోవడానికి చేయాల్సిందంతా చేస్తాం. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసినప్పుడు మనం ఏమీ చేయలేం. నా పిల్లలు నన్ను.. వెంటిలేటర్పై ఉన్న వ్యాధిగ్రస్తులా కాకుండా, నేనున్నట్టుగానే గుర్తుపెట్టుకోవాల'ని కోరుకుంటానని ప్రఫుల్ పేర్కొన్నారు. -
ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..
చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న సినిమా ‘సయ్యారా’ (Saiyaara). మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అహాన్ పాండే సంగీతకారుడు క్రిష్కపూర్గా, హీరోయిన్గా అనీత్ పద్దా ఆశావహ జర్నలిస్ట్ వాణి బాత్రాగా నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ ప్రేమ కథ ఇది. ఇందులో వాణిబాత్రా పాత్రలో ఒదిగిపోయిన 22 ఏళ్ల అనిత అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు చూపిస్తాడు దర్శకుడు. ఆ వ్యాధి కారణంగా వాణి క్రిష్ మద్య సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని చుట్టూ సాగుతుంది ఈ సినిమా. అయితే ఆ సినిమాలో హీరోయిన్ మాదిరిగా చిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి బారినపడతామా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఇది 60 ఏళ్లు పైబడ్డాక వచ్చే వ్యాధి. మరి చిన్నవయసులోనే ఈ వ్యాధిబారిన పడే ఛాన్స్లు కూడా ఉన్నాయా అంటే..సినిమా కాబట్టి అలా కథ కోసం హీరోయిన్ చిన్న వయసులోనే అల్జీమర్స్ వ్యాధి బారినపడినట్లు చూపించారా..? లేక వాస్తవికంగానే అది నిజమా అంటే..ఔననే చెబుతున్నారు నిపుణులు. ఈ అల్జీమర్స్ వ్యాధి 65 ఏళ్లు పైబడిన వారికి వచ్చినప్పటికీ..కొన్నిసార్లు 30 లేదా 40 ఏళ్ల వారిని కూడా ప్రభావితం చేస్తుందట. అయితే 20 ఏళ్లలోపు వ్యక్తుల్లో మాత్రం అరుదుగా కనిపిస్తుందని చెప్పారు. తక్కువ వయసులోనే ఈ సమస్య బారినపడిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందట. ప్రధానంగా APP TSEN వంటి జన్యువులలో ఉత్పరివర్తనల కారణంగా చిన్న వయసులోనే ఆ వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఆ మూవీలో వాణి పాత్రలో ఒదిగిపోయిన హీరోయిన్లా అపస్మారక స్థితి, తలతిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవని అన్నారు. పైగా ఈ లక్షణాలు అల్జీమర్స్ వ్యాధిలో భాగం కాదని కూడా చెప్పారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఇటీవలే జరిగిన సంభాషణలు లేదా సంఘటనలు మర్చిపోవడంవస్తువులను తప్పుగా ఐడెంటిఫై చేయడంఒక ప్రదేశం లేదా వస్తువుల పేర్లను మర్చిపోవడంఆలోచించడంలో ఇబ్బంది పడటంపదేపదే ప్రశ్నించడంకొత్త విషయాలను ప్రయత్నించడానికి సంకోచించడంనిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటంఅలాగే ఆ సినిమాలో తన భర్తను చూడగానే వాణి తన వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకుంటున్నట్లు చూపించారు. కానీ రియల్గా అలా జరగదు. అంత స్పీడ్గా రికవరీ కావడం జరగదని చెప్పుకొచ్చారు నిపుణులు. వృద్ధాప్యంలో వచ్చే చిత్తవైకల్యానికి కారణం డిప్రెషన్ అయితే..చిన్న వయసులో ఈ వ్యాధి బారిన పడటానికి జన్యు సంబంధిత సమస్యలే కారణమని అన్నారు. పైగా దీన్ని కరెంట్ షాక్తో ట్రీట్మెంట్ చేయరని కూడా చెప్పారు. అయితే ఈ మూవీ జ్ఞాపకశక్తిని కోల్పోవడాన్ని ముందుగా గుర్తించాలనే విషయాన్ని హైలెట్ చేసింది. దీన్ని గనుక గమనించనట్లయితే అల్జీమర్స్ వ్యాధి తీవ్ర స్థాయికి చేరకమునుపే ఆయా పేషెంట్లను మందులు, కౌన్సిలింగ్లతో తర్వితగతిన నయం చేయగలుగుతామని అన్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
ఈ కేసులో నిర్దిష్టమైన ఆధారాలు తప్పనిసరి
నాకు గత కొంత కాలంగా విపరీతమైన నడుము నొప్పి వస్తుండటంతో ఒక సర్జన్ వద్దకు వెళ్ళాను. ఆయన సర్జరీ చేస్తే తగ్గుతుంది అని చెప్పి, నమ్మించి సర్జరీ చేశారు. కానీ నొప్పి పోలేదు. ఇప్పుడేమో నడుము కింది భాగంలో ఒక డిస్క్ సర్జరీ చేయాలని అంటున్నారు. ముందే ఎందుకు చెప్పలేదు అంటే, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు అంటున్నారు. గూగుల్లో చూస్తే మొదట చేసిన సర్జరీ అంత ఫలితాలు ఇవ్వదు, అసలు చేసింది కూడా దండగే అని ఉంది. ఆ సర్జన్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డబ్బు కోసమే చేశాడు అనుకుంటున్నాను. ఎలాంటి కేసులు వేయాలి? – విక్రమ్, తిరుపతి ఏంటండీ విక్రమ్ గారూ.. చాలా అక్రమంగా ఉన్నారే! ఒక అర్హత కల్గిన డాక్టరు అనుభవాన్ని, నిర్ణయాన్ని గూగుల్లో ఏదో చదివి తప్పు అని తేల్చేస్తారా? పోనీ అదే గూగుల్, యూట్యూబ్లో చూసి మీ సర్జరీ మీరే చేసుకోకపోయారా? ఒక క్వాలిఫైడ్ (అర్హులైన) డాక్టరు ఇచ్చే సలహాపై మీకేదైనా సందేహం ఉంటే మరొక డాక్టరు వద్ద అభిప్రాయం తీసుకోవాలి. అంతేగానీ గూగుల్ చెప్పింది అని కేసులు వేస్తాననుకోవటం సబబేనా? మీ సమస్యకి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని చెప్పే నైపుణ్యం మీకుందా?ఏది ఏమైనా, మీరు అడిగారు కనుక చట్టం మాత్రమే చెబుతాను. అలా చేయమని సలహా మాత్రం ఇవ్వను.1) భారత వినియోగదారుల సంరక్షణ చట్టం 2019 ప్రకారం, వైద్యసేవలు కూడా ‘సేవలు’ కిందికి వస్తాయి. ఒక వైద్యుని నిర్లక్ష్యం వల్ల మీరు శారీరక నష్టం అనుభవించి ఉంటే, మీరు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (కన్స్యూమర్ కోర్టు)లో కేసు వేయవచ్చు. అక్కడ మీరు నష్టపరిహారం, వైద్య ఖర్చులు, భవిష్యత్తు చికిత్సల ఖర్చులు సైతం కోరవచ్చు) 2) భారత న్యాయ స్మృతి కోడ్ (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం, డాక్టర్ నిర్లక్ష్యం క్రిమినల్ బాధ్యతకు దారి తీయవచ్చు. ప్రస్తుత చట్టం ప్రకారం, సెక్షన్ 106 (డాక్టరు నిర్లక్ష్యం వలన ప్రాణ నష్టం) – సెక్షన్ 125 (నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితి కల్పించటం) వంటి సెక్షన్ల కింద కేసు వేసే అవకాశం ఉంది. కానీ, దీనికి తగినంత పటిష్టమైన మెడికల్ ఆధారాలు ఉండాలి. కేవలం అనుమానాల ఆధారంగా క్రిమినల్ కేసులు వేయటం , అవి నిలబడటం కష్టం.ప్రతి వైద్యలోపం లేదా ప్రతికూల ఫలితాన్ని వైద్యుడి నిర్లక్ష్యంగా పరిగణించలేము. చికిత్సలు కొన్ని రిస్క్లతో ఉంటాయి. కాపాడాలని ప్రయత్నించే వైద్యులు కూడా ఎప్పుడో అపరాధులుగా/నిందితులుగా మారిపోతే, మన వైద్య వ్యవస్థ స్తంభించిపోతుంది.అమెరికా వంటి దేశాల్లో, వైద్యులు కేసుల ఉచ్చులో పడిపోతారనే భయంతో అవసరమైన చికిత్సలు ఇవ్వకుండా డిఫెన్సివ్ మెడిసిన్స్ పాటిస్తున్నారు. అంటే రోగికి కావాల్సింది కాకుండా, చట్టపరమైన సమస్యలు రాకుండా చికిత్స అందిస్తున్నారు! మన దేశం కూడా అదే దిశగా పోతే, ప్రజలే నష్టపోతారు.మీకు నిజంగా అన్యాయం జరిగిందని మీరు భావిస్తే... మొదట వైద్య నిపుణుల సలహా తీసుకోండి (ఇంకొక నిపుణుడి లిఖిత పూర్వక మెడికల్ అభిప్రాయం). అనంతరం ఒక న్యాయవాది ద్వారా సరిగా మీ కేసు గమనించి, ఏ మార్గం మీకు సరైందో నిర్ణయించండి.నిర్దిష్టమైన ఆధారాలతో మాత్రమే ముందుకెళ్లండి. ఎందుకంటే ఒక వైద్యుని ప్రొఫెషనల్ జీవితాన్ని కేవలం అనుమానాలతో లేక ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేస్తే, అందుకు తగిన చర్యలు సదరు వైద్యులు కూడా తీసుకోవచ్చని మరువకండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. ) -
'స్కాన్ అండ్ పే'తో తప్పుతున్న లెక్క..!
స్కాన్ అండ్ పే.. వినడానికి ఎంత సింపుల్గా ఉంది.. చిల్లర గొడవలేదు.. పెద్దనోట్ల బెడదలేదు.. అనిపిస్తోంది..కదా! అయితే స్కాన్ అండ్ పేతో ఆర్థిక నియంత్రణ కోల్పోతున్నామని, అకౌంట్లో డబ్బులు ఇట్టే ఖాళీ అయ్యేది కూడా తెలియడంలేదని పలువురు చెబుతోన్న మాట. డిజిటల్ పేమెంట్స్లో ఎంత సౌలభ్యం ఉందో.. అంతే ఇబ్బందులూ ఉన్నాయనేది వాస్తవం.. ఒకప్పుడు ఏదైనా ఖర్చు చేయాలంటే ముందుగా జేబు చూసుకునే అలావాటు ఉండేది. ఆన్లైన్ పేమెంట్స్ పుణ్యమాని అదికాస్త అదుపుతప్పింది.. ‘జస్ట్ స్వైప్ అండ్ బై’ ఆప్షన్తో నెమ్మదిగా నోట్ల కాలాన్ని మర్చిపోతున్న తరుణంలో ఒక సరికొత్త జీవన శైలికి అలవాటుపడ్డారు. ఈ సౌలభ్యంతో పాటు పెరిగిన ఖర్చులు, తగ్గిన పొదుపులు, అదుపులో లేని ఆర్థిక వ్యయాలకు సంబంధించిన అధ్యయనాలు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని హెచ్చరిస్తున్నాయి. ఆన్లైన్ పేమెంట్స్ సిటీ లైఫ్స్టైల్కు కొత్త ఊపునిచ్చాయి. వేగం, సౌలభ్యం, భద్రతను పెంచాయి. అయితే ఇదే క్రమంలో వ్యయం విషయంలో నియంత్రణను కోల్పోయేలా చేస్తున్నాయని, ఈ సౌలభ్యతతో పాటు ఖర్చులు పెరిగాయని, పుదపు పూర్తిగా తగ్గిపోయిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాల పేరుతో అదుపులేని ఖర్చులతో అప్పుల భారం పెరుగుతోందని, ఇది భవిష్య ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సూచిస్తున్నారు. సింగిల్ టచ్తో.. డిజిటల్ పేమెంట్స్ వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నామో మర్చిపోతున్నాం. సింగిల్ టచ్తో చెల్లింపులు జరిగిపోవడం వల్ల, ఆ ఖర్చు విలువ ఆ క్షణంలో తెలియడం లేదు. ఖరీదైన కాఫీ, ఫుడ్ డెలివరీ, కాస్మొటిక్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఫిట్నెస్ యాప్స్, విలాసవంతమైన గ్యాడ్జెట్లు.. ఇలా ప్రతి రోజూ చిన్న చిన్న ఖర్చులన్నీ కలిసిపోయి పెద్ద మొత్తాన్ని తినేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ విషయంలో నియంత్రణ కొరవడుతోంది. డబ్బు నోట్లను చేత్తో పట్టుకున్నప్పుడు కలిగిన భావన, డిజిటల్ నెంబర్ల రూపంలో ఉండడంలేదని చెబుతున్నారు. పాత రోజుల్లో జీతం వచ్చిన వెంటనే ఒక భాగాన్ని పొదుపుకు ఉంచే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు డబ్బు బ్యాంకులో క్రెడిట్ అయినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ వల్ల ఒక్క రోజు గడిచేలోపు వేగంగా ఖర్చవుతోంది. నెల చివరికి మిగిలే డబ్బు మిగలకపోగా క్రెడిట్కార్డులకు చేరువ చేస్తోంది. ఈ కారణంగా, పొదుపు ఖాతాల్లో నిల్వలు కరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే అలవాటు కూడా మందగిస్తోంది.ఆర్థిక భద్రత తప్పనిసరి.. హైదరాబాద్ వంటి పట్టణాల్లో యువతరం అత్యంత ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటారు. నేటితరం జీవనశైలిలో డిజిటల్ లావాదేవీలు.. షార్ట్స్ మెనూ డెలివరీలు, ఓటీటీ ట్రెండ్లు, ఇన్స్టంట్ బుకింగ్స్, ఈఎంఐలపై ఫోన్లు, గ్యాడ్జెట్లు, నిత్యం మారే డిజిటల్ ఖర్చులతో ఆర్థిక భద్రత కనుమరుగవుతోంది. పైగా ఇన్స్టెంట్ లోన్ యాప్స్పై ఆధారపడుతున్నారు. చిన్న వయసులోనే అప్పులు, క్రెడిట్ కార్డ్ బకాయిల సమస్య తలెత్తుతోంది. వ్యక్తిగత ఆర్థిక భద్రతపై అవగాహన కొరవడుతోంది. డిజిటల్ డిపెండెన్సీకి వ్యతిరేకంగా.. ‘పేమెంట్ సౌలభ్యం ఉండటం మంచిదే.. కానీ, అది మనం పొదుపు చేయడం మర్చిపోయే స్థాయికి వెళితే ప్రమాదమే’.. అన్నది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. డిజిటల్ ట్రాన్సాక్షన్ గణాంకాలు పెరగడమే కాకుండా, ఆర్థిక సమతుల్యత కూడా విపరీతంగా పెరుగుతోంది. సగం మందికిపైగా వినియోగదారులు తాము నెల మొత్తంలో చేసిన ఖర్చు ఎంతో గుర్తించలేని స్థితిలో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారని ఓ అధ్యయనం చెబుతోంది. ఖర్చులను ట్రాక్ చేసే టెక్నాలజీ.. డిజిటల్ మానిటరింగ్ టూల్స్ వినియోగం ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటాయని కొందరు సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో కాయిన్, వాల్నట్, ఈటీ మనీ వంటి కొన్న యాప్స్ నెలవారీ బడ్జెట్ అప్లికేషన్లు, ఖర్చులను ట్రాక్ చేయడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే, ‘స్పెండ్ బిఫోర్ యూ ఎర్న్’ తరహా మానసిక ధోరణికి బదులుగా ‘సేవ్ బిఫోర్ యూ స్పెండ్’ అలవాటుగా చేసుకోవాలి. -
టీచరమ్మకు స్వాగతం
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న గీతా గోపీనాథ్ ఆ పదవి నుంచి వచ్చే నెలలో వైదొలగనున్నారు. ఆ తరువాత తనకు బాగా ఇష్టమైన బోధన వృత్తిలోకి వెళ్లనున్నారు.‘ఐఎంఎఫ్’లో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్గా చరిత్ర సృష్టించారు గీత. ‘జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం’ అంటూ ‘ఐఎంఎఫ్’లో పనిచేయడం గురించి చెబుతారు గీత.గీత మళ్లీ బోధనరంగం వైపు రావాలనుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. హార్వర్డ్ యూనివర్శిటీలో బోధనకు విరామం ఇచ్చి ‘ఐఎంఎఫ్’లో చేరిన గీత మళ్లీ పాఠాలు చెప్పనున్నారు.‘నా మూలాల్లోకి తిరిగి వస్తున్నాను. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆర్థిక శాస్త్రంలో వచ్చే తరానికి శిక్షణ ఇవ్వడానికి నా తిరుగు ప్రయాణం ఉపయోగపడుతుంది’ అంటున్నారు గీత.‘ఐఎంఎఫ్’లో చేరడానికి ముందు గీతకు బోధన రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ షికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్, హార్వర్డ్ యూనివర్శిటీలలో పనిచేశారు.ఎంత జటిలమైన ఆర్థిక విషయాలనైనా సులభంగా బోధించడం గీతా గోపీనాథ్ ప్రత్యేకత. సమకాలీన సంఘటనలు, దినప్రతికలలో వచ్చే వ్యాసాలను ఉటంకిస్తూ వివిధ ఆర్థిక సిద్ధాంతాలను విద్యార్థులకు బోధించేవారు.గీత దిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తున్న కాలంలో మన దేశం ఫైనాన్సింగ్, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ నేపథ్యమే ఆమెను అంతర్జాతీయ ఆర్థిక విషయాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ఆ ఆసక్తి గీతా గోపీనాథ్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో ఉన్నతస్థానానికి తీసుకువెళ్లింది. -
ఇంద్రజాల ఆస్కార్ ఏం మాయ చేశావ్!
తన ఇంద్రజాల ప్రతిభతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన మెజీషియన్, మెంటలిస్ట్ సుహాని షా ప్రతిష్ఠాత్మకమైన ‘బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్–2025’ అవార్డు గెలుచుకుంది. ఇంద్రజాల రంగంలో ఈ పురస్కారాన్ని ఆస్కార్తో సమానంగా భావిస్తారు. అవార్డ్ గెలుచుకున్న సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది సుహాని షా.‘ఒక కల కంటే ఆ కలను నెరవేర్చుకోవడానికి గట్టిగా నిలబడాలి. కల నెరవేర్చుకోవడం అసాధ్యంగా అనపించవచ్చు. నీ వల్ల కాదు అని ఎంతో మంది అనవచ్చు. అయినా సరే పట్టుదల వీడొద్దు. పట్టుదలగా ముందుకు సాగినప్పుడే అద్భుతం జరుగుతుంది. కల నెరవేరుతుంది’ అని రాసింది సుహాని.బాల్యంలో టీవీలో వచ్చే మ్యాజిక్ షోలను కన్నార్పకుండా చూసిన సుహాని తాను కూడా మెజిషియన్ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. గత పాతిక సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 5,000 ప్రదర్శనలు ఇచ్చింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన సుహాని షా మెషిజియన్, మెంటలిస్ట్ మాత్రమే కాదు మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎంతోమందిని తన ఉపన్యాసాలతో దిశానిర్దేశం చేసింది. -
ఆరోగ్యం కోసం మైక్రోసాఫ్ట్ కెరీర్ని వదిలేసుకున్న సీఈవో..!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు. అందుకోసం అత్యున్నతమైన కెరీర్ని కూడా వదిలేస్తున్నారు. ఆ కోవకు చెందని వారే భారత సంతతికి చెందిన ఈ సీఈవో. ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చి మంచి కెరీర్కి స్వస్తి పలికిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారాయన. ఎందుకిలా అంటే..అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సీఈఓ సుధీర్ కోనేరు ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. ఆరోగ్యవంతంగా జీవించాలని మైక్రోసాఫ్ట్లో సుమారు 15 ఏళ్ల విజయవంతమైన కెరీర్కు స్వస్థి పలికి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన సియాటిల్కు చెందిన జెనోటీ అనే కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇది సెలూన్లు, స్పాలు, ఫిట్నెస్ కేంద్రాలకు మంచి వ్యాపార సాఫ్ట్వేర్ని అందిస్తుందట. అంతేగాదు 56 ఏళ్ల సుధీర్ మంచి ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరీ బెంగళూరు బ్రీతింగ్ వర్క్షాప్లకు హాజరవుతారట. అందుకోసం సుమారు రూ. 1లక్ష నుంచి 1.6 లక్షలు ఖర్చు చేస్తారు. కేవలం నాలుగు రోజుల ఈ బ్రితింగ్ వర్క్షాప్లకు ఆయన ప్రతి ఏడాది రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారట. ఈ సెషన్లలో ఆధ్యాత్మిక శ్వాస పద్ధతులకు సంబంధించి రెండు గంటల గైడ్లైన్స్, ధ్యానాలు ఉంటాయట. వాటిని సుధీర్ శరీరాన్ని అద్భుతంగా నయం చేసేవి, చాలా శక్తిమంతమైనవిగా పేర్కొంటారాయన.మైక్రోసాఫ్ట్లో సుధీర్ ప్రస్థానం..సుధీర్ 1992లో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ మేనేజర్గా కెరీర్ ప్రారంభించి..జస్ట్ ఎనిమిదేళ్లకే 2000లో తన సొంత కంపెనీ ఇంటెలిప్రెప్ను ప్రారంభించారాయన. సరిగ్గా 2008లో అంటే 39 ఏళ్ల వయసులో కెరీర్ మంచి పీక్ పొజిషన్లో ఉండగా యోగా, వాకింగ్, జాగింగ్ వంటి ఫిట్నెస్ కోసం కంపెనీని విడిచిపెట్టారు. తాను ఆర్థికంగా ఉన్నత స్థితిలోఉన్నా..కానీ ప్రస్తుత లక్ష్యం కేవలం తన వ్యక్తిగత శ్రేయస్సు తోపాటు కుటుంబంతో బలమైన బంధాలు ఏర్పరుచుకోవడమేనని చెబుతున్నారు సుధీర్. వర్క్ పరంగా తాను చాలా బెస్ట్ కానీ, కేవలం డబ్బు సంపాదించడమే కాదు..అంతకుమించి తన కోసం సమయం కేటాయించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని గ్రహించానంటాడు సుధీర్. అందుకోసమే రెండేళ్ల సుదీర్థ సెలవుల అనంతరం మైక్రోసాఫ్ట్ కంపెనీని నుంచి పదవీ విరమణ చేసి జెనోటిని స్థాపించానని తెలిపారు. తన కంపెనీ సంస్కృతిలో వెల్నెస్ సూత్రాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేగాదు తన సంస్థ పని సమయంలో యోగా, కిక్బాక్సింగ్, పైలేట్స్, వంటి ఫిట్నెస్ తరగతులను నిర్వహిస్తుంది. ఉద్యోగులు వీటిలో పాల్గొని వర్కౌట్లు చేసినట్లయితే మంచి పారితోషకం కూడా పొందుతారట. అంతేగాదు తన ఉద్యోగులకు స్పా, సెలున్లలో మంచి మసాజ్లు, ఆరోగ్యకరమైన స్నాక్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇక తన దృష్టిలో ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ని కలిగి ఉండటం కాదట. సమతుల్యమైన ఆహారంతో మంచి సామర్థ్యంతో జీవించడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ఇక సుధీర్ వీక్ఆఫ్లతో సహా వారం రోజులు ఉదయమే ఏడింటికే యోగా చేస్తారట. బాలికి వెళ్లి కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటారట. అక్కడ మసాజ్లు, సన్బాత్ వంటి చికిత్సలు తీసుకుంటారట. అలాగే బెంగళూరులోని నాలుగు రోజుల శ్వాస వర్క్షాప్లో కూడా పాలుపంచుకుంటారట.(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..) -
ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి నిల్వ చేయకూడదా..?
సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఫ్రిడ్జ్లో ఉంచం. సాధారణంగా బయట అరమాల్లో రెండింటిని ఒకే చోట ఉంచుతాం. కొందరైతే నేరుగా ఉల్లిపాయ బుట్టలోనే ఉంచుతారు. అయితే ఇలా మాత్రం అస్సలు ఉంచకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ప్రాణాంతంకమని, ఒక్కోసారి ఇలా నిల్వచేసిన వాటినే గనుక వండి తింటే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకు సరైన ఆధారాలు స్పష్టం కానప్పటికీ ఇలా రెండింటిని కలిసి నిల్వ చేయద్దని మాత్రం సూచిస్తున్నారు. ఎందుకంటే..ఇలా ఎప్పుడైతే రెండింటిని కలిపి నిల్వ చేస్తారో..అప్పుడు ఉల్లిలో విడుదలయ్యే ఎథెలిన్ బంగాళదుంపలతో చర్య జరిపి..త్వరగా మొలకెత్తేలా చేస్తుందట. అంతేగాదు అలాంటి బంగాళ దుంపల్లో సోలనిన్, చాకోనిన్ అనే విషాలు ఉత్పత్తి అవుతాయి. అవి గనుక తీసుకుంటే..అల్సర్లు, పేగువాపు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట. అంతేగాదు ఒక్కోసారి నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అధ్యయనంలో కూడా..అమెరికా సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన అధ్యయనాల ప్రకారం ఉల్లిపాయలు ఇథలీన్ను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే వాటి సమీపంలో ఇతర ఆహార పదార్థాలను ఉంచుతామో.. అవి త్వరగా పాడవ్వడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. అదీగాక ఈ బంగాళ దుంపలు సహజంగా సోలనిన్, చాకోనిన్ వంటి ఆల్కాలయిడ్లను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఉల్లిపాయల వద్ద వాటిని ఉంచగా..అవి త్వరగా మొలకెత్తి..పెద్ద మొత్తంలో విషపూరితమైన ఆల్కలాయిడ్లను విడుదల చేస్తుందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఈ పచ్చి లేదా చెడిపోయిన బంగాళ దుంపలు మానవులకు అత్యంత ప్రమాదమని అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల మొలకెత్తని తాజా బంగాళ దుంపలే తినడం మంచిదని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఈ రెండిని కలిపి నిల్వ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: నేచురల్ బ్యూటీ కోసం ఐదు పువ్వులు..! ఆ సమస్యలు దూరం..) -
అందాన్ని మరింత అందంగా మార్చే ఐదు పువ్వులు ఇవే..!
పువ్వులాంటి కోమలమైన అందం కోసం పడుతులు ఎంతగానో తపిస్తుంటారు. ఎన్నో క్రీమ్లు, లోషన్లు తెగ విచ్చలవిడిగా రాసేస్తుంటారు. అయినా మంచి ఫలితం ఉండక బాధపడుతుంటారు. అలాంటి వారు తప్పక ఈ ఔషధగుణాలున్న ఈ ఐదు పువ్వులను తప్పక ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ పువ్వులేంటో సవివరంగా తెలుసుకుందామా..!.చమోమిలే పువ్వులుచమోమిలే పువ్వులు వడదెబ్బకు కమిలిన చర్మాన్ని అందంగా మార్చుతుంది. ఎర్రబడిన చర్మాన్ని నార్మల్ స్థితికి తీసుకువస్తుంది. అలాగే చర్మం రంగుని కూడా కాంతిమంతంగా మారుస్తుంది. హానికరమైన యూవీ కిరణాలకు గురయ్యి..సన్బర్న్ తరుచుగా ఎదురవ్వుతుంది చాలామందికి. అలాంటి వారికి తాజా చమోమిలే టీ చక్కటి ఉపశమనం. అంతేగాదు చిన్న కాటన్ ప్యాడ్, లేదా టవల్ని ఆ లిక్విడ్లో ముంచి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.విచ్ హాజెల్విచ్ హాజెల్ పువ్వులను తోటలో సులభంగా పెంచవచ్చు, ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పువ్వులు మొటిమలతో పోరాడటమే కాకుండా సహజ ఆస్ట్రింజెంట్గా కూడా పనిచేస్తాయి. ఇది చర్మ కణాలు, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. జిడ్డుని తొలగించి, మొటిమల సమస్యను నివారిస్తుంది.కలేన్ద్యులా"గెండే కా ఫూల్" అని కూడా పిలిచే అద్భుతమైన వైద్యం. ఇది యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను, జుట్టుపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ని తొలగించి శుభ్రంగా ఉంచుతుంది. అనేక సౌందర్య సాధనాల్లో ఈ కలేన్ద్యులా పువ్వుని ఉపయోగిస్తారు. నల్లమచ్చలు, ఎరుపుని తగ్గించి, మృదువైన ఆకృతిని అందిస్తుంది.మందారపెద్ద పెద్ద ఎర్రటి మందార పువ్వులు చర్మం, జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. మందారలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంధోసైనోసైడ్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, రాడికల్ నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. మందారలోని అధిక ఆస్ట్రిజెంట్ లక్షణం అధిక నూనె స్రావాన్ని నియంత్రించి, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. జాస్మిన్చర్మంపై ఉండే వాపు, ఎరురంగు, చికాకుని నివారిస్తుంది. మొటిమల తాలుకు మచ్చలను కూడా తొలగిస్తుంది. యాంటీఏజింగ్ ప్రయోజనాలను కలిగి ఉంది. అలాగే యూవీ కిరణాలను, కాలుష్యం వంటి సమస్యల నుంచి రక్షించచేలా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది అకాల వృద్ధాప్య సమస్యను నివారస్తుంది. జాస్మిన్ క్రీమ్ లేదా నూనె అనేక నొప్పులను, తిమ్మిరుల నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే ముఖంపై ఉండే గాయలు, కోతలకు చక్కటి క్రిమిసంహార మందులా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చివరగా సహజసిద్ధమైన అందం కోసం రోజూ చూసే ఈ ఐదు మొక్కలతో అందాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. పైగా ఇవి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.(చదవండి: A2 నెయ్యి' అంటే..? దీనికి మాములు నెయ్యికి తేడా ఏంటంటే..) -
రుతుక్రమ వ్యర్థాలపై పోరు: హైదరాబాద్లో 'పీరియడ్. ప్లానెట్, పవర్, ఎకో ఎడిషన్' సక్సెస్
హైదరాబాద్, జూలై 22, 2025: హైదరాబాద్లో సెయింట్ ఆన్స్ కాలేజ్(St. Ann’s College) ఫర్ ఉమెన్లో రుతుక్రమ వ్యర్థాలు, అవి మానవ ఆరోగ్యంపై, పర్యావరణంపై చూపే ప్రభావం వంటి అంశాలపై సుదీర్ఘకాలంగా నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదించే ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం సమాచారం అందించడానికే కాకుండా, తరతరాలుగా మూఢనమ్మకాలు, భయాలతో నిండిన సామాజిక సమస్య గురించి యువతుల్లో స్ఫూర్తిని, అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో బహిరంగంగా చర్చించడానికి సంకోచించిన అనేక విషయాలను ఇప్పుడు నిర్భయంగా చర్చించారు.ఈ కార్యక్రమానికి "పీరియడ్. ప్లానెట్. పవర్. ఎకో ఎడిషన్" అని పేరు పెట్టారు. రుతుక్రమంపై ఉన్న అపోహలను తొలగించి, కీలకమైన వాస్తవాలను తెలియజేయడం దీని లక్ష్యం. ప్రస్తుతం వాడుతున్న సాధారణ శానిటరీ ప్యాడ్లలో చాలా ప్లాస్టిక్ ఉంటుంది. ఒక ప్యాడ్ దాదాపు 4 ప్లాస్టిక్ సంచులతో సమానం. అవి కుళ్ళిపోవడానికి, భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. భారతదేశంలో ఏటా లక్ష టన్నులకు పైగా రుతుక్రమ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. అందుకే, పర్యావరణానికి, శరీరానికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఇప్పుడు చాలా అవసరం."నో ప్లాస్టిక్ ఆన్ ప్రైవేట్" అనే ఒక ముఖ్యమైన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని(Manjula Anagani) నడిపిస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కల్పించడానికి డాక్టర్ నబత్ లఖాని(Nabat Lakhani) (మహిళల ఆరోగ్యం, రుతుక్రమ అవగాహనపై పని చేస్తున్న మర్హమ్ ఎన్జీవో స్థాపకురాలు), అలాగే 95 మిర్చి హైదరాబాద్ బృందం, రోటరాక్ట్ వంటి సంస్థలు ముందుకొచ్చాయి.ప్లాస్టిక్ ప్యాడ్లు కేవలం భూమిని పాడుచేయడమే కాకుండా, మన శరీరానికి కూడా హాని కలిగిస్తాయి. ఒకసారి వాడి పారేసే ప్యాడ్లలో సింథటిక్ పదార్థాలు, బ్లీచులు, ఇతర హానికర రసాయనాలు వాడతారు. వీటి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, చికాకు కలగవచ్చు. అంతేకాకుండా, ఇవి దీర్ఘకాలంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి ఇతర సమస్యలకూ దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాడిన ప్యాడ్లను సరిగ్గా పారవేయకపోతే, అవి నేల, నీరు, గాలిని నిరంతరం కలుషితం చేస్తూనే ఉంటాయి. పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా అవసరం.ఈ కార్యక్రమంలో వాస్తవాలతో కూడిన సమాచారంతో, ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా చర్చించారు. హాస్యాన్ని పంచుతూ విద్యార్థినులను వారు వాడుతున్న రుతుక్రమ ఉత్పత్తుల గురించి మళ్లీ ఆలోచించుకోవాలని ఈ సెషన్లో ప్రోత్సహించారు. దీంతోపాటు, పర్యావరణానికి మేలు చేసే, ఆరోగ్యానికి మంచివైన ప్రత్యామ్నాయ క్లాత్ ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్పులు, పీరియడ్ ప్యాంటీలు, బయోడిగ్రేడబుల్ ప్యాడ్ల గురించి తెలుసుకుని, వాటిని ఉపయోగించాలని ప్రోత్సహించారు. ఈ విధంగా, రుతుక్రమ ఆరోగ్యం, పర్యావరణం రెండింటికీ మేలు చేసే పద్ధతులకు మద్దతుదారులగా మారాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.'ప్లాస్టిక్ ఫ్రీ జులై'లో భాగంగా, 95 మిర్చి హైదరాబాద్ బృందం పర్యావరణానికి మేలు చేసే రుతుక్రమ ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించింది. రూపల్ టీమ్ లీడ్గా, ఆర్జే గౌరిక, శుభాంగి హోస్ట్లుగా వ్యవహరించారు. వీరు బాలీవుడ్ పాటలను పేరడీలుగా మార్చి పాడుతూ, ప్లాస్టిక్ రహిత పీరియడ్ ఉత్పత్తులకు మారాలనే విషయాన్ని నొక్కి చెప్పారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పీరియడ్స్ గురించి ఉన్న అపోహలను తొలగించారు. పర్యావరణ స్పృహతో పీరియడ్ ఉత్పత్తులను వాడేవారిలో తాము కూడా భాగమవుతామని ప్రతిజ్ఞ చేశారు. -
'A2 నెయ్యి' అంటే..? దీనికి మాములు నెయ్యికి తేడా ఏంటంటే..
నెయ్యి తినడం మంచిదని విన్నాం. ఇటీవలకాలంలో పోషకాహార స్పృహ ఎక్కువై..మంచి విటమిన్లుతో కూడిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదో తిన్నామంటే తినడం కాకుండా..ఆరోగ్యదాయకమైన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఒకటే ఈ 'ఏ2 నెయ్యి' . దీన్ని ఆధునిక సూపర్ ఫుడ్గా కీర్తిస్తున్నారు. అంతేగాదు ఆయుర్వేద గ్రంథాల్లో సైతం దీన్ని "లిక్విడ్ గోల్డ్"గా వ్యవహరిస్తున్నారు. అసలేంటీ నెయ్యి..? మాములు నెయ్యికి దీనికి ఉన్న తేడా ఏంటంటే..ఏ2 నెయ్యి అంటే..గిర్, సాహివాల్ మరియు రతి వంటి స్వదేశీ భారతీయ ఆవుల పాల నుంచి తీసిన నెయ్యిని ఏ2 నెయ్యిగా వ్యవహరిస్తారు. దీన్ని తీసే విధానంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుందట. ఎందుకంటే మాములు వాటిలో పచ్చి పాల నుంచే నేరుగా నెయ్యిని సెపరేట్ చేయరు. పెరుగుగా తోడుపెట్టి పులిసిన మజ్జిగ నుంచే వెన్నను సెపరేట్ చేసి చక్కగా కాస్తారు. ఇది చూడటానికి గోల్డెన్ రంగులో సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట. ఇందులో బీటా కేసిన్ ప్రోటీన్ మాత్రమే ఉంటుందట. అదే సాధారణ వాణిజ్య పాల్లో ఏ1 బీటా కేసిన్ ఉంటుందట. అంతేగాదు ఈ ఏ2 పాలు టైప్ 1 డయాబెటిస్, కరోనరి హార్ట్ డిసీటజ్ ఆర్టెరియోస్క్లెరోసిస్ ఆటిజం, స్కిజోఫెనియా వంటి శిశు ఆకస్మిక మరణాలను నివారించగలదట. ఈ ఏ2 నెయ్యిని 5 వేల ఏళ్లనాటి పురాతన పద్ధుతుల్లో చేయడం వల్లే ఇన్ని విటమిన్స్ , పోషకాలు సమృద్ధిగా ఉంటాయిట.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే.. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డీ, కాల్షియం, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ కే, ఒమేగా 3, ఒమేగా 9 తదితర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవేగాక మెదడు పనితీరుని మెరుగుపరిచే సంయోగ లినోలిక్ ఆమ్లం (CLA) వంటివి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అథ్లెట్లు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే సామర్థ్యం పెరుగుతుంది కూడా. అలాగే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్కు మద్దతు ఇచ్చి, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తుంది. పాలు, పన్నీర్ వంటివి పడవని వారికి ఈ ఏ2 నెయ్యి మంచి సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చర్మం, జుట్టు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నివారిస్తుందా..ఈ ఏ2 నెయ్యి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. సహజమైన మెరుపుని అందిస్తుంది. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరిచి, జుట్టురాలు సమస్యను నివారిస్తుంది. ఇందులో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ఉంటుందట. అలాగని మితీమిరీ వినయోగించొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎప్పుడు సమతుల్యతకు పెద్దపీట వేస్తే..ఏదైనా ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.(చదవండి: 56 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే..! పెద్దాళ్లు కాస్తా చిన్నపిల్లల్లా..) -
56 ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తే..! ఈ పెద్దాళ్లు కాస్తా..
