Lifestyle
-
బరువు తగ్గి పీసీఓఎస్ని తిప్పికొట్టింది..! అలాగే ఆ సమస్యలు..
బరువు తగ్గడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చొ తెలిస్తే విస్తుపోతారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే ఎంత మెరుగైన మార్పులు సొంతం చేసుకోవచ్చో అనేందుకు ఈ మహిళే ఉదాహరణ. తాను వెయిట్లాస్తో ఎన్ని లాభాలు పొందిందో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే కాదు..బాడీ మార్పుల తాలుకా ఫోటోలను కూడా షేర్ చేసుకుందామె.ఆ మహిళే దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త నికితా ఫుల్వానీ. చాలామంది బరువు తగ్గడాన్ని రూపానికి సంబందించిదిగా భావిస్తారు.కానీ ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే హార్మోన్ల సమతుల్యత నుంచి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానిపై ప్రభావం ఉంటుందని చెబుతుంది. తాను బరువు తగ్గడం వల్ల ముందుగా తన నెలసరి సమస్యలను పరిష్కారమయ్యాయని, ఆ తర్వాత తన చర్మం నిగారింపు సంతరించుకోవడం మొదలైందని చెబుతోంది. అలాగే ముఖంపై రోమాలు కూడా తగ్గాయని చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా నీరు తాగడం, మంచి ఆహారపు అలవాట్లతో అధిక బరువుని సునాయాసంగా తగ్గించుకున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గాయో కూడా వివరించింది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం నిగారింపు సంతరించకుందని, అలాగే శరీరం యాక్టివ్గా మారిందని అంటోంది. అలాగే చర్మంపై ఇదివరకు ఉన్న మచ్చలు కూడా తగ్గాయని, మేకప్ లేకుండా సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నానని అంటోంది. అధిక చక్కెర తీసుకోవడంతో నోటి చుట్టూ, మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉండేదని పేర్కొంది. అయితే ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన పదార్థాలకు, చక్కెరకు దూరంగా ఉందో ఆ సమస్య చాలమటుకు తగ్గిందని అంటోంది. అలాగే పాదాల సైజు నుంచి మణికట్టు సైజు అన్నింటిలో శరీర మార్పుని చవిచూశానంటోంది. కానీ బరువు తగ్గితే శరీరం ఎంతగా రూపాంతరం చెందుతుందో, మనలో ఎంతటి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయో స్పష్టంగా తెలిసిందని అంటోంది. ప్రస్తుతం తనను చూస్తే..జస్ట్ 25 లేదా 27 ఏళ్లు అని మాత్రమే అనుకుంటారని అంటోంది. కచ్చితంగా బరువు తగ్గితే అక్షరాల యవ్వనంగా మారిపోతామని, మన చర్మకాంతి పెరుగుతుందని చెబుతోంది ఫుల్వానీ. మన జీవనశైలి బాగుంటే అందం, ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయని చెబుతోంది. View this post on Instagram A post shared by Nikita Phulwani (@niggiphulwani) (చదవండి: తొలి ట్రాన్స్జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!) -
రయ్ రయ్..నాలుగు చక్రాల సైకిలోయ్!
తమిళనాడు వెల్లూరులోని వాణివిద్యాలయంలో పదవతరగతి చదువుతున్న శబరివాసన్ నాలుగు చక్రాల సైకిల్ తయారుచేసి ‘ఆహా!’ అనిపించుకున్నాడు. వృథాగా పడి ఉన్న వస్తువులతో ఈ నాలుగు చక్రాల సైకిల్ను తయారుచేయడం విశేషం. ‘ఎవరి సలహాలు, సూచనలు తీసుకోకుండానే మా అబ్బాయి ఈ సైకిల్ను తయారుచేశాడు’ అని సంబరపడిపోతున్నాడు శబరివాసన్ తండ్రి కతిర్వేల్. ఆయన క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శబరివాసన్కు సైకిల్ నుంచి కారు వరకు రకరకాల వాహనాల గురించి ఆసక్తి. వాటిలో ఏ భాగాలు ఉంటాయి? అది ఎలా పనిచేస్తుంది?... మొదలైన వివరాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాలుగు చక్రాల సైకిల్ తయారుచేయడానికి కారణం అయింది.అందుబాటులో ఉన్న వస్తువులతోనే రకరకాల వాహనాలు తయారుచేసిన వ్యక్తుల వీడియోలు తరచుగా చూసేవాడు. ఆ సమయంలోనే తనకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, స్పేర్ ట్యూబ్లను సేకరించి నాలుగు చక్రాల సైకిల్ను తయారు చేశాడు. ఈ వాహనాన్ని తయారుచేయడానికి నెలరోజుల సమయం పట్టింది.‘నేను తయారుచేసిన నాలుగు చక్రాల సైకిల్ను చాలామంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని కొత్త వాహనాలు తయారుచేస్తాను’ అని ధీమాగా అంటున్నాడు శబరివాసన్. (చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్..) -
పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్, ఇంధన సమస్యలు తలెత్తుతాయేమోనని యావత్తు దేశం ఆందోళన చెందింది. సరిగ్గా ఈ సమయంలో విశాఖ తీరానికి ఎల్పీజీ, చమురు నౌకలు ఒక్కొక్కటిగా చేరుకోనుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఇలా యుద్ధం మరేదో విపత్తు కారణంగా మొదట ఇబ్బందులు ఎదురయ్యేది గ్యాస్, చమురు వద్దే. ఇంతవరకు చాలాసార్లు చమురు కష్టాలు చూశాం. కానీ తొలిసారిగా గ్యాస్ కొరత ఎలా ఉంటుందో గత కొన్ని రోజులుగా దాని ఎఫ్క్ట్ని ప్రత్యక్షంగా చూశాం. ఒక్కసారిగా గ్యాస్పై ఆధారపడకుండా వండే ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు చూశారు అంతా. మరోవైపు ఇండక్షన్ స్టవ్లు, కట్టెల పొయ్యిలు ఇలా పలు రకాల ప్రత్యామ్నాయాలు, కొంగొత్త ఆవిష్కరణల దిశగా నిపుణులు అడుగులు వేశారు. అయితే వీటన్నింటికంటే భిన్నంగా అందరికంటే ముందే పొయ్యితో పనిలేకుండా చేసే వంటకాల గురించి ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ చెఫ్ శివకుమార్. పైగా మంట, నూనెతో సంబంధం లేకుండా హాయిగా ఆస్వాదించే రకరకాల వంటకాలను సైతం కనిపెట్టారాయన. మరి అవేంటో..?, ఎలా చేస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.ప్రముఖ చెఫ్ పడయాల్ శివకుమార్ వండకుండా, నూనె లేకుండా వండే ఆహారంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన పచ్చిపదార్థాల్లో సహజ రుచులు, పోషకవిలువల ప్రాముఖ్యతను గ్రహించి ఆయన ఈ దిశగా అడుగులు వేశారు. నూనె తరుచుగా పదార్థాల సహజ రుచిని, దాని పోషక విలువలని తగ్గించేస్తుందట. ఇక ఉడికించడం వల్ల పెద్ద ఎత్తున పోషకాలు ఆవిరైపోతాయి. అందువల్ల ఆ రెండింటితో పనిలేకుండా వండే వంటకాల్లో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి పోషకాలను పొందొచ్చని గట్టిగా నమ్మారు శివ. ఆ నేపథ్యంలోనే మంట, నూనెతో పనిలేకుండా వండే వంటకాలపై అన్వేషించి ఏకంగా..2500 విభిన్న రకాల వంటకాలను తయారు చేసే పద్ధతులను అభివృద్ధి చేశారు. అంతేగాదు కోయంబత్తూర్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన దక్షిణ భారత రా వెగన్ వంటకాలను అందించే 'పడయల్ నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్'ను కూడా ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ "ఆహారమే ఔషధం" అనే శివకుమార్ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రెస్టారెంట్ కారం తక్కువ, రుచిలో ఏమాత్రం తీసిపోని మంచి బోజనాన్ని అందిస్తుంది. 'రా ఫుడిజం'ను ప్రోత్సహిస్తూ, ప్రాసెస్ చేసే ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండేలా చేసి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఈ వంటకాలను అందించడం విశేషం. సహజమైన వంట సంప్రదాయాల వైపుకు అందరూ అడుగులు వేసేలా చేయడమే తన లక్ష్యమని అంటున్నారు. శివ వంటకాలన్ని జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేలా, ఆరోగ్య సమస్యలను పరిష్కరించేవిగా నిరూపితమయ్యాయట కూడా. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..ప్లస్ టూ వరకు రెగ్యులర్గా చదివిన శివకుమార్.. ఆ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఆధ్యాత్మికంపై మక్కువతో వేదాగ్ని మహర్షి వద్ద యోగా అభ్యసించారు. అలా ఆ సంస్థలో పదేళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అక్కడే యోగాసనాలు, ఆరోగ్యకరమైన ఆహారవిధానాలు నేర్చుకున్నారు. అదే ఆయన్ని ఈ ‘పడయల్’ రెస్టారెంట్ వరకు నడిపించింది. యోగా శిక్షణలో ఉన్న వారికి అందించే చిరుధాన్యాలు, మూలికా ఆహారం తీసుకున్న వారి శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం గమనించిన ఆయన ఈ సహజసిద్ధమైన ప్రకృతి ఆహారంపై ప్రయోగాలు చేశారు. అలాగే ఈ వంటకాలు తిన్న చాలామంది తమ ఆరోగ్య సమస్యలు నయమైనట్లు చెబుతుండడంతో ప్రకృతి ఆహారంపై మరింతగా అన్వేషణ చేసినట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Padayal No Oil No Boil (@padayal_nooil_noboil) (చదవండి: అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..) -
గొడవలను పరిష్కరించే నేర్పు
మీరు సామాజికంగా లేదా వృత్తిపరంగా ఎదుగుతున్నప్పుడు, భిన్నాభిప్రాయాలు రావడం సహజం. ఆ భిన్నాభిప్రాయాలు 'గొడవలు'గా (Conflicts) మారి సంబంధాలను దెబ్బతీయకుండా, వాటిని ఒక పరిష్కారం వైపు నడిపించడమే 'Conflict Resolution'. నిజమైన మేధావి గొడవలను గెలవాలని చూడడు, గొడవలను 'ముగించాలని' చూస్తాడు. గొడవలు అనేవి మనుషుల మధ్య ఉండే 'గ్యాప్' వల్ల వస్తాయి. చాలామంది గొడవ అనగానే అది ఒక యుద్ధం అనుకుని, గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రొఫెషనల్ వరల్డ్ లో గొడవను గెలవడం అంటే అవతలి వ్యక్తిని ఓడించడం కాదు, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని కనుగొనడం.గొడవలు ఎందుకు వస్తాయి? సైకాలజీ ప్రకారం, గొడవలకు ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి.Communication Gap: ఒకరు చెప్పింది మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం.Ego Clash: "నేను చెప్పిందే కరెక్ట్" అనే అహంకారం అడ్డు రావడం.Conflicting Interests: ఒకరి అవసరాలు మరొకరి అవసరాలకు విరుద్ధంగా ఉండటం.వీటిని గుర్తించినప్పుడే మీరు పరిష్కారం వైపు అడుగు వేయగలరు.థామస్-కిల్మాన్ మోడల్ (TKI Model)గొడవలను ఎదుర్కోవడానికి మనుషులు ఐదు రకాల పద్ధతులను వాడుతుంటారు.Competing (పోటీ): నేనే గెలవాలి, అవతలి వారు ఓడిపోవాలి. (Win-Lose)Avoiding (తప్పించుకోవడం): గొడవ వద్దు అని అసలు విషయం మాట్లాడకుండా ఉండటం. (Lose-Lose)Accommodating (సర్దుకుపోవడం): అవతలి వారు చెప్పిందే సరే అనడం. (Lose-Win)Compromising (రాజీ): ఇద్దరం కొంచెం తగ్గి మధ్యలో ఒక చోట కలవడం.Collaborating (సహకారం): ఇద్దరికీ లాభం కలిగే కొత్త మార్గాన్ని వెతకడం. (Win-Win)ఒక 'జీనియస్ పర్సనాలిటీ' ఎప్పుడూ Collaborating లేదా Compromising పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తుంది.మోటివేషన్ మాయ vs రియల్ రిజల్యూషన్మోటివేషన్ "నీ పవర్ ఏంటో చూపించు, నిన్ను తక్కువ చేసిన వాడికి బుద్ధి చెప్పు" అని రెచ్చగొడుతుంది. ఇది గొడవను ఇంకా పెంచుతుంది.సైకాలజీ "ముందు అవతలి వ్యక్తిని ప్రశాంతంగా విను (Active Listening). వారికి ఏం కావాలో అర్థం చేసుకుంటే, గొడవ సగం పరిష్కారం అవుతుంది" అని చెప్తుంది (De-escalation).గొడవలను పరిష్కరించే ఫార్ములాGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, గొడవలను ఎలా డీల్ చేయాలి?Step 1: Break Emotional Attachment గొడవ జరుగుతున్నప్పుడు మీలోని ఆవేశాన్ని, అహాన్ని 'Break' చేయండి. "నేను గెలవాలి" అనే ఆలోచన కంటే "సమస్య పరిష్కారం అవ్వాలి" అనే ఆలోచనపై దృష్టి పెట్టండి. ఒక అడుగు వెనక్కి వేయడం అంటే ఓడిపోవడం కాదు, అది ఒక 'స్ట్రాటజీ'.Step 2: Build Empathy Bridgeఅవతలి వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారి కోణం నుండి ఆలోచించండి. "నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నా ఇబ్బంది ఇది..." అని సంభాషణను సానుకూలంగా 'Build' చేయండి. మీరు వారిని అర్థం చేసుకున్నారని వారికి తెలిస్తే, వారు కూడా తగ్గుతారు.Step 3: శాశ్వత పరిష్కారంకేవలం ఆ క్షణానికి గొడవ ఆపడం కాదు, మళ్ళీ అలాంటి సమస్య రాకుండా ఒక 'సిస్టమ్'ని క్రియేట్ చేయండి. గొడవ పడిన వ్యక్తితో కూడా మళ్ళీ మంచి సంబంధాన్ని నెలకొల్పడమే 'Beyond' స్టేజ్. ఒక శత్రువుని మిత్రుడిగా మార్చుకోవడమే నిజమైన విజయం.మీ రిజల్యూషన్ స్టైల్ ఏంటి?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.గతంలో మీరు పడిన ఒక పెద్ద గొడవను గుర్తు తెచ్చుకోండి. అక్కడ మీరు పోటీ పడ్డారా లేక సహకరించారా?గొడవ జరుగుతున్నప్పుడు మీరు అవతలి వ్యక్తి మాటలను పూర్తిగా వింటున్నారా?మీరు గొడవ పడిన తర్వాత ఆ వ్యక్తితో మీ సంబంధం ఎలా ఉంది?శాంతియే అసలైన శక్తి!బ్రో, గొడవ పడటానికి బలం ఉంటే సరిపోతుంది, కానీ గొడవను ఆపడానికి 'వ్యక్తిత్వం' ఉండాలి. సమాజంలో లేదా ఆఫీసులో అందరూ మిమ్మల్ని ఒక Peace Maker లాగా చూడాలి. ఎక్కడ గొడవ జరిగినా మీరు వస్తే అది పరిష్కారం అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించడమే మీ పర్సనాలిటీకి అసలైన గౌరవం.గుర్తుంచుకోండి "The quality of your life is determined by the quality of your relationships, and the quality of your relationships is determined by how you handle conflicts."(చదవండి: రూ. 41 లక్షల జీతం వద్దనుకుని కవయిత్రిగా..!) -
అనుగ్రహబలమివ్వు సీతారామా!
‘శ్రీరాముని అనుగ్రహబలమే బలము’ అన్నాడు త్యాగయ్య. రాముని అనుగ్రహం అతి సులువు. మాటకు కట్టుబడుట... మంచికి కట్టుబడుట... ఇవి చేస్తే చాలు. అయిననూ ఆయన మనయందు పరాకుగా ఉంటే ఒక మాట చెప్పేందుకు సీతమ్మ తల్లి ఉండనే ఉందిగా. సీతాసమేతుడైన ఆ దివ్యమూర్తి జన్మదినమూ, వివాహమూ లోక విశేషము. పొందగలిగినన్ని వరములు ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.స్థితప్రజ్ఞతరేపే పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, ఆ పట్టాభిషేకం ఆగిపోయి, అడవికి వెళ్లాలని తెలిసినప్పుడు కుంగిపోలేదు. తండ్రిని నిందించలేదు, పినతల్లి కైకేయిని ద్వేషించలేదు. ఆ క్షణంలో ఆయన చూపిన నిలకడ స్థితప్రజ్ఞకి పరాకాష్ట. అత్యంత ఒత్తిడిలో కూడా విచక్షణ కోల్పోకుండా ఉండటం ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణం.కృతజ్ఞత ఎవరైనా వంద తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా, వారు చేసిన ఒక్క చిన్న మేలును కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప గుణం రాముడిది. కృతజ్ఞత చూపడంలో రాముడు ఒక మార్గదర్శి.ధర్మబద్ధతరాముడిని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటే ధర్మానికి ప్రతిరూపంగా పేర్కొంటారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. రాముడి బాణం దెబ్బ తొలుతగా రుచి చూసిన మారీచుడే. అంటే శత్రువు చేత కూడా ప్రశంసలు పొందేంతటి ధర్మగుణం కలవాడన్నమాట. ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మిన సత్యం, ధర్మం నుంచి తప్పుకోకపోవడం ఆయన గొప్పతనం. -
ఐరన్ అప్తో.. ప్రపంచ రికార్డు
ఐరన్ డెఫిషియెన్సీ(ఐడిఏ)పై అవగాహన పెంచే క్రమంలో అంతర్జాతీయ పోషకాహార సంస్థ దానోన్ ఇండియా నిర్వహించిన కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని భాగ్యనగరంలోని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య నిపుణులు రక్తహీనతను ఎదుర్కొనే విషయంలో పాలుపంచుకుంటామని ప్రమాణం చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. 2025 నవంబర్లో ప్రారంభించిన ‘ఐరన్ అప్’ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించారు. ఈ కాంపెయిన్లో భాగంగా వైద్యులు అవగాహన పెంపు, సమయానుకూల నిర్ధారణ, పోషకాహార ప్రాముఖ్యతపై కృషి చేయాలని సంకల్పించారు. పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు సహా అనేక మంది వైద్య నిపుణులు కార్యక్రమంలో భాగమయ్యారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువుల్లో రక్తహీనతను తగ్గించేందుకు డానోన్ ‘స్వస్థ మాత స్వస్థ బాలక్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని బీహార్లో అమలు చేస్తోంది. ఈ సందర్భంగా డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ.. ‘ఈ గుర్తింపు వైద్య సమాజం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమో చూపిస్తుంది అని తెలిపారు. -
పెళ్లి చేసుకోకుంటే ఇదంతా చేసేవాడిని కాదు..!: రిషి సునాక్
'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే మూడు గంటల ఎపిసోడ్లో, జెరోధా సహ వ్యవస్థాపకుడు బిలియనీర్ నిఖిల్ కామత్ యూకే మాజీ ప్రధాని రిషి సునాక్, భార్య అక్షతా మూర్తితో సరదా సంభాషణ నిర్వహించారు. ఆ సంభాషణలో నాయకత్వ వైఫల్యం, గుర్తింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ఆర్థికవ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రముఖ పోడ్కాస్ట్కు అతిథులుగా వచ్చిన తొలి జంట రిషి సునాక్, అక్షతామూర్తిలే. ఆ పాడ్కాస్లో ఈ దంపతులు షేర్ చేసుకున్న అమూల్యమైన విషయాలేంటో చూద్దామా..!.ఆ పాడ్కాస్ట్లో రిషి ప్రధాని అనతరం లైఫ్, నేర్చుకున్న పాఠాలు, రాజకీయాల్లో కొనసాగనున్నారా?, యువ భారతీయులకు మార్గనిర్దేశం వంటి పలు అంశాలపై మాట్లాడగా, మూర్తి వారసత్వ విజయంలో ఉండే సవాళ్లు, తన గుర్తింపు, కుటుంబ అంచనాలు, తమ అభిప్రేయ బేధాల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.ఇక్కడ రిషి పదవి నుంచి వైదొలగిన అనతరం దీన్ని రాజకీయ ఓటమిగా కాకుండా, అరుదైన మానసిక పునఃప్రారంభంగా అభివర్ణించారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం.. తర్వాత ఏం చేయాలో అస్సలు తనకు తెలియలేదన్నారు. అయితే ఈ విరామ సమయంలోనే తనకు ఏం చేయాలి, ఏం కావలనేది క్షణ్ణంగా తెలుసుకోగలిగాను అన్నారు. ఇక్కడ మనల్ని మనం బాధతుగా భావించుకోకూడదు, ఆ రాజకీయ ఓటమిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలన్నారు. అంతేగాదు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాను ప్రస్తావిస్తూ..ఈ టైంలో కర్తవ్యంపై దృష్టి పెట్టడం సరైనది అని చెప్పారు రిషి. అలాగే భారతీయ వినియోగ విప్లవాన్ని తరాల మార్పుగా అభివర్ణించారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఎన్నడూ చేయనంత స్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కొన్న వస్తువులు పిల్లల్లు కొనడం లేదు. ఈతరానికి కొత్తబ్రాండ్లు, స్వదేశీ ఉత్పత్తులు, ప్రామాణికత కావాలని అన్నారు. అంతేగాదు భారతీయ తల్లిదండ్రులు విద్యను మెరుగైన జీవితానికి కీలకంగా చూస్తారన్నారు. తాను కూడా తన తల్లిదండ్రలును ఆ విషయంలో బాగా నిరాశపరిచనట్లు తెలిపారు. తన పేరెంట్స్ డాక్టర్ కావాలనుకుంటే..బదులుగా తాను రాజకీయాలు ఎంచుకున్నానని అన్నారు. అలాగే విద్య భవిష్యత్తు గురించి మాట్లాడుతూ కామత్ కాలేజ్కి వెళ్లకపోవడంపై అభద్రతాభావం వ్యక్తం చేయగా..సునాక్ ఇక్కడ నేర్చుకునే సామర్థ్యం ముఖ్యం అని చెప్పారు. ఇప్పడు చాలామటుకు పరిశోధన కోసం క్లాడ్, ఐఏ సాధనాలు వినియోగిస్తున్నా..తాను మాతరం స్వయంగా ఆలోచించడానికే ప్రాధాన్యత ఇస్తా, అలాగే తన ప్రసంగాలు, వాదనాలు తానే స్వయంగా రాసుకుంటానని చెప్పారు రిషి. అంతేగాదు యువత రాకీయాల్లోకి రావడంపై కూడా రిషి మాట్లాడారు. చాలా స్థైర్యం, సహనం, సేవా దృక్పథం ఉంటే తప్పక రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ఆ మూడు లక్షణాలు ఉంటేనే 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగల శక్తి వస్తుందన్నారు. ఇక అక్షతామూర్తి ఈ సంభాషణలో తన ఐడెంటిటీ గురించి మాట్లాడారు..తాను బ్రిటిష్ యాసతో మాట్లాడే బెంగళూరు అమ్మాయినని చెప్పారు. తన భర్త ప్రధాని, తండ్రి వ్యవస్థాపకుడు..కానీ ఇవేమి తన గుర్తింపు కాదని, తన ప్రభావమే తన ఐడెంటీటిగా మార్చుకుంటానని అన్నారామె. చివరగా ఆ పాడ్కాస్ట్లో ఇద్దరిలో తమకు నచ్చే అంశాల గురించి కూడా షేర్ చేసుకున్నారు. రిషి పనిచేసేముందే క్షణ్ణంగా ఆలోచిస్తే..తాను మొదలు పెట్టాక..ఏం చేస్తే బెటర్ అని ఆలోచించుకుంటానని అన్నారు అక్షతా. ఇక పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో రిషి విశ్లేషణను విశ్వసిస్తానని, ఆయన తన సూక్ష్మదృష్టిని నమ్ముతాడని అక్షతా చెప్పుకొచ్చారు. ఇక సునాక్ వైవాహిక బంధం వల్ల ఇదంతా చేయగలిగాను..ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తన భార్యకే క్రెడిట్ ఇస్తూ..ఆమె మద్దతు లేకుండా ఏమి చేయలేనని అన్నారు రిషి. View this post on Instagram A post shared by Nikhil Kamath (@nikhilkamathcio) (చదవండి: హైరాక్స్ ఫిట్నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!) -
హైరాక్స్ ఫిట్నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!
సాధారణంగా మారథాన్, ఫుల్ మారథాన్.. వంటి పలు రకాల ఫిట్నెస్ ఫార్మాట్లో వృద్ధులు సైతం పాల్గొని రికార్డులు తిరగరాశారు. వాటన్నింటకంటే ఇటీవల సరికొత్తగా హైరాక్స్ అనే ఫిట్నెస్ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఫిట్నెస్ ఔత్సాహికులు ఈ ట్రెండ్ని ఆదరిస్తున్నారు కూడా. అయితే ఇది సాధారణ మారథాన్ వలే జస్ట్ పరుగు కాదు..మల్టీటాస్కింగ్ వర్కౌట్లుగా చెప్పొచ్చు. కాస్త క్లిష్టతరమైనది కూడా. అలాంటి కఠినమైన హైరాక్స్ ఫంక్షనల్ రేసింగ్ పోటీలో ఓ 72 ఏళ్ల మహిళ అవలీలగా రికార్డు నెలకొల్పింది. పైగా ఆమె తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఈ ఘనత సృష్టించడం విశేషం. ఎవరామె..? అంత ఏజ్లో ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..స్కాట్లాండ్కి చెందిన 72 ఏళ్ల కరోల్ మున్నో అనే మహిళ ఈ ఘనతను సృష్టించింది. ఏకంగా మూడుసార్లు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ హైరాక్స్ ఫిట్నెస్ రేసులో రికార్డు నెలకొల్పిందామె. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఫిట్నెస్ రేసులలో ఒకటైన హైరాక్స్లో రికార్డులు బద్దలు కొట్టి అంచనాలకు మించి సత్తా చాటిందామె. ఈ హైరాక్స్ రేసులో పాల్గొన్న అత్యంత పైబడిన వారిలో ఒకరిగా..తన సహచర క్రీడాకారిణిలో పోటీపడి ఈ రికార్డుని సృష్టించింది. ఈ రేసు వ్యాయామం, ఓర్పుతో కూడిన పరుగు. చాలా ఓర్పుతో చేయాల్సి పోటీ ఇది. ఆమెకు మూడు హిప్ రీప్లేస్మెంట్లు జరిగాయి. అంటే అధిక శారీరక ప్రభావం చూపే కార్యకలాపాలను పరిమితం చేసే పరిస్థితి ఆమెది..అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ అవలీలగా ఈ క్లిష్టమైన రేసులో సత్తా చాటి స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ. హైరాక్స్ అంటే..ఇదొక గ్లోబల్ ఇండోర్ ఫిట్నెస్ రేస్. ఇందులో ఎనిమిది.. ఒక కిలోమీటరు పరుగు తోపాటు స్లైడ్పుష్లు, రోయింగ్, బర్పీలు, వెయిటెడ్ లంజెస్ వంటి ఎనిమిది ఫంక్షనల్ వర్కౌట్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంలే ఒకేసారి బలం, ఓర్పు, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి రూపొందించిన రేసింగ్ ఫార్మాట్ ఇది. సాంప్రదాయ మారథాన్లు లేదా జిమ్ పోటీల వలె కాకుండా, అత్యంత కఠినంగా, విభిన్నంగా ఉంటుంది. అలాంటి కఠినతరమైన ఈ రేసును వయసు పైబడి, అందులోనూ శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న వారికి పూర్తి చేయడం అత్యంత కష్టం. కానీ ఈ స్కాటిష్ బామ్మ అచంచలమైన పట్టుదల ఉంటే ఈ శారీరక ఇబ్బందులు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి..సాధారణంగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి ఆపరేషన్లు చేయించుకుంటే..వారిని అధిక ప్రభావం చూపే వ్యాయమాల విషయంలో కేర్ఫుల్గా ఉండమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఈ 72 ఏళ్ల బామ్మ ఆ అభిప్రాయాన్నే అందరూ ఆశ్చర్యపోయేలా తిరగరాసింది. అయితే ఈ బామ్మ క్రమం తప్పకుండా వర్కౌట్ల శిక్షణ తీసుకోవడం తోపాలు పలు రకాల వ్యాయామాలు మార్చుతుండటం వల్ల హైరాక్స్లో సులభంగా రాణించగలిగేలా ఓర్పుతో కూడిన బలం సంపాదించుకుంది. అలాగే వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించింది కూడా. కాగా ఈ సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ హైరాక్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో ఎక్కువగా జరుగుతాయి.(చదవండి: పర్యాటక అద్భుతం..'రివర్కేఫ్'గా వంతెన!) -
హీరోయిన్ చేస్తానని నా భార్యను తీసుకెళ్లాడు సార్..!
నాకు నలభై సంవత్సరాలు. నా భార్య స్వాతికి ముప్పై సంవత్సరాలు (పేర్లు మార్చబడినవి). మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమె చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే వంటలు చాలా బాగా చేస్తుంది. అయితే నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం ఆమెకు ఎక్కువ. కోవిడ్ సమయంలో సరదాగా యూట్యూబ్లో వంటల వీడియోలు చేయడం ్రపారంభించింది. మొదట్లో మంచి వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. కానీ తరువాత వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరగలేదు. అదే సమయంలో రీల్స్ ట్రెండ్ మొదలైంది. దాంతో ఆమె వంటలు తగ్గించి చిన్నచిన్న డ్యాన్సులు, స్కిట్స్ చేయడం ్రపారంభించింది. ఇతరుల మాదిరిగా తనకు వ్యూస్ రావడం లేదని రొమాంటిక్ పాటలకు, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఈ లోపు సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, తరువాత ఆమెను హీరోయిన్ని చేస్తానని నమ్మబలకడంతో ఆమె నేను ఎంత చెప్పినా వినకుండా హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అతను రెండు మూడు చిన్న సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం త్వరలోనే హీరోయిన్ అవుతానని నమ్ముతోంది. ఆ వ్యక్తి ఆమెను ప్రలోభపెట్టి అన్ని రకాలుగా తన వైపు తిప్పుకుంటున్నాడని అర్థమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సర్దిచెప్పకపోగా మా కూతురు హీరోయిన్ అవుతుందని, నేను అనవసరంగా అనుమానాలు పెంచుకుంటున్నానని నా మీదనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – నరసింహారావు, విజయవాడమీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో అర్థమవుతోంది. ఒకవైపు బాధ, మరోవైపు అవమానం, కోపం, నిరాశ ఇవన్నీ కలగలిసిన పరిస్థితి మీది. ఇక మీ భార్య విషయానికి వస్తే, ఆమెకు ముందు నుంచే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆకాంక్ష ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొందరిలో ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు రావడం మాత్రమే వారికి చాలా ముఖ్యం. యూట్యూబ్లో వంటల వీడియోల ద్వారా కొంతకాలం ఆమెకు ఆ గుర్తింపు వచ్చింది. కానీ వ్యూస్, సబ్స్క్రైబర్లు తగ్గడంతో ఆమె రీల్స్, ఇతర వీడియోల వైపు వెళ్లి ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కొత్తగా ప్రయత్నిస్తున్న మహిళలను ప్రలోభపరుస్తుంటారు.ఇలాంటి సమయంలో మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకువెళ్లడం చాలా ముఖ్యం. మొదటగా.. ఆమె చేస్తున్న ప్రతి దాన్ని పూర్తిగా తప్పు అని చెప్పి, ఆపమని ఒత్తిడి చేస్తే ఆమె ఇంకా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. బదులుగా ‘‘నీ ప్రయత్నాలకు నేను కూడా తోడుగా ఉంటాను’’ అనే విధంగా మాట్లాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవసరమైతే కొంతకాలం ఆమెతో కలిసి ఆడిషన్లకు వెళ్లడం ద్వారా ఆమె ఒంటరిగా ఉండే పరిస్థితి తగ్గుతుంది. రెండవది.. సినిమా రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న... లేదంటే స్థిరపడిన వ్యక్తులతో ఆమె మాట్లాడేలా చూడండి. ఆ రంగంలో ఉన్న కష్టాలు, వాస్తవ పరిస్థితుల గురించి వాళ్లు చెబితే కొన్నిసార్లు అది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మూడవది.. మీ పిల్లల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్లు ఈ పరిస్థితి వల్ల ఒత్తిడికి గురికాకుండా చూడాలి. అవసరమైతే కొంతకాలం వారిని హాస్టల్లో చేర్పించండి. నాలుగవది.. మీ అత్తమామలతో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ‘‘ఆమె నటనావకాశాల కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె భద్రతే నాకు ముఖ్యం’’అని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఇంతేకాదు.. చట్టపరమైన విషయాల గురించి కూడా మీరు అవగాహన కలిగి ఉండటం మంచిది. ఆ వ్యక్తి నిజంగా మోసం చేస్తున్నాడని అనిపిస్తే సంబంధిత ఆధారాలను సేకరించండి. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని బలవంతంగా మార్చడం సాధ్యం కాదు, ఆమె సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారని గమనించాలి. కాబట్టి మనం చేయగలిగేది ఓపికగా ప్రయత్నించడం, అదే సమయంలో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా ఉండడం మాత్రమే! పరిస్థితి క్లిష్టంగా అనిపిస్తే ఒక మంచి క్లినికల్ సైకాలజిస్టు లేదా సైక్రియాట్రిస్టు దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు మనశ్శాంతి కోల్పోకుండా మీ శ్రేయోభిలాషులతో కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. ఒక్కోసారి జీవితంలో మనం అన్నీ అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఓపిగ్గా ముందుకెళ్లండి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఆన్లైన్ ప్రపంచంలో మీ ప్రవర్తన
ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా కలవకముందే, అతని ఆన్లైన్ ప్రొఫైల్ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం. మీరు లింక్డ్ఇన్ లో ఏం పోస్ట్ చేస్తున్నారు, వాట్సాప్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈమెయిల్స్ ఎలా రాస్తున్నారు అనేదే మీ 'Digital Personality'.ఈ డిజిటల్ ప్రపంచం ఒక గోడ లేని గది లాంటిది. ఇక్కడ మీరు చేసే ప్రతి చిన్న పని ఒక రికార్డ్గా మిగిలిపోతుంది. ఆన్లైన్లో మీరు ప్రదర్శించే ప్రవర్తన మీ ప్రొఫెషనల్ కెరీర్ ని నిర్మించగలదు లేదా దెబ్బతీయగలదు. ఒక పరిణతి చెందిన వ్యక్తిగా డిజిటల్ స్పేస్లో మీరు పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి.The Internet Never Forgets...చాలామంది సోషల్ మీడియాలో ఆవేశంగా కామెంట్స్ చేస్తుంటారు లేదా అనవసరమైన పోస్టులు పెడుతుంటారు. కానీ గుర్తుంచుకోండి మీరు డిలీట్ చేసినా, ఇంటర్నెట్ లో ఏదో ఒక మూల మీ డేటా ఉంటుంది (Digital Footprint). భవిష్యత్తులో మీరు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు మీ పాత డిజిటల్ ప్రవర్తన మీకు అడ్డంకి కాకూడదు.ప్రస్తుతం 70% కంటే ఎక్కువ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసే ముందు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ని చెక్ చేస్తున్నాయి. మీ పోస్టులు మీ 'బాధ్యత'ను ప్రతిబింబించాలి.Messaging & Emailing Etiquetteఆన్లైన్ లో మనం కేవలం పదాల ద్వారానే కమ్యూనికేట్ చేస్తాం. అక్కడ మన బాడీ లాంగ్వేజ్ కనిపించదు, కాబట్టి పదాల ఎంపిక చాలా ముఖ్యం.ఆఫీస్ గ్రూపుల్లో రాత్రి వేళల్లో వాట్సప్ మెసేజ్ చేయకపోవడం, అనవసరమైన ఫార్వర్డ్స్ పంపకపోవడం కనీస మర్యాద. ప్రతి చిన్న విషయానికి ఫోన్ కాల్ చేయకుండా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా పర్మిషన్ అడగడం ఒక ప్రొఫెషనల్ పద్ధతి.ఈమెయిల్స్ లో సబ్జెక్ట్ లైన్ స్పష్టంగా ఉండాలి. ఎదుటివారి సమయాన్ని గౌరవిస్తూ విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి. 'Capital Letters' లో రాయడం అంటే ఆన్లైన్ భాషలో అరవడంతో సమానం, కాబట్టి దాన్ని నివారించండి.మోటివేషన్ మాయ vs డిజిటల్ రియాలిటీమోటివేషన్ "నీ మనసులో ఉన్నది ధైర్యంగా సోషల్ మీడియాలో చెప్పు, భయపడకు" అని చెప్తుంది."నీ అభిప్రాయం చెప్పేటప్పుడు అది ఎవరిని నొప్పించకుండా, నీ బ్రాండ్ వాల్యూని తగ్గించకుండా ఉందో లేదో చూసుకో" అని సైకాలజీ చెప్తుంది. ఆన్లైన్ లో 'రియాక్ట్' అవ్వడం కంటే 'రెస్పాండ్' అవ్వడం ముఖ్యం. ఇదే సోషల్ ఇంటెలిజెన్స్. డిజిటల్ ప్రెజెన్స్ ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ డిజిటల్ పర్సనాలిటీ ఇలా ఉండాలి.Step 1: Break Digital Noise అపరిచితులతో ఆన్లైన్ వాదనలు (Online arguments), నెగటివ్ కామెంట్స్ చేయడం వంటి అలవాట్లను 'Break' చేయండి. మీ శక్తిని, సమయాన్ని వృథా చేసే డిజిటల్ పనులకు దూరంగా ఉండండి. మీ ప్రొఫైల్ లో ఉన్న నెగటివిటీని క్లీన్ చేయండి.Step 2: Build Value Additionమీరు ఒక విషయాన్ని పోస్ట్ చేస్తున్నారంటే, అది చదివేవారికి ఏదో ఒక రకమైన 'విలువ'ను ఇవ్వాలి. అది ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు. మీరు ఏ రంగంలో నిపుణులో ఆ రంగానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ మీ 'అథారిటీ'ని 'Build' చేయండి.Step 3: Digital Leadershipఆన్లైన్ లో కూడా ఒక నాయకుడిలా ప్రవర్తించండి. ఇతరుల విజయాలను మెచ్చుకోండి, ఎవరైనా తప్పు చేస్తే పబ్లిక్ గా కాకుండా ప్రైవేట్ గా చెప్పండి. మీ డిజిటల్ ప్రెజెన్స్ చూసి నలుగురు స్ఫూర్తి పొందాలి. ఇదే 'Beyond' స్టేజ్.డిజిటల్ ఇమేజ్ ఎలా ఉంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? అది మీకు నచ్చుతుందా?మీ సోషల్ మీడియా ఫీడ్ చూస్తే మీ గురించి ఒక కొత్త వ్యక్తికి ఏమనిపిస్తుంది?ఆన్లైన్ లో మీరు ఇచ్చే కామెంట్స్ మీ సంస్కారాన్ని ప్రతిబింబిస్తున్నాయా?మీ స్క్రీనే మీ అద్దం!బ్రో, ఆన్లైన్ లో మీరు చేసే ప్రతి క్లిక్ మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తోంది. డిజిటల్ మర్యాద అనేది ఒక స్కిల్ మాత్రమే కాదు, అది మీపై మీకు ఉన్న గౌరవం. అక్కడ మీరు ఎంత హుందాగా ఉంటే, నిజ జీవితంలో మీకు అంతటి గుర్తింపు లభిస్తుంది."Be the same person online as you are offline—respectful and authentic."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Professional Mask: ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?) -
పర్యాటక అద్భుతం..'రివర్కేఫ్'గా వంతెన!
మనసు పెట్టాలే గానీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అందుకు నిదర్శనం చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఆ వంతెన. మన సాయుధ బలగాలు ఆ వంతెనకు ప్రాణంపోసి కొత్తరూపం ఇచ్చారు. చెప్పాలంటే..అద్భుతమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చేశారు. అదంతా ఎక్కడ అంటే..సాధారణంగా మంచి కేఫ్కి వెళ్లి ఓ కప్పు కాఫీ లేదా టీ సిప్ చేసి ఎంజాయ్ చేస్తాం. అలా కాకుండా ప్రకృతి మధ్య కొలువుదీరి..కింద జలజల పారే నది నడుమ కాఫీ/టీ తాగుతుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. అలాంటి అనుభూతి కోసం అరుణాచల్ ప్రదేశ్లోని రివర్ కేఫ్కి రావాల్సిందే. న్గ్యామ్జాంగ్ చూ నదిపై కొలువుదీరిన కేఫ్ ఇది. ఎన్నాళ్లుగానో వాడుకలో లేని వంతెనని భారత సైన్యం కేవలం 31 రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వంతెనను కేఫ్గా మార్చి అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. వచ్చే పర్యాటకులు గల గల పారే నదిని తమ పాదాల కింద నుంచి చూస్తూ..చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ..భోజనం చెయ్యొచ్చు. ఆ కేఫ్ని గాజు భవంతిలా తీర్చిదిద్దడం విశేషం. సందర్శకులు వంతెనపైనే లేదా నదీ తీరంలోని కేఫ్ విభాగంలో కూర్చోవడానికి ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కటి విభిన్నమైన అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఆపరేషన్ సద్భావనలో భాగంగా, భారత సైన్యం కేవలం 31 రోజుల్లో ఈ కేఫ్ను నిర్మించింది. ఉపయోగంలో లేని సైనిక నిర్మాణాన్ని ప్రయాణికులు, బాటసారులు స్వాగతించే ప్రదేశంగా మార్చారు. ఈ కేఫ్ స్థానిక మోన్పా మహిళలచే నిర్వహించబడుతోంది. పర్యాటక ప్రదేశంగా మారుతున్న ఈ మారుమూల ప్రాంతానికి కొత్త జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది ఈ రివర్కేఫ్. సందర్శకులకు ఈ కేఫ్ పర్వతాలు, నదులు, మేఘావృత లోయల మధ్య మరుపురాని అనుభూతుల్ని అందిస్తుంది. Under #OpSadbhavna, the Indian Army has established Border Brew Café at Jemithang, a first-of-its-kind initiative in Northeast India.Constructed on a decommissioned Bailey Bridge over Ngyamjang Chu, the cafe will support local communities and strengthen tourism in #Arunachal. pic.twitter.com/GJKCNLdJSb— MyGov Arunachal Pradesh (@MyGovArunachal) March 19, 2026 (చదవండి: రెంట్ ఏ ట్రీ..!) -
రెంట్ ఏ ట్రీ..!
కేరళకు చెందిన ఒక స్టార్టప్ అందరి మనసుల్నీ గెలుచుకుంటోంది. రెంట్ ఏ ట్రీ అనే పేరుతో ఉన్న ఈ సంస్థ.. ఆసక్తిగలవారు ఎవరైనా ఒక మామిడి చెట్టును అద్దెకు తీసుకుని, సాగుతో సంబంధం లేకుండానే ఆ చెట్టుకు కాసే దిగుబడిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కొచ్చికి చెందిన ఉమేష్ దామోదరన్ ఈ వినూత్న బిజినెస్ని ప్రారంభించారు. బెంగళూరులో ఒక ఎడ్టెక్ స్టార్టప్ను నడిపే దామోదరన్ ఒకసారి కొచ్చి–బెంగళూరు మధ్య ప్రయాణిస్తున్నపుడు అల్ఫోన్సో మామిడి పండ్లను చూశారు. కొన్నింటిని తన స్నేహితుల కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా వారికి ఆ పండ్ల రుచి బాగా నచ్చి, మరోసారి కావాలని కోరారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి ఒక పూర్తి చెట్టు పండ్లన్నీ తమకే కావాలని అడిగారు. అపుడే దామోదరన్లో ఈ ‘రెంట్ ఏ ట్రీ’ ఆలోచనకు పునాది పడింది. ఈ కంపెనీ వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చెట్టును, మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి లీజుకు తీసుకోవచ్చు. చెట్టు సంరక్షణ, సాగు బాధ్యతలన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ సంస్థ ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరి, తమిళనాడులోని దిండిగల్, కేరళలోని పాలక్కాడ్ ప్రాంతాల్లో సుమారు 250 ఎకరాల అల్ఫోన్సో మామిడి తోటలను నిర్వహిస్తోంది. ఈ స్టార్టప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘బ్రిలియంట్ ఐడియా’ అని కొంతమంది కొనియాడగా, మరికొంతమంది దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాపు సరిగా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి అనుకోని వర్షాలు పంటను దెబ్బతీస్తాయని.. నష్టం రావొచ్చు అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Karostartup (@karo_startup_) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
పెద్దలకు అర్థం కాకుండా పోతున్న టీనేజర్ల ప్రపంచం
జెన్ ఆల్ఫాకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్ప్లే, యాడ్స్తో పెద్దల కంటెంట్ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచం చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్దలకు తమ పిల్లలపై ఉన్న అవగాహనను తుడిచిపెడుతోంది. వినోదానికీ, వాణిజ్యానికీ తేడా తెలియని జెన్ ఆల్ఫా తరం ఓ విష వలయంలో చిక్కుకుంటోంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్తో కలిసి, అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) అకాడమీ ‘వాట్ ది సిగ్మా?’ అనే ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన తేలి్చంది. ఈ పరిశోధన హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో జరిగింది. వ్లాగ్స్, షార్ట్స్, గేమ్ప్లేలోని స్పాన్సర్డ్ కంటెంట్లో జెన్ ఆల్ఫా తరం చిక్కుకుంటోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి రెండు వేర్వేరు ప్రపంచాలు కావు.. రెండూ ఒక్కటే అనే భావనకు విపరీతంగా గురవుతున్నారు. మరి వీరిపై వాణిజ్యపరమైన ప్రభావం ఏమిటి? 7నుంచి 15 ఏళ్ల వయసు (జనరేషన్ ఆల్ఫాకు చెందిన) పిల్లలు మీడియా, కంటెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? హైపర్–డిజిటల్ వాతావరణంలో వాణిజ్య సందేశాలను ఎలా గుర్తిస్తారు? ఎలా వర్గీకరిస్తారు? ఎలా అర్థం చేసుకుంటారు? వంటి విషయాలను అధ్యయనంలో పరిశీలించారు. పిల్లల అంతర్జాలం.. పెద్దల్లో గందరగోళం.. జెన్ ఆల్ఫా తరం ఇంటర్నెట్తో పాటు వృద్ధి చెందకుండా.. ఇంటర్నెట్లో ఇరుక్కుపోతున్నారు. వారి సాంస్కృతిక సంకేతాలు, సౌందర్య భావనలు, భాషా ప్రపంచం నెమ్మదిగా వేరవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సమకాలీనమైన ఈ తరానికి సంబంధించిన ప్రస్తావనలు అపరిచితంగా ఉంటాయి. హాస్యం అస్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, వారికి ఆట స్థలంలో ఆటలాగా తక్షణమే, అందరితో పంచుకోవాల్సిన అంశాలుగా మారుతున్నాయి. పిల్లల డిజిటల్ ప్రపంచం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కోల్పోతున్న పరిస్థితుల్లో.. వీక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఫీడ్తో బిజినెస్ అల్గారిథం రంగంలోకి దిగింది. ఈ పరిణామం ఎంత వేగంగా జరుగుతోందంటే, పెద్దలను వారి పిల్లల ప్రపంచంలో నిరక్షరాస్యులుగా మార్చేస్తోంది. తాము పూర్తిగా చూడలేని వారి ప్రపంచంలో హానికరమైన కంటెంట్ అంటే ఏమిటో తెలియక, స్క్రీన్ సమయం, డిజిటల్ వినియోగంపై నియమాలను నిర్దేశిస్తూ, అమలుపై స్పష్టత లేని స్థితిలో తల్లిదండ్రులు నిరంతరం నియమాలను సవరించుకుంటున్నారు.వినోదం రూపంలో ప్రమాదం.. చిన్న పిల్లలు (7–12 మధ్య వయసు్కలు) అత్యంత స్పష్టమైన ప్రకటనలను మాత్రమే గుర్తిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్లు, గేమింగ్ అనుసంధానాలు, వ్లాగ్ స్పాన్సర్íÙప్లు వీరికి కేవలం వినోదంగానే అనిపిస్తాయి. పెద్ద పిల్లలు (13–15 మధ్య వయస్కులు) ప్రకటనల అక్షరాస్యతను ఎక్కువగా పెంపొందించుకున్నా.. భావోద్వేగాలతో కూడిన, కథనంతో మిళితమైన బ్రాండ్ సందేశాలకు సులభంగా ప్రభావితమవుతుంటారు. నిరంతరాయంగా ప్రసారమయ్యే మీడియా ప్రవాహంలో మునిగిపోవడంతో వీరిలో విచక్షణా శక్తి తగ్గిపోతోంది.డిజిటల్ సొసైటీ దిశగా.. జెన్ ఆల్ఫాకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్ప్లే, యాడ్స్తో పెద్దల కంటెంట్ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.క్రమబదీ్ధకరణకు ఓ వ్యవస్థ అవసరం.. ఈ నేపథ్యంలో జెన్ ఆల్ఫాకు మార్కెటింగ్ విషయంలో బాధ్యతాయుతమైన విధానాన్ని నిర్ధారించడానికి, ప్లాట్ఫామ్లు, కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనదారులు, తల్లిదండ్రులు, పాఠశాలల సమన్వయంతో ఓ నిరీ్ణత వ్యవస్థ అవసరమని అధ్యయనకర్త అభిప్రాయం. పాఠశాలల్లో మీడియా, ప్రకటనల అక్షరాస్యత వాణిజ్య విద్య ద్వారా వాణిజ్య ఉద్దేశంపై అవగాహన పెంపొందించడం అవసరమని స్పష్టం చేసింది.అధ్యయనకర్తలు ఏమంటారంటే.. ‘ఏఎస్సీఐ అకాడమీ’ వాట్ ది సిగ్మా?’ అధ్యయనం, జనరేషన్ ఆల్ఫా కంటెంట్ జీవితంపై జరిపిన ఒక పరిశోధన. ఇది వారిని విమర్శించడానికి కాదు, వారిని అర్థం చేసుకోవడానికి. వారి సాంస్కృతిక దృక్పథాలు, మునుపటి తరాల వారి దృక్పథాల నుంచి భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వీరే అతి పిన్న వయసు్కలైన మీడియా వినియోగదారులు కాబట్టి, వారు ప్రకటనలను ఎలా తీసుకుంటారు? అనే దానిపై అవగాహన పొందడం.. బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడంలో మొదటి అడుగు.’ అని ఏఎస్సీఐ సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ అంటున్నారు. ‘గత తరానికి డిజిటల్ మీడియా పరిచయం కాగా, ఈ తరానికి అదే ప్రపంచం. వీరికి కంటెంట్తో సంబంధం ఉంది, దీనిని తల్లిదండ్రులు, విశ్లేషకులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నివేదిక వారు ఏమి చూస్తున్నారో మాత్రమే కాకుండా, అల్గారిథమ్, కంటెంట్, ప్రకటనల ద్వారా వారు ఎలా ప్రభావితమవుతున్నారో అన్వేíÙంచింది. ప్రకటనల వాతావరణంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? అనే ప్రయత్నాలకు ఆలంబనగా.. ఇది జెన్ ఆల్ఫా, వాస్తవ పరిస్థితులపై అవగాహన కలి్పంచడానికి ప్రయత్నించింది’ అని ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ సంతోష్ దేశాయ్ చెబుతున్నారు. -
ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?