పెళ్లి, పిల్లలు, కెరీర్ సెటిల్మెంట్తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు అందరు. కాసేపు మన బాల్యపు స్మృతుల్లోకి వెళ్దామన్నా..ఆలోచన కూడా రాదు. కానీ ఒక్కసారి నాటి స్నేహితులను, నాటి చిలిపి పనులు గుర్తొస్తేనే..కళ్ల నుంచి నీళ్లు అప్రయత్నంగా జాలువారతాయి. ఆ స్వీట్మెమొరీస్ ఎవ్వరికుండవు చెప్పండి. కాకపోతే..ఉరుకుల పరుగుల జీవన విధానంలో కాసేపు ఆగి వెనక్కి చూసే అవకాశం చిక్కకపోవడమే తప్ప. నాటి స్నేహితులను కలిసినా..టచ్లో ఉన్నా..కళ్లముందు ఆ మధుర జ్ఞాపకాలు మెదిలాడుతూనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే అలాంటి భావోద్వేగపు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు ఈ ఐదుగురు ఆంటీలు.ఒక మహిళ తన నలుగురు స్నేహితులతో కలసి తాము చదువుకున్న పాఠశాల కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ MAMCని సందర్శిస్తారు. అదికూడా దాదాపు 40 ఏళ్ల అనంతరం తమ చిన్ని నాటి జ్ఞాపకాలను వెదుకుతూ..వచ్చారు ఆ ఐదుగురు 50 ఏళ్ల మహిళలు. ఆ పాఠశాల ఆవరణం, తరగతి గదులు చూస్తూ..నాటి మధుర స్మృతుల్లోకి జారిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఐదుగురు ఆంటీల్లో ఒకామె తాము సరిగ్గా 40 ఏళ్ల తర్వాత మా స్వీట్మెమొరీస్ వెతుక్కుంటూ ఈ స్కూల్కి వచ్చాం. తాము 56 ఏళ్ల చిన్నారులమని నవ్వుతూ చెబుతున్నారు ఆ వీడియోలో. ఇక్కడ మా కలలు కనిపిస్తాయి. మేం చేసిన చిలిపి అల్లర్లు గుర్తుకొస్తాయి. ఈ పాఠశాల కలియ తిరుగుతుంటే..మా కాలు తడబడదు..భావోద్వేగంతో ఉబ్బితబ్బిబవుతుందంటున్నారు వారంతా. ఆ మహళలంతా చీరలు ధరించి అలనాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ ఆ పాఠశాల చుట్టూ కలియతిరిగారు. తాము ఆ పాఠశాలో 1987 బ్యాచ్కి చెందినవాళ్లమని చెప్పుకొచ్చారు కూడా. ఈ మధురానుభూతి వెలకట్టలేనిది, మాటలకందనిది అంటున్నారు ఆ మహిళా స్నేహితులు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక అంతా తమ బాల్యపు స్మతుల్లోకి వెళ్లిపోయారు. ఎవ్వరికైనా.. స్కూల్ చదువు ఓ అద్భుత వరం..అది ఎవ్వరికైనా మధురానుభూతులను పంచే గొప్ప భావోద్వేగపు అనుభూతి కదా..!. View this post on Instagram A post shared by Kakali Biswas (@phoenix_stories) (చదవండి: ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు! ఈ జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు) -
కొంపముంచుతున్న ఆన్లైన్ పరిచయాలు..!
తెలంగాణ ఉమ్మడిక కరీనంగర్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన బాలిక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతో బాలిక ఇంట్లో చెప్పకుండానే రాయలసీమకు పారిపోయింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఇంటికి తిరిగి వచ్చింది. తొమ్మిదో తరగతి చదివే తన కూతురు మారాం చేస్తోందని తండ్రి స్మార్ట్ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్తో ఆమె తన స్నేహితులతో కాలక్షేపం చేయడం ప్రారంభించింది. ఇదేసమయంలో వివిధ వెబ్సైట్లు ఓపెన్చేసి సంబంధం లేని అనేక అంశాలకు ఆకర్షితురాలైంది. చివరకు చదవడం పక్కన పెట్టేసింది. ఫోన్ చేతిలో లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది.ఓ గ్రామంలో బాలిక(16), యువకుడు(20) ఏకాంతంగా ఉండడాన్ని గమనించిన యువకులు.. వారిని పట్టుకుని కొలువుదీరిన కుల సంఘం వద్దకు తీసుకెళ్లారు. కుల పెద్దలు పంచాయితీ పెట్టగా.. తాము ఏడాదిగా ప్రేమించుకుంటున్నామని బాలిక, యువకుడు చెప్పేశారు. మైనార్టీ తీరిన వెంటనే పెళ్లి చేయాలని పంచాయితీ పెద్దలు నిశ్చయించారు. రామగుండానికి చెందిన ఓ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. హాస్టల్లో వసతి పొందుతోంది. కార్యాలయం నుంచి తీసుకొచ్చే ర్యాపిడో డ్రైవర్తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారించినా వినకుండా డ్రైవర్ను పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమోగానీ యువకుడు వేధించగా తాళలేక సఖి కేంద్రాన్ని ఆశ్రయించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక, సోషల్మీడియా ప్రభావంతో టీనేజ్ యువత ఇలా దారితప్పుతోంది. ఎదిగీఎదగని వయసు.. తెలిసీ తెలియని మనసు.. ఆకర్షణ.. ఆపై తప్పటడుగులు.. వెరసి టీనేజ్ను ట్రాక్ తప్పేలా చేస్తోంది. మరోవైపు.. సామాజిక మాధ్యమాలు కౌమరంపై విషం చిమ్ముతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, వాట్సప్, ఓటీటీలు, సీరియల్స్, రీల్స్ విషబీజాలు నాటుతున్నాయి. ప్రేమ పేరిట కొందరు, పరిచయం పేరిట మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్మార్ట్గా వల విసిరి చాటింగ్తో మొదలుపెట్టి.. ముగ్గులోకి దింపుతున్నారు.. అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. ఇలా చోటుచేసుకునే దారుణం గురించి తెలియక బాలికలు, యువతులు మోసపోతున్నారు. తల్లిదండ్రుల అతిగారాబమో, అతి నమ్మకమో, నిర్లక్ష్యమో తెలియదు గానీ.. యూత్ ట్రాక్ తప్పుతోంది. చివరకు ఠాణా మెట్లెక్కి బోరున విలపించడం తప్ప చేసేదేమీలేక చూస్తూ ఉంటోంది. ఇలా ఒకటికాదు రెండు కాదు.. నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక పరువుపోతుందని మిన్నకుండిన వారు వేలల్లో ఉంటున్నారు. కొంతకాలంగా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వస్తున్న ‘టీనేజ్ లవ్’లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక.. పిల్లలు అల్లరి చేస్తున్నారని, ఫోన్ ఇస్తే వారిపనివారు చేసుకుంటారని కొందరు, ఉపాధి కోసం భర్త లేదా భార్య విదేశాలకు వెళ్తూ పిల్లలను పెద్దల వద్ద ఉంచుతున్నారు. వృద్ధాప్యంలోని తమ తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఏ మేరకు గమనిస్తున్నారోననే విషయం గమనించక ముందే ప్రమాదం జరిగిపోతోంది. మితిమీరిన స్వేచ్ఛ, చేతిలో అవసరానికి సరిపడా సొమ్ము ఉండడంతో హైస్కూల్ వయసు నుంచే ప్రేమ అనే ఆకర్షణ వైపు టీనేజ్ను నడిపిస్తున్నది. ఉపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పదు. కానీ అదే సమయంలో పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. మరోపక్క.. సామాజిక మాధ్యమాల ద్వారానూ అనేక మోసాలు జరుగుతున్నాయి. కొందరు యువకులు యువతుల్లా నటిస్తూ అవతలి యువతుల ఫొటోలు సేకరిస్తారు. వాటిని ఆ యుతులకే పంపించి బెదిరిస్తున్నారు. ఇంకొందరైతే అమ్మాయిల పేరిట ఖాతాలు సృష్టించి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పంపించి ఆకట్టుకునేందుకు యతి్నస్తారు. ఆ వల వల విసిరి నమ్మించి మోసం చేస్తారు. ఒక్కోసారి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో కొన్నిమార్పు వస్తుంటాయి. అందుకే.. స్మార్ట్ఫోన్పాటు సోషల్ మీడియా అకౌంట్లను తరచూ పరిశీలించాలి. ఎన్ని పనులు ఉన్నా వారి ప్రవర్తనను నిశితంగా గమయనించాలి. ట్రాక్తప్పిన వారు తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు అంటున్నారు.పర్యవేక్షణ తప్పనిసరి తల్లితండ్రులు తమ పిల్లలపై అనేక ఆశలు పెట్టుకుంటారు. బాగా చదివిస్తుంటారు. కానీ, వారి పర్యవేక్షణ కూడా చాలాఅవసరం. ప్రస్తుతం మొబైల్ఫోన్ చాలాకీలకం. పిల్లలకు చదువులకు ఉపయోగపడుతోంది. కానీ... ఇందులోని సోషల్ మీడియా, సినిమాల ప్రభావం, ఆ దశలో వచ్చే మార్పు పిల్లలపై బాగా పడుతోంది. తల్లిదండ్రులిద్దరూ సంపాదనపై దృష్టిపెట్టి పిల్లలను పట్టించుకోకపోతే ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే.. – డాక్టర్ రవివర్మ, సైకియాట్రిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!
మనిషి శరీరంలో మెదడు అద్భుత శక్తివంతమైన భాగం. ప్రశాంతతకు, మన భవితను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుపాత్ర అత్యంత కీలకం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ తరుణంలో మనిషి మెదడుకు మరింత పదును పెట్టాలి్సన పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు రోజుకు 12 గంటలు కంప్యూటర్లకే అతుక్కుని పోతుండగా.. ఏ పనీపాట లేనివారు రోజుకు 18 గంటలు సెల్ఫోన్లో గడుపుతున్నారు. మెదడు ఒత్తిడికి గురై న్యూరో సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా జూలై 22న జాతీయ మెదడు దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా కథనం.. ‘గతం గురించి ఆలోచించను. భవిష్యత్తుపై బెంగపెట్టుకోను. వర్తమానంలోనే జీవిస్తా. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రచిస్తా. ఫలితం కంటే ప్రక్రియపై దృష్టిసారిస్తా. ప్రక్రియ ఉప ఉత్పత్తే ఫలితం’ అని అంటాడు మహేంద్రసింగ్ ధోని. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మెదడుకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్రెయిన్కు వచ్చే ప్రమాదకర వ్యాధులలో బ్రెయిన్ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇటీవల పక్షవాతం, పార్కిన్సన్ వంటి వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధులు మెల్లమెల్లగా మనిషి శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.తేలికగా తీసుకోవద్దు...మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి అయినప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటారు. దీంతో న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మెదడు సంబంధ వ్యాధులతో పోరాడుతున్న ఏ వయసు వారికైనా ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్యులు చెబుతున్నారు.ఆదిలోనే గుర్తిస్తే..శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏపనినైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే ఒత్తిడిని ఎదుర్కొనటమే కాదు.. ఏపనిపైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే అలాంటి మానసిక సమస్యలను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు. చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటంతో పాటు సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారని.. తద్వారా అది క్రమంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితికి దారితీస్తుందంటున్నారు. ఒత్తిడి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మేలని సూచిస్తున్నారు.ఏటా సుమారు 30 వేల మంది..ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 30 వేల మంది మానసిక ఒత్తిళ్లతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. వీరిలో చాలామంది ఒత్తిడికి గురయ్యాక ధూమపానం, మద్యం సేవనం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసై, తమ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజం నిర్లక్ష్యంగా ఉండటం, అవగాహన లోపించడం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. జయిద్దామిలా..ఎప్పుడు ఒత్తిడికి గురవుతున్నామో ఒకచోట నమోదు చేసుకోవాలి.ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి పద్ధతులు అవలంబించాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి.కెఫిన్ ఎక్కువగా ఉండే కాపీ, శీతల పానీయాలు తాగటం మానేయాలి.ప్రతికూల ఆలోచనలను మొగ్గ దశలోనే తుంచేయాలి.ఒత్తిడికి గురైనప్పుడు.. దాని నుంచి బయ టపడటానికి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలి.మెదడు వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దుమెదడుకు సంబంధించి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్స్, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులకు మానసిక ఒత్తిడే కారణం. ముఖ్యంగా పిల్లల్లో సెల్ఫోన్ వాడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయంపై జాగ్రత్త వహించాలి. ప్రతీ ఒక్కరికి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం. – డాక్టర్ రాజీవ్రెడ్డి, న్యూరోసర్జన్, మెడికవర్ (చదవండి: నేచర్లో' నేర్చుకో..! ఆరుబయట అభ్యాసం..అరుదైన అనుభవం..) -
కల్యాణ వైభోగమే : మూడు రోజుల పెళ్లి, ఆధునికతకు పెద్ద పీట
సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్): రాజులు, జమీందారీ వ్యవస్థలో పెళ్లి వారం రోజుల వేడుక కాగా, తర్వాత కాలంలో సాదాసీదాగా మారి ఇప్పుడు మూడు, ఐదు రోజుల ముచ్చటయింది. పసుపు దంచడంతో మొదలయ్యే పెళ్లి వేడుకల్లో ఒకరోజు మెహందీ, మరో రోజు సంగీత్, గానా భజాన, ఇంకోరోజు మంగళ స్నానాలు, కూరాడు, పెళ్లికూతురు ముస్తాబు మరుసటి రోజు పెళ్లితంతు అన్ని కూడా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు.వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పెళ్లి నాటి జ్ఞాపకాలను భద్రంగా దాచుకునేలా ఫొటోగ్రఫీకి పెద్ద పీట వేస్తున్నారు. ఆహ్వానంతో మొదలయ్యే ఫొటోగ్రఫీ ప్రీ వెడ్డింగ్, హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలను చిరస్థాయి జ్ఞాపకాలుగా మిగుల్చుకునేలా ఫొటో, వీడియోగ్రఫీలకు ప్రాధాన్యత పెరిగింది. రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఫొటోగ్రఫీ చార్జీలు పెరగడం చూస్తే వధూవరులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అర్థమవుతుంది.నవంబర్ వరకు ముహూర్తాలుఈనెల 24 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈనెలలో 26,30,31, ఆగస్టులో 1,3,5,7,8,9, 10,11,12,13,14,17 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం. ఇది శూన్యమాసం పెళ్లి ముహూర్తాలు లేవు. మళ్లీ సెప్టెంబర్లో 23, 24,26,27,28, అక్టోబరులో 1,2,3,4,8,10,11,12,22, 24,29,30,31, నవంబర్లో 1,2,7,8,12,13,15,22,23, 26,27,29,30వ తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. – నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్ఆధునికతకు ప్రాధాన్యతపెళ్లి, ఇతర కార్యక్రమాల్లో ఆధునీకతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా అలంకరణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. సంప్రదాయలతోపాటు శోభాయాయానంగా ఉండేలా డేకరేషన్ చేస్తున్నారు. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, కరీంనగర్ ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 25 శ్రావణమాసం మొదలు నవంబర్ చివరి వరకు ఊరువాడ పెళ్లి సందడి నెలకొననుంది. బంగారు నగల దుకాణాలు, పెళ్లివస్త్రాలయాలు కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో సుమారు 5వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని ముహూర్తాలు నిర్ణయించే పురోహితులు చెప్తున్నారు. కాగా, మారిన కాలానికి అనుగుణంగా సంగీత్, మెహెందీ, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటి అదనపు కార్యాలు చోటు చేసుకుంటూ వివాహ వ్యయాన్ని భారీగా పెంచేశాయి. జీవితంలో ఒకేసారి జరిగే వేడుకనే కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వివాహాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక్కో పెళ్లికి రూ.10 లక్షలకు తగ్గకుండా ఖర్చు పెడుతుండడం ఇప్పుడు సర్వసాధారణమైంది. – సిరిసిల్లకల్చరల్/విద్యానగర్(కరీంనగర్) -
ఉత్సాహంగా 'సైకిల్ ఫర్ ఏ కాజ్'..!
సామాజిక అభివృద్ధి, బాధ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ‘సైకిల్ ఫర్ ఏ కాజ్’ పేరుతో రైడ్ నిర్వహించారు. రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా చేపట్టిన ఈ ఈవెంట్లో 120 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. రాడిసన్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అభివృద్ధికి, అవగాహనకు మద్దతివ్వడంలో భాగంగా నిర్వహించిన ఈ రైడ్లో సైక్లిస్టులు రైడ్ ఫర్ హోప్ (3 కి.మీ), రైడ్ ఫర్ చేంజ్ (6 కి.మీ), రైడ్ ఫర్ ఇంపాక్ట్ (50 కి.మీ) వంటి మూడు విభాగాల్లో పోటీపడ్డారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ జోషి మాట్లాడారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో దీనిని నిర్వహించామన్నారు. ఈ సైక్లోథాన్ కేవలం సైక్లింగ్ మాత్రమే కాదు, సమాజంలో నిజమైన మార్పే దీని ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. నయనానందకరం అనుష్క నృత్యంనాట్య గురువు ప్రమోద్రెడ్డి శిష్యురాలు చెరుకు అనుష్క భరతనాట్యం నయనానందకరమని ఐపీఎస్ అధికారి ఎం.రమేష్ అన్నారు. రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనుష్క అరంగేట్రం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయ నృత్యం పట్ల అవగాహన కల్పిచి శిక్షణ ఇప్పించాలని అన్నారు. ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, మరోవైపు సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతి, వర్ణం, థిల్లాన, ప్రదోష సమయం వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శన అహూతులను ఆకట్టుకుంది. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నాట్య గురువు అనుపమ కైలాష్, తల్లిదండ్రులు చెరుకు గోవర్ధన్రెడ్డి, అంజలి పాల్గొన్నారు. (చదవండి: కాశీ నేపథ్యంలో.. 'కైలాసవాస శివ'..) -
కాశీ నేపథ్యంలో.. 'కైలాసవాస శివ'..
శివుడి అనుమతి ఉంటేనే కాశీ వెళ్లగలమని, శివతత్వాన్ని మరోసారి పాటలో ప్రతిబింబించారని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ నేతృత్వంలో రూపొందించిన ‘కైలాసవాస శివ’ పాటను నగరంలోని ప్రసాద్ ల్యాబ్ వేదికగా సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల, శ్రీనివాస్ అవసరాల, బీవీఎస్ రవి, యదువంశీ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పాట విన్నాక భావోద్వేగంతో మళ్లీ ఓసారి కాశీకి వెళ్లాలనిపించిందని భరణి అన్నారు. ఆసియాలోనే అత్యంత ప్రాచీన నగరమైన కాశీ, కాశీ సాహిత్యానికి సంబంధించి తెలుగులో మొదటిసారి ఏనుగుల వీరాస్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ను రచించారని గుర్తు చేశారు. రౌద్రానికి భిన్నంగా శాంతి సంగీతం.. కుంభమేళా జరిగిన నెల రోజులకు కాశీ వెళ్లి ఈ పాట చిత్రీకరించామని సంగీత దర్శకులు అనుదీప్ అన్నారు. శివుడి పాటలంటేనే గుర్తొచ్చే స్వరం.. విజయ్ ప్రకాశ్. ఆయనే తెలుగు, హిందీ భాషల్లో ఈ పాట పాడారు. అద్భుతమైన తెలుగు పదాలతో కిట్టు రాసిన ఈ పాట ప్రైవేట్ ఆల్బమ్స్లో పెద్ద హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఈ పాట నిర్మాణానికి ఎస్ఆర్డీ సంస్థ ఆర్థిక సాయం అందించింది. శివుడి పాట అంటే రౌద్రం, హై పిచ్ మ్యూజిక్ ఎక్కువ. కానీ శివుడిలోని ధ్యాన సంద్రం, శాంతిని ప్రతిబింబించేలా స్లో మెలోడీలో ఈ పాట చేశామని పేర్కొన్నారు. డైరెక్టర్ నాగ్ అర్జున్ రెడ్డి, మాలిక్రామ్, హర్షితా రెడ్డి, కమిటీ కుర్రోళ్లు సిసీ బృందం పాల్గొని సందడి చేసింది. (చదవండి: -
'నేచర్లో' నేర్చుకో..! ఆరుబయట అభ్యాసం..
ఆకాశంలో తారలు, చందమామల గురించి మనకు తెలుసు. చెట్లూ పుట్టల గురించి కూడా మనకు తెలుసు.. అయితే వీటిలో చాలా వరకూ మనం నాలుగు గోడల మధ్య తరగతి గదిలో కూర్చుని చదువుకున్నాం.. కాబట్టి మనకు అవగాహన ఉంది.. కానీ ఆకాశంలోకి చూస్తూ.. నక్షత్రాల గురించి, అడవిలో నడుస్తూ ఆకులు, చెట్ల గురించి తెలుసుకోవడం ఎలా ఉంటుంది? ‘అదే అసలైన చదువు’ అంటున్నారు పలువురు నగరవాసులు. అవుట్ డోర్ క్లాస్ రూమ్ లెసన్స్కి జై కొడుతున్నారు. ప్రస్తుతం ఆకాశం వైపు చూడటం కంటే మొబైల్ స్క్రీన్లనే పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు. చందమామను కూడా తల్లులు మొబైల్స్లోనే చూపించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలైన చదువు అంతా ఆరుబయటే ఉందని భావించిందో మిత్రబృందం. అనుకున్నదే తడవుగా ఓ కొత్త ఆలోచనకు తెరతీసింది. తద్వారా అవుట్ డోర్ క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసింది. సరికొత్త తరగతి గదులను నగరవాసులకు పరిచయం చేస్తోంది. ‘ఈ కాన్సెప్్టని కోవిడ్ సమయంలో ఆలోచించాం. నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టాం. తొలిదశలో మొత్తం ఐదారుగురమే కానీ, ఇప్పుడు మా టీమ్ 25కి చేరింది’ అంటూ చెప్పారు మాజీ ఐటీ ఉద్యోగి రాఘవ. తమ కాన్సెప్ట్ గురించి ఆయన పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. వాట్సాప్ గ్రూప్గా ప్రారంభమై.. నా స్నేహితుడు దేవేందర్, ఐశ్వర్యలతో కలిసి మరికొందరు స్నేహితులను ఆహ్వానించడం ద్వారా అది ఒక వాట్సాప్ గ్రూప్గా ప్రారంభమైంది. కాలక్రమేణా మా కార్యకలాపాలు వైవిధ్యభరితంగా మారాయి. మా టీమ్లో నక్షత్రాలూ పాలపుంతలను విడమరిచే ఆ్రస్టానమీ తెలిసిన నిపుణుల నుంచి గణితాన్ని ప్రకృతితో ముడిపెట్టి వివరించే మాథ్ మెటీషియన్ వరకూ.. ఒక్కొక్కరూ ఒక్కో సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చేసిన 25 మంది ఉన్నారు. ఎంచుకున్న టాపిక్ బట్టి వారు ఆయా సెషన్లకు హాజరవుతూ పాఠాలు బోధనలా కాకుండా ప్రాక్టికల్ అనుభవాలను అందిస్తారు. నగరంలోని పార్కుల నుంచి కర్ణాటకలోని కూర్గ్ వరకూ.. ‘నగరంలోని రాక్ ఏరియాలు, పార్కులు, లేక్స్.. ఇలా కాదేదీ క్లాస్రూమ్కి అనర్హం అన్నట్టుగా మారిపోతాయి. నగరం మాత్రమే కాదు రాష్ట్రాలు కూడా దాటుతూ, కూర్గ్ వంటి హిల్ స్టేషన్స్లో సైతం సెషన్స్ ఏర్పాటు చేస్తాం. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, హైకింగ్లు, ఫొటో వాక్లు, చారిత్రక బాటలు, రాత్రుళ్లు నక్షత్రాల వీక్షణం, తల్లిదండ్రులు–పిల్లల శిబిరాలు.. ఇలా అవుట్డోర్ క్లాస్రూమ్స్ ప్రతి నెలా అనేక సెషన్లు నిర్వహిస్తుంది. పాఠశాల విద్యార్థుల నుంచి కార్పొరేట్ బృందాల వరకూ ఇందులో భాగస్వాములవుతున్నారు. పైగా వీరంతా ఈ తరహాబోధనకు ఆకర్షితులవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికి దాదాపు 100కిపైగా క్లాసులు.. ‘ప్రతి సెషన్లో కనీసం 25 నుంచి 40 మంది వరకూ స్థానం కల్పిస్తాం. నగరంలోని పలు స్కూల్స్, కార్పొరేట్ సంస్థలతో కలిసి వీటిని ప్లాన్ చేస్తుంటాం. ఇప్పటికి దాదాపు 100కి పైగానే క్లాస్ రూమ్స్ నిర్వహించాం. ఇతర నగరాల్లోనే కాకుండా భవిష్యత్తులో విదేశాలకు సైతం విస్తరించాలనే ఆలోచన చేస్తున్నాం’ అంటూ ముగించారు రాఘవ. ఉరుకుల పరుగుల జీవితంలో నేర్చుకోవడం కూడా అంతే వేగంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నేచర్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. నేచురల్గా నేర్చుకోవడమూ అంతే ముఖ్యం అనే ఆలోచనే ఈ తరహా అవుట్ డోర్ క్లాస్ రూమ్స్కి ఊపునిస్తోందనేది నిరి్వవాదమైన అంశం. (చదవండి: -
పచ్చని విరులు.. ఆరోగ్యపు సిరులు..
ప్రతి ఒక్కరూ పచ్చని ప్రకృతిని చూస్తే పరవశించిపోతారు. అలాంటి పచ్చని ప్రకృతి మన ఇంట్లోనే ఉంటే ఇటు కంటికి.. అటు ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్షాకాలం కావడంతో నగరంలో నర్సరీలు పూలు, పండ్లు, ఆయుర్వేదం మొక్కలతో అమ్మకాలకు సిద్ధమయ్యాయి. అదే తరహాలో కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలు పెంచేందుకు రంగు రంగుల కుండీలు సైతం ఆకర్షిస్తున్నాయి. హఫీజ్పేట డివిజన్ పరిధిలోని కొత్తకుంట చెరువు కట్టపై ఆర్టీసీ కాలనీ వద్ద, జాతీయ రహదారి జెనిసిస్ స్కూల్ వద్ద నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇవి మొక్కల ప్రేమికులను, కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి అమ్మకందారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డులో నర్సరీలు ఏర్పాటు చేసేవారు మొక్కల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడటంతో మియాపూర్, హఫీజ్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలకు నర్సరీలే జీవనాధారం. ఈ నర్సరీల్లో 500ల రకాల వరకూ వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తారు. అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేదం, పండ్ల జాతులు అమ్మకాలకు ఉంచుతారు. ఇతర ఉత్పత్తులు.. మొక్కల పెంపకానికి కావాల్సిన వివిధ రకాల మోడళ్లలో రంగు రంగుల కుండీలు, సేంద్రీయ ఎరువులు, వర్మీ కంపోస్టు, కోకోపిట్, ఆయుర్వేదం, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలకు కావాల్సిన పురుగు మందులు, ఇళ్లలోకి కీటకాలను నివారించే మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పాటు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసే లాన్ కూడా సప్లై చేస్తున్నారు. కుండీలు రూ.20 నుంచి రూ.350 వరకూ అమ్ముతున్నారు. పూల మొక్కలకు గిరాకీ.. గులాబీ, చామంతి, మందారం, అలంకరణ పూలు వంటివి సుమారు 300 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ డోర్ మొక్కలు, తులసిలో లక్ష్మీ, కృష్ణ, శివుడి పూజకు బిల్వపత్రం, శంకం పూలు, పారిజాతం, ఉసిరి, జమ్మి వంటి మొక్కలు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో రూ.30 నుంచి రూ.350 వరకూ ధరల్లో విక్రయిస్తున్నారు. ఆయుర్వేదం, పండ్ల మొక్కలు.. వివిధ రకాల రోగాలను నియంత్రించడంలో ఉపయోగపడే ఆయుర్వేదం మొక్కలైన తులసి, కలబంద, నల్లేరు, రణపాల, గరిక, తిప్పతీగ, మారేడు మొక్కలతోపాటు పండ్ల మొక్కలైన సపోట, దానిమ్మ, జామ, మామిడి, అంగూర్, నిమ్మ తదితర హైబ్రిడ్ మొక్కలు అలరిస్తున్నాయి. దోమలను నివారించే లెమన్ గ్రాస్, లావెండర్, పుదీన, సిటోన్రెల్లా వంటి అనేక మొక్కలు ఉన్నాయి. నర్సరీ ఏర్పాటు సంతోషకరం..కొత్తకుంట చెరువు కట్టపై నర్సరీ ఏర్పాటు సంతోషకరం.. కాలనీ వాసులు ఇష్టానుసారం చెత్త వేస్తున్న నేపథ్యంలో అదే స్థలంలో మొక్కలు పెంచడం మంచిపరిణామం. చెరువు నీరు మొక్కల ఎదుగుదలకు ఉపయోగం. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. – సురేష్ మదీనాగూడఆయుర్వేద మొక్కలకు గిరాకీ.. ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఆయుర్వేద మొక్కలకు గిరాకీ పెరిగింది. దీంతో పాటు కీటకాలను నివారించే కొన్ని రగకాల గడ్డిజాతి మొక్కలకు కూడా డిమాండ్ ఏర్పడింది. – రాజు, నర్సరీ నిర్వాహకుడు -
అడవిని సాకుతున్న ఆడపడుచులు!
అడవిలోని కోతులు చిటారుకొమ్మనున్న పండును రుచి చూస్తున్నట్టుగా కొద్దిగా కొరికేసి, మళ్లీ మరో పండును అందుకుంటాయి. పూర్తిగా తినేయకుండానే పండ్లనిలా పక్కకు విసిరేస్తున్నందుకు విసుగూ, చిరాకు మనకు. అరణ్యంలోని ఏనుగు అవసరమైనదేదో తినేయకుండా అందుతున్న కొమ్మల్ని అల్లిబిల్లిగా విరిచేసి అల్లంత దూరానికి విసిరేసి చెల్లాచెదురుగా పడేస్తుంది. చూడ్డానికి ఇదేదో వృథా పనిలా అనిపిస్తుందిగానీ... ఇందులో అడవి మనుగడ దాగుంది. కోతి మాత్రమే చిటారు కొమ్మకు చేరగలుగుతుంది. కానీ అంతదూరాలకు ఎక్కలేనివీ... మధ్య కొమ్మలూ, చెట్టు మొదళ్లలో ఉండే జీవులూ తినడానికి ప్రకృతి చేసిన ఏర్పాటది. అలా ఎన్ని జీవులు ఎంత ఎక్కువగా తింటే... వాటి గింజలు అంతంత దూరాలకు చేరి అక్కడ మొలకెత్తుతుంటాయి. అలా మొలకెత్తే మొక్కలకు సూర్యరశ్మి అందేందుకూ... పక్కలకు పాకకుండా ఇతర మొక్కలకూ అవకాశమిస్తూ చెట్టు నిటారుగానే ఎదిగేందుకు ఏనుగులిలా పక్క కొమ్మల్ని విరిచి పడేస్తుంటాయి. మనుగడ కోసం అన్ని జీవులూ ప్రయత్నిస్తున్నట్టే... తనలోని ఇతర జీవులను బతికించుకుంటూ... తాను బతికి పచ్చటి ఆకుల బట్టకట్టడానికి ప్రయత్నిస్తుంది అడవి. సహజ సహజాతం తప్ప ఇతర జ్ఞానాలేమీ లేని మూగజీవులూ అందుకు తోడ్పడుతుంటే... అద్భుత జ్ఞానం ఉండి... అన్నీ తెలిసిన మనిషి మాత్రం అడవుల నిర్మూలనకు పాల్పడుతుంటాడు. అయితే కేరళ ఉత్తర వాయనాడ్లోని పెరియ అనే ప్రాంతంలోని గురుకుల బొటానికల్ శాంక్చువరీలో... అంతరిస్తున్న ఓ అడవిని కాపాడటానికి ఇరవై మంది మహిళలు నిత్యం కృషి చేస్తుంటారు. వారి శ్రమ కారణంగా మునపటి విస్తీర్ణానికి తోడు... ఇప్పుడు మరో 32 హెక్టార్లు అదనంగా పెరుగుతోందా ఆ అడవి. అక్కడి అరుదైన జాతుల్లో దాదాపు 40% మొక్కలకు ఆ అడవే నివాసం. గోరింటాకు పెట్టుకునే ఆ మహిళల చేతులే... ఇప్పుడు ‘గుల్మెహందీ’ అనే హిందీ పేరున్న ‘బల్సామినసీ’ కుటుంబపు అనేక ప్రజాతుల మొక్కలను పెట్టని కోటలా కాపాడుతున్నాయి. ఆ అడవి ఇప్పుడు అత్యంత అరుదైన మొక్కలకు ఆలవాలం. ఎర్రచందనం చెట్లు కేవలం శేషాచలం అడవుల్లోనే పెరుగుతూ మరెక్కడా జీవించలేనట్టే... అత్యంత అరుదైన జాతి మొక్కలైన ‘ఇంపాటియెన్స్ జెర్డోనియా’ వంటి మొక్కలు అక్కడ... అంటే ఆ పశ్చిమ కనుమల సానువుల్లో తప్ప మరెక్కడా పెరగవు. ‘బల్సామినసీ’ అనే కుటుంబానికి చెందిన ఆ మొక్కలన్నీ దాదాపుగా అంతరించే దశకు చేరుకున్నాయి. అలాంటి జాతుల మొక్కల్ని సంరక్షించడమే కాదు... అలాంటి అనేక రకాల అరుదైన ఇతర జాతుల మొక్కలకూ ఆ అడవిలో ఆవాసం కల్పిస్తూ వాటిని సంరక్షిస్తున్నారా అతివలు. మరోమాటగా చెప్పాలంటే అవన్నీ ఎపీఫైటిక్ప్లాంట్స్. ‘ఎపీ’ అంటే ‘పైన’... ‘ఫైట్’ అంటే మొక్క. అంటే తమ మనుగడ కోసం అవి మరో చెట్టుని ఆలంబనగా చేసుకోవాలి. ఇక్కడ ‘పారసైట్’కూ, ‘ఎపీఫైట్’కు తేడా ఏమిటంటే... తాము ఎదుగుతున్న చెట్టుపైనే బతుకుతూ, అలా బతకడానికి దాని ఆహారాన్ని దొంగతనంగా తీసుకుంటే అవి పారసైట్స్. కేవలం తమ అవసరాలైన సూర్యరశ్మీ, ఇతర వనరులు చక్కగా అందడానికి ఇతర మొక్కల మీద ఎదిగేవీ ఎపీఫైట్స్. తాము పెరగడానికి దోహదపడుతున్న చెట్ల ఆహారాన్ని ఇవి దొంగిలించవు. అలాంటి ఈ ఎపీఫైట్స్ మనుగడ కోసం తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు ఆ అడవిని సంరక్షిస్తున్న ఆడపిల్లలు. – యాసీన్ -
చిరుజల్లుల్లో బికేర్ఫుల్.. ఆ ఆహారాలను తీసుకోకపోవడమే మేలు..!