చాలామందికి ఒక సందేహం ఉంటుంది—"నేను ఇంట్లో ఉన్నట్టే ఆఫీసులో ఉండాలా? లేక అక్కడ వేరే మనిషిలా నటించాలా?" అని. సైకాలజీ దీనిని 'The Professional Mask' (వృత్తిపరమైన ముసుగు) అంటుంది. ఇది అబద్ధం ఆడటం కాదు, ఇది ఒక రకమైన 'ఎమోషనల్ మేనేజ్మెంట్'. ఆఫీసు అనేది ఒక ప్రొఫెషనల్ వేదిక. అక్కడ మీరు మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను ప్రతిచోటా ప్రదర్శించకూడదు. ఒక 'ప్రొఫెషనల్ మాస్క్' ధరించడం అంటే మీ సహజత్వాన్ని చంపుకోవడం కాదు, మీ బాధ్యతకు తగ్గట్టుగా మీ ప్రవర్తనను మలచుకోవడం. ఇది మీ Career Growth కి ఒక రక్షణ కవచం లాంటిది.పర్సనల్ vs ప్రొఫెషనల్ (The Boundaries)చాలామంది ఆఫీసులో అందరినీ 'ఫ్రెండ్స్' అనుకుని తమ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి…ఆఫీసులో మీ రోల్: మీరు అక్కడ ఒక పనిని పూర్తి చేయడానికి ఉన్నారు.మీ ఐడెంటిటీ: అక్కడ మీరు ఒక మేనేజర్, ఒక ఇంజనీర్ లేదా ఒక లీడర్.మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేరు చేసే ఆ 'లైన్' ఎంత స్పష్టంగా ఉంటే, మీ పర్సనాలిటీకి అంత గౌరవం ఉంటుంది. అతిగా కలిసిపోవడం (Over-familiarity) ఒక్కోసారి మీ అథారిటీని తగ్గిస్తుంది.Emotional Laborమీకు ఇంట్లో గొడవ జరిగి ఉండవచ్చు, లేదా మీకు ఒంట్లో బాలేకపోవచ్చు. కానీ మీరు ఒక క్లయింట్ మీటింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా కనిపించాలి. దీన్నే 'Emotional Labor' అంటారు. మీ మూడ్ ఎలా ఉన్నా, మీ పనిపై అది ప్రభావం చూపకుండా చూసుకోవడమే అసలైన 'ప్రొఫెషనల్ పర్సనాలిటీ'.మోటివేషన్ మాయ vs ప్రొఫెషనల్ రియాలిటీమోటివేషన్ "Be yourself, అందరితో మనసు విప్పి మాట్లాడు" అని చెప్తుంది. ఇది కొన్నిసార్లు రిస్క్. సైకాలజీ "పరిస్థితిని బట్టి నీ ప్రవర్తనను మార్చుకో (High Self-Monitoring). ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో తెలియడమే అసలైన తెలివితేటలు" అని చెప్తుంది.ప్రొఫెషనల్ మాస్క్ ఎలా ధరించాలి?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ ఆఫీస్ పర్సనాలిటీ ఇలా ఉండాలి.Step 1: Break Over-sharingఆఫీసులో మీ పర్సనల్ కష్టాలను, ఇతరుల గాసిప్స్ని చర్చించే అలవాటుని 'Break' చేయండి. మీరు ఎంత తక్కువ వ్యక్తిగత విషయాలు చెబితే, మీ ప్రొఫెషనల్ ఇమేజ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పని మాత్రమే మాట్లాడాలి.Step 2: Build Consistencyమీ మూడ్ ఎలా ఉన్నా, ఆఫీసులో మీ ప్రవర్తన నిలకడగా (Consistent) ఉండాలి. ఒకరోజు చాలా యాక్టివ్గా, మరోరోజు చాలా డల్గా ఉండటం వల్ల మీపై నమ్మకం తగ్గుతుంది. ఒక ప్రొఫెషనల్ 'Standard' ని 'Build' చేయండి.Step 3: Authority & Approachability మీరు ఒక వైపు ప్రొఫెషనల్గా ఉంటూనే, మరోవైపు అందరికీ అందుబాటులో ఉండేలా (Approachable) ఉండాలి. గౌరవం అనేది భయం వల్ల రాకూడదు, మీ క్రమశిక్షణ వల్ల రావాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ ఆఫీస్ పర్సనాలిటీ ఎలా ఉంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ ఆఫీస్ ఫ్రెండ్స్ కి మీ పర్సనల్ లైఫ్ గురించి ఎంత తెలుసు? అది అవసరమా?ఆఫీసులో సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారా?మీరు మీ ప్రొఫెషనల్ రోల్ కి న్యాయం చేస్తున్నారా?మీ ముసుగే మీ బలం!బ్రో, ప్రొఫెషనల్ మాస్క్ అనేది మిమ్మల్ని మీరు దాచుకోవడం కాదు, మిమ్మల్ని మీరు 'ప్రెజెంట్' చేసుకోవడం. ఒక నటుడు స్టేజ్ మీద ఎలాగైతే తన పాత్రను పోషిస్తాడో, ఆఫీసులో మీరు మీ ప్రొఫెషనల్ పాత్రను అద్భుతంగా పోషించాలి. అప్పుడే మీ కెరీర్ లెగసీ నిర్మించబడుతుంది."Professionalism is not about what you do, but how you do it." -
అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్..!
కేకు కావచ్చు.. పూతరేకు కావచ్చు.. కాదేదీ కళకు అనర్హం అంటున్నారు ఆధునిక చెఫ్స్. తినిపించడానికి ముందు కనిపించే విధానంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. నోరూరించే రుచులను చూడగానే ఆకట్టుకునే కళా నైపుణ్యాన్ని అద్దుతున్నారు. అదే విధంగా తాను సృష్టించిన పేస్ట్రీలకు అచ్చమైన పండ్ల రూపాలను అందిస్తూ అంతర్జాతీయంగా వైరల్ అయ్యాడు పారిస్కు చెందిన ఓ ప్రముఖ చెఫ్. ఇప్పుడు ఆయన సృష్టించిన పండ్ల తరహా డిజర్ట్స్ భాగ్య నగరానికి కూడా వచ్చేయడం విశేషం. సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. దుబాయ్లోని కునాఫా చాక్లెట్ నుంచి టోక్యోలోని మెత్తటి పాన్కేక్స్ వరకు ఖండాలను దాటి తరలివస్తున్న ఆహార ధోరణులను మనం నగరంలోనూ చూడగలుగుతున్నాం. ఇదే క్రమంలో సిటీకి వచ్చేసింది పారిస్ డిజర్ట్. పండ్ల ఆకారాన్ని పోలిన ఇవి చూసేందుకు కూడా పండ్లలా కనిపిస్తాయి. పేస్ట్రీ కళలోని నైపుణ్యాన్ని మనసుకు హత్తుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాషన్ క్యాపిటల్ నుంచి.. పారిస్ అనగానే ఫ్యాషన్ ప్రియుల కలల చిరునామా అని తెలిసిందే. మన డిజైనర్లకు అక్కడ ప్రదర్శనలో పాల్గొనడం అంటే జీవితకాలపు కల సాకారం కావడమే. అలాంటి వస్త్రశైలి గురించి మాత్రమే చర్చలు చేసే సిటీ.. తొలిసారి అక్కడి డిజర్ట్స్ గురించి కూడా మాట్లాడుతోంది. దీనికి కారణం అక్కడి ప్రసిద్ధ పేస్ట్రీ మేకింగ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ సృష్టించిన పండ్ల ఆకారపు స్వీట్లు.ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.డిజర్ట్ ట్రెండ్.. నిమ్మకాయలు, ఆపిల్, స్ట్రాబెర్రీ, పీచెస్.. ఇలా అనేక రకాల పండ్ల రూపాలకు ప్రతి సృష్టి చేస్తున్నారు. అచ్చం ఆయా ఫలాలను పోలిన రూపంలో సృష్టించిన డిజర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ప్రత్యేకంగా మారడానికి కారణం నిజమైన పండ్లలా అనిపించే వాటి రూపం మాత్రమే కాదు, రుచి కూడా. ఈ డిజర్ట్స్లో మూస్, కంపోట్, స్పాంజ్, చాక్లెట్ పొరలు రుచికరమైన ఆకృతులను సమతుల్యం చేశాయి. తద్వారా ఆధునిక పేస్ట్రీ వైవిధ్యానికి అంతర్జాతీయ చిహ్నంగా ఇవి మారాయి.నగరానికి వచ్చేశాయ్.. అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకున్న ఈ పండ్ల ఆకారపు డిజర్ట్స్ ఇప్పుడు నగరంలోనూ సందడి చేస్తున్నాయి. బహుళ పొరలను ప్రదర్శించే ఈ స్వీట్ శిల్పాలను తెలంగాణ రాష్ట్రం బంజారాహిల్స్లోని నోమ్ కేఫ్ వంటి పేరున్న కేఫ్స్ అందిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా పర్షియన్ చెఫ్లను సైతం తీసుకొస్తున్నారు. ఈ ఫ్రూట్ డిజర్ట్స్ మెనూలో రాస్బెర్రీ, ఆర్కిటిక్ బ్లిస్ బెర్రీ, హాజెల్నట్, గ్రీన్ ఆపిల్, కొబ్బరి, బొప్పాయి, క్రౌన్ పియర్ వంటి రుచులు నగరంలో కొలువుదీరాయి. View this post on Instagram A post shared by Arts Terra (@arts_terra)(చదవండి: అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాయ్..! కానీ 17 కిలోమీటర్లు..) -
ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్ప్రదేశ్కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.అరుణాచల్ప్రదేశ్కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్ సోకి యెకర్ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్ అనేశారు. పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్ప్రదేశ్ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్. ఫిట్నెస్ జర్నీ మొదలైందిలా..తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్లాస్ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్గా మారానని సంతోషంగా చెబుతోందామె. సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్డ్గా కనిపిస్తున్నావ్.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్ అనుహ్యమైన టర్న్ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్ సోకి యెకర్. View this post on Instagram A post shared by Leyu Abom Soki Yekar (@abomsokiyekar) (చదవండి: దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్) -
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
భారత్లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కు పోస్టర్ బాయ్గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) జంక్ ఫుడ్ డేట్స్కు అతీతంగాచాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు. అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్. సోమన్ ఫిట్నెస్..తరచుగా ఫిట్నెస్ ఐకాన్గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్మోడల్గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు. సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) (చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!) -
పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!
మొదట్లో ఒకప్పుడు కొందరు మహిళలకు దేవుళ్లు పూనడం లేదా శివమూగడం అంటూ జరుగుతుంటేది. ఒక ఆసక్తికరమైన అబ్జర్వేషన్ ఏమిటంటే... ఇది చాలావరకు ఆర్థికంగా దిగువ మధ్యతరగతి వారిలోనూ, పేద వర్గాల్లోనే కనిపిస్తుండటం చాలా సాధారణం. నిజానికి ఇదొక రకమైన మానసిక రుగ్మత. ఇలాంటి మానసిక రుగ్మతల్లో పేషెంట్... ‘నేను’ లేదా ‘తాను’ అనే భావన నుంచి విడిపోయి... మరేదో స్థితిని సంగ్రహిస్తాడు.అంటే మరో స్థితిని ΄పొందుతాడు కాబట్టి ఇంగ్లిష్లో దాన్ని పొజెసివ్ స్టేట్ అంటారు. అప్పట్లో అంటే... శాస్త్రీయ అవగాహన అంతగా లేని రోజుల్లో ఇలా జరగడాన్ని... అంటే తాను అన్న భావన నుంచి దూరం జరిగే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. నిజానికి హిస్టెరస్ అంటే గర్భసంచి (యుటెరస్) అని అర్థం. యుటెరస్ శరీరంలోని ఇతర భాగాలకు తిరుగాడుతూ... పాకడం వల్ల వచ్చే వ్యాధిగా పరిగణించి అప్పట్లో దీన్ని ‘హిస్టీరియా’ అంటూ వ్యవహరించేవారు. మహిళల్లో ఈ తరహా జబ్బులు ఎక్కువ కాబట్టి హిస్టీరియా అనేవారు. అయితే వైద్య విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెంది కారణం తెలిసిన తర్వాత ఆ హిస్టీరియా అనే మాటను వాడకంలోంచి తొలగించారు. అయితే మానసిక విజ్ఞానశాస్త్రం బాగా పెరగడంతో పాటు తన స్థితి నుంచి తాను విడిపోయే పరిస్థితికి (డిసోసియేషన్కు) శాస్త్రీయమైన కారణాలు తెలిశాక... ఈ తరహా మానసిక రుగ్మతలను డిసోసియేషన్ / కన్వర్షన్ డిజార్డర్స్గా చెబుతున్నారు. వీటిల్లో అనేక రకాలుంటాయి. అవేమిటో చూద్దాం...ఓ ఊళ్లోని ఓ పేదింటి అందమైన అమ్మాయిని అక్కడి ఓ రాజకీయ నాయకుడూ... ఊరికి పెద్ద అయిన ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. అతడేమో ఆర్థికంగా, సామాజికంగా చాలా పవర్ఫుల్. కానీ ఈ అమ్మాయి ఓ అమాయకపు దిగువ ఆర్థికస్థాయికి చెందిన పేద పిల్ల. ఆ పవర్ఫుల్ వ్యక్తిని ఎదిరించగలిగే బలంగాని, మానసిక స్థైర్యంగాని ఆ అమ్మాయికి లేవు. అయితే ఆ పవర్ఫుల్ వ్యక్తి వేధింపులను ఆమోదించి, అతడికి లొంగిపోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మెదడు ఓ మాయ చేస్తుంది. తనను తాను రక్షించుకునేందుకు ఆ అమ్మాయికి తెలియకుండానే ఓ ఎత్తుగడ వేస్తుంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయికి గ్రామదేవత పూనుతుంది. దాంతో ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. మెదడు చేసే ఈ పనులు ‘సబ్–కాన్షియస్’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియదు. అయితే ఆ అమ్మాయి... తన చుట్టూ ఉన్న ప్రకృతి సంబంధమైన అంశాలను (నేచర్ను) అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ‘పొజెస్’ చేసుకుంటుంది. అలా తననుంచి తాను ‘విడిపోయి’ అంటే ‘డిసోసియేట్’ అయి... గ్రామదేవత తాలూకు స్థితిని ‘పొజెస్’ చేసుకుని... అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల నుంచి వచ్చే వేధింపుల నుంచి తనను తాను కాపాడుకోడానికి తనకు తెలియకుండానే ఈ పనులు చేస్తుంది. ఇప్పుడు గ్రామదేవత పూనాక ఆ అమ్మాయి స్థితి చాలా బలంగా మారిపోతుంది. ఊరిపెద్ద ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా... సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడా అమ్మాయిని తాత్కాలికంగా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ స్థితిలో ఆ అమ్మాయి అక్కడివారి పూజలందుకుంటూ ఉంది. ఆమెకు కావాల్సిన పనులను ఊరి ప్రజలద్వారా చేయించుకుంటూ ఉంది. ఆమె నుంచి వచ్చే మాటను గ్రామదేవత మాటలుగా ఎంచి, ఊరిజనమంతా వాటిని పాటిస్తుంటారు.నిజానికి ఆమె కోరని మరికొన్ని కోరికలనూ గ్రామస్తులు తీరుస్తుంటారు. దాంతో ఆమె మెదడుకు ఇదొక అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్ చేసుకుంటుంది. అంటే గ్రామదేవత తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది. పూనకం (పొసెషన్)లోకి వెళ్తుంది. ఇలా కేవలం గ్రామదేవతలే కాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన వేరే మనిషి గానీ, దెయ్యాలూ, భూతాలు కూడా పూనడం అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. సామాన్య జనం దీన్ని పూనడం అంటారుగానీ మానసిక వైద్య శాస్త్రంలో దీన్ని డిసోసియేషన్ డిజార్డర్ అని చెప్పవచ్చు.డిసోసియేషన్ అంటే...? డిసోసియేషన్ (dissociation) అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘నేను’ అంటే ఏమిటో, ఆ ‘నేను’ అనే భావన ఎలా కలుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలూ, భావోద్వేగాలూ... ఇవన్నీ తనవిగా గుర్తించడాన్ని ఇంగ్లిష్లో ‘ఐ’ అండ్ ‘మైన్’ అనీ, అదే తెలుగులో చె΄్పాలంటే ‘నేను’ / ‘నా ఆలోచనలు’’ అని చెప్పవచ్చు. అందరిలో ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్ కొంతమందిలో ఒక్కోసారి కొంత వ్యవధి పాటు తొలగిపోతుంది. ఆ సమయంలో ఆ నేను... నేను కానేమో అనే భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్’ అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... బాగా తీవ్రంగా, తాను తట్టుకోలేనంతగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గానీ లేదా తన ప్రాణాలకే ముప్పు ఏర్పడినప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడిపోతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్ను తనవి కావన్నంతగా విడివడే కండిషన్ను ‘డిసోసియేషన్ ఆఫ్ అఫెక్ట్స్’ అనవచ్చు. తన భావోద్వేగాల తీవ్రత కారణంగా అతడి మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా ఓ వ్యక్తి తననుంచి తాను విడిపోవడం జరుగుతుంది.డీసోసియేషన్ కలిగే పరిస్థితులివి... తట్టుకోలేనంత ఒత్తిడి తీవ్రమైన అలసట చాలా తీవ్రమైన డిప్రెషన్ పసితనంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో ఉండటం... వంటి పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఓ వ్యక్తికి తనదైన దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. ఇంగ్లిష్లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్ ‘సెల్ఫ్ ఫీలింగ్’ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తేలిగ్గా డిసోసియేషన్కు లోనవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్) కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు ‘అపరిచితుడు’ సినిమాలోని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఓ వ్యక్తి తననుంచి విడివడి వేరే వ్యక్తిని లేదా వేరే వ్యక్తుల ప్రవర్తనలనూ, పర్సనాలిటీలను ΄పొజెస్ చేసుకోవడమే అని చెప్పవచ్చు.‘నేను’ లేదా ‘నా’ అనే భావన లేకపోవడం ఎలా జరుగుతుందంటే... ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి చూపు, వినికిడి, స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ ఉపయోగపడుతుంటాయి. తాను ఉన్న తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అది లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు. దీనికి సంబంధించి మరింత అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మన దేహంలోని ఒక భాగానికి మత్తు (లోకల్ అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అలా ఇచ్చాక అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తున్నప్పటికీ... అక్కడేం జరుగుతోందో మనక తెలియదు. ఒకవేళ అలా శస్త్రచికిత్స చేస్తున్న విషయం గనక మనం మన కళ్లతో చూడకపోతే అది మన శరీరానికి సంబంధించిందన్న భావన కూడా మనకు కలగక΄ోవచ్చు. ఉదాహరణకు మన పంటికి ఏదైనా చికిత్స చేయించుకుంటున్నప్పుడు అక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చాక పన్నుకు డ్రిల్లింగ్ జరుగుతున్నప్పటికీ మనకు అక్కడ ఏమవుతోందో అన్నది తెలియనే తెలియదు.మరికొన్ని ఉదాహరణలివి... కొందరు పీర్ల గుండం దగ్గరా లేదా తమ మొక్కుబడులలో భాగంగా నిప్పులు తొక్కుతూ చేసే మరికొన్ని ప్రత్యేక ప్రార్థనల్లో నిప్పుల మీద బాధే తెలియకుండా నడుస్తుంటారు. తీవ్రమైన భక్తి ఆవేశాలకూ, భక్తిభావనలకు లోనైనప్పుడు ఆ తన్మయత్వం తారస్థాయిలో ఉన్నప్పుడు బాధ అనే భావనే రాదు. ఈ తరహా డిసోసియేషన్ను ‘సెన్సరీ డిసోసియేషన్’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శజ్ఞానానికి సంబంధించిన డిసోసియేషన్గా చెప్పవచ్చు. ఏదైనా తట్టుకోలేనంత తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు అది మన మెదడుపై ఒక షాక్లాంటి ప్రభావం చూపవచ్చు. అంతటి ప్రభావం కారణంగా మెదడు మొద్దుబారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే కొందరికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆ షాక్ కారణంగా చాలాసేపటి వరకు వానికి నొప్పి కలగకపోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్ కారణంగా జరిగే పరిణామమే. ఏదైనా ఒక సబ్జెక్ట్లో అత్యంత ఆసక్తితో అందులో మునిగిపోయినప్పుడు ఓ విద్యార్థిలోగానీ లేదా ఏదైనా అత్యంత ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నప్పుడూ ఎవరైనా వ్యక్తిగానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియనంతగా అందులో పూర్తిగా లీనమైపోయినపోవచ్చు. అది కూడా డిసోసియేషన్కు ఓ తార్కాణమే. మనసు నిండా తీవ్రమైన భక్తిభావనను నిండిపోయినప్పుడు తనలోకి దైవం వచ్చినట్లుగా కొందరు అనుభూతి చెందవచ్చు. ఇలాంటి భావనలకు లోనుకోవడం కూడా ఒక రకంగా ‘డిసోసియేషన్’యే అని చెప్పవచ్చు. ఈ స్థితినే ‘పొసెషన్’ అంటారు. కాకపోతే ఇది పూర్తిగా సంస్కృతి ఆమోదించిన అంశం కావడంతో... అంతటి భక్తి భావన అన్నది ఆ వ్యక్తికి గానీ, లేదా ఇతరులకు గానీ ఇబ్బంది కలగజేయనంతవరకు దాన్ని వ్యాధిగా పెద్దగా పరిగణించరు. డిసోసియేషన్ ఆమ్నీషియా : ఏదైనా షాకింగ్ సంఘటనతో లేదా బలమైన కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగినా లేదా అలాంటి గాయాల్ని కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం జరుగుతుంది. ఇలా తమకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే వాటిని మరచిపోవడాన్ని ‘డిసోసియేషన్ ఆమ్నీషియా’ అంటారు. ఈ కండిషన్లో కలిగే మరచిపోవడం అన్నది సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. డిసోసియేటివ్ ఫ్యూగ్ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పని ప్రదేశం నుంచి అకస్మాత్తుగా ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అతడు ఈ ప్రయాణంలో తన సెల్ఫ్కేర్ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి) అంశాల విషయంలో మామూలుగా ఉన్నా... తాను తిరిగి వెనకకు వచ్చాక తాను ఎక్కడెక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ పాక్షికంగానో లేదా మొత్తంగానో మరచిపోవచ్చు. ఇలాంటి డిసోసియేషన్లో కనిపించే లక్షణాలకు ఎలాంటి నరాల వ్యాధులూ కారణంగా కనిపించవు. ట్రాన్స్ అండ్ పొసెషన్ స్టేట్ మధ్య తేడా... ట్రాన్స్ : తాను అనే తన సొంత భావనను అంటే తానెవరు అనే ఫీలింగ్ను... ఇంగ్లిష్లో చెప్పాలంటే తన ఐడెంటిటీని కోల్పోయే లేదా పూర్తిగా మరచిపోయే స్థితిని ‘ట్రాన్స్’ అంటారు. తన చుట్టూ జరుగుతున్న వాటిని ఏమాత్రం గుర్తించలేకపోవడమో లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించగలిగడం లాంటి స్థితిని ‘ట్రాన్స్’గా చెప్పవచ్చు. ఆ స్థితిలో తన భాష, కదలికలు, శారీరకంగా తాను కనబరిచే సాధారణ పోష్చర్స్... ఇవన్నీ చాలావరకు తగ్గిపోతాయి. ఈ స్థితిలో పొడిపొడిగా కేవలం రెండు మూడు మాటలు మాట్లాడుతుంటారు. పొసెషన్ కండిషన్: ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరినట్లుగా ప్రవర్తించే కండిషన్ను ‘పొసెషన్’ అంటారనీ, దానికి అపరిచితుడు సినిమా లాంటి ఉదాహరణలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం ఏ గ్రామదేవత మాత్రమే కాకుండా... ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా ఉండటం... అలాగే మరికొందరిలో దెయ్యం / భూతం / ఏదో శక్తి ఆవహించినట్లుగా భావించడం కూడా పొసెషన్ స్టేట్గానే చెప్పవచ్చు. ఈ పరిస్థితి కారణంగా తనకు గానీ... అతడి వల్ల ఇతరకులకు గానీ ఇబ్బందిగా లేనంతవరకు దాన్ని వ్యాధిగా పరిగణించరు. ఒకవేళ అలాంటి పొజెషన్ స్టేట్ వల్ల అది ప్రమాదకరంగా పరిణమించినప్పుడే దాన్ని వ్యాధిగా గుర్తిస్తారు. ఒక ప్రాంతంలో సెషన్ సంస్కృతిలో ఇమిడిపోయి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రం ఆ ప్రవర్తనను వ్యాధిగా గుర్తించడం అంతగా జరగదు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం దాన్ని వ్యాధిగా భావించి తగిన చికిత్స అందించాలి. డిసోసియేషన్తో కలిగే సమస్యలు డిసోసియేటివ్ కన్వల్షన్స్ : శరీరంలో ఫిట్స్ వచ్చిప్పుడు దేహంలో ఎలాంటి కదలికలు సంభవిస్తాయో డిసోసియేటివ్ కన్వల్షన్లో అలాంటి కదలికలు కనిపిస్తాయి. ఈ కండిషన్లో ఉన్నవారు కిందపడిపోయినప్పటికీ సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండకపోవచ్చు లేదా చాలా అరుదుగా మాత్రమే ఇలా జరగవచ్చు. డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్స్ : తనలో ఎలాంటి శారీరక సమస్యా లేకపోయినప్పటికీ... నరాలకు సంబంధించిన ఎలాంటి లోపాలూ లేకపోయినప్పటికీ... వీళ్లలో మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం, అడుగులు సరిగా పడకపోవడం, నడవలేకపోవడం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ‘డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్’ (dissociative motor disorder) కావచ్చు. డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్: ఏ కారణమూ లేకుండా... ఒక వ్యక్తి శరీరంలోని ఒక భాగంగానీ లేదా మొత్తం శరీరంలోగానీ ఎలాంటి స్పర్శా లేకపోడంతో పాటు వారిని తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్పోజ్ చేసినా వారికి ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగకపోవడాన్ని డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్గా పేర్కొనవచ్చు. అయితే ఇలా కొందరిలో వారు తమ చూపు, వాసన చూసే శక్తి, వినికిడి శక్తిని కూడా కోల్పోవడం జరగవచ్చు. చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్ వాష్’ ప్రక్రియను కూడా ఒక రకమైన డిసోసియేషన్గా చెప్పవచ్చు. కొందరికి... వారు తమ శరీరం నుంచి విడిపోయి, తమ శరీరాన్ని బయటి నుంచి చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్డెత్’ అనుభవాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్ వల్ల కలిగే అనుభూతులే అని చెప్పవచ్చు. కన్వర్షన్ డిజార్డర్స్ :తీవ్రమైన మానసిక సంఘర్షన కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. ఇలా మానసిక అంశాలను శారీరక లక్షణాలుగా మార్చుకుని బయటపెట్టడాన్ని ‘కన్వర్షన్ డిజార్డర్’ (conversion disorder) అంటారు.చికిత్సఏ కారణాల వల్ల డిసోసియేషన్ లేదా కన్వర్షన్స్ జరుగుతోందో గుర్తించి ఆ కారణాలను దూరం చేసి ఈ లక్షణాలు తమంతట తామే తగ్గిపోతాయి. అలాగే ఈ తరహా పేషెంట్స్లో వారు కోల్పోయిన లేదా ఛిద్రమైన వాళ్ల ‘సెల్ఫ్’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు సమర్థమైన చికిత్స అందించవచ్చు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్ను బలపరచడం / పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కరించవచ్చు. ఇందులో భాగంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలిగేలా వాళ్లలో కొన్ని నైపుణ్యాలనూ (స్కిల్స్), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను పెంచడం కూడా ఈ జబ్బులకు చికిత్సలో ఓ ప్రధానమైన భాగం. అవసరాన్ని బట్టి కొన్ని మందులు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటివీ అందించాల్సి రావచ్చు.- డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ -
విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?
మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు. కానీ ఒక 'జీనియస్' వ్యక్తిత్వానికి విమర్శ అనేది ఒక 'చెత్త' కాదు, అది ఒక 'ఎరువు' (Fertilizer). ప్రపంచంలో ఏమీ చేయని వాడిని ఎవరూ విమర్శించరు. మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారంటే, మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని అర్థం. విమర్శ అనేది మీ పని తీరుపై లేదా మీ ప్రవర్తనపై ఇతరులు ఇచ్చే ఒక 'ఫీడ్బ్యాక్'. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే మీ Professional Maturity ని నిర్ణయిస్తుంది.ఏది తీసుకోవాలి? ఏది వదలాలి?విమర్శలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు.నిర్మాణాత్మక విమర్శ (Constructive Criticism): ఇది మీ పనిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. ఇందులో లాజిక్ ఉంటుంది, మీ తప్పు ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్తుంది. ఇది మీకు ఒక 'గురువు' లాంటిది.విధ్వంసకర విమర్శ (Destructive Criticism): ఇది కేవలం మిమ్మల్ని మానసికగా దెబ్బతీయడానికి, మీ పరువు తీయడానికి చేసేది. ఇందులో అసూయ, ద్వేషం ఉంటాయి. దీన్ని మీరు ఒక 'నాయిస్' (Noise) లాగా వదిలేయాలి.ది సైకాలజీ ఆఫ్ రియాక్షన్...ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మన మెదడులోని Amygdala వెంటనే "ప్రమాదం!" అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మనకు వెంటనే కోపం లేదా బాధ కలుగుతుంది.Stoic Approach: విమర్శ రాగానే స్పందించకండి. "ఈ మాటలో నిజం ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజం ఉంటే సరిదిద్దుకోండి, అబద్ధం అయితే నవ్వి ఊరుకోండి. ఎదుటివారి మాటలకు మీ ప్రశాంతతను తాకట్టు పెట్టకండి.మోటివేషన్ మాయ vs రియల్ గ్రోత్మోటివేషన్ "నిన్ను విమర్శించే వాళ్ళ నోళ్ళు మూయించు, నువ్వు ఎవరో నిరూపించుకో" అని ఆవేశాన్ని నూరిపోస్తుంది. ఇది మీలో అహంకారాన్ని (Ego) పెంచుతుంది.సైకాలజీ "విమర్శను ఒక డేటా పాయింట్లా చూడు. నీ పర్సనాలిటీలో నీకు తెలియని 'Blind Spots' ని విమర్శకులు చూపిస్తారు" అని చెప్తుంది. విమర్శకుడు మీ ఉచిత సలహాదారు అని భావించండి.విమర్శను మెట్టుగా మార్చే ఫార్ములాGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, విమర్శను డీల్ చేసే విధానం.Step 1: Break Emotional Defense విమర్శ వినగానే "నన్నే అంటావా?" అనే ఆ అహాన్ని 'Break' చేయండి. వెంటనే సమాధానం ఇవ్వాలనే ఆత్రుతను ఆపండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీరు ఆ విమర్శను లాజికల్గా విశ్లేషించగలరు.Step 2: Build Filtering Process వచ్చిన విమర్శ నుండి 'విషయాన్ని' (Content) తీసుకోండి, 'విషాన్ని' (Tone) వదిలేయండి. మీ పనిని మెరుగుపరిచే పాయింట్ ఏమైనా ఉందా? అని వెతకండి. ఉంటే, దాన్ని మీ పనిలో ఇంప్లిమెంట్ చేసి మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. Step 3: Graceful Acceptanceమిమ్మల్ని విమర్శించిన వ్యక్తికి "థాంక్యూ, నీ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను" అని చెప్పండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ కరిష్మాను వంద రెట్లు పెంచుతుంది. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించే స్థాయికి వెళ్లడమే 'Beyond' స్టేజ్.విమర్శను ఎలా చూస్తున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు?ఆ విమర్శలో కనీసం 1% అయినా నిజం ఉందా?ఆ విమర్శ మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చిందా లేక కోపిష్టిగా మార్చిందా?విమర్శకులు మీ ఎదుగుదలకి కావాలి!బ్రో, ఒక శిల్పం అందంగా మారాలంటే దానికి ఉలి దెబ్బలు తగలాలి. విమర్శలు ఆ ఉలి దెబ్బల వంటివి. మీరు ఎంత గొప్పగా విమర్శలను స్వీకరిస్తారో, అంత అందమైన వ్యక్తిత్వంగా మీరు రూపొందుతారు. విమర్శకులని శత్రువులుగా చూడకండి, వారిని మీ క్వాలిటీ చెకర్స్ లాగా చూడండి."To avoid criticism, do nothing, say nothing, and be nothing.-Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: నాయకుడిలా ఆలోచించడం ఎలా..?) -
వ్యర్థాలకూ వైద్యం
డెంటిస్ట్గా క్షణం తీరికలేనంత బిజీగా ఉండే డాక్టర్ శాంతి తుమ్మల, బెంగళూరు నగరంలోని చెత్త కుప్పలను చూసి బాధపడేవారు. అధికారులకు ఫిర్యాదు చేసి ఊరుకోవడం కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. బస్సు, ట్రైన్, బస్స్టేషన్, చౌరస్తా... ఇదీ అదీ అని తేడా లేకుండా తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఎందుకు డాక్టరమ్మా ఇది నీకు’ అన్నారు చాలామంది. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి తన వృత్తిని వదులుకొని పూర్తిస్థాయి ప్రచార కార్యకర్తగా మారారు. లక్షలాది మందిలో మార్పు తీసుకువచ్చారు...బెంగళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివసిస్తున్న శాంతి తన ఇంటిసమీపంలో ట్రక్కుల నిండా చెత్తను చూసేవారు. ఆ చెత్తగుట్టలు ఆమెను తీవ్రంగా కలవర పరిచేవి. సమస్య పరిష్కారానికి తానే నడుం బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, ΄÷డి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎలా వేరు చేయాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.అయితే... చాలామంది డాక్టర్ శాంతి మాటలకు అసహనంగా ముఖం పెట్టేవాళ్లు. కొందరికి ఆమె చెప్పింది వినడం టైమ్ వేస్ట్గా అనిపించేది. ‘పబ్లిసిటీ కోసమే ఈ ప్రచారం చేస్తుంది’ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరమ్ ద్వారా లక్షమందికి పైగా వ్యర్థాల విభజనలో సహాయపడ్డారు. ఆమె తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి ‘కంపోస్ట్ లెర్నింగ్ సెంటర్’ కూడా ్రపారంభించారు.మై వేస్ట్ మై మేనేజ్మెంట్కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆచరణాత్మక ప్రచారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు డాక్టర్ శాంతి. తన ఇంట్లోకి ΄్లాస్టిక్ను అనుమతించరు. గుడ్డ సంచులను ఉపయోగిస్తారు. పాత చీరెలు ధరిస్తారు. నిల్వ చేయడానికి స్టీల్ డబ్బాలనే వాడతారు.‘మై వేస్ట్ మై మేనేజ్మెంట్’ అనేది శాంతి నినాదం.ప్రజలు వ్యర్థాలను వేరు చేయడం ప్రారంభించినప్పటికీ, సేకరణ సమయంలో కాంట్రాక్టర్లు వాటన్నింటినీ మళ్లీ కలిపేస్తున్నారని ఆమె గమనించి, అలా జరగకుండా ఉండడానికి అధికారుల సహకారం తీసుకున్నారు.వృత్తిని త్యాగం చేసి...వృత్తిని, సామాజిక కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం డా. శాంతికి కష్టంగా మారింది. క్లినిక్లో రాత్రంతా పనిచేయడం వల్ల ఆమె అలసిపోయేవారు. ఇలా అయితే కుదరదనుకొని వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఉద్యోగం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.తన పట్టుదలతో పరిసర ప్రాంతాలను మాత్రమే కాకుండా, ఎంతోమంది బెంగళూరు వాసుల ఆలోచనా విధానాన్ని మార్చారు.ఉమ్మడి బాధ్యతతన ప్రచారానికి బస్సులను కూడా వేదికగా ఉపయోగించుకుంటారు డా.శాంతి. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో బస్సులో నిలబడి ‘దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దు’ అని ప్రయాణికులకు విన్నపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ‘నగరాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి ఉమ్మడి బాధ్యత’ అని ఒకటికి రెండు సార్లు చెబుతుంటారు. వ్యర్థాల విభజన అనేది సక్రమంగా జరగడం ప్రారంభమైన తరువాత ఆమె కంపోస్టింగ్పై దృష్టి సారించారు. -
ఆనందాల దేశం... ఫిన్లాండ్కు ఫ్రీగా వెళ్లే ఛాన్స్!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా 2026లో కూడా ఫిన్లాండ్ నిలిచింది. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా అగ్రస్థానంలో కొనసాగింది. ఈ జాబితాలో ఐస్ల్యాండ్ 2వ స్థానం, డెన్మార్క్ 3వ స్థానం, కోస్టారికా 4వ స్థానం, స్వీడన్ 5వ స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘చిల్ లైక్ ఏ ఫిన్ ఛాలెంజ్’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.వరుసగా తొమ్మిది సంవత్సరాలుగా ఫిన్ల్యాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలవడానికి కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే...→ ఈ దేశంలో అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.→ బలమైన సామాజిక భద్రత ఉంటుంది’. తరతరాలుగా ప్రకృతితో గాఢమైన అనుబంధం ఉంది. → విలాసాల కంటే పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తారు.→ సంపద విషయంలో ‘ఇంకా కావాలి’ అనే అత్యాశ కాకుండా ‘ఇది చాలు’ అనుకునే సంతృప్తి ఈ దేశ ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది.→ అవినీతి కేసులు తక్కువ కావడంతో సామాజిక ఆందోళనకు తావు ఉండదు. → ప్రభుత్వ అధికారులపై అధిక విశ్వాసం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ. → ఆడంబరమైన జీవితం కంటే చిన్న, చిన్న రోజువారీ ఆనందాలలోనే సంతోషాన్ని వెదుక్కుంటారు.చిల్ లైక్ ఏ ఫిన్ ఛాలెంజ్మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు, శాంటా క్లాజ్ గ్రామం, ఉత్తర ధృవపు కాంతిని వీక్షించగలిగే సుందర సరస్సులు యాత్రికులకు అనేకరకాల అనుభవాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ అధికారిక పర్యాటక వేదిక అయిన ‘విజిట్ ఫిన్లాండ్’ ప్రత్యేకమైన ఏడు రోజుల ‘చిల్ లైక్ ఏ ఫిన్ ఛాలెంజ్’ ద్వారా అక్కడి జీననశైలిని ప్రత్యక్షంగా చూడడానికి ప్రజలను ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన కొందరు అంతర్జాతీయ పర్యాటకులను ఫిన్నిష్ లేక్ల్యాండ్లో ఒక వారం గడపడానికి ఆహ్వానిస్తారు. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. మెరిసే సరస్సులు, పచ్చదనాల దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి.వేసవి స్వర్గంతమ ప్రచారంలో భాగంగా ఫిన్ల్యాండ్లో వేసవి కాలాన్ని పరిచయం చేసే ఒక వీడియోను విడుదల చేసింది అక్కడి పర్యాటకశాఖ. ‘ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. మాకు నాలుగు రుతువులు ఉన్నాయి. మేము వాటన్నిటిని ప్రేమిస్తాం. మాకు అత్యంత ఇష్టమైనది వేసవి. వేసవి సెలవులను సంతోషంగా గడుపుతాము. వేసవి ప్రారంభమైన వెంటనే, సామాను సర్దుకొని సరస్సు ఒడ్డున ఉన్న క్యాబిన్ల దగ్గరకు వెళతాం. అక్కడే మా సంతోష ప్రపంచాన్ని వెదుక్కుంటాం. ఆలస్యంగా పడుకుంటాం. ఆలస్యంగా నిద్రలేస్తాం. బయటకు వెళ్లి హైకింగ్, బైకింగ్ చేస్తాం. స్నేహితులను కలుసుకుంటాం’ అంటూ వీడియో వినిపిస్తుంది.సందడి మొదలైంది...ఏడు రోజుల జూన్ ఛాలెంజ్ కోసం ప్రపంచ నలుమూలల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ పార్టనర్తో కలిసి ఇన్స్టాగ్రామ్ లేదా టిక్టాక్లో ఒక వీడియోను రూ΄÷ందించాలి. అందులో వారు తమను తాము పరిచయం చేసుకోవాలి.‘లేక్ల్యాండ్లో ఫిన్నిష్ వేసవి సెలవులు ఎలా ఉంటాయని మీరు ఊహిస్తున్నారు?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అధికారిక వెబ్సైట్లో ఉన్న దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి, దాని లింక్ను తమ సోషల్ మీడియా పోస్ట్కు జత చేయాలి. దరఖాస్తు చేసుకునే వారి వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. భార్య, స్నేహితుడు, కుటుంబ సభ్యులు... తమకు నచ్చిన ఎవరితోనైనా కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేది... 29 మార్చి.ఆ అవకాశం మీకే రావచ్చు!మీ కోరికల జాబితాలో ‘ఫిన్లాండ్కు వెళ్లాలి’ అనేది కూడా ఉన్నట్లయితే మీరు ‘చిల్ లైక్ ఏ ఫిన్’ ఛాలెంజ్లో పాల్గొనడం మంచిది. ఏమో... ఆ ఛాన్స్ మీకే రావచ్చు! ఇది విస్మరించలేని అద్భుత అవకాశం. పర్యాటక ప్రదేశాలను హడావిడిగా చుట్టి రావడం కాకుండా ప్రకృతితో గాఢమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి, ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా స్థిరంగా నిలవడానికి కారణాలు ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ చాలెంజ్ను రూపకల్పన చేశారు. ఈ చాలెంజ్కు ఎంపిక అయిన వారిని ఖర్చులన్నీ వారే భరించి ఉచితంగా తీసుకు వెళతారు. ‘అంతమందిలో మనకేం వస్తుందిలే’ అనుకోవడం నిరాశ. ‘మాకు కూడా రావచ్చునేమో!’ అనుకోవడం ఆశ. సంతోష సౌధానికి పునాది ఆశే కదా! మీలో క్రియేటివిటీ ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకోవడానికి ఇదే సరైన సమయం. దరఖాస్తు పూర్తి చేయడానికి ‘చిల్లైక్ఏఫిన్.కామ్’లోకి వెళ్లాలి. ‘మేము ఎలాంటి వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నామంటే’ అనే కాప్షన్తో ఈ సైట్లో కొన్ని వివరాలు ఇచ్చారు. ఉదాహరణకు కొన్ని...→ ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడనివారు.→ ఇక్కడి అనుభవాలను చిత్రీకరించి ఇతరులకు షేర్ చేసేవారు.→ డ్రైవింగ్ తెలిసిన వారు. కనీసం ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఉన్నవారు. -
ఇండియాలోనే స్విట్జర్లాండ్
లడఖ్ ప్రాంతం సమ్మర్లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు, మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.గ్రామాల మధ్య జీవనంచిన్న గ్రామాల్లో ప్రజల జీవనం ప్రకృతి రిథమ్తో కలిసి నడుస్తుంది. వీధుల్లో నడిచే ప్రజలు, మోనాస్టరీస్ పక్కన కనిపించే ప్రశాంత వాతావరణం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్ గాలులు, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వాయు మార్గంలో లేదా ట్రైన్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి లేహ్కి డైరెక్ట్ ఫ్లైట్ వెళ్లవచ్చు. లేహ్ విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభమైన తర్వాత హిమాలయాల మధ్య రోడ్ జర్నీ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక అందమైన లోయ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వ్యాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్, ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్లా మార్చేస్తాయి. ఉదయ సమయంలో వ్యాలీ మీద పడే సాఫ్ట్ వెలుగు చుట్టూ ఉన్న హిల్స్ని మరింత అందంగా చూపిస్తుంది. మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా సాగుతుంటే, ఈ ప్రదేశం మొత్తం ఒక ప్రశాంతమైన మరో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది.అపాతాని సంస్కృతిజీరో వాలీలో జీవించే అపాతాని ట్రైబ్ ప్రజల జీవనం ప్రకృతితో కలిసి నడుస్తుంది. విలేజెస్ మధ్య కనిపించే బాంబూ హౌజెస్, పాడీ ఫీల్డ్స్ మధ్య ఉన్న ఫుట్పాత్స్ ఈ ప్రదేశంలో లైఫ్ రిథమ్ ఎలా ఉంటుందో చూపిస్తాయి. స్థానిక మార్కెట్లలో ప్రజలు సమయం గడపడం, వ్యాలీ మధ్యలో కనిపించే గ్రామాలు ఈ ప్రయాణాన్ని ఒక కల్చరల్ అనుభవంగా మార్చేస్తాయి. సమ్మర్ సీజన్లో వ్యాలీలో పచ్చని రంగులు మరింత విస్తృతంగా కనిపిస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా అస్సాంలోని గౌహతి వరకు వాయు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జీరో వ్యాలీకి వెళ్లవచ్చు. గౌహతి నుంచి ఇటానగర్ మీదుగా కొండల మధ్య నడిచే రోడ్స్ ద్వారా వ్యాలీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ మధ్య నడిచే ఈ రోడ్డు ప్రయాణంలో అడవులు, లోయలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని ఒక మెమోరబుల్ జర్నీగా మార్చేస్తాయి. (చదవండి: లాంజ్లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి) -
ఆరోగ్య సారథులు 'చిరుధాన్యాలు'
ప్రస్తుతం బియ్యం, గోధుమలే అధికంగా వాడుతున్నాం గానీ ఒకప్పుడు చిరుధాన్యాలదే రాజ్యం. ఏవో రెండు, మూడు కాదు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, సామలు, ఊదల వంటి ఆరేడు రకాల చిరుధాన్యాలు తినేవారు. అయితే నలబైల్లో వచ్చిన క్షామం, పెరుగుతున్న జనాభా అవసరాలు తిండి గింజల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. శాస్త్రీయ పరిశోధనలు.. హరిత విప్లవం పుణ్యమాని గోధుమ, వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. దాంతో మన ఆహారపు అలవాట్లు సమూలంగా మారిపోయాయి. ముఖ్యంగా చిరుధాన్యాల వాడకం బాగా తగ్గిపోయింది. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? పోషకాలు అందుతున్నాయా, లేదా? అనే విచక్షణే లేకుండా పోయింది. మరోవైపు శారీరక శ్రమ కూడా తగ్గిపోయింది. ఫలితంగా జీవనశైలితో ముడిపడిన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్లు వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. వీటితో సంభవించే మరణాలూ ఎక్కువవుతూ వస్తున్నాయి. ఇవన్నీ మన ఆహార అలవాట్లను ఒక్కసారి సమీక్షించుకోవాలనీ, చిరుధాన్యాలకు పట్టం కట్టాలనీ నిర్దేశిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారమూ సంపూర్ణంగా ఉండాలి. వాటిల్లో సింహభాగం ధాన్యాలదే. అలాంటి చిరుధాన్యాల వల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటో సవివరంగా చూద్దామా..!.చిరుధాన్యాల్లో పోషకాలు పెద్దమొత్తంలో ఉండటమే కాదు. వీటిల్లోని కొన్ని సంయోజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి వరి, గోధుమ వంటి పెద్ద ధాన్యాలు.. రాగులు, కొర్రలు, సామల వంటి చిన్న ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వు, కేలరీలన్నీ కొద్ది గొప్ప తేడాలతో దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే ఇవి మెరుగైనవి కావటమే విశేషం. వరి, రాగులు, సామల్లో 7% మాంసకృత్తులుంటే.. గోధుమ, జొన్న, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెల్లో 10-12% వరకు ఉంటాయి. పిండి పదార్థమైతే- వరిలో 77%, గోధుమల్లో 64% వరకు.. చిరుధాన్యాల్లో 60-70% వరకు ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50-55 శాతమే ఉంటుంది. వీటి నుంచి 330-345 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. బియ్యం, గోధుమల్లో 2% కొవ్వు ఉంటుంది. చిరుధాన్యాల్లో ఇది ఎక్కువ. అత్యధికంగా సజ్జలతో 5% వరకు కొవ్వు లభిస్తుంది. జొన్న, కొర్రలు, వరిగెల్లో 3 నుంచి 3.5% ఉంటుంది. ఈ కొవ్వు హాని చేసేది కాదు. మంచి శక్తిని ప్రసాదిస్తుంది. వీటిల్లో విటమిన్ ఈ కూడా ఎక్కువే. ఖనిజ లవణాల విషయంలో చిరుధాన్యాలదే పైచేయి. రాగుల్లో పాలతో సమానంగా 344 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. బియ్యం, గోధుమల్లో ఐరన్ అంతగా ఉండదు. చిరుధాన్యాల్లో ఇది మంచి పాళ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సజ్జల్లో 8 మి.గ్రా., సామల్లో 9.3 మి.గ్రా ఐరన్ ఉంటుంది. రాగులు, జొన్నల్లో సుమారు 4 మి.గ్రా. ఉంటుంది. రక్తహీనత తగ్గటానికిది ఎంతో అవసరం. జీవక్రియల్లో పాలు పంచుకునే మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటివీ వీటిల్లో ఎక్కువే. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కావటానికి మెగ్నీషియం.. ఎదుగుదలకు జింక్ తోడ్పడుతుంది. అయితే బియ్యం, గోధుమల్లో కన్నా చిరుధాన్యాల్లో థయమిన్ తక్కువగా ఉంటుంది. నైసిస్, పెరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ వంటివి మాత్రం బాగానే ఉంటాయి. కొన్నింటిలో విటమిన్ ఏ, బీటా కెరటిన్లు కూడా ఉంటాయి.డాక్టర్ బీ గోపిచంద్, హెచ్ఓడీ, డీన్ మిజోరం యూనివర్సిటీ(చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..) -
లాంజ్లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి
ఎయిర్పోర్టులో లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటే లాంజ్ యాక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. కంఫర్టబుల్ సీటింగ్, ఫ్రీ ఫుడ్, వైఫై లాంటి ఫెసిలిటీస్తో ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ మరింత బెటర్ అవుతుంది. కానీ అందరికీ లాంజ్ యాక్సెస్ ఉచితంగా లభించదు. కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా యాక్సెస్ పొందవచ్చు.క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్చాలా ప్రీమియం కార్డుల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని కార్డుల్లో సంవత్సరానికి లిమిటెడ్ ఫ్రీ ఎంట్రీస్ ఇస్తారు. ట్రావెల్కు ముందు మీ కార్డ్ బెనిఫిట్స్ చెక్ చేసుకుంటే ఈజీగా ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.ఎయిర్లైన్ లాయల్టీ ప్రోగ్రామ్స్ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ కోసం ఎయిర్లైన్స్ స్పెషల్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇస్తాయి. పాయింట్స్ కలెక్ట్ చేసి ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రెగ్యులర్గా అదే ఎయిర్లైన్తో ట్రావెల్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.ఎర్లీ ఫ్లైట్ అప్గ్రేడ్స్కొన్నిసార్లు బిజినెస్ క్లాస్కి లాస్ట్ మినిట్ అప్గ్రేడ్ ఆఫర్స్ వస్తాయి. కొంచెం ఎక్స్ట్రా పే చేసి అప్గ్రేడ్ తీసుకుంటే లాంజ్ యాక్సెస్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది.ట్రావెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్కొన్ని ట్రావెల్ మెంబర్షిప్ సర్వీసెస్లో లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి. యాన్యువల్ మెంబర్షిప్ తీసుకుంటే మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్లో లాంజ్ యూజ్ చేయవచ్చు.స్పెషల్ ఆఫర్స్ అండ్ డీల్స్ఫెస్టివ్ సీజన్ లేదా ట్రావెల్ డీల్స్ సమయంలో కొన్ని కార్డ్స్ లేదా బుకింగ్ ఫ్లాట్ఫామ్స్ స్పెషల్ లాంజ్ యాక్సెస్ ఆఫర్స్ ఇస్తాయి. అలెర్ట్స్ ఫాలో అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందడం కష్టం అనిపించినా, కరెక్ట్ ట్రిక్స్ ఉపయోగిస్తే సాధ్యమే. కొంచెం ప్లానింగ్తో మన ట్రావెల్ అనుభవాన్ని కంఫర్టబుల్, ప్రీమియంగా మార్చుకోవచ్చు. -
భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!
ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజం. అయితే వాటిని అధిగమిస్తు ఎలా ముదుకుపోతామనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టెకీ ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ.. అందంగా తీర్చిదిద్దుకున్న తన కెరీర్ సక్సెస్ని షేర్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఎవ్వరైన చూపించాల్సిన తెగువ, పట్టుదలను హైలెట్ చేస్తున్న ఈ స్టోరీ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఆ టెకీనే బారతీ సంతతికి చెందిన ప్రియాంక వర్గాడియా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో సీనియర్ డైరెక్టర్ డెవలపర్ జీటీఎం మార్కెటింగ్గా పనిచేస్తున్నారామె. ఇన్స్టాగ్రామ్లో తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు. పోస్ట్లో తన కెరీర్ ప్రారంభంలో చాలా పోరాటాలు, రిస్క్లు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో భారీ విద్యా రుణం తీసుకున్నానని వెల్లడించింది. అక్కడ అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు సుమారు రూ. 40 లక్షల దాక రుణం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత భారత్ నుంచి అమెరికాకు తన తొలి ఫ్లైట్ జర్నీ కోసం కూడా తన తండ్రి భూమిని తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఆ రోజు తన విదేశీ ప్రయాణం ఎంత భారమైందో మర్చిపోలేనని, అక్కడ ఒంటరిగా చదవు సాగించడం అంత సులభం కాదని అంటోంది. అక్కడ విద్యా వ్యవస్థకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుందని అంటోంది. ఎందుకంటే అక్కడ బోధనాపద్ధతులు, కొత్త వాతావరణానికి సర్దుకుపోవడం అంత సులభమైనవి కావని, పైగా తన చదువు, వంట, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు తన విద్యార్ధి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడిని కూడా భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన అప్పులు తీర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగం సంపాందించక తప్పని పరిస్థితి. ఇవన్నీ తనని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసేవని అంటోంది. ఈ సవాళ్లన్నింటిని ఎదుర్కొనడానికి తొందరలో మంచి భవిష్యత్తు కచ్చితంగా ఉందనే ఆశ..కొండంత ధైర్యాన్ని ఇచ్చేదని పేర్కొంది. ముందున్న జీవితం గురించి అంతరంగంలో నిశబ్దమైన ఉత్సాహం, అలాగే తాను తీసుకున్న సాహసం చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం తదితరాలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ ఆమె మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు. అలాగే తన ఉద్యోగం కారణంగా అనేక ప్రదేశాలకు పర్యటించే అవకాశం కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం తన తల్లిదండ్రులను అమెరికాకి తీసుకురావడం.. తాను సాధించిన అతిపెద్ద ఘనత అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులకు అదే తొలి విమాన ప్రయాణ అనుభవమని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఉద్యోగ కెరీర్ లైఫ్లో ఎన్నో విమాన ప్రయాణాలు చేసినా.. తన హృదయంలో మాత్రం.. ఆనాడు భయంతో చేసిన తొలి విమాన ప్రయాణానికే ఎప్పటికీ ప్రత్యేక స్థానం అని చెబుతోంది.(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
నాయకుడిలా ఆలోచించడం ఎలా..?
చాలామంది నాయకత్వం అంటే ఒక పదవి (Position) లేదా పదిమంది మీద అధికారం చలాయించడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, లీడర్షిప్ అనేది ఒక 'మైండ్సెట్'.మీరు ఒక టీమ్ కి హెడ్ అయినా కాకపోయినా, మీ ఆలోచనా విధానం ఒక నాయకుడిలా ఉంటే.. ప్రపంచం మిమ్మల్ని అనుసరించడం మొదలుపెడుతుంది.నాయకత్వం అంటే దారి చూపించడం కాదు, ఆ దారిలో అందరినీ నడిపించడం. ఒక నాయకుడి వ్యక్తిత్వం సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. వారు సమస్యను చూసే విధానం, మనుషులను అర్థం చేసుకునే తీరు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. నాయకుడిలా ఆలోచించడానికి కావలసిన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఉంది.బాధ్యత (Extreme Ownership)సాధారణ వ్యక్తి తప్పు జరిగితే ఇతరులను వేలెత్తి చూపుతాడు (Blame game). కానీ ఒక నాయకుడు 'Extreme Ownership' తీసుకుంటాడు."పని జరగలేదా? అది నా బాధ్యత. నా టీమ్కి నేను సరిగ్గా వివరించలేకపోయాను"అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకుంటారో, అప్పుడే మీకు ఆ సమస్యను పరిష్కరించే 'అధికారం' (Power) లభిస్తుంది. బాధ్యత తీసుకోని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడు.విజన్ vs ఎగ్జిక్యూషన్ (Vision vs Execution)నాయకుడు ఎప్పుడూ రెండు కళ్లతో చూస్తాడు. ఒక కన్ను భవిష్యత్తు మీద (Vision) ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో మనం ఎక్కడ ఉండాలి? మన లక్ష్యం ఏంటి? అని ఆలోచిస్తుంది. మరో కన్ను ప్రస్తుత పని మీద (Execution) ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఈ రోజు మనం చేయాల్సిన చిన్న పని ఏంటి? అని ఆలోచిస్తుంది. కేవలం కలలు కనేవాడు 'ఉత్తమ ఆలోచనాపరుడు' అవుతాడు, కానీ ఆ కలలను నిజం చేసేవాడే 'నాయకుడు' అవుతాడు.ఎమోషనల్ స్టెబిలిటీ (Emotional Stability)యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం ఎప్పుడూ సేనాపతి ముఖం వైపు చూస్తుంది. సేనాపతి కళ్ళలో భయం ఉంటే సైన్యం ఓడిపోతుంది. అలాగే, ఆఫీసులోనో, ఇంట్లోనో సమస్య వచ్చినప్పుడు మీరు ఎంత 'ప్రశాంతంగా' ఉన్నారనేదే మీ నాయకత్వ లక్షణం.మీ నియంత్రణలో లేని వాటి గురించి ఆందోళన చెందకుండా, మీరు చేయగలిగిన దానిపై దృష్టి పెట్టడమే Stoicism.నాయకత్వ లక్షణాలను బిల్డ్ చేయడంGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీలోని లీడర్ని మేల్కొలిపే విధానం.Step 1: అనుసరించే తత్వాన్ని బ్రేక్ చేయండి"ఎవరో వస్తారు, ఏదో చేస్తారు" అని ఎదురుచూసే మనస్తత్వాన్ని 'Break' చేయండి. ఎవరూ రాకపోయినా, నేను మొదలుపెడతాను అనే చొరవ తీసుకోండి. నాయకుడు ఎప్పుడూ మొదటి అడుగు వేస్తాడు.Step 2: పీపుల్ స్కిల్స్ పెంచుకోండినాయకత్వం అంటే మనుషులతో పని చేయించడం. ఎదుటివారిలోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం నేర్చుకోండి. మీ గెలుపు కంటే మీ టీమ్ గెలుపు ముఖ్యం అని భావించినప్పుడే మీరు ఒక నాయకుడిగా ఎదుగుతారు. సహానుభూతి (Empathy) మీ అతిపెద్ద ఆయుధం.Step 3: లెగసీ మేకింగ్ మీరు లేకపోయినా మీ సిస్టమ్ నడవాలి. మీరు నేర్చుకున్నది పదిమందికి నేర్పించి, మరో పదిమంది నాయకులను తయారు చేయడమే 'Beyond' స్టేజ్. నిజమైన నాయకుడు అనుచరులను కాదు, మరో నాయకులను తయారు చేస్తాడు.మీలో నాయకుడు ఉన్నాడా?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:సమస్య వచ్చినప్పుడు మీరు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నారా? లేక ఎవరిని నిందించాలి అని చూస్తున్నారా?మీరు చేసే పని వల్ల కనీసం ఒక్కరికైనా ఉపయోగం ఉందా?మీరు మాట్లాడేటప్పుడు ఇతరులలో నమ్మకాన్ని నింపుతున్నారా?నాయకత్వం ఒక ఎంపిక!బ్రో, నాయకత్వం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది మీరు తీసుకునే 'నిర్ణయం'. మీరు మీ జీవితానికి నాయకుడిగా మారిన రోజే, ప్రపంచానికి నాయకుడిగా మారే ప్రయాణం మొదలవుతుంది. మీ వ్యక్తిత్వమే మీ అధికారం."A leader is one who knows the way, goes the way, and shows the way." (జాన్ సి. మాక్స్వెల్). -
యద్భావం తద్భవతి
వరదల ధాటికి ఒక ఊరు పెద్ద మొత్తంలో నష్ట పోయింది. ఆ ఊరి రైతుల ప్రధానపంట వేరుశనగ. వరద నీటి వల్ల వారు విత్తనాలకని దాచిపెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పనికిరాకుండా పోయాయి. అందరూ వెళ్ళి జమీందారును సహాయం చేయమని కోరారు. దానగుణం కలిగిన జమీందారు సహాయం చేయడానికి అంగీకరించాడు. రైతులు అడిగినన్ని విత్తనాలు ఇవ్వసాగాడు.అదే సమయంలో అక్కడికి ఒక ముసలావిడ విత్తనాలకని వచ్చింది. ఆమె గురించి తెలిసిన కొందరు ఆమెను వింతగా చూశారు. మరి కొందరైతే ‘నీకు సెంటు నేల లేదు. నువ్వెక్కడ పండిస్తావు? నువ్వు పండించినా తినడానికి నీకు పిల్లాజెల్లా లేరు కదా’ అని వేళాకోళం చేశారు. ఆమె నవ్వి ఊరుకుంది. జమీందారు మాత్రం ఆమె అడిగినన్ని విత్తనాలు ఇచ్చి పంపాడు. మూడు నెలలు గడిచింది. వేరుశనగ తోటలు కోతకు సిద్ధమయ్యాయని తెలిసి వాటిని చూడటానికని జమీందారు జట్కాలో బయలుదేరాడు. ఆ ఊరి రైతులందరూ జమీందారుకు పడీపడీ నమస్కరించారు. తాము నాటిన వేరుశనగ తోటలను చూపారు. ఆ మొక్కలన్నీ పొట్టిగా, బలహీనంగా, ఆకులు ఎండి పోయి ఉన్నాయి. రైతులకు సరైన ఫలితం వచ్చే సూచనలు కనిపించలేదు. బాధగా వెనుదిరిగాడు.ఎండ ఎక్కువయ్యింది. విశ్రాంతి కోసం ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. ఎదురుగా చిన్న గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద వేరుశనగ మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటి ఆకులు గాఢ పచ్చ రంగులో ఉన్నాయి. ఆశ్చర్య పోయాడు జమీందారు. చిన్నగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముసలావిడ కూర్చుని ఉంది.‘మీ ఊర్లో వేరుశనగ పంట ఎవ్వరికీ సరిగా పండలేదు, నీకు మాత్రం ఎలా పండింది?’ అని అడిగాడు. ఆమె చల్లటి కుండ నీళ్ళు జమీందారు చేతికి ఇస్తూ ‘నా ప్రార్థన వల్ల’ అని బదులిచ్చింది.ఆసక్తిగా ‘నువ్వు ఏమని ప్రార్థన చేశావో నాకు చెప్పు!’ అన్నాడు.నాకు పొలం లేదు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇవి బాగా పండితే ఎవరో ఒకరు తింటారని ఈ గుట్ట మీద నిలబడి విత్తనాలు చల్లాను. అలా చల్లేటప్పుడు... ‘కాపలాదారుడు తినగా మిగిలింది, దొంగ తినగా మిగిలింది, చూసినవాడు తినగా మిగిలింది, పక్షులు తినగా మిగిలింది, నాకూ కొంత మిగిలితే సంతోషం స్వామీ’ అని దేవుణ్ణి ప్రార్థించాను’’ అని చెప్పింది.ఆమె సహృదయతకు జమీందారు చలించి పోయాడు. ‘మనం మంచిగా ఆలోచించి ఒక పని చేస్తే ప్రకృతి పదింతల సహాయం చేస్తుందని’ జమీందారుకు అర్థం అయింది. ఆమెకు హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
యక్షప్రశ్న లంటే..?
ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటుంటే యక్షప్రశ్నలు వేస్తున్నావు అనడం....పరిపాటి. అసలు యక్షప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని ఏ సందర్భంలో అడిగారో ఇపుడు తెలుసుకుందాం. అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోని అరణ్యపర్వానికి సంబంధించినవే.. ఈ యక్ష ప్రశ్నలు. పాండవులు మాయాజూదంలో ఓడిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైత వనానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు తన ‘అరణి‘( నిప్పు పుట్టించే కర్ర ) ఒక మృగం తీసుకు పోయిందని, దానిని వెతికి ఇవ్వమని ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అంటే... పాండవుల్లో పెద్దవాడు, బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు.ధర్మరాజు ధర్మనిష్టకు పరీక్షయే ఈ యక్షప్రశ్నలు. ధర్మరాజు తన తమ్ముళ్లలో నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముని ఒకరి తరవాత మరొకరిని అరణి తీసుకుని రావలసిందిగా కోరడంతో వారు అరణ్యంలోకి వెళ్లడం ఎంతకూ తిరిగి రాక పోవడంతో చివరకు ధర్మరాజే.. బయలుదేరి వెళ్ళాడు. అయితే తన సోదరులు విగతజీవుల్లా ఒక సరస్సు వద్ద పడి ఉండడాన్ని ధర్మరాజు గమనించాడు. ఈ నేపథ్యంలో తనకు దాహంగా ఉండడంతో సరస్సులో నీరు తాగేందుకు దిగుతుండగా ఒక యక్షుని అదృశ్యవాణి వినిపించింది. ఓ.. ధర్మరాజా! నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు తాగేందుకు మంచి నీరు లభిస్తుందని, లేకుంటే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అందుకు ధర్మరాజు సరే అనడంతో ఆ యక్షుడు 72 ప్రశ్నలను అడుగుతాడు. వాటన్నిటికీ ధర్మరాజు సక్రమంగా సమాధానాలను చెప్పడంతో ఆ యక్షుడు సంతృప్తి చెంది, మీ సోదరులలో ఒకరిని మాత్రమే బతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాడు. అందుకు ధర్మరాజు తన పినతల్లి కుమారులైన నకుల, సహదేవులలో ఒకరిని బతికించమని కోరడంతో ఆ యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు సంతోషించి, అందరికీ ప్రాణదానం చేస్తాడు. ధర్మాచరణ విశిష్టతను తెలిపిన ప్రశ్నలనే యక్షప్రశ్నలు అంటారు.– సి.ఎన్. మూర్తి, పాత్రికేయులు -
మౌనం..అంతరంగ అన్వేషణకు మార్గం
భారతీయ జీవన దర్శనం మౌనాన్ని ఒక మహోన్నత తపస్సుగా, ముని వృత్తిగా అభివర్ణించింది. ‘మౌనం సర్వార్థ సాధకమ్‘ – అనగా మౌనం ద్వారా సమస్త కార్యాలను సాధించవచ్చు. మౌనం అంటే కేవలం పెదవులు మూసి ఉంచడం కాదు; అనవసర ఆలోచనలను నియంత్రించి మనసును నిశ్శబ్దంగా మార్చడం.నేటి ఆధునిక కాలంలో మనిషి నిరంతరం బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య, సామాజిక మాధ్యమాల అలజడిలో జీవిస్తున్నాడు. ఈ గందరగోళం వల్ల తనతో తాను మాట్లాడుకునే అమూల్య సమయాన్ని కోల్పోతున్నాడు. మౌనం మనలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను, వివేకాన్ని మేల్కొల్పుతుంది. మాటల ద్వారా వ్యయమయ్యే శక్తిని ఆదా చేసి, ఆ శక్తిని అంతరంగ వికాసానికి ఉపయోగించేలా చేస్తుంది.వైదిక ఆధ్యాత్మిక చరిత్రలో మౌనానికి రమణ మహర్షి ఒక మహోన్నత నిదర్శనం. ఆయన కేవలం తన మౌనం ద్వారానే భక్తుల సంశయాలను నివృత్తి చేసేవారు. మాటలు వివరించలేని గూఢ సత్యాలను మౌనం సులువుగా వివరిస్తుంది. అలాగే, దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు మౌన ముద్ర ద్వారానే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అశాంతిగా ఉన్న మనసు ఎప్పుడూ వాదిస్తుంది; ప్రశాంతమైన చిత్తం మౌనంలో లీనమవుతుంది. మౌనం మనల్ని అహంకారం నుండి విముక్తులను చేసి, పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. లోతైన నిశ్శబ్దంలోనే దైవ వాక్కు వినిపిస్తుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనం మాట్లాడే మాటల్లో చాలా వరకు అనవసరమైనవి, ఇతరులను నొప్పించేవి ఉంటాయి. మౌనాన్ని అలవర్చుకోవడం వల్ల వాక్ దోషాలు నశిస్తాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు ఎదురు దాడి చేసే కంటే, కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా ఏకాంతంగా మౌనం పాటించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది మన నరాల వ్యవస్థకు విశ్రాంతినిచ్చి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాటలకు అంతటి గౌరవం పెరుగుతుంది. మౌనం బలహీనత కాదు; అది ఒక ఉన్నతమైన మానసిక పరిపక్వత.ఆర్ష సంస్కృతి అందించిన ఈ మౌన మార్గం వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్న నానుడి అక్షర సత్యం. మన అంతరంగంలో మౌనం అనే జ్యోతి వెలుగుతున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని కల్లోలాలు మనల్ని స్పృశించలేవు. మాటలకందని ఆనందాన్ని అనుభవించాలంటే మౌనమే ఏకైక శరణ్యం. అశాంతిని వీడి, మౌనాన్ని ఆలింగనం చేసుకుని ఆత్మాన్వేషణ సాగిద్దాం. మౌనమే శక్తి, మౌనమే శాంతి. సర్వం నిశ్శబ్దమయం!బాహ్య ప్రపంచంలో మనం ఎంత ఎదిగినా, అంతరంగంలో మౌనాన్ని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. మౌనంలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి; వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగు వైపు, అశాంతి నుండి ప్రశాంతత వైపు నడిపించే దివ్య మార్గం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఈ సండే సరదాగా 'కేసర్ పిస్తా దోసె' ట్రై చేయండిలా..!
కేసర్ పిస్తా దోసెకావలసినవి: బియ్యం–ఒక కప్పు, మినపప్పు–పావు కప్పు , శనగపప్పు–ఒక టేబుల్ స్పూన్ , మెంతులు–ఒక టీ స్పూన్ , ఉప్పు– రుచికి సరిపడా, కుంకుమ పువ్వు–15, వేడి పాలు–2 టేబుల్ స్పూన్లు, నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు, ఏలకులు–3 (పొడి చేయాలి)పిస్తా చట్నీ కోసం: పిస్తా–100 గ్రాములు, పచ్చి మిరకాయలు–2, తురిమిన కొబ్బరి–2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం–ఒక టీ స్పూన్ , జీలకర్ర పొడి–అర టీ స్పూన్, ఉప్పు –రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పులను కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటల సేపు పులియబెట్టండి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పావుగంట ఉంచండి. ఈ పాలను పులిసిన దోసెపిండిలో వేసి, బాగా కలపండి. అదే సమయంలో ఏలకుల పొడి కూడా కలపండి. అంతే దోసెపిండి రెడీ. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యితో దోసెలు వేసుకోవాలి.పిస్తా చట్నీ తయారీ: పిస్తా, పచ్చి మిరపకాయలు, కొబ్బరి తురుము, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే టేస్టీ పిస్తా చట్నీ రెడీ. ఈ వేడి వేడి దోసెలను ఈ చట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.రష్యన్ మష్రూమ్ జూలియన్ కావలసినవి: పుట్టగొడుగు ముక్కలు–250 గ్రాములు ఉల్లిపాయ–1, వెల్లుల్లి రెబ్బలు–2, వెన్న–ఒకటిన్నర టేబుల్ స్పూ¯Œ హెవీ క్రీమ్–ముప్పావు కప్పు, మోజరెల్లా చీజ్– ఒక కప్పు (తురిమినది), మిరియాల పొడి–ఒక టీ స్పూన్, ఉప్పు– రుచికి సరిపడా. తయారీ: ముందుగా ఒక కడాయిలో టీ స్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పుట్టగొడుగుల్లోని నీరు ఆవిరయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న సిరామిక్స్ బౌల్స్లో వేయాలి. అదే పాన్లో అర టీస్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో హెవీ క్రీమ్ వేసి మిక్స్ చేయండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సాస్లా బాగా కలపండి. ఈ సాస్ను ముందుగా రెడీ చేసిన పుట్టగొడుగుల మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 375 ఫారన్హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన మైక్రోవేవ్ ఒవెన్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేయండి. అంతే టేస్టీ రష్యన్ మష్రూమ్ జూలియన్ రెడీ.ఛత్తీస్గఢీ ఫరా కావలసినవి: అన్నం–ఒక కప్పు, బియ్యప్పిండి–2 కప్పులు, ఎండు మిరపకాయలు–2, నువ్వులు–ఒక టేబుల్ స్పూన్ , జీలకర్ర– ఒక టేబుల్ స్పూన్, ఆవాలు–ఒక టీ స్పూన్ , కరివేపాకు–రెండు రెమ్మలు, పచ్చిమిర్చి–3 (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర–కొద్దిగా, నూనె–తాలింపు కోసం, ఉప్పు–రుచికి సరిపడా.తయారీ: ముందుగా వండిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి చపాతీ ముద్దలా తయారు చేసి కాసేపు ఉంచండి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నిలువుగా చిత్రంలో చూపిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని స్టీమర్ సాయంతో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. మరోవైపు పాన్ లో కొద్దిగా నూనె వేసి 2 ఎండు మిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు వేయించండి. అంతే టేస్టీ ఫరా రెడీ. వీటిని పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి. -
సహజ మెరుపుని అందించే 'ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్'
ఎండ వేడి, కాలుష్యం, ఒత్తిడి వంటి వివిధ కారణాలతో చాలామందిలో నల్లటి మచ్చలు, ముఖం మీద సన్నని రంధ్రాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో ముఖం నిస్తేజంగా మారుతుంది. ఇటువంటి సమయంలో ముఖంలోని సహజ మెరుపును తిరిగి పొందేందుకు చాలా మంది పార్లర్లకు వెళుతుంటారు. అయితే చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చుకునేందుకు ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ సాయపడుతుంది. ఇది చర్మాన్ని చల్లగా మార్చి తాజాగా ఉంచుతుంది. దీని సాయంతో ఎటువంటి రసాయనాలు లేకుండానే ఇంట్లోనే సహజమైన నిగారింపు పొందవచ్చు.ఐస్ క్యూబ్లను నేరుగా ముఖానికి రాసుకుంటే చర్మం ఎర్రగా మారడం, మంట, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ ఉపయోగిస్తే చల్లని స్పర్శ ముఖం అంతటికి సమానంగా అందుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం సహజంగా కాంతిమంతంగా మారుతుంది. చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు రావు. ఈ పరికరంతో సున్నితంగా మసాజ్ చేస్తే చర్మంపై ఏర్పడిన సన్నని రంధ్రాలు తగ్గి, చర్మం నునుపుదేరుతుంది. కళ్ల కింద వాపు, ముఖంపై అలసట మటుమాయం అవుతాయి. ఎండ ధాటికి చర్మం వడలిపోయే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు కూడా ఈ మసాజర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మసాజర్ను ఉపయోగించడం చాలా తేలిక. మసాజర్లో నీటిని నింపి ఫ్రీజర్లో ఉంచాలి. నీరు గడ్డకట్టిన తర్వాత ముఖంపై మసాజ్ చేస్తే చాలు, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మసాజర్ కేవలం అందాన్ని పెంచడమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పోర్టబుల్ సైజులో ఉండటంతో ఉపయోగించడం చాలా సులభం. తక్కువ ఖర్చుతో, ఎలాంటి రసాయనాలు లేకుండా ముఖాన్ని మెరిపించుకునేందుకు ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ మంచి ఎంపికనే చెప్పుకోవాలి. ఆన్లైన్లో లభిస్తున్న ఈ పరికరం ధర కేవలం రూ. 2,299 మాత్రమే.(చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
పట్టులాంటి జాలువారే కురులు కోసం..
పట్టులా జాలువారే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. పార్లర్లలో క్రీములు వాడి, ఆవిరి పట్టించి జుట్టుకు సత్వరమే మెరుపును, మృదుత్వాన్ని అందిస్తారు. అయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ చెప్పిన చిన్న ట్రిక్తో ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టును మెరిసేలా, సిల్కీగా మార్చుకోవచ్చు. ఇందుకోసం బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకోండి. ఈ నీటిలో మూడు స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టండి. తల స్నానం చేసిన వెంటనే తల తడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. తర్వాత నీటిలో ముంచిన మెత్తని కాటన్ గుడ్డను తలకు చుట్టుకోవాలి. కాసేపటికి ఫ్యాన్ గాలి తగిలేలా కూర్చోవాలి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేసుకుంటే చాలు మెరిసే, పట్టుకుంటే జారిపోయే కురులు మీ సొంతమవుతాయి. -
ప్రెగ్నెన్సీ టైంలో శరీరమంతా దురదలు వస్తాయా..?
నేను ఎనిమిదో నెల గర్భిణిని. రెండు రోజులుగా శరీరం అంతా కొద్దిగా దురదగా ఉంటోంది. ఇది ఏమైనా సమస్యా? ఏమి చేయాలి?– రమ్య, గుంటూరు.సాధారణంగా 30 నుంచి 32 వారాల గర్భధారణలో, ముఖ్యంగా మొదటి గర్భం సమయంలో, కొంతమందికి శరీరం మీద దురదలు రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా కొన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. దురదలు శరీరం అంతా ఉన్నాయా లేక అరికాళ్లు, అరిచేతుల్లో మాత్రమే ఉన్నాయా అని తెలుసుకోవాలి. అలాగే పగలు ఎక్కువగా ఉంటాయా, రాత్రి ఎక్కువగా ఉంటాయా అన్నది చూడాలి. కొంతమందికి దురదలు ఎక్కువగా ఉండి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇవి మైల్డ్గా ఉన్నాయా లేక తీవ్రమైనవా అన్నది అంచనా వేయాలి. ఇలాంటి సందర్భంలో తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. రక్తపోటు వంటి ముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. అలాగే బిడ్డ బాగున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి, డాప్లర్ పరీక్ష ద్వారా బిడ్డ బరువు, గర్భంలో ఉన్న ఉమ్మనీరు పరిమాణం, బిడ్డకు రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. దురదలు తేలికగా ఉంటే సాధారణంగా యాంటీహిస్టమిన్ మందు, చర్మానికి రాసుకునే లోషన్ లేదా మాయిశ్చరైజర్ ఇచ్చి రెండు రోజులు పరిశీలిస్తారు. చాలాసార్లు ఇవి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. అయితే దురదలు ఎక్కువగా ఉన్నా లేదా మందులతో రెండు రోజులలో తగ్గకపోవడం జరిగినా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా సీరమ్ బైల్ యాసిడ్స్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ అనే సమస్య ఉందా లేదా చూడాలి. ఈ పరిస్థితిలో బైల్ యాసిడ్స్ పెరగడం వల్ల గర్భిణికి ఎక్కువగా దురదలు రావచ్చు. అలా ఉంటే దానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స తీసుకుంటే దురదలు తగ్గి బిడ్డ ఎదుగుదల కూడా సాధారణంగా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ కాలంలో, ముఖ్యంగా 38 వారాల వరకు లివర్ ఫంక్షన్ టెస్టులు, బైల్ యాసిడ్స్ పరీక్షలు తరచూ చేయించు కోవాలి. సాధారణంగా 38 వారాలు వచ్చిన తర్వాత డెలివరీ చేయడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ ఉన్నప్పుడు 38 వారాల కల్లా డెలివరీ చేస్తే తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.నాకు నలభై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయితే, గత నాలుగు నుంచి ఆరు నెలలుగా నెలసరిలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఏమి చేయాలి?– లక్ష్మీ దేవి, కర్నూలు.ఇలాంటి సమస్యతో వచ్చినప్పుడు ముందుగా రోగి డీటెయిల్డ్ హిస్టరీ తెలుసుకోవాలి. సైకిల్ రెగ్యులర్గా ఉన్నా రక్తస్రావం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉందా, లేక ఏడు రోజులు లేదా పది రోజులకంటే ఎక్కువ కొనసాగుతుందా అన్నది తెలుసుకోవాలి. అలాగే రోజుకు ఎన్ని ప్యాడ్లు మార్చాల్సి వస్తోంది, రాత్రిపూట కూడా లేచి మార్చాల్సి వస్తుందా, గడ్డలు పడుతున్నాయా, కడుపునొప్పి ఉందా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. నలభై నాలుగు ఏళ్ల వయసు పెరిమెనోపాజ్ దశకు దగ్గరగా ఉండే వయసు కాబట్టి ఇలాంటి బ్లీడింగ్ ఎందుకు అవుతోంది అన్నది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం హిమోగ్లోబిన్ , సీబీపీ, థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, అలాగే మధుమేహానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. అదనంగా అల్ట్రాసౌండ్ స్కాన్ తప్పనిసరిగా చేస్తారు. స్కాన్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయా, లేదా ఎడినోమయోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇవి లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే గర్భసంచి పొర మందం, అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉందో చూస్తారు. ప్రాథమికంగా రక్తస్రావం తగ్గించడానికి నాన్ హార్మోనల్ మందులు ఇస్తారు. హార్మోనల్ చికిత్స ప్రారంభించే ముందు బ్లీడింగ్కి కారణమేమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైబ్రాయిడ్లు లేదా ఇతర సమస్యలు లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్ ఎండోమెట్రియల్ బయోప్సీ చేస్తారు. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పరిస్థితిని నేరుగా చూసి, అక్కడి నుంచి చిన్న టిష్యూ నమూనా తీసి పరీక్షకు పంపడం. దీనివల్ల హార్మోన్ మార్పులు ఉన్నాయా లేదా కేన్సర్కు సంబంధించిన మార్పులు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, నాన్ హార్మోనల్ మందులతో సమస్య తగ్గకపోతే హార్మోనల్ చికిత్స ఇవ్వచ్చు. ఇది మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. మరో విధానం గర్భసంచి లోపల పెట్టే ప్రత్యేక పరికరం. ఇది కాపర్ టీ లాంటిదే కానీ ఇందులో హార్మో నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనిని పెట్టిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని వల్ల నెలసరి క్రమంగా రావడం, రక్తస్రావం తగ్గడం, రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడడం సాధ్యమవుతుంది. ∙డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
పక్షవాతానికి వార్నింగ్ బెల్..!
పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్ సిగ్నల్స్. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్ స్ట్రోక్కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి. కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు. అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. టీఐఏ లక్షణాలు: ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్ తప్పడం) అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్గా తీసుకుని, డాక్టర్ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్స్టైల్ మాడిఫికేషన్స్తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్కు కారణాలు... 1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉన్నవారిలో పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్ ఆప్నియా), నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు. చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.డా. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ (చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!) -
'మత్తు'కు మందు ఇలా..!
ఇటీవల డ్రగ్స్ అనే మహమ్మారి సెలిబ్రిటీల వేడుకల్లో కనిపించడం పరిపాటిగా మారింది. ఇక చిన్నపిల్లలూ, టీనేజ్ బాలల్లో ఈ అలవాటు పెరుగుతుండటం చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో టీనేజ్ పిల్లలు కొంత పెద్దయ్యాక మద్యం అలవాటుకు దగ్గరవుతుంటేనే ఎంతో ఆందోళనగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పెద్ద నగరాల్లోని కొన్ని పబ్స్లో, పార్టీలలో, న్యూ ఇయర్ వేడుకల్లాంటి సోషల్ ఈవెంట్స్లో డ్రగ్స్ కనిపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు... పెద్ద పెద్ద హోదాల్లో, పదవుల్లో ఉన్నవాళ్ల పార్టీల్లోనూ డ్రగ్స్ కనిపించడం బెంబేలెత్తిస్తోంది. డ్రగ్స్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో... తమ టీనేజ్ పిల్లలూ, కుటుంబ సభ్యుల్లోని యువత ఇలా డ్రగ్స్కు అలవాటు పడటాన్ని తల్లిదండ్రులు గుర్తించడం ఎంతో అవసరం. డ్రగ్స్ అలవాటు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలపడం, దానికి కావాల్సిన చికిత్స ప్రక్రియలను సూచించడం కోసమే ఈ కథనం...ఈమధ్య కాలంలో కొన్ని స్కూల్ ప్రాంగణాలలో హైస్కూల్ స్థాయికి వచ్చిన పిల్లలు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశ్లేషకుల పరిశీలనల్లో డ్రగ్స్కు అలవాటు పడటం 14 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో ఎక్కువని తెలుస్తోంది. అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నా ఈ కింది వాటిని ప్రధానమైనవిగా పరిగణించవచ్చు. అవి... పాశ్చాత్య ధోరణుల్లోని పెడపోకడలను మన పిల్లలూ అనుసరించడం / అనుకరించడం సెలిబ్రిటీలు కుటుంబాల్లో లేదా బాగా ధనవంతుల ఫ్యామిలీలలో పిల్లలపై పేరెంట్స్ పర్యవేక్షణ తక్కువగా ఉండటం స్నేహితులూ, తోటివారు చేస్తున్న పనులు చూసి... వాటిలో ఏదైనా ఆనందాన్ని తాము మిస్ అవుతున్నామన్న భావనతో వాళ్లను అనుకరించడం (పియర్ ప్రెషర్స్)ఆర్థికంగా మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం తోపాటు కొత్తగా టీన్స్లో ఉండే సహజ ఉత్సాహంతో జీవితాన్ని ఎడ్వెంచరస్గా, ఎక్సయిటింగ్గా ఉండేలా చేసుకోవాలనే తాపత్రయంతో ఈ పెడదారులు తొక్కడం మానసిక ఒత్తిడులనుంచి చాలా త్వరితంగా బయటపడాలన్న ఆకాంక్ష. డ్రగ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు... ఈలోకంలోని చాలామందిలో ఒక అ΄ోహ ఉంటుంది. తమపై తమకు నియంత్రణ ఎక్కువ అనీ, తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓ అలవాటు మానుకోగలమనే అపోహ ఉండటం చాలా సహజం. కానీ డ్రగ్స్ విషయంలో అలా కాదు. అవి మనిషిని బానిసగా మార్చేస్తాయి. అందుకే డ్రగ్స్ను మొదలుపెట్టి వదిలించుకోడానికి ప్రయత్నించడం కంటే ముందునుంచే దూరంగా ఉండటం మేలుడ్రగ్స్ తాలూకు దుష్పరిణామాలు చాలా దీర్ఘకాలం ఉపయోగించాక కనిపిస్తాయని అనుకోవడం సాధారణం. కానీ చాలా సందర్భాల్లో ఆరోగ్యంపై చూపే ఆ దుష్ప్రభావాలు తొలిసారే కనిపించవచ్చు. పార్టీ స్పైకింగ్ అంటే... : కొత్త అమ్మాయిలకూ లేదా అప్పటివరకూ ఎప్పుడూ మత్తుమందుల జోలికి వెళ్లని అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేయడం కోసం... వాళ్లకు తెలియకుండానే మత్తు ఇవ్వడాన్ని ‘పార్టీ స్పైకింగ్’గా చెబుతారు.సహజంగా అలవాటుగా మారే డ్రగ్స్ ఇవి... యాంఫిటమైన్స్, మెటా యాంఫిటమైన్స్ కొకైన్ బార్బిట్యురేట్స్, మిథాజోలిన్, క్వినాజోలిన్ వంటి నిద్ర మాత్రలు (క్రాష్). కెన్నాబిస్ (గంజాయి)నల్లమందు వంటి మాదకద్రవ్యాలు, పొగాకులో ఉండే నికోటిన్ ఆల్కహాల్ (కాకపోతే నికోటిన్, ఆల్కహాల్ను పూర్తిగా డ్రగ్స్ కేటగిరీలో చెప్పలేకపోయినప్పటికీ... తమను బానిసగా మార్చుకునే సామర్థ్యం వీటికీ ఉంది).మళ్లీ మళ్లీ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుందంటే... సాధారణంగా మళ్లీ మళ్లీ తీసుకోవాలనే కోరికతో డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అన్నది రెండు రకాలుగా జరుగుతుంది. 1) శారీరక లక్షణాలతో : తొలుత అంతులేని ఉత్సహం, ఎక్సైట్మెంట్, ధైర్యం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలనూ, హాయి భావనను కలగజేసే ఈ డ్రగ్స్... వాటిని తీసుకోనప్పుడు దేహంలో శారీరకంగా కొన్ని తీవ్రమైన మార్పులు జరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అవేమిటంటే... డ్రగ్స్కు అలవాటు పడ్డ శరీరం వాటిని తీసుకోనప్పుడు దేహమంతా వణుకు, విపరీతంగా చెమటలు పట్టడం, స్థిరంగా స్థిమితంగా ఉండలేక΄ోవడం, గుండె దడ, కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2) మానసికమైన భ్రాంతులతో : డ్రగ్స్ తీసుకోవడం అలవాటయ్యాక ఎప్పుడైనా తీసుకోనప్పుడు... కొందరిలో కొన్ని రకాల భ్రాంతులు కనిపించవచ్చు. అంటే లేని శబ్దాలు వినిపించడం, వాస్తవం కాని దృశ్యాలు కనిపించడం వంటివి. ఒక్కోసారి డ్రగ్స్కు అలవాటు పడ్డవారు తమనెవరో బాధపెడుతున్నట్లు భ్రాంతి చెందడమూ జరగవచ్చు. దాంతో మానసికంగా డ్రగ్కోసం పరితపించడం జరుగుతుంది.సామాజికంగా జరిగే నష్టాలు డ్రగ్స్ తీసుకున్న వారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వేగంగా వాహనాలు నడపటం, సెక్స్లో వికృతంగా ప్రవర్తించడం వంటి పనులకు పాల్పడవచ్చు. కొందరు దొంగతనాలూ, హత్యల వంటి నేరాలకూ పాల్పడవచ్చు. చదువు దెబ్బతినవచ్చు. గుర్తించడం ఎలా... పిల్లలు నలుగురితోనూ, కుటుంబసభ్యులతో కలవకుండా... తాము ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడటం గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్రంగా ప్రవర్తించడంమాటలలో, చేతలలో నిర్లక్ష్యం, ఎవరినీ లెక్కచేయక΄ోవడం వ్యక్తిగత పరిశుభ్రత అంతగా పాటించక΄ోవడం ∙డ్రగ్స్కు అలవాటైన వారి చెమటనుంచి ఒక రకం వాసన వస్తుండటం స్కూల్లో, కాలేజీలో స్కోర్ తగ్గడం... వంటి మార్పులు కనిపిస్తుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను డాక్టర్కు లేదా సైకియాట్రిస్ట్కు చూపించాలి.డాక్టర్ శివ అనూప్ యెల్లా, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ (చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!
ఇటీవలకాలంలో అందర్నీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కోసం మార్కెట్లో ఇప్పటికే పలు రకాల డయాబెటిస్ మందులు కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో ఎంతో కొంత దుష్ప్రభావాలు తప్పవనేది నమ్మకతప్పని నిజం. ఆ నేపథ్యంలోనే సహజసిద్ధంగానే సులభంగా అధిక బరువుకి చెక్పెట్టే మార్గాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా సైంటిస్టులు ఈ సమస్యకు కొండచిలువ రక్తంతో పరిష్కార మార్గం చూపి సరికొత్త ఆశను రేకెత్తించారు. వాట్ కొండచిలువ రక్తం అని వెన్నులో వణుకు పుట్టుకొస్తున్నా..అలా ఎందుకు చెప్పారో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనంలో చాలా ఆసక్తికర విషయాలను సవివరంగా వెల్లడించారు కూడా. బరువు తగ్గించే ఒక అణువుని బర్మీస్ కొండచిలువ రక్తంలో గుర్తించారు. ఆకలిని భిన్నమైన రీతీలో లక్ష్యం చేసుకోవడం అనే పరిశోధనలో భాగంగా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది సరికొత్త ఆశను రేకెత్తించింది. సాధారణంగా కొండచిలువలు విపరీతమైన ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధి చెందినవి. అవి తమ శరీర బరువుకి సమానమైన పరిమాణంలో ఉన్న ఆహారాన్ని స్వాహా చేస్తాయి. ఆ తర్వాత నెలల తరబడి ఆహారం లేకుండా జీవిస్తాయి. అలా.. ఎలా అన్నేళ్లు ఆహారం లేకుండా ఉంటాయని పరిశోధించగా..ఆ సమయంలో వాటి రక్తప్రవాహంలో కొన్ని అణువులు వేగంగా పెరుగుతాయిని గుర్తించారు వైద్యులు. ఇవి అసాధారణ జీవక్రియను నిర్వహించడానికి సహాపడతాయిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్థాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని జోనాథన్ లాంగ్ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో కొండచిలువలు ఆహారం తినడానికి, తర్వాత వాటి రక్తనమునాలను విశ్లేషించారు. వాటిలో గణనీయంగా పెరిగిన 200కు పైనే ఎక్కువ అణువులను గుర్తించారు. ఆ అణువుల్లో పీటీఓఎస్(pTOS)గా పిలిచే ఒక అణువు వెయిరెట్లకు పైగా పెరిగింది. పేగులలో బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ అణువు మానవులలో కూడా తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది. దాని సామర్థాన్ని పరీక్షించడానికి పరిశోధకులు ఊబకాయం ఉన్న ఎలుకలకు ఈ పీటీఓఎస్ ఇచ్చారు. ఆ ఫలితాల్లో ఆ ఎలుకలు తక్కువ ఆహారం తిని, 28 రోజుల వ్యవధిలో తమ శరీర బరువులో సుమారు 9% కోల్పోయాయని గుర్తించారు. కడుపు ఖాళీ అయ్యి..జీర్ణక్రియ నెమ్మదించే ప్రక్రియను తరుచుగా వికారం వంటి దుష్ప్రభావాలను కలిగించే వెగోవీ వంటి బరువు తగ్గించే మందుల్లా కాకుండా ఈ పీటీఓఎస్(pTOS) నేరుగా బ్రెయిన్పై పనిచేస్తోందట. ఇది ఆకలిని నియంత్రించే ప్రాంతమైన హైపోథాలమస్ను లక్ష్యంగా చేసుకుంటుందట. ఇది ఒకరకంగా ప్రస్తుత చికిత్సలలో ఉన్న సాధార దుష్ప్రభావాలు లేకుండా ఆకలిని నియంత్రించే కొత్త మార్గాన్ని అందించిందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన నేచరల్ మెటబాలిజంలో ప్రచురితమైంది. ఇది మానవులుకు ఎంతవరకు సురక్షితమైనది అనేది నిర్థారించడానికి ఇంకా పలు అధ్యయనాలు చేయాల్సి ఉంది. కానీ శాస్త్రవేత్తలు మాత్రం భవిష్యత్తులో ఊబకాయ భయానికి ఇదో గొప్ప ఆశకిరణంగా మారుతుందని ప్రగాఢం నమ్ముతుండటం విశేషం.(చదవండి: జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!) -
జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!