వర్షాకాలం అనగానే భలే సరదాగా ఉంటుంది. చిరుజల్లుల్లో ఆహ్లాదభరితమైన వాతావరణం మనసు మెచ్చినా.. ఆరోగ్యపరంగా సమస్యాత్మకమే. ఈ కాలం వ్యాధులు ముసిరే కాలం. కాస్త తీసుకునే ఆహారంలో ఇలా మార్పులు చేసుకుంటే..ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారినపడకుండా ఉంటారని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు బాత్రా. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.ఈ కాలంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అంత చురుగ్గా ఉండదు కాబట్టి తీసుకునే ఆహారంపై కాస్త ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణురాలు బాత్రా. మారే రుతుపవనాల దృష్ట్యా తీసుకునే డైట్లో మార్పులు తప్పనిసరి అని అంటున్నారు. ఈ వర్షాకాలంలోవ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచే ప్రభావవంతమైన ఆహారాలను గురించి ఇన్స్టా వేదిక షేర్ చేశారు పోషకాహార నిపుణురాలు బాత్రా. తేలికగా జీర్ణమయ్యే ఈ తొమ్మిది ఆహారాలను తీసుకోమని చెబుతున్నారామె. అవేంటంటే..మొదటగా తెల్ల బియ్యాన్ని నివారించి బదులుగా బ్లాక్ రైస్ను ఎంచుకోవాలని అన్నారామె. ఎందుకంటే ఇందులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి మెరుగా ఉండి, జీర్ణక్రియ గట్ ఆరోగ్యాన్ని ప్రభావవంతంగా ఉంచుతుంది. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తుంది అని చెబుతోంది బాత్రఅందువల్ల నిరోధక పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు గట్ ఆరోగ్యాన్ని మందగించిన రుతుపవన జీవక్రియలో రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.పచ్చి సలాడ్ కంటే మెత్తగా ఉడికించిన కూరగాయలను ఎంచుకోవాలట. ఎందుకంటే పచ్చి కూరగాయలు వర్షాకాలంలో పొట్ట ఉబ్బరాన్ని కలిగిస్తాయి. ఇక ఉడకబెట్టిన కూరగాయలు ప్రేగుకు ఉపశమనం కలిగించేలా మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.వీధుల్లో అమ్మే తినుబండరాలు, చాట్ వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. బదులుగా ఆవితో ఉడికించిన మొలకెత్తిన మూంగ్ చాట్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిలో ఎంజైమ్లు, ప్రోటీన్లలో అధికంగా ఉండటమే గాక ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట.ఈ కాలంలో తప్పనిసరిగా తులసి-అల్లం కషాయం వంటి వాటిని సేవించాలని సూచిస్తున్నారామె. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుందట. ఈ కాలంలో ముడి ఆకుకూరలకు బదులుగా మోరింగ సూప్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనిలో ఐరన్, యాంటీమైక్రోబయాల్, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి అందువల్ల దీన్ని తీసుకుంటే బాడీ మంచి యాక్టివ్గా ఉండి జీర్ణ సమస్యలు దరిచేరవు.ఈ కాలంలో మిగిలిపోయిన చద్దన్నం నివారించాలట. సాధ్యమైనంత వరకు తాజాగా వండిన భోజనం తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో నీటిలోనూ, చల్లటి పదార్థాల్లోనూ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందువల్ల తాజాగా వేడిగా ఉండే ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే మంచిదని చెబుతోందామె.అలాగే బేకరీ ఉత్పత్తులను నివారించి.. ఇంట్లో చేసిన ధోక్లా లేదా ఉడికించిన సెనగలు, స్వీట్కార్న్, చిలగడ దుంపలు వంటివి తీసుకోవాలని చెబుతోందామె.అలాగే కట్చేసి నిల్వ ఉంచిన పండ్ల ముక్కలకు బదులుగా తాజాగా కడిగి కట్ చేసిన పండ్లను తినాలని సూచిస్తున్నారామె.ఈ వర్షాకాలంలో వేడిగా పొగలతో కూడిన ఆహారంత తీసుకుంటేనే మంచిది. ఇది రుచికరంగానే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి, మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. లేదంటే చల్లటి ఆహారాలు జీర్ణ సమస్యలు, పలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు బాత్రా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. (చదవండి: -
58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్కారు..! ఇప్పటికీ..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న నానుడి జగమెరిగిన సత్యం. ఎప్పటికీ పాతకాలం నాటి డిజైన్లు, నాటి వస్తువులు అపురూపమే. ఎంతటి ఆధునిక సాంకేతిక హంగులతో వచ్చినా..ఏళ్ల నాటి వస్తువులే అదరహో అన్న రేంజ్లో ఉంటాయి. వాటి పనితీరు కూడా వాహ్ అని మెచ్చుకునేలా ఉంటుంది. అలాంటి పాతకాలం నాటి మెర్సిడెస్ బెంజ్ కారుకి సంబంధించిన వీడియో నెట్టింట పెను దుమారం రేపుతోంది. దాని రూపురేఖలు, పనితీరు చూసి ఫిదా అవ్వాల్సిందే. అంతలా చెక్ చెదరకుండా ఉంది ఆ బెంజ్ కారు.ఇషాన్ బల్లాల్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ 58 ఏళ్ల క్రితం నాటి ఓల్డ్ బెంజ్ కారు వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఆ కారు 1967 నాటిది. తన తాతగారు ఉపయోగించేవారని చెప్పుకొచ్చాడు వీడియోలో. ఆయన ఆ కారు డ్రైవింగ్ సీటులో కూర్చొని కబుర్లు చెబుతూ తనను టూర్లకు తీసుకువెళ్లేవారని నాటి స్మృతులను గుర్తు చేసుకున్నాడు. మంగళూరు నుంచి చెన్నే వెళ్తూ ఆయన నాకు చెప్పే పలు కథలు ఆ బెంజ్ కారుని చూడగానే గుర్తుకొస్తాయని చెబుతున్నాడు ఇషాన్. తాను డ్రైవింగ్ లైసెన్స్ పొందినా కూడా డ్రైవర్ పర్యవేక్షణ లేకండా ఆ బెంజ్ కారుని నడపలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే కాస్త తప్పుగా నడిపినా..ఆ కారు పాడవ్వుతుందన్న ఉద్దేశ్యంతో తాను పూర్తిస్థాయిలో నడపగలిగిన అనుభవం వచ్చాక నడిపానని అన్నాడు. తన దివంగత తాతాగారి కారుని తాను ఎలా భద్రంగా చూసుకున్నాడో వివరించాడు. అందువల్లే ఆ 58 ఏళ్ల నాటి బెంజ్ కారు ఇప్పటికీ మంచి కండిషన్లో పనిచేస్తుందని చెబుతున్నాడు ఇషాన్. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి...మీ తాత గారు ఆ కారుని ఎంత అపురూపంగా చూసుకున్నారో స్పష్టమవుతుంది. బహుశా ఆ తీరే వంశపారంపర్యంగా మీకు వచ్చిందేమో. తాతాగారు ఎంత మంచి వారసత్వాన్ని మీకందించారంటూ ఇషాన్పై పొగడ్తల జల్లు కురిపించారు. (చదవండి: జస్ట్ పెంపుడు కుక్కల సంరక్షణతో.. నెలకు ఏకంగా రూ. 4 లక్షలు పైనే..) -
లవ్ ప్రపోజల్ తిరస్కరించిన ఇండియన్ టెకీకి బాస్ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే
పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన. కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్ టెకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్ టెక్ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్ రిమోట్గా పనిచేస్తోంది. అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్ ఇన్డైరెక్ట్గా పెట్టిన ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్లో ఆరోపగించింది. చీటికి మాటికి కోపగించుకోవడం, పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది. తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని, దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్గా వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.దీనిపై నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ, కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్ చేసినా. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు పరిస్థితి మరింత టాక్సిక్గా మారుతుంది. మీ మెంటల్ హెల్త్ను కాపాడుకోండి’’ అని ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే ఆప్షన్ మరొకరు సూచించారు. మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు. -
డాగ్ వాకర్గా.. నెలకు ఏకంగా రూ. 4లక్షలు పైనే..
ప్రస్తుత అవసరాలను క్యాష్ చేసుకుని ఆ దిశగా అడుగులు వేసి లక్షలు ఆర్జించిన వాళ్లెందరో ఉన్నారు. ఇక్కడ కాస్త క్రియేటివిటీ..విభిన్నంగా ప్రత్యేకతను చాటుకోవడమే సక్సెస్ మంత్ర. అలాంటి సీక్రెట్ని ఫాలో అవుతూ ఇక్కడొక వ్యక్తి ఏకంగా సాప్ట్వేర్ ఉద్యోగులనే తలదన్నేలా లక్షల్లో ఆర్జిస్తున్నాడు. ఇంతకీ అతడేం చేస్తున్నాడో వింటే తెల్లబోవడం ఖాయం. ఈ విధంగా కూడా ఇంతలా సంపాదించడం సాధ్యమేనా.. ? అనే సందేహం కలుగక మానదు.మహారాష్ట్రకు చెందని ఒక వ్యక్తి డాగ్ వాకర్గా పనిచేస్తూ..రూ. 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు. అతడు ఎంబిఏ డిగ్రీ ఉన్న తన సోదరడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడట. అతడి సోదరుడు ఓ కార్పొరేట్ కంపెనీలో నెలకు రూ. 70 వేలు సంపాదిస్తుంటే.. ఈ వ్యక్తి మాత్రం పెంపుడు కుక్కలను టేకర్గా తన సోదరుడి కంటే ఎక్కువ ఆర్జించడం విశేషం. అతడు మొత్తం 38 కుక్కల సంరక్షణను చూసుకుంటాడు. ఒక్కో కుక్కకు రూ. 15 వేళు ఛార్జ్ చేస్తాడట. అలా అతడు నెలకు రూ. నాలుగు లక్షల పైనే ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విషయం నెట్టింట వైరల్గా మారింది. అది సాధ్యమేనా..భారతదేశంలో పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ 2026 నాటికి ₹7,500 కోట్లు దాటుతుందని అంచనా. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో డాగ్ వాకర్లు , పెంపుడు జంతువుల సంరక్షణ నిపుణుల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పెంపుడు జంతవుల యజమానులు డాగ్ వాకర్, సంరక్షణ నిపుణుల సేవలను కోరుకోవడంతో .. ఇప్పుడు ఇదే ..అత్యంత ఆదాయ మార్గ వృత్తిగా మారింది. ముంబై లేదా పూణే వంటి నగరాల్లోని చాలా మంది ప్రొఫెషనల్ డాగ్ వాకర్లు ఒక్కో కుక్కకు ₹300 నుండి ₹500 వరకు వసులు చేస్తారట. రోజుకు పది నుంచి 15కు పైగా పెంపుడు జంతువుల బాధ్యత తీసుకుంటే ఇలా లక్షల్లో ఆర్జించడం సాధ్యమే అని అంటున్నారు నిపుణులు. ఆ కేర్ టేకర్లు పెంపుడు జంతువుల సంరక్షణ, డాగ్ వాకింగ్ వంటి ప్రీమియం సేవలకు అనుగుణంగా డబులు వసూలు చేయడం జరుగుతుందట. జంతు యజమానుల నమ్మకాన్ని పొందిన జంతుకేర్ టేకర్లు, కచ్చితమైన షెడ్యూలింగ్తో ఈ రేంజ్లో డబ్బులు సంపాదిస్తారని చెబుతున్నారు. అయితే అధి మొత్తంలో ఆర్జించడం అనేది సంరక్షణ నిపుణుడి తీరు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఈ ఉద్యోగాలదే డిమాండ్ కాబోలు..!. View this post on Instagram A post shared by The Bharat Briefing (@thebharatbriefing) (చదవండి: ప్రపంచంలోనే అతి సన్నని కారు..! ఎంతటి ఇరుకు సందుల్లో అయినా..) -
ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్..!
ఇటీవలి కాలంలో మన హైదరాబాద్తో పాటు మెట్రో నగరాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆందోళన, ఒత్తిడి, శారీరక ఆలసట, మానసిక భావోద్వేగాలను నియంత్రించే శక్తి కళలకు ఉందనేది వాస్తవం.. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ మంచి పాట వినబడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.. కొందరికి ప్రకృతిని చూస్తే, మరికొందరికి ఆర్ట్ని చూసినా.. బొమ్మలు వేసినా మనసుకు హాయినిస్తాయి.. దీనికి ఇవే ఉదాహరణ.. మనలోని కనిపించని భావాలు.. కళలకు స్పందిస్తాయి.. సాంత్వన చేకూరుస్తాయి. దీంతో గత కొద్దికాలంగా నగరంలో ‘హీలింగ్ థెరపీలు’ విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ఈ చికిత్సా పద్ధతుల్లో ఆర్ట్ ఆఫ్ హీలింగ్ థెరపీలకు ప్రత్యేక స్థానం ఉంది. మానసిక ప్రశాంతతను కోరుకునే యువత, కార్పొరేట్ ఉద్యోగులు ఈ సృజనాత్మక మెడిటేషన్ వేదికగా సాంత్వన పొందుతున్నారు.. ప్రస్తుతం నగరంలో ఏ రంగం చూసినా విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ వైవిధ్యంతో పాటే అనేక మానసిక, సామాజిక ఒత్తిళ్లను నగరవాసులకు చేరువ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి బయటపడటానికి ఆర్ట్ హీలింగ్ థెరపీలను జీవన శైలిలో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగర వేదికగా విభిన్న రకాల హీలింగ్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్ థెరపీల్లో మ్యూజిక్ థెరపీ, డాన్స్ మూవ్మెంట్ థెరపీ, సౌండ్ బౌల్ హీలింగ్, యోగా–శ్వాస పరమైన ధ్యాన చికిత్స, రేయికి– ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ (ఈ ఎఫ్ టీ), క్లే మోడలింగ్/పోటరీ థెరపీ, ఎక్సŠప్రెషన్ జర్నలింగ్/రైటింగ్ థెరపీ వంటివి ఈ తరం లైఫ్స్టైల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ థెరపీలన్నీ మెడిటేటివ్ ఎఫెక్ట్ కలిగించేలా ఉండి, మానసిక ఒత్తిడి, ఆత్మవిమర్శ, ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారికి సాంత్వన చేకూరుస్తూ, మనశ్శాంతిని అందిస్తున్నాయి. మానసిక స్పందనలు తెలిపే భాష.. ఆర్ట్ హీలింగ్ థెరపీ ఒక మందు కాదు – అది ఓ మనో విశ్రాంతి పాఠశాల. భిన్న రంగాల వేదికైన హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ థెరపీలు సమాజాన్ని మనశ్శాంతి వైపు నడిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆర్ట్ థెరపీ అనేది వినూత్నంగా, వైవిధ్యంగా మనసుపై ప్రభావం చూపించే ఒక మానసిక చికిత్స. చిత్రకళ అనేది రంగుల సమ్మేళనం, మట్టి శిల్పాల తయారీ, మాస్క్ మేకింగ్, కలర్ థెరపీ లాంటి అంశాల ద్వారా వ్యక్తి భావోద్వేగాలను బయటకు తీసే ఒక మృదు స్పర్శా విధానం. ఇది శాస్త్రీయ వైద్యం కాదు, కేవలం మెదడుపై సున్నిత ప్రభావాన్ని చూపిస్తూ మౌనంగా స్పందనలు తెలిపే ఓ భాష మాత్రమే. సాంత్వనకు కేంద్రంగా సిటీ.. నగరంలోని కన్హ శాంతి వనం హార్ట్ఫుల్ నెస్ సెంటర్లో ఆర్ట్ – ధ్యానం కలిసిన హోలిస్టిక్ మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లోనూ లైసెన్స్డ్ ఆర్ట్ థెరపిస్టుల సహాయంతో సరికొత్త థెరపీలు అందించే వేదికలు ఎన్నో ఉన్నాయి. కొన్ని క్లే (మట్టి), పెయింటింగ్ ఆధారిత వర్క్షాపులు నిర్తహిస్తుంటే ఆర్ట్ ఫర్ థెరపీ ఫౌండేషన్ వంటి వేదికలు పిల్లలు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కల్పతరు ఆర్ట్ హీలింగ్ వంటి సంస్థలు మునుపటి ట్రామాలను చక్కదిద్దేందుకు క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వంటి పద్ధతులు పాటిస్తున్నారు. జెన్ జీ హీలింగ్... ఇలాంటి థెరపీలను ఈ తరం యువతకు అనువుగా మలుస్తున్నాయి సంస్థలు. ఈ జెన్ జీ తరంలో డిజిటల్ లోన్లీ నెస్, ఒత్తిడి పెంచే విద్యావ్యవస్థ, వర్క్–లైఫ్ ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ అన్ఎక్స్ప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ హీలింగ్ థెరపిస్ట్ తెలిపారు. ఈ తరం శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతోంది. ప్రభావం చూపే మాటలకంటే రంగులు, ఆకారాలు, కళల సృజనాత్మకతతో కలగలిసిన ప్రయాణంతో మనసు తన బాధను చెప్పే అవకాశం పొందుతోంది. ఇలాంటి కారణాలతో ఈ ఆర్ట్ థెరపీల అవసరం ఎక్కువైందని మరి కొందరి నిపుణుల అభిప్రాయం. అవస్థలు ఎన్నో.. మార్గం ఒకటే..!! డిప్రెషన్(నిరాశ), ఆందోళన (యాంగ్జైటీ) బాధితులు, పిల్లల్లో స్పీచ్/బిహేవియరల్ సమస్యలు ఉన్నవారు, ట్రామా/లాస్/బ్రేకప్ నుంచి కోలుకునేవారు, ఏకాంత జీవితం గడుపుతున్న వృద్ధులు, క్రియేటివ్ బ్లాక్ ఎదుర్కొంటున్న కళాకారులకు ఈ ఆర్ట్ థెరపీలు వరంగా మారుతున్నాయి. -
వెండితెర యాక్టర్.. వీగన్ అంబాసిడర్..
క్రీడల్లో రాణించాలని సాధన చేస్తున్నాం కదా.. గుడ్లు, పాలు తినాలి.. లేకపోతే బలం ఎలా వస్తుంది? జిమ్కి వెళ్తున్నాం.. మటన్, చికెన్ తినాల్సిందే.. లేకపోతే వర్కవుట్ ఏం చేస్తాం? మజిల్ ఎలా బిల్డ్ చేస్తాం? అని భావిస్తాం. అయితే ఇవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తున్నారు సినీహీరో అరవింద్ కృష్ణ. అంతేకాదు గట్టిగా వాదిస్తున్నారు కూడా.. ఆ గట్టితనమే ఆయనకు వీగన్ వాయిస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఒక సినిమా నటుడిగా మరోవైపు బాస్కెట్ బాల్ ప్లేయర్గా తనను నిలబెట్టిన వీగన్ అంతకు మించిన లాభాలే తనకు అందించిందంటున్న అరవింద్ కృష్ణ ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘టీనేజ్ చదువు మొత్తం అమెరికాలోనే సాగింది. అదే సమయంలో నేను బాస్కెట్ బాల్ కూడా ఆడేవాడిని. అప్పుడు నేను కూడా చాలా మందిలాగే స్పోర్ట్స్లో రాణించాలంటే మటన్, చికెన్, ఎగ్స్ తప్పక తినాలని భావించే నాన్ వెజిటేరియన్నే’. స్లాటర్ హౌస్ తెచ్చిన ఛేంజ్.. నాకు 17ఏళ్ల వయసులో అనుకోకుండా స్లాటర్ హౌస్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులు చూశాక, మూగజీవుల విలాపం.. నాలో అనూహ్య మార్పుకు దారితీసింది. నన్ను పూర్తి వెజిటేరియన్గా మార్చేసింది. విచిత్రం ఏమిటంటే.. నాన్ వెజ్ తిన్నప్పటి కంటే ఆ తర్వాతే నేను ఆటగాడిగా రాణిస్తున్నాననేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి శాఖాహారం వైపు ఆకర్షితుడినయ్యాను. వీగన్.. విన్ విన్.. వీగన్ శైలి ఆహారం పరిచయం తర్వాత నా జీవితమే మారిపోయింది. 33 ఏళ్ల వయసులో వీగన్గా మారాను. పాలు సహా జంతు సంబంధ ఉత్పత్తులన్నీ మానేశాక.. నా ఆరోగ్యం మెరుగుపడింది. గ్లూటెన్కు శరీరంలో చోటు ఇవ్వకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. తద్వారా శారీరక సామర్థ్యం పెరిగింది. చర్మం మరింత కాంతివంతగా మారింది.ఆలోచనల్లో వేగం, పదను పెరిగింది. ఇది క్రీడా జీవితానికి బాగా ఉపకరించింది. దీంతో వీగన్యురీ అంబాసిడర్ బాధ్యతలు ఆనందంగా స్వీకరించాను. గతేడాది భారత్లోనే అతిపెద్ద వీగన్ థీమ్ సదస్సు జరిగిన వీగన్ ఇండియా కాన్ఫరెన్స్లో వీగన్ వాయిస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నా. డబుల్ రోల్లో సక్సెస్ఫుల్గా.. నటుడిగా రామారావు ఆన్ డ్యూటీ, ఏ మాస్టర్పీస్, రైజ్ ఆఫ్ సూపర్హీరో వంటి సినిమాలతో పాటు త్వరలో రానున్న అండర్ వరల్డ్ బిలియనీర్ వంటి వెబ్సిరీస్లతోనూ తగినంత గుర్తింపుతో సంతృప్తిగా ఉన్నాను. దేశంలోనే ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్గా ఉన్న ఏకైక నటుడిని కూడా. ఇప్పటికీ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటా. నా ఫిజిక్ చూసి వీగన్ ఫుడ్తో ఎలా సాధ్యం అని అడుగుతుంటారు. అయితే ఆ ఫుడ్ కాబట్టే ఇలాంటి ఒరిజినల్ ఫిట్నెస్ సాధ్యమైందని చెబుతుంటా. ‘అంతర్జాతీయ బాస్కెట్బాల్ సమాఖ్య (ఎఫ్ఐబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐపీఎల్ తరహాలో బాస్కెట్బాల్ పోటీ 3 బీఎల్లో పాల్గొన్నా. ప్రతిష్టాత్మక ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఏకైక భారతీయుడిని కావడం విశేషం. హైదరాబాద్ 3 బీఎల్ జట్టుకు నాయకత్వం వహించాను. ఇందులో ఇతర దేశాల ఆటగాళ్లు ఉన్నారు. జీవితంలో విజయానికి క్రమశిక్షణ కీలకం. అవి క్రీడలే నాకు నేర్పించాయి. నా క్రీడా నేపథ్యం నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దింది’ అని అరవింద్ చెప్పుకొచ్చారు. (చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!) -
ఈ సండే స్పెషల్గా వెరైటీ స్వీట్స్ ట్రై చేయండిలా..!
ఇటలీ క్రిస్పిల్లే రైస్ రోల్స్కావలసినవి: బియ్యం– 250 గ్రాములు (కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి), చిక్కటి పాలు– 400 మి.లీ., నీళ్లు– 100 మి.లీ., ఉప్పు– చిటికెడు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార పొడి– 70 గ్రాములుపైనే, మైదాపిండి– 135 గ్రాములు, తాజా యీస్ట్– 15 గ్రాములు, (2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలలో కలిపి క్రీమ్లా చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి– కొద్దిగా, నారింజ తొక్కల తురుము– కొద్దిగా (నిమ్మ తొక్కలు కూడా తీసుకోవచ్చు) తేనె లేదా పంచదార పాకం– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా పాలు, నీళ్లు ఒక పాత్రలో వేసుకుని, చిన్న మంట మీద ఎసరు పెట్టినట్లుగా పెట్టుకోవాలి. పాలు పొంగుతున్న సమయంలో బియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం పలుకుగా ఉంటే ఇంకొన్ని పాలు పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం పూర్తి అయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక బౌల్లోకి తీసుకుని, వెనీలా ఎక్స్ట్రాక్ట్, 70 గ్రాముల పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యీస్ట్, మైదా పిండి, నారింజ తొక్క లేదా నిమ్మ తొక్క తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా రోల్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఒక బౌల్లో వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తేనె లేదా పంచదార పాకం వేసుకుని పైన పంచదార పొడి జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. నారింజ ముక్కలతో వీటిని తింటే భలే రుచిగా ఉంటాయి.ఛెన్నా గొజ్జాకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, నిమ్మరసం– 2 టేబుల్ స్పూన్లు (వెనిగర్ కూడా వాడుకోవచ్చు), కూలింగ్ వాటర్– సరిపడా, రవ్వ– ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి– ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి– అర టీస్పూన్, నెయ్యి– వేయించడానికి సరిపడా, పంచదార, నీళ్లు– ఒక కప్పు చొప్పునతయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి, మధ్యస్థ మంటపై మరిగిస్తూ, పాలు పొంగకుండా చూసుకోవాలి. మరిగిన తర్వాత ఒక నిమిషం పాటు చల్లారనిచ్చి, ఇప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్ను కొద్దికొద్దిగా పోస్తూ, పాలు విరిగే వరకు నెమ్మదిగా కలపాలి. పాలు పూర్తిగా విరిగిపోయాక, విరిగిన పనీర్ను ఒక బౌల్లోకి తీసుకుని చల్లటి నీటిలో వేసి దానిలో కాసేపు కడిగి, పలుచటి క్లాత్లోకి తీసుకోవాలి. నీరు మొత్తం పిండేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నీరు పిండేటప్పుడు కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి.అనంతరం ఆ పనీర్ని సుమారు 5 లేదా 7 నిమిషాలు చేత్తో పిసికి మరింత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ, మైదా పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అది అప్పుడు చపాతీ పిండిలా మెత్తగా అవుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని, చిన్న మంట మీద, నేతిలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ మీద పంచదార, నీళ్లు పోసుకుని, ఏలకుల పొడి వేసుకుని, లేత పాకం రాగానే కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో నేతిలో వేగిన ముక్కలను వేయించి పాకంలో నానబెట్టాక సర్వ్ చేసుకోవచ్చు.చాక్లెట్ పీనట్ బార్స్ కావలసినవి: ఓట్స్ పౌడర్– ఒక కప్పుపైనే (ఓట్స్ని దోరగా వేయించి పౌడర్లా చేసుకోవాలి), బాదం పౌడర్– ఒక కప్పు, పీనట్ బటర్– 2 కప్పులు, మేపుల్ సిరప్– 80 ఎమ్ఎల్, డార్క్ చాక్లెట్ ముక్కలు– ఒక కప్పు తయారీ: ముందుగా ఓట్స్ పౌడర్లో బాదం పౌడర్, పీనట్ బటర్, మేపుల్ సిరప్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్ద కాగానే బేకింగ్ ట్రేలో నింపుకుని సమాంతరంగా ఒత్తుకోవాలి. ఈలోపు చాక్లెట్ ముక్కల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కరిగించుకుని, ఆ సిరప్ను బేకింగ్ ట్రేలో ఉన్న పీనట్ మిశ్రమంపై, సమానంగా పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టుకుని నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!) -
లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్ హేవెన్స్. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు. ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్ మ్యాథ్స్ ప్రాజెక్టు’ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మరో కొత్త ప్రయత్నంఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్’ ఈ పద్ధతిలో కోడ్ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?) -
నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!
కొన్ని పండ్లు, కూరగాయలు సర్వసాధారణంగా ఒక నిర్దిష్టమైన రంగులో ఉంటాయి. అవి భిన్నమైన రంగులో కనిపిస్తే, అదొక విచిత్రంగా ఉంటుంది. అలవాటైన రంగుల్లో కాకుండా, నీలిరంగులో కనిపించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల సంగతి తెలుసుకుందాం...టొమాటోలు పండిన తర్వాత ఎర్రని ఎరుపురంగులో ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అరుదుగా కొన్ని జాతుల టొమాటోలు ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉంటాయి. వీటిని ‘బ్లూ టొమాటో’ అని, ‘పర్పుల్ టొమాటో’ అని అంటారు. ఇవి ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు. ఇంగ్లండ్లోని జాన్ ఇనెస్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా ఈ నీలి టొమాటో జాతులను సృష్టించారు. నేరేడు జాతికి చెందిన పండ్ల రంగుకు కారణమైన పిగ్మెంట్తో ముదురు నీలి, ముదురు ఊదా రంగులు వచ్చేలా టొమాటోలను రూపొందించారు. వీటిని ఇప్పుడు పలు యూరోపియన్ దేశాల్లో పండిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఈ జాతుల టొమాటో మొక్కలు చీడ పీడలను తట్టుకుని పుష్కలంగా దిగుబడిని ఇవ్వగలవని చెబుతున్నారు.బ్లూ క్యారట్స్మొక్కజొన్న దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. సాధారణంగా మొక్కజొన్న గింజలు పసుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా లేత పసుపు, తెలుపు రంగు గింజలతో కూడా ఉంటాయి. అరుదుగా నీలి రంగు గింజలు ఉండే మొక్కజొన్నలు మెక్సికోలో పండుతాయి. మామూలు మొక్కజొన్న మాదిరిగానే నీలి మొక్కజొన్నను కూడా రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. సాధారణ మొక్కజొన్నల కంటే నీలి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.నీలి ముల్లంగిమన దేశంలో ఎక్కువగా ముల్లంగి తెలుపు రంగులోనే దొరుకుతుంది. కొన్ని దేశాల్లో ఎరుపు, పసుపు, గులాబి వంటి రంగుల్లో కూడా దొరుకుతుంది. అరుదుగా కొన్ని చోట్ల ముదురు నీలి, ముదురు ఊదా రంగుల్లో కూడా ముల్లంగి దొరుకుతుంది. నీలి, ఊదా రంగుల్లో ఉన్న ముల్లంగిని కోస్తే, లోపలి భాగంలో నీలి, ఊదా రంగులతో పాటు కొంత తెలుపుదనం కూడా ఉంటుంది. రుచికి ఈ రకం ముల్లంగి కొంచెం తీపిగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినడంతో పాటు సలాడ్లు, ఇతర వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.చిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.నీలి అరటిపండ్లుఅరటిపండ్లు ఎక్కువగా పసుపురంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చగాను, అరుదుగా ఇంకొన్ని ఎరుపు రంగులోను ఉంటాయి. జావాలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలిరంగు అరటిపండ్లు పండుతాయి. దీనిని ‘బ్లూ జావా బనానా’ అని, ‘హవాయిన్ బనానా’ అని అంటారు. అరటిచెట్లు శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పెరగవు. అయితే, ఈ నీలి అరటిపండ్ల జాతికి చెందిన చెట్లు మాత్రం చల్లని వాతావరణాన్ని కూడా తట్టుకుని పెరగగలవు. దీని రుచి వెనీలా ఐస్క్రీమ్లా ఉంటుంది. అందువల్ల దీనిని ‘వెనీలా బనానా’ అని, ‘ఐస్క్రీమ్ బనానా’ అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని యూరోపియన్ దేశాల్లో కూడా పండిస్తున్నారు.బ్లూ స్వీట్ పొటాటోచిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.బ్లూ పొటాటోబంగాళ దుంపలు పైకి గోధుమరంగులో ఉంటాయి. తొక్క తీశాక తెలుపురంగులో ఉంటాయి. అయితే, ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉండే బంగాళ దుంపలు కూడా ఉన్నాయి. తొక్క తీసి, తరిగిన తర్వాత కూడా ఈ దుంపలు ముదురు ఊదా లేదా నీలి రంగుల్లోనే ఉంటాయి. ‘అడిరోన్డాక్ బ్లూ’ జాతికి చెందిన బంగాళ దుంపలు ఈ ముదురు ఊదా లేదా నీలి రంగుల్లో ఉంటాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటి నుంచి మరిన్ని నీలిరంగు బంగాళ దుంపల జాతులను కూడా ఇటీవలి కాలంలో అభివృద్ధి చేశారు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?) -
రాలిన జుట్టే పెరిగేనులే..!
చక్కని తలకట్టుతోనే ముఖానికి అందం వస్తుంది. జుట్టు ఊడిపోతున్నా, నెత్తి పలచబడిపోతున్నా చాలామంది అసలు సహించలేరు. జుట్టు ఊడిపోయే సమస్యకు ‘ప్లాస్మా థెరపీ’తో మంచిఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ చికిత్సలో ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నారో వారి రక్తమే సేకరించి, ఆ రక్తంలో ప్లేట్లెట్లు అధికంగా ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. వాటిని సూక్ష్మంగా ఉండే సూదులతో, తలపైన జుట్టు రాలిన ప్రదేశంలో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల దెబ్బతిన్న జుట్టు కుదుళ్లు పునరుత్తేజం పొంది, కొత్త జుట్టు ఏపుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ ట్రీట్మెంట్కి సాధారణంగా 3 నుంచి 6 వారాల వ్యవధిలో, సుమారు 4 సెషన్లు అవసరమవుతాయి.చర్మ సంరక్షణ కోసం..ఆధునిక జీవనశైలిలో, చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టంగా మారుతోంది. అలాంటప్పుడు చర్మాన్ని ఎల్లవేళలా కళకళలాడేలా ఉంచుకోవాలంటే చిత్రంలోని ఈ స్టైలిష్ గాడ్జెట్ని వెంట ఉంచుకోవాల్సిందే!ఈ ‘పోర్టబుల్ నానో ఫేషియల్ డివైస్’ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. రోజువారీ చర్మ సంరక్షణకు, ఇది కాంపాక్ట్గా ఉంటుంది. ఆఫీసులో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఈ డివైస్ను ఉపయోగించి, చర్మానికి తక్షణ తాజాదనాన్ని పొందవచ్చు. ఈ ఫేషియల్ స్టీమర్ పైభాగంలో ప్రత్యేకమైన మిర్రర్ ఉంటుంది. దాని చుట్టూ ఎల్ఈడీ లైట్ కూడా ఉండటంతో చీకటి వేళల్లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ మిర్రర్ 180 డిగ్రీలు కదులుతూ ఉండటంతో, నచ్చిన తీరులో పట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ మిర్రర్ ఇరువైపులా ఉండటంతో ఎటు తిప్పినా అందాన్ని చూసుకోవచ్చు.పైగా ఈ డివైస్ ఆన్లో ఉన్నప్పటికీ శబ్దం చేయదు. ఆటో షట్డౌన్ ఆప్షన్తో చాలా అనుకూలంగా పని చేస్తుంది. దీనిలో టెంపరేచర్ సెట్టింగ్స్ మార్చుకోవడం కూడా తేలికే! దీని ధర సుమారు రూ.2,500 ఉంటుంది. ఈ డివైస్ నుంచి వచ్చే ఆవిరితో చర్మాన్ని లోతుగా శుభ్రపరచుకోవచ్చు. దీనిలో 80 ఎమ్ఎల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనిని ఈజీగా డివైస్కి కింద భాగంలో సొరుగు మాదిరిగా అమర్చుకోవచ్చు. ఇది ఆగకుండా పదిహేను నిమిషాల పాటు ఆవిరి అందిస్తుంది. ఈ స్పెషల్ ఫేస్ స్టీమర్ వెంట ఉంటే అన్ని వేళలా తాజాగా మెరిసిపోవచ్చు. (చదవండి: ఒత్తిడి కంటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు) -
పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?– అనిత, మెదక్.మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్ను సంప్రదించి మాత్రమే వాడాలి.నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.– సుజాత, రాజోలు.వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది. యాంటీఫంగల్ ఆయింట్మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్గా తీసుకోవాల్సిందే..) -
ధోతికట్టు..అదిరేట్టు..!