బరువు తగ్గడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది ఆరు పదుల వయసులో వెయిట్లాస్కు ఉపక్రమించి సక్సెస్ అందుకుంది ఈ మహిళ. అది కూడా మూడు నెలల్లో తగ్గి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేసింది. ఒత్తిడితో కూడిన వృత్తిజీవితాన్ని హ్యాండిల్ చేస్తూ..బరువు తగ్గడం విశేషం. మరి అంతలా స్లిమ్గా మారిన ఆ మహిళ ఫిట్నెస్ మంత్రా ఏంటో చూద్దామా..!.కెరీర్ కోచ్ అయిన క్రిస్ బోయెట్చెర్ తాను ఫిట్నెస్కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నిరూపించడానికే ఈ వెయిట్లాస్ జర్నీకి ఉపక్రమించినట్లు తెలిపారు. ఇంతకుమునుపు పని నిమిత్తం జర్నీలు, ఎక్కువ గంటల పని, తదితరాలతో బిజీగా గడిపి, ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితానికి అనుకూలమైన వ్యవస్థకు కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యానని అంటోంది. అలా మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకోగలిగానని అంటోంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా అనుభూతి చెందని బలాన్ని తిరిగి పొందగలిగానని చెబుతోంది. తనకు ఎంత తీరిక లేని దినచర్యతో ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన ప్లాన్ని మిస్ చేయలేదట. ఇన్నాళ్లు ఆత్యానూన్యత భావంతో ఉన్న అధిక బరువుని..సక్రమమైన జీవనశైలితో చెక్పెట్టి స్లిమ్గా మారినిట్లు చెబుతోంది. అలా 73 కిలోల నుంచి 66 కిలోలకు అనూహ్యంగా తగ్గిపోయానని అంటోంది. అలాగే తానేమి కఠినమైన త్యాగాలు చేయలేదని, తన వాస్తవిక జీవితానికి అనుకూలమైన, నిర్వహించదగిన జీవనశైలిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ప్రణాళిక పక్కాగా ఫాలో అయ్యేలా కేర్ తీసుకున్నానని, దాంతో నాజూకుగా మారి ఆత్మవిశ్వాసంతో అందరి ముందుకు రాగలిగానని అంటోంది. నెటిజన్లు సైతం ఆమె రూపు రేఖల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దశాబ్దాలు జీవించినా సరైన జీవన విధానం, నిరంతర కృషి, బలం, ఆత్మవిశ్వాసంతో మొత్తం ఆరోగ్యాన్ని ఇట్టే మార్చుకోగలరని ప్రూవ్చేసింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ అంటూ పోస్టులు పెడుతున్నారు. Mary is a 62 year old administrator.She thought she would never lose the belly fat and build strength at her age.Mary was beginning to believe "I'm too old for that." But she decided to try anyway.She was dealing with travel for work, long hours, and the belief that her… pic.twitter.com/atZvUZgTnO— Chris Boettcher (@chrisboettcher9) February 16, 2026 (చదవండి: మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..) -
ట్రెండ్ను ఫాలో కాదు… సెట్ చేసిన సిరిసిల్ల శ్రీకాంత్ విజయం
చదివింది సాఫ్ట్వేర్.. చేస్తోంది హార్డ్వేర్ బిజినెస్. ట్రెండ్ను ఫాలో కావడం కాదు.. సెట్ చేస్తామంటున్నారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే). తన పేరుతోనే కంపెనీని ఏర్పాటు చేసి భవన నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఉసూరమనే యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నప్రాయంలోనే పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ.సిరిసిల్ల: సామాన్యుడు పారిశ్రామికవేత్త కావాలంటే ఎంతో శ్రమించాలి. మరెంతో సాహసించాలి. ఎన్నో ఎదురుదెబ్బలను ఓర్చుకోవాలి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘పుల్లూరోళ్ల’ హార్డ్వేర్ షాప్ అంటే.. తెలియనివారుండరు. ‘పుల్లూరి’ పరివారంలో ఓ వ్యాపారి పుల్లూరి శ్రీకాంత్(39). అందరిలాగే తెలుగు మీడియంలో సిరిసిల్లలోనే చదువుకున్న ఆ యువకుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉద్యోగ వేటలో పడ్డారు. ఏడాదికి రూ.లక్ష జీతం వస్తే చాలు.. జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే నమ్మకంతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వూ్యకు వెళ్లాడు. కానీ ఆ ఉద్యోగం రాలేదు. సిరిసిల్లకు చేరి అమ్మనాన్నలు రాధా, కృష్ణమూర్తిలకు తోడుగా వ్యాపారంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఎంతకాలం చిరువ్యాపారం అని ఆలోచించిన ఆ యువకుడు.. కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ఎదగాలని భావించాడు. సిరిసిల్లను వీడి భార్య ప్రణిత, కూతురు దేవహాసిని, కొడుకు రిషికేశ్తో హైదరాబాద్కు చేరారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో ఓ సంస్థను స్థాపించి అనతికాలంలోనే రూ.వందల కోట్ల వ్యాపారానికి చేరుకున్నారు.వ్యాపార కుటుంబం నుంచి..సిరిసిల్లలో మంచి పేరున్న వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన పుల్లూరి శ్రీకాంత్(39) చిన్న వయసులోనే నిర్మాణరంగంలో స్థిరపడ్డారు. శ్రీకాంత్ తాత, నానమ్మలు పుల్లూరి లక్ష్మీనారాయణ, అనసూర్యలు చిరువ్యాపారులు. వారి వారసత్వ వ్యాపారాన్ని మరింత పెంచుతూ శ్రీకాంత్ తల్లిదండ్రులు పుల్లూరి రాధా, కృష్ణమూర్తి స్థానికంగా హార్డ్వేర్ వ్యాపారాన్ని విస్తరించారు. ఆ వ్యాపారాన్ని ఆకాశమెత్తుకు చేర్చుతూ పారిశ్రామికవేత్తగా పీఎస్కే స్టీల్, పీఎస్కే సిమెంట్తోపాటు భవన నిర్మాణాలు, వంతెనలు, రోడ్లు, అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణాలకు అవసరమైన అన్ని వస్తువులను నేరుగా సరఫరా చేసే స్థాయికి చేరారు. నిజానికి ఈ వ్యాపార రంగంలో మార్వాడీ సేట్లు, ఉత్తర భారతానికి చెందిన బడా వ్యాపారులు స్థిరపడి ఉండగా.. వాళ్లకు ధీటుగా నమ్మకంగా.. శ్రీకాంత్ ఆ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని షాద్నగర్లో కంపెనీలో భాగస్వామిగా మారి సొంత బ్రాండ్ను ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా నిర్మాణ రంగంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనూ విస్తరించారు.వందకు పైగా ఉద్యోగులుపీఎస్కే సంస్థలో వంద మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. నిర్మాణ రంగంలోని ప్రముఖ కంపెనీలకు హోల్సేల్గా మెటీరియల్ సరఫరా చేస్తూ వ్యాపారం సాగిస్తున్న శ్రీకాంత్ నెలకు రూ.50లక్షల నుంచి రూ.60లక్షల వేతనాలను తన వద్ద పనిచేసే ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నారు. ‘అల్ఫా’ సర్కిల్ పేరుతో ప్రముఖులను, ప్రముఖ కంపెనీలను భాగస్వాములను చేస్తూ పరస్పర సహకారంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు శ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల కలయికతో పీఎస్కే వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం ఏటా రూ.వందల కోట్ల మేరకు టర్నోవర్తో పీఎస్కే వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎస్కే వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో శ్రీకాంత్ ముందుకు సాగుతున్నారు.అంచెలంచెలుగా..శ్రీకాంత్ ఒకేసారి తన వ్యాపారాన్ని పెంచుకోకుండా.. హైదరాబాద్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుని వ్యాపారాన్ని విస్తరించారు. రాష్ట్రవ్యాప్తంగా హోల్సేల్ హార్డ్వేర్ షాపులకు సిమెంట్, స్టీల్ను సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని బెంగళూర్, వైజాగ్ పట్టణాలకు విస్తరించారు. స్టీల్, సిమెంట్ ఉత్పత్తి రంగాల్లో ఎంతో పేరున్న ప్రముఖ కంపెనీలతో పోటీ పడుతూ నమ్మకంతో ఉన్నత స్థితికి చేరారు. పీఎస్కే సంస్థ వ్యాపార రంగంలో స్థిరపడి ముందుకు సాగడంతో గ్లోబల్ ఐకాన్ అనే సంస్థ 2023లో శ్రీకాంత్కు డాక్టరేట్ను అందించింది. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న జీ–20 సదస్సులోనూ శ్రీకాంత్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పీఎస్కే సంస్థ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ధార్మిక కార్యక్రమాల్లో, సామాజిక సేవలోనూ ముందున్నారు.లక్ష మందికి ఉపాధి లక్ష్యం2030 నాటికి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించి లక్ష మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నాను. ప్రముఖ కంపెనీల కొలాబ్రేషన్తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను. ‘అల్ఫా సర్కిల్’ను ప్రపంచ వ్యాప్తం చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలగా అనుకున్నది సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను. మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తా. – పుల్లూరి శ్రీకాంత్, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు -
పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!
పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి, పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. పెట్స్ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. పెట్స్తో అనుబంధమూ పెరుగుతోంది. దీని వల్ల కొత్త సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇంటిల్లిపాదీ ముందుగా పెట్స్కు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు అంటున్నారు నిపుణులు...‘పిల్లి చనిపోతే ఏడుస్తున్నావా, కుక్కపోతే అంత దుఃఖమా..’ అంటూ బాధపడుతున్నవారితోనే అవమానకరంగా మాట్లాడేవారుంటారు. దీనివల్ల వారి బాధ మరింత పెరుగుతుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. పెట్ అంటే కేవలం ఒక జంతువు కాదు. అది మనసుకు అండగా నిలిచే ఒక జీవం. మనం బాధల్లో లేదా ఆనందంలో ఉన్నప్పుడు మాటలేమీ లేకుండానే మనసును అర్థం చేసుకునే తోడు. అందుకే, ఇటీవలి కాలంలో చాలామంది పెట్స్తోనే ఎక్కువ అటాచ్మెంట్ను ఏర్పరుచుకుంటున్నారు. మనతో కలిసి జీవించే ప్రాణి అకస్మాత్తుగా దూరమైతే, ఇక ఎప్పటికీ రాదని తెలిస్తే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సున్నిత మనస్కులు మరింత భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో పెంపుడు జంతువును కోల్పోయినా అంతే బాధ కలుగుతుంది.వాస్తవం ఏంటంటే...∙పెట్స్కి మనుషుల కంటే తక్కువ జీవనప్రమాణం ఉంటుంది. పిల్లి జీవితం కాలం 13 నుంచి 20 ఏళ్లు. కుక్క ఆయుష్షు బ్రీడ్ను బట్టి 10 – 13 ఏళ్లు, కుందేలు 7 –10 ఏళ్లు. ఇలాగే, ఇతర జంతువులు, పక్షులకు.. నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ∙పోషణ, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు, బరువు నిర్వహణ.. ఇవన్నీ కూడా పెంపుడు జంతువుల ఆయుర్దాయాన్ని నిర్దేశిస్తాయి. వీటిని తప్పక అంగీకరించాల్సిందే. ఈ విషయాన్ని పెట్ను ఇంటికి తీసుకురావడానికి ముందే కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి. పిల్లలు ఉంటే వారికి ఈ నిజాలు తప్పక చెప్పాలి. ∙పెంపుడు ఎలా ఉండాలి, క్రమశిక్షణ, వాటికి ఇవ్వాల్సిన శిక్షణ, కుటుంబంలో అందరూ నిబంధనను తప్పక పాటించాలి. నెలకు ఒకసారైనా పెట్స్ పెంపకం గురించి మంచి–చెడులను అందరూ కలిసి బేరీజు వేసుకోవాలి. ∙పెట్ చనిపోవడం ఒక్కటే కాకపోవచ్చు... సూసైడ్కు ఒత్తిడికి సంబంధించిన కారణాలు మరిన్ని ఉండి ఉండవచ్చు.తేలిగ్గా తీసేయవద్దుకుటుంబంలో పెంపుడు జంతువుతో ఎవరికి ఎక్కువ అటాచ్మెంట్ ఉందో అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ‘పిల్లికి, కుక్కకే.. ఇలా అయిపోతే ఎలా.. అది ఒక జంతువు మాత్రమే కదా’ అనే మాటలతో వాళ్ల బాధను చిన్నచూపు చూడద్దు. దీనివల్ల ఇంట్లో తమ భావోద్వేగాలను పట్టించుకోనివారిగా, తమ బంధాన్ని అగౌరవ పరిచినట్టుగా భావిస్తారు. ఇవి చేయించవచ్చు...∙పెట్ రెస్క్యూ సెంటర్స్, అడాప్షన్ సెంటర్స్కి వెళ్లి రావచ్చు. ∙మరో చిన్న పెట్ను కుటుంబంలోకి ఆహ్వానించవచ్చు. ∙యానిమల్ రెస్క్యూ టీమ్స్తో కలిసి స్వచ్ఛందంగా తమ సేవలను అందించవచ్చు. ∙పెట్ లాస్ – ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్స్, హ్యూమన్ వరల్డ్ లింక్ వంటి గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో చేరి బాధను పంచుకోవచ్చు. ∙పెట్ జ్ఞాపకార్ధం ఒక మొక్కను తెచ్చి నాటి, ఆ మొక్క పెంపకంలో సేదతీరవచ్చు. ∙పెంపుడు జంతువు గురించి నచ్చిన విషయాలను రాసి, ఇంట్లో అందరూ ఆ విషయాలను పంచుకోవచ్చు. ∙బాధ నుంచి కోలుకోవడానికి స్థల మార్పిడి బెటర్. ∙మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులు, బాధను పంచుకోగలవారు దగ్గరగా ఉండాలి. పెట్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం కాదు. పెంపుడు జంతువు పంచిన ప్రేమను గుర్తుంచుకోవాలి. కానీ మన జీవితాన్ని వదిలేయకూడదు.. అనే వాస్తవాల్ని పెట్ లవర్స్ తెలుసుకోవాలి, సన్నిహితులకు తెలియజెప్పాలి.నిపుణుల సాయం అవసరం...పెట్స్ను ప్రేమించడం మంచి విషయం. కానీ, ఆ ప్రేమ మన బతుకుని బలి తీసుకునేలా ఉండకూడదు. ఎక్కువ ఎమోషన్కు గురవుతుంటే, మూల కారణాలను కూడా తెలుసుకోగలగాలి. దుఃఖిస్తున్నవారితో మాట్లాడుతూ ఉండాలి. గతంలో పెంపుడు జంతువుతో ఉన్న సమయాలు పదే పదే గుర్తుకు వస్తుంటే, ఆ సమయం లో మరో ఇష్టమైన వ్యాపకంతో పూరించుకోవాలి. అధిక ప్రేమ, భావోద్వేగాల విషయంలో కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే కౌన్సిలర్ సాయం తప్పక అవసరం.– డాక్టర్ సునీత ప్రసాద్, సైకాలజిస్ట్ -
రాముడికి జాబాలి ఉద్బోధ
పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.సీతమ్మవారి కోవెలశ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్ కోవిల్’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.→ సాంఖ్యాయన -
ది న్యూ అడిక్షన్ ఎకానమీ.. మీ మెదడుపై అదృశ్య యుద్ధం!
ప్రపంచం మొత్తం మీ అరచేతిలో ఉందని మీరు సంబరపడుతున్నారా? కానీ వాస్తవానికి ఆ అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోనే మిమ్మల్ని బందీని చేస్తోందని మీకు తెలుసా? సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్ను మాత్రమే తయారుచేయడం లేదు; అవి మన ప్రమేయం లేకుండానే మనల్ని బానిసలుగా మార్చే ‘డిజిటల్ డ్రగ్స్’ను డిజైన్ చేస్తున్నాయి. దీనినే నిపుణులు ‘అడిక్షన్ ఎకానమీ’ అని పిలుస్తున్నారు. మీ సమయమే వారి పెట్టుబడి!సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే మనం డబ్బులు చెల్లిస్తాం. కాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని మనం భ్రమపడుతుంటాం. ఒక వస్తువుకు మీరు డబ్బు చెల్లించడం లేదంటే, అక్కడ మీరే ఒక వస్తువు అని అర్థం. మీ సమయం, శ్రద్ధ, వ్యక్తిగత సమాచారమే వారి పెట్టుబడి. మీరు ఫోన్ చూస్తూ గడుపుతున్న ప్రతి అదనపు నిమిషం ఈ కంపెనీల పాలిట ఒక బంగారు గుడ్డు. మీరు ఎంత ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోతే, ఆ కంపెనీల షేర్ల విలువ అంతగా పెరుగుతుంది. 2026 ముగిసే నాటికి సోషల్ మీడియా యాడ్ మార్కెట్ సుమారు రూ.26 లక్షల కోట్లకు చేరుకోనుందంటే, మన ఏకాగ్రతను వారు ఎంత ఖరీదైన వస్తువుగా మార్చారో అర్థం చేసుకోవచ్చు. మెటా, గూగుల్ వంటి సంస్థలు రోజుకు వేల కోట్లు సంపాదిస్తున్నాయంటే, దానికి ఇంధనం మన మెదడులోని డోపమైన్, మన చేతిలోని సమయమే!దిగ్భ్రాంతికర గణాంకాలు 2025–26 నివేదికల ప్రకారం ఇటీవలి గణాంకాలు చూస్తుంటే మనం ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది.→ సగటు భారతీయుడు రోజుకు దాదాపు 6.5 గంటల సమయాన్ని ఇంటర్నెట్పై గడుపుతున్నాడు. ఇందులో మూడు గంటల కంటే ఎక్కువ సమయం కేవలం వినోదం, సోషల్ మీడియాకే పరిమితం. → ఒకప్పుడు మనుషుల్లో పన్నెండు సెకన్లుగా ఉన్న అటెన్షన్ స్పాన్, ఇప్పుడు ఎనిమిది సెకన్లకు పడిపోయింది. ఒక గోల్డెన్ ఫిష్ అటెన్షన్ స్పాన్ తొమ్మిది సెకన్లు. అంటే మనం దానికంటే ఘోరంగా ఉన్నామన్నమాట! → రోజుకు ఐదుగంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న టీనేజర్లలో ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం 35 శాతం పెరిగినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నివేదిక చెబుతోంది. → ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ వల్ల 2025లో భారతీయ కుటుంబాలు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోయినట్లు అంచనా.బయటపడటం ఇలా... ఈ ‘అడిక్షన్ ఎకానమీ‘లో మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని తాకట్టు పెట్టకండి. ఈ రోజే మీ డిజిటల్ ప్రయాణాన్ని నియంత్రించుకోండి. స్మార్ట్ఫోన్ కంటే మీ స్మార్ట్నెస్ గొప్పదని నిరూపించండి! → మీ ఫోన్ స్క్రీన్ను రంగులు లేకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో మార్చండి. రంగులు లేకపోతే మెదడుకు ఆ దృశ్యాలు ఆకర్షణీయంగా అనిపించవు, తద్వారా ఫోన్ వాడకం 30 శాతం తగ్గుతుంది. → ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మెదడుకు చిన్న విరామాన్ని ఇస్తుంది. → డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఫోన్ను అనుమతించకండి. ముఖ్యంగా నిద్రపోయే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టడం వల్ల ’మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి గాఢ నిద్ర పడుతుంది. → మీ ఫోన్లోని సెట్టింగ్స్లో ’డిజిటల్ వెల్–బీయింగ్’ ఆప్షన్ ద్వారా ప్రతి యాప్కు సమయాన్ని కేటాయించుకోండి. సమయం ముగియగానే యాప్ లాక్ అయ్యేలా చూసుకోండి. → ఖాళీ సమయం దొరకగానే ఫోన్ తీయకండి. ఆ ఖాళీ సమయాన్ని ఆలోచనల కోసం, ప్రకృతిని గమనించడం కోసం కేటాయించండి. సృజనాత్మకత ఎప్పుడూ ఖాళీ మెదడులోనే పుడుతుంది.మెదడును హ్యాక్ చేస్తున్న సైకాలజీటెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు వందల సంఖ్యలో సైకాలజిస్టులను నియమించుకుంటాయి. ఎందుకో తెలుసా? మన మెదడులోని బలహీనతలను కనిపెట్టడానికి. జూదం ఒక వ్యసనం. ఒక లాటరీలో ఎప్పుడు జాక్పాట్ తగులుతుందో తెలియదు. సైకాలజిస్టుల సహాయంతో అలాంటి వ్యసనాన్ని సోషల్ మీడియాలో ‘నోటిఫికేషన్స్’ ద్వారా సృష్టించారు. అలాగే మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ప్రేరేపించే డోపమైన్ను రిలీజ్ చేసేలా లైక్స్, కామెంట్స్ పనిచేస్తాయి.నెవెర్ మైండ్ స్మార్ట్ఫోన్ మోసుకొచ్చిన మాయ రోగాల్లో ‘డూమ్ స్క్రోలింగ్’ ఒకటి. ‘డూమ్ స్క్రోలింగ్’ బారినపడిన వారు అదేపనిగా స్మార్ట్ఫోన్లో కలత రేపే వార్తలను స్క్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వార్తలను చూస్తూ ఆందోళనకు, దిగులుకు లోనవుతారు. అయినా, వారు ‘డూమ్ స్క్రోలింగ్’ను నియంత్రించుకోలేరు.సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఒక వ్యక్తిని 'కరిష్మాటిక్' అని ఎప్పుడు పిలుస్తారంటే..
చాలామంది కరిష్మా (Charisma) పుట్టుకతో వచ్చే వరం అనుకుంటారు, లేదా కేవలం సినిమా స్టార్లకు మాత్రమే ఉంటుందని భ్రమిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, కరిష్మా అనేది నేర్చుకోగలిగే ఒక Behavioral Skill.కరిష్మా అంటే అందంగా ఉండటం కాదు, ఎదుటివారిని 'అందంగా' ఫీలయ్యేలా చేయడం. మీరు ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం మీ రాకతో పాజిటివ్గా మారితే... అదే కరిష్మా. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన ఉంటే మనకు తెలియని ఒక ఉత్సాహం, నమ్మకం కలుగుతాయి. దీనికి వెనుక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని డీకోడ్ చేద్దాం.The Charisma Trifectaఒక వ్యక్తిని మనం 'కరిష్మాటిక్' అని ఎప్పుడు అంటామంటే, వారిలో ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు:1. Presence: మీరు ఎవరితో ఉన్నారో, ఆ క్షణంలో పూర్తిగా వారితోనే ఉండటం. మీ మనసు ఎక్కడో ఉండి, మీరు అక్కడ ఉన్నట్లు నటిస్తే కరిష్మా మాయమైపోతుంది. మీ ఏకాగ్రతే మీ ఆకర్షణ.2. Power: ఇది ఎదుటివారిని భయపెట్టే శక్తి కాదు. మీ జ్ఞానం, మీ హోదా, మీ ఆత్మవిశ్వాసం లేదా మీ శారీరక దృఢత్వం ద్వారా వచ్చే 'ప్రభావం'. లోకానికి మీరు ఏదో ఒకటి సాధించగలరనే నమ్మకం కలిగించడం.3. Warmth: మీ శక్తిని ఎదుటివారి మేలు కోసం వాడతారనే భరోసా. మీరు ఎంత పవర్ఫుల్ అయినా, మీలో ఆత్మీయత లేకపోతే మిమ్మల్ని 'అహంకారి' అంటారు. శక్తికి ఆత్మీయత తోడైనప్పుడే అది 'కరిష్మా' అవుతుంది.The Halo Effectసైకాలజీలో Halo Effect అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉంటే, మన మెదడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తెలివైనవాడు, నమ్మదగ్గవాడు అని భావిస్తుంది. ఉదాహరణకు, మంచి డ్రెస్సింగ్ లేదా మంచి నవ్వు. కరిష్మాటిక్ వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ బాడీ లాంగ్వేజ్ని, ప్రెజెన్స్ని అద్భుతంగా మెయింటైన్ చేస్తారు.రియల్ కరిష్మామోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "ఎప్పుడూ నవ్వుతూ ఉండు, బిగ్గరగా మాట్లాడు, అందరినీ పొగుడు" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి Fake గా అనిపిస్తుంది. కానీ కరిష్మా అనేది లోపలి నుండి రావాలి. మీరు మీ గురించి మీరు గొప్పగా ఫీలైనప్పుడు, ఎదుటివారిలో మంచిని చూడగలిగినప్పుడు మీ కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. అదే అసలైన ఆకర్షణ.మీ చరిష్మా కోడ్ని అన్లాక్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీరు ఒక ఆకర్షణీయమైన లీడర్గా మారే మార్గం ఇది.Step 1: అభద్రతా భావం, పరధ్యానం బ్రేక్ చేయండిమీరు మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం లేదా మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోవడం వంటి పాత అలవాట్లను 'Break' చేయండి. అభద్రతా భావం (Insecurity) ఉన్న చోట కరిష్మా ఉండదు.Step 2: యాక్టివ్ ఎంగేజ్మెంట్ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వారిని ఎంత గౌరవిస్తారో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా బిల్డ్ చేయండి. మీ నడకలో, నిలబడే తీరులో ఒక 'గ్రేస్' ఉండాలి.Step 3: ప్రభావితం చేసే శక్తిమీరు ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ అవసరం అక్కడ ఉండాలి. మీ జ్ఞానంతో, మీ వినయంతో అందరినీ ఆకట్టుకోండి. మీరు లేని సమయంలో కూడా మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ కరిష్మా చెకప్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి మీరు ఇస్తున్న 'అటెన్షన్' ఎంత?2. మీలో Power and Warmth బ్యాలెన్స్డ్గా ఉన్నాయా?3. మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా ఫీలవుతున్నాడా లేక ఇబ్బందిగా ఫీలవుతున్నాడా?కరిష్మా అంటే ఎదుటివారిని గెలవడం!బ్రో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటే కేవలం అందంగా కనిపించడం కాదు, అద్భుతంగా ప్రవర్తించడం. మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎంతగా ప్రోత్సహిస్తారో, వారిని ఎంతగా అర్థం చేసుకుంటారో.. అదే మీ కరిష్మాను పెంచుతుంది. ఇది మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి ఒక రాకెట్ ఇంజిన్ లాంటిది."Charisma is the ability to influence without logic."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?) -
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్ -
మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..
చర్మసంరక్షణకు సంబంధించిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వంటి ఎన్నో ఆయిల్స్ రాసి, అంతగా ప్రయోజనం పొందక విసిగిపోయినవాళ్లెందరో ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో నెట్టింట వైరల్గా మారింది నల్పమరాది తైలం. అసలేంటి తైలం అని అందరిలోనూ ఒకటే కుతుహలం రేకెత్తించింది. ఇంతకీ ఏంటి ఆయిల్..? చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతుందంటే..ఆ ఆయిల్ నల్పమరాది తైలం. ఇది భారతదేశంలోని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధ తైలం. కేరళ ఆయుర్వేదం నుంచి ఉద్భవించింది. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, ఛాయను మెరుగుపర్చడానికి, ఎండవల్ల వచ్చిన టాన్(నలుపుదనాన్ని)ని తొలగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో తరుచుగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. ఇటీవల గత కొన్ని రోజులుగా ఈ ఆయిల్ గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ తైలం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు తాము ఈ ఆయిల్ని వినియోగించి చూశాం అంటూ ఇస్తున్న రివ్యూలు కూడా ఈ క్రేజ్కి కొంత కారణం. దాంతో ఈ ప్రొడక్ట్ ప్రధాన ఆకర్షణగా మారడమే గాక, తరతరాలుగా విశ్వసిస్తున్న ఈ ఆయిల్ పట్ల ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు, చర్మ సంరక్షణ ప్రియులను నుంచి పెద్ద ఎత్తున్న సానుకూల స్పందన రావడం విశేషం. తయారీ..నల్పమరాది తైలం ప్రధానంగా మర్రి, రావి, గోమేధిక, అత్తి వంటి నాలుగు రకాల చెట్ల బెరడులతో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని స్వస్థపరిచి, కాంతివంతం చేస్తుంది. ఈ తైలానికి సాధారణంగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. ఇందులో పసుపు, వెటివర్, ఆమ్లా, వంటివి కూడా జోడిస్తారు. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఉపయోగపడతాయి.మూడువేల ఏళ్లకు పైగా చర్రిత కలిగిన పురాతన తైలం కేరళలో ఉద్భవించిందని చాలామంది ప్రజల గట్టి నమ్మకం. నాలుగు పవిత్రమైన చెట్ల బెరడు నుంచి వచ్చిన మిశ్రమం కావడంత దీన్ని "నల్పమరం" అని పిలస్తారు. దీన్ని గాయాలు మాన్పడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి ఎక్కువుగా వినియోగించేవారట. ఇది శిశువుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందట. మంత్రసానులు ఈ నూనెలోని పలుచని ద్రావణాన్ని శిశువుల మసాజ్ కోసం వినియోగిస్తారట. అంతేగాదు ప్రపంచ యుద్ధాల సమయంలో, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల మహిళలు సాంప్రదాయ నల్పమరాది తైలం మిశ్రమాలను పునరుద్ధరించి, వాటిని కొబ్బరి ఆకుల బుట్టలలో నిల్వ చేసేవారట. అంతటి విశిష్టత కలిగిని నూనెని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!. View this post on Instagram A post shared by Dr Midhila Reghunath (B.A.M.S) (@ayursutraabydrmidhila) (చదవండి: 9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!) -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్నెస్లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
సివిల్స్లో సత్తా చాటిన దినసరి కూలీ కొడుకు..! 'ధురంధర్ 2' మూవీ..
ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్ అవ్వాలనేది ఎందరో యువత డ్రీమ్. అత్యంత కఠినతరమైన ఎగ్జామ్లో గెలుపుని అందుకోవడమే తమ ధ్యేయంగా ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అంత కష్టమైన ఎగ్జామ్లో తొలిప్రయత్నంలోనే అవలీలగా విజయఢంకా మోగించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు ఈ యువకుడు. ఇతడి గెలుపు 'ధురందర్ 2'మూవీ నటుడిని సైతం ఆకట్టుకుంది. అతడు మాములు స్ఫూర్తి కాదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఖుషీ చేసే హీరో మాధవన్ ఈసారి కూడా అలానే మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో సత్తా చాటి సుబ్రమణ్య భారతి వీడియోని రీషేర్ చేస్తూ..ఆ యువకుడి అజేయమైన సక్సెస్ జర్నీని మెచ్చుకున్నారు. అందుకు సహకరించిన అతని తల్లిదండ్రులు, అతడికి లభించిన మద్దతు తదితరాలన్ని తనను ఎంతగానో కదిలించాయని, పైగా స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు. పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఎలా మార్పు తీసుకురాగలవో అనేందుకు ఆ యువకుడు సుబ్రమణ్య భారతినే ఉదాహరణ అంటూ పోస్ట్ని ముగించారు మాధవన్. హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోలో దినసరి కూలీ కుమారుడైన సుబ్రమణ్య భారతి ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వ 'నాన్ ముదల్వన్' పథకం సహాయంతో ఈ అధ్భుతమైన ఘనతను సాధించాడు. భారతి తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం విశేషం.తన సక్సెస్ జర్నీ అసాధారణమైనది అభివర్ణించాడు సుబ్రమణ్య భారతి. తాను క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సివిల్ సర్వీసెస్ను ఎంచుకున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడానికి, ఈ పథకం, కోచింగ్ వంటి మద్దతే కారణమని పేర్కొన్నారు. తాను కేవలం 18 ఏళ్ల వయసులో, ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా ఈ సివిల్స్ ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అందుకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని, ఎందుకంటే వాళ్లు దేశానికి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో సేవ చేసేలా వాళ్లు సదా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. కాగా, భారతి తండ్రి మరియప్పన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం పేద కుటుంబమని, ఇటుకల తయారీ యూనిట్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటానని చెప్పారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కుమారుడు ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్కు సన్నద్ధమయ్యాడని అన్నారు. అందులో విజయం సాధించడానికి తమిళనాడు ప్రభుత్వ నాన్ ముదల్వన్ పథకం ఎంతగానో సహాయపడిందని అన్నారు. నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం:తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి (Skill Development), ఉపాధి అవకాశాలను పెంచే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది 18-35 ఏళ్ల యువతకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ, భాషా నైపుణ్యాలు, ఇండస్ట్రీ-రెడీ కోర్సులలో శిక్షణ ఇస్తూ, ఉచిత కోచింగ్, స్కాలర్షిప్లను అందిస్తుంది. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)(చదవండి: మా మాష్టారే పేషెంట్గా..!) -
ఇంగ్లీష్... ఈజీగా!
ఇంగ్లీష్ అనేది హిందూ మహాసముద్రమంత పెద్దది. ఎంత నేర్చుకున్నా.... నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. కొద్దిమందికి ఇంగ్లీష్ బాగానే అర్థం అవుతుంది. కాని రెండు మూడు వాక్యాలు కూడా ధైర్యంగా మాట్లాడలేరు. కొందరు ఏదో రకంగా ఇంగ్లీష్ మాట్లాడతారుగానీ, ఆ భాషకు సంబంధించిన జ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అర్పిత్ మిట్టల్ ‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రూపకల్పన చేశాడు. తొలి అడుగుతోనే ఆదరణను సొంతం చేసుకున్నాడు...‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రెండు లక్షల సంఖ్యలో మంత్లీ యూజర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చిన్న చిన్న పట్టణాలకు చెందినవారే. గూగుల్ ప్లేలో ఈ యాప్ డౌన్లోడ్లు కోటి దాటాయి. ‘స్పేస్ఎక్స్.ఏఐ’ ఫౌండర్ హోదాలో దిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నాడు అర్పిత్.‘ఎడ్టెక్ ప్లాట్ఫామ్లు ఏఐని ఫీచర్లా ఉపయోగిస్తున్నాయి. మా ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఏఐ అనేది యాంత్రికంగా ఉండదు. టీచర్లాగే వ్యవహరిస్తుంది’ అంటాడు అర్పిత్ మిట్టల్.ప్రాక్టికల్గా మాట్లాడేలా...యాప్ ఓపెన్ చేయగానే సుదీర్ఘమైన గ్రామర్ పాఠాలు వినిపించవు. ఇతరులతో సహజంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సంక్లిష్టమైన గ్రామర్ పాఠాలతో కాకుండా ప్రాక్టికల్గా, సులభంగా ఇంగ్లీష్ మాట్లాడేలా చేస్తుంది. ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్, వర్క్ప్లేస్ డిస్కషన్స్, కస్టమర్ కాల్...మొదలైన వాటి ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయిస్తాం. ఏ రకంగా చూసినా గురువుకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు. అయితే ప్రాక్టిస్ టైమ్పై పరిమితిని తొలగించడం ద్వారా గుడ్ టీచింగ్కు ఇది సరిౖయెన వేదిక అవుతుంది’ అంటున్నాడు అర్పిత్. అందరికి ఒకేలా అని కాకుండా ప్రతి సెషన్ పర్సనల్ యూజర్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ లెర్నింగ్ యాప్ కోర్ లాజిక్ విషయానికి వస్తే....‘రిపిటీషన్ ద్వారా మాట్లాడడం అనేది మెరుగుపడుతుంటే, రిపిటేషన్లు కొనసాగనివ్వండి’ మరొకటి...‘ప్రతి లెర్నర్కు అపరిమితంగా మాట్లాడే సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రాక్టిస్ గ్యాప్ లేకుండా చూడడం’ఏ యాసలో మాట్లాడినా సరే!→ మన దేశంలో ఇంగ్లీష్ నేర్చుకునేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు మూడు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడలేని వారి నుంచి, అనర్గళంగా మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారు ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యాసకుల స్థాయికి అనుగుణంగా మా జనరేటివ్ ఏఐ తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. శ్రద్ధగా నేర్చుకునేలా చేస్తుంది. వారు మాట్లాడే విధానం, ఉచ్చారణ, ఉపయోగించే పదాలు...మొదలైన వాటిని విశ్లేషిస్తుంది. ఉదాహరణకు... ఒక లెర్నర్ ప్రాథమిక వాక్యాలను సులభంగా చెప్పగలుగుతుంటే కొత్త పదాలు, జాతీయాలను ఉపయోగించి సంక్లిష్టమైన వాక్యాలు రాయడానికి ప్రయత్నించమని ఏఐ వారికి సలహా ఇస్తుంది. మన దేశంలో అనేక రకాల యాసలు ఉన్నాయి. అవి ఒకే రాష్ట్రంలో కూడా విభిన్నంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి సేకరించిన నిజమైన స్వరాలతో సిస్టమ్కు శిక్షణ ఇచ్చాం. దీనివల్ల లెర్నర్స్ పంజాబీ, బెంగాలీ, తమిళం, మరాఠీ... ఏ యాసలో మాట్లాడినా సరే, అది అర్థం చేసుకొని కచ్చితమైన ఫీడ్బ్యాక్ను అందిస్తుంది.→ పది మిలియన్ల డౌన్లోడ్ల స్థాయికి చేరుకోవడం రాత్రికి రాత్రి జరగలేదు. ఒకే ఒక్క చానెల్ ద్వారా సాధ్యపడలేదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించి లెర్నర్లు ఎదుర్కొంటున్న సమస్యలను 360 డిగ్రీల కోణంలో అర్థం చేసుకొని, విశ్లేషించుకొని ప్లాట్ఫామ్కు రూపకల్పన చేశాం. భయంభయంగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడేలా చేశాం. మన దేశంలో స్పోకెన్ ఇంగ్లీష్ సాధనాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే ఎంత ఎక్కువమందికి చేరువ అవుతామనేదే అసలు సిసలు విజయం. మౌత్టాక్ మా విజయానికి ప్రధాన కారణం.→ మేము కేవలం కొన్ని భాషలను నేర్పించడానికో లేదా ప్రజలను ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం కోసం సిద్ధం చేయడానికో ప్రయత్నించడం లేదు. నిజజీవిత సంభాషణలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉదాహరణకు ఆఫీసులో మేనేజర్తో ఎలా మాట్లాడాలి, డాక్టర్కు అనారోగ్య లక్షణాలను ఎలా వివరించాలి, ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలి...మొదలైనవి. నిజజీవిత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పాఠాలను డిజైన్ చేయడం వల్ల లెర్నర్లు తమకు అలవాటైన వాతావరణంలో ఉన్నట్లు భావిస్తారు. దీంతో వారు ఉత్సాహంగా, వేగంగా నేర్చుకుంటారు.– అర్పిత్ మిట్టల్, ఫౌండర్, స్పేస్ఎక్స్.ఏఐ -
కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?
మనం మట్టిలో ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు కదా! దానికి నీరు, ఎరువు, సరైన సమయం కావాలి. అలాగే, మన మనసులో కొత్త ఆలోచనలను నాటడం (Planting Ideas) కూడా ఒక కళ. దీన్నే మనం 'The Build Stage' అంటాం.మనసు ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు అందులో ఏది నాటితే అదే పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు మీ మనసులో 'నేను ఓడిపోతాను', 'నేను ఎవరికీ పనికిరాను' అనే కలుపు మొక్కలను నాటారు. ఇప్పుడు ఆ స్థానంలో 'విజయం', 'అద్భుతమైన వ్యక్తిత్వం' అనే విత్తనాలను నాటే సమయం ఆసన్నమైంది.1. The Germination of an Ideaఒక ఆలోచన మనసులో స్థిరపడాలంటే దానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది.Exposure: ముందుగా మీరు కొత్త ఆలోచనలకు మీ మనసును తెరవాలి, గొప్ప వ్యక్తులను కలవడం, కొత్త పుస్తకాలు చదవడం లాంటివి చేయాలి. Acceptance: ‘‘ఆ ఆలోచన నా జీవితానికి ఉపయోగపడుతుంది" అని మీరు నమ్మాలి.Repetition (పునరావృతం): ఆ ఆలోచనను రోజుకు వందసార్లు మీ మెదడుకు గుర్తు చేయాలి.2. మెదడును ఎలా రీ-వైర్ చేయాలి? (Neuroplasticity)మనం చేసే పనులను బట్టి మన మెదడులోని నాడీ మార్గాలు (Neural Pathways) మారిపోతాయి. దీన్ని సైకాలజీలో 'Neuroplasticity' అంటారు. మీరు ఒకే నెగటివ్ ఆలోచనను పదే పదే చేస్తే, మీ మెదడు దానికి అలవాటు పడిపోతుంది. అలాగే, మీరు కొత్త ఆలోచనను పదే పదే ప్రాక్టీస్ చేస్తే, మెదడు దాన్ని ఒక కొత్త 'హైవే' లాగా మార్చేస్తుంది.3. నిజమైన 'బిల్డ్' పద్ధతిమోటివేషన్ "ఒకే రోజులో నీ లైఫ్ మార్చేయ్, రేపటి నుండే కొత్తగా ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే 20 ఏళ్ల అలవాటు ఒక్క రోజులో పోదు. సైకాలజీ కొత్త ఆలోచనను చిన్న చిన్న పనుల ద్వారా ప్రాక్టీస్ చేయమంటుంది (Incremental Building). ఉదాహరణకు, మీరు 'కాన్ఫిడెంట్' అవ్వాలనుకుంటే, ఒకే రోజులో స్టేజ్ ఎక్కక్కర్లేదు. ముందు అద్దం ముందు మాట్లాడండి, ఆ తర్వాత స్నేహితుల ముందు మాట్లాడండి. ఇది నిజమైన 'బిల్డ్' పద్ధతి.4. మీ మనసులో కొత్త పంట!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీని ఎలా నిర్మించాలో చూద్దాం.Step 1: కలుపు మొక్కల తొలగింపు (Break)మీ పాత భయాలు, నమ్మకాలు ఒక 'కలుపు' లాంటివి. పాత పద్ధతిలో "నేను చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-టాక్ ఎక్కడ మొదలవుతుందో అక్కడ 'బ్రేక్' చేయండి. అది రాగానే దాన్ని తుడిచేయండి.Step 2: నిర్మాణాత్మక ఆచరణ (Build)కొత్త ఆలోచనలకు మద్దతు ఇచ్చే వాతావరణాన్నిబిల్డ్ చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులతో తిరగండి, ఆ విషయాలపైనే వినండి. ఏ ఆలోచనను మీరు పదే పదే వింటారో, అదే మీ పర్సనాలిటీగా మారుతుంది. ఇది 'నిర్మాణం' (Build).Step 3: ఆటోమేషన్ (Beyond)ఒక్కసారి కొత్త ఆలోచన మీ సబ్-కాన్షియస్ మైండ్ లోకి వెళ్తే, ఇక మీరు కష్టపడక్కర్లేదు. అది మీ ప్రవర్తనలో, మీ మాటల్లో ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మీరు మారుతారు, మీ జీవితం మారుతుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మనసులో ఏముంది?ఈ రోజు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారం మీరు నాటాలనుకుంటున్న ఆ ఒక్క 'కొత్త ఆలోచన' ఏంటి?దాన్ని నాటడానికి మీరు వేస్తున్న మొదటి చిన్న అడుగు ఏంటి?మీరు నాటబోయే ఆ విత్తనం రేపు ఎలాంటి ఫలాలను (Results) ఇస్తుంది?మీరే మీ తోటమాలి!బ్రో, మనసు అనే తోటలో కలుపు మొక్కలు వాటంతట అవే వస్తాయి, కానీ మంచి మొక్కలు మనం నాటుకోవాలి. మీరు మీ మైండ్కి తోటమాలి లాంటివారు. ఏ ఆలోచనను పెరగనివ్వాలో, దేన్ని తీసేయాలో నిర్ణయం మీదే. మీ కొత్త వ్యక్తిత్వాన్ని ఒక అద్భుతమైన తోటలా నిర్మించుకోండి.గుర్తుంచుకోండి, "Your life is the harvest of your thoughts."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
"ఉగాది" రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..?
తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రముఖంగా ఆచరించేది పంచాంగ శ్రవణం. ఈ రోజునే ఎందుకంటే..తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మరి అంత విశిష్టత గల పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదోక దిక్సూచిలా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ ఏడాది వచ్చే ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచన కుపక్రమిస్తారు.తిధిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చపంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధకతిధి వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్తజ్ఞ్రులు ఇలా చెప్పారు.తిధేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మవర్ధనీమ్నక్షత్రాద్హరతే పాపమ్ యోగాద్రోహ నివారణమ్కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలమ్కాల విత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్సంపదల కోరేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే.‘‘ శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదో షారుహంగంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాంఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రాదంనానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం’’.ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్స్వప్నాలను దోషాలను తొలగించేది; గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది.పంచాంగశ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు.ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిషశాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని, ఆసంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
కొత్త తరం ఉగాది స్వరం
ఉగాదంటే వాకిట్లో పూల రుతువుచిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం. చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది. నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది. రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం. ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని. సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు. ‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా. -
ఏ నేరమూ చేయకున్నా... అకౌంట్ ఫ్రీజ్ అయింది..?
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అంటూ ఫోన్ చేసిన వారిని నమ్మి ఒక వాట్సాప్ గ్రూపులో చేరాను. కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాను. మొదట్లో ఆరు లక్షల దాకా లాభం వచ్చింది అని దాదాపు 10 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇంతలో ఉన్నట్టుండి ఓ రోజు ఒక్కసారిగా నా ఎకౌంట్లో నుంచి 8 లక్షల రూపాయలు కట్ అవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కోర్టు ఆర్డర్ ద్వారా డబ్బులు వేరే అకౌంట్ కి పంపించేశారని, నా అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేశారనీ తెలిసింది. కోర్టు ఆర్డర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. బ్యాంక్ వారిని అడిగితే పరిష్కారం కోసం తమిళనాడు కోర్టుకు, కర్ణాటక కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. నా అకౌంట్లో ఇంకా 20 లక్షలు ఉన్నాయి కానీ కేసుల వల్ల అవి కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. తీరా చూస్తే నేను పెట్టుబడి పెట్టిన దానికంటే పోయిందే ఎక్కువ. దయచేసి నాకు పరిష్కారం సూచించగలరు.– నళిని, హైదరాబాద్అనేక రకాల సైబర్ నేరాల్లో ఆన్లైన్ ట్రేడింగ్ కూడా ఒకటి. స్నేహం పేరుతో ప్రలోభ పెట్టి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు లాగేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ట్రేడింగ్ చేయాలని అనుకుంటే నమ్మకమైన కంపెనీల ద్వారా మాత్రమే చేయాలి తప్ప, సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ గ్రూపులలో ప్రకటనలు చూసి చేయడం అనేకమందిని బాధితులను చేస్తున్నాయి. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీరు నేరం చేయనప్పటికీ, మీరు ఆన్లైన్ ట్రేడింగ్ చేసి సంపాదించాను అనుకునే నగదు బహుశా సైబర్ నేరగాళ్లు చేసిన లావాదేవీలలో భాగం అయి ఉండవచ్చు. మరొకరి దగ్గర అక్రమంగా తీసుకున్న డబ్బులను కొత్తగా ఇన్వెస్ట్మెంట్ మాయలో పడిన వారికి లాభంగా చూపిస్తూ వారి ఎకౌంట్లో వేసి వారి నమ్మకాన్ని సాధిస్తారు. తర్వాత మీరు ఎక్కువ లాభాల కోసం ఎక్కువ నగదు ఇవ్వాలి అనేదే వారి ఎత్తుగడ. కాబట్టి మీ అకౌంట్లోకి వచ్చిన మొత్తం లాభంగా మీరు భావిస్తున్నది అయినప్పటికీ, అది మరొక బాధితుడి డబ్బు అయి ఉండే ఆస్కారం ఉంది. అయితే నిజానిజాలు నిర్ణయించవలసినది కోర్టు!ఇకపోతే, మీ ఎకౌంటు ఫ్రీజ్ అయింది అని చె΄్పారు కాబట్టి, ఆర్డరు ఇచ్చిన కోర్టును లేదా ఏ పరిధిలోని పోలీసులు అకౌంట్ ఫ్రీజ్ చేశారో తెలుసుకొని వారిని సంప్రదించవలసి ఉంటుంది. వేరే రాష్ట్రాల కోర్టుకు వెళ్లడం లేదా అన్నిటినీ కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రస్తుతానికి మీ ఎకౌంటులో ఉన్న నగదును కూడా కాడుకోవడం మాత్రమే మీకు ఉండే దారి. అదనంగా మీరు కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారికి ఒక ఫిర్యాదు చేస్తే మంచిది. మిమ్మల్ని ఏ విధంగా ట్రేడింగ్ కంపెనీ వారు సంప్రదించారు, ఏ విధంగా ఏ అకౌంట్లోకి మీరు డబ్బులు జమ చేశారు వంటి పూర్తి వివరాలను సైబర్ క్రైౖమ్ డిపార్ట్మెంట్ వారికి వెల్లడించి ఒక లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి. మీకు వచ్చినది ఎంత...? పోయినది ఎంత అనే విషయాన్ని రుజువులతో సహా ఇవ్వండి. మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావాలి అంటే అది పోలీసు వారు మాత్రమే చేయగలరు. అదీ విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే రికవరీ చేయగలరు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మీ అకౌంట్లో లావాదేవీలు చేయడానికి మీ అనుమతి అవసరం లేదు! శ్రీకాంత్ చింతల(హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. ) -
నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!
రీల్ లైఫ్లోనే గాదు రియల్ లైఫ్లో కూడా బ్యూటీఫుల్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు సూర్య-జ్యోతికలని. ఈ ఇద్దరు నటనపరంగానే కాదు, వ్యక్తితత్వ పరంగానూ నూటికి నూరు మార్కులు దక్కించుకున్న గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె దియా, కుమారుడు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి..అశేష ఆదరాభిమానాలను అందుకుంది. అయితే ఆమె ఒక పక్క తన వృత్తిని, మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ..సూపర్ విమెన్గా పేరుతెచ్చుకుంది కూడా. మరి అలాంటి జ్యోతిక పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది?, ఆమె చెప్పే అమూల్యమైన పేరెంటింగ్ టిప్స్ గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ఇంటర్వూలో జ్యోతిక తాను తల్లిగా మారాక తనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా తన పిల్లలను మీడియాకి, సెలబ్రిటీ హోదాకి చాలా దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. వాళ్లకు సహనం, భావోద్వేగాల విలువ గురించి నేర్పిస్తుంటానని చెప్పారు. పేరెంట్స్గా పిల్లలను విలువలతో పెంచడం తోపాటు తాము కూడా కొన్ని విషయాలను వారి నుంచి నేర్చుకున్నామని అన్నారు. జీవితంలో కొన్ని సమయాల్లో వేగాన్ని తగ్గించి చిన్ని చిన్ని విషయాలను కూడా ఆస్వాదించడం, వాటి విలువ గురించి తెలుసుకోవడంలో పిల్లలు ఎంతగానో సహాయపడ్డారని అంటోంది. బాధ్యత, నిస్వార్థ ప్రేమ విలువలను తన పిల్లల ద్వారా తెలుసుకోగలిగానని చెబుతోంది. పిల్లలు ఎదుగుతుండటాన్ని చూడటం జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాల్లో ఒకటని అన్నారు. అలాగే పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైనది వారి వ్యక్తిత్వాన్ని ప్రోత్సాహించడం అని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. పిల్లలు నిజంగా దేనిపట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకుంటూ..ఆ విషయాలను అన్వేషించి, ఆ దిశలో వెళ్లేలా స్వేచ్ఛను ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారామె. దీనివల్ల పిల్లలు ఇతరుల ఆదేశాలకు లేదా నిర్ణయాలకు లోబడకుండా, తమను తాము వ్యక్తీకరించుకోగలిగేలా ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుగకు సాగుతారని అంటోందామె. అంతేగాదు పిల్లలందరూ తమదైన రీతిలో ప్రత్యేకమైనవారని, విశిష్టమైన వాళ్లని నమ్ముతానని అన్నారు. అంతేగాదు సినీ ఆడంబరాలకు అతీతంగా వాస్తవాలను తెలసుకునేలా పెంచుతానని, ముఖ్యంగా ఒదిగి ఉండేలా పెంచుతానని అన్నారు. అలాగే ఆమె ప్రతి తల్లిదండ్రలు త పిల్లలతో కలిసి ఈ మూడు పనులు చేయాలని అన్నారు. అవేంటంటే..ప్రతిరోజూ పిల్లలతో కనీసం ఒక గంట నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం. కలిసి భోజనం చేయండి, ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడండి, బహుశా ఒక గేమ్ లేకా వాళ్లకు నచ్చిదాంతో మమేకమైతే.. పిల్లలు తమ మనసు విప్పి, వారు ఏమి ఆలోచిస్తున్నారో, వారిలో నిజంగా ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి సహాయపడుతుంది. వారి ప్రాణ స్నేహితుడు ఎవరు, వారికి ఎవరు ఇష్టం, ఒక పిల్లవాడిని ఎందుకు ఇష్టపడరు, ఏ ఉపాధ్యాయుడితో ఏమి జరుగుతోంది వంటి సాధారణ విషయాలు సైతం మనతో పంచుకుంటారు. రెండొవది ప్రయాణం చేయడం. కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబ బంధం చాలా బలపడుతుంది.మూడవది వారికి ఆదర్శంగా ఉండటం; వారికి సలహాలు ఇవ్వకండి.చివరగా ప్రతి తల్లి తన వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం ఆమెకు ఉంటుందని చెబుతోంది జ్యోతిక. తన మటుకు ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికి ప్రాధ్యాన్యత ఇస్తానని, రెండిటిని సమతుల్యం చేసుకునే పనులను బ్యాలెన్స్ చేస్తానని అన్నారామె. (చదవండి: నీతా అంబానీకి మానవతా పురస్కారం..!) -
నీతా అంబానీకి మానవతా పురస్కారం..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న కేఐఐటీ (KIIT) విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) హ్యుమానిటేరియన్ అవార్డు 2025తో నీతా అంబానీని సత్కరించారు. ఈ సందర్భానికి అనుగుణంగా ఆమె అద్భుతమైన లుక్లో ఈ కార్యక్రమానికి హాజరయ్యారామె.ఈ ప్రత్యేక సందర్భం కోసం, నీతా అంబానీ ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని తనచీరను ఎంచుకోవడం విశేషం. సాధారణ ముదురు మెరూన్ చీరకు కాంట్రాస్ట్గా ఆకుపచ్చ రంగు అంచుతో కూడిన చీరను ఎంచుకున్నారు. ఇది ఆమెకు మరింత అందాన్ని ఇచ్చింది. ముందు భాగంలో కుచ్చులు పెట్టి, కొంగును తన భుజం నుండి నేల వరకు సింగిల్ పైటతో జారవిడిచారు. ఆ చీరకు మ్యాచింగ్ మెరూన్ కలర్ విత్ ఆకుపచ్చ అంచు ఉన్న బ్లౌజ్ని ఎంచుకున్నారు. అంతేగాదు అమూల్యమైన ఆభరణాలకు బదులుగా పూల డిజైన్లో ఉన్న ఒక జత రూబీ, డైమండ్ చెవిపోగులు, ఒక స్టేమెంట్ ఉంగరం, ఆకుపచ్చ గాజులు, బంగారు పూసల నెక్లెస్ ధరించారు. జుట్టుని కూడా పెద్ద తరహాలో హుందాగా పాపిడి తీసి పువ్వులతో అలకరించిన జడకొప్పులా వేసుకున్నారు. చక్కగా సాధారణ స్త్రీలా కళ్లకు కాటుక, గుండ్రటి బొట్టుతో సరికొత్తగా కనిపించారామె.కిస్ ఫౌండేషన్ ప్రకారం, 'మానవతా సేవ. సమాజ సాధికారత పట్ల ఆమెకున్న అసాధారణ నిబద్ధత'కు గాను నీతా అంబానీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడిస్తూ.. ఆమె దూరదృష్టి గల నాయకత్వం, పరోపకార కార్యక్రమాల ద్వారా, విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, గ్రామీణాభివృద్ధిపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపారు. భారతదేశం అంతటా లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేశారు అని పేర్కొంది. View this post on Instagram A post shared by KISS Foundation (KISS) (@kissfoundation) (చదవండి: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..తొలిదశలో సురక్షితమేనా..?) -
ఫైనాన్షియల్ పర్సనాలిటీ అంటే..?
డబ్బు కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది మీ 'పర్సనాలిటీకి అద్దం'. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు? భద్రత కోసం చూస్తున్నారా? లేక హోదా కోసం చూస్తున్నారా? మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా, మీ డబ్బు ఖర్చు చేసే విధానం మీలోని భయాలను, ఆశలను బయటపెడుతుంది. సైకాలజీ ప్రకారం, మన ఫైనాన్షియల్ నిర్ణయాలు మన బాల్యంలో ఏర్పడిన నమ్మకాలపై (Money Beliefs) ఆధారపడి ఉంటాయి.1. నాలుగు రకాల ఫైనాన్షియల్ పర్సనాలిటీలుసైకాలజీ ప్రకారం, మనుషులను డబ్బును ఖర్చు చేసే తీరు బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. The Spender (ఖర్చు చేసేవాడు): వీరు డబ్బును 'సంతోషం' కోసం ఖర్చు చేస్తారు. ఎవరైనా ఏమనుకుంటారో అని, లేదా ఇన్స్టంట్ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేస్తారు. ఇది వారిలోని 'అభద్రతా భావం' (Insecurity) ను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం.The Saver (దాచుకునేవాడు): వీరు డబ్బును 'భద్రత'గా భావిస్తారు. ప్రతి రూపాయిని దాచుకోవడం వీరి పర్సనాలిటీ. ఇది వారిలోని 'భవిష్యత్తు భయం' (Fear of the future) ను ప్రతిబింబిస్తుంది. The Avoider (తప్పించుకునేవాడు): వీరు తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడ్డానికి కూడా భయపడతారు. డబ్బు విషయంలో ఒక రకమైన 'నిరాసక్తత'ను ప్రదర్శిస్తారు. ఇది వారి 'అసమర్థత' (Feeling of helplessness) ని సూచిస్తుంది. The Investor/Planner: వీరు డబ్బును ఒక 'సాధనం'లా వాడతారు. వీరిలో ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటాయి. వీరు తమ వ్యక్తిత్వాన్ని 'రిస్క్ అండ్ రివార్డ్' తో బ్యాలెన్స్ చేసుకుంటారు.2. మనీ ట్రాప్స్: పర్సనాలిటీని ఎలా దెబ్బతీస్తాయి?Status Spending: మనకు నచ్చని వస్తువులను, మనకు ఇష్టం లేని వ్యక్తులను మెప్పించడానికి కొనడం. ఇది మీ 'ఆత్మవిశ్వాసం' లేకపోవడానికి సంకేతం.Impulse Buying: ఎమోషనల్ గా ఉన్నప్పుడు (కోపం లేదా బాధ) ఖర్చు చేయడం. ఇది మీ 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' లోపం.3. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ డబ్బుని మీ పర్సనాలిటీని పెంచే ఆయుధంగా ఎలా మార్చుకోవాలి?Step 1: డబ్బుతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ని బ్రేక్ చేయండిమీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో గమనించండి. అది మీ అవసరమా? లేక మీలోని ఏదో వెలితిని నింపుకోవడానికా? మీరు 'Spender' అయితే, మీలోని 'Insecurity' ని 'Break' చేయండి. 'Saver' అయితే, మీలోని 'భయాన్ని' బ్రేక్ చేయండి.Step 2: వాల్యూ బేస్డ్ స్పెండింగ్మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ Values ని ప్రతిబింబించాలి. మీరు చదువుకోవడానికి, ఆరోగ్యం కోసం, మంచి సంబంధాల కోసం ఖర్చు చేస్తున్నారా? అయితే అది మీ పర్సనాలిటీని Build చేసుకోవడం. అనవసరమైన వాటిని కట్ చేయండి.Step 3: ఆర్థిక స్వేచ్ఛడబ్బు కోసమే బ్రతకడం కాదు, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. మీ ఆర్థిక క్రమశిక్షణే మీ పర్సనాలిటీకి ఒక 'స్టేటస్'ను ఇస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని మరింత ధైర్యంగా ప్రభావితం చేయగలరు. ఇదే 'Beyond' స్టేజ్.4. మీ ఫైనాన్షియల్ అద్దంఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ గత నెల ఖర్చులలో ఎన్ని 'అవసరం' కోసం, ఎన్ని 'హోదా' కోసం?మీరు ఎందుకు దాచుకుంటున్నారు? (భయం కోసమా? లక్ష్యం కోసమా?)మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకి, మీ వ్యక్తిత్వానికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా?డబ్బు - మీ పర్సనాలిటీకి మందు!బ్రో, డబ్బు లేకపోవడం వల్ల వచ్చేది పేదరికం, కానీ డబ్బుని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల వచ్చేది 'పర్సనాలిటీ క్రైసిస్'. క్రమశిక్షణతో కూడిన ఖర్చు, మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తుంది."Wealth is not about having a lot of money; it's about having a lot of options." Naval Ravikanthసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?) -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు'
ఒకప్పుడు ‘సక్సెస్’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్ జనరేషన్ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్నెస్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్నెస్ అనగానే కేవలం యోగా క్లాస్/ డైట్ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్నెస్ అని లైఫ్స్టైల్ కోచ్ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్నెస్ ట్రెండ్గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో చిన్న గెస్ట్హౌస్లు, నేచర్ గార్డెన్లు, వీకెండ్ రిట్రీట్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్ కల్చర్లోనూ వెల్నెస్ కీలకాంశంగా మారుతోంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్ఆర్ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. కాన్షియస్.. మ్యాడ్ నెస్.. హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్ క్లినిక్స్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్ చేస్తుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్ లెర్నింగ్, స్టార్ట్ అన్లెర్నింగ్’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్ మ్యాడ్ నెస్’ కాన్సెప్ట్కు బలం ఇస్తోంది. ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్ వాటర్ సైడ్లో యోగా, మెడిటేషన్, భజన్ జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ లైఫ్స్టైల్లో వెల్నెస్ కేవలం ట్రెండ్ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్కి ప్రయాణమే నేటి హైదరాబాద్ కొత్త లైఫ్స్టైల్. -
ఆ ప్లంబర్ వేతనం ఏడాదికి రూ. 18 లక్షలా..!
ఏఐ వచ్చేసింది ఇంకేముంది ఉద్యోగాలు ఉష్కాకి అంటూ మేధావులు, నిపుణులు పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేశారు. కానీ నెట్టిట వైరల్ అవుతున్న ఈ విషయం గురించి తెలుసకున్నాక ఆ నిర్ణయం తప్పని ఒప్పుకుంటారు. ఎంత ఏఐ వచ్చినా..శ్రామిక జీవుల పనితనాన్ని ఎంతటి అత్యున్నత సాంకేతికత అయినా భర్తీ చేయలేదని తేటతెల్లమవుతుంది.నెట్టింట 'ముంబైలో ఒక ప్లంబర్ రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు' అనే క్యాప్షన్తో చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచించేలా చేసింది. ఆ పోస్ట్ల ముంబై ప్లంబర్తో జరిగిన సంభాషణను షేర్ చేసుకున్నాడు. అతను తన టౌన్షిప్లోని సోసైటీలో ఒక ప్లంబర్తో మాటమంతి కలిపినట్లు తెలిపాడు. తాము చాలా విషయాలు మాట్లాడుకుంటూ..అతడి సంపాదన గురించి ఆరా తీశాడు. కాంట్రాక్టుల ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 18 లక్షల దాక ఉంటుందని ప్లంబర్ చెప్పాడు. అయితే తాను తమాషాగా అంటున్నాడేమో అనుకున్నా..కానీ తర్వాత అతను సంపాదిస్తున్న మొత్త లెక్కించడంతో అప్పుడు అర్థమైంది. పైగా ఆ వ్యక్తికి హ్యుండాయ్ క్రెటా (2023 మోడల్) కారు ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నాడట, ఓ పొలం కూడా కొన్నానని చెబుతున్నాడు. అతను రిచ్ ప్లంబర్ అని అప్పుడే నాకు తెలిసంది. అంటే తానెంతలా సంపాదించాలి అని ఆలోచిస్తు ఉండిపోయా అంటూ పోస్ట్లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు సైతం ఏఐ బ్యూకాలర్ ఉద్యోగాలను అమాంత మిగిసింది అన్నది ఎవరూ అని ఒకరు, శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: స్ట్రాంగెస్ట్కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..) -
ఈ సర్జరీలతో గుండెకు బైపాస్..!
గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్ వల్లగానీ వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్ అంటే ఏమిటో చూద్దాం.స్టెంట్ అంటే ఏమిటి...? గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్ స్టెంట్ అమర్చడంగా చెబుతారు.నిజానికి ఇలా స్టెంట్ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్ను పంపడమూ జరుగుతోంది. గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి... తొలుత యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే... బైపాస్ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే స్టెంట్ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే... గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్ సర్జరీ. రెండోవి వాల్వ్ సర్జరీలు. వీటిల్లో... బైపాస్ సర్జరీలోనే... ఓపెన్ హార్ట్ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్క్ సర్జరీ, హైబ్రిడ్ సర్జరీ, రొబోటిక్ బైపాస్ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...బైపాస్ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని) నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్ గ్రాఫ్ట్ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అంటారు.బైపాస్ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి. ఓపెన్హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా కొనసాగేందుకు హార్ట్లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్లంగ్ మెషిన్ను వాడతారో... దాన్ని ‘ఓపెన్హార్ట్ సర్జరీ’ పరిగణించవచ్చు.బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక ప్రత్యేక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్ హార్ట్ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.టీసీఆర్ఏటీ : ఈ ‘టీసీఆర్ఏటీ’ అనేది ‘టోటల్ కొరనరీ రీవాస్క్యులరైజేషన్ బై యాంటీరియర్ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్ (కార్డియోపల్మునరీ బైపాస్ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.కంప్లీట్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే..? బైపాస్ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్ చేస్తారని అర్థం. చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్) చేస్తారు. కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ... లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ... పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్ చాలా త్వరితంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బై΄ాస్ శస్త్రచికిత్సలో పేషెంట్ చాలా సీరియస్గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బై΄ాస్ సర్జరీ’ అంటారు.రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...?ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.త్వరగా కోలుకోవడం కోసం... పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.నిర్వహణ: యాసీన్డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ టి. వంశీధర్, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ (చదవండి: పైల్స్ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!) -
ఎల్పీజీ గ్యాస్ కొరత..ఆ స్టవ్లకు పెరుగుతున్న డిమాండ్..
యుద్ధం కారణంగా సిలిండర్ల దిగమతులకు అంతరాయం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ నేపథ్యంలో పలువురు తమ సృజనాత్మకతకు పదును పెట్టి మరి సరసమైన ధరలో కొంగొత్త స్టవ్లను అందిస్తున్నారు. ఎల్పీజీకి పత్యామ్నాయంగా అందిస్తున్న ఈ స్టవ్లకు ఒక్కసారిగా మార్కెట్లో అనుహ్యమైన డిమాండ్ పెరిగింది కూడా. అందుకు నిదర్శనమే బెంగళూరు వాసి ఆశోక్ ఉర్స్ రాకెట్ స్టవ్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మాజీ ఉద్యోగి అయిన 65 ఏళ్ల ఆశోక్ ఉర్స్ ఆరేళ్ల క్రితం గ్రామీణ ప్రజల కోసం ఇంధనాన్ని ఆదా చేసే స్టవ్ని రూపొందించారు. దానికి ఇప్పుడు అధిక మొత్తం ఆర్డర్లు..అలాంటి స్టవ్లు కావాలంటూ వాణిజ్య పరిశ్రమలో డిమాండ్ ఊపందుకుంది. కళ్లకు, ఊపరితిత్తులకు చికాకు కలిగించే వంటచెరుకుకి ప్రత్యామ్నాయంగా, అలాగే కలప తక్కువగా లభించే ప్రాంతాలకు వెసులుబాటుగా దీనిని రూపొందించారు. తక్కువ ఇంధనంతో వంటచేసుకునేలా రూపొందించిన స్టవ్ ఇది. సింపుల్గా చెప్పాలంటే కట్టెలపొయ్యి సంక్షిప్త నమునా, తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూనే అధిక ఉష్ణ సామర్థ్యం కోసం రూపొందించింది. ఇన్సులేషన్తో కప్పబడిన L-ఆకారపు దహన గది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి చిప్పలు, పుల్లలు, కర్రలు, ఎండు ఆకులు లేదా వ్యవసాయ వ్యర్థాలు వంటి చిన్న జీవపదార్థపు ముక్కలు అధిక తీవ్రతతో కూడిన వేడితో మండుతాయి. సాంప్రదాయ కట్టెల పొయ్యిలతో పోలిస్తే..ఇది కట్టెల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో జరిగే బహిరంగ కార్యక్రమాల్లో ఈ కట్టెల పొయ్యిల పై అవగాహన కల్పిస్తున్నారు ఉర్స్. ఈ పొయ్యి ధర వచ్చేసి కేవలం రూ. 3000/-.(చదవండి: గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!) -
ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?
సాధారణ స్థితిలో ప్రతి ఒక్కరూ మంచే మాట్లాడతారు, ప్రశాంతంగానే ఉంటారు. కానీ, "ఒత్తిడి (Stress) ఉన్నప్పుడు మీరు ఎవరు?" అనేదే మీ అసలైన వ్యక్తిత్వం."నేను ఆ టైమ్ లో కోపంగా మాట్లాడాను బ్రో, కానీ నేను చాలా మంచివాడిని" అని చాలామంది అంటారు. సైకాలజీలో దీనిని మనం అంగీకరించలేం. ఎందుకంటే, ఒత్తిడి అనేది మీలోని ముసుగును తీసేసే ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. ఒత్తిడిలో మీరు అరుస్తున్నారంటే, ఆ కోపం మీలో ఎప్పుడూ ఉన్నదే, అది ఆ సమయంలో బయటపడింది అంతే.1. ఒత్తిడిలో మెదడు ఏం చేస్తుంది? మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులో భయాన్ని నియంత్రించే Amygdala యాక్టివేట్ అవుతుంది. దీన్నే 'Amygdala Hijack' అంటారు. ఆ సమయంలో మన లాజికల్ మెదడు (Prefrontal Cortex) పనిచేయడం ఆగిపోయి, కేవలం మన 'సర్వైవల్ ఇన్స్టింట్స్' (Fight or Flight) మాత్రమే పనిచేస్తాయి.Fight (పోరాటం): కోపంతో అరవడం, వాదించడం.Flight (పారిపోవడం): సమస్య నుండి తప్పించుకోవడం, బాధ్యత తీసుకోకపోవడం.Freeze (స్తంభించిపోవడం): ఏం చేయాలో తెలియక ఆగిపోవడం.మీరు ఈ మూడింటిలో దేనికి రియాక్ట్ అవుతున్నారో గమనిస్తే, మీ 'ఒత్తిడి వ్యక్తిత్వం' అర్థమవుతుంది.2. మీ పర్సనాలిటీని ఒత్తిడి ఎలా మార్చేస్తుంది?ఒత్తిడిలో మీరు మూడు రకాలుగా మారతారు.The Victim: "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని నిరంతరం బాధపడటం.The Bully: ఒత్తిడిని భరించలేక ఇతరులను డామినేట్ చేసి, కంట్రోల్ చేయాలని చూడటం.The Hermit: పూర్తిగా ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవడం.కానీ, Resilient Personality ఉన్న వ్యక్తి మాత్రం ఒత్తిడిలో కూడా నిశ్శబ్దంగా తన పని చేసుకుంటాడు. అతను సమస్యను చూసి భయపడడు, పరిష్కారం కోసం చూస్తాడు.3. నిజమైన స్ట్రెస్ మేనేజ్మెంట్"ఎప్పుడూ హ్యాపీగా ఉండు, స్ట్రెస్ కి చోటు ఇవ్వకు" అని సోకాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్తారు. ఇది అసాధ్యం, ఎందుకంటే జీవితం ఉన్నచోట స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మధ్యలో ఉండి కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలో సైకాలజీ (Mindfulness & Stoicism) నేర్పిస్తుంది. స్ట్రెస్ను పూర్తిగా తొలగించడం కాదు, స్ట్రెస్ను 'మేనేజ్' చేయడం నేర్చుకోవాలి.4. ఒత్తిడిలో కూడా 'మీరు'గా ఉండటం ఎలా?నా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఒత్తిడిని మీ పర్సనాలిటీకి ఆయుధంగా మార్చుకోండి.Step 1: రియాక్షన్ బ్రేక్ఒత్తిడి మొదలవ్వగానే, ముందుగా శారీరక మార్పులను (గుండె వేగం పెరగడం) గుర్తించండి. వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, మీరు 'అమైగ్డాలా హైజాక్' నుండి బయటపడవచ్చు. ఆ 'రియాక్షన్'ని బ్రేక్ చేయడం మీ మొదటి విజయం.Step 2: స్ట్రెస్ వాల్యుయేషన్"ఈ ఒత్తిడికి కారణం ఏంటి? ఇది నా కంట్రోల్ లో ఉందా?" అని ప్రశ్నించుకోండి. మీ కంట్రోల్ లో ఉంటే పని చేయండి, లేకపోతే దాన్ని 'లెట్ గో' (Let go) చేయండి. మీ ఎనర్జీని కంట్రోల్ చేయలేని వాటి కోసం వృథా చేయకుండా, కంట్రోల్ చేయగలిగే వాటిపై 'Build' చేయండి.Step 3: స్టాయిక్ కామ్తుఫానులో కూడా చెట్టు కదలనట్లు, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీరు మీ సెల్ఫ్-కంట్రోల్ ని కోల్పోకూడదు. ఎవరైతే ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటారో, వారే నిజమైన నాయకులు. ఇదే Beyond స్టేజ్.5. మీ స్ట్రెస్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారంలో మీరు ఎక్కడ అతిగా రియాక్ట్ అయ్యారు?ఆ సమయంలో మీ మెదడు మిమ్మల్ని ఏమని భయపెట్టింది?ఇప్పుడు ఆ పరిస్థితిని తిరిగి చూస్తే, మీరు ఎలా స్పందించి ఉండాల్సింది?ఒత్తిడి మీ పర్సనాలిటీకి అద్దం!బ్రో, ఒత్తిడి మిమ్మల్ని చెడగొట్టదు, అది కేవలం మీ లోపల ఏముందో బయటకు తీస్తుంది. మీ లోపల శాంతి ఉంటే, ఒత్తిడిలో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. లోపల గందరగోళం ఉంటే, ఒత్తిడిలో మీరు నలిగిపోతారు. కాబట్టి బయట పరిస్థితులను మార్చడం కంటే, లోపలి పర్సనాలిటీని నిర్మించడం ముఖ్యమని గుర్తుంచుకోండి."It is not the mountain we conquer, but ourselves." Edmund Hillaryసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!) -
మండుటెండల్లో మనసు చల్లగా
మండే ఎండలు, ఎడారి అంటే వెంటనే గుర్తొచ్చేది రాజస్థాన్. ఎండాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ వేడిలో కూడా మనసుకి శాంతి, ఆధ్యాత్మిక చల్లదనం కలిగించే ప్రదేశం ఉంది. అదే పుష్కర్లో ఉన్న పవిత్రమైన పుష్కర్ సరోవర్.ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ సరోవరం రాజస్థాన్లో అత్యంత పవిత్రమైన జల ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరోవరం బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో ఏర్పడింది అని చెబుతారు. అందుకే ఈ సరోవరం చుట్టూ 50కి పైగా ఘాట్లు, అనేక ఆలయాలు కనిపిస్తాయి.ఎండాకాలంలో పుష్కర్ పట్టణంలో వేడి ఎక్కువగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్, సాయంత్రం సమయంలో సరోవరం వద్ద వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో సరోవరం మీద పడిన సూర్య కిరణాల వల్ల నీరు బంగారు వర్ణంలో మెరుస్తుంది. అదే సమయంలో ఘాట్ల దగ్గర భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తూ కనిపిస్తారు. తెల్లని ఘాట్లు, ఆలయాల గోపురాల ప్రతిబింబం నీటిపై పడుతూ ఒక అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. పుష్కర్కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే బ్రహ్మ ఆలయం పుష్కరం ఇక్కడే ఉంది. అందుకే భక్తులు మాత్రమే కాదు, ట్రావెల్ లవర్స్కు కూడా పుష్కర్ ఒక స్పిరిచ్యువల్ డెస్టినేషన్ గా నిలుస్తుంది. ఎండాకాలంలో రాజస్థాన్ పర్యటన అనేది సాధారణంగా కష్టమైనదే. ఒక వేళ ఏదైనా పనిలో భాగంగా వెళ్తే మాత్రం మౌంట్ అబూ, పుష్కర్ వంటి ప్రదేశాలకు పర్యటనకు వెళ్లచ్చు. మండే వేడిలోనూ ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు.ఎలా చేరుకోవాలి?తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్΄ోర్ట్ నుంచి జైపూర్ కు నేరుగా ఫ్లైట్లో చేరుకోవచ్చు. రైలు మార్గాన వెళ్లేవారు.. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ స్టేషన్ నుంచి జైపూర్కు రైలు మార్గాన చేరుకోవచ్చు. హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుంచి రైలు మార్గం అందుబాటులో ఉంది. జైపూర్ నుంచి రోడ్డు మార్గాన అజ్మేర్, పుష్కర్ సులభంగా చేరుకోవచ్చు. వెళ్లడానికి ముందే టికెట్లు, రూమ్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది.యూరప్లోని అందమైన ద్వీపాల కథనార్త్ ఆట్లాంటిక్ సముద్రం మధ్య ఉన్న ఫరో ఐలాండ్స్ అనే ద్వీప సమూహం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. యూరోప్లో ఇది చాలా పాప్యులర్ డెస్టినేషన్. పచ్చని పర్వతాలు, సముద్రం మధ్యలో కనిపించే చిన్న గ్రామాలు ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ ద్వీ΄ాలకు ప్రత్యేకమైన, ప్రశాంతమైన గ్రామాలే ప్రధాన ఆకర్షణ. ఉదయం వేళలో సముద్ర అలలు, పచ్చని పర్వతాల మధ్య పడిన వెలుగు ప్రపంచం అంతా ప్రశాంతంగా అనిపించే దృశ్యాన్ని సృష్టిస్తుంది.గ్రామాల జీవనంఫరో గ్రామాల సందుల్లో చిన్న ఇళ్లు, గ్రాస్ రూఫ్స్, సముద్రంపై నడిచే పడవల దృశ్యం కనిపిస్తుంది. స్థానిక ప్రజలు ప్రకృతి రిథమ్తో కలిసి జీవించే జీవన విధానాన్ని ఇక్కడ చూడచ్చు. ఫిషింగ్, సముద్ర సంస్కృతి ఇక్కడి ప్రజల జీవితంలో కీలక భాగంలాంటిది. ఇక్కడ ఎక్కువగా వైకింగ్స్ వారసులే నివసిస్తుంటారు.హైదరాబాద్ నుంచి యాత్రహైదరాబాద్ నుంచి ఫరో ఐలాండ్కి ప్రయాణం సాధారణంగా వాయు మార్గంలోనే జరుగుతుంది. ముందుగా హైదరాబాద్ నుండి దుబాయ్ లేదా ఢిల్లీ నుండి యూరోప్లోని కోపెన్ హ్యాగెన్ చేరుకోవాలి. అక్కడి నుండి వగార్ విమనాశ్రయానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి చిన్న రోడ్డు ప్రయాణం చేసి ద్వీపాల మధ్య ఉన్న అందమైన గ్రామాలకు వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. -
గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో సంక్షోభం తలెత్తింది. దాంతో గృహ అవసరాలకే కాక హోటళ్లు, అన్నదాన కార్యక్రమాలు వంటి పలు వాటిపై ఈ గ్యాస్ కొరత ప్రభావం మాములుగా లేదు. అంతేగాదు దీనికి ప్రత్యామ్నాయం ఏంటీ అని సర్వతా ఒకటే చర్చ. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ సైతం బ్యాన్ చేసిన కట్టెల పొయ్యిలను తిరిగి వినియోగించుకోమని ఆదేశించడం చూస్తేనే తెలుస్తోంది సంక్షోభం ఏ స్థాయిలో ఉందనేది. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ..సరికొత్త ఆశను రేకెత్తించారు పూణెకి చెందిన ఇంజనీర్ ప్రియదర్శన్ సహస్రబుద్ధే. అది కూడా వంటింటి వ్యర్థాలతోనే ఈ ఎల్పీజీ గ్యాజ్ సమస్యకు పరిష్కారం చూపించాడు.పూణేకు చెందిన ఇంజనీర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే పూర్వ విద్యార్థి ఈ ఎల్పీజీ గ్యాస్ కొరతకు తన ఇంటి కోసం కనిపెట్టిన ఆవిష్కరణతోనే మార్గం చూపాడు. ఆయన కొన్నాళ్ల క్రితం కుటుంబ వ్యాపారం చేస్తున్నప్పుడు భోజనం తర్వాత ఎంతలా ఆహారం వృధా అవుతుందో గమనించాడు. ఆ వ్యర్థాలను ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ..పలు కంపోస్టింగ్ ప్రయోగాలు చేశాడు. కానీ పరిష్కారం దొరకలేదు. కానీ వాటిని తిరిగి మనకు శక్తిమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దిశగా జీవ ఇంధనాల శాస్త్రంపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. అప్పుడే తెలుసుకున్నాడు వంటశాలలో ఉత్పత్తి అయిన సేంద్రీయ వ్యర్థాలను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేసి మీథేన్ వాయువుని ఉత్పత్తి చేయొచ్చని. ఇది వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం. పైగా వ్యర్థాలను పొంగిపొర్లుతున్న పల్లపు ప్రాంతాలకు పంపే బదులు గృహాలకు శక్తిగా మారిస్తే..ఆ ఆలోచనే 2017లో 'వాయు' అనే సాధారణ గృహాల కోసం రూపొందించిన కాంపాక్ట్ దేశీయ బయోగ్యాస్ ప్లాంట్గా రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ వాయురహిత జీర్ణక్రియ అని పిలువబడే సహజ ప్రక్రియ ద్వారా సేంద్రీయ వంటగది వ్యర్థాలను మీథేన్గా మారుస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన వాయువు నేరుగా స్టవ్కు పైపుల ద్వారా పంపొచ్చు. మిగిలిపోయిన వేస్ట్ని ఎరువుగా ఉపయోగించొచ్చు. ఈ ప్రయోగం ముందగా సహస్రబుద్దే తన ఇంట్లోనే ప్రారంభించాడు. ప్రతిరోజు సేకరించిన ఆహార వ్యర్థాలను ఉపయోగించి దాదాపు 800 లీటర్ల బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఇది అతని ఇంటి వంట అవసరాలకు సరిపోయింది. అంతేగాదు ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించింది కూడా. తన చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు కూడా దీనిపై అవగాహన కల్పించి..వాళ్లు కూడా ఈ మార్గంలో పయనించేలా చేశాడు. ఆ తర్వాత తన వినూత్న స్టార్టప్ సాయంతో నాసిక్, హైదరాబాద్, ఔరంగాబాద్తో సహా వివిధ నగరాల్లో వందకు పైగా యూనిట్లను స్థాపించారు. ఇవి ప్రతిరోజూ దాదాపు రెండు టన్నుల ఆహార వ్యర్థాలను ప్రాసెస్ చేయగలవు. ఇక్కడ ఈ ఇంజనీర్ వ్యర్థాలను పారేసివిగా కాకుండా వినియోగించుకునే విలువైన వనరుగా ఎలా వాడాలో తెలియజేశాడు. ఓ పక్క వ్యర్థాల సమస్యకు చెక్పెట్టాడు, అలాగే ఎల్పీజీ గ్యాస్పై ఆధారపడకుండా స్వచ్ఛమైన మీథేన్ వాయువుని పొందేలా చేశాడు. పర్యావరణానికి హితంగా, వంటిల్లు పరిశుభ్రంగా ఉంచే గొప్ప పరిష్కారం కదూ ఇది..!.(చదవండి: ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!) -
ఆస్కార్ ఫుడ్ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..
సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. మార్చి 16న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు వేదికగా నిలిచింది. మరి ఈ వేడుకకు వచ్చే అతిరథ మహారథులకు ఆస్కార అవార్డుల అనంతరం జరిగే విందు ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖులు, సెలబ్రిటీల కోసం ప్రత్యేక మెనూతో కూడిన వంటకాలను సర్వ్ చేయనున్నారు. ఈసారి ఆస్కార్ వేడుక అనంతరం జరిగే పార్టీలో ఏం వంటకాలు ఉన్నాయో చూద్దామా..!.ప్రఖ్యాత చెఫ్ రెస్టారెంట్ వ్యాపారి వుల్ఫ్గ్యాంగ్ పుక్ ఈ ఆసార్క్ వేడుకకు వచ్చే అతిథులు తీవ్రమైన ఆకలితో ఉంటారని అందుకే పిజ్జా వంటి కంఫర్ట్ ఫుడ్(మనసుకు హాయినిచ్చే ఆహారం)ని ఇష్టపడతారని చెబుతున్నారు. ఈసారి విందుని 75 మంది ప్రధాన చెఫ్లు (savoury chefs), 45 మంది పేస్ట్రీ చెఫ్లు, 325 మంది సేవా సిబ్బంది, నిర్వాహకులు కలిసి తయారు చేస్తారని అన్నారు. ఈ ఏడాది హాలీవుడ్ ప్రముఖులకు వడ్డించే వంటకాల మెనూలో ఏం ఉన్నాయంటే..ఇలా ఆస్కార్ అతిథులకు రుచికరమైన ఆహారం వడ్డించడం అనేది పుక్ బృందానికి వరుసగా ఇది 32వ సంవత్సరం కావడం విశేషం. అందుకే ఈసారి 70కి పైగా వంటకాలు వడ్డించామని తెలిపారు పుక్. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మార్పులు చేర్పులు ఏమిటంటే: జపనీస్ శైలి పబ్ ఆహారాన్ని అందించే 'live izakaya station', అప్పుడే తయారుచేసిన ఐస్క్రీమ్ను వడ్డించే ఇటాలియన్ 'gelato machine' వంటివి హైలెట్గా నిలవనున్నాయి.ఈ ఏడాది మెనూలో 600 హోం మేడ్ పిజ్జాలు, 'artichoke agnolotti' అనేది ఇటాలియన్ పాస్తా మాదిరి శాకాహార వంటకం, బంగారు పొడితో అలంకరించిన రెండు వేల చిన్న చాక్లెట్ ఆస్కార్ విగ్రహాలు. ఈ చాక్లెట్ ఆస్కార్ విగ్రహాలపై రెండు గ్యాలన్ల 24-క్యారెట్ల 'ద్రవ బంగారం' వినియోగిస్తారట. మొత్తం 1500 మంది వంట చేసి సర్వ్ చేస్తారట. వంటకాలన్ని చాలా లైట్వైట్గా తయారు చేస్తారు. అలాగే ఈ వంటకాల కోసం ఇబ్బడిముబ్బడిగా సాస్లను వినియోగించరట. ముఖ్యంగా వంటల్లో అన్ని నాణ్యమైన దినుసులనే వినియోగిస్తారట. వాటిలో దాదాపు 91 కిలోల డ్రై-ఏజ్డ్ రిబే, 136 కిలోల హౌస్-స్మోక్డ్ సాల్మన్, 14 కిలోల కలుగా కేవియర్, 227 కిలోల వైల్డ్ మష్రూమ్లు, 91 కిలోల నిషికి రైస్, 181 కిలోల చీజ్లు తదితరాలు ఉంటాయి. ఈ ఏడాది ఆస్కార్ వంటకాలు సర్వ్ చేసే మెనూ పేరు వచ్చేసి ఎలిగాన్స్ అండ్ కంఫర్ట్ కంబైన్. అలాగే కొత్తవంటకాల ప్రయోగాలను పరిచయం చేయరట. ఎందుకంటే అవి అందరికీ పడకపోవచ్చు..ఏదైన హెల్త్ సమస్యలు ఉత్ఫన్నమయ్యే అవకాశం ఉండొచ్చు. అంతేకాదండోయ్ విందుతోపాటు మందు కూడా ఉంది. ఏకంగా 1700 షాంపైన్ బాటిళ్లు అతిథులకు సర్వ్ చేస్తారట. అలాగే ఈ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని లాస్ ఏంజెల్స్లో ఉంటున్న నిరాశ్రయ ప్రజలకు పంపిణీ చేస్తారట. (చదవండి: మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్..! 18 దేశాలు..) -
మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్..! 18 దేశాలు..
సాధారణ పరిస్థితుల్లో మారథాన్ చేయడమే కష్టం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్ అంటే..సవాలు ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి భయానక పరిస్థితులను తట్టుకుని విజయవంతంగా అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించి.. అరుదైన ఘనతను రన్నర్ నమోదు చేశారు . ఈ అసాధారణ మారథాన అక్టోబర్ 25, 2025న స్వీడన్లోని గార్పెన్బర్గ్లో జరిగింది.తలకు హెడ్ల్యాంప్లు ధరించి షూలేస్లను గట్టిగా కట్టి ..రన్నర్లు అత్యంత లోతైన భూమి లోపల ఈ ప్రత్యేకమైన రేసుని పూర్తి చేశారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 1,118.56 మీటర్లు (3,669 అడుగుల 10 అంగుళాలు) లోతులో జరిగిన సర్టిఫైడ్ మారథాన్లో దాదాపు 18 దేశాల నుంచి యాభైఐదు మంది రన్నర్లు పాల్గొన్నారు. ఇక్కడ వాతావరణం వేడిగా, తేమగా, కొద్దిగా దుమ్ముతో కూడినది. ఇక ఈ రేసు జరిగిన లోతుని గురించి చెప్పాలంటే..ఈ భూగర్భ స్థాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏంజెల్ జలపాతం, స్కాట్లాండ్లోని UKలోని ఎత్తైన పర్వతం బెన్ నెవిస్ కిందగా ఎంతో లోతు ఉంటుందో అంత లోతైనదిగా గుర్తించారు. ఈ మారథాన్ని బికమింగ్ఎక్స్ (యూకే), ఐసిఎంఎం (యూకే), బోలిడెన్ (స్వీడన్) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ మారథాన్తో దాదాపు రూ. 8 కోట్ల డబ్బుని సేకరించారు. వీటిని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ మారథాన్ రైసుతో మరో ప్రపంచ రికార్డుని కూడా నమోదు చేశారు. అదేంటంటే ఈ రన్నర్లు లోతైన భూగర్భ మారథాన్ దూరం వచ్చేసి 1,082.30 మీటర్ల (3,550 అడుగుల 10 అంగుళాలు) రన్ చేసి మరో రికార్డుని క్రియేట్ చేశారు. ఈ మేరకు ఈ మారథాన్ని నిర్వహించిన బికమింగ్ఎక్స్ సహ వ్యవస్థాపకుడు బేర్ గ్రిల్స్ మాట్లాడుతూ..వందల మీటర్ల భూగర్భంలో మారథాన్ను నిర్వహించడం అసాధారణమైన ఘనత అని, అయినప్పటికీ అది సాధ్యమయ్యే పరిధిలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో కూడా మారథాన్ సహజంగానే కష్టమైనది, అలాంటి కఠినమైన వాతావరణంలో ఈ మారథాన్ రేసులో పాల్గొనడం అనేది తీవ్రమైన ఒత్తిడి అధిగమించే సవాలుగా పేర్కొన్నారు.(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!) -
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
కాన్ఫిడెన్స్ అంటే ఎదుటివారిని డామినేట్ చేయడం లేదా గట్టిగా అరవడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే "నేను గొప్పవాడిని" అని అరుచుకోవడం కాదు, "నేను దేనినైనా ఎదుర్కోగలను" అని మనసులో ఉండే 'Self-Efficacy' (ఆత్మసామర్థ్యం). దీనికి గర్వానికి (Arrogance) మధ్య ఉన్న తేడాను గుర్తించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక 'నిశ్శబ్ద బలం' (Silent Strength).1. Albert Bandura సిద్ధాంతంకాన్ఫిడెన్స్ అనేది ఒక పుట్టినప్పుడు వచ్చే లక్షణం కాదు. ఆల్బర్ట్ బాండూరా అనే సైకాలజిస్ట్ దీనిని 'Self-Efficacy' అని పిలిచారు. దీనికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి.Mastery Experiences: మీరు ఒక పనిని పదే పదే చేసి, అందులో నైపుణ్యం సంపాదించినప్పుడు వచ్చే నమ్మకం.Vicarious Experiences: మీలాంటి వారే ఒక పనిని సాధించడం చూసి, "అతనే సాధించగలిగినప్పుడు నేను ఎందుకు సాధించలేను?" అని అనుకోవడం.Social Persuasion: మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించడం.Physiological States: మీ శరీరంలోని ఒత్తిడిని, ఉత్సాహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది.2. గర్వానికి, కాన్ఫిడెన్స్ కి తేడా ఏంటి?Arrogance (గర్వం): "నేను అందరికంటే తోపు, నేను ఎప్పుడూ తప్పు చేయను." ఇది భయాన్ని దాచుకోవడానికి వేసే ముసుగు.Confidence (ఆత్మవిశ్వాసం): "నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుండి నేర్చుకుని మళ్ళీ లేవగలను." ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం.కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలిస్తే భయం, అందుకే అతను ఇతరుల మీద అరుస్తాడు.3. నిజమైన కాన్ఫిడెన్స్మోటివేషన్ ట్రైనర్లు "నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు గెలుస్తావు" అని చెప్తారు. ఇది కేవలం పైన పూసే రంగు. కానీ సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ రావాలంటే 'కాంపిటెన్స్' (నైపుణ్యం) ఉండాలి (Competence-based Confidence). మీరు ఒక పనిని కష్టపడి నేర్చుకుని, అందులో ప్రావీణ్యం సంపాదిస్తే.. ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది.4. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం మూడు అంచెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలో చూద్దాం.Step 1: అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండిముందుగా I am not enough అనే అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి. మీరు ఎవరితోనూ పోటీ పడనవసరం లేదు, మీ నిన్నటి వెర్షన్ తో మాత్రమే పోటీ పడండి.Step 2: చిన్న చిన్న విజయాలుఒక రోజులో మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి. ఆ చిన్న 'విజయం' మీ సబ్-కాన్షియస్ మైండ్కి మీరు నమ్మదగ్గ వ్యక్తి అని చెప్తుంది. ఇలా రోజురోజుకూ మీ కాన్ఫిడెన్స్ మజిల్ని Build చేయండి.Step 3: నిశ్శబ్ద విజేతమీరు స్టేజ్ ఎక్కనవసరం లేదు, అరవనవసరం లేదు.. మీ నడకలో, మీ కళ్ళలో, మీ మాటల్లో ఆ బలం కనిపిస్తుంది. ఎదుటివారికి మీరు ఒక 'ముప్పు'గా కాకుండా, ఒక 'ప్రేరణ'గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు ఎప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఫీలవుతారు? మీలో ఉన్న ఒక బలహీనతను మీరు గర్వంగా ఒప్పుకోగలరా?ఇతరుల విమర్శలు మిమ్మల్ని ఇంకా కదిలిస్తున్నాయా?కాన్ఫిడెన్స్ ఒక ప్రయాణం!బ్రో, కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలను పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి.. అప్పుడు కాన్ఫిడెన్స్ దానంతట అదే ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది."Confidence is silent. Insecurities are loud."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..) -
పైల్స్ నుంచి ఫ్రీ అవండి ఇలా...