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడుకండువా లేనిదే గడపదాటని వాడుపంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడుసినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి.ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’.ఈవెంట్లలోనే..నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్లో సరికొత్త సంప్రదాయ అలంకరణగా మారింది.– పడకంటి ఇందు,చామ కృష్ణవేణి, కరీంనగర్ ఎనభై ఏళ్లుగా..మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం. – గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి సాగు పనులకు అనుకూలంనా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు.సలేంద్రి దేవయ్య, పెద్దూరు అర్ధశతాబ్దకాలం క్రితం వరకు పురుషులు పంచెకట్టు, స్త్రీలు గోచి చీరలతో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ వస్త్రధారణలో మార్పు ప్రవేశించింది. పల్లె సీమల్లో ఒక ఈడు దాటిన స్త్రీ, పురుషులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తున్నా మెజార్టీ ప్రజల్లో ఈ అలవాటు దాదాపు కనుమరుగయ్యే దశ కనిపిస్తోంది. పంచెకట్టు ఒక తరం ఉనికిని, అస్తిత్వాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక కార్యాలు, వివాహాది శుభకార్యాల సమయంలో వరుడితో పాటు అతని తండ్రి, కన్యాదానం చేసే వధువు తండ్రి సైతం పంచెకట్టుకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లలకు ఐదారేళ్ల వయసొస్తే పంచెలు కట్టించే వేడుక నిర్వహించడం కూడా చూస్తున్నదే.పంచెకట్టు ప్రయోజనాలుశరీరానికి సహజమైన గాలి తగలడం పంచెకట్టుతో ఉన్న నిజమైన సౌకర్యం. ఏ తరహా శరీరానికైనా నప్పే పంచె వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం బాగుంటుందంటారు. పది మంది పిల్లల్ని కని పెంచిన పూర్వీకుల సంతతి కూడా ఇందుకు నిదర్శనంగా కనిపించడం విశేషం.ఇక స్త్రీల వేషధారణలో సైతం గోచీ పెట్టుకునే చీరలు ఈ తరానికి తెలియవంటే ఆశ్చర్యం లేదు. అమ్మమ్మ, నాన్నమ్మలంటేనే ఆ తరహా వేషధారణ గుర్తొచ్చేది. ఇప్పుడు మెల్లగా మొదలైన మార్పు అటు పంచెను ఇటు గోచీ చీరను తుడిచిపెట్టేసింది.సుమారు ఏడెనిమిది మీటర్లు లేదా 9 గజాలు లేదా 18 మూరల పొడవుండే ఈ చీరలు ధరించడం తెలుగునాట తరాలుగా కొనసాగింది. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి సాగుపనులకు అనుగుణంగా ఉండే అద్భుతమైన కట్టుబడి ఇది. గొల్ల కురుమలతో పాటు సాగు పనులు చేసే కాపు సామాజికవర్గాల్లో ఈ తరహా చీరకట్టు కనిపించేది. వాళ్ల ఆచారాల ఆధారంగా కొంగు కొందరు ఎడమ వైపు మరి కొందరు కుడివైపుకి ధరించేవారు.ఈ తరానికి తెలియని బొడ్లె సంచిగోచీ చీర ధరించే మహిళలు విధిగా ధరించే మరో వస్త్ర పరికరం బొడ్లె సంచి. ఈ తరానికి కనీసం చూసే భాగ్యం కూడా లేని అపురూపమైన నాటి మనీ పర్స్. వాలెట్గా పిల్చుకుంటున్న నేటి మనీ పర్స్లోని అరల కన్నా ఎక్కువగా ఉండే ఈ బొడ్లె సంచిలో ప్రయాణాలకు అవసరమైన చిల్లర నాణేలు, ఒకటో రెండో కరెన్సీ నోట్లకు భద్రమైన బ్యాగు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులున్న బొడ్లె సంచిని గోచీ చీరతో పాటు బొడ్లో దోపుకునే సంరక్షించుకునేవారు. ఇది కూడా లేని వాళ్లు కొంగు చివరన డబ్బులు మూటగా కట్టుకుని దాన్ని శరీరం చుట్టూ తిప్పి తిరిగి బొడ్లో దోపుకునే వారు.జీన్స్ ప్యాంటుల్లోకి వచ్చాక..స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇప్పుడు అందరూ కామన్గా ధరించేది జీన్స్ ప్యాంట్నే. యువతరానికి నచ్చినప్పటికీ దీంతో ఉండే అసౌకర్యం, అనారోగ్యం కూడా ఎక్కువే. జననేంద్రియాలను పట్టి ఉంచే లక్షణంతో ఉంటాయి కాబట్టి సహజమైన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణానికి గురవుతుంటాయి. కాబట్టి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటిగా నిపుణులు చెప్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతున్న జంటలు కొన్నైతే, స్థిరపడ్డాకే సంతానం అనుకుంటూ 30 దాటినా పెళ్లిల్లు లేవు, 40 దాటినా సంతానం లేకుండా పోతున్నారు.అన్ని మారిపోతున్నాయిమన సంప్రదాయలు ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని మారిపోతున్నాయి. మగ్గం బట్టలు పోయి మిల్లు బట్టలు వచ్చాయి. అప్పటి దోతి, పంచె కుట్టు, బనీయన్లు ఇప్పుడు కానరావడం లేదు. నేను మాత్రం మా తాత, నాయిన పద్ధతిలోనే నడుచుకుంటున్న.– కనుమల్ల రామస్వామి, నేత కార్మికుడు, వెదిర గోచీ పెట్టుకోవడమే అలవాటుచిన్నప్పుడు గౌను, లంగాజాకెట్ వేసుకునేదాన్ని. వయస్సు వచ్చాక లంగా, జాకెట్ ఓనీ, తర్వాత గోచిచీర కట్టుకుంటున్న. ఇప్పటి పిల్లలకు గోచిపెట్టుకోవడం నామోషీగా అనుకుంటారు. కానీ అదే మన పాతకాలం పద్ధతి. చీర కంటే గోచి చీర కట్టుకుంటే బాగుంటుంది.– కనకమ్మ, వ్యవసాయదారు, కరీంనగర్ నిండుగా ఉంటుందిపాత పద్ధతిలో ఆరుగజాల చీర కట్టుకుంటే నిండుగా ముతైదువ తనం ఉట్టిపడుతుంది. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులు పాటించడంలేదు. ఇంకా ముసలివాళ్లు మాత్రమే గోచిచీర కట్టుకుంటున్నారు. – ఓదెమ్మ, వ్యవసాయదారు,రైతుబజార్, కరీంనగర్ (చదవండి: -
పిల్లల కోసం కలలను నేస్తున్నారు..! వైకల్యాన్నే గౌరవప్రదమైన గుర్తింపుగా..
చేపకళ్ల బుజ్జీ.. బజ్జోవమ్మా!అమ్మ నిన్ను పతంగుల ప్రపంచానికి తీసుకెళ్తుంది.. అక్కడవి మబ్బుల్లా తేలుతుంటాయి.. గాలి తరగల మీద ఎగురుతుంటాయి.. ఎరుపు, ఆకుపచ్చ.. బులుగు.. పసుపు రకరకాల వర్ణాలతో ఆకాశానికి రంగులద్దుతాయి..నీకూ నింగిలో ఎగరాలనుందా.. మబ్బుల్లా.. పతంగుల్లా.. గాలి తెమ్మెరలా.. అయితే చిట్టి చిలకమ్మా.. నిద్దురపో హాయిగా.. సూరీడూ సద్దు మణిగినిద్దరోయాడు.. నువ్వూ బజ్జో.. పతంగుల లోకాన్ని చూసొద్దాం!ఇలాంటి పోయమ్స్, రైమ్స్ మీ పాపాయి బెడ్ షీట్స్ మీదో.. బ్లాంకెట్ల మీదో ఉంటే..! హాయిగా బజ్జోవడమే కాదు.. కంటికి ఇంపైన రంగుల్లోని ఆ అక్షరాలకు ఆకర్షితులై వేవేల వర్ణాల ఊహలను పోగేసుకుంటారు.. పెద్దయ్యాక దాన్నో అద్భుత జ్ఞాపకంలా చదువుకుంటారు. అలాంటి బాల్యాన్ని స్వచ్ఛమైన నూలు గుడ్డలో అంతే స్వచ్ఛమైన రంగుల్లో ముంచి మెత్తగా అందిస్తోంది ‘వైట్వాటర్’ అనే కిడ్స్ వేర్ బ్రాండ్! ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ మీద అజ్రక్, కాంతా, కచ్, ఇక్కత్.. ఇలా దేశం నలుమూలల నైపుణ్యాలను డిజైన్ చేస్తున్నారు. వీటికి దేశంలో సరే పశ్చిమాసియా, సింగపూర్, అమెరికా, ఇటలీ దేశాల్లోనూ డిమాండ్ ఉంది. ‘వైట్ వాటర్’ ఇద్దరు అక్కాచెల్లెళ్ల బ్రెయిన్ చైల్డ్.. వాళ్ల అవిరామ కృషి.వివరాల్లోకి.. శ్వేత, అంకిత ధరీవాల్ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీళ్ల స్వస్థలం అహ్మదాబాద్. శ్వేత స్పెషల్లీ చాలెంజ్డ్. సరిగ్గా నడవలేదు. అంకితకు విటిలిగో! వీళ్ల ప్రయాణం కేవలం పిల్లల కోసం స్కిన్ ఫ్రెండ్లీ దుస్తులను తయారుచేసే సంస్థను నెలకొల్పడమే కాదు.. గుర్తింపు, గౌరవాన్ని పొందడం కూడా! ఆ ప్రయాణం దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట ఓ వేసవిలో మొదలైంది. అప్పటికి శ్వేత టెక్స్టైల్ డిజైనర్. రచయిత కూడా. తన పిల్లల కోసం ఆర్గానిక్ కలర్స్తో హాయిగా స్కిన్ఫ్రెండ్లీగా ఉండే కాటన్ దుస్తుల కోసం వెదుకుతోంది. ఎక్కడా దొరకలేదు. అప్పడనిపించింది వాటిని తనే తయారు చేస్తే..? అని! అంతే! సోదరి అంకిత సహాయంతో దేశమంతా తిరిగి నాణ్యమైన నేత, నైపుణ్యం గల మహిళా చేనేత కళాకారులను కలుసుకుంది. వాళ్లందరినీ తన ప్రాజెక్ట్లో భాగం చేసి 2017లో ‘వైట్వాటర్’ను ప్రారంభించింది.వైట్.. స్వచ్ఛతకు, వాటర్.. పారదర్శకమైన జీవన ప్రవాహానికి చిహ్నం. అందుకే ఆ బ్రాండ్లోగోలో సముద్రంలో చేప ఈదుతున్నట్టుగా ఉంటుంది. ‘ఇది పిల్లలు తాము సృష్టించాలనుకుంటున్న ప్రపంచంలోని భద్రత’ను సూచిస్తుంది అంటారు ఈ అక్కాచెల్లెళ్లు. దీన్ని అంకిత డిజైన్ చేసింది. ఆమె లండన్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ విద్యార్థి. దుస్తులనేమో శ్వేత డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్స్తో పిల్లలకు స్టోరీస్ కూడా చెప్పాలనుకుంటుంది. అందుకే పిల్లల కోసం తాము తయారు చేసే టవల్స్, బెడ్ షీట్స్, దుప్పట్లు, పిల్లో కవర్స్ మీద పోయెమ్స్, జోలపాటలు, రైమ్స్ను రాస్తుంది. ఈ బ్రాండ్ కుర్తా సెట్స్నూ తయారు చేస్తుంది. ‘మాది కేవలం ఒక బ్రాండ్ కాదు.. ఒక ఉద్యమం.. గుర్తింపు కోసం, గౌరవం కోసం చేసే మూవ్మెంట్. అందుకే మా డిజైన్స్ ఐడెంటిటీ, డిగ్నిటీ, పోయెట్రీ, పర్పస్తో మిళితమై ఉంటాయి. మా ఈ బ్రాండ్ ఫిలాసఫీని మా వైకల్యమే షేప్ చేసింది’ అని చెబుతారు శ్వేత, అంకిత. అలా వాళ్లు పిల్లల కోసం దుస్తులనే కాదు కలలనూ నేస్తున్నారు. (చదవండి: Donald Trump: కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్కు కూడా ఇదే సమస్య!) -
పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..!
చాలా చిన్నపిల్లల్లో నోటి నుంచి చొల్లు / జొల్లు కారుతుండటం చాలా కనిపించేదే. వైద్య పరిభాషలో చొల్లు/జొల్లు స్రవించే కండిషన్ను ‘సైలోరియా’ అనీ, ఇంగ్లిషు వాడుకభాషలో దీన్ని ‘డ్రూలింగ్’ అని అంటారు. నెలల పిల్లల్లో ముఖ్యంగా నాలుగు నెలల నుంచి 18 నెలల వరకు చిన్నపిల్లల్లో ఇది సాధారణంగా కనిపించేదే. ఆ టైమ్లో అంత చిన్న పిల్లల్లో అలా చొల్లు / జొల్లు స్రవిస్తుండటం చాలా సాధారణం. కానీ నాలుగేళ్లు దాటిన తర్వాత కూడా జొల్లు కారడం జరుగుతుంటే... అంటే పెద్ద పిల్లల్లోనూ ఇదే కనిపిస్తుంటే అది కొన్ని సీరియస్ సమస్యలకు సూచన కావచ్చు. పెద్దపిల్లల్లో ఇలా చొల్లు స్రవించడానికి దానికి కారణాలేమిటో, వాళ్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో తెలుసుకుందాం. చిన్నారుల్లో వాళ్ల నోరు, దవడ భాగంలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ పూర్తిగా అభివృద్ధి చెందేవరకూ ఇలా నోటి నుంచి లాలాజలం వస్తుండటం మామూలే. కానీ చిన్న పిల్లల్లో నాలుగేళ్లు దాటాక కూడా చొల్లు వస్తూనే ఉంటే దాన్ని కాస్త సీరియస్గా తీసుకోవాలి. అంటే దాన్ని సాధారణ విషయంగా అనుకోకుండా కాస్త అబ్నార్మాలిటీగా పరిగణించాలి. పెద్ద పిల్లల్లో చొల్లు / జొల్లును సీరియస్గా ఎందుకు తీసుకోవాలంటే...?కొంతమంది పెద్ద పిల్లల్లో మానసిక సమస్యలు, నరాల బలహీనతకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే ఇలా చొల్లు / జొల్లు కారుతుండటం జరుగుతుంది. అంటే వాళ్లలోని ఆరోగ్య సమస్య కారణంగా వాళ్ల నోట్లో స్రవించిన లాలాజలాన్ని వాళ్లు తమంతట తామే మింగలేనందువల్ల ఇలా జొల్లు / సొల్లు స్రవిస్తుంటుంది. ఇక కొందరు చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ముక్కులు విపరీతంగా బిగుసుకుపోయినా, దంత (డెంటల్) సమస్యలు ఉన్నా, మింగలేక΄ోవడానికి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు (ఉదా: సివియర్ ఫ్యారింగో టాన్సిలైటిస్ వంటివి) ఉన్నా చొల్లు/జొల్లు కారుతుంటుంది. పైగా ఇలాంటి సమస్యలు ఉన్నపుపడు జొల్లు కారడం మరింత పెరుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికం. తొలుత తీసుకోవాల్సిన జాగ్రత్తలు...పెద్ద పిల్లల్లో ఇలా చొల్లు / జొల్లు కారుతున్నప్పుడు వాళ్లంతట వాళ్లే తమ లాలాజల స్రావాన్ని మింగుతుండేలా వాళ్లకు అలవాటు చేయాలి. ఇక లాలాజల స్రావం ఎక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన దంత ఉపకరణాలు (స్పెషల్ డెంటల్ అప్లయెన్సెస్) ఉపయోగించి వాలంటరీగా వాళ్లకు మింగడం ప్రక్రియను అలవాటు చేయించవచ్చు. అడ్వాన్స్డ్ చికిత్సగా... మరికొందరిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో (ముఖ్యంగా పెద్దవాళ్లలో, పెద్ద పిల్లల్లో) కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో బొట్యులినం అనే ఒక రకం ఇంజెక్షన్ను లాలాజల గ్రంథుల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. జొల్లు స్రవించే పిల్లలకు ఇవీ సూచనలు... అన్నిటికంటే ముఖ్యంగా ఏడాదిన్నర దాటాక కూడా పిల్లల్లో చొల్లు / జొల్లు స్రవిస్తుంటే ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి... మంచి నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) తరచూ గుటక వేస్తూ లాలాజలం మింగడం అలవాటు చేయడంనోటి కండరాల కదలికలను మెరుగు పరచడం (ఇంప్రూవ్మెంట్ ఆఫ్ టోన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఓరల్ మజిల్స్)... ఈ చర్యలన్నీ పిల్లల్లో చొల్లు/జొల్లు స్రవించకుండా అరికట్టడానికి బాగానే ఉపయోగపడతాయి. అప్పటికీ అలాగే స్రవిస్తుంటే పిల్లల డాక్టర్ను సంప్రదించి, అసలు కారణం తెలుసుకోడానికి అవసరమైన పరీక్షలు చేయించాలి. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్సలు ఉంటాయి. (చదవండి: ఏరియల్ యోగా అంటే..? కేవలం మహిళల కోసమేనా..) -
పెరిగే ఒత్తిడి కంటికీ కాటే..!
ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. ఒత్తిడి మన అంతర్గత అవయవాలపైనా, మెదడుపైనా ప్రతికూల ప్రభావాలను చూపి, అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు గుండె, మానసిక ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ మొదలైన అంశాలపై ఒత్తిడి ప్రభావం చాలా తీవ్రంగానే పడి గుండె΄ోటు మొదలుకొని, జీర్ణసమస్యలూ, మానసిక సమస్యలూ వస్తాయి. అలాగే కంటి విషయంలో ఒత్తిడి తన దుష్ప్రభావాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం.కంటిపై ఒత్తిడి దుష్ప్రభావం ఎలాగంటే... కంటిపై పడే దుష్ప్రభావాలకంటే ముందుగా... అసలు ఒత్తిడి వల్ల దేహంపై కలిగే ప్రభావాలేమిటో, అసలవి ఎందుకు కలుగుతాయో చూద్దాం. అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో దేహం ‘ఫైట్’ లేదా ‘ఫ్లైట్’ అనే పరిస్థితికి సిద్ధమవుతుంది. అంటే పోరాడు’ కుదరకపోతే పారిపో’ అనే పరిస్థితులకు దేహాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో దేహంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి. ఆ హార్మోన్ల వల్ల దేహం చాలా కొద్ది వ్యవధిలోనే పారిపోవడానికి లేదా పోరాటానికి అవసరమైన బలాన్ని ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేలా చేస్తుంది. పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురి కావడం, వాటికి అవసరమైన రక్తప్రవాహం అందక΄ోవడం, కండరాల్లో ఇన్ఫ్లమేషన్ వంటి అనర్థాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కంట్లో ఉండేవీ కండరాలే కావడంతో అన్ని కండరాల్లాగానే వీటిపైన కూడా ఆ దుష్ప్రభావాలు పడతాయి.కంటిపై ఒత్తిడి పెంచే అంశాలివి... ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యేవారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి. అన్ని రకాల ఒత్తిళ్లతో పాటు మరికొన్ని అంశాలు కళ్లపై తమ ప్రభావాన్ని నేరుగా పడేలా చేస్తాయి. అవి... ఎక్కువ సేపు స్క్రీన్ను చూస్తుండటం. (అది టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఏదైనా కావచ్చు); నిద్రలేకపోవడం; వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుండటం... ఇవన్నీ కంటిపైనా ఒత్తిడి పడేలా చేస్తాయి.ఒత్తిడి కారణంగా వచ్చే కంటి సమస్యలివి... కన్ను స్ట్రెయిన్ కావడం (ఏస్థెనోపియా) : డిజిటల్ స్క్రీన్స్కు నిత్యం ఎక్స్΄ోజ్ అవుతూ ఉండటం. ఈ కారణంగా కళ్లు స్ట్రెయిన్ అవుతుంటే తలనొప్పి, కళ్లు ΄÷డిబారడం, మసక మసగ్గా కనిపించడం వంటివి.డ్రై ఐస్ : ఒత్తిడి కారణంగా కళ్లలో స్రవించే నీరు (కన్నీరు లేదా లాక్రిమస్ సెక్రిషన్) తగ్గుతుంది. దీని కారణంగా కళ్లు పొడిబారడంతో పాటు కళ్లలో ఇసకపడ్డట్లు ఫీలింగ్, ఇరిటేషన్, కళ్లమంటల వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లర్డ్ విజన్ : కంటి చుట్టూతా ఉండే కండరాలు ఒత్తిడితో బిగుసుకుపోతున్న కారణంగా... చూపు స్పష్టంగా కనిపించక ఎదుటనున్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా కళ్లలో సన్నటి కన్నీటి పొర అవరించినప్పుడూ ఇలా మసగ్గా కనిపించవచ్చు. కన్ను అదరడం (ట్విచ్చింగ్) : కన్ను అదరడం చాలామందిలో కనిపించే సాధారణమైన అంశం. కన్ను అదరడాన్ని బట్టి కొందరు శుభసూచనలను / అశుభసూచకాలను దీనికి ఆ΄ాదిస్తుంటారు. ఇలా కన్ను అదరడాన్ని (ట్విచ్చింగ్ను) దీన్నే వైద్య పరిభాషలో ‘మయోకైమియా’ అంటారు. ఇది దీనివల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి కారణంగా కన్ను అదురుతుండటం చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. కాంతికి ప్రతిస్పందించడం (లెట్ సెన్సిటివిటీ) : తీవ్రమైన కాంతిలో కన్ను చాలా ఇబ్బందికి గురయ్యే విషయం తెలిసిందే. ఒత్తిడితో కన్ను రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి... మైగ్రేన్ను కలగజేస్తుందన్న విషయం తెలిసిందే. మైగ్రేన్లో కన్ను మామూలు కాంతిని కూడా చూడలేక΄ోతుంది. అలాగే ఆరుబయట తీవ్రమైన కాంతి ఉన్నప్పడూ కన్ను తెరుచుకోడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని కంటి భ్రమలూ, భ్రాంతులు (విజువల్ హేలూసినేషన్స్) : అరుదుగా కొన్ని సందర్భాల్లో కంటికి కొన్ని దిగ్భ్రమలు కలుగతాయి. దాంతో కంటి ముందు లేనివి కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని కాంతిపుంజాలు వెలుగుతున్నట్లుగానూ, అవి తేలుతూ పోతున్నట్లుగానూ (వీటినే ఫ్లోటర్స్ అంటారు), మెరుపులు మెరుస్తున్నట్లుగా దిగ్భ్రమలు కలగవచ్చు. కొన్నిసార్లు తాత్కాలికంగా కన్ను దేన్నీ చూడలేకపోవచ్చు కూడా. ముఖ్యంగా ఇలాంటివి ఆక్యులార్ మైగ్రేన్ అనే కండిషన్లో కలుగుతాయి.మేనేజ్మెంట్ / చికిత్స...లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు కన్ను పొడిబారిన సందర్భాల్లో కృత్రిమంగా కన్నీటిని ఇచ్చే చుక్కల మందులూ, ల్యూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, కన్ను సరిగా చూడలేక΄ోతున్న సందర్భాల్లో యాంటీ గ్లేర్ కళ్లజోడు, కన్ను పూర్తిగా అలసి΄ోతున్నప్పుడు కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలను డాక్టర్లు చెబుతారు. దీనికి తోడు పూర్తి దేహానికి ఒత్తిడి తొలగేందుకు యోగా, పప్రాణాయామ వంటి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలంటూ చెబుతారు. ఇక కొందరికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీనికి తోడు దేహానికి తగినన్ని ద్రవాలు అందుతూ దేహాన్ని హైడ్రేటెడ్గా ఉంచేలా నీరూ, ద్రవాహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, మంచి ΄ోషకాహారం తీసుకోవడం వంటి మంచి జీవనశైలి మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. చివరగా... ఇటీవల వైగవంతమైన జీవనశైలిలో కంటినీ, కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మొదట్లో ఒత్తిడి (స్ట్రెస్) కారణంగా కంటికి వచ్చే అనారోగ్యాలు పెద్దగా ఇబ్బంది పెట్టక΄ోవచ్చుగానీ... ఇదే వత్తిడి దీర్ఘకాలం ఉంటూ అదేపనిగా కంటిపై ఒత్తిడి కలగజేస్తే అది మరిన్ని దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘చికిత్స కంటే నివారణ మేలు’ అనే సూక్తిని అనుసరించి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిపై దృష్టి కేంద్రీకరించి, దాన్ని పూర్తిగా తగ్గించుకోవలన్న వాస్తవం కంటి విషయంలో మరింతగా ఆచరించాల్సిన సత్యం. కంటిపై ఒత్తిడి తగ్గి... కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే...ప్రతి 20 నిమిషాలకొకసారి 20 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పాటు చూస్తుండాలి.ప్రతి రెండు గంటలకోసారి (కంప్యూటర్ చూడ్డంలాంటి) పనికి బ్రేకిచ్చి 10 – 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే గంటా లేదా రెండుగంటల ముందర మొబైల్ ఆపేయాలి. రాత్రి చీకట్లో లైట్ లేకుండా మొబైల్గానీ, లాప్టాప్గానీ చూడకూడదు.ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. (చదవండి: అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..) -
ఏరియల్ యోగా అంటే..? కేవలం మహిళల కోసమేనా..
ఇటీవల ఆరోగ్య స్పృహ ఎక్కువై అంతా జిమ్, వాకింగ్, యోగా, వ్యాయమాలు బాట పట్టారు. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి విభిన్న రకాల వర్కౌట్లను అనుసరిస్తున్నారు. వినూత్న శైలిలో ఆరోగ్యంగా ఉండటం ఎలా అంటూ సరికొత్త యోగాలను పరిచయం చేస్తున్నారు. అలానే నెట్టింట ఇండోనేషియా బండా అషేలోని మహిళా జిమ్లోని సరికొత్త యోగా ఫోజ్లు పెద్ద దుమారం రేపి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అక్కడ మహిళలంతా వ్యాయామాలు చేస్తున్నారా..? ఊయల్లో సేదతీరుతున్నారా అని అర్థంకానీ ఫోజ్లలో కనిపించారు. మరి ఆ సరికొత్త యోగా భంగిమ ఏంటి..? ఎలా చేస్తారు..? ఎవరికి మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.2004 సునామీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరమే ఈ బందా అసే. అక్కడ కాస్త మహిళలకు సంబంధించి కట్టుదట్టమైన చట్టాలు అమలులో ఉన్నా దేశం ఇది. అయితే అక్కడ మహిళా ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో యోగా క్లాసులు, పలు వెల్నెస్ సెంటర్లు నడుస్తుండటం విశేషం. అక్కడ ఓ మహిళల జిమ్లో ఈ వింతైన దృశ్యం కనువిందు చేసింది. ఆ మహిళలంతా ఊయల ఆసనం మాదిరి యోగా భంగిమలో వేలాడుతూ కనిపించారు. దాన్ని ఏరియల్ యోగా అని పిలుస్తారట. అదెలా చేస్తారంటే.. View this post on Instagram A post shared by Chaideer Mahyuddin (@mirroreye) ఏరియల్ యోగా అంటే: ఊయలలాంటివి లేదా పైకప్పు నుంచి వేలాడే మృదువైన వస్త్రాల సాయంతో చేసే యోగా పద్ధతి. ఇది సాధారణ యోగాతో పాటు జిమ్నాస్టిక్స్, పైలేట్స్ వంటి వర్కౌట్లను కలగలపిన ఒక ప్రత్యేకమైన యోగాసనం.ప్రయోజనాలు..ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది: శరీర భాగాలు గాలిలో సాగదీయబడి, కండరాలు మెరుగవుతాయివెన్నునొప్పి తగ్గుతుంది: వెన్నెముకపై ఒత్తిడి లేకుండా స్ట్రెచ్ అవుతుందిఒత్తిడి తగ్గుతుంది: గాలిలో వేలాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందిబరువు తగ్గేందుకు సహాయపడుతుంది: 50 నిమిషాల సెషన్లో సుమారు 320 కేలరీలు ఖర్చవుతాయిజీర్ణక్రియ మెరుగవుతుంది: పొత్తికడుపు సమస్యలు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయిశ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుంది: ఊపిరితిత్తులకు వ్యాయామం అవుతుందిఎవరికి మంచిది కాదంటే..గుండె జబ్బులు, బీనీ, గ్లకోమా, ఆర్థరైటిస్ ఉన్నవారుగర్భిణులు, పెద్ద ఆపరేషన్ చేసినవారుఒకవేళ ఈ ఏరియల్ యోగా చేయాలనుకున్న నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. ఇది కేవలం మహిళలే కాదు ఆరోగ్యవంతమైన పురుషుల కూడా చేయవచ్చు. పైన చెప్పిన అనారోగ్య సమస్యలు లేనివాళ్లు ఎవరైనా నిపుణుల పర్యవేక్షలో నిస్సందేహంగా ఈ ఏరియల్ యోగాని నేర్చుకోవచ్చని చెబుతున్నారు. -
మనుషులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పది విషయాలివేనట!
ఒకరెవరో చాట్ జీపీటీ (Chatgpt)ని తమాషాగా ఒక ప్రశ్న అడిగారు... మనుషులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పది విషయాలేమిటీ... అని. దానికి చాట్ జీపీటీ ఇలా చెప్పింది...ఒకటి... ప్రతి వాళ్లూ 24 గంటలూ ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు లేదా మొబైల్ ఫోన్లకు బానిసలు అయిపోయారు.రెండు... మీరు తీసుకునే ఆహారం మీకు అనారోగ్యం కలిగించే విధంగా రూపొందించబడింది. మూడు... ఇంటర్నెట్ అంతా జల్లెడ పట్టేశారు... దానిని మీ నియంత్రణలోకి తీసుకున్నారు. నాలుగు... డబ్బు శూన్యం నుంచి సృష్టించబడింది. అప్పు చేయడం అందరికీ తప్పనిసరిగా మార్చేసింది. ఐదు... ఆధునిక వైద్యం మూలకారణాలకు కాకుండా పైకి కనిపించే సాధారణ లక్షణాలకు మాత్రమే చికిత్స చేసే విధంగా తయారైంది. ఆరు... చరిత్ర పాఠాలు అసలు విషయాలను, వాస్తవాలను చెరిపేసి వాటిని అలాగే మరుగున పడేసి ఎవరికి నచ్చిన విధంగా వారు రాసుకునేలా తయారైంది. ఏడు.. కృత్రిమ మేధ అంటే ఏఐ ప్రపంచ వాకిళ్లను బార్లా తెరిచేసి, సువిశాలం చేసేసింది. ఎనిమిది... అంతరిక్షం... మరీ అంత దూరం ఏం కాదు. నువ్వు అనుకున్న దానికన్నా దగ్గరే... భూమి పొర నువ్వు అనుకునేంత గట్టిగా ఏం ఉండదు. బాగా పెళుసైనది. తొమ్మిది... జీన్ ఎడిటింగ్ అంటే జన్యు సవరణ నువ్వనుకున్నదానికన్నా నిశ్శబ్దంగా వేగంగా ముందుకు సాగుతోంది. పది... భూమి సూర్యుణ్ణి ఇప్పుడున్న దానికన్నా వేగంగా చుట్టగలదా? అలా చుడితే ఎన్నో విపత్తులు, ఉపద్రవాలూ చోటు చేసుకోవూ..వీటికి నెటిజనులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చూడటానికి ఇవన్నీ ఏవో తమాషాగా.. సిల్లీ సమాధానాల్లా అనిపిస్తున్నాయి కానీ నిజంగానే అవి పరిగణనలోకి తీసుకోదగ్గవి. ఆలోచించ దగ్గవీనూ అని అంటున్నారు. ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! -
చెడుకు చెక్.. పిల్లల్లో ఈ అయిదు ప్రమాద సంకేతాలు
ఉదయం లేచింది మొదలు ఉరుకుల పరుగులు జీవితాలు. పిల్లలను రెడీ చేసి స్కూళ్లకు పంపించి, తాము రెడీ అయి ఆఫీసులకు వెళుతుంటారు తల్లిదండ్రులు. ఎలాగూ స్కూల్కి పంపిస్తున్నాం కదా...అన్నీ అక్కడ టీచర్లే చూసుకుంటారులే అని పేరెంట్స్, పిల్లల ప్రవర్తనను సరిచేయాల్సింది వారి తల్లిదండ్రులే అని టీచర్లు అనుకోవడం సాధారణంగా జరిగిపోతుంటుంది. మార్కులు, ర్యాంకులు, గ్రేడులు చూసుకొని సంతృప్తి పడిపోతారు. ‘కానీ, పిల్లలు సరైన దారిలో ఉన్నారా, చెడు స్నేహాల్లో తమను దాటిపోతున్నారా అనేది చూసుకోవాల్సింది తల్లిదండ్రులే. బిడ్డ చెడు సహవాసంలో ఉందని చెప్పడానికి ఈ 5 హెచ్చరిక సంకేతాలు విస్మరించవద్దు’ అంటున్నారు చైల్డ్ సైకియాట్రిస్ట్లు, నిపుణులు. ఈ విషయాల సాయంతో మీరు మీ పిల్లల ప్రవర్తనలో మార్పులను గుర్తించవచ్చు. సకాలంలో వాటిని సరిదిద్దడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు. ఉపాధ్యాయుల గురించి ఎప్పుడూ చెడ్డగా మాట్లాడటం...: ఒక పిల్లవాడు తన ఉపాధ్యాయుల గురించి పదే పదే చెడుగా మాట్లాడటం లేదా తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభించినట్లయితే, అది మీ బిడ్డ తప్పుడు సహవాసంలో ఉన్నాడనడానికి సంకేతంగా గుర్తించాలి. స్నేహితుడి తప్పులకు వత్తాసు పలకడం: ఒక పిల్లవాడు తన స్నేహితుడి చెడు ప్రవర్తనకు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తే, అది ఆ పిల్లవాడు ఆ చెడ్డ స్నేహితుడి ప్రభావానికి లోనయ్యా డనడానికి స్పష్టమైన సంకేతంగా గ్రహించాలి. దీనిని తల్లిదండ్రులు హెచ్చరికగా తీసుకోవడం మంచిది.తరచూ ప్రతికూల చర్చలు : మీ బిడ్డ అకస్మాత్తుగా తన గురించి తాను ప్రతికూలంగా మాట్లాడటం ప్రారంభిస్తే లేదా తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్నట్లు అనిపిస్తే, అది అతని తోటివారి ప్రతికూల ప్రభావాల వల్ల కావచ్చని గుర్తించాలి.రహస్యంగా మాట్లాడటం లేదా చాటింగ్...: ఒక పిల్లవాడు అకస్మాత్తుగా తన ఫోన్ను దాచి స్నేహితులతో మాట్లాడటం లేదా చాటింగ్ చేస్తున్నప్పుడు తన మొబైల్ స్క్రీన్ను దాచుకోవడం ప్రారంభిస్తే, తల్లిదండ్రులు అలెర్ట్గా ఉండాలి.చదువు నుండి పారిపోవడం...: మీ బిడ్డ ఉన్నట్టుండి స్కూల్కి వెళ్లనని మొరాయించడం లేదా హోంవర్క్ చేయకుండా మొండికి వేయడం, స్కూల్ ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్పడం లేదా చదువుపై ఆసక్తి చూపక΄ోవడం.. వంటివి గమనిస్తే అది సోమరితనం వల్ల మాత్రమే కాదు, చెడు సహవాసం వల్ల కూడా కావచ్చు అని గ్రహించాలి. పిల్లల ప్రవర్తనలో పై విధమైన మార్పులు గమనిస్తే సకాలంలో తగు చర్యలు తీసుకోవాలి. ఇందుకు స్కూల్ టీచర్ల సాయం తీసుకోవడం, నిపుణుల కౌన్సెలింగ్తో.. చెడు సావాసాలను గుర్తించి, పొరపాట్లను నివారించి, సమస్యను చక్కదిద్దవచ్చు.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే! -
అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..
అరటి తొక్కలను పడేయకండి.. పండే కాదు..తొక్కల కూడా ఉపయోగమే అంటూ పలు బ్యూటీ చిట్కాలు గురించి విని ఉంటాం. అందులోనూ చాలామంది అరటి పండు తొక్కలను ముఖంపై, దంతాలపై తెగ రుద్దేస్తుంటారు. క్లీనింగ్ పర్పస్గా ఉపయోగపడుతుందని, ముఖం, దంతాలు నిగనిగలాడే తెల్లటి మెరుపుని సంతరించుకుంటాయిని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇందులో వాస్తవమెంతుందో ఓ ఇన్ఫ్లుయెన్సర్ సవివరంగా చెప్పడమే గాక నిపుణులు కూడా ఆమె మాటకే మద్దతిస్తూ పలు సూచనలు కూడా ఇచ్చారు. అమెరికాకు చెందిన బ్యూటీ అండ్ వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్ము బ్యూటీ వ్యవస్థాపకురాలు జరీఫా అహ్మద్ అరిజే ఇన్స్టాలో ఆరోగ్యకరమైన తెల్లటి దంతాల కోసం అరటి తొక్కలను చాలామంది వినియోగిస్తుంటారని చెప్పుకొచ్చింది. 50 మిలియన్ల మందకి పైగా ప్రజలను బోటాక్స్ బదులుగా అరటితొక్కను ముఖంపై రుద్దడం వంటివి చేస్తుంటారని అన్నారామె. వీటికి దంతాలను కూడా తెల్లగా మార్చే శక్తి ఉన్నందున అదుకోసం కూడా ఉపయోగిస్తారని చెప్పారు. ఇదేమి మ్యాజిక్ కాదని, ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఇవ్వకుండా దంతాలను సున్నితంగా పాలిష్ చేసి, మంచి స్ట్రాంగ్గా మారుస్తాయని చెప్పుకొచ్చింది. దీన్ని ఎక్కువగా కరేబియన్, ఆఫ్రికన్, దక్షిణాసియన్లు నోటి ఆరోగ్యం కోసం ఉపయోగిస్తుంటారని తెలిపింది. రాత్రిపూట ఇదేమి దంతాలను శుభ్రపరచదు గానీ, స్ట్రాంగ్ ఉండేలా చేస్తుంది. ఈ అరటిపండులో సహజసిద్ధంగా ఇంత మంచి లక్షణం ఉండటం కారణం చేతనే చాలామంది బోటాక్స్ల జోలికిపోవడం లేదని చెబుతోంది.ఇది నిజమేనా..?దంతాలు అందంగా మారాలంటే దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా అరటి తొక్కలు దంతాలను తెల్లగా మారుస్తాయిని చెప్పడానికి ఎక్కడ శాస్త్రీయమైన ఆధారాలు లేవని అన్నారు. సదరు ఇన్ఫ్లుయెన్సర్ వాదనను సమర్థించేలా శాస్త్రీయ పరిశోధనలు కూడా ఏమి జరగలేవని తేల్చి చెప్పార. ఇలా అరటి తొక్కను రుద్దడంతోనే దంతాలు స్ట్రాంగ్ అవుతాయని చెప్పుందుకు కూడా సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు నిపుణులు. అరటి తొక్కల్లో పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్ వంటివి ఉన్నప్పటికీ అవేమి ఇలా రుద్దగానే దంతంలోకి చొచ్చుకునిపోవని అన్నారు. అయితే ఈ పద్ధతిలో దంతాలపై ఉండే మరకలను తొలగే అవకాశం ఉందేమో గానీ, ఆ తర్వాత క్రమం తప్పకుండా బ్రెష్ చేయకపోతే మాత్రం సమస్య తప్పదని అన్నారు. ఎందుకంటే దీనిలో సహజ చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇలా రుద్దిన తర్వాత తప్పనిసరిగా బ్రష్చేయాల్సిందేనని అన్నారు. ఒకవేళ అలా వదిలేస్తే..దంతక్షయానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు అవి ఉపరితల మరకలను తొలిగించవచ్చేమో కానీ దంతాలపై ఉండే లోతైన మరకలను మాత్రం పూర్తిగా తొలగించేలేదని చెప్పుకొచ్చారు. చివరికి ఇది తెల్లబడటం అటుంచి ఆ తొక్కలో ఉండే వర్ణద్రవ్యం దంతాలపై ఉండే ఎనామిల్ని పసుపు రంగులోకి మార్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదేమి హైడ్రోజన్ పెరాక్స్డ్ మాదిరి మంచి బ్లీచింగ్ చికిత్సను అందించి దంతాలను తెల్లగా మార్చలేదన్నారు. వైద్యపరంగా ఆమోదించిన ఉత్పత్తులు, వైద్య నిపుణుల సలహాలతో దంతాలను తళతళలాడే మెరుపులో ఉండేలా చేసుకోవాలని అన్నారు నిపుణులు. View this post on Instagram A post shared by zareefa ahmed-arije (@byzareefa) (చదవండి: ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..! వీడియో వైరల్) -
ఎంఆర్ఐ స్కానింగ్ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..