ముళ్ల మీద కూర్చోవడం అనే మాట వాడుకగా వాడుతుంటారు. మొలల సమస్య ఉంటే ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ‘మొల’ అంటే మేకు అని అర్థం. ఆకృతిలోనూ అవి మేకును పోలి ఉంటాయి. అలాగే కూర్చునే చోట నిజంగా మేకులే ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ సమస్యకు ఆ పేరొచ్చిందేమో అనిపిస్తుంటుంది. మలద్వారం దగ్గర వచ్చే మొలల సమస్యను ఇంగ్లిష్లో పైల్స్ అనీ, హిమరాయిడ్స్ అని అంటారు. ఈ సమస్యకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మలద్వారం దగ్గరి కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. ఒకరకంగా ఇది దేహానికి చివరి ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తనాళాలు ఎక్కువ సంఖ్యలో అల్లుకు΄ోయినట్టుగా ఉంటాయి. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. ఇలా బుడిపెలుగా వచ్చే వాటిని తెలుగులో మొలలు అనీ మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఇవి కొందరిలో మల ద్వారం నుంచి బయటకూ వచ్చేసి బాధిస్తుంటాయి. ఒక్కోసారి కొందరిలో ఆ బుడిపెలు ఒరుసుకు΄ోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంటుంది. మలద్వారం వద్ద తీవ్రమైన దురదా నొప్పీ కూడా ఉంటాయి. వెరసి అవన్నీ కూర్చోనివ్వకుండా, కదల్లేకుండా బాధపెడుతుంటాయి. కారణాలు... మలద్వారం వద్ద రక్తనాళాల వాపునకు కారణమైన ఏ అంశాల వల్లనైనా ఇవి రావచ్చు. ఉదాహరణకు...కడుపులో ఒత్తిడి పెరగడం (మలబద్ధకం ఉన్నవాళ్లు ముక్కుతూ విసర్జన చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం మొలలకు ప్రధాన కారణం)స్థూలకాయం హై΄ో థైరాయిడిజం మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు కండరాలపైనా, రక్తనాళాలపైనా పడే ఒత్తిడి వల్లశారీరక శ్రమ లేని వృత్తుల్లో ఉన్నవాళ్లలో దేహానికి తగినంత వ్యాయామం లేకపోవడంతోదీర్ఘకాలం పాటు నీళ్ల విరేచనాలు అవుతుండటం (డయేరియా)... ఈ అంశాలన్నీ మొలల సమస్యకు కొన్ని కారణాలు నివారణ / చికిత్స... మూలశంకవ్యాధిలో లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇందుకు కారణాలను తెలుసుకుని వాటినీ అదుపు చేయాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు... మలబద్దకం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి అంశాలు కారణమైతే వాటినీ అదుపు చేయాలి. అక్కడి రక్తనాళాలను గాయపరచకుండా విసర్జితమయ్యేందుకు మలం మృదువుగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలిష్ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇక ద్రవాహారం, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా విసర్జన అలవాట్లు ఉండాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి చికిత్స అవసరం. తీవ్రతను బట్టి డాక్టర్లు కొన్ని రకాల చికిత్సలు మొదలుకొని శస్త్రచికిత్స వరకు సూచిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సల్లోనూ లేజర్, క్రయోథెరపీ, మినిమల్లీ ఇన్వేజివ్ ప్రోసీజర్ ఫర్ హీమరాయిడ్స్ / హీమరాయిడోపెక్సీ (ఇందులో అదనంగా పెరిగిన రక్తనాళాలకు రక్తసరఫరా జరగకుండా ఆపి, అవి తొలగి΄ోయేలా చేయడంతో పాటు నొప్పి, రక్తస్రావం వీలైనంతగా నివారించే అడ్వాన్స్డ్ ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘రఫాలో ప్రొసిజర్’ అనే నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. లక్షణాలు... మొలల వ్యాధి ఉన్నా... చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. మొలలు ఉన్నాయన్న విషయమే వాళ్లకు తెలియకపోవచ్చు కూడా. మరికొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... మలవిసర్జన తర్వాత ప్రక్షాళన సమయంలో ఓ ఉబ్బులాగా లేదా కండలాగా చేతికి తగలడం. (అందులో రక్తం గడ్డకట్టి ఉంటే గట్టిగా కూడా తగలవచ్చు) కొందరిలో మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటం ∙మల విసర్జన తర్వాత మలంపై రక్తపు చారికలా కనిపించడంకొన్సిసార్లు లోపలి దుస్తులకు తడిలా నీళ్లలా ఏదైనా మరకలా అంటడం మలద్వారం చుట్టూరా దురదగా అనిపించడం.కొందరిలో అరుదుగా నొప్పి... పైల్స్ వల్ల నొప్పి చాలా అరుదుగా కలుగుతుంది. మొలలలోపల రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే మొలలతో నొప్పి తెలుస్తుంది. కొందరిలో పైల్స్తో పాటు మలద్వారంలో చిన్న పగులు (ఫిషర్) కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాత్రం నొప్పి రావచ్చు. కొందరిలో మల విసర్జన వల్ల లోపల ఉండే మొలలన్నీ గుత్తిలా బయటకు రావచ్చు. అలాంటప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మొలల సమస్యలో ఇది సమస్య తీవ్రతకు ఇదొక తార్కాణం.డాక్టర్ ఆసిఫ్ మెహరాజ్, సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ (చదవండి: జీఎస్ఎమ్’: చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!) -
చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!
మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్ఎమ్’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్ వచ్చివారిలో 50% మంది జీఎస్ఎమ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక మెనోపాజ్ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్ఎమ్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్ఎమ్ కనిపిస్తోంది. పేరును బట్టి కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా... సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.గుర్తించడమెలా (డయాగ్నసిస్) జీఎస్ఎమ్కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్ దగ్గర చెప్పుకుంటే చాలు.చికిత్స ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్ సూచించడం వంటివి. అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీగా హార్మోన్లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.సమస్య ఎందుకొస్తుందంటే... సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్... వారి ప్రైవేట్ పార్ట్స్ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.డాక్టర్ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ -
రూ. 9 వేలతో దుస్తుల వ్యాపారం ప్రారంభించి..ఇవాళ ఏకంగా రూ. 57 కోట్లు..
సింగల్ మదర్ సక్సెస్ స్టోరీ ఇది. ఓ సాధారణ వీధి దుకాణం నుంచి బ్రాండ్ని నిర్మించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు బట్టలు అమ్ముడైతే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ ఏకంగా ఓ బ్రాండ్ వ్యస్థాపకురాలిగా కోట్లు గడిస్తూ..సక్సెస్కి చిరునామాగా మారిందామె. ఎవరామె అంటే..చైనాలో డాంగ్ అనే మహిళ కేవలం రూ. 9,240లతో వీధి దుకాణం నడుపుతుండేది. 1990లలో హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌలో నిర్మించిన డాంగ్ తన విజయవంతమైన దుస్తుల వ్యాపారం కారణంగా ప్రజలందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2012లో డాంగ్ వద్ద ఎలాంటి పొదుపులు, ఆదాయం లేక ఒంటిరి తల్లిగా రోడ్డుపై నిలబడిపోయింది. కనీసం తన బిడ్డకు పాలపొడిని కొనడానికి కూడా డబ్బులు లేని దారిద్యాన్ని అనుభవించింది. ఇరవైల వయసులో తన బిడ్డను పోషించుకోవాల్సిన పరిస్థితి ఆమెది. ఆ నేపథ్యంలో చిన్నగా వీధి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించింది. అయితే వ్యాపారం అంతగా లాగాక.. ఇబ్బందిపడింది. ఒక్కోసారి ఈ వ్యాపారం తన వల్ల కాదేమో అన్నంతగా చేతులెత్తేసి దిగాలు పడేది. మళ్లీ ఆ క్షణంలోనే నేడు ఓడిపోతే..నా బిడ్డ బాధ్యతను ఎవరు చూసుకుంటారని భయపడేది. అయినా తాను పేదదాన్ని అయ్యిండొచ్చు, కానీ తన బిడ్డ ఎందుకు పేదవాడిగా ఉండాలన్న ఆలోచన తనకు వెనుకడగు వేయనివ్వని పట్టుదలను ఇచ్చేదట. అదే తనకు కఠినమైన ఆ పరిస్థితులను తట్టుకునే శక్తిని అందించిందట. తన వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రాత్రి మార్కెట్ల వైపుకి మొగ్గు చూపేదట. తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలంటే మంచి పరిచయాలు కూడా అవసరమని తెలుసుకుంది డాంగ్. అలా డబ్బు ఆదా చేస్తూ..స్టాక్ కొనడానికి ఉదయం ఐదుగంటల కల్లా మేల్కొనేది. తర్వాత రాత్రి కూరగాయల మార్కెట్ వెలుపల బట్టలు అమ్ముతుండేది. రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేది. బేరమాడటం, భారీ వస్తువులను తక్కువ ధరకే తీసుకెళ్లగలిగే మాట చాతుర్యం అన్నింటిని స్వయంగా నేర్చుకుంది. ఈ పనుల బిజీలో బిడ్డ ఆలనాపాలనా చూడటం కష్టంగా ఉండేది. ఒక్కోసారి రాత్రిపూట వీధుల్లో బిడ్డను ఒంటరిగా వదిలేసి వ్యాపారం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా కష్టాలను ఓర్చుకుంటూ..నెమ్మదిగా రిటైల్ దుకాణాలను నడిపే స్థాయికి చేరుకుంది. అప్పుడే చైనీస్ సంప్రదాయాన్ని సమకాలీన డిజైన్తో మిళితం చేస్తూ ఒక ప్రసిద్ధ బ్రాండ్ను నిర్మించింది. ఈ బ్రాండ్కి చైనా దేశ్యవాప్తంగా గుర్తింపు వచ్చేలా అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి రూ. 54 కోట్లు పైనే గడించే స్థాయికి చేరుకుంది. నెటిజన్లు సైతం ఆమె కథ విని ఒంటిరి తల్లి చాలా శక్తిమంతమైనది. ఎన్ని కష్టాలు ఓర్చుకుందో ఆమెకే తెలుసు అంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: 76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!) -
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..) -
ఇది అశ్వమేలు యాగం!
మెరుపు వేగంతో పరుగెత్తే గుర్రాలను చూసి ‘ఆహా’ అనుకుంటాం. చాలామంది గుర్రపు డెక్కల వేగాన్ని మాత్రమే చూస్తారు. కొద్దిమంది మాత్రం వాటి కళ్లలోకి చూస్తారు. ఆ కళ్లలోని అలసటను, అనారోగ్యాన్ని గ్రహిస్తారు. ఉత్తరాఖండ్కు చెందిన గౌరీ మౌలేఖీ అలాంటి వారిలో ఒకరు. తీర్థయాత్రల దారుల్లో గుర్రాలు పడే బాధలు, హింసను కళ్లారా చూసింది. గుర్రాల సంక్షేమం కోసం నడుం బిగించింది. వేలాది గుర్రాలను రక్షించింది. వాటి కోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుర్రాలపై హింస జరగకుండా స్వచ్ఛంద సేవకులతో సైన్యాన్ని ఏర్పాటు చేసింది. ఆమెది రాజ్యవిస్తరణ కోసం చేసే అశ్వమేధ యాగం కాదు... అశ్వాల సంక్షేమం కోసం చేసే అశ్వమేలు ఉద్యమ యాగం...ఎర్రటి ఎండలో రెండు గుర్రాలు ఒక బండిని లాగుతూ అలసటతో డెహ్రాడూన్ సమీపంలో కుప్పకూలిపోయాయి. ‘అయ్యో!’ అనుకోలేదు యజమాని. అతడికి ఆగ్రహం వచ్చింది. భయపెట్టి పరుగెత్తించడానికి వాటి ముక్కుల దగ్గర కాగితం వెలిగించాడు. అవి భయాందోళనలతో మళ్లీ పరుగెత్తడం ప్రారంభించాయి. ఈ సంఘటన గౌరి మౌలేఖీకి పదే పదే గుర్తుకు వచ్చి బాధ పెట్టేది. చార్ధామ్, వైష్ణోదేవి వంటి ప్రసిద్ధి తీర్థయాత్ర మార్గాలలో గుర్రాలను ఉపయోగిస్తారు. అక్కడ కొన్ని గుర్రాలు ఎదుర్కొనే బాధలు ఇన్నీ కావు. ఈ అమానవీయ దృశ్యాన్ని మార్చాలనుకుంది గౌరి.న్యాయస్థానం దృష్టికి...వివిధ రూపాల్లో గుర్రాలు ఎదుర్కొంటున్న హింసను ఉత్తరాఖండ్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది గౌరి. గుర్రాలను మాతృప్రేమతో ఎలా చూసుకోవాలో చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. గాయపడి ఎవరూ పట్టించుకోని గుర్రాలకు ఆశ్రయం కల్పించడానికి ఉత్తరాఖండ్లో గుర్రాల అభయారణ్యం ఏర్పాటు చేసింది. ఆమె పని కేవలం గుర్రాలకు పునరావాసం కల్పించడం మాత్రమే కాదు, ఎక్కడ గుర్రాలపై హింస జరిగినా నిరోధించడం, జంతువుల పట్ల కరుణతో ఉండాలనే సందేశాన్ని జనాలలోకి తీసుకువెళ్లడం. జంతు సంక్షేమ ఉద్యమానికి ముందు విద్యాబోధన, రేడియో జాకీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం, థియేటర్... ఇలా ఎన్నో పనులు చేసింది గౌరి మౌలేఖీ.క్షేత్రస్థాయిలో...‘మా జోక్యానికి ముందు రాష్ట్రంలో జంతువుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఏవో ఆచారాల పేర్లతో లక్షలాది జంతువులను బలి ఇచ్చేవారు. పశువైద్యుల కొరత ఉండేది. ప్రభుత్వ సహకారంతో వన్య్రపాణుల సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగుపరచడానికి సహకార విధానంతో అధికారులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాం, జంతువులకు సంబంధించి ఆరోగ్యకరమైన పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. తీర్థయాత్ర మార్గాలలో రిజిస్టర్డ్, ఆరోగ్యకరమైన గుర్రాలను మాత్రమే అనుమతించేలా చూశాం’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది గౌరి.అడ్డంకులు ఎదురైనా సరే...గత కొన్ని సంవత్సరాలుగా డెహ్రాడూన్ చీఫ్ వెటర్నిటీ ఆఫీసర్ డా.సతీష్ జోషి, గౌరీతో కలిసి జంతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ కేదార్నాథ్, యమునోత్రిలాంటి ప్రాంతాలలో మా వైద్య అధికారులతో పాటు గౌరి బృందం చెప్పుకోదగినరీతిలో జంతుసంక్షేమం కోసం కృషి చేస్తోంది’ అంటున్నాడు డాక్టర్ సతీష్. ఒకప్పుడు ఏ గుర్రాలను చూసి అయితే గౌరి బాధపడిందో అవి ఇప్పుడు ఆమె సంరక్షణలో క్షేమంగా... ఆరోగ్యంగా ఉన్నాయి. ‘ఇప్పుడు అవి నా దగ్గర క్షేమంగా, సంతోషంగా ఉన్నాయి. చనిపోయే వరకు జంతువులతో పనిచేయించాలనే క్రూరత్వం అంతరించాలి’ అంటుంది గౌరి.జంతు సంక్షేమం... అషిమ ఫెలోషిప్జంతు సంక్షేమానికి సంబంధించి యువతరానికి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటైన కార్యక్రమం... అషిమ ఫెలోషిప్. చట్టపరమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వ విభాగాలు, పరిశ్రమలతో వ్యూహాత్మక కమ్యూనికేషన్లకు ఉపయోగపడుతుంది. ఈ ఫెలోషిన్ అన్లైన్ సెషన్తో ప్రారంభమవుతుంది.‘జంతు సంక్షేమ చట్టాల గురించి సమగ్ర జ్ఞానాన్ని అందించే ఫెలోషిప్ ఇది’ అంటుంది సనా సింగ్. దిల్లీకి చెందిన సనా సింగ్కు చాలాసంవత్సరాలుగా జంతుసంక్షేమం ఆసక్తి. ఆ ఆసక్తితోనే అషిమ ఫెలోషిప్ చేసింది సింగ్. ‘ఫెలోషిప్ కోసం ఇచ్చే ఎనిమిది నెలల శిక్షణ ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ ఇది మాత్రమే సరిపోదు. జంతు సంక్షేమానికి సంబంధించి సమాజం సీరియస్గా ఆలోచించాలి’ అంటుంది. – గౌరి మౌలేఖీ -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
వడగండ్లా... బండరాళ్లా...
పిల్లలూ...వడగండ్ల వాన అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. మన దేశంలో వేసవిలో ఎక్కువ పడుతుంటుంది. చిన్న చిన్న గోలీల వంటి వడగళ్లు (Hailstones) పడుతుంటాయి. కొన్ని చోట్ల ఇంకాస్త పెద్ద వడగండ్లు పడుతుంటాయి. వడగండ్లు ఎందుకు పడతాయి? వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం.ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్షఅయితే అమెరికాలోని ఇలినాయిస్లో ఎంత పెద్ద వడగండ్లు పడ్డాయో. ఒక్కోటి పెద్ద రాయంత ఉంది. నాలుగు అంగుళాల వెడల్పుతో ఉంది. కంకాకీలో 6 అంగుళాల వడగళ్లను గుర్తించారు. రాష్ట్రంలోనే ఒక కొత్త రికార్డు వడగండ్లుగా NWS బుధవారం తెలిపింది. అందుకే వడగండ్ల వానలో చిక్కుకుని చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: ఆరు వేళ్లు.. నెతన్యాహూ సేఫేనా? రూమర్లు హల్చల్(మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్) -
మండిస్తున్న ఎండలు, పైకప్పు చల్లగా ఇలా..!
నగర/పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు అధిక ఉష్ణంతో సెగలు కక్కుతున్నాయి. ఇరుకు రేకుల ఆవాసాల్లో తలదాచుకునే పేదల నుంచి పక్కా ఇళ్లలో ఉండే మధ్యతరగతి ప్రజల వరకు వేడిఒత్తిడి (హీట్ స్ట్రెస్)కి లోనవుతున్నారు. తమ ఇళ్లు వేడెక్కిపోతుంటే ఏసీలు కొనే స్తోమత లేని వారు అల్లాడుతున్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనం ప్రకారం.. ఆరు భారతీయ నగరాల్లో 80% విస్తీర్ణంలోని గృహవాసులు వేడి ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్ చెయ్యటమే, ఏసీలు/కూలర్ల వాడకం కన్నా, మేలైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. వేడి ఒత్తిడి నుంచి కాపాడు కోవటానికి ఉపయోగపడే కూల్ రూప్ పద్ధతులేమిటో చూద్దాం.. హీట్ స్ట్రెస్కు మూల కారణాలు ఇవి.. అర్బన్ ప్రాంతాలు ఇళ్లతో నిండిపోవటం, పచ్చదనం తగ్గిపోవటం, వాహన కాలుష్యం పెరిగిపోవటంతోపాటు వేడిని అతిగా గ్రహించే స్వభావం గల (హీట్ ట్రాపింగ్ మెటీరియల్) సామగ్రితో ఇళ్లు నిర్మించటం ఈ వేడి ఒత్తిడి పెచ్చుమీరటానికి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కాంక్రీటు, ఇటుకలు, రాళ్లు పగటి పూట సూర్యరశ్మి నుంచి వేడిని గ్రహించుకొని, రాత్రి పూట నెమ్మదిగా ఆ సెగను వదులుతూ ఉంటాయి. దీంతో కాంక్రీటు భవనాలు రాత్రిళ్లు కూడా సెగలు కక్కుతూనే ఉంటాయి. అందువల్ల అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా రేకుల ఇళ్లు, మండు వేసవిలో నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. మెరుగైన పైకప్పులు.. మూడు రకాలు బయటి వేడిని అతి తక్కువగా గ్రహించటంతోపాటు అతి తక్కువగా ఇంటి లోపలికి వదిలే పై కప్పులు ముఖ్యంగా మూడు రకాలు. వీటినే థర్మల్లీ ఎఫిషియెంట్ రూఫ్స్ అని వ్యవహరిస్తున్నారు. కూల్ రూఫ్స్ : ఎండ కాచే సమయంలో సోలార్ రేడియేషన్ను ఎక్కువగా గ్రహించకుండా తిరిగి వాతావరణంలోకి తిప్పికొట్టే (రిఫ్లెక్టివ్) సామర్థ్యం, గ్రహించిన కొద్దిపాటి వేడిని కూడా గది లోపలికి కాకుండా పైకప్పు నుంచే అతి త్వరగా బయటకు వదిలి వేసి చల్లబడే సామర్థ్యం గల టైల్స్, పెయింట్లు, మెంబ్రెయిన్లు ఈ కోవలోకి వస్తాయి. గ్రీన్ రూఫ్స్ : ఆర్సీసీ శ్లాబ్పైన వాటర్ ప్రూఫింగ్ చేసి మట్టి పోసి మొక్కలు పెంచితే అదే గ్రీన్ రూఫింగ్. సూర్యరశి్మని గ్రహించి మొక్కలు పెరుగుతుంటాయి. అవి ఆకుల ద్వారా వాతావరణంలోకి వదిలే నీటి తేమ వల్ల పైకప్పు, పరిసరాలు చల్లగా ఉంటాయి. పచ్చని లాన్/ మొక్కలు/ చిన్న చెట్లు పెంచాలంటే 300 ఎంఎం లోతులో మట్టి పొర వేసుకోవాలి. రూఫ్ పార్కులు, సేదదీరే స్థలాలు, కమ్యూనిటీ గార్డెన్లకు ఈ ఇంటెన్సివ్ గ్రీన్ రూఫ్ అనువైనది. ఎక్స్టెన్సివ్ గ్రీన్ రూఫ్ పద్ధతిలో అయితే 25–125 ఎంఎం లోతు మట్టి పొర వేస్తే చాలు. నీటి ఎద్దడిని తట్టుకునే సక్యులెంట్స్, గడ్డి, తీగజాతి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంటి పైకప్పులను ఇన్సులేట్ చెయ్యటమే ఏసీల వాడకం కన్నా మేలైన పరిష్కారం మట్టి పాత్రలతో ఇన్సులేషన్: ఆర్సీసీ శ్లాబ్పైన మట్టి పాత్రలను బోర్లించి, వాటిపైన సున్నం లేదా సిమెంట్ కాంక్రీటు వేసి, దానిపైన సెరామిక్ టైల్స్ వంటి వాటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. బోర్లించిన మట్టిపాత్రలో ఉండే గాలి శ్లాబ్కు వేడి చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఎండ వేడి కిందకు దిగకుండా ఉంటుంది. ఇన్సులేటెడ్ రూఫ్స్: రూఫ్ శ్లాబ్ ద్వారా గది లోపలికి దిగే వేడిని మూడింట రెండొంతులు పైకప్పుపై వేసే ఇన్సులేటెడ్ రూఫ్ అరికడుతుంది. ఇన్సులేషన్ పొరగా ఎక్స్ట్రూడెడ్ పాలిస్టైరెన్ షీట్ (ఎక్స్పీఎస్), సెల్యులోజ్ పైబర్, థర్మోక్రేట్, లైమ్ కాంక్రీట్, హాలో టెర్రకోట టైల్స్, గ్లాస్ వూల్ షీట్లను వాడుతున్నారు. దీని మందం 20–50 ఎం.ఎం. ఉంటుంది. షీట్ ధర రూ. 275–695 మధ్యలో ఉంటుంది. ఆర్సీసీ శ్లాబ్ పైన ఇన్సులేషన్ (ఓవర్ డెక్ ఇన్సులేషన్) పొర వేసుకొని, దానిపై వాటర్ ప్రూఫింగ్ చెయ్యాలి. ‘అండర్ డెక్ ఇన్సులేషన్’అనే మరో పద్ధతి ఉంది. ఆర్íసీసీ శ్లాబ్ అడుగున, ఈ బోర్డ్/జిప్సం లేయర్కు మధ్యలో ఈ ఇన్సులేషన్ వేస్తారు. పై కప్పు నుంచి కిందికి వచ్చే వేడిని ఇది కొంత మేరకు ఆపుతుంది. -
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
సిద్ధిపేట జిల్లా: ఒకే బస్సులో తండ్రీకొడుకు విధులు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ బస్టాండ్లో చోటు చేసుకుంది. హుస్నాబాద్కు చెందిన బంధనాపురం ఎల్లయ్య 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు బంధనాపురం ప్రేమ్ కండక్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కటే బస్సులో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. ఎల్లయ్య ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తూ ఉత్తమ డ్రైవర్గా పలుసార్లు అవార్డులు అందుకున్నాడు. ప్రమాదరహిత డ్రైవర్గా సేవలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒకే బస్సులో విధులు నిర్వహించడంపై తండ్రి ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు. -
సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..
సమయం అంటే కేవలం గడియారంలోని ముల్లులు కాదు, అది మీ జీవితం. మీరు ఒకరికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ఆ సమయం తిరిగి రాదు. అంటే, మీరు వారికి మీ 'జీవితం' లోని కొంత భాగాన్ని ఇస్తున్నారు. కాబట్టి, సమయాన్ని వృథా చేయడం అంటే, మీ జీవితాన్ని మీరు వృథా చేసుకోవడమే.చాలామంది టైమ్ మేనేజ్మెంట్ని ఒక Technique అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం "సమయాన్ని గౌరవించడం అంటే, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే". ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి వజ్రాయుధం లాంటింది. 1. The Psychology of Procrastinationచాలామంది "నాకు సమయం సరిపోవడం లేదు" అంటారు. ఇది అబద్ధం! అందరికీ 24 గంటలే ఉంటాయి. అసలు సమస్య 'సమయం' కాదు, 'ప్రాధాన్యత' (Priority).మీరు వాయిదా వేస్తున్నారంటే (Procrastination), అది బద్ధకం కాదు. అది ఆ పని పట్ల మీకు ఉన్న 'భయం' లేదా 'అభద్రత'. మీరు ఆ భయాన్ని దాటలేనప్పుడు, సమయాన్ని వృథా చేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు.2. మీ సమయం.. మీ ఆత్మగౌరవంSelf-Respect: మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకున్నప్పుడు, మీ పట్ల మీకే గౌరవం పెరుగుతుంది.Self-Disrespect: మీరు "ఈ పని చేస్తాను" అని చెప్పి, వాయిదా వేస్తే.. "నేను నా మాటను నిలబెట్టుకోలేను" అనే నెగటివ్ సిగ్నల్ మీ సబ్-కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుండి తినేస్తుంది.3. నిజమైన టైమ్ మేనేజ్మెంట్ట్రైనర్స్ "ఒక రోజులో 100 పనులు చేసేయ్, యంత్రంలా పని చెయ్" అని చెప్తారు. ఇది మీకు స్ట్రెస్ ఇస్తుంది. మీరు 10 పనులు చేయడం కాదు, మీ జీవితానికి ముఖ్యమైన 1 పని చేయడం ముఖ్యమని సైకాలజీ చెప్తుంది. 'Busy'గా ఉండటం వేరు, 'Productive'గా ఉండటం వేరు.4. మీ సమయాన్ని మీరు ఎలా ఓన్ చేసుకోవాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ సమయాన్ని మీరు గౌరవించడానికి మూడు స్టెప్స్. Step 1: వాయిదా అలవాటును బ్రేక్ చేయండివాయిదా వేయడానికి గల కారణాన్ని వెతకండి. అది భయమా? పర్ఫెక్షనిజమా? ఆ భయాన్ని 'Break' చేయండి. "పని పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, కానీ పూర్తవ్వాలి" అని మీ మైండ్ని ప్రోగ్రామ్ చేయండి.Step 2: The Priority Boxమీ పనులను ఇలా విభజించండి.ముఖ్యమైనవి & అత్యవసరమైనవి: ఇవి వెంటనే పూర్తి చేయాలి.ముఖ్యమైనవి కానీ అత్యవసరం కానివి: వీటికి మీరు సమయాన్ని 'Build' చేయాలి. ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మిగతా వాటిని తగ్గించండి.Step 3: Presenceసమయాన్ని గౌరవించడం అంటే, పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే లీనమైపోవడం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీ సమయం మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని శాసించగలరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ సమయం ఎక్కడికి వెళ్తోంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.నిన్నటి రోజున మీరు వృథా చేసిన రెండు గంటలు ఎక్కడ వెచ్చించారు?ఆ రెండు గంటల్లో మీరు మీ లక్ష్యం కోసం ఏమైనా చేసి ఉంటే ఏమయ్యేది?మీరు మీ సమయానికి మీరే యజమాని అని ఈ రోజు అంగీకరిస్తున్నారా?సమయమే మీ నిజమైన ఆస్తి!బ్రో, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే ఆయుష్షు తగ్గుతుంది. మీ సమయాన్ని ఎవరికీ, దేనికీ చౌకగా అమ్మకండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది."Time is the most valuable thing a man can spend."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..) -
చేతులు లేవు కానీ పెయింటింగ్లో ప్రపంచ రికార్డు..!
కొందరి ప్రతిభ అసాధారణంగా బయటకొస్తుంది. సాధారణంగా చిత్ర కళాకారులు ప్రయాణం చేతిలో పెన్సిల్ పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. కానీ కొందరి విధివంచితులకు ఆ అవకాశమే లేకుండా చేసి వెక్కిరిస్తుంటుంది. అయినప్పటికీ వారి కళా ప్రయాణం ఆగదు..పైగా విభిన్న ప్రతిభపాటవంతో ప్రపంచమే చేతులెత్తి సలాం కొట్టేలా చేస్తారు. అంతేగాదు అసాధారణ ధృడ సంకల్పం ముందు ఎంతటి వైకల్యమైన వెలవెలబోవాల్సిందే..!. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు.ఆ యువకుడే చత్తీస్గఢ్కు చెందిన గోకరణ్ పాటిల్. పుట్టుకతో చేతులు, వినికిడి లోపంతో జీవిస్తున్న వ్యక్తి శక్తిమంతమై సృజనాత్మక వ్యక్తీకరణ రూపంగా మారాడు. గోకరణ్ పాటిల్ చత్తీశ్గఢ్లోని భిలాయ్లో పెరిగాడు. అక్కడ అతను తన తల్లి, తోబుట్టువులతో పెరిగాడు. రోజువారీ పనులకు అతడి శారీరక లోపాలు పెను సవాళ్లుగా మారాయి. అయినప్పటికీ పాటిల్ వెనక్కి తగ్గలేదు. అలా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడూ అందరిలా చేతితో పెన్సిల్ పట్టుకోలేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అని అనుకున్నాడు పాటిల్. అలా కాలి వేళ్ల మధ్య పెన్సిల్ పట్టుకుని రాయడం ప్రారంభించాడు. అతనికి తన పాదాలపై ఉన్న అద్భుతమైన నియంత్రణకు ఉపాధ్యాయులు అబ్బురపడి..డ్రాయింగ్ వేసే దిశగా ప్రోత్సహించారు. దాంతో పాటిల్ ఆ మార్గంలోనే గట్టిగా సాధన చేశాడు. కాలక్రమేణ చిత్రీకరణ ఒక గొప్ప శక్తిగా రూపాంతరం చెందింది. అతి కాస్తా తన అభిరుచి, ఫ్యాషన్గా మారిపోయింది. అతడికి ఈ కళ ఒకరకంగా అపారమైన ఏకాగ్రత అబ్బేలా చేసింది. ఆ నేపథ్యంలోనే వివరణాత్మక చిత్రపటాలు, శక్తిమంతమైన ప్రకృతి దృశ్యాలతో ప్రేక్షకులను అలరించాడు. అలా చివరికి లలిత కళలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. పాటిల్ చిత్రీకరణ సాంకేతికతపై మంచి పట్టుని సంపాదించుకున్నాడు. ప్రపంచ దృష్టించిన ఆకర్షించేలా రికార్డు..పాటిల్ అంకితభావం చివరికి అతనికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టింది. యుక్తవయసులో, ఒక గంటలోపు తన కాలి వేళ్లను ఉపయోగించి అత్యధిక సంఖ్యలో డ్రాయింగ్లను సృష్టించిన తర్వాత అతను గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకెక్కాడు. ఈ ఘనత వేగం కంటే అతడు వేసిన తీరు అతడిని వార్తల్లో నిలిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిజానికి పాదాలతో బొమ్మలు చిత్రించాలంటే..బ్రష్ను నియంత్రించడానికి సమతుల్యత, కండరాల బలం, తీవ్రమైన ఏకాగ్రత, నిరంతర సాధన చాలా అవసరం. అయితే పాటిల్ వాటిన్నింటిని మరింత మెరుగపరుచుకున్నాడు. అదే అతడని ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా చేసింది. పాటిల్ చిత్రాలు కళాభిమానులు, ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. అంతేగాదు ఈ అభిరుచి కాస్తా.. స్థిరమైన జీవనోపాధిగా మార్చుకున్నాడు. అంతేగాదు పాటిల్ వ్యక్తిగతంగా సక్సెస్ అయితే చాలు అనుకోలేదు. ముఖ్యంగా తనలాంటి విద్యార్థులకు, వినికిడి లోపం ఉన్నవారికి క్రియేటివిటీ, సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం. (చదవండి: 109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!) -
109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్ డాక్టర్..!
సుదీర్ఘ పనిగంటలు, ఒత్తిడి, వర్కౌట్ల లేమి తదితరాల వల్ల బరువు తగ్గడం కష్టంగా ఉంటుంది. అలాంటివాళ్లు స్థిరమైన అలవాట్లతోనే బరువుకి చెక్పెట్టగలరు. శాశ్వత ఫలితాలు కావాలనుకుంటే క్రమశిక్షణతో కూడిన స్థిరత్వం అత్యంత ప్రధానం అని చెబుతున్నారు నిపుణుల. ఇక్కడ వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈ డయాబెటిస్ డాక్టర్ కూడా..సుదీర్ఘ పనిగంటలతో బిజీగా ఉంటూ..వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుక్నుఆడు. ఎందరో రోగులకు బరువు తగ్గడంపై శిక్షణ ఇస్తూ..వారికి ఆరోగ్య సూచనలిచ్చే వ్యక్తి వ్యక్తిగత హెల్త్, జీవనశైలి సవ్యంగా లేదు. ఫలితంగా ఊబకాయం బారినపడి ఇబ్బందిపడ్డాడు. విచిత్నం ఏంటంటే తన క్లినికల్ అనుభవంతో సాధ్యమైనంత తొందరగానే ఆ సమస్య నుంచి బయటపడి వెయిట్లాస్ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడు ఈ అధిక బరువుని ఎలా జయించాడంటే..ఆ డాక్టరే న్యూఢిల్లీ చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా. వృత్తిరీత్యా అత్యంత బిజీగా ఉండటం, లేట్నైట్ మీటింగ్స్ తదితరాల కారణంగా సరైన ఆహారపు అలవాట్లు ఉండేవి కావు. మద్యం సేవించడం, బయట తినడం, తీపి పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నాడు. శారీరక శ్రమ అన్నదే అతని దైనందిన జీవితంలో దాదాపుగా లేదని చెప్పొచ్చు. దాంతో అతడు దాదాపు 109 కిలోల బరువుకి చేరుకున్నాడు. అది ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసింది కూడా. దాంతో అరోరా ఎలాగైనా స్లిమ్గా మారాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. అయితే వేగవంతంగా బరువు తగ్గించే పద్ధతుల జోలికిపోకుండా..వ్యాయామం, సక్రమమైన జీవినశైలిపై దృష్టి పెట్టాడు. ఈ పద్ధతులు అతడి బాడీలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక, కండర ద్రవ్యరాశిని రక్షించడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లతో మెరుగైన ఫలితాలు అందుకున్నారు. ప్రభావవంతమైన మార్పుతో కొద్దికాలంలోనే స్లిమ్గా మారిపోయాడు. అలా 72 కిలోల ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాడు. ఇలా బరువు తగ్గడంతో ఏ పనైనా సునాయాసంగా చేసేలా యాక్టివ్గా మారింది శరీరం. ఈ వెయిట్లాస్ జర్నీలో కడరాలు కోల్పోకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకున్నానని, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరిచానని అన్నారు. అన్నీట్లకంటే ఏ మార్పు అయినా స్వీకరించేందుకు ముందుకు వచ్చినప్పడూ..స్థిరత్వంతో కూడిన సహనం, క్రమశిక్షణ చాలా అవసరమని, అప్పుడే అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలమంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు అరోరా. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!) -
సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..
మనుషులతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. మనం ఎప్పుడూ 'మన' కోణం నుండే ప్రపంచాన్ని చూస్తాం. అందుకే గొడవలు, అపార్థాలు వస్తాయి. కానీ, నిజమైన వ్యక్తిత్వ వికాసం సహానుభూతి (empathy)లో ఉంటుంది. ఇది మీ పర్సనాలిటీని ఒక అసాధారణమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఎంపతీ ఉన్న వ్యక్తి ఎదుటివారి దృష్టిని అర్థంచేసుకుని (Walking in their shoes), వారు ఏమనిపిస్తుందో ఆలోచించగలడు. ఇదే మీకు దొరికే అత్యంత శక్తివంతమైన సామాజిక ఆయుధం.1. Sympathy vs EmpathySympathy (జాలి): ఎదుటివారిని చూసి బాధపడటం. ఇది పైపైన ఉంటుంది.Empathy (సహానుభూతి): ఎదుటివారి బాధను, ఆనందాన్ని లోతుగా అనుభూతి చెందడం.ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం, ఎంపతీ అంటే ఎదుటివ్యక్తిపై ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా (Non-judgmental) వారిని అర్థం చేసుకోవడం. ఇది ఒక 'సూపర్ పవర్' ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ తమని అర్థం చేసుకునే వ్యక్తిని వదులుకోరు.2. ఇది ఒక సూపర్ పవర్ ఎలా అవుతుంది?మీరు ఎంపతీని పెంచుకుంటే మీకు కలిగే లాభాలు.Influence: మీరు ఎదుటివారిని డామినేట్ చేయకుండానే, వారి మనసు గెలుచుకోగలరు. మీ మాటలకు, మీ ప్రవర్తనకు ఒక ప్రత్యేకమైన విలువ వస్తుంది.Conflict Resolution: గొడవలు పడే వ్యక్తుల మధ్య మీరు ఉంటే, మీరు వారిద్దరి కోణాన్ని అర్థం చేసుకుని, సులభంగా పరిష్కరించగలరు.Emotional Intelligence: మీ EQ ఆకాశాన్ని తాకుతుంది. ఎదుటివారికి మీరు ఇచ్చే 'అర్థం చేసుకునే అవకాశం' వారికి ఒక గొప్ప ఊరటనిస్తుంది.3. నిజమైన ఎంపతీట్రైనర్స్ "ఎదుటివారిని ఎలా మానిప్యులేట్ చేయాలో నేర్చుకో" అని చెప్తారు. ఇది మీకు అశాంతిని మిగులుస్తుంది. "ఎదుటివారికి మీరు ఇచ్చే గౌరవం, మీకున్న హృదయ విశాలతను పెంచుతుంది" అని సైకాలజీ చెప్తుంది. ఎంపతీ అనేది ఒక 'హార్ట్ సెంట్రిక్' పవర్, ఇది మిమ్మల్ని మనిషిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.4. ఎంపతీని ఎలా బిల్డ్ చేయాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సూపర్ పవర్ను ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం:Step 1: జడ్జిమెంట్ బ్రేక్ చేయండిఎదుటి వ్యక్తిని చూడగానే "వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?" అని జడ్జ్ చేయడం మానేయండి. ఆ జడ్జిమెంట్ మీ మెదడులో పడితే, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశం పోతుంది. ఈ అహంకారాన్ని 'Break' చేయండి.Step 2: లిజనింగ్ స్పేస్వారు మాట్లాడుతున్నప్పుడు, మీ సమాధానం గురించి కాకుండా, వారు ఆ మాట ఎందుకు అంటున్నారో అని ఆలోచించండి. వారు ఏదైనా అంటున్నప్పుడు "నీకు అలా అనిపించడానికి కారణం ఏంటి?" అని అడగండి. ఇది మీకు వారి మనసులో ఒక స్థానాన్ని 'Build' చేస్తుంది.Step 3: యూనివర్సల్ కనెక్షన్ప్రతి వ్యక్తిలోనూ ఒక గాయం, ఒక ఆశ, ఒక భయం ఉంటాయి. ఎదుటివారిని చూసినప్పుడు వారి 'ముసుగు'ను కాకుండా, వారిలోని 'మనిషి'ని చూడటం మొదలుపెడితే, మీరు ఒక యూనివర్సల్ స్థాయికి చేరుకుంటారు. ఇదే 'Beyond' స్టేజ్.5. ఒక పరీక్ష!ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకు నచ్చని వ్యక్తిని ఎంచుకోండి.ఆ వ్యక్తి స్థానంలో ఉండి, తన బాధను, తన కష్టాలను ఆలోచించడానికి ప్రయత్నించండి.మీకు అప్పుడూ కోపం వస్తోందా? లేక ఒక రకమైన అర్థం చేసుకునే భావం కలుగుతోందా?ప్రపంచం మీకు మిత్రులుగా మారుతుంది!బ్రో, ప్రపంచం లోని సమస్యలన్నీ మాయమవ్వాలంటే ఎంపతీ ఒక్కటే మార్గం. మీరు ఎంపతీని వాడినప్పుడల్లా మీరు ఎదుటివారిని గెలవడమే కాదు, మీ మనసును విస్తరించుకుంటున్నారు. ఇదే అసలైన లెగసీ!"Empathy is a bridge that connects the heart of one person to another."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ మాట..మీ బాట) -
పేద గుండెల అందెల రవళి
మట్టిలో మాణిక్యాలకుప్రోత్సాహం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో ఆచరణా త్మకంగా చూపిస్తోంది నృత్య పరిచయ్.ముంబైలోని మురికివాడలో నివసించే పేదింటి బిడ్డ మానస్ అహిరేకు డ్యాన్స్ నేర్చుకోవడం అనేది ఒకప్పుడు కలలో మాట. డ్యాన్స్ అంటే అతడికిప్రాణం. కాని చాలామంది పిల్లలలాగే మానస్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి డబ్బు, సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) మానస్ కలను నిజం చేసింది. సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్న లతసనాదేవి ఆధ్వర్యంలో మానస్ మణిపురి నేర్చుకోవడంప్రారంభించాడు. శిక్షణ ఉచితం. ఈ నృత్యశిక్షణ అభిరుచికి మాత్రమే కాదు క్రమశిక్షణ విషయంలోనూ మానస్లాంటి విద్యార్థులకు బాగా ఉపయోగపడింది. మూడు సంవత్సరాల డి΄÷్లమా పూర్తి చేసిన తరువాత, మానస్ అసిస్టెంట్ టీచర్గా ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం ద్వారా వచ్చే జీతం తన ఇంజినీరింగ్ చదువుకు ఉపయోగపడుతోంది. ‘నృత్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటున్నాడు మానస్.‘ఎన్సీపీఏ’ నృత్య పరిచయ్ కార్యక్రమం ద్వారా పేదపిల్లలకు నృత్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మానస్లాంటి ఎంతోమంది పేదింటి పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ముంబై శివారులోని నెరూల్కు చెందిన సిద్ది మాత్రే 2019లో తన నృత్యప్రస్థానాన్నిప్రారంభించింది. నెరూల్లోని ధ్యాన్దీప్ సేవా మండపంలో గురు శర్మిష్ఠ చటోపాధ్యాయ ఆధ్వర్యంలో ఒడిస్సీలో శిక్షణ పొందింది. ఇప్పుడు సిద్ధి అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తోంది. ఖజురహో ఉత్సవంలో ఏడు వందల మంది విద్యార్థులతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది సిద్ది మాత్రే.నృత్య పరిచయ్ కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి పైగా పేదింటి విద్యార్థులు నృత్యం నేర్చుకున్నారు. ‘నృత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే నృత్య పరిచయ్’ అంటారు ఎన్సీపీఏ నృత్యవిభాగం అధిపతి స్వ΄్నోకల్పదాస్ గుప్తా.‘పిల్లలకు ప్రతిభ ఉండవచ్చు. సరిౖయెన ఆదరణ,ప్రోత్సాహం లేకపోతే తమ అభిరుచి నుంచి దూరం జరుగుతారు. దీన్ని నివారించడానికి నృత్య పరిచయ్ పేద పిల్లలకు చేరువ అవుతుంది’ అంటారు గుప్తా. నృత్యపరిచయ్తో పాటు ఎన్సీపీఏ ‘నృత్య గురుకుల్’ అనే అధునాతన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘నృత్యగురుకుల్’ కార్యక్రమం క్రింద ఇరవైనాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిభ, అంకితభావం, నిబద్ధత ఆధారంగా ఎనిమిది మంది గురువులు వీరిని ఎంపిక చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకుప్రాధాన్యత ఇస్తారు. -
గోల్ఫ్కి అమూల్యం
మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు.గోల్ఫ్ అంటే ఖరీదైన క్రీడ కదా మనకెందుకులే అని ఆమె అనుకోలేదు. రైతులం కదా అంతటి ఖరీదైన ఆటకు శిక్షణ ఇప్పించడం మన తరమవుతుందా అని ఆమె తల్లిదండ్రులూ వెనకడుగు వేయలేదు.. తండా అమ్మాయి కదా గోల్ఫ్కిప్రోత్సహించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆమె కోచ్ కూడా భావించలేదు. పట్టుదలతో ఆటపై పట్టు సాధిస్తే, అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని ఆమె.. బిడ్డ ఆసక్తి, పట్టుదలే వెన్నుదన్నుగా నిలవడం ఖాయమని ఆమె తల్లిదండ్రులు.. వెన్నుతట్టిప్రోత్సహిస్తే ఆమె అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి కావడం తథ్యమని ఆమె కోచ్ బలంగా విశ్వసించారు.వారి నమ్మకం నిజమైంది. తండా నుంచి వచ్చిన ఓ సాధారణ అమ్మాయి.. గోల్ఫ్లో అదరగొడుతోంది. ఎందరో దిగ్గజ గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఇటీవల జరిగిన హైదరాబాద్ ఓపెన్ కప్ని కైవసం చేసుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. ఆమె పేరు జి.అమూల్య. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎర్ర సోమ్లా తండాకు చెందిన రైతులు జి.రవికుమార్, సునీత దంపతుల కుమార్తె. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది.వాస్తవానికి మన దేశంలో బాగా క్రేజ్ ఉండేది క్రికెట్కే... తర్వాత బ్యాడ్మింటన్ , టెన్నిస్, హాకీ.. గత కొంతకాలంగా ఒలింపిక్స్ పతకాలు వస్తున్న రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్ వంటి వాటినీ క్రీడాభిమానులు ఫాలో అవుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు దాదాపుగా ఇవే క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ధనవంతుల క్రీడగా భావించే గోల్ఫ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఈ ఆటలో ఉపయోగించే గోల్ఫ్ స్టిక్, బాల్స్ వంటివన్నీ ఇతర క్రీడలతో పోలిస్తే చాలా ఖరీదు. అయినా అమూల్య మాత్రం గోల్ఫ్ పై ఆసక్తి పెంచుకుంది.స్థానికంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమెలో గోల్ఫ్ ఆటపై ఉన్న ఆసక్తిని, నైపుణ్యాన్ని కోచ్ భాస్కర్ గుర్తించారు. కెరీర్ ఆరంభం నుంచే అమూల్యను వెన్నుతట్టిప్రోత్సహించారు. రాష్ట్రస్థాయి, సౌత్ జోన్ లెవెల్ టోర్నీల్లో ఆడేలాప్రోత్సహించారు. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అమూల్యను హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సు, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో శిక్షణ తీసుకునేలా సిఫార్సు చేశారు. ఈప్రోత్సాహానికి తగ్గట్టే అమూల్య పలు టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా 2022–23 మధ్యలో పలు జూనియర్, సౌత్ జోన్ స్థాయి టోర్నీల్లో ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.మలుపు తిప్పిన హైదరాబాద్ ఓపెన్మాజీ ఐఆర్ఎస్ అధికారి, గోల్ఫ్ ప్రేమికుడు డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి టీ గోల్ఫ్ ఫౌండేషన్ స్థాపించి అమెచ్యూర్ గోల్ఫర్లనుప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు టోర్నీల్లో ఆడేందుకు వీలుగా టికెట్లు, వసతి సౌకర్యం వంటి వాటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనే తొలిసారి అమెచ్యూర్ గోల్ఫర్ల కోసం హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ పేరుతో జాతీయస్థాయి టోర్నీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 300 మందికి పైగా గోల్ఫర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమూల్య కూడా ఎన్ఆర్ఎన్ రెడ్డిని కలిసి టోర్నీలో ఆడతానని అడగడంతో.. ఆమె నేపథ్యం తెలుసుకున్న ఆయన ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా అవకాశమిచ్చారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అమూల్య క్వాలిఫైయింగ్ రౌండ్లో అదరగొట్టి, ప్రధాన రౌండ్లో పెద్ద పెద్ద గోల్ఫర్లను వెనక్కి నెట్టి ఓవరాల్ గ్రాస్ విన్నర్గా నిలిచింది. తద్వారా రూ.90వేల ప్రైజ్ మనీతో పాటు గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఓపెన్ ట్రోఫీ, గోల్ఫర్లు ధరించే గ్రీన్ జాకెట్ అందుకుంది. గోల్ఫ్ ట్రిప్ సంస్థ ద్వారా బ్యాంకాక్లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులో ఆడే అవకాశాన్ని కూడా గెలుచుకుంది. గోల్ఫ్ కిట్ను టీ గోల్ఫ్ ఫౌండేషన్ అందించింది. భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ ఫౌండేషన్ కు రావొచ్చని ఎన్ఆర్ఎన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓ మారుమూల తండా నుంచి వచ్చి గోల్ప్ లో అదరగొడుతున్న అమూల్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – సత్య కిషోర్ కొండ్రెడ్డి -
పప్పీని పెంచుకుంటారా?