ఆస్పత్రికి వెళ్లినప్పుడు తరుచుగా వింటుంటాం ఎంఆర్ఐ స్కానింగ్ గురించి. కొందరు రోగులకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి చేయించుకోవాల్సిందిగా వైద్యులు చెబుతుంటారు. కానీ అలాంటి స్కానింగ్ చేయించుకునేటప్పుడు బహు జాగ్రత్తగా వ్యహరించాలి. లేదంటే ఈ వ్యక్తిలా గాయలపాలవ్వాల్సి వస్తుంది.ఎంఆర్ఐ గదిలో స్కాన్ చేస్తుండగా ఒక వ్యక్తి మెటల్ చైన్ ధరించి గదిలోకి వచ్చాడు. అంతే అమాంతం ఎంఆర్ఐ మెషీన్ లోపలి శక్తిమంతమైన అయాస్కాంతం అతడిని గొలుసుతో సహా తన వైపుకి లాగేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన న్యూయార్క్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. సకాలంలో అధికారులు స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. అదేంటి ఆస్పత్రిలో మెషీన్ ఆన్లో ఉండగా సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ గది తలుపు లాక్ చేసి ఉంటుందా కదా అనే ప్రశ్నలు సర్వత్రా మొదలయ్యాయి. అయినా రోగి పరీక్ష చేయించుకుంటుంటే ఈ వ్యక్తి అక్కడే తిరుగుతున్నాడా అంటూ పలుఅనుమానాలు వ్యక్తమయ్యాయి అందిరిలో. కాగా, ఇక అధికారులు కూడా ఈ సంఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇలాంటి స్కానింగ్ యంత్రాల పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇలాంటి ప్రమాదాల బారినపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎంఆర్ఐ యంత్రాల సమీపంలో లోహ వస్తువులు ఎందుకు ప్రమాదకరం..ఆ యంత్రాలు శరీరం లోపలి చిత్రాలను తీయడానికి అత్యంత బలమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తాయి. ఇది మెషిన్ని స్కాన్ చేయనప్పుడూ కూడా అయస్కాంతక్షేత్రం ఆన్లోనే ఉంటుందట. ఈ నేపథ్యంలోనే వైద్యులు ప్రజలకు ఆ మెషీన్ వద్దకు ఎలాంటి లోహ వస్తువులతో రాకూడదని సూచిస్తుంటారు. (చదవండి: Donald Trump: కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్కు కూడా ఇదే సమస్య!) -
కాళ్లలో వాపు?.. సిరలు దెబ్బతిన్నాయేమో.. ట్రంప్కు కూడా ఇదే సమస్య!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాళ్ల వాపుతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు అనంతరం ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఇదేమీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితి కాదని, 70 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో సాధారణంగా వచ్చే సమస్య అని పేర్కొన్నారు వైద్యులు. వృద్ధుల్లో ఇది అత్యంత సర్వసాధారణమైన పరిస్థితి అని తేల్చి చెప్పారు. ఇలా తరుచుగా ట్రంప్కి కాళ్ల వాపు ఎందుకు వస్తుంది అనే దిశగా మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు. వృద్ధులను వేదించే ఈ అనారోగ్య సమస్య ఎందువల్ల వస్తుంది..అసలేంటి వ్యాధి తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!.దీర్ఘకాలిక సిరల లోపం అంటే..ఇది ఎందుకు వస్తుందంటే..కాళ్లల్లోని సిరలు దెబ్బతిన్నప్పుడూ రక్త ప్రవాహాన్ని సరిగా నిర్వహించలేనప్పుడు సంభవిస్తుంది. కాళ్లలోని రక్తం గుండెకు తిరిగి రావడానికి కష్టమవ్వడంతో కాళ్ల సిరల్లో రక్త పేరుకుపోయి వాపు లేదా మచ్చల రావడం వంటి సమస్యలు వస్తాయి. అక్కడ సిరలు అధిక పీడనానికి గురై దెబ్బతినడంతో ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సిరలు మూడు రకాలుగా ఉంటాయి.వాటిని లోతైన, ఉపరితల, డీప్ అనే సిరలుగా విభజిస్తారు. శరీరంలో లోతైన సిరలు కండరాల గుండా ప్రవహిస్తాయి. ఈ ఉపరిత సిరలు చర్మం ఉపరితలంతో కనెక్ట్ అవుతాయి. అంతకుమించి డీప్గా ఉండే సిరలు లోతైన, ఉపరితల సిరల రెండింటిని కనెక్ట్ చేస్తాయిప్రభావం ఎలా ఉంటుందంటే..దీర్ఘాకాలిక సిరల లోపం( Chronic Venous Insufficiency) కారణంగా కాళ్ల నుంచి రక్తం గుండెకు చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కాళ్ల సిరల్లో ఒత్తిడి ఏర్పడి అతి చిన్న రక్తనాళాలు, కేశనాళికలు పగిలిపోతాయి. ఆ ప్రాంతంలోని చర్మం ఎర్రటి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. కాస్త గుద్దిన లేదా గీతలు ఏర్పడ్డ సులభంగా చీరుకుపోయినట్లు అవుతుంది. అంతేగాద ఆ ప్రాంతంలో కణజాల వాపు, నష్టం ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం ఉపరితలంపై పుండ్లు ఏర్పడి ఇన్ఫెక్షన్ల బారినపడతారు. ఈసమయంలో గనుక సకాలంలో వైద్యం తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. సంకేతాలు, లక్షణాలు..కాళ్లు నొప్పి, తొందరగా అనిపించడం,జలదరింపు లేదా సూదులు గుచ్చుతున్న అనుభూతికాళ్లలో తిమ్మిరి ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా ఉండటంరంగు మారిన చర్మం లేదా ఎర్రటి రంగులోకి మారడంకాళ్లపై చర్మం పొరలుగా లేదా దురదగా ఉండటంతోలులా కనిపించే చర్మంపుండ్లువేరికోస్ సిరలుకాలికింద భాగంలో వాపు మచ్చ కణజాలం అభివృద్ధి చెంది కణజాలాలోని ద్రవాన్ని బంధిస్తుంది.ఇన్ఫెక్షన్కి రీజన్..వైద్యుల అభిప్రాయం ప్రకారం, కాళ్ళ సిరల్లోని కవాటాలు సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు దీర్ఘకాలిక సిరలోపం సాధారణంగా ఏర్పడుతుంది. అలాగే కాళ్ళ సిరల్లో సరైన దిశలో రక్త ప్రవాహానికి సహాయపడే కవాటాలు ఉంటాయి. ఒకవేళ అవి కూడా దెబ్బతిన్నట్లయితే, రక్తం గుండె వైపు పైకి తిరిగి ప్రవహించడంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలా వాల్లు కూడా పనిచేయకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు. కాళ్ళ సిరల్లో పుట్టుకతోనే వచ్చిన వైకల్యాలు.కాళ్ళ సిరల్లో మార్పులు వల్ల లోతైన సిరల త్రాంబోసిస్ కారణంగా ఈ సమస్య వస్తుంది. ఎక్కువగా వృద్ధులే ఈ సమస్య బారినపడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
సారా అలీ ఖాన్ (Sara Ali Khan) సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ల కుమార్తె. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సారా తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకుంది. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్లో పట్టా పొందింది. ఆతరువాత నటనా రంగంలోకి అడుగు పెట్టి బస్టర్ హిట్స్ తో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 'కేదార్నాథ్' 'అత్రంగి రే', ఇంకా వెబ్సిరీస్లతో అదరగొట్టేసింది. సారా అలీ ఖాన్ కొత్త చిత్రం మెట్రో... ఇన్ దినోం మంచి పేరే తెచ్చుకుంది. అయితే సినిమాల్లోకి రావడానికి ముందు 96 కిలోల బరువు, PCOS సమస్యలతో బాధపడిన డైట్, వర్కౌట్స్తో 47 కిలోలకి తగ్గింది. ఈ జర్నీకి సంబంధించిన వివరాలు తాజాగా పంచుకుంది.సారా అలీ ఖాన్ కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా 91 కిలోల నుండి 46 కిలోలకు తన బరువును తగ్గించుకుంది. ముఖ్యంగానో-షుగర్ ,నో-మిల్క్ డైట్ ప్లస్ కార్డియోతో తాను 45 కిలోల బరువు తగ్గానని వెల్లడించింది. సినిమాలు, నటన పట్ల ప్రేమతో నటిగా స్థిరపడాలనే లక్ష్యంతో సారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. ఇందుకు సహాయపడే కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంది. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా PCOS ఉన్న అమ్మాయిలు- హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే, అధిక బరువుతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో హార్మోన్ల కారణంగా బరువు తగ్గడం చాలా కష్టతరం అయినప్పటికీ సారాదృఢ సంకల్పం, అంకితభావంతో కృషి చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం, కార్డియో, కఠిన వ్యాయామాల మిశ్రమంతో దాదాపు 45 కిలోల బరువు తగ్గింది. అలా 96 కిలోల నుండి 51 కిలోలకు చేరుకోవడం విశేషం.సారా అలీ ఖాన్ వెయిట్ లాస్ జర్నీరణవీర్ అల్లాబాడియా అకా బీర్బైసెప్స్తో జరిగిన ఇంటర్వ్యూలో, సారా అలీ ఖాన్ తన బరువు తగ్గడం గురించి తెలిపింది. సినిమాలలో నటించాలంటే దర్శకుడు కరణ్ జోహార్ 'సగం' బరువు తగ్గించమని కోరాడని అదే తనకు ప్రేరణ అని తెలిపింది. అమెరికాలో బాగా జంక్ ఫుడ్కు అలవాటు పడిన సారా షుగర్, జంక్ ఫుడ్, నూనెలో వేయించిన స్నాక్స్ పూర్తిగా దూరం పెట్టేసింది. ఇంటి,హెల్తీ ఫుడ్కే ప్రాధాన్యత ఇచ్చింది. చక్కెర, పాలు, కార్బోహైడ్రేట్లు లేని ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చేది. రోజంతా హైడ్రేటెడ్గా ఉండేలా నీళ్లు, ముఖ్యంగా జీలకర్ర, కొత్తిమీర నీళ్లు వంటివి తాగేది.వ్యాయామాల్ని కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది. ఇందులో యోగా ,డ్యాన్స్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఆమె గంటకుపై ట్రైనింగ్ తీసుకునేది. ఒక విధంగా చెప్పాలంటే వ్యాయామాన్ని ఒక పనిగా కాకుండా అదే రోజువారీ ప్రాధాన్యతగా మార్చుకుంది. ఇంత బరువు తగ్గినా ఇప్పటికీ తన బరువుతో సమస్యలను ఎదుర్కొంటున్నానని చెప్పింది. బాడీ పెరుగుతోంది. ముఖం పెద్దగా మారింది.. ఏమి తింటున్నానో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువుతో అదుపులో ఉంచుకోవడం ఉండటం తనకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. తనకు సంబంధించి బరువు తగ్గడం కెరీర్ కోసం మాత్రమేకాదు, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం కూడా. PCOSను తగ్గించుకోవడం, తన ఆత్మవిశ్వాసానికి, జీవితంలో స్పష్టత రావడానికి బరువు తగ్గడం అనేది చాలా సాయపడిందని వెల్లడించింది. -
‘మాన్యువల్లీ క్లీనింగ్' తొలి స్టార్టప్..! సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్హోల్స్..
ఐఐటీ–మద్రాస్లో చేసిన కాలేజీ ప్రాజెక్ట్ దివ్యాన్షు కుమార్ను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది. మాన్యువల్ స్కావెంజర్స్కు ప్రత్యామ్నాయంగా సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్హోల్స్ను శుభ్రపరిచే రోబోట్స్ను రూపొందించాడు. ప్రభుత్వం మాన్యువల్లీ క్లీనింగ్ను నిషేధించినప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట ఇది కొనసాగుతూనే ఉంది. 1993 నుంచి 2020 వరకు దాదాపు 928 మంది ట్రాకర్లు మరణించారు. తమిళనాడు, గుజరాత్లలో అత్యధిక మరణాలు సంభవించాయి.బిహార్లోని గయకు చెందిన దివ్యాన్షు కుమార్ ‘సోలినస్ ఇంటిగ్రిటీ’ అనే స్టార్టప్ను మొదలుపెట్టాడు. మాన్యువల్లీ క్లీనింగ్కు ఈ స్టార్టప్ తయారుచేసే రోబోలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఐఐటీ–మద్రాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన దివ్యాన్షు ప్రొడక్ట్ డిజైన్లో మాస్టర్స్ చేశాడు. ‘మాన్యువల్లీ క్లీనింగ్కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మన దేశంలో వచ్చిన తొలి స్టార్టప్ మాది. తొలి దశలో సీడ్ ఫండింగ్ మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటున్నాడు దివ్యాన్షు. సెప్టిక్ ట్యాంక్లు, డ్రైనేజి క్లీనింగ్, వాటర్ పైప్లైన్ల క్లీనింగ్...మొదలైన వాటిపై ఈ స్టార్టప్ పనిచేస్తోంది. క్లౌడ్–బేస్డ్ స్టోరేజీ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్కు సంబంధించి ‘స్వస్థ్ ఏఐ’ అనే సర్వీస్ను కూడా ‘సోలినస్’ నిర్వహిస్తోంది. (చదవండి: టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్) -
టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్
యూత్, టెక్నాలజీ అనేవి వేరు వేరు పదాలు కాదు. టెక్నాలజీని ‘జీ హుజూర్’ అనేలా చేసి సమాజహితానికి ఉపకరించే డివైజ్లను ఆవిష్కరిస్తున్నారు యువ ఇన్వెంటర్ వంద కోట్ల కంపెనీ వోనర్!పదహారు ఏళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ‘వావ్’ అనిపించింది ప్రాంజలి అవస్థీ. మూడు కోట్లతో ప్రాంరంభమైన ఈ కంపెనీ వంద కోట్ల టర్నోవర్కు చేరడం విశేషం. ఏడేళ్ల వయసులోనే కోడింగ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంజలి పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఫ్లోరిడా యూనివర్శిటీలో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో ప్రాంజలికి ఏఐ గురించి వివరంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మొదట్లో ఒక ఏఐ కంపెనీలో పనిచేసిన ప్రాంజలి ఆ తరువాత ‘డెల్వ్. ఏఐ’ పేరుతో సొంత స్టార్టప్ మొదలు పెట్టి విజయం సాధించింది. అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించడం ద్వారా ‘డెల్వ్. ఏఐ’ సంక్లిష్ట డేటా ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల వనరులు, ఆదాయన్ని ఆదా చేస్తుంది.అథ్లెట్ టు టెక్నో ఎక్స్పర్ట్పదకొండు సంవత్సరాల వయసులో కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ మొదలుపెట్టింది పుహబి చక్రవర్తి. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. ఆటలో విజయం సాధించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పోటీల సమయంలో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొన్న పుహబి ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అనే ఏఐ మోడల్కు రూపకల్పన చేసింది. చిన్నప్పటి నుంచే పుహబికి కోడింగ్ అంటే ఇష్టం. తమ స్కూల్లో నిర్వహించిన ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ కార్యక్రమంలో పాల్గొన్న పుహబికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మంచి అవగాహన ఏర్పడింది. ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ కార్యక్రమంలో ఎఎన్ఎన్, సీఎన్ఎన్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకుంది. ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అప్లికేషన్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, డైట్ అనే మూడు భాగాలు ఉంటాయి. ఫిజికల్ హెల్త్కు సీఎన్ఎన్, మెంటల్ హెల్త్కు ఏఎన్ఎన్, డైట్కు జనరల్ లూపింగ్ను వాడింది. ఆరోగ్యకరమైన శారీరక, మానసిక జీవనశైలి విషయంలో అథ్లెట్స్కు ‘అథ్లెటిక్స్ ఎక్స్’ బాగా ఉపయోగపడుతుంది.గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్పద్దెనిమిది సంవత్సరాల కావ్య కొప్పారపు ‘గ్లియోవిజన్’ అనే ఏఐ టూల్ను డెవలప్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ ఇమేజ్లను త్వరగా విశ్లేషించడానికి ఉపకరించే టూల్ ఇది. డయాబెటిక్ రెటినోపతిని డిటెక్ట్ చేసే స్మార్ట్ఫోన్ సిస్టమ్ను కూడా డెవలప్ చేసింది. టెక్నాలజీకి సంబంధించి అమ్మాయిలను ప్రోత్సహించడానికి ‘గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్’ అనే సంస్థను ప్రారంభించింది. హెల్త్కేర్కు ఉపకరించే ఏఐ సాధనాలపై దృష్టి పెట్టిన కావ్య టైమ్స్ ‘25 మోస్ట్ ఇన్ష్లూయెన్సల్ టీన్స్’ జాబితాలో చోటు సాధించింది.యువ ఏఐ ఉద్యమం‘ఎన్కోడ్’ అనే సంస్థకు స్నేహ రెవనర్ ఫౌండర్, ప్రెసిడెంట్. రెగ్యులేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉపకరించే యూత్ ఆర్గనైజేషన్ ఇది. అమెరికాలోని ఈ ఆర్గనైజేషన్లో వెయ్యి మంది యువతీ,యువకులు ఉన్నారు. ఏఐ పాలసీ ఇనిషియేటివ్స్కు సంబంధించి ‘ఎన్కోడ్’ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. వర్క్షాప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. టైమ్స్ ‘మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ జాబితాలో స్నేహ చోటు సాధించింది.ఆ నలుగురు... వందలాది వన్య్రపాణులను రక్షిస్తున్నారురోడ్లపై జంతువులు ప్రమాదానికి గురికాకుండా ఉండడానికి కొలరాడో (యూఎస్)లోని ‘స్టెమ్ స్కూల్ హైల్యాండ్స్’కు చెందిన నలుగురు టీనేజ్ అమ్మాయిలు ప్రాజెక్ట్ డీర్’ అనే ఏఐ–పవర్డ్ వైల్డ్లైఫ్ డిటెక్షన్ డివైజ్ను డెవలప్ చేశారు. థర్మల్ ఇమేజింగ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి పనిచేసే డివైజ్ ఇది. చీకట్లో, దట్టమైన పొగమంచు ఆవరించినప్పుడు కూడా రోడ్డుపై జంతువులను డిటెక్ట్ చేస్తుంది. ‘రోడ్డుపై జంతువుల ఉనికిని కనిపెట్టిన వెంటనే ప్రాజెక్ట్ డీర్ డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది’ అంటుంది నలుగురు ఇన్వెంటర్లలో ఒకరైన బ్రి స్కోవిల్లీ. ‘ప్రాజెక్ట్ డీర్ డివైజ్లాంటి ఆవిష్కరణ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా కొత్త’ అంటుంది మరో స్టూడెంట్ సిద్దీ సింగ్. (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్) -
‘నిథమ్’.. పాకశాస్త్ర రిథమ్..
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘నిథమ్’ ఔత్సాహిక వ్యాపార వేత్తలకు, పాకశాస్త్ర నిపుణులకు రిథమ్ అన్నట్లుగా గుర్తింపు పొందుతోంది.. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ కింద మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఇందులో భాగంగా 20 రోజుల పాటు శిక్షణ పొందిన 29 మంది మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. దీంతోపాటు వీరందరికీ ఫుడ్ ట్రక్కులను మంజూరు చేశారు.. నిథమ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 29 మందికి ట్రైనీ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిషెల్లి జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో నిథమ్ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎంకే గణేష్ సరి్టఫికెట్లు అందజేశారు. చెఫ్ తుల్జారామ్ ఆధ్వర్యంలో గురువారం పలు రకాల ఫిష్ వంటకాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఫిష్ పకోడా, ఫిష్ 65, ఫిష్ కట్లెట్, పట్రా రి మిర్చీ, ప్రాన్స్ పలావ్, అపోలోఫిష్, ఫిష్ ఇన్ హాట్ గార్లిక్, ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీ వంటి పలురకాల వంటకాలతో విందుచేశారు. చేపలతో తయారు చేసిన వంటకాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సెర్ఫ్ నిథమ్ అధికారులు వీటిని రుచిచూసి శిక్షణార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చెఫ్ తుల్జారామ్ వంటకాల తయారీపై పలు సూచనలు చేశారు. ముగింపు సమావేశం నిర్వహించి శిక్షణ పొందిన వారికి సరి్టఫికెట్లు అందించారు. కార్యక్రమంలో నిథమ్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ జే ఫ్రాన్సిస్, ఫిషరీస్ శాఖ జనరల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి మార్గంగా.. మహిళలు తమకాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్్ఫ) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించాం. ఫిష్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో భాగంగా మహిళలకు ఇది ఉపాధి మార్గంగా మారిందని, మహిళలను వ్యవస్థాపకులుగా మార్చడమే లక్ష్యంగా, జీవనోపాధి పొందేలా, తద్వారా పలువురికి ఉపాధి కల్పించేలా మొబైల్ ఫిష్ ట్రక్ క్యాంటీన్లను నడిపేందుకు ప్రోత్సహిస్తున్నాం. వ్యాపార ప్రమాణాలతో పాటు పరిశుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా శిక్షణ అందించాం. – డాక్టర్ సతీష్ సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్) -
పార్లమెంట్ ఫుడ్ మెనూ..! లిస్టు చూసేయండి!
పార్లమెంటు క్యాంటీన్లో ఫుడ్ మెనూ ఎలా ఉంటుందో తెలుసా..!. ఎప్పుడైనా దీని గురించి విన్నారా అంటే..చాలామందికి తెలియదనే చెప్పాలి. అధికారులు, శాసనసభ్యులు, మహామహారథులు ఉండే ఆ శాసనసభలో వారికి మంచి విలాసవంతమైన భోజనమే క్యాంటిన్లో ఉంటుదనేది వాస్తవమే. కానీ ఈసారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది పార్లమెంట్. అక్కడ క్యాంటీన్ మెనూలో ఎలాంటి వంటకాలు చేర్చారంటే..మంచి రుచికరమైన థాలిస్, కూరలను అందిచిన పార్లమెంట్ క్యాంటీన్ ఇటీవలే దాని మెనూని సరికొత్త వంటకాలతో మార్పులు చేసింది. ఇదివరకటిలా నెయ్యి, నూనెతో కూడిన భారీ భోజనాలకు స్వస్తి చెప్పేసేలా ఓ ముందడుగు వేసింది. ఆ వంటకాల స్థానంలో.. సుదీర్ఘ గంటలు పనిచేసే శాసనసభ్యుల్లో ఉత్సాహం నింపేలా, జోవర్ ఉప్మా, మిల్లెట్ ఇడ్లీలు, శక్తిమంతమైన సలాడ్లు, కాల్చిన చేపలు సర్వ్ చేయనుంది. దీన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. మెనూలో రుచి, పోషకాహారాన్ని కోల్పోకుండా ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇస్తోంది. అంతేగాదు ఇక్కడ అందించే ఫుడ్ పోషకాహార నిపుణుల మార్గదర్వకత్వంలో జాతీయ ఆరోగ్య ప్రచారానికి అనుగుణంగా ఉంటుందట. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి ఆరోగ్యప్రదాయకమైన వంటకాలతో సమతుల్య ఆహారానికే పెద్దపీట వేసేలా అందించనుంది. ఈ విభిన్న రుచులకు అనుగుణంగా ప్రతి వంటకం పక్కన కేలరీ ట్యాగ్ని కూడా ఇస్తారట. ఈ విధానం జాగ్రత్తగా తినడాన్ని ప్రోత్సహిస్తుందట.ముఖ్యంగా మిల్లెట్ ఆధారిత అల్పాహార వంటకాల నుంచి 270 కిలో కేలరీలతో నిండిన సాంబార్తో రాగి ఇడ్లీ, 206 కిలో కేలరీలతో కూడిన జోవర్ ఉప్మా, మూంగ్ పప్పు చిల్, చనా చాట్, ఉడికించిన కూరగాయలు (157 కిలో కేలరీలు) ఉండగా, మాంసాహార ప్రియుల కోసం గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లను సర్వ్ చేయనుంది. ఎంపీలు (పార్లమెంటు సభ్యులు) ఇప్పుడు ఇక స్నాక్స్, పానీయాల కోసం..గార్డెన్లో పండిన తాజా పండ్ల సలాడ్లు(113 కిలో కేలరీలు), క్లియర్ సూప్, కాల్చిన టమోటా, తులిసి షోర్బాల వంటి జ్యూస్లు సిప్ చేయొచ్చు. అలాగే భోజనాన్ని చివరగా తీపి పదార్థం ముగించేలా మిక్స్ మిల్లెట్ ఖీర్ కూడా అందించనున్నారు. సుదీర్ఘ గంటలు పనిచేసే నాయకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరి ఆరోగ్యదాయకంగా రూపొందించారు ఈ మెనూని. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం ప్రకటించి..చిరు ధాన్యాలకు భారీ ప్రచారం లభించింది. ఆ నేపథ్యంలోనే పార్లమెంటులో మెనూలో ఈ సరికొత్త మార్పులు చేశారు. అలాగే శరీరం రోజువారీ అవసరాలను తీర్చడానికి పిండి పదార్థాలు, కేలరీలు, సోడియం తక్కువగా ఉండి, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా మెనూని చాలా ఆలోచనాత్మకంగా రూపొందించారు. పని చేసే అధికారులలో ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు వంటి ఆందోళనలకు చెక్ పెట్టేలా ఈ మెనూని అత్యంత ఆరోగ్యదాయకంగా రూపొందించడం విశేషం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
'కెరీర్'.. వెరీ కేర్ఫుల్..!
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన. విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో తెలుసుకుంటుండాలి. ప్రభుత్వ వెబ్సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్సైట్లు.నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్ఫాంలు ఉపయుక్తం.పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర.. పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరి మాట నమ్మాలి..? ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు. సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం. కార్యాచరణ సూచనలు.. నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్లైన్లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి. తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు.. ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్సీ, ఈసీఈ, ఏఐఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్లో ఉన్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి. లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్ఐడీ, నిఫ్ట్, ఎఫ్ఎల్ఏఎమ్ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం. వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్కు బేసిక్గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ, పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు. పీజీ (పోస్ట్గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది. కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం: క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్ఏ, ఎమ్మెస్సీ, ఎమ్కాం, గేట్–ఎమ్టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు. పీహెచ్డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్గా గమనించాల్సిన అంశం. పీహెచ్డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్డీ సరైన మార్గం. యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, గేట్, జేఆర్ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్షిప్తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్అండ్డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్డీ అవసరం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా
MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్ చేస్తే సూపర్ స్టార్ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్..పోతాయ్.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని నిరూపించిన నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla) (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి ఇంట్లో పుట్టాడు. కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు. దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్ చేస్తేప్రస్తుతం గోరఖ్పూర్ నుండి పార్లమెంటు, లోక్సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్తో తన కెరీర్ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్పురి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2003లో వచ్చిన సయ్యా హమార్ బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు. అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్.1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి లగ్జరీ కార్లున్నాయి. -
114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..
ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కుడైన మారథాన్ అథ్లెట్గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేంత వరకు మంచి ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరిచేవారు. "టర్బన్డ్ టోర్నడో"గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఫౌజా సింగ్ జూలై 14న 114 వయసులోకి అడుగుపెట్టారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత శతాధిక వృద్ధ మారథాన్ అథ్లెట్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడం బాధకరం. ఆయన చనిపోయేంత వరకు చక్కటి క్రమశిక్షణయుత జీవనశైలికి మారుపేరుగా నిలిచారాయన. వందేళ్ల వయసులో కూడా యువకుడు మాదిరి దూకుడుగా ఉండే అతడి తీరు అందర్నీ ఆశ్చచకితులను చేసేది. అంతలా సుదీర్ఘకాలం జీవించడమే కాకుండా..ఆరోగ్యంగా ఫిట్గా ఉండేందుకు ఆయన ఎలాంటి ఆహార తీసుకునేవారు..?. అతడి జీవన విధానం ఎలా ఉండేది అంటే..ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫౌజా సింగ్ 1911లో జన్మించారు. వందేళ్లు పూర్తి అయిన వెంటనే మారథాన్లో పాల్గొని పరుగుపెట్టడం ప్రారంభించారు. ఆ వయసులో అతడి అపారమైన ఓపిక, చలాకితనం చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ఈ మారథాన్ ప్రయాణాన్ని 89 ఏళ్ల వయసులో ప్రారంభించి 2000 నుంచి 2013 మధ్య మొత్తం 9 మారథన్లు పూర్తి చేశారు. అంతేగాదు ఆయన తన 101వ పుట్టి రోజు జరుపుకున్న మూడు వారాలకే లండన్ మారథాన్లో పాల్గొని ఏడు గంటల 49 నిమిషాల్లో పూర్తి చేశారట. గత 12 ఏళ్లలో మొత్తం ఎనిమది మారథాన్లు పూర్తి చేశారు. ఇంతలా యాక్టివ్గా ఆ వయసులో మారథాన్లు పూర్తి చేయడానికి గల సీక్రెట్ సింపుల్ ట్రిక్సేనని అంటారు ఫౌజా సింగ్. తాను శాకాహారాలు మాత్రమే తింటానని, అదే తన ఆరోగ్య రహస్యమని చెబుతున్నారు. అంతేగాదు ఆయన శాకాహారులు మాంసం తినేవారికంటే సుదీర్ఘకాలం బతుకుతారని బలంగా విశ్వసిస్తాడాయన. ఇదే విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తాను ప్రతిరోజు చపాతీ, పప్పు, సబ్జీ, సాగ్ వంటి శాకాహారాలు తినడం తోపాటు నడవడం, జాగింగ్ వంటివి కూడా చేస్తానని వెల్లడించారు. వయసు పరిణితిని అందిచవచ్చేమో గానీ ఓర్పు, ప్రశాంత జీవనం, మంచి ఆరోగ్యం మాత్రం పోషకాహారమైన శాకాహారంతోనే వస్తుందని సదా పిలుపునిచ్చేవారు ఫౌజా. తాను జీవితాంతం శాకాహారినే అని ప్రకటించారు కూడా. సిక్కు మతం "జీవించడానికి తినాలే తప్ప తినడానికే జీవించకూడదు" అని ప్రభోదిస్తుంది. తాను పుట్టిన భారతావనిలోని పంజాబ్లో స్వయంగా తాము పండించే పంటలనే తింటారని, అదే వారి దీర్ఘాయువు రహస్యమని తరుచుగా చెబుతుండేవారు. ఆ క్రెడిట్ అంతా శాకాహారాలకే ఆపాదిస్తానని అంటుండేవారు. మన భారత ప్రధాని మోదీ సైతం శాకాహారాలతోనే ఆరోగ్యం అని మన్కీ బాత్లో చెబుతుంటారు. అలానే చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా మొక్కల ఆధారిత ఆహారాలతోనే అనారోగ్యం బారిన పడకుంటా ఉంటామని చెబుతుండటం విశేషం. (చదవండి: హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
అత్యుత్తమ ‘ఫన్’ దేశం అదే..! టాప్ 40లో ఇండియా స్థానం?
ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది వినోదం. విపరీతమైన పని ఒత్తిడికి దారి తీస్తున్న ప్రస్తుత ఉరుకులు పరుగుల లోకంలో విశ్రాంతి దానితో పాటే వినోదం కూడా ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందుకు అనుగుణంగానే అనేక రకాల వినోద మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. తమ ప్రజల్ని వినోదభరితంగా ఉంచడానికి అనేక దేశాల్లో ప్రభుత్వాలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే అత్యంత వినోదభరిత దేశంగా ప్రజలు ఏ దేశాన్ని గుర్తిస్తున్నారు? అనే ఆలోచనతో ది యుఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ ఆధ్వర్యంలో ది వరల్డ్స్ మోస్ట్ ఫన్ కంట్రీస్ పేరిట తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు. వినోదాన్ని పంచే వేడుకలు, ఈవెంట్లు, సాహసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు..వగైరాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దాని ప్రకారం వినోద భరిత జీవనాన్ని అందించే 40 దేశాల జాబితాను రూపొందించారు. ఇటీవలే విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం.. స్పెయిన్ అత్యుత్తమ వినోద భరిత దేశంగా నిలిచింది. సాహసాలు, సంస్కృతీ సంప్రదాయల పరంగా 4వ స్థానంలో నిలిచిన ఈ దేశం మొత్తంగా చూస్తే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా స్పెయిన్లో నిర్వహించే టమాటినా ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రపంచలోనే అతిపెద్ద టమాటా ఫెస్టివల్గా వందల కొద్దీ టన్నులను దీని కోసం వినియోగిస్తారు. ఇవే కాకుండా మరిన్ని వినోదాలు, అడ్వంచర్స్ కూడా స్పెయిన్ను ఈ అంశంలో అందలాలు ఎక్కించాయి.ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్, థాయ్ల్యాండ్, ఇటలీ, మెక్సికో, గ్రీస్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఐర్లాండ్, సింగపూర్, టర్కీ, అమెరికా, కెనడా, కోస్టారికా, ఐస్ల్యాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, కొమెనిక్ రిపబ్లిక్, యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, బెల్జియం, మొరాకో, ఈజిప్ట్, స్విట్జర్లాండ్, సైప్రస్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇండోనేషియా, యుఎఇ, చిలీ, ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, పెరు, స్వీడన్, డెన్మార్క్లు ఉన్నాయి.ఈ జాబితాలో ఎక్కడా ఇండియాకు చోటు దక్కకపోవడం విశేషం. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం ఇంకా కొన్ని రకాల కట్టుబాట్లను సంకెళ్లను తెంచుకోకపోవడం అలాగే మన దేశంలో వినోదం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు లేకుండా మన పండుగలు, సంప్రదాయ జాతరలు వంటి వాటిలో అది మమేకమైపోవడం వంటి పలు కారణాలు ఉండవచ్చునని అంటున్నారు. అంతేగాక ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న ప్రజలు, ప్రాంతాలను బట్టి కూడా ఇది ఆధారపడి ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు.(చదవండి: చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?) -
భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?
భారతీయులకు శుభవార్త. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి ఇదొక గొప్ప అవకాశం. రూ. 7,500కే వీసా అందిస్తోంది. ఫ్రాన్స్, యుఎస్, యుకె, స్పెయిన్ కాదు, మరేంటి ఆ దేశం! ఏంటి నమ్మబుద్ధి కావడం లేదు కదా. పదండి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.వీసా దరఖాస్తు ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, కొన్నిసార్లు అదనపు ఛార్జీలు ఇవన్నీ కలిపి కొంత ఖర్చుతో కూడుకున్నదే. వీసా ఫీజు ఎంత అనేది ఆయా దేశాలను బట్టి మారుతుంది.ప్రతి ఒక్కరూ ఒకసారి విదేశాలకు వెళ్లి అక్కడ పని చేసి మంచి డబ్బు సంపాదించాలని కలలు కంటారు. అయితే, ఖరీదైన వీసాల కారణంగా, ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు, రూ.7,500 కంటే తక్కువకే వీసాను అందించడమే కాకుండా, అక్కడ ఒక ఏడాది దాకా పని చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ దేశం పేరే జర్మనీ. రొమాంటిక్ రైన్ వ్యాలీ నుండి బవేరియాలోని అద్భుత కోటలు, గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది జర్మనీ. జర్మనీ బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగాలు , అధిక జీవన నాణ్యత భారతీయులతో సహా ఈయూ యేతర నివాసితులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి, జర్మనీ ఫ్రీబెరుఫ్లర్ వీసా అని కూడా పిలిచే ఫ్రీలాన్స్ వీసాను అందిస్తోంది. ఇది వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా( ఫ్రీలాన్సర్లుగా) పని చేయడానికి వీలు కల్పిస్తుంది. హైక్వాలిటీ లైఫ్ గడపాలనుకునే వారికి, క్రియేటివ్ ప్రొఫెషనల్స్, పర్యాటకులకు గొప్ప అవకాశం అంటూ ఊరిస్తోంది. ఎవరు అర్హులుభారతదేశంలోని జర్మన్ మిషన్ల ప్రకారం, జర్మన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 18 కింద ఈ క్రింది వర్గాల ఫ్రీలాన్స్ వీసాలు పొందే అర్హత వీరికి ఉంది.ఇండిపెండెంట్ సైంటిస్టులు, శాస్త్రవేత్తలుకళాకారులు, ఉపాధ్యాయులు , విద్యావేత్తలున్యాయవాదులు, నోటరీలుపేటెంట్ ఏజెంట్లుసర్వేయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లుపశువైద్యులువాణిజ్య రసాయన శాస్త్రవేత్తలుఅకౌంటెంట్లు, పన్ను సలహాదారులుకన్సల్టింగ్ ఆర్థికవేత్తలు, స్వార్న్ అకౌంటెంట్లు, పన్ను ఏజెంట్లుదంతవైద్యులు, వైద్యేతర నిపుణులు, ఫిజియోథెరపిస్టులుజర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వ్యాఖ్యాతలుఅనువాదకులు, పైలట్లు , ఇతర సారూప్య వృత్తులు.ఫ్రీలాన్స్ వీసా అంటే ఏంటి? అర్హతలు, పైన పేర్కొన్న వృత్తిలో స్వయం ఉపాధి పొందుతున్న వారు ఫ్రీలాన్స్ వీసాను వినియోగించుకోవచ్చ. వీసా కోసం చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ పని రుజువు , అర్హత రుజువుతో సహా కొన్ని అవసరాలను తీర్చాలి. వీసా కోసం చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా కూడా అవసరం.అదనంగా, దరఖాస్తుదారులు జర్మనీ లేదా యూరప్లోని వారి సంబంధిత వృత్తిపరమైన రంగంలో వ్యాపార పరిచయాల ఉన్నవారి వివరాలను, వారి ఫ్రీలాన్స్ జాబ్ వివరాలపై సమగ్ర సమాచార మివ్వాలి.ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన పత్రాలుఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు (6 నెలల కంటే పాతవి కానివి), ఆర్థిక స్తోమత రుజువు, ఫ్రీలాన్స్ వర్క్, అర్హత రుజువుతో సహా అనేక దృవీకరణ పత్రాలను సమర్పించాలి. జర్మనీలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థ లేదా ఇతక సంస్థనుంచి డిగ్రీ చదివి ఉండాలి.. 75 యూరోలు లేదా రూ. 7,486 వీసా రుసుము, సుమారుగా. 45 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు, పెన్షన్ లేదా యాజమాన్యంలోని ఆస్తులతో సహా అదనపు పదవీ విరమణ ప్రయోజనాల ధృవపత్రాలు అవసరం.జర్మన్ ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు ప్రక్రియలో సాధారణంగా జర్మనీలోకి ప్రవేశించే ముందు స్వదేశం నుండి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. జర్మన్ ఎంబసీ లేదా కాన్సులేట్తో అపాయింట్మెంట్ తీసుకొని, అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా మంజూరైన తరువాత జర్మనీకి వెళ్లిన తరువాత రెండు వారాలలోపు వారి చిరునామాను నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత, వారు ఫ్రీలాన్సర్గా లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక విదేశీయుల కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందినివాస అనుమతి ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు చెల్లుతుంది. ఆ తరువాత సంబంధిత నియమాలకు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారి వీసా రెన్యూల్ అవుతుంది. జర్మనీలో వరుసగా ఐదేళ్ల నివాసం తరువాత వారి ఫ్రీలాన్సర్ భాషా ప్రావీణ్యం, ఆర్థిక పరిస్థితి అక్కడి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే శాశ్వత నివాసం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్లు స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేసుకుని పన్ను నంబర్ను పొందాలి.ఫ్రీలాన్స్ వీసా ప్రయోజనాలుఫ్రీలాన్స్ వీసా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు జర్మనీలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి ప్రాప్యత మరియు అధిక నాణ్యత గల జీవనంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్రీలాన్స్ వీసాతో, వ్యక్తులు తమ వృత్తిపరమైన నెట్వర్క్ను నిర్మించుకోవచ్చు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని తద్వారా జర్మన్ ఆర్థిక వ్యవస్థకు దోహదపడవచ్చు. అన్నీ సవ్యంగా ఉండి, అక్కడి భాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆర్థిక పరిస్థితులు ప్రమాణాల కనుగుణంగా వుంటే ఫ్రీలాన్స్ వీసా శాశ్వత నివాసానికి ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది, ఇది జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమని చెప్పవచ్చు. -
సిరికాకొలనులో సీత..!
గుణశేఖర్ ‘రామాయణం’ గుర్తుందా? రాముడుగా జూ. ఎన్టీఆర్తోపాటు సీతగా.. స్మితామాధవ్ ప్రేక్షక మనసులను కట్టిపడేసింది! సినిమాల్లో కనిపించకపోయినా.. నాట్యంతో, గానంతో కళాభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది!ఇటీవల ‘సిరికాకొలను చిన్నది’ నృత్యరూపకంతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వాసి స్మిత గురించి మరిన్ని విషయాలు, విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘‘నిజానికి.. వేటూరి సుందర రామ్మూర్తి ‘సిరికాకొలను చిన్నది’ రేడియో డ్రామాను కె. విశ్వనాథ్గారు సినిమాగా తీయాలనుకున్నారట. ఎందుకనో కుదరలేదట. 2019 ఎండింగ్లో ఆయన ఆ స్క్రిప్ట్ను నాకు ఇచ్చి నన్ను చేయమన్నారు. కోవిడ్ రావడంతో ఆ ప్రాజెక్ట్ లేట్ అయింది. నేను చేసిన ఆ నృత్యరూపకానికి చాలా ప్రశంసలు అందాయి. కె. విశ్వనాథ్గారు ఉండి ఉంటే చాలా మురిసిపోయేవారు. నా ప్రదర్శనకు వాళ్ల అబ్బాయి వాళ్లంతా వచ్చారు.. సంతోషమేసింది. విశ్వనాథ్గారున్నప్పుడు చేయలేకపోయాననే బాధ మాత్రం ఉంది. వారంటే నాకు చాలా అభిమానం, గౌరవం. వారి సినిమాల్లో నటించాలనే ఆసక్తి, ఆలోచన వచ్చేప్పటికే ఆయన సినిమాలు తగ్గించేసుకున్నారు. నా పెర్ఫార్మెన్సెస్ చాలా వాటికి వచ్చారు. కళ పట్ల నాకున్న కమిట్మెంట్ను మెచ్చుకునేవారు. నాకు ఊహ తెలిసేప్పటికల్లా భరతనాట్యం, కర్ణాటక సంగీతం క్లాసెస్లో ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే మాది కళల నేపథ్యం ఉన్న కుటుంబం. మా అమ్మమ్మ, నానమ్మ పాడేవారు. అమ్మ (హేమ) పాడుతారు.. వీణా వాయిస్తారు. అన్నయ్య సిద్ధార్థ వీణ, వయొలిన్ నేర్చుకున్నాడు. అయితే మా ఇంట్లో ఆర్ట్ని ప్రొఫెషన్గా తీసుకుంది మాత్రం నేనే! భరతనాట్యంలో నా గురువు రాజేశ్వరీ సాయినాథ్, సంగీత గురువు లలితమ్మ.తాతగారి వల్లే సీత.. నా అరంగేట్రం గురించి పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి, నా గురించి వాకబు చేసి మా ఇంటికి వచ్చారు నిర్మాత, కవి ఎమ్మెస్ రెడ్డి. ‘మేము తీయబోయే ‘రామాయణం’ సినిమాలో మీ అమ్మాయిని సీతగా అనుకుంటున్నాం.. మీకు సమ్మతమేనా’ అని నాన్నగారిని అడిగారు. దాని మీద మా ఇంట్లో పెద్ద చర్చే జరిగింది. మా తాతగారే చొరవ తీసుకుని ‘మంచి అవకాశం... పంపించండి’ అని తేల్చేశారు. అలా తాతగారి వల్లే ఆ సినిమాలో సీతగా నటించాను. రామాయణం తర్వాతా, హీరోయిన్గానూ చాలా అవకాశాలే వచ్చాయి. కానీ ఇటు డాన్స్ అండ్ మ్యూజిక్, చదువు, అటు సినిమాలు.. బ్యాలెన్స్ చేసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాల మీద దృష్టి పెట్టలేదు. నేను చదువులో కూడా క్వయిట్ గుడ్. లా (ఉస్మానియా యూనివర్సిటీ)లో గోల్డ్మెడలిస్ట్ని. కర్ణాటిక్ మ్యూజిక్, భరతనాట్యం(మద్రాస్ యూనివర్సిటీ)లో మాస్టర్స్ చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. వీలున్నప్పుడల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తుంటాను భరతనాట్యం అండ్ కర్ణాటిక్ మ్యూజిక్లో. బాలినీస్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. అనేక రకాల అంశాలలోమన దేశానికి, ఇండోనేషియాకు ఉన్న సంబంధం వల్ల నాకు ఆ దేశపు బాలినీస్ డాన్స్ అంటే ఆసక్తి పెరిగింది. అందుకే బాలీ (ఇండోనేషియా)వెళ్లి..కొన్నాళ్లుండి ఆ డాన్స్ నేర్చుకుని వచ్చాను.అండర్ ప్రివిలేజ్డ్కు ఫ్రీగా.. ఇరవై ఏళ్ల కిందటే అంటే కాలేజ్ డేస్లోనే ‘వర్ణా ఆర్ట్స్ అకాడమీ’ పేరుతో డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేశాను. దాదాపు వంద మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో అండర్ప్రివిలెజ్డ్ పిల్లలూ ఉన్నారు. వాళ్లందరికీ ఫ్రీగానే నేర్పిస్తాను. అయితే మిగతా పిల్లలెవరికీ వాళ్లు అండర్ ప్రివిలెజ్డ్ అని తెలియనివ్వం. అందరూ ఈక్వలే! ఎవరి ఆత్మవిశ్వాసమూ దెబ్బతినకూడదు కదా! అంతేకాదు మా ఆర్ట్స్కూల్కి అన్ని మతాలకు చెందిన పిల్లలూ వస్తుంటారు. అందరికీ అంతే శ్రద్ధతో నేర్పిస్తాం. చాలామంది దర్శకులూ వస్తుంటారు చైల్డ్ ఆర్టిస్ట్ల కోసం. 24 క్రాఫ్ట్స్తో కూడిన సినిమా అంటే నాకు ముందునుంచీ క్రేజే! ఇప్పుడు నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.స్త్రీల సమస్యలు కళ ద్వారా.. ‘సిరికాకొలను చిన్నది’ కంటే ముందు కూడా తమిళ్, సంస్కృత నృత్యరూపకాలు చాలా చేశాను. పర్సనల్గా ఫీలై.. నాకు నచ్చితే సబ్జెక్ట్, భాషా భేదాలు చూడను. ‘సిరికాకొలను చిన్నది’ కోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో హార్డిల్స్ ఎదురయ్యాయి. ‘ఇంత కష్టపడ్డం అవసరమా?’అనడిగారు శ్రేయోభిలాషులు చాలామంది. అవసరమే! ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యాను ఆ ప్రాజెక్ట్తో. అలా నచ్చితే వెనక్కి తగ్గను. నేనెప్పుడూ ఓల్డ్ ఇన్ ద న్యూ.. న్యూ ఇన్ ద ఓల్డ్ని చూస్తాను. ఈ కోవలోనే మహిళలు, పిల్లలకు సంబంధించి అంశాలనూ నాకొచ్చిన కళద్వారా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేనేజ్మెంట్ స్కూల్స్ నా ్ర΄ోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాయి. ఆ ప్రోగ్రామ్స్లోనూ వాళ్ల సమస్యలను రామాయణ, మహాభారతాల్లో ఉన్న స్టోరీస్కి అనుసంధానించి ప్రదర్శిస్తుంటాను. సమాజానికి కళలు అవసరం.. కళలకు సమాజం అవసరం. కళలు ఒత్తిడిని జయించేలా చేస్తాయి. అయితే దానికి పోటీని చేర్చకూడదు. పోటీ వల్ల సాంత్వన స్థానంలోస్ట్రెస్ చేరుతుంది. అందుకే ఒకటే చెబుతాను కళలు గురువులు నేర్పుతారు సంస్కారం మాత్రం పేరెంట్సే నేర్పాలి. పిల్లలను పిల్లలుగానే ఉండనివ్వాలి. వాళ్ల బాల్యాన్ని లాక్కోకూడదు’’ అని ముగించారు స్మితామాధవ్.తాతను అమెరికా పంపిన నానమ్మ.. మా నాన్న (పీబీ మాధవ్) వాళ్లు అయిదుగురు తోబుట్టువులు. వాళ్ల చిన్నప్పుడే ఏదో ఆరోగ్య సమస్యతో మా తాత (పీబీ కృష్ణస్వామి)గారు చూపుకోల్పోవడంతో ఆయన చేస్తున్న క్లర్క్ జాబ్ కూడా పోయింది. అప్పుడు మా నానమ్మ (సుగంధ కృష్ణస్వామి) తన నగలన్నీ అమ్మి.. తాతగారిని అమెరికా పంపించారు బ్రెయిలీలో టీచర్ ట్రైనింగ్ కోసం. ఆయన అమెరికా నుంచి వచ్చేసరికి నానమ్మ కూడా తన పిల్లలతో పాటు చదువుకొనసాగించి, ట్యూషన్స్ చెబుతూ కుటుంబాన్ని పోషించింది. తనూ ఎం.ఎ. ఎం.ఈడీ. చేసింది. తాతగారు ఇండియా వచ్చేసమయానికే కేంద్రప్రభుత్వం డెహ్రాడూన్లో బ్లైండ్ స్కూల్ను స్టార్ట్ చేసింది. దేశంలో అదే ఫస్ట్ బ్లైండ్ స్కూల్. దానికి తాతగారే ప్రిన్సిపల్. మా నానమ్మ దూరదృష్టికి నిదర్శనం అది. – సరస్వతి రమ(చదవండి: World Emoji Day: సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!) -
ఎండుకొబ్బరి ఎక్కువకాలం తాజాగా...
మరింత రుచికోసం కూరలు, స్వీట్లలో ఎండుకొబ్బరిని వినియోగిస్తుంటాం. దీనికోసం కొబ్బరిని ఇంట్లో నిల్వచేసుకుంటూ ఉంటాం. కానీ కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం జరుగుతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ...మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా గుడ్డతో తుడిచి, గంటసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపలా బయటా తుడవాలి. అలా తుడిచిన చిప్పలను ఎండలో ఆరబెట్టి, కవర్లో వేసి ఉంచాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే ఎక్కువ రోజులు చిప్పలు తాజాగా ఉంటాయి. (చదవండి: హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..) -
విమాన ప్రయాణమంటే భయం..!
నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సేల్స్ హెడ్గా పని చేస్తున్నాను. నా జాబ్లో భాగంగా నేను తరచుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. తొందరగా వెళ్ళి రావడం కోసం ఎక్కువగా విమానంలో ప్రయాణం చేస్తాను. విమాన ప్రయాణం అంటే ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే ΄ోయిన నెలలో అహమ్మదాబాద్లో విమానం కూలిపోయి చాలామంది చనిపోయారు కదా, ఆ సంఘటనకి సంబంధించిన వీడియోలు పదేపదే నేను టీవీలో, ఫోన్లో చూశాను. అప్పటి నుండి విమాన ప్రయాణం అంటే నాకు విపరీతంగా భయం వేస్తోంది. అసలు విమానం అనే పదం విన్నా, విపరీతమైన ఆందోళన, భయం వేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా లో ఏ రాష్ట్రంలో మీటింగ్ ఉన్నా ట్రైన్ లేదా బస్సులోనే వెళ్తున్నాను. ఒక్కొక్కసారి కారు డ్రైవర్ను తీసుకొని వెళ్తున్నాను. నా గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ నేను ఇలా భయపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక స్నేహితుడి సలహాతో హైదరాబాద్లో ఒకాయన హిప్నోనో థెరపీ చేస్తా అంటే వెళ్ళి కలిసాను. రెండు మూడు సెషన్స్కి వెళ్ళాను కానీ నాకు పెద్దగా ఉపయోగమనిపించలేదు. నాకు సైకియాట్రీ మందులు అంటే ఉన్న భయం వల్ల డాక్టర్ని కలవకూడదు అని ముందు అనుకున్నా, ఇంక నావల్ల కాక, ధైర్యం చేసి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను ఈ సమస్యనుండి ఎలాగైనా బయటపడవేయండి. రాజేష్, హైదరాబాద్ ముందుగా మీరు ధైర్యంగా మీ సమస్యను మాతో పంచుకున్నందుకు అభినందనలు. మనలో ఎవరైనా పెద్ద ప్రమాదాన్ని లేదా భూకంపాలు, వర దలు వంటి ప్రకృతి వైపరీత్యాలకి ప్రత్యక్షంగా గురైనపుడు లేదా అలాంటి తీవ్ర సంఘటనల గురించి పదే పదే వార్తల్లో, టీవీలో, ఫోన్లో చూసినప్పుడు మన మెదడు ఒక రకమైన షాక్కి లోనవుతుంది. దీనిని సైకాలజీ పరిభాషలో ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. ఇలాంటి పరిస్థితిలో మనసుకి విపరీతమైన ఆందోళన, భయం, పీడకలలు రావడం, నిద్ర పట్టక΄ోవడం, ప్రమాదం జరిగిన ప్రదేశం లేదా ఆ రకమైన వాహనాన్ని చూసినప్పుడు తీవ్రభయం కలగడం చూస్తుంటాం. ఇది మొదలుకొని కొన్నిసార్లు దీర్ఘకాలిక పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్‘ కి దారి తీయవచ్చు. మీరు ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను పదే పదే చూసిన కారణంగా మీ మెదడు ‘విమాన ప్రయాణం అంటే ప్రమాదం’ అనే సంకేతాన్ని ముద్రించుకుంది. దీన్ని ‘క్లాసికల్ కండిషనింగ్‘ అంటారు. ఈ పరిస్థితి వల్ల మీరు ‘ఏరో ఫోబియా’ అంటే విమాన ప్రయాణ భయం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది తీవ్రమైన సమస్యగా అనిపించినా, మంచి చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించే వీలుంది. చికిత్సలో భాగంగా గ్రాడ్యుయేటెడ్ ఎక్సో్పజర్ థెరపీ, ‘కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్‘ వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘వర్చువల్ రియాలిటీ‘ వంటి ఆధునిక వైద్య విధానాలు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. మిమ్మల్ని వివరంగా పరీక్షించిన తర్వాత మీ సమస్య తీవ్రతని బట్టి అవసరమైతే కొన్ని మందులు తాత్కాలికంగా వాడాల్సి రావచ్చు. అయితే ఈ చికిత్సలు అన్నీ కూడా నిపుణులైన సైకియాట్రిస్ట్, లైసెన్స్ పొందిన క్లీనికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. ఓపికగా, నమ్మకంగా చికిత్స కొనసాగిస్తే మీరు మళ్ళీ మునుపటిలా విమాన ప్రయాణాలు చేయగలరు. ఆల్ ది బెస్ట్ ! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్లో రూ. 72 లక్షలు..) -
హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..
తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న నటుడిగా పేరుగాంచిన ఆర్ మాధవన్..ఐదు పదుల వయసులో కూడా అదే యంగ్ లుక్లో అభిమానులను అలరిస్తున్నారు. ఒకనొక టైంలో అధిక బరువుతో ఇబ్బందిపడ్డ మాధవన్ గతేడాది 2024లో అనూహ్యంగా బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ ఇదివరకటి మాధవన్ మన ముందుకు వచ్చేశాడంటూ అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అది కూడా 21 రోజుల్లోనే అదనపు బరువుని తగ్గించుకోవడం విశేషం. మరి అందుకోసం అతడు ఎలాంటి డైట్ ప్లాన్ అనుసరించాడు, ఎలాంటి వర్కౌట్లు చేసేవాడో తెలుసుకుందామా..!.చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు మాధవన్ ఎలాంటి వర్కౌట్లను ఆశ్రయించలేదన. జస్ట్ తీసుకునే ఆహారంలోనే మార్పులు, చక్కటి జీవనశైలితో బరువు తగ్గాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను అడపాదడపా ఉపవాసం(మెడిటేరియన్ డైట్), రోజుకు 45 నుంచి 60 సార్లు బాగా నమిలి తినడం, నీళ్లు అధికంగా తీసుకోవడం వంటివి అనుసరించినట్లు తెలిపారు. అలాగే రోజులో తన చివరి భోజనం సాయంత్రం 6.45 గంటలకు (వండిన ఆహారం మాత్రమే తీసుకునేవారట). తెల్లవారుజామున సుదీర్ఘ వాకింగ్, గాఢనిద్ర, పోన్కి దూరంగా ఉండటం వంటివి చేశానని చెప్పారు. పుష్కలంగా నీరు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. శరీరంగా సులభంగా జీర్ణం చేసుకునే పోషకాహారానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా మాధవన్ 21 రోజుల్లో ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు. ఇది మంచిదేనా అంటే..నిపుణులు ఏమంటున్నారంటే..అడపాదడపా ఉపవాసంఅడపాదడపా ఉపవాసం అనేది ఒక విధమైన తినే విధానం. ఇది ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆర్.మాధవన్ ప్రతిరోజూ సాయంత్రం 6:45 గంటలకల్లా తన చివరి భోజనం తింటానని, మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత ఎలాంటి పచ్చి ఆహారాన్ని తిననని వెల్లడించాడు.ఆహారాన్ని సరిగ్గా నమలడంఇలా 45 నుంచి 60 సార్లు ఆహారాన్ని నమలడానికి బరువు తగ్గడానికి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి కూడా. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సరైన వ్యూహంగా చెబుతున్నారు నిపుణులు.ఉదయాన్నే వాకింగ్బరవుని అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గం ఇది. ఎలాంటి కఠిన వ్యాయామాలతో పనిలేకుండా చేసే సుదీర్ఘ వాకింగ్ కండరాలకు మంచి కదలిక తోపాటు సులభంగా కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతుంది.స్లీప్ అండ్ స్క్రీన్ డిటాక్స్మంచి నాణ్యమైన నిద్రకు స్కీన్ సమయం తగ్గించడమే అని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం ముందు 90 నిమిషాలు పాటు స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలామంచిదని సూచించారు.పుష్కలంగా ద్రవాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలుబరువు తగ్గించే ప్రయాణంలో తాను పుష్కలంగా ద్రవాలు తాగానని హైడ్రేటెడ్గా ఉంచుకున్నానని ఆర్.మాధవన్ తెలిపారు. మాధవన్ తన శరీరం సులభంగా జీర్ణం చేసే ఆకుపచ్చ కూరగాయలు, ఆహారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు చాలా దూరంగా ఉన్నారు. ఇది సరైన జీవనశైలికి నిదర్శనమని చెబుతున్నారు నిపుణులు. ఈ విధమైన ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరిస్తే ఎవ్వరైనా..సులభంగా బరువు తగ్గుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024 (చదవండి: రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..) -
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్ ..! వేరెలెవెల్..
కేరళలోని సంప్రదాయ శాస్త్రీయ నృత్యం మోహినీయాట్టం, మోడ్రన్ ర్యాప్ ట్రాక్ను మిక్స్ చేసి సోషల్ మీడియా సెన్షెషన్గా మారింది శ్వేత వారియర్. ఎనిమిదిమంది డ్యాన్సర్లతో కలసి ఈ వినూత్న నృత్యం చేసింది. ‘రన్ ఇన్ అప్ ర్యాప్ చూసిన తరువాత కొత్తగా ఏదైనా చేయాలనిపించింది’ అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసింది శ్వేత.ఈ డ్యాన్స్ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘రెఫ్రెషింగ్’ ‘ఇన్నోవేటివ్’ ‘పవర్ఫుల్’ అని స్పందించారు నెటిజనులు. కేరళలోని పాలక్కాడ్కు చెందిన శ్వేత వారియర్ కొత్త డ్యాన్స్ స్టైల్స్ను క్రియేట్ చేయడంలో పేరు తెచ్చుకుంది. మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లి దగ్గర భరతనాట్యంలో శిక్షణ పొందింది. భరత నాట్యం, అర్బన్ స్ట్రీట్ స్టైల్స్ను మిక్స్ చేసి సృష్టించిన ‘స్ట్రీట్ వో క్లాసికల్’ సూపర్హిట్ అయింది.రకరకాల ‘హైబ్రీడ్ డాన్స్ స్టైల్స్’తో డాన్సర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్వేత వారియర్. సోనీ టీవి ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’లో రన్నర్–అప్గా నిలిచింది. View this post on Instagram A post shared by Swetha Warrier (@shweta_warrier) (చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..!
ధృఢ సంకల్పం ఎంతటి వైకల్యాన్ని అయినా అధిగమించి లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకు ఎన్నో ఉదంతాలు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా ఈ పారాసైక్లిస్ట్ కూడా ఆ కోవలోకి చేరిపోయారు. ఆయన తన రాష్ట్ర అభ్యున్నతి కోసం అనితరసాధ్యమైన యాత్ర చేపట్టారు. ఆ జర్నీ అతడి శారీరక స్థితి రీత్యా అత్యంత సవాలుతో కూడినది. అయినప్పటికీ అన్ని కష్టాలను ఓర్చుకుంటూ లక్ష్యాన్ని చేధించి దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచారాయన. ఆయనే పారాసైక్లిస్ట్ రాకేష్ బానిక్. అతను తన శారీరక అసమానతలు, కఠినమైన వాతావరణ పరిస్థితులను పలు అవాంతరాలు అధిగమించి మరి ఏకంగా ఏడు వేల కిలోమీటర్లు చుట్టొచ్చారు. అదంతా ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందామా..!.అస్సాంకి చెందిన ఆయన ఇది వ్యక్తిగత విజయం కాదని తన రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి చేసిన చిన్న ప్రయత్నమని అన్నారు. తాను ఈ యాత్రను అస్సాం పర్యాటక మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏప్రిల్ 29న మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు, రష్యా, కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ గుండా సైకిల్ తొక్కుతూ దాదాపు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంటికాలితో తొక్కుతూ ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. తాను ఈ నాలుగు దేశాలలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులతో సంభాషించారట. వారికి భారతీయ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యం గురించి పరిచయం చేశారట. ఎదురైన ఇబ్బందులు..విదేశీ భూభాగంలో కృత్రిమ కాలుతో సైక్లింగ్ చేయడం చాలా కష్టమైన పని. ప్రతికూల వాతావరణంలో చేస్తున్న కఠినమైన ప్రయాణంలా ఉందని అన్నారు. రష్యాలో మైనస్లలో ఉష్ణోగ్రతలు పడిపోతుంటే..ఉజ్బెకిస్తాన్లో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతని ఎదుర్కొంటూ సైక్లింగ్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ విధమైన వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ప్రయాణించడం అత ఈజీ కాదని అన్నారు. పైగా సరైన ఫుడ్ దొరకక పడ్డ ఇబ్బందులు అంత ఇంత కాదని కూడా అన్నారు. ఈ పరిస్థితులన్నింటికి తోడు చైనా వీసా తిరస్కరణ ఎంతగానో బాధించిందన్నారు. దాంతో నేపాల్ గుండా వెళ్లేలా జర్నీని ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రమోషన్ లక్ష్యంగా చేస్తున్న ఈ యాత్ర చైనా ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే టిబెట్లోకి అడుగుపెట్టనివ్వలేదని బానిక్ తెలిపారు. ఇక అఫ్ఘనిస్తాన్ గుండా సైక్లింగ్ చేస్తూ వెళ్లడం అన్నది అత్యంత సవాలుతో కూడినది. తాలిబాన్ నుంచి నేరుగా రాలేకపోయినా..అక్కడకు ఒక అద్దె కారులో 150 కిలోమీటర్లు ప్రయాణించి తాలిబాన్ చెక్పోస్ట్లు దాటి కాబూల్కి వెళ్లినట్లు తెలిపారు. కాబూల్లోని భారత రాయబార కార్యాలయం తన ప్రతి కదలికను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు వివరించారు. అక్కడ ఏకంగా ఏడెంచల కట్టుదిట్టమైన భద్రత ఏదోలా అనిపించిందన్నారు. అయితే అక్కడ తాలిబాన్ల నుంచి తనకు ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా..హై సెక్యూరిటీ నడుమ బానిక్ని త్వరగా పంపిచేయాలన కాబోల్లోని భారత రాయబార కార్యాలయం భావంచిందట. అదీగాక ఆయన ఆహార్యం కూడా ఈజీగా విదేశీయుడని గుర్తించేలా ఉండటంతో, హోటల్ నుంచి బయటకు వెళ్లేలా కాబూల్ భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసినట్లు వివరించారు. చివరికి భారత రాయబార కార్యాలయం సురక్షితమైన వాహనంలో విమానాశ్రయానికి చేర్చిందని తెలిపారు. తాను ఇక అక్కడి నుంచి నేపాల్కి పయనమైనట్లు తెలిపారు. ఓ పెనువిషాదంలో..2012లో అస్సాంలోని కాలిబోర్ సమీపంలో జరిగిన ఒక విపత్కర ప్రమాదంలో రాకేష్ బానిక్ తన కాలును కోల్పోయాడు. దాంతో రెండేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అయితే 2014లో కృత్రిమ కాలుని పొంది.. ఆ వైకల్యాన్ని తన బలంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా పారాసైక్లిస్ట్గా మారి ఖార్దుంగ్ లా పాస్ (17,582 అడుగులు) ఎత్తు నుంచి బ్యాంకాక్, గౌహతి మధ్య తేమతో కూడిన మైదానాల వరకు విభిన్న యాత్రలు చేశారు. పైగా సుమారు 21 వేల కిలోమీటర్లు సైకిల్పైనే చుట్టొచ్చారు.(చదవండి: ఎవరీ సంధ్యారాణి మాఝి..? ఏకంగా ప్రభుత్వ వాహన మహిళా డ్రైవర్గా..) -
ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషం నిల్ !
28 ఏళ్ల యువకుడు ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చాడు. పలు ఓటములు చవిచూసి..స్వయంకృషితో ఎదిగాడు. ఏకంగా ఏడాదికి కోట్లు గడించే స్థాయికి చేరుకున్నాడు. చాలా కింద స్థాయి నుంచి శ్రీమంతుడిగా మారాడు. ఇంత సక్సెస్ అందుకున్నా..ఆనందించలేకపోతున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా వాపోయాడు ఓ ఎంటర్ప్రెన్యూర్. పైగా అంతకుమునుపే..చాలా ఆనందంగా ఉన్నా..అప్పుడే చాలా హెల్దీగా ఉన్నా. ఇప్పుడు మాత్రం అంతలా ఉత్సాహంగా అస్సలు ఉండలేకపోతున్నా అని బాధగా చెప్పాడు. అయితే తన తల్లిదండ్రులు మాత్రం తన విజయాన్ని ఆస్వాదిస్తున్నారని గర్వంగా చెప్పాడు. విజయం సాధించాక ఆనందం దూరమైపోతుందా అంటే.28 ఏళ్ల భారతీయ ఎంటర్ప్రెన్యూర్ రెడ్డిట్లో షేర్ చేసిన పోస్టు నెట్టింట పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే.. వ్యవస్థాపకుడిగా తన జర్నీ ప్రారంభమైన విధానం గురించి వివరించారు. తనకు ఒక ప్రీమియం కారు, విదేశీ పర్యటనలు చుట్టొచ్చేంత మనీ, మంచి బంగ్లా కొనేంత డబ్బు ఉందని చెప్పుకొచ్చారు. ఐతే 12 ఏళ్ల క్రితం తానొక సాధారణ విద్యార్థినని, స్కాలర్షిప్పై సీఏ చేస్తున్నట్లు తెలిపాడు. 2017లో ఒక లక్ష పెట్టుబడితో స్టార్టప్ ప్రారంభించి పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. ఇక 2020 కోవిడ్ సమయంలో సీఏ ఫైనల్లో ఉన్నట్లు గుర్తుచేసుకున్నాడు. అయితే అది కరోనా టైం కావడంతో పరీక్ష వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. దాంతో ఆన్లైన్ సర్వీస్ ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదేనండి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. అలా అతడు నెలకు 1 నుంచి రెండు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. అలా వెను తిరిగి చూడకుండా కోట్లు సంపాదించే రేంజ్కి వచ్చేశాడు. అంతేగాదు దుబాయ్ వంటి విదేశాల్లో కూడా తన కార్యకలపాలు ప్రారభించే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా మంచి ఆదాయన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ అతడి అదృష్టం ఏంటంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే సక్సెస్ అందుకుని అంచలంచెలుగా ఎదిగాడు. కేవలం తనకు వచ్చిన లాభాల్లో కొద్ది మొత్తం డబ్బు మాత్రమే పెట్టుబడి పెడుతూ..కోట్లు గడించాడు. ఒక్క సింగిల్ లోను లేకుండా పైకొచ్చానంటూ తన వ్యవస్థాపక జర్నీని షేర్ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు అతడి పోస్ట్ని చూసి ప్రశంసిస్తూ..మీరు ఇప్పుడు హ్యాపీనేగా అని ప్రశ్నించగా..అందుకు ఆ వ్యక్తి చాలా మంచి ప్రశ్న వేశారంటూ సమాధాన మిచ్చాడు ఇలా. "అస్సలు సంతోషంగా లేను. ఒకప్పుడు చాలా ఉల్లాసంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు ప్రతి నిమిషం టెన్షన్ పడుతున్నా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా. ప్రయాణాలు చేయలేకపోతున్నా. ఎక్కువ పనిగంటలు. ఇప్పుడు నా వద్ద కావల్సినంత డబ్బు ఉంది కానీ సంతోషించ లేకపోతున్నా. ఐతే తన తల్లిదండ్రులు తన సక్సెస్ని చూసి గర్వంగా ఫీలవుతున్నారు. అలాగే ఏ వస్తువు అయినా ఈజీగా కొనేయొచ్చు.. అన్నతం ధైర్యం గుండెల్లో ఉంది. డబ్బు కేవలం భద్రతనే ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వలేదని బాధగా బదులిచ్చాడు. అందుకు నెటిజన్లు మిత్రమా ఎందరో కలల ప్రపంచాన్ని నువ్వు సాకారం చేసుకోగలిగావు. అందుకు సంతోషం. పైగా వ్యాపారాన్ని నడిపంచే స్థాయికి చేరుకున్నావు. అంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలవు. మంచి సంతోషాన్ని కూడా కచ్చితంగా పొందగలుగుతావు అని ఆశ్వీరదిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఇష్టమైన గులాబ్ జామ్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!) -
దంపతుల ‘మొక్క’వోని దీక్ష, ఏడాదికి రూ. లక్ష ఖర్చు
కోల్సిటీ(రామగుండం): ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు, ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు. ఏడాదికి రూ.లక్ష ఖర్చు నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖనిఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు -
గాంధీ.. గాడ్సే.. నోబెల్ శాంతి బహుమతి!
శాంతి, అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు?. ఆయన దారిలో నడిచిన వారెందరినో వరించిన ఆ పురస్కారం.. ఆయన్నెందుకు వరించలేదు? కారణం.. నాథూరాం గాడ్సేనా?? గాంధీని చంపిన గాడ్సే.. ఆయనకు నోబెల్ దక్కే అవకాశాన్ని కూడా చంపేశాడా? అందుకే 1948లో నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదా? పైగా.. తగు యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరూ జీవించి లేనందున ఆ పురస్కారాన్ని ఇవ్వడం లేదన్న నోబెల్ కమిటీ ప్రకటన దీన్నే సూచిస్తోందా? అసలు.. గాంధీకి నోబెల్ రాకపోవడానికి గాడ్సేకు ఉన్న లింకేంటి?1930ల్లో ఏం జరిగిందంటే..నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ 5 సార్లు నామినేట్ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948ల్లో ఆయన ఈ పురస్కారం దక్కే అవకాశం వచ్చింది. గాంధీ అహింసా మార్గం లేదా శాంతి మార్గం అన్నది తన దేశ స్వాతంత్య్రం కోసం తప్ప.. అంతర్జాతీయ శాంతి కోసం కాదని నోబెల్ కమిటీలోని కొందరు సభ్యులు ఆ టైంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొనడానికి ఆయన షరతులతో సమ్మతి తెలపడాన్ని వాళ్లు ఎత్తి చూపారు. నోబెల్ బహుమతులను ఇచ్చే నార్వే అప్పట్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు అవార్డులు ఇవ్వకూడదని ఆ దేశం అనుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతారు. 1947 వచ్చేసరికి ఆ సమయంలో విభజన కారణంగా చెలరేగిన హింస.. మతపరమైన హింసను నిరోధించడానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాకపోవడం, విభజన హింస.. గాంధీ శాంతి సందేశాన్ని మరుగునపడేటట్లు చేసిందని ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు. 1900 నుంచి 1960 వరకూ పురస్కారాలను గమనిస్తే మనకీ విషయం అర్థమవుతుందని గేర్ లూండెస్టాడ్ అన్నారు.1948లో ఎందుకు రాలేదంటే..1948లో గాంధీజీ మళ్లీ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ ఏడాది గాంధీ పేరును అమెరికాకు చెందిన శాంతి కార్యకర్త, ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత ఎమిలీ గ్రీన్ బాల్చ్, బాంబే స్టేట్ తొలి సీఎం బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, యునైటెడ్ ప్రావిన్సెస్ తొలి సీఎం గోవింద్ వల్లభ్ పంత్, లోక్సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్.. ఇలా ఎందరో ప్రముఖులు ప్రతిపాదించారు. ఆ ఏడాది మహాత్మునికే శాంతి బహుమతి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు పేర్లతో షార్ట్ లిస్ట్ (గాంధీ పేరు ఈ జాబితాలోకి రావడం మూడోసారట) రెడీ అయ్యింది. అయితే, నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ల గడువు ఇంకో రెండ్రోజుల్లో ముగుస్తుందనగా.. జనవరి 30న మహాత్ముడిని గాడ్సే పొట్టనబెట్టుకున్నాడు. తద్వారా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం లేకుండా చేశాడు. ఎందుకంటే.. ఆ సంవత్సరం ఎవరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం లేదని 1948, నవంబర్ 18న కమిటీ ప్రకటించింది. పైగా.. ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఆ అవార్డు పొందేందుకు తగు అర్హత కలిగిన వ్యక్తి ఎవరూ లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్పటి నిబంధనల ప్రకారం.. మరణానంతరం నోబెల్ ఇచ్చే సంప్రదాయం లేదు. తర్వాతి కాలంలో దాన్ని సవరించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మహాత్ముడు జీవించి ఉండి ఉంటే.. 1948 నోబెల్ శాంతి బహుమతి ఆయనకే దక్కి ఉండేదన్నది అత్యధికుల వాదన. పైగా.. ‘గాంధీ ఈ పురస్కారాన్ని దాదాపుగా దక్కించుకునే దాకా వచ్చారు. అయితే, ఆయన మరణం దాన్ని దూరం చేసింది’ అని 1948 నోబెల్ కమిటీ రికార్డుల్లో నమోదై ఉండటం కూడా ఆ వాదనను మరింత బలపరిచింది. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం అన్నది కమిటీ చరిత్రలో అతిపెద్ద తప్పిదమని గేర్ లూండెస్టాడ్ అన్నారు. తర్వాత నోబెల్ కమిటీ కూడా మహాత్ముడికి శాంతి బహుమతి దక్కకపోవడంపై 1989, 2006లలో విచారం వ్యక్తం చేసింది. గాంధీ గొప్పోడని చెప్పడానికి ఆయనకు నోబెల్ అక్కర్లేదు.. కానీ నోబెల్ గొప్ప అవార్డు అని చెప్పుకోవడానికి మాత్రం గాంధీ కావాలి! దట్సిట్..(చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
చిట్టి చేతుల్లో స్క్రీన్.. అంతటా అదే సీన్..
ఒకప్పుడు చిన్నారులకు చందమామ కథలు చెబుతూ అన్నం తినిపించేవారు అమ్మలు. ఆ కథలు వింటూ మరో లోకంలో విహరించేవి ఆ పసిహృదయాలు. చిన్న తలుపు తట్టినా చప్పట్లతో పరుగులుతీసి ఆటలాడేవారు. ఇప్పుడు ఆ రోజులు వెనక్కి పోయాయి. చందమామ చూపించే తల్లుల బదులు, యూట్యూబ్ కార్టూన్లు ప్లే చేసే అమ్మలుగా మార్పుచెందారు. బాల్యంలోనే మొబైల్తో స్నేహం చేస్తూ పెరుగుతున్న ఈ తరం అది లేకుండా ఉండలేని స్థితికి చేరింది. ఇది అధునాతన సాంకేతికత అందించిన సౌకర్యమే కాదు, అనేక మానసిక, శారీరక సమస్యలకు దారితీసే వ్యసనం కూడా. ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని పూర్తిగా నిరాకరించడం సాధ్యమా అంటే.. కాదనే చెబున్నాయి అధ్యయనాలు.. అలా అని అంతలా అవసరమా అంటే అదీ కాదనే చెబుతున్నారు. కానీ చిన్నారుల మెదడు అభివృద్ధి, మానసిక స్థితి, నైపుణ్యాల పెరుగుదల అన్నిటికీ స్థిరమైన అనుసంధానం కావాలంటే, మొబైల్ వినియోగాన్ని సమతుల్యంగా నియంత్రించడం తల్లిదండ్రుల బాధ్యత. వారు చూపిన దారిలోనే పసి పిల్లలు నడుస్తారు.. మనం మొబైల్ ఆఫ్ చేస్తే, వారు జీవితాన్ని ఆనందించడంలో ముందుకు వస్తారన్నది నిపుణుల మాట. ఇటీవలి కాలంలో పిల్లల్లో ఫోన్లు, ట్యాబ్ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. నగరాల నుంచి పల్లెలకూ ఈ విష సంస్కృతి విస్తరించింది. సహజమైన ఆటలతో అలసిపోవాల్సిన పసి హృదయాలు డిజిటల్ గేమ్స్కు బానిసలవుతున్నారు. దీనికి ప్రధాన కారకులు తల్లిదండ్రులేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం తినిపించడానికో.. అల్లరి తగ్గించడానికో మనం అలవాటు చేసే ఈ పద్ధతికి బాల్యం బలైపోతోంది. కొంత కాలానికి అదే అడిక్షన్గా మారుతోంది. చిన్నారులకు మొబైల్ వినియోగం వల్ల కలిగే నష్టాలు సాధారణమైనవి కాదు, వారు పెరుగుతూ ఉంటే ఈ వ్యసనం పోతుందని నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం చేత చిన్నారులు దీర్ఘకాలిక సమస్యల భారిన పడుతున్నారు. దృష్టి సమస్యలు : నిరంతరం మొబైల్ స్క్రీన్ చూడటంవల్ల, మరీ దగ్గర నుంచి చూస్తుండటం వల్ల చూపు బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మైల్స్ డిసార్డర్స్, డ్రై ఐ వంటి సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. నిద్రలేమి : స్మార్ట్ఫోన్ నుంచి వచ్చే నీలి కిరణాలు(బ్లూ లైట్) నిద్రకు ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ను నియంత్రిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది. మానసిక అసంతృప్తి : ఎక్కువగా డిజిటల్ ప్రపంచంతో మమేకమవుతూ, వాస్తవ ప్రపంచానికి దూరమవ్వడం వల్ల పిల్లల్లో ఒంటరితన భావన, ఆందోళన, కొంతవరకూ డిప్రెషన్కు గురికావచ్చు. అవగాహనాలేమి : వీడియోలు, రీల్స్ వంటి తక్షణ వినోదం చిన్నారుల్లో సహనాన్ని తగ్గిస్తుంది. దృష్టి ఎటుపోతుందో అక్కడే ఆలోచన కూడా ఆగిపోతుంది. ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు. చూడకూడనివన్నీ చూస్తూ : కొన్ని రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో పిల్లలకు అవసరం లేని కంటెంట్ ఉంటుంది. అది వారి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే దుష్ఫలితాలను కలిగిస్తుంది.పెద్దలే ఆదర్శంగా : తల్లిదండ్రులే ముందుగా మొబైల్కి బానిసలుగా ఉంటే.. పిల్లలు ఎలా దూరమవుతారు? ఫోన్ల వాడకాన్ని తల్లిదండ్రులే మొదట నియంత్రించాలి. తద్వారా పిల్లలకు ఆదర్శంగా మారాలి. నియంత్రిత కంటెంట్ : పిల్లలకు పూర్తిగా మొబైల్ తీసేయడం కాకుండా, వారితో ఓపెన్ డైలాగ్ పెట్టి, వారికి సేఫ్ కంటెంట్ మాత్రమే చూపించడం అవసరం. ఇతర వ్యాపకాల వైపు.. పిల్లలను మొబైల్కి దూరం చేయడానికి పరిష్కార మార్గాలు మనచేతుల్లోనే ఉంటాయి. వారి మానసిక స్థితికి అనుగుణంగా, వారి ఇష్టాలపై ఆసక్తి పెంచేలా ఇతర వ్యాపకాలతో మునిగిపోయేలా చేయొచ్చు. సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పిల్లలు మొబైల్ చూడకుండా ఉండేందుకు కొన్ని విడియోలు, టిప్స్, ట్రిక్స్ వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా ‘కిట్ బ్యాగ్ ట్రిక్’, ‘బుక్స్ బిఫోర్ స్క్రీన్’ వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. వాటిపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకి యాక్టివిటీ జర్నల్స్ ఇవ్వడం, పజిల్ ఛాలెంజ్లు పెట్టడం ద్వారా మొబైల్ బదులుగా కొత్త అలవాట్లు పెంచుతున్నారు. ఈ డిజిటల్ తరం కాబట్టి అవసరమైనంత మేర రైమింగ్స్, కిడ్స్ ఐక్యూ వంటి వీడియోలు చూపించి వారి వ్యసనాన్ని నియంత్రించాలి. డిజిటల్ డిటాక్స్ షెడ్యూల్ : రోజులో ఒక నిర్దిష్ట సమయానికి మొబైల్ పూర్తిగా వదిలేసి, కుటుంబంతో సమయాన్ని గడపడం, ఆటలు, పుస్తకాలు, చర్చలతో సమయాన్ని గడిపేలా చేయాలి. ఆఫ్లైన్ వినోదాన్ని ప్రోత్సహించాలి : బొమ్మల కథలు, బోర్డు గేమ్స్, డ్రాయింగ్, సంగీత తరగతులు, నృత్యం లాంటి క్రియేటివ్ యాక్టివిటీలతో వారి దృష్టిని డైవర్ట్ చేయాలి. (చదవండి: ఆంబోప్లియా: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!) -
Amblyopia: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!
కొన్ని సందర్భాల్లో రెండు కళ్లలో... ఏదో ఓ కన్ను పనిచేయడానికి కాస్త బద్ధకిస్తుంటుంది. ఈ సమస్య అందరిలోనూ వచ్చే అవకాశమున్నా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువ. అయితే... తమకు ఉన్న రెండు కళ్లలో ఒకటి... తన పక్కదానంత బాగా పనిచేయడం లేదన్న విషయం వారికి తెలిసే అవకాశం సాధారణంగా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా కనిపించే కంటి నుంచే ప్రతిబింబాలను గ్రహించి, అస్పష్టంగా కనిపించే ప్రతిబింబాలను మెదడు నిరాకరిస్తుంది. అంటే ఈ రెండు కళ్లలో ఒకటి ప్రతిబింబాన్ని ప్రసారం చేయడంలో కాస్త బద్ధకంగా పనిచేస్తుందన్నమాట. ఇలా బద్ధకంగా పనిచేసే కన్ను పనితీరు క్రమంగా తగ్గి΄ోతూ... ఒక దశలో పూర్తిగా పనిచేయకుండా ΄ోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యనే వాడుక భాషలో ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. సాధారణంగా ఆంబ్లోపియా సమస్య ఉన్నప్పుడు... కొద్దిగానైనా చూపు ఉన్నంత కాలం... తమ కళ్లలో ఒకదానికి సమస్య ఉందన్న విషయమే బాధితులకు తెలిసే అవకాశం పెద్దగా ఉండదు. ఈలోపే జరగాల్సిన అనర్థాలు జరిగే అవకాశముంది. అందుకే ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా)పై అవగాహన అవసరం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. ఓ కేస్ స్టడీశిరీష (పేరు మార్చాం) అనే ఓ ఎనిమిదేళ్ల చిన్నారి రెండు కళ్లలో ఒక కన్నులోంచే దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండో కన్ను మంచి ప్రతిబింబాన్ని పంపడంలో కాస్త బద్ధకిస్తోంది. ఇలా కంటిన్యువస్గా జరిగే సమయంలో ఎదుటి దృశ్యాన్ని స్పష్టంగా పంపే కంటి తాలూకు ప్రతిబింబాన్నే మెదడు తీసుకుంటోంది. సరిగ్గా కనిపించని కంటి నుంచి వచ్చే ఆ సమాచారాన్ని తీసుకోవడాన్ని నిరాకరిస్తూ పోవడంతో కొంతకాలానికి ఆ కంటికి క్రమంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈలోపు ఏదో ఇతర పరీక్ష కోసం వెళ్లిన సమయంలో డాక్టర్లకు ఒక కన్ను బద్ధకిస్తోన్న విషయం తెలిసివచ్చింది. దాంతో డాక్టర్లు అతి కష్టమ్మీద ఆ రెండో కంటి చూపునూ కాపాడగలిగారు. అసలు ‘లేజీ ఐ’ పై అవగాహన రావాలంటే ముందుగా... చూడడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలియడం చాలా ప్రధానం. మనం ఏదైనా దృశ్యాన్ని లేదా వస్తువును చూడాలంటే... తొలుత ఆ వస్తువుపై కాంతి పడి, మళ్లీ అదే కాంతి మన కంటిని చేరాలి. అప్పుడది తొలుత నల్లగుడ్డు అయిన కార్నియా నుంచి, తర్వాత పారదర్శకమైన మన లెన్స్ నుంచీ ప్రసరించి... రెటీనా అనే తెరపై ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని తలకిందులుగా పడేలా చేస్తుంది. ‘ఆప్టిక్ నర్వ్’ అనే కీలకమైన నాడి ద్వారా రెటీనాపైనున్న ప్రతిబింబం సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో ఆ వస్తువు కనిపించడం వల్ల మనకు దృష్టిజ్ఞానం కలుగుతుంది. ఏమిటీ ‘లేజీ ఐ’?మనకు కలిగే దృష్టి జ్ఞానాన్ని ‘బైనాక్యులర్ విజన్’ అంటారు. అంటే... మన రెండు కళ్లలోని దృశ్యాలూ తమ తమ రెటీనాలపై కలిసి (ఇంటిగ్రేట్ అయి) ఆ రెండూ ఒకే దృశ్యంగా / వస్తువుగా కనిపిస్తాయి. అంటే ‘బై’ అంటే రెండు... ‘ఆక్యులార్’ అంటే ‘కళ్లు’... ఈ రెండు కళ్లూ కలిసి ఒకే దృశ్యాన్ని చూపడమే ‘బైనాక్యులార్ విజన్’! ఏదైనా కారణాలతో ఒకవేళ ఒకరి రెండు కళ్లలో... ఒకదానికి ఏదైనా కొంత లోపం ఉంటే... అలాంటప్పుడు ఒక కంటిలోని ప్రతిబింబం చాలా స్పష్టంగానూ, లోపమున్న కంటిలోని ప్రతిబింబం కొంత అస్పష్టంగా... ఇలా తన రెండు రెటీనాలపై ప్రతిబింబాలను చూపుతుంది. అయితే రెండు కళ్లతో చూసేప్పుడు బైనాక్యులర్ విజన్ కారణంగా ఆ లోపం తెలియక΄ోవచ్చు. ఒక్కో కంటితో విడివిడిగా, పరీక్షగా చూసినప్పుడు మాత్రమే అది తెలిసిరావచ్చు.ఇలాంటి సందర్భాల్లో స్పష్టమైన ప్రతిబింబాన్నే మెదడు స్వీకరిస్తుంది. అస్పష్టమైన దాన్ని క్రమంగా నిరాకరిస్తూపోతుంది. ఇలా అస్పష్టమైన ప్రతిబింబాన్ని నిరాకరించడాన్ని ‘సప్రెషన్’ అంటారు. ఒక కంట్లో ప్రతిబింబం అస్పష్టంగా ఏర్పడుతున్నప్పుడూ, ఆ సమాచారాన్ని మెదడు క్రమంగా నిరాకరిస్తూపోతూ ఉండే మెడికల్ కండిషన్ను ‘లేజీ ఐ’ అనీ, వైద్యపరిభాషలో ‘ఆంబ్లోపియా’ అని అంటారు. లేజీ ఐ / ఆంబ్లోపియా సమస్య ఉన్నవారిలో తొలుత ఎలాంటి లోపమూ కనిపించదు. చిన్నపిల్లల్లోనైతే వాళ్ల కన్ను అభివృద్ధి / వికాసం కూడా మామూలుగానే జరుగుతాయి. వైద్యపరీక్షల్లోనూ కంటి గురించి ఎలాంటి లోపమూ తెలియదు. కాని కొన్నిసార్లు ఏదో ఒక కంట్లోగానీ లేదా ఒక్కోసారి రెండు కళ్లల్లోనూ చూపు మందగిస్తుంది. ‘లేజీ ఐ’ కండిషన్ వయసుతో పాటు పెరుగుతూ పోతుంది. పైకి అంతా బాగానే ఉండటంతో ఈ కండిషన్ను తొలిదశల్లో గుర్తుపట్టడమూ కష్టమే.ఆంబ్లోపియా విస్తృతి : మన దేశంలోని చిన్నారుల్లో దీని విస్తృతి దాదాపు రెండు శాతం. అంటే ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరిలో ఈ లోపం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి ఇంకా ఎక్కువ. అంటే దాదాపు 4 శాతం. ఆంబ్లోపియా రకాలు అన్ ఐసోమెట్రోపిక్ ఆంబ్లోపియా : ఒక కంట్లో ఉన్న దృష్టిలో΄ానికీ (రిఫ్రాక్టివ్ ఎర్రర్కూ), మరో కంటికీ తేడా ఉండటం. ఈ సమస్య ఉన్న వాళ్లలో చాలా ఎక్కువమందిలో ఈ సమస్యే ఉంటుంది. ఐసోమెట్రిక్ ఆంబ్లోపియా : రెండు కళ్లలోనూ ఎక్కువ దృష్టిలోపం (రిఫ్రాక్టివ్ ఎర్రర్) ఉండటం. (ఉదా + 6.0 ; +6.0) మెరిడోనల్ ఆంబ్లోపియా: కళ్లలో సిలెండ్రికల్ పవర్ ‘2.0’ కంటే ఎక్కువ ఉండటం. స్టెడిస్మస్ ఆంబ్లోపియా : మెల్లకన్ను కారణంగా వచ్చే ఆంబ్లోపియా ఇది. డిప్రొవేషనల్ ఆంబ్లోపియా : పుట్టుకతోనే కంట్లో శుక్లం ఉండటం, కార్నియా సమస్య, రెటీనా సమస్య, కనురెప్ప వాలిపోవడం వంటి సమస్యలున్నప్పుడు, కాంతి కిరణాలు రెటీనాకు సరిగా చేరకపోవడం ఈ తరహా ఆంబ్లోపియా వస్తుంది.ఎంత త్వరగా చికిత్స జరిగితే... అంత మేలైన ఫలితాలుఆంబ్లోపియాను ఎంత త్వరగా గుర్తించి, ఎంత చిన్న వయసులో చికిత్స చేయిస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే ఆ పసివయసులో తమ చూపులో లోపం ఉందన్న విషయాన్ని పిల్లలు గ్రహించలేకపోవడం, అలాగే చిన్నారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఒకపట్టాన గుర్తించలేరు. అయితే చిన్నతనంలోనే అంటే... రెండు నుంచి ఎనిమిది ఏళ్లలోపు గుర్తించి, చికిత్స చేయిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అంతమాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదు. పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వరకు చికిత్స చేయించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫలితాలు చిన్నప్పటితో పోలిస్తే కాస్త నిదానంగా కనిపిస్తాయి. పెద్దవాళ్లలో కూడా ‘విజన్ థెరపీ’ ద్వారా కొంతవరకు ఫలితాలను రాబట్టవచ్చు. ఏ కారణంతో ఆంబ్లోపియా వచ్చిందో దానికి చికిత్స చేయడం : అంటే ఉదాహరణకు దృష్టిలోపాల వల్ల సమస్య వచ్చినట్లయితే దానికి సరిపడిన అద్దాలను ఇవ్వడం. ఉదాహరణకు ప్లస్ పవర్, మైనస్ పవర్, సిలెండ్రికల్ పవర్. మెల్లకన్ను కారణంగా ఆంబ్లోపియా వస్తే మెల్లకన్ను కరెక్షన్ చికిత్సతో దాన్ని సరిచేయడం. డిప్రెవేషన్ ఆంబ్లోపియా జబ్బులకు... అంటే శుక్లం, కార్నియా, రెటీనా, వాలిపోయే కనురెప్పలు వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం ద్వారా లోపాల్ని తొలగించవచ్చు. ఉదాహరణకు... పుట్టుకతోనే శుక్లం (కాటకార్ట్) కారణంగా ఆంబ్లోపియా వస్తే... శస్త్రచికిత్స ద్వారా తొలుత పారదర్శకత కోల్పోయిన శుక్లాన్ని తొలగించాలి. ఆ స్థానంలో ఇంట్రా ఆక్యులార్ లెన్స్ను అమర్చాలి. శుక్లం కేవలం ఒకే కంట్లోనే ఉంటే– బిడ్డ పుట్టిన వెంటనే ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఒకవేళ శుక్లాలు రెండు కళ్లలోనూ ఉంటే ఆపరేషన్కు కొన్ని మాసాల వ్యవధి తీసుకోవచ్చు. కాని శస్త్రచికిత్స మాత్రం తప్పనిసరిగా చేయించాలి. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే చూపు వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలకు డాక్టర్లు సూచించిన ప్రకారం... క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఇలా ఆ చిన్నారికి 14 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. మూడేళ్లలోపు పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. కొందరిలో పుట్టగానే మెల్లకన్ను ఉండవచ్చు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డకు మెల్లకన్ను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తారు. పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించవచ్చని మరికొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతుంటారు. ఈ రెండూ సరికాదు. పిల్లల్లో మెల్లకన్నును గమనించగానే వెంటనే పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. మెల్లకంటి సమస్యకూ ఎంతత్వరగా చికిత్స చేయిస్తే... అంత మంచిది. కంటి రెప్ప వాలిపోవడం వల్ల ఆంబ్లోపియా వస్తే... ఆ రెప్ప పైకెత్తి నిలిపి ఉంచేలా ఓ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీన్నే ‘టోసిస్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఈ ఆపరేషన్ తర్వాత కూడా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. కొందరిలో కంటికి అద్దాలు అవసరమవుతాయి. ఇలాంటివారు అద్దాలు వాడుతూనే ఆంబ్లోపియాకూ చికిత్స చేయించాలి.అంబ్లోపియాకు కారణాలు(ఆంబ్లోజెనెసిస్)విజువల్ డిప్రవేషన్ : చూపు విషయంలో ఒక కంటిలో ఉన్నంత స్పష్టత మరోదానిలో లేకపోవడం. లైట్ డిప్రవేషన్ : కంటిలోని కొన్ని దోషాల కారణంగా (కాటరాక్ట్ వంటి వాటివల్ల) రెటీనాకు తగినంత కాంతి చేరకపోవడం. అబ్–నార్మల్ బైనాక్యులార్ విజన్ : అంటే రెండు కళ్లూ సమంగా ఒకే వస్తువుపై కేంద్రీకరించలేకపోవడం... ఈ అంశాలు ఉన్నవారిలో ఆంబ్లోపియా క్రమంగా వృద్ధిచెందుతుంది.అక్లూజన్ థెరపీఈ చికిత్స ప్రక్రియలో నార్మల్గా ఉన్న కంటిని పూర్తిగా మూసివేసి, చూపు మందగించిన కంటి తాలూకు దృష్టి మెరుగుపడేలా స్టిమ్యులేట్ చేస్తారు. నార్మల్గా ఉన్న కంటిని ఎన్నాళ్లు మూసి ఉంచి... ఈ స్టిమ్యూలేషన్ చికిత్స చేయాల్సి ఉంటుందన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. ఈ చికిత్స వల్ల 8 నుంచి 10 ఏళ్ల వరకు ఉన్న పిల్లల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.పీనలైజేషన్అట్రోపిన్ చుక్కల మందులు లేదా బలమైన లెన్స్లను బాగా కనిపించే కంటికి వాడతారు. అప్పుడు బలహీనంగా ఉన్న కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. దాంతో అది చూడటానికి ప్రయత్నించడాన్ని మొదలు పెడుతుంది. కన్నును మూసివేసి ఉంచి చేసే చికిత్స అయిన ‘అక్లూజన్ థెరపీ’లోలా కాకుండా, కన్ను తెరచే ఉంచి చేసే చికిత్స ఇది.విజన్ థెరపీపైన పేర్కొన్న అక్లూజన్ పద్ధతిలో చికిత్స చేస్తూ... కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా బలహీనమైన కంటిని చురుగ్గా మారేలా చేస్తారు. దీని వల్ల మెదడు కూడా తిరిగి ప్రతిబింబాన్ని గ్రహించేలా, పక్క కన్ను ప్రతిబింబంతో పోల్చుకుని... మళ్లీ చూపు, బైనాక్యులర్ విజన్ పొందేలా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రక్రియకు దాదాపుగా 100 నుంచి 200 గంటల పాటు చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు / నిర్ధారణనిజానికి చాలా మంది తమకు లోపం ఉన్నట్లు గుర్తించలేరు / చెప్పలేరు. ∙ఒక కంటిలో చూపు తగ్గడంక్రౌడింగ్ ఫినామినా: అంటే... అనేక అక్షరాలు ఉన్నప్పుడు ఏదో ఒక అక్షరాన్ని మాత్రమే చూడగలగటం. ఒక్క అక్షరాన్ని మాత్రమే చదవడగలగడం. న్యూట్రల్ డెన్సిటీ ఫిల్టర్ : దీనితో పరీక్షించినప్పుడు మామూలు కంటి చూపు ఉన్నవారికిస్పష్టంగా కనిపించదు. కానీ ‘ఆంబ్లోపియా’ ఉన్నవారు దీనిలోంచి చూసినప్పుడు... వారికి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందిలో మెల్లకన్ను ఉండటం, అలాగే రంగులు చూసే సామర్థ్యం తక్కువగా ఉండటం. కంటి డాక్టర్లు పైన పేర్కొన్న లక్షణాలను బట్టి ‘ఆంబ్లోపియా’ను నిర్ధారణ చేస్తారు. నివారణమూడు నుంచి ఐదేళ్ల వయసులోని పిల్లలకు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. లోపాలుండి శస్త్రచికిత్స అవసరమైన వారికి వీలైనంత త్వరగా చేయించాలి. ఆక్లూజన్ థెరపీ ద్వారా చూపు తిరిగి వచ్చాక కూడా ‘మెయింటెనెన్స్ థెరపీ’ అంటూ రోజూ రెండు గంటల పాటు అక్లూజన్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ∙తరచూ కంటి డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి.ఫ్యూజనల్, స్టీరియాప్టిక్ ఎక్సర్సైజెస్లేజీ ఐ తన చురుకుదనాన్ని పొందేలా చేసిన చికిత్స ప్రక్రియల తర్వాత ఆ రెండు కళ్లూ ఒకేలాంటి మంచి ప్రతిబింబాన్నే మెదడుకు ఇచ్చేలా చేసేందుకు కొన్ని వ్యాయాయాలు చేయిస్తారు. ఇందులో ఫ్యూజనల్ ఎక్సర్సైజ్లో రెండు కళ్లూ తాము ప్రతిబింబించే దృశ్యాన్ని మెదడు ఒకేలా గ్రహించేలా చేస్తారు. ఇక స్టీరియాప్టిక్ ఎక్సర్సైజ్లో ఈ రెండు కళ్లూ డెప్త్ / 3 డీ ఇమేజ్ సాధించేలా చేయడానికి చేయిస్తారు. ఈ రెండు ఎక్సర్సైజ్లు చేయిస్తేనే భవిష్యత్తులో లేజీ ఐ లో చూపు తగ్గకుండా ఉంటుంది. లేదంటే మళ్లీ వెనక్కువెళ్లే అవకాశాలు ఉంటాయి.ఫార్మకోథెరపీలీవోడోపావంటి మందుల ద్వారా కంటి నరాలు బాగా పనిచేసేలా చేస్తారు. భవిష్యత్తు చికిత్స ప్రక్రియల్లో జీన్ థెరపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త చికిత్స ప్రక్రియలు అందివచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల అడల్ట్ ఆంబ్లోపియాకు కూడా మరిన్ని అధునాతన చికిత్సలను అందుబాటు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: 'మార్నింగ్ వాకింగ్' ఎందుకంటే..! థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ) -
అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!
ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన, మర్చిపోలేని అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తిపేశ్వర్ (Tipeshwar, Maharashtra అడవిలో అద్భుతమైన దృశ్యాలు ఆయన కంటపడ్డాయి. అది చూసి ఆయన హృదయం మైమర్చి పోయిందట. గాలికి ఊగిసలాడే ప్రతీ ఆకు ఒక కథను వినిపిస్తుంది అంటూ పులకించిపోతూ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆకు కదలినా వినిపించే నిశ్శబ్ద వాతావరణంలో ఒక్క క్షణం గుండె ఆగిపోయే దృశ్యాన్నిగాంచిన వైనాన్ని పంచుకున్నారు.పులి కనిపించిన ఆ మరపురాని క్షణం-నిశ్శబ్దంగా, రాయల్గా తమ కళ్ల ముందునుంచి ఒక పులి వెళ్లిన దృశ్యాలనువర్ణించారు. ఒక్క క్షణం శ్వాసం ఆగిపోయినంత పని. ఇక్కడితో అయిపోలేదు. ఆ క్షణాలను అలా ఆస్వాదిస్తూ ఉండగానే, చిరుతపులి వచ్చింది. తనదైన వేగంగా, అలా కళ్లముందునుంచి శరవేగంగా కదిలి పోయింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అడవిలో అందం అలా వచ్చి అలా మాయమై పోతుందనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.పులి గర్జన చెట్ల గుండా ప్రతిధ్వనిండచమేకాదు మనం రక్షించుకోవాల్సింది , గౌరవించుకోవాల్సింది ఒక భూమిని మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది అనే ఆలోచనను రగిలించింది. అదొ క నిశ్శబ్ద వాగ్దానం. పక్షులతో పాటు ఎన్నో మరెన్నో.. అడవిని సజీవ సింఫొనీగా మలిచే రావాలు. ఇవన్నీ అత్యంత మరపురాని రోజులకు నేపథ్య సంగీతమని చెప్పుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రయాణం కాదు. అంతకుమించినలోతైన అనుభవం అన్నారు. తిపేశ్వర్లో తాము చూసినవి కేవలం జంతువులను కాదు, ప్రకృతి మనకంటే చాలా కాలం ముందు రచించుకున్న కవితలోని పద్యాలు. మనం అదృష్టవంతులైతే ఈ అందమైన ప్రకృతిని సజీవంగా ఉంచడంలో సహాయం లభిస్తుందన్నారు.ఇదీ చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు Lost in the wild heart of Tipeshwar — where every rustling leaf hinted at an untold story, and every shifting shadow held the thrill of the unknown. 🌿🐅That unforgettable moment when the tiger appeared — silent, regal, and commanding — it felt like time held its breath. A gaze… pic.twitter.com/cfZ8nnxjIg— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 15, 2025 -
సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ
భారతదేశంలోని ప్రముఖ ధూపద్రవ్య బ్రాండ్ అయిన ఐటీసీ మంగళ్దీప్ స్పెషల్లీ ఏబుల్డ్ దృష్టిలోపి ఉన్నవారికోసం సిక్స్త్ సెన్స్ ప్యానెల్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే సువాసనలను గుర్తించేలా దృష్టి లోపంతో ఉన్న వ్యక్తులను భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసింది. మంగళ్దీప్ సిక్స్త్ సెన్స్ ప్యానెల్ను 180 మందికి విస్తరించింది. విభిన్న, విశిష్ట విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల నుండి వీరిని ఎంపిక చేసింది.దృష్టి లోపం ఉన్నవారికి అధికంగా వాసనలను పసిగట్టే జ్ఞానం ఉంటుందని వైద్యపరంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో భగవంతుడికి, భక్తులకు మధ్య వారధిగా ఉండే ఒక పవిత్రమైన కార్యంలో సువాసన టెస్టింగ్లో అంధులకు భాగస్వామ్యం కల్పించింది. 2021లో తీసుకొచ్చిన సిక్స్త్ సెన్స్ ప్యానెల్ కార్యక్రమం కింద ప్రత్యేక సువాసన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 30 మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను ఇటీవల సత్కరించింది. చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లలో 180 మందికి పైగా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు మంగళ్దీపి వెల్లడించింది. అప్పటి నుండి ఈ ప్యానెల్ ఉత్పత్తి ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది, శాండల్, రోజ్, లావెండర్, మ్యారిగోల్డ్ వంటి అనేక ప్రత్యేకమైన,సువాసన వేరియంట్లను మంగళ్దీప్ విడుదల చేయటంలో తోడ్పాటు అందించినట్టు తెలిపింది.ఈ కార్యక్రమం గురించి ఐటిసి లిమిటెడ్లోని అగర్బత్తి & మ్యాచ్ల వ్యాపారం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవ్ తాయల్ మాట్లాడుతూ, “సిక్స్త్ సెన్స్ ప్యానెల్ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంపిక చేసిన సువాసలు, అభివృద్ధి, మెరుపుపర్చడం అనేది, సహజంగా వాసనలను పసిగట్టడంలో ఎక్కువ పవర్ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్ల సాంప్రదాయ పరీక్షా పద్ధతులకు మించి విలువైన ధృక్పథం అలవడింన్నారు. రాబోయే రోజుల్లో తమ సంస్థలో మరింత మందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ధూప్ స్టిక్స్, ఫ్లోరా అగర్బత్తిస్, ప్రీమియం కప్పులు, సాంబ్రాణి స్టిక్స్ వంటి మంగళ్దీప్, కీలక ఉత్పత్తులతో ముడి పదార్థాలు, మిశ్రమ అనుభవాల ద్వారా ఫ్రూటీ, ఫ్లోరల్, వుడీ, హెర్బల్/మింట్ ,ఔధ్/అంబర్ వంటి ప్రధాన సువాసనలను గుర్తించడంలో శిక్షణ నిచ్చారు. ప్యానెల్ సభ్యులు నెలవారీ సువాసన పరీక్షలలోపాల్గొనడానికి, వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడానికి వీలుగా నిర్మాణాత్మక ఉత్పత్తి మూల్యాంకన ప్రోటోకాల్లు అందిస్తారు. "ఐటిసి సిక్స్త్ సెన్స్ ప్యానెల్లో భాగం కావడం నిజంగా సాధికారత కల్పించే అనుభవమనీ,. దృష్టి లోపం ఉన్న సమాజానికి అర్థవంతమైన స్వరాన్ని అందించే ప్రాజెక్ట్కు సహకరించడం గౌరవంగా ఉందని మాజీ బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేత & మహనవ్ ఎబిలిటీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేందర్ వైష్ణ కొనియాడారు.ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రేడియో ఉడాన్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మినల్ సింఘ్వి ఐటీసీకి ధన్యవాదములు తెలిపారు. -
ఇష్టమైన గులాబ్ జామ్లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!
అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్లతో తేలిగ్గా కొలెస్ట్రాల్ని మాయం చేసుకుని ఫిట్గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!ప్రసిద్ధ యూట్యూబర్ ఆశిష్ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒక్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్ సీక్రెట్ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్ స్వయంగా ఆ సీక్రెట్ ఏంటో స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. తనకు నచ్చిన గులాబ్ జామ్లు ఆస్వాదిస్తూ డైట్ ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్, కార్బోహైడ్రేట్లు తన డైట్ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్. డైట్ విధానం..అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. లంచ్ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్తో ఉంటుంది.స్నాక్స్సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.విందుఆశిష్ విందు కూడా ప్రోటీన్తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్. బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.అప్పడప్పుడు చీట్మీల్..ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్ అయ్యేవాడు కాదట.(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!) -
బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు : ఓ అందమైన ప్రేమకథ
‘‘బెంగళూరు బోయ్.. అమెరికా అమ్మడు" వీరి నిజ జీవిత ప్రేమగాథ ఇది సోషల్ మీడియా ద్వారా మొదలై, సరిహద్దులు దాటిన ప్రేమగా నిలిచింది. తొలి చూపులోనే ఏదో తెలియని ఆకర్షణ, సప్త సముద్రాల అవల ఉన్నా చేరువ కావాలనుకున్నారు. నా ప్రతి శ్వాసవి నువ్వే..అన్నట్టు ఊసులాడుకున్నారు. కట్ చేస్తే.. ఇదే అందమైన ప్రేమకథగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదండి ఈ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే షేర్ చేసిన పోస్ట్ ప్రకారం సోషల్ మీడియా ద్వారానే లవ్బర్డ్స్ బెంగళూరుకు అబ్బాయి, అమెరికా అమ్మాయి పరిచయం, ప్రేమకు దారితీసింది.. ప్రతీక్షణం టచ్లో ఉన్నారు ఒకరి అభిప్రాయాలను పంచుకున్నారు. వీడియో కాల్స్ వర్చ్యవల్ డిన్నర్స్. ఇక విడిగాబతకలేమని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చేసింది. ఆఅబ్బాయి పేరే దీపక్. అమ్మాయిపేరు హన్నా. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆర్టిస్ట్ దీపక్ 2023, ఏప్రిల్లో ఒక ప్రదర్శన కోసం ముంబైకి వెళ్ళినప్పుడు హన్నా అమ్మాయిని చూశాడు. తొలిచూపులోనే హన్నాపై ఇష్టం పెంచుకున్నాడు. మొత్తం మీద ధైర్యం చేసి మాటకలిపాడు. ముంబైలో ఆ కాసేపటి పరిచయంతో ఆశ్చర్యంగా ఇద్దరూ స్నేహితులైపోయారు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. ఇక అప్పటినుంచి వీరి ప్రణయ గాథకు అడుగులు పడ్డాయి. తమ స్నేహం కేవలం ఆకర్షణ కాదు అంతకుమించి అని దీపక్ ఫిక్స్ అయిపోయాడు. మనుషులు దూరమైనా..మనసులు దగ్గరే!ఇంతలో ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా, వారి కమ్యూనికేషన్ ఎప్పుడూ ఆగలేదు. రోజువారీ సందేశాలు, తరచు కాల్స్, ఎన్నో ఆలోచనలు, మరెన్నో అభిప్రాయాలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేశాయి. నెమ్మదిగా వారి స్నేహం ప్రేమగా వికసించింది. త్వరలోనే అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో తన భావాలతో కూడిన భావోద్వేగ పెయింటింగ్ను అందించాడు. అంతే ఆమె కూడా ఫిదా అయిపోయింది.కానీ హన్నా అమెరికాకు వెళ్లిపోయింది. ఆ దూరం వారిద్దరి మధ్యా ప్రేమ మరింతపెరిగింది. చివరికి దీపక్ తన తల్లితో తన ప్రేమ గురించి చెప్పాడు. హన్నా ఫోటో చూడగానే తల్లి తక్షణమేఅంగీకరించింది. అటు హన్నా కూడా తన ప్రియుడిని తన కుటుంబానికి పరిచయం చేసింది. భాషా అంతరాలు ఉన్నప్పటికీ పరస్పరం అంగీకరించారు.ఒక సంవత్సరం తర్వాతఫిబ్రవరి 2024లో తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చింది హెన్నా. విమానాశ్రయంలో ఆత్మీయంగా హెన్నాను ఆలింగనం చేసుకున్న క్షణం ఇక విడిచి ఉండటం కష్టమని నిర్ణయించు కున్నారు. ఆ హగే వారి జీవితంలో కీలక నిర్ణయానికి నాంది పలికింది. అదే ఏడాది జూలై 26న అందమైన ఎర్రచీరలో పెళ్లి కూతురిలా ముస్తాబైంది హన్నా. సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ అపురూపంగా పెళ్లి చేసుకున్నారు.జీవితంలో మొదలైన అందమైన మలుపు ఎంతో హృద్యంగా సాగిపోతోంది. ఒకరి ప్రపంచంలో ఒకరిగా మారిపోయారు. దీపక్ తల్లి హన్నాకు సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని ఎలా తయారు చేయాలో నేర్పిస్తోంటే, హన్నా పాశ్చాత్య వంటకాలను పరిచయం చేసింది. ఈ ప్రేమికుల పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయికను కాదు, రెండు విభిన్న సంస్కృతులు, ఆచారాలు, హృదయాలను కలయిక. వీరి అందమైన లవ్స్టోరీకి త్వరలోనే తొలి వసంతం నిండబోతోంది. ప్రేమ పెళ్లికి దేశం, ప్రాంతం, భాషా ఇలాంటివేవీ అడ్డురావని నిరూపించారు. దీపక్ ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం 93 వేలకు పైగా అనుచరులు ఉన్నారు. -
'వాకింగ్'పై థైరోకేర్ వేలుమణి ఆసక్తికర వివరణ..!
ఇటీవలకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా తమ ఫిట్నెస్కి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరు వాకింగ్, యోగా, జిమ్ వంటి ఇతరత్రా వర్కౌట్లు చేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా టెన్షన్గా పొద్దుపొద్దునే వాకింగ్కి వెళ్లిపోతుంటారు. ఎంతలా అంటే..ఒక్కరోజు వాకింగ్ మిస్ అయితే ఏదో పోయినట్లుగా గాభర పడిపోతుంటారు. అయితే అంతలా వాకింగ్ చేసేవాళ్లంతా ఆరోగ్యం కోసమేనా అన్న సందేహాన్ని లెవెనత్తారు శాస్త్రవేత్త-థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎ వేలుమణి. ఆయన దీనిపై స్వయంగా మూడేళ్లు అధ్యయనం చేసినట్లు కూడా వివరించారు. అలా ఉదయమే నడవడానికి వెనుకున్న ప్రధాన కారణాలేంటో సోషల్ మీడియో పోస్ట్లో చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులోని మూడు పార్కులలో ఉదయం నడిచేవారిపై అధ్యయనం చేశారట. దాదాపు 100 నుంచి 500 మీటర్లు వాకింగ్కి వెళ్లే వారందరిపై ఆయన అధ్యయనం చేశానన్నారు. అయితే అది ఫిట్నెస్ కాదు, క్రమశిక్షణ అంతకంటే కాదట. మరేంటంటే..ఇది హార్మోన్ల ప్రేరేపిత నడకగా తేల్చేశారాయన. అంతేగాదు ఉదయం పబ్లిక్ పార్కుల్లో వాకింగ్ చేసేవారందర్నీ మూడు గ్రూప్లుగా వర్గీకరించి మరి దాని వెనుకున్న కారణాలను వెల్లడించారు.మొదటి రకం..వేలుమణి గమనించి వ్యక్తుల్లో దాదాపు 20% మంది వివిధ వయసుల వారిగా వేగంగా నడవడం, లేదా పరుగెత్తడంలో చాలా యాక్టివ్గా నిమగ్నమై ఉన్నవారు. ఇది కొనితెచ్చుకున్న బలవంతంపై చేసున్న వాకింగ్ అట. వారంతా శ్రేయోభిలాషులు, ఆరోగ్య నిపుణులు మార్గనిర్దేశం ప్రకారం లక్ష్యం ఆధారిత వ్యక్తులట. శారరీక రూపం, ఫిట్నెస్కి కేరాప్ అడ్రస్గా స్ఫూర్తినిచ్చే కేటగిరి వ్యక్తులే వీరు అని చెప్పారు. రెండో రకం..ఆరోగ్య స్ప్రుహతో..40 ప్లస్లో వైద్య అవసరం రీత్యా తప్పక వాకింగ్ చేసే కేటగిరికి చెందినవారట. వీరంతా, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో వాక్ చేసే వ్యక్తులట. అంటే వీళ్లంతా స్వచ్ఛందంగా నడక కోసం వచ్చిన వాళ్లు కాదని "హర్మోన్ల బందీలు"గా వ్యాఖ్యానించారు.ప్రేమ పక్షులు..ఇక మిగతా సముహం 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల యువ జంటల సముహం. ఉదయం పార్కుల్లో వాకింగ్ చేసేవాళ్లలో దాదాపు 30 శాతం యువత కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లు ఫిట్నెస్ లేదా వైద్య పరిస్థితి వంటి కారణాలతో నడవడం లేదని చెప్పారు. కేవలం వాళ్లు పార్కు మూలల్లో నిశబ్దంగా కూర్చొని గడిపేందుకు వస్తుంటారని అన్నారు. ఇది కూడా హార్మోన్ల బలవంతమే అని పేర్కొన్నారు. ఎందుకంటే యుక్త వయసులో సహజంగా వచ్చే ఫీలింగ్స్కి కారణం హార్మోన్ల ప్రభావమనే ఉద్దేశ్యంతో వేలుమణి ఆ విధంగా వ్యాఖ్యానించారు. చివరగా తాను చేసిన ఈ అధ్యయనంలో 80% మంది ఆరోగ్యం లేదా జీవనశైలిలో భాగంగా చేయలేదు. కేవలం హర్మోన్ల ప్రభావం కారణంగానే చేసిన వాకింగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ మూడు రకాల వ్యక్తుల సముహం..“లుకింగ్, డయాబెటిస్, ప్రేమ తదితర మూడు కారణాలతో వాకింగ్ చేస్తున్న వారు. ఇవన్ని హర్మోన్లతో లింక్ అప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఫిట్నెస్ కోసం చేసిన వాకింగ్ కాదు..హార్మోన్లతో ప్రేరేపించబడిన నడక అని పేర్కొన్నారు వేలుమణి. (చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!) -
హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు..!
హెల్త్ వార్నింగ్ మెసేజ్లు సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై ఉండటం చూసే ఉంటాం. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఈ హెచ్చరిక సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలా కనిపిస్తున్నా..ఎలా పొగరాయళ్లు వీటికి అలవాటు పడతారా అని తెగ అనుకునేవాళ్లు చాలామంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు దాదాపుగా అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి జాబితాలోకి నోరూరించే ఈ చిరుతిండ్ల ఇప్పుడు చేరిపోనున్నాయి. తలుచుకుంటేనే తినాలనిపిచే ఆ స్నాక్స్ ఐటెంపై ఇలా వార్నింగ్ మెసెజ్లు ఉంటే ఆహారప్రియుల పరిస్థితి ఊహకందనిది..పొగాకు ఉత్పత్తులపై ఉండే హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు కూడా వచ్చేశాయి. ఇదేంటి ఎంతో ఇష్టంగా ఆ చిరుతిండ్ల అని అవాక్కవ్వకండి. ఎందుకంటే వాటిని తినే మనం చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ ఆహార పదార్థాలపై కూడా ఈ హెచ్చరిక సందేశాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసిందట. త్వరలో ఇది అమలు కానుందట కూడా. నిజానికి మనదేశంలో ప్రతి నలుగులో ఒకరు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. దాన్ని నివారించేందుకు ఇలా సిగరెట్ ప్యాకట్లపై ఉన్నట్లుగానే సమోసాలు, జిలేబీలు మాదిరిగా డీప్ఫ్రై చేసే ఇతర స్నాక్స్పై కూడా హెల్త్ వార్నింగ్ మెసేజ్లు ఉండాలని ఆరోగ్య మత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేగాదు కేంద్ర ఆరోగ్య సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఈ జిలేబీలు, సమోసాలు ఉన్నచోట తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ఆరోగ్య హెచ్చరికలో ఆ ఆహారాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతాన్ని హైలట్ చేస్తారట. కాబట్టి ఇది అచ్చం సిగరెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరిక లేబుల్ వలే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య మంత్రిశాఖ పేర్కొంది. ఇది అవసరమా..ఇటీవల కాలంలో భారతదేశంలో పెరుగుతున్న అనారోగ్యకరమైన జీవనశైలి, ఉద్ధృతమవుతున్న వ్యాధుల ఆందోళనల నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇలా ఆదేశాలు జారి చేసింది. ప్రస్తుతం, ఊబకాయం, చక్కెర, అధిర రక్తపోటు, గుండె జబ్బు వంటి సమస్యల బారిన ఏటా వేలాది మంది పడుతున్నారని, అందుకు ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, జీవనశైలే అని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు 2050 నాటికి సుమారు 449 మిలియన్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. బ్యాన్ కాదు...ఇలా హెల్త్ వార్నింగ్ మెసేజ్ల పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఆయా చిరుతిండ్లను పూర్తిగా నిషేధించడం కాదని స్ఫష్టం చేసింది ప్రభుత్వం. కేవలం ప్రజలకు ఆయా ఆహారపదార్థాలపై అవగాహన కల్పించి ఆరోగ్యంగా జీవించేలా చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ చొరవ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా" ఉద్యమం నుంచి వచ్చిందట. ఆయన పిలుపునిచ్చిన 10% నూనెని తగ్గించి ఆరోగ్యంగా ఉందాం..అలాగే భారతదేశాన్ని మరింత బలోపేతంగా మారుద్దాం అన్న నినాదం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది కేవలం ఆరోగ్య సలహా మాత్రమే గానీ ప్రత్యేకంగా పలాన వంటకాలని పేర్లను ప్రస్తావించలేదని, హెచ్చరిక బోర్డు పెట్టాలని గానీ ఆదేశించలేదని స్పష్టం చేసింది కేంద్రం. (చదవండి: దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!) -
సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ రాక్ డే
హైదరాబాద్ శివార్లలో రెండున్నర బిలియన్ ఏళ్ల క్రితం వెలసిన అరుదైన వారసత్వ రాతి సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కొనియాడారు. అదే లక్ష్యంగా నృత్యం, ఇకెబనా ఎగ్జిబిషన్ ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని సుందరయ్య విజాన కేంద్రంలో నిర్వహించారు. సొసైటీ టు సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్రాక్ డే సందర్భంగా పర్యావరణంలో ముఖ్య భూమికను పోషించే రాతి సంపదను ఆయా దేశాలు ఎలా కాపాడుకుంటారో వివరించారు. నయనతార నందకుమార్ అవర్ సీక్రేడ్ ప్లేస్కు చెందిన వారు అంతరించిపోతున్న రాతి సంపద గురించి డ్యాన్స్ రూపంలో వివరించారు. పుప్పాలగూడలోని పకృద్ధీన్ గుట్ట 400 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, గుట్టను ఎలా ధ్వంసం చేస్తున్నారో, కంచె గచ్చిబౌలిలో పురాతన రాళ్లు, పర్యావరణ విధ్వంసాన్ని వివరించారు. నగర శివార్లలో రెండున్నర బిలియన్ సంవత్సరాల క్రితం వెలసిన రాతి సంపదకు ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని నయనతార వివరించారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాళ్లు, నీళ్లు, చెట్లు ఎలా మమేకమవుతాయో వివరిస్తూ ఓరా స్కూల్ ఆఫ్ ఇకెబనా హైదరాబాద్ చాప్టర్ సభ్యులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చెట్లకు రాళ్లు మినరల్స్ను అందిస్తాయని, రాళ్లలో పక్షలతో పాటు అనేక ప్రాణులు జీవిస్తాయని తెలియజేశారు. పర్యావరణ విచ్ఛిన్నం వల్లే గ్లోబల్వారి్మంగ్, అతి వర్షాలు, వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి అవాంతరాలు వస్తున్నాయని ఓరా స్కూల్ ప్రెసిడెంట్ నిర్మల పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రెసిడెంట్ ఫాతిమా అలీఖాన్, వైస్ ప్రెసిడెంట్ సంగీత వర్మ, జనరల్ సెక్రెటరీ ఫ్రాక్ ఖాదర్ పాల్గొన్నారు. (చదవండి: సామాజిక మాధ్యమాల్లో వైరల్గా ‘గివ్ హిమ్ నోబెల్’ ..!) -
దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!
‘గివ్ హిమ్ నోబెల్’.. గత కొంత కాలంగా ఈ ఒక్క వాక్యం గ్లోబల్ సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలానే కొన్ని వింత వ్యాఖ్యలు చేయగానే, భారతీయ నెటిజన్లు దాన్ని వినోదాత్మకంగా తీసుకుని ట్రోలింగ్ మంత్రంగా మార్చేశారు. ఇలాంటి ట్రోలింగ్ కల్చర్ ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా నగరంలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ అతిగా వినియోగిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్ పుట్టుకొచ్చి నానా హంగామా చేస్తోంది. సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయాలు ఇలా ఒకటేంటి.. ట్రెండింగ్లో ఉన్న ప్రతి అంశం పైనా ట్రోలింగ్ జరుగుతోంది. ఇందులో హ్యూమర్, సెటైర్, సోషల్ కామెంటరీ, ఫన్, సూచనలు తదితర అంశాలు సమ్మిళితంగా ఉంటుంది. సాధారణంగా నగరంలో లక్షల మంది సోషల్ మీడియా యాప్స్ వాడుతున్న వారు ఉండటం, అంతర్జాతీయ అంశాలకు సైతం నగరం వేదికగా ఉండటంతో ఇక్కడ కూడా ట్రోలింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్న మాట. ట్రోలింగ్ ఒక వినోద మాధ్యమంగా ప్రారంభమై, నేడు ఓ సామాజిక ప్రయోగంగా మారింది. అయినా సరే, ఇది బాధ్యతతో వినియోగించాల్సిన సాధనం. హాస్యం చాటుతూనే, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ వంటి డిజిటల్ నగరాలు ఈ మార్పులకు మార్గదర్శకంగా మారాలని నిపుణుల అభిప్రాయం. స్మార్ట్ఫోన్ విప్లవం, డేటా వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికల్లో (ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొదలైనవి) ట్రోలింగ్ ఒక మోడ్రన్ కల్చర్లా మారింది. హైదరాబాద్లోని మిలీనియల్స్, జెన్–జీ తరాలు ప్రత్యేకించి ట్రోల్స్ను వినోదంగా తీసుకుంటూ, వాటిని షేర్ చేయడం ద్వారా మీమ్స్, సెటైర్ వంటి కళలను కొత్త రీతిలో వెలుగులోకి తెస్తున్నారు. మూడు నుంచి ఐదు గంటలు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ విడుదల చేసిన 2024 డిజిటల్ యుసేజ్ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 78 శాతం మంది యువత రోజుకు కనీసం 3–5 గంటల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ ఓ ప్రధాన వినోదపు సాధనంగా మారింది. స్థానిక స్థాయిలో జీహెజ్ఎంసీ పనితీరు, ట్రాఫిక్ సమస్యలు, మినిస్టర్ స్టేట్మెంట్లు మొదలుకొని అంతర్జాతీయంగా ట్రంప్, పుతిన్, ఎలాన్ మస్్కల వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్కు గురవుతున్నాయి. అత్యధికంగా సినిమాలపైనే.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్ చిత్రం విడుదలైనప్పుడు ‘హనుమాన్కి వైఫై ఉంద’ని, థియేటర్లో హనుమాన్కు సైతం ఒక సీట్ వదిలేయాలనే ట్రోల్స్ జోరుగా సాగాయి. నాగ్చైతన్య, సమంత విడాకుల సమయంలో కూడా ‘వెడ్డింగ్ టార్గెట్ 2.0’ అనే పేరుతో కొందరి ఎడిటెడ్ పోస్టర్లు చక్కర్లు కొట్టాయి. నేషనల్ క్రష్గా మారిన రషి్మక మందన సినిమాలో నటిస్తే అది వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని, పూజా హెగ్దే నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఇలాంటి వింత వింత ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ విపరీతంగా ట్రోల్కు గురయ్యారు. తన జెర్సీ నెంబర్ 18, ఈ సారి జరిగిన మ్యాచ్ కూడా 18వ మ్యాచ్ కావడంతో ఇక ట్రోఫీ గెలవరని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే దీనికి విభిన్నంగా 18 ఏళ్ల తరువాత మ్యాచ్ గెలవడంతో ఈ ట్రోలింగ్కు తెలపడింది. కానీ మరుసటి రోజు బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అపశృతి జరిగి క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో మరణించడంతో మళ్లీ ట్రోలింగ్ పుంజుకుని ఒక వారం పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదే ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ఓడినప్పుడు కూడా.. ‘బిర్యానీ తిని ఆట పై దృష్టి సారించలేరనే’ కామెంట్లతో ట్రోల్ చేశారు. సోషల్మీడియా రాజకీయం రాజకీయాల పరంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పారీ్టల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులను సైతం పెట్టుకుని సోషల్ మీడియా ట్రోలింగ్ మీమ్స్ తయారు చేస్తున్నారు. వీటికి ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ వేదికల్లో ప్రత్యేక ఖాతాలు, గ్రూపులు సైతం ఆవిష్కరించారు. తెలంగాణలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య, ఏపీలో వైఎస్ఆర్సీపీ–టీడీపీ మధ్య ట్రోలింగ్ ఎక్కువగా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బీజేపీ పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గ్లోబల్ వేదికగా.. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో.. నువ్వు ఓకే అను ఏసేద్దాం అంటూ పోకిరి సినిమా డైలాగ్స్ను భారత్–ఇజ్రాయెల్ మీమ్స్గా తయారు చేసి పాక్ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ తెలుగు మీమర్స్ చాలా ఉత్సాహంగా, క్రియేటివ్గా ఉన్నారు. ఇదే యుద్ధం సందర్భంగా భారత్–పాక్ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అనే ట్రంప్ స్టేట్మెంట్ ఆధారంగా.. ‘గీవ్ హిమ్ నోబెల్’ అనే ట్రోల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఎలన్ మస్క్ ‘ట్విట్టర్’లో మార్పులపై ‘ఇంతలోనే ట్విట్టర్ మేము మిస్ అవుతున్నాం మస్క్ గారు’ అంటూ ట్రోల్స్ చేశారు. ట్రోలింగ్లోనూ రెండు రకాలు.. పాజిటివ్ వర్సెస్ నెగెటివ్ ట్రోలింగ్. పాజిటివ్లో హ్యూమరస్, సెటైరిక్ ఎక్కువగా ఉంటూ.. సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలతలపై క్రియేటివ్గా విమర్శలు, పౌరుల చైతన్యం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. నెగెటివ్ ట్రోలింగ్లో బులీయింగ్, మోసం వంటి అంశాలను ఎత్తి చూపుతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితాలపై దూషణలు తారా స్థాయికి చేరాయి. ట్రోల్ పేరుతో హేట్స్పీచ్ ఎక్కువ వ్యాప్తిచేస్తున్నారు. కుల, మత, భౌగోళిక అంశాలపైన ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. -
ఈ కళ అమ్మ కల
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఆమె పేరెంట్స్కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.క్రమశిక్షణకు కళకళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.బ్యాడ్ టచ్... టీచ్ హిమ్నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంనాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం. కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.రెస్ట్ నచ్చదునాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).రియాక్ట్ అయ్యే బలంమార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్గా వీక్గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా చేస్తుంది.సైలెంట్గా ఉండొద్దుఅమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్లో సైలెంట్గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.పాలిటిక్స్లోకి...నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.– డి.జి. భవాని -
MorningFood పరగడుపున ఇవి తింటున్నారా?
మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు లో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.ఉదయం వేళల్లో మసాలాలు, డీప్ ఫ్రైస్ తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా కడుపుకి మంచిదే కదా అని పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.చాలామంది బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు ఎదురై.. ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం చాలాప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు.చదవండి : Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు -
లైఫ్స్టైల్ ఇన్ప్లేషన్ : దీన్ని ఎదుర్కోవడం ఎలా?
మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడి పోయారనే! మీ బ్యాంక్ బ్యాలెన్స్ను ఏ నెల చెక్ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్’ (Lifestyle Inflation) అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’! – సాక్షి, స్పెషల్ డెస్క్ సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్ బ్రాండ్లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.‘పెరగటం’నిజం కాదు! మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరు గుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుంచి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని. ఏఐ భయం పొంచి ఉంది! జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏఐ (కృత్రిమ మేధస్సు). ఏఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోల్చుకోవటం జీతానికి చేటు.. తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్గ్రేడ్’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.చిక్కుకోకుండా ఉండాలి జీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్ కార్డులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుంచీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీతం పెరిగీ ప్రయోజనం ఉండదు.ఇదీ చదవండి: యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!ముందస్తు హెచ్చరిక సంకేతాలు..జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని ముందుగా తెలియబరిచే హెచ్చరికలు కొన్ని ఉంటాయి. మొదటి హెచ్చరిక: మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. రెండో హెచ్చరిక: జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్ వేసుకోవటం మానేయటం. మూడో హెచ్చరిక : జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్ను పెంచేయటం. నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి– తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం. అయిదో హెచ్చరిక ఇంటర్నెట్, ఓటీటీల సబ్బ్ స్క్రిపషన్లు పెరగటం.బయట పడే మార్గం ఉంది.. జీవనశైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కలి్పంచండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ. -
యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు! -
ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి!
బొమ్మలు చిన్నపిల్లల కోసమే అనుకుంటారు చాలా మంది. బొమ్మలు పెద్దల్లో ఉన్న పిల్లల కోసం కూడా! బొమ్మలను చూడటం, వాటిని తాకడం, షెల్ఫ్లలో పెట్టుకుని దాచుకోవడంఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అంటారు నిపుణులు. ‘నా చిన్నప్పటి సంతోషాలను ఇప్పటికీ పొందుతున్నాను’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్ (Saylee Padwal). ముంబైలో ఉన్న శైలీ ఇంటికి వెళితే ఇంటి నిండా బొమ్మలే. వీటి సేకరణ కూడా ఒక ఇన్వెస్ట్మెంటే అంటున్న శైలీ పరిచయం. ‘కొత్త బొమ్మ కొన్నప్పుడల్లా నాకు ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్. ఆమె ఇంటికి వెళితే గదులు, అరలు, అల్మారాలు, గోడలు... అన్నీ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే అవేవీ దేశీయమైన బొమ్మలు కాదు. ఈ కాలపు పిల్లలు కూడా తక్కువగా చూసే ఆధునిక బొమ్మలు. చాలా మటుకు చైనా బొమ్మల తయారీ దిగ్గజం పాప్ మార్ట్ తయారు చేసి వదిలేవే. హాట్సునే మికు, స్మిస్కిస్, క్రై బేబీస్... ‘వీటన్నింటి కంటే నాకు లబుడు బొమ్మలు ఇష్టం’ అంటుంది శైలీ పాడ్వాల్.ఫ్యాషన్ డిజైనర్గా దేశ విదేశాలు తిరిగే శైలీ తనకు స్నేహితులెవరైనా ఉన్నారంటే బొమ్మలనే అంటుంది. ‘కొత్త కొత్త బొమ్మలను చూడటం, తాకడం వాటిని ఇంట్లో అలంకరించుకోవడం థెరపీ అనే అనిపిస్తుంది నాకు. బొమ్మలు కేవలం పిల్లలవి కాదు. బొమ్మలకు ఆకారాలుంటాయి. ప్రాణం లేకపోయినా అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో అనుబంధం ఏర్పడుతుంది. బొమ్మలు తోడుంటే ఒంటరితనం బాధ ఉండదు’ అంటుంది శైలీ.ఈ బొమ్మల మీద ఆసక్తి ఆమెకు బార్బీ బొమ్మల నుంచి వచ్చింది. ‘నా చిన్నప్పుడు అమ్మ ప్యాకెట్ మనీ ఇచ్చేది. వాటిని దాచి దాచి మొదటిసారి బార్బీ రెయిన్, బార్బీ సన్డాల్ అనే రెండు బొమ్మలు కొన్నాను. నా చిన్నప్పుడు అవే పెద్ద ఫ్రెండ్స్గా ఉన్నాయి. బొమ్మలను నేను చూసే పద్ధతి, వాటిని అలంకరించే పద్దతి, ఆకర్షణీయమైన బొమ్మలను చూసే పద్ధతి గమనించిన మా అమ్మ నేను ఫ్యాషన్ రంగంలో రాణిస్తానని ఊహించింది. ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం వల్ల బొమ్మల్లోని అంద చందాలు నాకు మరింత బాగా అర్థమయ్యాయి’ అంది శైలీ.అయితే ఇంటి నిండా బొమ్మల్ని చూసి ‘ఇన్ని ఎందుకు’ అని తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. ‘ఈ బొమ్మలు కొని పెట్టడం కూడా ఒక పెట్టుబడే. బొమ్మలు ఎప్పటికప్పుడు మారు తుంటాయి. ఒకసారి వచ్చిన బొమ్మలు మళ్లీ రావు. ఇలా కలెక్ట్ చేసి పెడితే కొన్నాళ్లకు అవి అరుదైనవిగా మారుతాయి. వాటిని భారీ రేటు ఇచ్చి కొనేవారూ ఉంటారు’ అంటుంది శైలీ.చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!పసిపిల్లలు బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోవడం అందరికీ తెలిసిందే. బొమ్మలు మానసిక ఓదార్పుని ఇస్తాయి. దేశీయ బొమ్మలు ఒకప్పుడు పిల్లలందరి దగ్గరా ఉండేవి. ఇప్పుడు ఏ బొమ్మలు లేకపోతే కనీసం టెడ్డీ బేర్ను అయినా పెట్టుకుంటున్నారు. ‘అది మంచిదే’ అంటుంది శైలీ.‘పిల్లలున్న ఇంట్లో బొమ్మలు లేవంటే వారు సరిగా పెరగడం లేదని అర్థం. మరొకటి పిల్లలకు బొమ్మలు ఇచ్చాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పద్దు. వాటితో ఎలా వ్యవహరించాలో పిల్లలకు తెలుసు. వాటిపై ప్రయోగాలు జరిపినా...విరగ్గొట్టినా అదంతా ఎదుగుదలలో భాగంగా చూడాలి’ అంటుంది శైలీ. అయితే మితిమీరిన బొమ్మలను కొనడం ఒక వ్యసనంగా చూసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే శైలిది సేకరణా... లేకుంటే వ్యసనమా... అనిపిస్తుంది. ఒకవేళ వ్యసనమైనా హాని లేని వ్యసనమే అనుకుని సరిపెట్టుకోవచ్చు. ‘మీరేమైనా అనుకుంటే నా బొమ్మల ప్రపంచం నాది’ అంటోంది శైలీ.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! -
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం. అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్ప్తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్తో పాటు ఇన్స్టా, ఫేస్బుక్లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. వైరల్గా మారిన ఈ ఫోక్ సాంగ్స్లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరల్ అయినవి.. కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్లో, ఫేస్బుక్, యూట్యూబ్లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి. ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్స్టా రీల్స్లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి. కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్షాప్లలో హైలైట్గా నిలిచింది. రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్గా మారింది. లైఫ్స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్.. ఈ పాటలు గతంలో టిక్టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్కట్, ఇన్స్టాల్లో వైరల్గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్స్టైల్ ఈవెంట్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. -
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్!
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్ కాదు..రిటైర్మెంట్ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ టెక్నిక్లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్ డైట్లు, అధిక పోషకాహార డైట్లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్ వాష్..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!) -
‘అయ్యో శ్రద్ధా’..! మూడు ఖండాలు, 45 ప్రముఖ నగరాలు..
హైదరాబాద్ నగరం మరోసారి నవ్వుల పండుగకు వేదిక కానుంది. డిజిటల్ హాస్య తార ‘అయ్యో శ్రద్ధా’గా గుర్తింపు పొందిన శ్రద్ధా జైన్ తన అద్భుత స్టాండప్ కామెడీ షో ‘సో మినీ థింగ్స్’ పేరుతో దేశంలో చివరి సారి ప్రదర్శించనుంది. ఈ హృద్యమైన వినోద యాత్ర ఈ నెల 27న హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రదర్శన కేవలం వినోదం మాత్రమే కాదు.. భారతీయ కుటుంబ జీవనాన్ని, మన ఊహల్ని, నిత్యజీవితంలో మినీ మినీ కహానీలను పరిపూర్ణంగా హాస్యంగా మలిచే ఓ అనుభూతిని ప్రదర్శించనుంది. శ్రద్ధా కామెడీ మాయాజాలం మానసిక అంతర్భావాల పరంగా అద్భుతంగా ఉంటుందని అభిమానుల మాట. ఓ చిన్న పిల్లవాడిలా జిజ్ఞాసతో, అమాయకంగా ఆలోచించే తత్వం ఆమె పండించే ప్రతి కథనంలో కనిపిస్తుంది. ‘సో మినీ థింగ్స్’ అనే పేరు కూడా ఆమె ప్రదర్శనలోని మినీ కథలు, మినీ ఎమోషన్స్, మినీ వెర్షన్లకు అద్దం పట్టినట్లే ఉండనుంది. భారతీయ కుటుంబాల్లోని సరదా సంభాషణలు, అపరిచిత సందర్భాల్లో తలెత్తే హాస్యాన్ని తన ప్రత్యేక శైలిలో మలచి ప్రేక్షకులకు అందించడం ఆమె ప్రత్యేకత. ఈ ప్రదర్శనకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న లైవ్ట్రీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోను నిగమ్, హరిహరన్ వంటి సంగీత దిగ్గజాల లైవ్ షోల వేదికగా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా షోను ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ప్రదర్శించి, ఇప్పుడు చివరగా భారత్లో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో భారీ ప్రేక్షకాభిమానంతో ప్రారంభమైన ఈ చివరి టూర్, ముంబై, చెన్నై, హైదరాబాద్ షోతో ముగుస్తుంది. ఈ సందర్భంగా సీఈఓ శరత్ వత్సా మాట్లాడుతూ.‘దాదాపు 90 నిమిషాలు ప్రేక్షకులు నవ్వుల ప్రపంచంలో మునిగి తేలాక వారి మనసు తేలికపడి, హృదయాన్ని హత్తుకునే అనుభూతితో బయటికి రావడం.. ఇదే మాకు సంతృప్తి. 2024లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ‘మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ – ఫిమేల్’ అవార్డును అందుకున్న ఈ ఇంజినీర్, ఆర్జే, కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం కామెడీ ప్రపంచానికి ఒక మైలు రాయిలా మారిపోయింది’ అని తెలిపారు. -
రిమ్ 'జిమ్'.. హోమ్..! కోవిడ్ తర్వాత పెరుగుతున్న ట్రెండ్..
నగరంలో ఆరోగ్యంపై అవగాహనతో పాటు కొత్త కొత్త ట్రెండ్స్ పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం హోమ్ జిమ్స్కు డిమాండ్ ఊపందుకుంటోంది. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు, సంపన్నులకు మాత్రమే పరిమితమైన ఇవి ప్రస్తుతం మధ్యతరగతి ఇళ్లలో సైతం సాధారణంగా మారాయి. బ్యాచిలర్ హోమ్స్లో, కో–లివింగ్ ఫ్లాట్స్లో సైతం నలుగురైదుగురు యువత కలిసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. హోమ్ జిమ్ కాన్సెప్ట్ ఇటీవల కాలంలో నగరంలో స్థిరపడుతోంది. నగరంలో హోమ్ జిమ్ ట్రెండ్ ఊపందుకోడానికి కోవిడ్ పుణ్యమాని వర్క్ కల్చర్లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒక కారణమే. ఇంట్లో అధిక సమయం గడపడం అలవాటవుతున్న పలువురు వృత్తి నిపుణులు ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాల నుంచి ప్రతికూలతల వరకూ ఒకసారి బేరీజు వేసుకోవడం మంచిదని ఫిట్నెస్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. స్థలం ఉంటేనే ఫలం.. ఒక మోస్తరు హోమ్ జిమ్ ఏర్పాటుకు కనీసం 60–100 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని అంచనా. బేసిక్ హోమ్ జిమ్ అయితే 60–80 చదరపు అడుగులు (ఉదాహరణకు బెడ్రూమ్ కార్నర్ లేదా బాల్కనీలో) అలా కాకుండా ఫుల్ సెటప్ చేసుకోవాలంటే.. 100–150 చ.అ. (ఒక ప్రత్యేక గది అయితే మరింత మంచిది) అవసరం అవుతుంది. బడ్జెట్ ఇలా.. హోమ్ జిమ్ బడ్జెట్ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవల్ హోమ్ జిమ్కైతే పెట్టుబడిగా రూ.30,000 నుంచి రూ.50,000 మధ్య సరిపోతుంది. అదే మిడ్ రేంజ్లో వెళ్లాలనుకుంటే రూ.50,000 నుంచి రూ.1.5 లక్షలు, పూర్తి సెటప్ కోరుకుంటే రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ (బ్రాండెడ్ ఎక్విప్మెంట్ను బట్టి మారవచ్చు) వెచ్చించాల్సి ఉంటుంది.ప్రాథమిక పరికరాలు.. ఇంట్లో జిమ్లో ఉండాల్సిన పరికరాల్లో డంబెల్స్ సెట్స్ (రూ.3,000 నుంచి రూ.10,000) రాడ్స్, వెయిట్స్ (రూ.5,000 నుంచి రూ.15,000), బెంచ్ ప్రెస్ (రూ.8,000 నుంచి రూ.20,000) యోగా మ్యాట్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ (రూ.1,000 నుంచి రూ.3,000 ), ట్రెడ్మిల్ లేదా ఎలిప్టికల్ మిషన్ (రూ.20,000 నుంచి రూ.లక్ష) ఆల్ ఇన్ వన్ మల్టీ జిమ్ మిషన్ (రూ.40,000 నుంచి రూ.1.5 లక్షల వరకు), లాట్ మిషన్ (రూ.15,000 నుంచి రూ.25,000)లు కొనుగోలు చేయాలి. ప్రతికూలతలు.. సరైన శిక్షకులు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య. ఒకవేళ ఇంటికి వచ్చి శిక్షణ ఇచ్చే ట్రైనర్స్ను ఎంచుకుంటే వారికి చెల్లించాల్సిన మొత్తం ఆర్థిక భారంగా మారుతుంది. ఒంటరిగా చేయడం వల్ల సరిపడా మోటివేషన్ దొరకదు. వర్కవుట్స్ను వాయిదా వేసే అవకాశం ఎక్కువ. ఎంత వరకూ చేయాలో, ఏ వర్కవుట్ ఎలా చేయాలో తెలుసుకుని చేయకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు. అద్దెకు ఉంటున్న ఇళ్లు అయితే ఇంటి యజమానులతో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా ఇళ్లు మారే సమయంలో ఈ ఎక్విప్మెంట్ భారంగా పరిణమించవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. నగర ట్రాఫిక్లో రాకపోకలకు పట్టే సమయం, ఎండ, వాన తదితర వాతావరణ అడ్డంకులు ఉండవు. జిమ్లో పదుల సంఖ్యలో ఉండే ఇతర సభ్యుల మధ్య చేయడం, కొన్ని సార్లు ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండకపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక్క హోమ్ జిమ్తో కుటుంబ సభ్యులందరికీ వ్యాయామం చేసే అవకాశం లభిస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ చక్కని ఆరోగ్యకర వాతావరణానికి దోహదపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెలవారీగానో, వార్షిక ఫీజు రూపంలోనో చెల్లించాల్సిన జిమ్ మెంబర్షిప్ ఖర్చును దూరం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సన్నిహితులను కూడా కలుపుకుంటే స్వల్ప కాలంలోనే పెట్టుబడి రికవరీ అయినట్టు భావించవచ్చు. -
అప్పుడు బంజరు భూమి... ఇప్పుడు ప్లేగ్రౌండ్
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని మారుమూల గ్రామం... చింద్నార్. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న బంజరు భూమి ఇప్పుడు వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, క్లైంబింగ్ వాల్, లాంగ్ జంప్ పిట్... మొదలైన వాటితో అందమైన ప్లేగ్రౌండ్గా మారింది. ఈ గ్రామంలోనే కాదు దంతెవాడ జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల వెనకాల ఉన్న బంజరు భూములు అందమైన ప్లేగ్రౌండ్స్గా మారి ఆహా! అనిపిస్తున్నాయి.ఈ మార్పుకు కారణం... సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్, మన్ దేశీ ఫౌండేషన్. ప్లేగ్రౌండ్స్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కోచ్లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్లేగ్రౌండ్ నిర్మాణ ప్రక్రియ అనేది కమ్యూనిటీ ఈవెంట్గా మారింది. గ్రామప్రజలు ప్లేగ్రౌండ్ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.మన దేశంలో 65–70 శాతం స్కూల్స్లో సరిౖయెన ప్లేగ్రౌండ్లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రాష్ట్రాలలోనూ తన ప్రాజెక్ట్ను అమలు చేయాలని సంకల్పించాయి సచిన్, మన్ దేశీ ఫౌండేషన్లు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...)