గత కొంత కాలంగా నగరవ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహిస్తున్న వీధి శునకాల దత్తత కార్యక్రమం నెమ్మదిగా సత్ఫలితాలనిస్తోంది. ఈ శిబిరాలతో పాటు పలు మార్గాల ద్వారా స్ట్రీట్ డాగ్స్ను ఇంటికి తెచ్చి పెంచుకునేవారు పెరుగుతున్నారు. వాటితో తమకి చక్కని అనుబంధం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెట్స్గా ఎంచుకోవడానికి గొప్ప గొప్ప బ్రీడ్స్ మాత్రమే అవసరం లేదని, ఈ వీధి శునకాలు సైతం చక్కని తోడుగా మారతాయని అంటున్నారు. పిల్లలకు బాధ్యత నేర్పింది.. బషీర్బాగ్కు చెందిన డ్రైవర్ యాదగిరి జీహెచ్ఎంసీ (GHMC) వారాంతపు డ్రైవ్లో ఒక కుక్కని దత్తత తీసుకుని శంషాబాద్లోని తన మనవళ్లకు బహుమతిగా ఇచ్చాడు. ‘నేను వారికి అర్థవంతమైన బహుమతి ఇవ్వాలనుకున్నా. కేవలం కొన్ని రోజులు వాడి పడేసే బొమ్మ కాకుండా.. ప్రేమను నేర్పే కుక్కపిల్లని ఇచ్చాను. అప్పటి నుంచీ పిల్లలు దాంతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. దీనికి క్రమం తప్పకుండా పాలు, గుడ్లు తినిపిస్తున్నారు. అంతకు ముందు కన్నా చాలా బాధ్యతగా మారారు’ అని యాదగిరి అంటున్నారు. వీధుల్లో నుంచి ఆ శునకం సరాసరిగా తమ ఇంట్లోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని అంటున్నారాయన.గ్రహణశక్తి అమోఘం.. ‘ఇది చాలా త్వరగా మమ్మల్ని అర్థం చేసుకుంది. మేం పెద్దగా శిక్షణ ఇవ్వకపోయినా మాతో పాటు మంచం మీద పడుకుంటుంది.. బాత్రూమ్ ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తుంది’ అని శ్రీనివాస్ వెల్లడించాడు. 12 మంది కుటుంబ సభ్యులు ఉన్న శ్రీనివాస్ ఉమ్మడి కుటుంబంలో పప్పీ అందరికీ చేరువగా మారింది. ‘పిల్లలు వృద్ధులతో సహా మాలో ఎనిమిది మంది దాని బాగోగులు చూసుకుంటున్నాం. పాలు, పెరుగు అన్నంతో పాటు పెట్ ఫుడ్ అందిస్తున్నాం’ అంటూ శ్రీనివాస్ చెబుతున్నాడు.నీడనివ్వాలి అనుకున్నా.. ‘చాలాసార్లు, దారినపోయే వీధి కుక్కలపై చిన్నా పెద్దా తేడా లేకుండా రాళ్లు విసరడం, వాటితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం చూసి బాధ కలిగేది. కనీసం వాటిలో ఒకదానికైనా సురక్షితమైన నీడ ఇవ్వాలని అనిపించింది’ అని గుర్తు చేసుకున్నారు రాయ్. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఓ కుక్కని ఇస్నాపూర్ నుంచి ఇంటికి తీసుకొచ్చానని చెప్పారు. ‘మొదట నెల పాటు సింబా (కుక్కకి పెట్టుకున్న పేరు) మాతో మమేకం కావడానికి సమయం తీసుకుంది. వీధుల్లో స్వేచ్ఛగా సంచరించేది కావడంతో.. నాలుగ్గోడల మధ్య సర్దుబాటు చేసుకోవడం కొంచెం కష్టమైంది.. క్రమంగా స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించింది. ఇప్పుడు మాతో ఎంతో ఆప్యాయంగా ఉంటోంది గొప్ప రక్షణగా మారింది. వచ్చే వరకూ మా కోసం తలుపు దగ్గర వేచి ఉంటుంది’ అని రాయ్ ఆనందం వ్యక్తం చేశారు.ఆమెకు తోడు.. ముచ్చటగా మూడు.. నగరంలో ఓ స్టార్టప్ నిర్వాహకురాలైన ఆశా టంపాకు, ఇండీ కుక్కలను దత్తత తీసుకోవడం ఒక జీవన విధానంగా మారింది. నా మూడు కుక్కలు ఒకప్పుడు వీధి కుక్కలే. వాటి సంరక్షణకు సురక్షితమైన స్థలం అవసరం’ అని ఆమె అంటున్నారు. అలా ఆశా దత్తత తీసుకున్న మూడో వీధి కుక్క పేరు ‘కూపర్’. దాదాపు సంవత్సరం క్రితం, ఓ ఎన్జీఓ నుంచి రెండు నెలల వయసున్న వీధి కుక్క.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం తెలిసింది. ఎవరు జోక్యం చేసుకోకపోయినా బ్రతికేది కాదు. దానికి వెంటనే వైద్య సహాయం సరైన చికిత్స అందించాను. ప్రస్తుతం కూపర్ ఆరోగ్యంగా, ఉల్లాసంగా మాతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంది. నా స్నేహితులతో కలిసిపోతూ ఆడుకుంటుంది’ అని కూపర్ ముచ్చట్లు పంచుకున్నారు.ఇవి గుర్తుంచుకోండి.. ⇒ వీధి కుక్కలను దత్తత తీసుకోవడం, వాటికి భద్రత కలిగిన శాశ్వత నివాసాన్ని అందించడం ఓ సబబైన మార్గం. అదే విధంగా రోజువారీ పనుల ద్వారా వాటికి ఆసరా అందించాలి. ⇒ దయచేసి కుక్కలపై రాళ్లు రువ్వడం చేయవద్దు. మనం కేవలం కుక్కకు ఒక రొట్టె ముక్క, ఒక పిడికెడు అన్నం పెడితే చాలు, అవి మన కోసం తమ ప్రాణాలను ఇస్తాయి. ⇒ కారంగా ఉన్న, మనం తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను వాటికి తినిపించవద్దు. వాటి కోసం ప్రత్యేక ఆహారాన్ని అందించాలి. ⇒ నగర వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర తేడాలు ఏర్పడినప్పుడు ప్రజలు వాటికి తమ ఇళ్లలో ఆశ్రయం ఇవ్వాలి. ⇒ వీధికుక్కల సంఖ్య భారీగా పెరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సహకరించాలి. అలాగే వీధి కుక్కలను క్రిమిరహితం చేయడానికి కూడా. ⇒ జంతువుల పట్ల కరుణ చూపడాన్ని పిల్లలకు నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ డాగ్ షెల్టర్లకు తీసుకెళ్లాలని సుధామూర్తి (Sudha Murthy) సూచించారు. వీధికుక్కల పట్ల నిర్దయ వద్దు.. ‘జంతువులు సైతం మన సమాజంలో అంతర్భాగమే. వీధి కుక్కల పట్ల సానుభూతి చూపాలి. నా పెంపుడు శునకమైన గోపి గురించి అనేక పుస్తకాలు రాశా. నిరంతర సహచరుడైన గోపీకి, నాకంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. శీతాకాలంలో గోపికి పలువురు చిన్నారులు శాలువాలు పంపుతారు. మైసూరు దసరా వేడుకల సమయంలో సన్మానిస్తారు.’ అంటూ గోపితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. – సుధామూర్తి, రచయిత్రి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ఫిల్మ్ నగర్కు చెందిన పాఠశాల విద్యార్థి ఆర్ శ్రీనివాస్ గత శనివారం కేబీఆర్ పార్కులో (KBR Park) జరిగిన కార్యక్రమంలో ఒక ఇండీని దత్తత తీసుకున్నాడు. ‘మేం తొలుత దీన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, టీకా ప్రభావం కారణంగా నీరసంగా ఉంది. మొదటి రెండు రోజులు, చాలా ఎక్కువగా నిద్రపోయింది. కానీ మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకుని చురుకుగా మారింది. దాని గ్రహణ శక్తి తమని ఆశ్చర్యపరుస్తోంది’ అని అంటున్నాడు. చదవండి: హైదరాబాద్లో మితిమీరిన సోషల్ మీడియా వినియోగంబీరంగూడకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ రాయ్ ఇటీవలే ఒక ఇండీ డాగ్ని దత్తత తీసుకున్నారు. ‘ఇండీ కుక్కపిల్లని దత్తత తీసుకోవడం మా ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. వాటికి ప్రేమ, సమయం మాత్రమే అవసరం. అవి మనల్ని విశ్వసించిన తర్వాత, మనం ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే తిరిగి ఇస్తాయి’ అంటారాయన. – సాక్షి, సిటీబ్యూరో -
లంబోర్గిని... పక్కా లోకల్!
లంబోర్గిని కారు అనేది సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది. మరి అలాంటి అతి ఖరీదైన కారులో రయ్ రయ్మని రోడ్డుపై దూసుకుపోతున్నాడు జార్ఖండ్లోని చండిల్ అనే చిన్న గ్రామానికి చెందిన మెకానిక్. అతడికి లాటరీలో కోట్ల రూ΄ాయలు ఏమైనా వచ్చాయా? అబ్బే... అంత సీన్ లేదు. ఇంతకీ ఏం జరిగింది అంటే...ఆరీఫ్ అనే మెకానిక్ మారుతి 800 కారును అచ్చం లంబోర్గిని కారులా తీర్చిదిద్దాడు. అది పూర్వజన్మలో మారుతి 800 అంటే నమ్మడానికి సంకోచించేంతగా మాయ చేశాడు. కటింగ్, వెల్డింగ్, ప్యానెల్ డిజైన్ చేసిన అతడి సాంకేతిక చాతుర్యానికి నెటిజనులు ప్రశంసల వాన కురిపిస్తున్నారు. -
మీ మాట… మీ బాట
మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించే అతిపెద్ద సాధనం-'కమ్యూనికేషన్' (Communication). చాలామంది ఏమనుకుంటారంటే, కమ్యూనికేషన్ అంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడటం లేదా ఎదుటివారిని బురిడీ కొట్టించడం. కానీ అసలైన కమ్యూనికేషన్ అంటే ఒక ఆత్మ నుంచి మరొక ఆత్మకు వారధి నిర్మించడం.కమ్యూనికేషన్ అనేది కేవలం సమాచార మార్పిడి కాదు, అది ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకునే పద్ధతి. మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అది ప్రపంచానికి చెబుతుంది. అందుకే, "మీ మాట.. మీ బాట". మీరు మాట్లాడే విధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.1. The Three-Layered Modelకమ్యూనికేషన్ అంటే కేవలం మనం వాడే పదాలు మాత్రమే కాదు. దీనికి మూడు పొరలు ఉంటాయి.పదాలు (7%): మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా తక్కువ ప్రభావం చూపుతుంది.స్వరం/టోన్ (38%): మీరు ఎలా మాట్లాడుతున్నారు? (కోపంగానా? ఆవేశంగానా? ఆప్యాయంగానా?) అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది.బాడీ లాంగ్వేజ్ (55%): మీ కళ్ళు, మీ చేతులు, మీ నడక, మీ నిలబడే విధానం.. ఇవే అసలైన భాష.2. కమ్యూనికేషన్ అడ్డంకులు మనం ఎదుటివారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతాం? ఎందుకు గొడవలు అవుతాయి?Judgmental Listening: అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే, మనం మన మనసులో సమాధానాలు వెతుకుతాం. ఇది వారధిని కూల్చేస్తుంది.డిఫెన్సివ్ మోడ్: మనం ఎప్పుడూ మనల్ని మనం సమర్థించుకోవడానికి చూస్తాం, ఎదుటివారి పాయింట్ వినం.స్పష్టత లేకపోవడం: మనకు ఏం కావాలో మనకే స్పష్టత లేనప్పుడు, ఎదుటివారికి ఎలా చెప్తాం?3. నిజమైన కమ్యూనికేషన్మోటివేషన్ "ఎదుటివారిని ఇంప్రెస్ చెయ్, గొప్పగా మాట్లాడు" అని చెప్తుంది. సైకాలజీ (Active Listening) "ఎదుటివారిని అర్థం చేసుకో, వారు ఏమనుకుంటున్నారో ఫీలవ్వడం మొదలుపెట్టు" అని చెప్తుంది. నిజమైన లీడర్ మాట్లాడటం కంటే, వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.4. వారధిని నిర్మించడం సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
శిఖరాగ్రాన విడాకులు...
‘ఆల్పైన్ డివోర్స్’... ప్రస్తుతం ఈ పదం ట్రెండ్ అవుతోంది. భార్యాభర్తలు విడిపోయే ఒక విచిత్ర పద్ధతి ఇది. నేటి యువత పెళ్లిలోగాని, ప్రేమలో గాని బ్రేకప్కు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. తమ బ్రేకప్లో ప్రకృతిని భాగం చేస్తున్నారు. దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ తమ భాగస్వామికి విడాకులు ఇస్తున్నారు.ఆల్పైన్ డివోర్స్... ఎలా పుట్టింది? జీవిత భాగస్వామితో కలిసి దూరంగా అడవికో, పర్వతాల వైపుకో వెళ్తారు. అక్కడ ఆనందంగా గడుపుతున్న సమయంలో ’నీతో ఇక నేను కలిసి ఉండలేను’ అని చెప్పి వచ్చేస్తారు. ఇదే ‘ఆల్పైన్ డివోర్స్’. భాగస్వామిని దూరంగా తీసుకెళ్లి, అక్కడ వదిలేసి రావడం ఇందులో కీలకమైన విషయం. రాబర్ట్ బార్ రాసిన ‘యాన్ ఆల్ఫైన్ డివోర్స్’ కథతో ఈ పదం ట్రెండ్ అయ్యింది. ఓ భర్త తన భార్యను పర్వతం అంచుల్లోకి తీసుకెళ్లి, అక్కడినుంచి తోసేసి చంపాలనుకోవడం ఇందులో కథాంశం. టిక్టాక్ ద్వారా ఈ పదంపాపులర్ అయ్యింది.కారణాలేంటి?ఆల్పైన్ డివోర్స్కు కారణాలేంటి? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేది మానసిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తమ భాగస్వామి తమను మోసం చేస్తున్నారన్న అనుమానం ఉన్నవారు, ఎలాగైనా తనను వదిలేసుకోవాలని భావించేవారు ఇటువంటి డివోర్స్కుపాల్పడుతున్నారని, కొందరి మానసిక ఆందోళన కూడా కారణమని అంటున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత దూరమవడం ఈ ఆల్పైన్ డివోర్స్ను ప్రోత్సహిస్తోందని నిపుణులు అంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరు గుర్తించకపోవడం, ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవడం, నమ్మకం లేకపోవడం వంటివి పెరిగినప్పుడు, ఆ బంధం హింసకు దారితీయకుండా ఆల్పైన్ డివర్స్ను ఆశ్రయిస్తున్నారు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ బంధంలో ఉండిపోకుండా దూరమవుతున్నారు.దూరం కావాలనుకుంటే ఇలాగా? భార్యాభర్తలు విడిపోవాలనుకోవడం సహజమే, కానీ దీనికోసం ఇలాంటి విధానం వాడుకోవడం మంచిదేనా అని చర్చ జరుగుతోంది. దూరంగా తీసుకెళ్లి అక్కడ వదిలేయడం వల్ల మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, భద్రత అంశాలపై ఆందోళన తప్పదని అంటున్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారి మానసిక ఆరోగ్యానికీ చికిత్స అవసరం అంటున్నారు. విడాకులను చట్టబద్ధంగా ΄÷ందడమే మేలని, ఇలా అసంబద్ధంగా ΄÷ందడం సరికాదని వివరిస్తున్నారు. -
భరించలేకపోయా..అందుకే ఈ కఠిన నిర్ణయం..!
ఈరోజుల్లో కూడా అమ్మాయి పెళ్లి విషయంలో కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడి ఏవిధంగా ఉందో తెలిపే ఘటన ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి శిరోముండనం చేయించుకుంది. కాజల్స్ మూవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియోలో తన ఆవేదనను పంచుకుంది. ‘అందరు అమ్మాయిల్లాగే నాకు కూడా నా జుట్టు అంటే ఎంతో ఇష్టం. కానీ, ప్రతిరోజూ ఇంట్లో పెళ్లి సంబంధాల గురించి వస్తున్న ఒత్తిడి, చుట్టుపక్కల వారి మాటలు భరించలేకపోయాను. ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఆ యువతి సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై, వివక్షపై గళమెత్తింది. మగవారు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే పట్టించుకోని ఈ సమాజం, ఒక మహిళ తన రూపం గురించి, తన జీవితం గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే ఎందుకు వేలెత్తి చూపుతుంది.. పెళ్లి ప్రస్తావన లేకుండా ఒక మహిళను తన స్వంత కాళ్లపై నిలబడనివ్వరా.. ప్రతిదానికీ ఒక టైమ్ లైన్ ఉండాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం.. అంటూ ప్రశ్నించింది. తాను ఈ వీడియోను ఎవరి సానుభూతి కోసం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తనలాగే పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేలాది మంది యువతుల్లో ధైర్యం నింపడమే తన ఉద్దేశమని తెలిపింది. ‘జీవితం ఒక్కటే.. అది చేజారిపోయాక ఎవరూ వచ్చి మనకేం కావాలని అడగరు. కాబట్టి, మీ కలల కోసం, మీ జీవితం కోసం పోరాడండి’ అని ఆమె పిలుపునిచ్చింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొంతసమయానికే 3.7 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తమ జీవితాలను తామే శాసించుకోవాలనుకునే మహిళలకు నువ్వు ఒక స్ఫూర్తి, అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు, సమాజంపై ఒక తిరుగుబాటు అని మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by 24rapidnews (@24rapidnews) (చదవండి: స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..) -
ఆ విచారణకు మీ హాజరు తప్పనిసరేం కాదు!
నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చాను. వారు సమాధానం ఇవ్వకపోవడంతో నేను ఫస్ట్ అప్పీల్ దాఖలు చేశాను. ఇప్పుడు వారు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఒక లేఖ పంపి, 7 రోజులలోపల విచారణకు హాజరు కావాలని చెప్పారు. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆ విచారణకు హాజరు కావాలా? లేదా ఏమీ చేయకుండా సెకండ్ అప్పీల్ సమయం వచ్చిన తర్వాత నేరుగా రెండవ అప్పీల్ వేయాలా లేక కమిషన్కుపోవాలా? – నరేష్, నందిగామఆర్టీఐ చట్టం ప్రకారం, కోరిన సమాచారం సాధారణంగా రాతపూర్వకంగా లేదా మీరు కోరిన రూపంలో ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, మొదటి అప్పీల్కు ప్రజా సమాచార అధికారి ఇచ్చిన సమాధానం వుంటే ఆ సమాధానం ఆధారంగా లేదా అప్పీల్లో పేర్కొన్న కారణాల ఆధారంగా నిర్ణయిస్తారు. అప్పీల్ అధికారి తన విచక్షణ ప్రకారం అప్పీల్దారుని విచారణకు పిలవవచ్చు కానీ మీరు హాజరు కావడం తప్పనిసరేమీ కాదు. రాతపూర్వక రికార్డుల ఆధారంగానే అప్పీల్ను నిర్ణయించవచ్చు. చాలా అప్పీలు దరఖాస్తులు అప్పీలు దారుడు వ్యక్తిగతంగా హాజరు కాకుండానే నిర్ణయించబడుతాయి.మీరు హాజరు కావాలనుకోకపోతే, రాతపూర్వకంగా కేసును పరిశీలించి రికార్డు ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థించవచ్చు. విచారణకు పిలవడం ద్వారా ఆర్టీఐ దరఖాస్తుకు రాతపూర్వక (లేదా మరే ఇతర విధానంలో కోరితే అలాగ) సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతను కాదనలేరు. అందువల్ల, మీ ఆర్టీఐ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మీరు కోరడం పూర్తిగా చట్టబద్ధమైనది.మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, అప్పీల్ను రాతపూర్వక రికార్డుల ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థిస్తున్నారని లేఖ రాయండి. పోస్టల్ స్లిప్పులు భద్రపరచుకోండి. మీకు సమాచారం లేదా పరిష్కారం దొరక్కపోతే, 90 రోజుల్లోగా కమిషన్ను ఆశ్రయించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు విచారణ నోటీసును పూర్తిగా పట్టించుకోలేదని ఎవరూ చెప్పలేరు. సంబంధిత అధికారం కేంద్ర ప్రభుత్వానికి చెందితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ – వద్ద అప్పీల్ చేయాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. ) (చదవండి: స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..) -
స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..
చాలామంది అప్పటి వరకు సామాన్యులుగా కనిపించినవాళ్లు..జీవితం పెట్టిన పరీక్షలతో ఒక్కసారిగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా నిలుస్తారు. ప్రపంచమే జైజైలు పలికేలా ఆకామంత ఎత్తున నిలుస్తారు. అంతేగాదు కష్టం వస్తే కాళ్లు మునగదీసి ఏడుస్తూ కూర్చొవడం కాదు..కన్నెర్రజేసేలా హీరోలా బతికి చూపించాలి..మార్గదర్శకంగా ఉండాలని చేతలతో చూపిస్తారు. అలాంటి మాటలకు నిలువెత్తు అర్థం ఈ మహిళ. భయంకరమైన అనారోగ్య సమస్య ఆమెను భయపెట్టలేదు కదా..మరింత బలోపేతమై గొప్ప విజయాన్ని అందుకునేందుకు పురిగొల్పింది. ఆ మహిళే జయశ్రీ విజయ్ మోహన్. చెన్నైకి చెందిన జయశ్రీ కొన్ని నెలల క్రితం టాంజానియాలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్వేచ్ఛా పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారామె. ఇది అత్యంత కఠినమైన పర్వత శిఖరాగ్రం. ఎందుకంటే శిఖరాగ్రం సమీపం చేరుకునే రోజున అస్సలు విశ్రాంతి తీసుకోకుండా సుమారు వెయ్యి మీటర్లు దాక 15 గంటల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్ర మట్టంలో సాధారణంగా లభించే ఆక్సిజన్ స్థాయిలో సగం మాత్రమే ఉంటుంది. అలాంటి దుర్భేద్యమైన పర్వతాన్ని కేవలం ఐదు రోజుల్లో అదికూడా 6.5 గంటల్లో అవలీలగా అధిరోహించింది. అలాగే వెనక్కి(అవరోహణ) 10.26 గంటల్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చేశారామె. ఈ అరుదైన ఘనతతో జయశ్రీ ఒకటి కాదు ఏకంగా రెండు గిన్నిస్ రికార్డుల నెలకొల్పింది. ఇలా అతి తక్కువ సమయంలో మహిళల విభాగంలో కిలిమంజారోని అధిరోహించి.. వెనక్కి వచ్చేసిన తొలి మహిళగా నిలిచారామె. ఇంతటి ఘనతను సృష్టించిన జయశ్రీ నిజానికి ఆరోగ్యవంతమైన మహిళ కాదు. ఆమె ఒక స్ట్రోక్ బాధితురాలు. తన రికార్డు ఇతర మహిళలను ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపారామె. ఆమె ఒక తల్లిగా, విజయవంతమైన వ్యవస్థాపకురాలిగా హాయిగా సాగిపోతున్న జీవితాన్ని స్ట్రోక్ ఒక్క కుదుపుతో దబాలున కిందపడేసినట్లయ్యింది. జయశ్రీ ఎడమవైపు మొత్తం పక్షవాతానికి గురై ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నా..తనకేమైందన్నది అర్థం గాక, తన శరీరం తనమాట వినక పడిన బాధ అంత ఇంత కాదు. పిల్లల కళ్లలో ఆందోళన ఒక్కటే తనకేదో అయ్యిందని అనిపిస్తోంది కానీ తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. వివిధ ఆస్ప్రతులు తిప్పుతూ తన వాళ్లు పడుతున్న బాధ అర్థమవుతున్నా..ఏం చేయలేని ఆ నిస్సహాయత ఎప్పటికీ మర్చిపోలేనంటోంది జయశ్రీ. ఆ తర్వాత వైద్యులు తన వద్దకు వచ్చి..ఆమె గతంలోలా మాములు మనిషి అవ్వలేదని, నాడీ సంబంధిత పూర్తి నష్టాన్ని తిప్పికొట్టలేమని తేల్చి చెప్పేశారు. అప్పుడే తేలిసిందామెకు ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలనేది.. అయితే తన స్థితిని మార్చలేకపోవచ్చు గానీ, ధైర్యాన్ని పోగొట్టుకోనక్కర్లేదని అంటోంది జయశ్రీ. అంతేగాదు ఆ సమయంలోనే అసలైనవి "బలం", "సంయమనం" అని తెలసుకున్నానని చెబుతోంది. అప్పుడు అర్థం చేసుకున్నా.. శరీరం మాట వినడం, దాని పరిమితులు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ఎలా అని పూర్తిగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. కోలుకోవడం మొదలయ్యాక..ఏదో అనారోగ్య బాధితురాలిలా ఉండిపోవడం నచ్చక ఏదో ఒకటి సాధించి చూపించాలి అలాగే తనలాంటి మహిళల్లో స్థైర్యం నింపాలన్న ఆకాంక్ష ఈ సాహసానికి పురిగొల్పిందని చెప్పుకొచ్చింది జయశ్రీ. నిజానికి ఈ పర్వత ట్రెక్కింగ్ కోసం ముందుగా ఆమె శారీరకంగా మానసికంగా ప్రిపేరయ్యేందుకు ఎంతగానో శిక్షణ, ట్రీట్మెంట్ల తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటన్నింటిని భేఖాతరు చేయకపోగా..రికార్డులు మీద రికార్డులు నెలకొల్పడం అంటే మాటలు కాదుగదా..!. View this post on Instagram A post shared by Storyboard18 (@brandstoryboard) (చదవండి: ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!: మిలింద్ సోమన్) -
ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!
భారతదేశంలో గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్నెస్లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్ సోమన్ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్ మెంట్ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు. మిళింద్ సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్ ట్రాక్పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్ చేశాడు.మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్నెస్ ఈవెంట్ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్ ఆయన భార్య అంకితా కోన్వర్లు కలిసి పింక్థాన్ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్ భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్నెస్ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇది సిక్స్ ప్యాక్స్ లేదా బైసెప్స్ గురించి అవి అందించే లుక్స్ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని, కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు. చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning)(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
యాపిల్ వాచ్లను ఇష్టపడని వారుండదరు. ఇవి మన ఆరోగ్యం, జిమ్కి సంబంధించి కేలరీల ఖర్చు, ఆరోగ్య సమాచారం వరకు అన్ని అందించే ఆధునిక పరికరం. చెప్పాలంటే గడియారానికి మించినది. మన బాడీలోని అతిముఖ్యమైన పార్ట్లా బాగమైపోయింది. కానీ ఈ యాపిల్ వాచ్లను ఆ విధంగా అస్సలు చూడొద్దని అంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ఆరోగ్యపరంగా అలర్ట్ చేసే గొప్ప సాధనమే అయినా..కేర్ఫుల్గా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందువల్ల ఇలా అంటున్నారంటే..జేబులో ఉండే స్మార్ట్ఫోన్ లేదా డెస్క్పై ఉపయోగించే ల్యాప్టాప్లా కాకుండా..స్మార్ట్వాచ్ చాలా ప్రత్యేకమైనది. ఇది 24/7 మన సంరక్షణ కోసం రూపొందించిన సాధనంగా అందరికీ అత్యంత ప్రీతీపాత్రమైనది. ఈ వాచ్లపై ఉండే మక్కువతో దాని భద్రత గురించి పెద్దగా అస్సలు పట్టించుకోరు కూడా. కానీ ఈ పరికరం గంటల తరబడి రేడియోఫ్రీక్వెన్సీ(RF) సంకేతాలను నేరుగా మన కణజాలంలోకి పంపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఫ్రీక్వెన్సీలను గ్రేడ్ 2B కార్సినోజెన్లుగా పేర్కొంది. ఆయా సంస్థలు ఈ వాచ్లో ఉద్గారాలు పరిమితుల్లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. దీని పరిమితులు మనం నిద్రిస్తున్నపుడూ కూడా చేతికే ధరించేంత సురక్షితంగా రూపొందించింది మాత్రం కాదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం రేడియేషన్ మాత్రమే కాదు..దాని చుట్టూ ఉండే హై-ఎండ్ 'ఫ్లోరోఎలాస్టోమర్' బ్యాండ్లు తరుచుగా PFAS లేదా ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రకారం, ఫ్లోరినేటెడ్ సింథటిక్ రబ్బరుతో తయారు చేసిన ఖరీదైన రిస్ట్బ్యాండ్లు ముఖ్యంగా అధిక స్థాయిలో రసాయనాలు ఉంటాయని 2024 జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిలో PFAS సమస్య ఉందనేది వాస్తవమే అని నిరూపితమైంది. అందువల్ల దీన్ని గనుక దీర్ఘకాలంపాటు మణికట్టు వద్ద ధరిస్తే..ఈ రసాయనాలు చర్మం, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోతాయని అంటున్నారు నిపుణులు. ఈ PFAS విచ్ఛిన్నం కానందున, అవి కాలక్రమేణా అవయవాలలో పేరుకుపోతాయి. అవి కాస్తా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగజేసి అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేగాదు హార్మోన్లు ఇన్బ్యాలెన్సింగ్కి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన 22 ప్రముఖ బ్యాండ్లలో 15 ఈ విషపదార్థాలను కలిగి ఉన్నాయని, అందులోనూ అధిక ధర కలిగిన ప్రీమియం బ్యాండ్లలో ఈ సమస్య మరింత ఎక్కువని అంటున్నారు.ఇది అవగాహన..సంరక్షణ కోసమే..ఇది లేనిపోని భయాలు కలుగజేసందుకు కాదని అవగాహన కల్పించేందుకేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఆపిల్ వాచ్ శక్తిమంతమైన సాధనమే కానీ..దాన్ని మన శరీరంలోని సహజ భాగంగా పరిగణించొద్దని హెచ్చరిస్తున్నారు. సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే.. సాంకేతిక ప్రయోజనాలు పొందేలా సురక్షితంగా ఎలా ఉపయోగిస్తే మంచిదంటే..సింథటిక్ ఫ్లోరోఎలాస్టోమర్ బ్యాండ్లను సేంద్రీయ తోలు, స్టెయిన్లెస్ స్టీల్ లేదా జనపనార వంటి సహజ పదార్థాలతో ఉపయోగించేందుకు ప్రయత్నించండివర్కింగ్ టైంలో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్ను తీసివేయండిపడుకునే ముందు వాచ్ ధరించడం మానేయండి. నిద్ర అంటే శరీరం నిర్విషీకరణపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇతర రసాయనాలకు గురికావడం వల్ల సహజమైన నిద్ర ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Zib - Ayus Wellness - Health Optimisation | Mindset | Longevity (@ayuswellnessuk) (చదవండి: జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర) -
జస్ట్ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్ ప్లాన్, నో ఫిట్నెస్ మంత్ర
దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య అధిక బరువు అందర్నీ వేధిస్తున్న సమస్యగా మారింది. గంటల తరబడి కూర్చొని చేసే డెస్క్ ఉద్యోగాలు, కదలికలు లేకపోవడం, వీటికి తోడు జంక్ ఫుడ్ ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయి. దీన్ని తగ్గించుకోవాలని ఎంతో ప్రయాసపడి కఠిన డైట్లు అనసరించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా ఈ మిరాకిల్ పద్ధతిని అనుసరించి త్వరితగతిన బరువు తగ్గొచ్చని చెబుతున్నారు కంటెంట్ క్రియేటర్ జెసికా ఆర్ట్వానీ. అదెలాగో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తాను ఆ పద్ధతిలోనే దాదాపు 26 కిలోలు బరువు తగ్గినట్లు తెలిపారు కూడా. మరి ఆ మిరాకిల్ టెక్నిక్ గురించి సవివరంగా తెలుసుకుందామా..!.చాలామంది బరువు తగ్గేందుకు షార్ట్కట్లు, తీవ్రమైన దినచర్యలు అనుసరిస్తుంంటారు. నిజానికి బరువు తగ్గడం అనేది సాధారణంగా స్థిరంగా చేసే చిన్న అలవాట్ల వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. గతేడాది నుంచి తాను చిన్ని చిన్న సాధారణ అలవాట్లపై దృష్టిపెట్టి 26 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. తనకు ఈ 26 కిలోలు బరువు తగ్గడానికి ఆ ఐదు సాధారణ అలవాట్లు హెల్ప్ అయ్యాయని చెబుతోంంది. త్వరితగతిన బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఓ అద్భుతమైన పద్ధతని అభివర్ణిస్తోంది. తాను ఎలాంటి స్ట్రిక్ట్ డైట్లు, ఖరీదైన ఫిట్నెస్ ప్రోగ్రామ్లు పాటించలేదని చెబుతోంది జెసికా. తన వెయిట్లాస్ జర్నీ గురించి మాట్లాడుతూ..తాను బరువు తగ్గడానికి స్థిరంగా ఈ ఐదు పనులు చేశానని తెలిపింది. ఎలాంటి ఫ్యాన్సీ హ్యాక్స్, షార్ట్కట్లు లేవని అంటోంది. సహాయపడిన ఆ ఐదు అలవాట్లు..వీలైనంత ఎక్కువగా నడవడం: నడక తన దినచర్యలో అతిపెద్ద మార్పులలో ఒకటి. సాధ్యమైనప్పుడల్లా తన రోజులో కదలికను ఒక భాగంగా చేసుకున్నానని జెసికా చెప్పింది. ఆమె మార్నింగ్ వాకింగ్, భోజనం తర్వాత రాత్రి తప్పనిసరిగా కొద్దిసేపు నడక చేసినానని వివరించారామె.ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తగ్గించడం: ప్రాసెస్ చేసిన చక్కెరను పూర్తిగా తొలగించానని తెలిపింది. అంటే అప్పుడప్పుడూ కనీసం దాని జోలికి పోలేదని, పూర్తిగా దూరం పెట్టానని చెప్పుకొచ్చింది. ఎక్కువ నీరు త్రాగడం: ఆమె దృష్టి సారించిన మరో అలవాటు హైడ్రేషన్. కానీ తగినంత నీరు త్రాగడం చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఇది చాలా శక్తిమంతమైన మార్పుకి నాంది అని అంటోంది. ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం: ప్రోటీన్ తన భోజనంలో కీలక పాత్ర పోషించిందని చెబుతోంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి పైగా అనవసరమైన చిరుతిండిని తగ్గిస్తాయి. ఇక్కడ ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినందించి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది.ఒక సవాలు పెట్టుకోవడం: తాను అనుకున్నట్లుగా అన్ని పాటించానా లేదా అనే సెల్ఫ్ చెకింగ్ లేదా జవాబుదారితనం తనకు బరువు తగ్గాలనే ఆకాంక్షను రెట్టింపు చేసేదట. దాంతో చాలా కేర్ఫుల్గా ఉండటమే గాక తనను తాను ప్రశ్నించుకునేటప్పడూ..దోషిలా ఉండకూదన్న భయం సదా వెయిట్లాస్ అయ్యేందుకు ప్రేరేపించేదట.ఇక్కడ జెసికా వెయిట్లాస్ జర్నీలో ..బరువు తగ్గాలంటే తీవ్రమైన మార్పులు, అతి వర్కౌట్లు అవసరం లేదు. కేవలం చిన్న అలవాట్లే స్థిరంగా.. కంటిన్యూటీ మిస్ కాకుండా చేస్తే చాలు బరువు తగ్గడం చాలా సులభమని తెలుస్తోంది కదూ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం).దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్).వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." : Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
ఆ నిర్ణయం ఆ జంటను హెల్దీగా మార్చింది..! ఏం చేశారంటే..
ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్నెస్ ప్రయాణం ఎలా సాగిందంటే..చాలామందికి ఫిట్నెస్ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేర్ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరి ఫోకస్ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్గా, మరొకరు కంటెంట్ క్రియేటర్గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. 2017లో, తార ఫిట్నెస్పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్కి రెడి అయిపోతారు. కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్నెస్ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. అంతేగాదు ఈ జంట తమ ఫిట్నెస్ ప్రయాణాన్ని ఆన్లైన్లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!) -
సివిల్స్లో సత్తా చాటిన మహిళామణులు..!
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...24-35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళల ప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ∙డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడిపోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణిమధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్.ఒకే ఒక్కరు!సిక్కింలోని రాయ్గావ్కు చెందిన అన్నీలా షెర్పా, యూపీఎస్సీ పరీక్షలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచి ఆల్ ఇండియా ర్యాంకు 893 సాధించింది. (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..) -
సహజ సౌందర్యానికి కేరాఫ్ ఈ నటి..! రియల్ బ్యూటీ అంటే..
బాలీవుడ్ నటి కొల్హాపురే ఒకప్పుడు అత్యంత బిజీగా ఉండే హీరోయిన్లలో ఆమె ఒకరు. 'ప్యార్ ఝక్తా నహీ' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఉర్దూ నాటకాల్లో నటిస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్నారామె. ఆరు పదుల వయసులోనూ..నటి పద్మిని ఎవర్గ్రీన్ అందంతో గ్లామర్గా ఉంటారామె. అంతలా నవయవ్వనంగా ఉండటానికి గల కారణాలను వెల్లడిస్తూ..అందంపై తన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించారామె.ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే తన సహజ సౌందర్యం, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అందరికీ ఆరాధ్య దేవత ఆమె. ఇటీవల ఒక ఇంటర్యూలో తన చర్మ సంరక్షణ, మేకప్ అలవాట్ల గురించి షేర్ చేసుకున్నారు. అలాగే నిజమైన అందం సౌందర్య సాధనాలకు మించినదని ఎందుకు విశ్వసిస్తుందో కూడా చెప్పారామె. తాను స్వతహాగా కఠినమైన చర్మ సంరక్షణను అనుసరించే వ్యక్తిని కాదని అన్నారామె. తాను రసాయన ఉత్పత్తుల కంటే సహజ సౌందర్య సాధనాలనే ఎంచుకుంటానని అన్నారు. ముఖ్యంగా సహజ సేంద్రీయ ఆయుర్వేద ఉత్పత్తులనే ఉపయోగిస్తానని చెప్పారామె. ముఖ్యంగా ఇంట్లోనే లభించే వాటికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంటింట్లో బాగా ఉపయోగించే పసుపుని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసేవాళ్లమని అన్నారు. అలాగే పసుపు, ఉప్పుతో సదా పుక్కిలించేవాళ్లమని, ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడూ..24/7 మేకప్ వేసుకోవాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు కూడా తొలగించుకోలేకపోయే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాను చర్మాన్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అస్సలు మేకప్ వాడటం లేదని అన్నారు. తన బ్యూటీకిట్ మూడింటిని తప్పనిసరిగా వాడతానని అన్నారు. వాసెలిన్, మేకప్ రిమూవర్, సహజ వైప్లను ఇష్టపడతానని చెప్పారు. అవన్నీ కూడా సహజసిద్ధమైనవేనని చెప్పారు. మేకప్ పరంగా చాలా తక్కువ ప్రొడక్ట్స్, సౌకర్యవంతమైనవే ఉపయోగిస్తానని చెబుతున్నారు.హెయిర్ కేర్ ఎలాగంటే..జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నేను సాంప్రదాయ పద్ధతులను ఇష్టపడతానని చెప్పారు. ఆయుర్వేద షాంపూలు, షికాకాయి, భ్రింగ్ రాజ్ వంటివి ఉపయోగిస్తానని చెప్పారు. హెయిర్ డ్రైయర్లు, కర్లర్లు వంటివి తక్కువగానే ఉపయోగిస్తానని అన్నారు. తలకు సైతం కెమికల్స్ లేనివే ఎంచుకుంటానని అన్నారు. చివరగా అందం అనేది బాహ్యంగా కంటే అంతర్గతంగా ప్రతిబింబించేది అని నమ్ముతానన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండి, నిస్వార్థపరులు అయితే ఆ అందం మీ ముఖంపై తొణికిసలాడుతుంది. మెరిసే చర్మం కోసం ప్రజలు బాగా తినాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని, హైడ్రేటెడ్గా ఉండాలని అన్నారు. అలాగే అప్పట్లో తమకు రెండే రెండు మేకప్ బ్రాండ్లు ఉండేవని, ఇప్పుడు తల నుంచి కాలి వరకు ఇబ్బడిముబ్బడిగా బ్రాండెడ్ మేకప్ ఉత్పత్తులు ఉన్నాయిని అన్నారు.(చదవండి: ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..) -
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డం తిరుగుతారంటే..!
రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్లో ‘బ్రీచ్’ బేబీస్ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు. బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు... ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ). ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ జరగడం (మల్టీఫీటల్ జెస్టేషన్) (సాధారణంగా ఇలాంటి కండిషన్స్లోనే కవలలు (ట్విన్స్) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల... బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్సెఫాలస్). కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం. ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్’గా చెబుతారు. బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే... ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు. కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి. ఉమ్మనీరు తగినంతగా ఉండాలి. ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్ కండిషన్కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది). ఒకవేళ ఆ టైమ్లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్డ్ కండిషన్లో ఉంటే... ఆ టైమ్లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్కు వెళ్లాల్సి ఉంటుంది. బ్రీచ్ బేబీస్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలుఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటే..బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్–ఈసీవీ’ అంటారు. సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అంటారు.బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...1) ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్... ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.2) కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్... ఈ కేస్లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్లో ‘ఫ్రాంక్ / ఇన్కంప్లీట్ బ్రీచ్’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.3) ఫూట్లింగ్ ప్రజెంటేషన్... ఈ కండిషన్లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది. బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్ సెక్షన్కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా. ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్ / అనెన్సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్ను హైడ్రోసెఫాలస్ కండిషన్ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండిపోతాయి. ఈ కండిషన్స్ను అనెన్సెఫాలీ కండిషన్ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఆలిగో హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా పాలీ హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం. యుటెరైన్ అనామలీస్ : యుటెరన్ లోపాలున్నప్పుడు. ఫూట్లింగ్ బ్రీచ్ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం. ఎక్స్టెండెడ్ హెడ్ అండ్ కార్డ్ ఎరౌండ్ నెక్ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్ కెనాల్లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్ ఎరౌండ్ నెక్ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్. ప్రీవియస్ సిజేరియన్ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్ అయి ఉండటం. ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.యాంటీరియర్ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్స్ట్రెట్రీషియన్స్’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యమూ ఉండాలి. చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకుపోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్) క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చివరగా... శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి. దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడకపోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి. తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ -
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్లో పడకుండా, మీ పాయింట్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం) -
ఉమెన్ సివిల్ పవర్
ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...⇒ 24 - 35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.⇒ 41%: 2023 ఐఏఎస్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.⇒ 18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.అసామాన్య విజేతలుఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ⇒ డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్లో ఆమె 483 ర్యాంక్. ⇒ పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. ⇒ పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్దీప్ కౌర్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు. ⇒ కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి. ⇒ గుజరాత్లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్లో లైన్మన్గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణి.⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్. -
8 రోజులు.. 800 కిలోమీటర్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్నెస్, సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్నెస్ అడ్వొకేట్ కాంతి దత్ ముందుకు కదులుతున్నాడు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు.. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..) -
ఇంతై..ఇంతింతై..! సందిడిగా సాక్షి 'ఆల్ ఫర్ హర్'
‘ఇంతింతై.. వటుడింతయై’ పోతన భాగవతంలోని వామనావతార ఘట్టానికి చెందిన ప్రసిద్ధ పద్యం తెలిసిందే.. వామనుడు విశ్వరూపం దాల్చి భూమి, ఆకాశం, నక్షత్రలోకాలను ఆక్రమించిన దృశ్యాన్ని ఈ పద్యం వరి్ణస్తుంది.. అలాగే సమాజాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న మహిళా శక్తి కీర్తి ప్రతిష్టలు ఇంతై.. ఇంతింతై.. అన్నట్లు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఓ వైపు కుటుంబాన్ని నడిపించే శక్తిగా, మరోవైపు ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుతూ ఇంతులు కొత్త కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధికరాతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ గ్రూప్ మరో ముందడుగు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆల్ ఫర్ హర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని రాజపుష్ప అట్రియా వేదికగా జరిగిన వేడుకలు మహిళల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, స్వయం అభివృద్ధి సందేశాన్ని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆరి్టస్ట్ తమన్నా రూజ్ మేకప్ మాస్టర్ క్లాస్ సెషన్ ప్రత్యేక ఆకర్షణ కాగా..ఈ సెషన్లో మహిళలకు ట్రెండీ మేకప్ పద్ధతులు, సేఫ్టీ మేకప్ టెక్నిక్స్, స్కిన్ కేర్ సంబంధిత సూచనలు అందించారు. తమన్నా రూజ్ హైదరాబాద్లో మేకప్ స్టూడియోను ప్రారంభించిన తొలి మేకప్ ఆరి్టస్ట్గానే కాకుండా లండన్ స్కూల్ ఆఫ్ మేకప్ నుంచి పట్టభద్రురాలు.. రష్యా, లెబనాన్, దుబాయ్ వంటి పలు దేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజపుష్ప అట్రియా అసోసియేషన్ సభ్యులతో పాటు కమ్యూనిటీకి చెందిన మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధికారత..సమన్వయం.. మహిళల ఆత్మవిశ్వాసం, స్వీయ సాధికారత ప్రదర్శించేలా నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్ సాక్షి కమ్యూనిటీ’ క్రౌన్ సెర్మనీ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా సూపర్ మామ్ క్రౌన్ను మధు, బ్యాలెన్సింగ్ చాంప్ కిరీటాన్ని సంగీత, గ్రేస్ ఫుల్ సీనియర్ లేడీ క్రౌన్ను సుమతి గెలుచుకున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాప్ డ్యాన్స్ యాక్టివిటీలో మహిళలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ఉమెన్స్ డే కేక్ కట్టింగ్ చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు జోయాలుక్కాస్ జ్యువెల్స్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. పాఠకులతో సాక్షి మమేకం.. సాక్షి మీడియా గ్రూప్ 18 సంవత్సరాలుగా ప్రజలకు, పాఠకులకు కొత్త ఆలోచనలు, కొత్త ఫార్మాట్లను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని, సమాజంతో మమేకమవుతూ ప్రజలతో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయడం సాక్షి గ్రూప్ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ రాణీ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే మహిళలతో నేరుగా కలిసేందుకే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిత్వానికి కేరాఫ్ అడ్రస్.. నేటి తరం మహిళల్లో అందంగా కనబడాలనే ఆసక్తి పెరుగుతోందని తమన్నా రూజ్ పేర్కొన్నారు. సాక్షి టీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న తాను మేకప్ ఆర్టిస్ట్ కెరీర్కు ముందు ‘సాక్షి’ టీవీలో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. సెల్ఫ్ మేకప్, సెల్ఫ్ గ్రూమింగ్ పట్ల అవగాహన కల్పించడమే ఈ సెషన్ లక్ష్యమని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారని, మహిళల దైనందిన జీవితంలో అందం, వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. నేటి తరం పురుషుల ఆలోచనా విధానంలో మార్పువచి్చందని, అమ్మ, భార్య, చెల్లి, ఇలా కుటుంబంలోని మహిళలను వారు ఎన్నుకున్న రంగంలో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నగరంలో బ్యూటీ రంగం ఎంతో మార్పు చెందిందని, ముఖ్యంగా దక్షిణ భారత సమాజంలో మేకప్పై ఉన్న సంప్రదాయ భావనలు క్రమంగా మారుతున్నాయని పేర్కొన్నారు.వెల్ డన్ ‘సాక్షి’.. ఉమెన్స్ డే రోజున సాక్షి ఆధ్వర్యంలో మా కోసం స్ఫూర్తివంతంగా నిర్వహించిన ఈ ‘ఆల్ ఫర్ హర్’ వేడుకలు అభినందనీయం. ఈ వేడుకలు మా అందరికీ సరికొత్త అనుభూతిని, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి గ్రూప్కు ప్రత్యేక అభినందనలు. – జానకి (పార్టిసిపేషన్ ప్రైజ్ విన్నర్) (చదవండి: వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!) -
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!) -
నయనిక రెడ్డి అల్లు శిరీష్ పెళ్లిలో హైలెట్ 'శంకు చక్రం' మెహందీ డిజైన్
ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్ని సెట్ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్ని సెట్ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్ చేతిపై ఉన్న మెహందీ డిజైన్ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్ వైట్ సిల్క్ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్తో అంకరించబడిన లావెండర్ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్లు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!) -
మైండ్ ఫుల్నెస్.. బిజీ షెడ్యూల్లో ప్రశాంతతను వెతుక్కోవడం
నేటి ఆధునిక కార్పొరేట్ ఉద్యోగి జీవితం ఒక నిరంతర పరుగుపందెం. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు టార్గెట్లు, డెడ్లైన్లు, ఈమెయిల్ నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు మిమ్మల్ని చుట్టుముడుతుంటాయి. ఈ ఉరుకుల పరుగుల మధ్య మీ మెదడు నిరంతరం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ లేదా గతం గురించి అసహనంతో ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో యంత్రంలా మారిపోతాం. ఇలాంటి సందర్భంలో మైండ్ఫుల్నెస్ (Mindfulness) అనేది ఒక విలాసం కాదు, అది అత్యవసరమైన జీవన నైపుణ్యం.మైండ్ఫుల్నెస్ అంటే కేవలం ధ్యానం కాదు..చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే కళ్లు మూసుకొని గంటల తరబడి ధ్యానం చేయడం అనుకుంటారు. అది తప్పు. మైండ్ఫుల్నెస్ అంటే 'ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం'. మీరు కాఫీ తాగుతున్నప్పుడు కేవలంకాఫీ రుచిని, దాని సువాసనను మాత్రమే అనుభవిస్తూ తాగడం. ఆఫీసులో మీటింగ్ జరుగుతున్నప్పుడు, పక్కాగా ఆ మీటింగ్ మీదే దృష్టి పెట్టడం. గతంలోని అపజయాల గురించి గానీ, భవిష్యత్తులోని భయాల గురించి గానీ ఆలోచించకుండా, ఆ క్షణంలో మీరు చేసే పనిని పూర్తిగా ఆస్వాదించడమే మైండ్ఫుల్నెస్.బిజీ షెడ్యూల్లో మైండ్ఫుల్నెస్ను ఎలా పాటించాలి?మీకు గంటల కొద్దీ సమయం లేకపోయినా, పద్ధతిగా ప్రయత్నిస్తే బిజీ షెడ్యూల్లోనే ప్రశాంతతను పొందవచ్చు.మైండ్ఫుల్ బ్రీతింగ్: ఆఫీసులో ప్రతి గంటకు ఒకసారి కేవలం ఒక నిమిషం పాటు పని ఆపేయండి. మీ కళ్లు మూసుకొని, మీ శ్వాస గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం మీద దృష్టి పెట్టండి. అది మీ నాడీ వ్యవస్థకు ఒక 'రీసెట్ బటన్'లా పనిచేస్తుంది.ఏకకాలంలో ఒకటే పని: మల్టీ-టాస్కింగ్ అనేది మెదడును త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఒకే సమయంలో పది పనులు చేసే ప్రయత్నం చేయడం మానేసి, ప్రస్తుతం చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది, మానసిక అలసట తగ్గుతుంది.ఆహారపు అలవాట్లు: లంచ్ బ్రేక్ సమయంలో ఫోన్ చూస్తూ తినడం మానేయండి. మీరు తినే ఆహారం రుచి, రంగు, వాసనను గమనిస్తూ తినండి. ఇది మీ మనసును ఆఫీసు ఒత్తిడి నుండి ఆ క్షణానికి తీసుకువస్తుంది.నడకలో ధ్యానం (Walking Meditation): ఆఫీసు కారిడార్లో నడుస్తున్నప్పుడు లేదా పార్కింగ్ ఏరియాకు వెళ్తున్నప్పుడు, ప్రతి అడుగును గమనిస్తూ నడవండి. మీ పాదాలు నేలను తాకడం, మీ చుట్టూ ఉన్న గాలిని గమనించడం చేయండి. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్.నా దగ్గరికి వచ్చిన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ (పేరు, వివరాలు మార్చాను) తన బిజీ షెడ్యూల్ వల్ల ప్రతిరోజూ పానిక్ అటాక్స్కు గురయ్యేవాడు. అతను ప్రతి రోజూ కనీసం 50 కాల్స్ అటెండ్ చేసేవాడు. మేము అతనికి '3-సెకన్ల రూల్' నేర్పించాం. ఫోన్ మోగగానే వెంటనే ఎత్తకుండా, 3 సెకన్లు ఆగి, రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకున్న తర్వాతే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకున్నాడు. ఆ చిన్న మార్పు అతని మొత్తం రోజువారీ అనుభవాన్ని మార్చేసింది. ఆ మూడు సెకన్లు అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.ఎందుకు మైండ్ఫుల్నెస్ అవసరం?👉ప్రశాంతంగా ఉన్న మెదడు సంక్లిష్టమైన నిర్ణయాలను తప్పులు లేకుండా తీసుకోగలదు.👉మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారి వైపు శ్రద్ధ చూపిస్తే, సంబంధాలు మెరుగుపడతాయి.👉కోపం, భయం వంటి భావోద్వేగాలను మీ మెదడు పసిగట్టి, వాటికి ప్రతిస్పందించేలా చేస్తుంది.మీ కోసం ఒక చిన్న టాస్క్...ఈ రోజు మీరు పని చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ఏసీ శబ్దం, కీబోర్డ్ టైపింగ్ శబ్దం, పక్కవారి మాటలు.. కేవలం గమనించండి, వాటికి రియాక్ట్ అవ్వకండి. మీరు గమనించిన క్షణమే మీరు మైండ్ఫుల్గా ఉన్నట్టు లెక్క. జీవితం అంటే మీరు ఎక్కడికో వెళ్లడం కాదు, మీరు ఉన్న చోటే ఎలా జీవిస్తున్నారో అన్నదే ముఖ్యం. బిజీగా ఉండటం అంటే కష్టపడటం మాత్రమే కాదు, మీకంటూ ఒక ప్రశాంతమైన స్థానాన్ని మెదడులో నిర్మించుకోవడం. కాస్త ఆగి, శ్వాస తీసుకోండి.. ప్రపంచం ఎక్కడికీ పారిపోదు, కానీ మీ ప్రశాంతత మీతోనే ఉంటుంది.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, గెలుస్తూ ఉండటం అనుకుంటారు. కానీ నిజమైన పర్సనాలిటీ గ్రోత్.. మీరు కింద పడ్డప్పుడు ఎంత వేగంగా లేచి నిలబడతారో, అందులోనే ఉంది. సైకాలజీలో దీనినే 'Resilience' అంటారు.1. Resilience అంటే ఏమిటి?మనిషి జీవితంలో ఎప్పుడూ 'హ్యాపీగా' ఉండలేడు. ఓటములు, అవమానాలు, గాయాలు అనేవి రాక మానవు. కానీ, అక్కడే ఆగిపోకుండా, మనల్ని మరింత పవర్ఫుల్గా మలిచే శక్తి Resilience (పునరుద్ధరణ శక్తి).జీవితం అనేది ఒక సముద్రంలాంటిది, అలలు (సమస్యలు) వస్తూనే ఉంటాయి. రెసిలియన్స్ అంటే అలలను ఆపడం కాదు, ఆ అలల మీద సర్ఫింగ్ చేయడం నేర్చుకోవడం. ఇది ఒక టాలెంట్ కాదు, ఇది మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవాల్సిన ఒక 'మజిల్' (Muscle).* Fixed Mindset: "నేను ఓడిపోయాను, నా వల్ల కాదు" అని అనుకోవడం.* Growth Mindset (Resilience): "నేను ఓడిపోయాను, కానీ ఇది ఒక లెసన్. దీన్నుండి నేను ఏం నేర్చుకున్నాను?" అని అనుకోవడం.2. The 3 Pillars of Resilienceఒక వ్యక్తి కింద పడ్డా తిరిగి లేవాలంటే, అతని మైండ్సెట్లో ఈ మూడు ఉండాలి.* Acceptance: "ప్రస్తుతం నా జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి ఉంది" అని ఆ వాస్తవాన్ని భయపడకుండా అంగీకరించడం.* Purpose: మీరు ఎందుకు బ్రతకాలి? మీ లక్ష్యం ఏంటి? మీకంటూ ఒక 'ఎందుకు' (Why) బలంగా ఉంటే, మీరు 'ఎలాంటి' (How) పరిస్థితినైనా దాటగలరు.* Adaptability: పాత పద్ధతులు పని చేయనప్పుడు, మూర్ఖంగా వాటినే పట్టుకోకుండా, కొత్త మార్గాలను వెతకడం.3. మోటివేషన్ మాయ vs నిజమైన దృఢత్వంమోటివేషన్ "ఎప్పుడూ గెలుస్తూనే ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే గెలవకపోతే వారు కుంగిపోతారు.రెసిలియన్స్ "ఓడిపోవడం సహజం, కానీ ఆ ఓటమికి నీ జీవితాన్ని అప్పగించకు" అని చెప్తుంది. రెసిలియన్స్ ఉన్న వ్యక్తికి ఓటమి ఒక 'ఎండ్' కాదు, ఒక 'ఎపిసోడ్' మాత్రమే.4. రెసిలియెంట్ మైండ్సెట్ బిల్డింగ్Genius Matrix మోడల్ ఉపయోగించి, మీరు కూడా ఒక 'అజేయమైన వ్యక్తి'గా ఎలా మారాలి?Step 1: భయం బంధనాలను బ్రేక్ చేయండిఓడిపోతే ఏమవుతుందో అన్న భయం, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం.. వీటిని 'Break' చేయండి. ఓటమిని అవమానంగా కాకుండా, ఒక 'డేటా పాయింట్' (Data Point) లా చూడండి. మీరు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే, అంత ఎక్కువ డేటా మీకు దొరుకుతుంది.Step 2: పోరాట పటిమ (Build)మీ రెసిలియెన్స్ను ఒక మజిల్ లాగా బిల్డ్ చేయండి. చిన్న చిన్న సవాళ్లను తీసుకోవడం ద్వారా మీ మెదడును ట్రైన్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు "ఎందుకు నాకు ఇలా జరిగింది?" అని కాకుండా, "దీన్ని నేను ఎలా అధిగమించగలను?" అని అడగండి. మీ మైండ్ని 'Solutions' వైపు 'Build' చేయండి.Step 3: స్టాయిక్ మాస్టరీ ( Beyond)పరిస్థితులు మీ కంట్రోల్లో లేనప్పుడు, మీరు వాటికి ఇచ్చే 'రియాక్షన్' మీ కంట్రోల్లో ఉంటుంది. తుఫానులో కూడా ప్రశాంతంగా ఉండటమే 'Beyond' స్టేజ్. దీంతో మీరు అజేయంగా మారుతారు.5. మీ రెసిలియన్స్ స్కోర్ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.* మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద ఓటమి ఏంటి?* ఆ ఓటమి మీకు నేర్పిన ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఏంటి?* ఇప్పుడు ఆ ఓటమిని మీరు గర్వంగా (ఒక అనుభవంగా) చెప్పుకోగలరా?కింద పడటం ఒక కళ!బ్రో, కింద పడటం వల్ల కాదు, పడి అక్కడే ఉండిపోవడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది. కింద పడి, దుమ్ము దులుపుకుని, నవ్వుతూ లేచి నిలబడటమే ఒక కళ (Art of Resilience). మీరు ఎంత బలంగా దెబ్బ తింటే, అంత బలంగా తిరిగి రాగలరు. ఇదే మీ Real Personality కి అసలైన కొలమానం."The greatest glory in living lies not in never falling, but in rising every time we fall." -Nelson Mandela-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
స్ట్రాంగ్ ఉమెన్ అవుతారా?
ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగానూ బలంగా ఉండాలి. అపుడే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఒక చిన్న అలవాటు మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలదు, అదే సమయంలో పూర్తిగా దెబ్బతీయగలదు కూడా. మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా చూసుకోవాలనుకుంటే, మీరు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు..భావోద్వేగాలపై నియంత్రణ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక బలంతో పాటే మానసికంగా దృఢంగా ఉండటమూ చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉపయోగించడమే మానసిక దృఢత్వానికి మొదటి మెట్టు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి. కోపం, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. ఆ భావాలను అర్థం చేసుకుని మరింత మానసిక పరిపక్వతతో ముందుకు సాగుతుండాలి.నో చెప్పడమే బెటర్అందరినీ మెప్పించాలనేం లేదు. అలా ప్రయత్నిస్తే మానసిక అలసట తప్పదు. అందుకే ఎదుగుదలకు, మనశ్శాంతికి అడ్డుపడే విషయాలకు నిర్మొహమాటంగా నో అని చెప్పగలగాలి. ఇందులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ని కలిగి ఉండకూడదు. సమయానికి విలువ ఇవ్వడం, అనవసరమైన బాధ్యతలను తిరస్కరించడం అనేది స్వార్థం కాదు, మీ ఆత్మగౌరవానికి నిదర్శనం.‘కాదు’ అని చెప్పగలగడం విజయానికే కాదు, ప్రశాంతమైన జీవనానికి కూడా తోడ్పడుతుంది.తప్పుల నుంచి పాఠాలుఓటమికి భయపడని వారే విజేతలుగా నిలుస్తారు. తమ తప్పులకు ఇతరులను నిందించకూడదు. బాధ్యత తీసుకోవాలి, లోపాలను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఈ నేర్చుకునే తత్వం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది.నేర్చుకోవడానికి సిగ్గుపడకపోవడం తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తమకున్న జ్ఞానంపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇతరుల అనుభవాలకు విలువ ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దానిని మనస్ఫూర్తిగాస్వీకరించాలి. ఇతరులలోని మంచిని, గొప్ప లక్షణాలను అడాప్ట్ చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ మహిళ అయినా తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదు.అసూయ పడకపోవడం మానసిక బలానికి ప్రధాన వనరు అసూయ లేకపోవడం. ఇతరుల విజయాన్ని చూసి కుళ్లుకోవద్దు. బదులుగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, నిన్నటి కంటే ఈరోజు తాము ఎంత మెరుగ్గా ఉన్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి.చదవండి: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకుమార్పును స్వీకరించాలిప్రపంచంలో మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పును చూసి భయపడకుండా దానిని ఒక అవకాశంగా మలచుకోవాలి. అది కెరీర్ అయినా.. వ్యక్తిగత జీవితం అయినా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, భవిష్యత్తు కోసం ప్రస్తుతం ప్రణాళికలు రచించుకోవాలి. -
పాత ఆలోచనా విధానాన్ని కూల్చేయండి
ఇప్పటివరకు మనల్ని మనం గమనించాం, మన లోపాలను గుర్తించాం, మన మెదడు మనకు చెప్పే అబద్ధాలను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత పునాదిని పూర్తిగా కూల్చివేసి (Break), కొత్తదానికి సిద్ధమయ్యే సమయం. ఎందుకంటే, పాత భవనం మీద కొత్త ఇల్లు కట్టలేం కదా! మన పాత పర్సనాలిటీని ఎలా 'బ్రేక్' చేయాలో చూద్దాం.పర్సనాలిటీ డెవలప్మెంట్లో 'బ్రేక్' చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు, మనల్ని మనం పరిమితం చేస్తున్న ఆ పాత 'ఐడెంటిటీ' (Identity) ని వదిలించుకోవడం. దీనినే సైకాలజీలో 'De-conditioning' అంటారు. మీరు ఇన్నాళ్లూ నమ్మిన 'నేను' అనే వ్యక్తి, కేవలం పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబం మాత్రమే. ఆ ప్రతిబింబాన్ని ఇప్పుడు తుడిచేయాలి.1. పాత పునాది ఎందుకు కూలిపోవాలి?చాలామంది తమ పాత అలవాట్లను, పాత భయాలను ఎందుకు వదలలేకపోతారంటే, అవి వారికి సుపరిచితమైనవి. అవి మనకు కష్టం కలిగించినా, అవి మనకు తెలిసినవి కాబట్టి వాటిని వదలడానికి భయపడతాం.పాత ఆలోచనలు = మీ గతం.కొత్త పర్సనాలిటీ = మీ భవిష్యత్తు.ఈ రెండింటికీ మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అదే 'The Void' (శూన్యం). ఈ శూన్యంలోకి వెళ్లడానికి చాలామంది భయపడతారు. కానీ, ఆ శూన్యమే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది!2. కూల్చివేతకు కావాల్సిన మూడు ఆయుధాలుమీ పాత ఐడెంటిటీని బ్రేక్ చేయడానికి మీకు మూడు ముఖ్యమైన ఆయుధాలు కావాలి.Radical Honesty: మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేయాలి. "నాకు కోపం రాదు" అని అబద్ధం చెప్పే బదులు, "నేను అతిగా రియాక్ట్ అవుతున్నాను, అది నా బలహీనత" అని ఒప్పుకోవాలి. నిజం మాట్లాడటం మొదలుపెడితే, పాత అబద్ధపు గోడలు దానంతట అదే కూలిపోతాయి.Detachment: మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మాత్రమే మీరు కాదు. కోపం వచ్చినప్పుడు "నేను కోపంగా ఉన్నాను" అనడం కంటే, "నాలో కోపం అనే భావం కలుగుతోంది" అని అనండి. ఆ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు వేరు (Detach) చేసుకున్నప్పుడే మీరు వాటిని బ్రేక్ చేయగలరు.Destruction of Comfort Zone: ప్రతిరోజూ మీకు భయం కలిగించే చిన్న పనిని చేయండి. మీ పాత వ్యక్తిత్వం ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మీరు అడుగు వేయండి.3. మార్కెట్ మోటివేషన్ vs రియల్ సైకాలజీమార్కెట్ "నేను గెలుస్తాను, నేను తోపు" అని అరుస్తూ గోడలను బద్దలు కొట్టమంటుంది. ఇది తాత్కాలిక జోష్.సైకాలజీ (CBT & Mindfulness) గోడలను కొట్టడం కాదు, ఆ గోడలు అసలు ఎందుకు కట్టామో (పాస్ట్ ట్రామాస్) అర్థం చేసుకుని, వాటిని ఇటుక ఇటుకగా విడదీయమంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గోడలు కట్టే అవకాశం ఉండదు.4. మీ నూతన నిర్మాణానికి సిద్ధం!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండాలి?Step 1: Break (అహాన్ని వదిలేయడం)మీరు ఇన్నాళ్లు కాపాడుకున్న ఆ 'ఇమేజ్'ని వదిలేయండి. "నేను అంటే ఇలాగే ఉంటాను" అనే ఫిక్స్డ్ మైండ్సెట్ను వదిలేయండి. మీ పాత ఐడెంటిటీని 'డీ-కన్స్ట్రక్ట్' (Deconstruct) చేయండి. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది అవసరం.Step 2: Build (నిశ్శబ్దం)పాత పర్సనాలిటీ కూలిపోయిన తర్వాత, కొత్తది కట్టే ముందు కొద్ది రోజులు 'నిశ్శబ్దం'గా ఉండండి. ఏ ప్లాన్లు లేని, ఏ లేబుల్స్ లేని ఒక శూన్య స్థితిలో ఉండండి. అక్కడే మీ అసలైన పర్పస్ (Purpose) పుడుతుంది.Step 3: Beyond (కొత్త ప్రతిబింబం)ఇప్పుడు మీరు కొత్త ఇటుకలతో, కొత్త ఆలోచనలతో మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఈసారి ఇది మీ ఛాయిస్, సమాజం వేసిన అచ్చు కాదు. ఇదే మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్ళే మార్గం.5. మీ పాత వ్యక్తిత్వానికి వీడ్కోలు!ఈ రోజు ఒక చిన్న విచారణ చేయండి.* మీ పాత ఐడెంటిటీలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన ఒక లక్షణం ఏది?* ఆ లక్షణాన్ని వదిలేస్తే, మీరు పోగొట్టుకునేది ఏంటి? (బహుశా అది ఒక భద్రత కావచ్చు).* ఆ భద్రతను వదిలి, కొత్తగా మారుతానని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి.కూల్చండి.. అప్పుడే నిర్మించగలరు!బ్రో, పాత గోడలను కూల్చడం బాధాకరమే కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ గోడల వల్ల మీరు ఇప్పటివరకు ఎంతో పరిమితంగా బతికారు. ఇప్పుడు ఆ పరిమితులు లేవు. మీరు గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు."Sometimes, you have to break yourself to become whole."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
పరుగే జీవితం
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది. ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్కి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్లో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.మార్చుకున్న షెడ్యూల్...చదువుకునే రోజుల్లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబుల్ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్లో నా జీవన శైలి ఉంటుంది. విదేశీ పోటీల్లోనూ...దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్ కాంపిటిషన్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఈ యేడాది జనవరిలో అజ్మీర్లో జరిగిన రన్నింగ్ రేస్లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రణరంగంలో నారీ శక్తి..!
ఒకప్పుడు కేవలం వైద్య, నర్సింగ్ సేవలకే పరిమితమైన మహిళలు, నేడు భారత సైన్యంలో కీలక విభాగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. యుద్ధ విమానాలు నడపడం నుంచి ఫిరంగి దళాల నిర్వహణ వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ మహిళల పాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. క్షేత్ర స్థాయి పోరాటంలో, అత్యున్నత స్థాయి వ్యూహ రచనలో పాల్గొని మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికే చాటిచెప్పారు. ప్రస్తుతం భారత సాయుధ దళాల్లో మహిళల సంఖ్య గత ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం..భారత సైన్యంలో సుమారు 8000 (వైద్య, నర్సింగ్ సేవలతో కలిపి) మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. 2022 నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళా క్యాడెట్లను చేర్చుకోవడం ప్రారంభమైంది. ప్రతి ఆరు నెలలకు 19 మంది మహిళా అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ ఇచ్చి నేరుగా ఆఫీసర్లుగా నియమిస్తున్నారు.సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత, మహిళా అధికారులకు కూడా పురుషులతో సమానంగా పదవీ విరమణ వరకు ఆర్మీలో కొనసాగడమే కాకుండా ఉన్నత పదవులను అధిరోహించగలుగుతున్నారుసాధారణ అధికారులుగా (మెడికల్, నర్సింగ్ మినహా) విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య 2037. గతంలో ఇది 1732 ఉండేది. భారత ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలు సైన్యంలో మహిళల సంఖ్య పెరిగేందుకు దోహదం చేశాయి.సుమారు 145 మందికి పైగా మహిళా అధికారులు ప్రస్తుతం కల్నల్ హోదాలో వివిధ యూనిట్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 60% మంది సరిహద్దుల్లోని కార్యాచరణ ప్రాంతాలలో సేవలు అందిస్తుండటం విశేషం.అగ్నిపథ్ పథకం కింద మహిళలను అగ్నివీర్లుగా రక్షణ దళాలలోకి తీసుకుంటున్నారు. నావికాదళంలో 20% ఖాళీలను మహిళలకే కేటాయించారు.ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, టెక్నికల్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నారు. లెఫ్టినెంట్ హోదాలో చేరే అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ. 56,000 పైగా స్టైపండ్ ఇస్తూ, గౌరవప్రదమైన కెరీర్ను ఆఫర్ చేస్తున్నారు.కమాండింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో 115 మందికి పైగా ఉండగా.. మరో 145 మంది విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు ఆర్టిలరీ, ఇంజినీర్లు, సిగ్నల్స్ వంటి విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదాతి దళంలోకి సైతం మహిళలను చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.మొదటిసారిగా టెరిటోరియల్ ఆర్మీలోని హోమ్ – హెర్త్ ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో మహిళా సైనికులను చేర్చుకోవాలని నిర్ణయించారు. దీనికోసం 110 ఖాళీలను కేటాయించారు. భారత సైన్యం లక్ష్యం ప్రకారం సుమారు 1700 మంది మహిళలను దశల వారీగా కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో చేర్చుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి ఏటా 100 మందిని చేర్చుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. మహిళా క్యాడెట్లు 60 మంది ఉండగా ఏటా 20 మంది కొత్తగా చేరుతున్నారు. భారత సైన్యంలో మొత్తంగా చూసినట్లయితే మెడికల్, డెంటల్ విభాగాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా అంటే సుమారు 21% ఉంది.(చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..) -
సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వే అసలైన అందం!
వెండితెరపై తన సహజ సిద్ధమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తాను గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మహిళలు తమని తాము ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని నేర్పిస్తోంది. మన విలువలకు విరుద్ధంగా ఉండేవి ఎంతటి విలువగలవయినా తిరస్కరించాలి అనే సూత్రాన్ని ఆచరించి చూపించారు. రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ని తిరస్కరించి, రంగు అనేది అందానికి కొలమానం కాదని నిరూపించారు. మేకప్ లేకుండా తెరపై కనిపించి .. నీలా నువ్వు ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. మొటిమలున్నా, జుట్టు రింగులుగా ఉన్నా.. అది దేవుడిచ్చిన వరమని, సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వుతో వెలిగే ముఖమే మిన్న అని చెబుతున్నారు. అలాగే చదువు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమని, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాటి చెప్పారు. మనం చేసే పనిపై ఇష్టం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని ఆమె అంటారు. విజయాలు, అపజయాలు తాత్కాలికమని, అవి నిన్ను ప్రభావితం చేయనివ్వద్దని సూచిస్తారు. బాల్యంలో స్టేజ్ ఫియర్ ఉన్న సాయిపల్లవి.. భయం ఉన్న చోటే ధైర్యాన్ని వెతుక్కోవాలని తన జీవిత విజయాల ద్వారా నిరూపిస్తారు. (చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..) -
అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..
కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్లుక్లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..సింగపూర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్ చువాండో టాన్కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్లుక్ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. అంతలా మెయింటైన్ చేస్తున్నా అతడి గ్లామర్ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.లైఫ్స్టైల్ ఎలా ఉంటుందంటే..ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక క్రమశిక్షణయుత జీవనమే మేలుబ్రేక్ఫాస్ట్: గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. లంచ్ లేదా డిన్నర్:భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్ లేదా చేప, రసం విత్ రైస్ ఉంటాయి. తప్పనిసరిగా వర్కౌట్లు. ఇవి కేలరీలు బర్న్ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్ చేసేలా డైట్ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్. అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. కాగా, టాన్ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్నెస్ పట్ల ఎంత కేర్గా ఉంటాడనేది. కాగా, టాన్ తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్లో. సింపుల్గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్. View this post on Instagram A post shared by CHUANDO TAN 陈传多 (@chuando_chuandoandfrey) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
బతుకులో జీవం నింపే కళ
‘మనసుకు నచ్చిన పని ఎంతటి సంతృప్తిని ఇస్తుందో హస్తకళల ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటారు’ మరియా క్లారా. సికింద్రాబాద్లోని నాగోల్లో ఉంటున్న మరియా ఉద్యోగాన్ని వదిలేసి, కలంకారి, బాతిక్ పెయింటింగ్ నేర్చుకొని కలంబాతిక్ మరియా క్లారా గా తన కళకు గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఆమె మనసును ఎలా గాయపరుస్తాయో, తిరిగి ఆమె జీవితం కొత్తగా ఎలా మార్పు చెందుతుందో ఈ కళ కూడా వస్త్రం మీద అలాగే కళ్లకు కడుతుంది’ అంటూ కళాత్మకమైన విశేషాలను పంచుకున్నారు...‘‘కరోనా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ప్రైవేట్ ఉద్యోగంలో యాంత్రికంగా రోజులు గడిచిపోయాయి. జీవితంలో జీవం ఉండేదెలాగో అన్వేషిస్తుండగా హస్త కళలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో బాతిక్ ఆర్ట్తో గొప్ప అనుభూతిని పొందాను. మావారు ప్రైవేట్ జాబ్ చేసి, రిటైర్ అయ్యారు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఎవరి ప్రయాణం వాళ్లదే. నేను వాళ్లకు సపోర్ట్ చేస్తాను. వాళ్లు నాకు సపోర్ట్ చేస్తారు. నా ఇష్టాన్ని వాళ్లు కాదనరు.అర్థమెంతో...వ్యాక్స్తో క్లాత్ మీద ముందుగా గీతలను డిజైన్ వచ్చేలా గీస్తాం. తర్వాత దానిని ముందే సిద్ధం చేసుకున్న రంగులలో ముంచుతాం. దాంతో ఆ క్లాత్మీద ఉన్న వ్యాక్స్ లైన్ అంతా విరిగిపోతుంది. ఆ గీతల స్థానంలో రంగు లైన్లు లైన్లుగా ఇంకిపోయి, ఒక చెప్పలేని అందం కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరి వల్లనైతే మనం బాధపడతామో, ఆ తర్వాత అదే బాధ అవతలి వారు పడుతున్నప్పుడు దానిని తొలగించాలని చూస్తాం. ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించిన వాళ్లకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. అంటే, ‘నువ్వు నొప్పిని అనుభవిస్తేనే, అవతలి వారికి ఉపశమనం ఇవ్వగలవు..’. అని ఈ బాతిక్ ద్వారా జీవితపు అర్థం ఏంటో తెలిసి వచ్చింది. అంటే నొప్పిని అనుభవించిన స్త్రీయే, నొప్పికి మందుకూడా వేయగలదు. అది ఈ బాతిక్ చూపుతుంది. మనసుకు అయిన గాయాలకు రంగులు పూసి, మనకే అందంగా చూపించే కళ ఇది.ఆసరా అయ్యేలా కూడా ఉండాలిమన గురించి బయటివారికి చెప్పలేని భావాలను ఆర్ట్ రూపంలో చెప్పవచ్చు. నటించాల్సిన అవసరం లేకుండా చేసేవి హస్తకళలే. నేను చేసేది కమర్షియల్ వర్క్ కాదు. ఎవరైనా తమకు నచ్చిన అంశం డిజైన్లో వచ్చేలా చేసి ఇవ్వమని అడిగితే దానికి తగినట్టు చేసి ఇస్తాను. ఉదాహరణకు.. ‘మా ఇంట్లో పెళ్లి ఉంది, వధూవరుల డిజైన్ చేసి ఇవ్వాలి’ అని అడిగితే అలాగే చేసి ఇస్తాను. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పది మందికి ఆసరా అయ్యేలా కూడా ఉండాలని కోరుకుంటాం.ఉపాధి కల్పిస్తున్నాను..కొన్ని చీరలు, డ్రెస్సులు కలం బాతిక్ పెయింటింగ్ చేసి, బొటిక్స్కి ఇస్తాను. ఈ వర్క్ని కొంతమంది మహిళలకు నేర్పి, వారికి ఉపాధిని కల్పిస్తున్నాను. గుజరాతీ, బెంగాల్ రాష్ట్రాలలో ఈ బాతిక్ పెయింటింగ్ బాగా ్రపాచుర్యంలో ఉంది. మన దగ్గర బ్లాక్ ప్రింట్ అచ్చులతో వేస్తారు. నేను మాత్రం పూర్తిగా చేతితోనే వేస్తాను. కాలేజీలు, స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడి విద్యార్థులకు ఈ వర్క్ నేర్పిస్తున్నాను. ఈ కళ గురించి ఏమీ తెలియని వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పనిని నేర్చుకోవచ్చు. హైదరాబాద్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జరిగే కార్యక్రమంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్క్ నేర్పించే అవకాశం లభించింది. ఇష్టంతో నేర్చుకున్న పని నన్ను ఎంతో మంది కళాకారులకు చేరువ చేసింది. భావోద్వేగాల సమతుల్యతను నేర్పించింది’ అంటూ హస్తకళల గొప్పతనాన్ని అందంగా వివరించారు ఈ కళాకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హెయిర్కట్ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం!
హెయిర్కట్ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్ కటింగ్ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది. చిన్నపాటి తప్పిదాన్ని పెద్దగా చేసి చూపించి వినియోగదారుల కేసులో కోట్లలో నష్టపరిహారం పొందింది. పాపం సదరు సెలూన్ సెంటర్ ఇంత చిన్నతప్పిదానికి అంత భారీ పరిహారమా అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే..మళ్లీ అమాంతం పరిహారం పెంచేసింది. చివరికి ఆమెకు ధర్మాసనం ఊహించని దిమ్మతిరిగిపోయే ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 12, 2018న, ఆమె హెయిర్ కట్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. కానీ వాళ్లు పొరపాటున తప్పుగా కట్చేశారు. దాంతో వాళ్ల సేవకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జూలై 2018లో వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2021న, వినియోగదారుల కమిషన్ బ్యూటీ సెలూన్ను తప్పుపడుతూ బాధిత మహిళకు ఏకంగా రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశంతో అసంతృప్తి చెందిన బ్యూటీ సెలూన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిహారం మొత్తం అంచనా వేసేందుకు ఆ కేసుని తిరిగి వినియోగదారుల కమిషన్కు పంపింది ధర్మాసనం. దాంతో ఆ మహిళ తన క్లైయిమ్ను అమాంతం రూ.2 కోట్లు నుంచి రూ. 5.2 కోట్లుకు పెంచేసింది. పైగా అందుకోసం కమిషన్ ముందు పలు పత్రాలను కూడా సమర్పించింది. వినియోగదారుల కమిషన్ ఆ పత్రాలను పరిశీలించి ఆమె ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు జరిగే రోజుకి రూ. 9 వడ్డీతో కలిపి మళ్లీ రూ. 2 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది. దాంతో మనస్తాపం చెంది బ్యూటీ సెలూన్ మళ్లీ సుప్రీంకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టు ముందు, ఆమె తాను ఉన్నత విద్యావంతురాలైన మహిళనని, కలకత్తాలోని ఐ.ఐ.ఎం. నుంచి మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా కూడా చేశానని పేర్కొంది. ఆ సెలూన్లో హెయిర్ కటింగ్ చేసుకోకముందు తనకు మంచి కెరీర్ ఉందని చెప్పింది. కానీ బ్యూటీ సెలూన్ దానిని ఖండించింది. హెయిర్ అనేది ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా వాదించింది. పైగా ఎగ్జిక్యూటివ్ పదవుల్లో ఉన్నవాళ్లు సినీ సెలబ్రిటీలు లేదా మోడలింగ్ వాళ్ల మాదిరిగా జుట్టు కత్తిరించుకోకూడదని వాదించింది. అందువల్ల జాబ్ కెరీర్ పాడైందని, ఉన్నతి పదవులు కోల్పోయానని, భారీ వేతనం అదుకోవాల్సిన తాను తక్కువ మొత్తంలో జీతం పొందుతున్నానని తన గోడును వినిపించింది. అంతేగాదు హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నానని, కానీ జూన్ 2018లో తన ఉద్యోగాన్ని ఈ కారణంగా కోల్పోయానని పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ముందు, తర్వాత ఆదాయ పన్ను రిటర్న్లను సమర్పించడంలో విఫలమైందని సెలూన్ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే అంత భారీ మొత్తంలో నష్ట పరిహారం పొందేలా సరైన ప్రామాణిక పత్రాలు ఏమి సమర్పించ లేదని కోర్టు గుర్తించింది. దాంతో కోర్టు కేవలం బాధతురాలి అంచనాలు, ఆమె ఇష్టాఇష్టాలను అనుసరించి పరిహారం ఇవ్వరని స్పష్టం చేసింది. అలాగే ఈ న్యాయపోరాటంలో గతంలో సదరు సెలూన్ 25 లక్షలు కోర్టులో డిపాజిట్ చేసిందని గుర్తుచేస్తూ..అంతమొత్తం మీరు సమర్పించిన పత్రాలకు అనుగుణంగా సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాదు ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో పరిహారం పొందాలంటే..అతనికి జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేస్తారు. అందుకు తగిన డాక్యుమెంట్స్, సాక్షాధారాలు కూడా ఉండాలంటూ సదరు మహిళకు చురకలు అంటించింది.(చదవండి: అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!) -
మీ బాడీ ఇమేజ్... మీ పర్సనాలిటీ...
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం మాట తీరు, డ్రెస్సింగ్ అనుకుంటారు. కానీ మీ పర్సనాలిటీకి అసలైన పునాది "మీ శరీరం". మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు నచ్చని వ్యక్తి కనిపిస్తే, ఆ అసంతృప్తి మీ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రతిబింబిస్తుంది. దీన్నే Body Image అంటారు.సమాజం, మీడియా, మన ఆలోచనలు కలిసి మనల్ని మనం ఒక 'వస్తువు'గా చూసుకునేలా చేశాయి. మన పర్సనాలిటీలో ఆత్మవిశ్వాసం (Confidence) పుట్టాలంటే, ముందుగా మన శరీరంతో (Body) మనకు ఉన్న సంబంధం బాగుండాలి.1. బాడీ ఇమేజ్ vs బాడీ రియాలిటీబాడీ రియాలిటీ అంటే మీ శరీరం నిజానికి ఎలా ఉంది? (ఎత్తు, రంగు, బరువు). ఇది ఒక భౌతిక సత్యం.బాడీ ఇమేజ్ అంటే మీ శరీరం గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయం.సమస్య ఏంటంటే, మనం బాడీ రియాలిటీతో కాకుండా, బాడీ ఇమేజ్ తో జీవిస్తాం. చాలామంది ఫిట్గా ఉన్నా కూడా, తమని తాము లావుగా భావించడం వల్ల ఆందోళన చెందుతారు. ఇది ఒక రకమైన Cognitive Distortion.2. సమాజం, మీడియా ప్రభావంమీడియా మనకు పర్ఫెక్ట్ బాడీ అంటే ఎలా ఉండాలో ఒక ప్రమాణాన్ని ఇచ్చింది."నువ్వు తెల్లగా ఉండాలి," "నువ్వు పక్కా ఫిజిక్ కలిగి ఉండాలి."ఈ ప్రమాణాలను అందుకోలేక, మెజారిటీ ప్రజలు తమ శరీరాన్ని తాము ద్వేషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి తన శరీరాన్ని అసహ్యించుకోవడం మొదలుపెడితే, అతను తనను తాను 'తక్కువ'గా చూసుకోవడం ప్రారంభించి, పర్సనాలిటీ పరంగా కుంచించుకుపోతాడు.3. పర్సనాలిటీపై ప్రభావంమీ బాడీ ఇమేజ్ బాగోలేకపోతే మీ పర్సనాలిటీ ఎలా మారుతుందో చూడండి.అభద్రతా భావం: ఎప్పుడూ ఇతరులు తనని చూసి ఏమనుకుంటున్నారో అని భయం (Social Anxiety).వాయిదా వేసే స్వభావం: "నేను బరువు తగ్గాక బయటకు వెళ్తాను, నేను అందంగా మారాక ఆ పని చేస్తాను"—ఇలా జీవితాన్ని వాయిదా వేస్తారు.ఎమోషనల్ అస్థిరత: చిన్న విమర్శ కూడా వారిని విపరీతంగా బాధపెడుతుంది.4. మీ శరీరంతో సంధి చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ శరీరానికి, మీకు మధ్య ఉన్న గొడవను ఎలా ఆపాలో చూద్దాం.Step 1: బాడీ షేమింగ్ ని ఆపండిమొదట మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపండి. అద్దం ముందు నిలబడి మీ శరీరంలోని లోపాలను వెతకడం మానేసి, మీ శరీరం మీకు చేస్తున్న సహాయాన్ని గుర్తించండి. "నా కాళ్లు నన్ను నడిపిస్తున్నాయి, నా మెదడు నాకు ఆలోచనలను ఇస్తోంది" అని కృతజ్ఞతతో ఉండండి. సమాజం చెప్పిన 'పర్ఫెక్ట్' ప్రమాణాలను 'Break' చేయండి.Step 2: ఫంక్షనాలిటీ vs అప్పియరెన్స్మీరు మీ బాడీని చూడటానికి అందంగా ఉండాలని కాకుండా, ఆరోగ్యంగా ఉండాలని అనుకోండి. వ్యాయామం అంటే బరువు తగ్గడానికి మాత్రమే కాదు, అది ఒక Self-Respect. మీరు మీ బాడీని గౌరవించి, దానికి కావాల్సిన వ్యాయామం, ఆహారం ఇస్తే, మీ ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ గా 'Build' అవుతుంది.Step 3: బాడీ అక్సెప్టెన్స్మీరు పరిపూర్ణంగా ఉన్నారా లేదా అనేది కాదు ముఖ్యం, మీరు మీ శరీరంతో ఎంత Comfortable గా ఉన్నారు అనేది ముఖ్యం. ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా గౌరవిస్తారో, అప్పుడు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక 'గ్లో' కనిపిస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ అద్దం ఏం చెప్తోంది?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.అద్దం ముందు నిలబడి, మీకు నచ్చని మీ బాడీ పార్ట్ వైపు చూడండి.దాన్ని ద్వేషించడం మానేసి, "థాంక్యూ, నువ్వు నాకోసం ఇంత కష్టపడుతున్నావు" అని చెప్పండి.మీ దృష్టిని అప్పియరెన్స్ నుండి 'బాడీ ఫంక్షనాలిటీ' కి మార్చండి.మీ శరీరమే మీ మొదటి ఇల్లు!బ్రో, ఒక ఇల్లు పాతబడితే దాన్ని కూల్చేయరు కదా, పెయింటింగ్ వేసి బాగుచేసుకుంటారు. మీ శరీరం మీ మొదటి ఇల్లు. దాన్ని ప్రేమించండి, గౌరవించండి. అప్పుడే మీ పర్సనాలిటీ లోపలి నుండి బయటకు ప్రకాశిస్తుంది.గుర్తుంచుకోండి, "Your body is the vehicle for your soul; treat it with the respect it deserves."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ కలలు చెప్పే నిజాలు) -
24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!
విదేశీ టూర్ వ్లాగర్ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్, కనీసం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్ ట్రావెల్ వ్లాగర్గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. బిహార్లోని ముంగేర్, భాగల్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్ కుమార్ అనే యువకుడు 197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్పోర్ట్తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్ది మధ్య తరగతి నేపథ్యం. తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్ మీడియాలో తన హోమ్టూర్ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్ వ్లాగ్ పేరుతో విదేశీ టూర్లు పర్యటించే రేంజ్కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్ అయ్యేవారు. అలా అతడి యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్ వస్తుంటాయి. ఇదంత శుభమ్కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. జర్నీ ఎలా ప్రారంభమైందంటే..తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్పై అంత పట్టు కూడా లేదని ఓపెన్గానే చెప్పేశాడు శుభమ్. కేవలం ఇండియా పాస్పోర్ట్తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్ వ్లాగ్గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్, తర్వాత రష్యా, థాయిలాండ్, లావోస్..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్ వ్లాగ్ పోస్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్హైక్ చేశాడు. అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్ పాస్పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్పోర్ట్తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్పోర్ట్లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్. ఎందుకంటే అప్పటికే తన పాస్పోర్ట్లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్పోర్ట్లను నింపాడు. అయితే శుభమ్ ప్రతి దేశానికి ఈ పాస్పోర్ట్తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్. 16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్లు ప్లాన్ చేసుకున్నాడట. అంటే శుభమ్ అప్లోడ్ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం అతడికి ఫోన్చేసి మరి అభినందించారట. ఇప్పుడు అతని టూర్ బకెట్ లిస్ట్లో బ్రెజిల్ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!. View this post on Instagram A post shared by Shubham Kumar || Extreme Traveller (@nomadshubham) (చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!) -
అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!
పాములను భయానకంగా మార్చేది ఏమిటంటే, కొన్ని విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చంపే సామర్థ్యం. కానీ విషపూరిత కాటుకు తెలిసిన ఏకైక విరుగుడు, యాంటీవెనమ్, అదే విషంతో తయారు చేయబడింది. శతాబ్దాలుగా,పాము విషంలోని ఎంజైమ్ల మిశ్రమంలో వివిధ రకాల ఔషధాలు కూడా ఉండొచ్చని మానవుడు ఏనాడో గుర్తించాడు.ఈ క్రమంలోనే విషం నుంచి తయారు చేసిన ఆధునిక చికిత్సా ఉత్పత్తులు నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్తాన్ని ప్రభావితం చేసే వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. ఈ పాముల విషాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేలా లక్ష్యంగా పెట్టుకుని మరి మందులు రూపొందించారు వైద్య నిపుణులు. అవేంటంటే రక్తపోటు , పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేసే కాప్టోప్రిల్ జరారాకా (దీన్ని దక్షిణ అమెరికా పిట్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము నుంచి తయారు చేస్తారట), అస్వస్థతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఎప్టిఫిబాటైడ్ (రాటిల్ స్నేక్ నుంచి తయారు చేస్తారు). ఇవేగాక కింగ్కోబ్రా విషంపై పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇందులో కూడా అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. దీని విషాన్ని హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించే బీటా-కార్డియోటాక్సిన్ ఔషధ తయారీలో ఇనియోగిస్తారట. అలాగే పెప్టైడ్ను నోటి ద్వారా తీసుకునే మందుని కూడా తయారు చేస్తారట.కేవలం పాముల నుంచే కాదు అవి కూడా..విషాన్ని ఉత్పత్తి చేసే జీవులు పాములు మాత్రమే కాదు. గొంగళి పురుగులు,కందిరీగలు, కోన్ నత్తల నుంచి టోడ్లు, జెల్లీ ఫిష్ వరకు వివిధ రకాల జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అఖరికి కొన్ని బల్లులు కూడా విషపూరితమైనవేనని చెబుతున్నారు నిపుణులు. మనం తరుచుగా పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం కింద అందించే భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు అని వింటుంటాం. అందుకు కారణం అన్నం లేదా కూరలో బల్లి పడటంతో ఇది జరిగిందని చెబుతుంటారు. అంటే సాధారణంగా బల్లలు విషపూరితమైనవి కావు, కానీ మనం తినే పదార్థాల్లో పడినప్పుడు దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రేగుల్లో చేరి పాయిజన్ అవుతుందట. అంతేకాదండోయ్ అమెరికా, మెక్సికో ఎడారులలో కనిపించే గిలా అనే బల్లి విషం నుంచి టైప్ 2 డయాబెటిస్ నివారణ మందును తయారు చేస్తారట. అంతేగాదు అంతకుమించి ప్రమాదకరమైన మరో చిన్నజీవి ఉంది. మనం తరుచుగా ఇళ్లల్లో చూసేదే. అదేనండి గొంగళి పురుగు. దక్షిణ అమెరికాలోని లోనోమియా గొంగళి పురుగు అత్యంత ప్రాణాంతకమైనదట. 1989లోబ్రెటిజల్లో వీటిని చూశారట. ఇవి సముహాలుగా గుత్తులగా ఉంటాయట. ఒక గుత్తిని తాకినా..అంతే ప్రాణాలే పోతాయట. అందుకు పెరూలోనే ఓ రోగి కేసు ఉదాహరణ అంటున్నారు వైద్య నిపుణులు. పెరూలో ఐదు గొంగళి పురుగులపై కాలు వేసిన ఒక యువ కెనడియన్ పర్యాటకుడి ప్రారంభంలో కొద్దిపాటి లక్షణాలు అనుభవించిన..రోజులు గడుస్తున్నకొద్ది బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ గొంగళి పురుగు విషం శాస్త్రవేత్తల పరిశోధనలో అంతర్గత రక్తస్రావం, మూత్రపిండ వైఫల్యానికి దాదితీస్తుందని తర్వాత తెలిసింది. దీనికి విరుగుడు బ్రెజిల్లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ తయారు చేసిన యాంటీవినమ్ మాత్రమే చికిత్స. ఇక సాలీడు విషం సైతం మానవులకు ఉపయోగపడుతుందట. ప్రపంచంలోని నాలుగు ప్రాణాంతక సాలెపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియాలోని గరాటు వెబ్ అనే సాలీడు విషం నుంచి సహజ పురుగుల మందు నివారిణిని తయారు చేస్తున్నారు. ఇది దోమలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందట. అలాగే ఇది డీడీటీ వంటి ఇతర పురుగుమందుల నిరోధకతను కూడా కలిగి ఉందట. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో పాము విషం వాడకాన్ని ప్రోత్సహిస్తోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలలు అనుభవించిన ఉపశమనం ఆధారంగా తేలు విషాన్ని చికిత్సలో ఉపయోగించారు. అంతేగాదు ఈ తేలు విషం ఒంటి నొప్పులకు నివారణగా కూడా ఉపయోగిస్తారట. అలాగే సముద్ర ఎనిమోన్ల ద్వారా ఉత్పత్తి చేసే టాక్సిన్లను ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారట. పురాత గ్రీకులు ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టారు. పైగా రాబోయే ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని ఆనాడే అంచనా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు చాలామటుకు తమ చిహ్నంగా సిబ్బంది చుట్టుతా చుట్టబడిన పాము నమునాని ఎంచుకోడానికి రీజనే ఇదే కావొచ్చు కూడా.జానికి లెనిన్(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు) -
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..) -
మీ కలలు చెప్పే నిజాలు
మన నిద్రలో వచ్చే కలలు కేవలం పిచ్చి ఊహలు కావు, అవి మన Subconscious Mind మనతో మాట్లాడుతున్న భాష. సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని Wish Fulfillment అని పిలిస్తే, కార్ల్ యుంగ్ Messages from the Psyche అని చెప్పారు.మనం మేల్కొని ఉన్నప్పుడు సమాజం కోసం ఒక ముసుగు (Mask) వేసుకుంటాం. కానీ నిద్రపోయినప్పుడు, ఆ ముసుగు తొలగిపోయి మన అసలైన భయాలు, కోరికలు, మరియు పరిష్కారం కాని సమస్యలు బయటకు వస్తాయి. మీ కలలు మీ పర్సనాలిటీకి ఒక 'రిఫ్లెక్షన్' లాంటివి. మీరు పదే పదే ఒకే రకమైన కలలు కంటున్నారంటే, మీ మనసు ఏదో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.1. ఫ్రాయిడ్ vs యుంగ్: కలల వెనుక ఉన్న సైకాలజీSigmund Freud ప్రకారం, మన కలలో వచ్చే ప్రతిదీ మన లోపల అణిచిపెట్టబడిన కోరికల ప్రతిరూపం. మనం పగలు బయటపెట్టలేని కోపాలు, ఆశలు అన్నీ కలల రూపంలో బయటపడతాయి.Carl Jung దీనిని ఇంకా లోతుగా చూశారు. కలలు మనలోని లోపాలను, మనం మర్చిపోయిన మన 'Shadow Self' (చీకటి కోణం) ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాయి. ఒక వ్యక్తికి పదే పదే ఎత్తు నుండి పడిపోతున్నట్లు కల వస్తుందంటే, అది అతను తన జీవితంలో నియంత్రణ (Control) కోల్పోతున్నాడని అర్థం.2. కలల్లో కనిపించే సింబల్స్ మీరు కలలను విశ్లేషించడం ద్వారా మీ పర్సనాలిటీలో ఉన్న బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.పారిపోవడం: ఇది మీ జీవితంలోని సమస్యల నుండి లేదా ఒక బాధ్యత నుండి మీరు పారిపోవాలని చూస్తున్నారని అర్థం. ఇది మీ 'Avoidant Personality' కి సంకేతం.పరీక్షలో ఫెయిల్ అవ్వడం: మీ పర్సనాలిటీలో మీకు 'పర్ఫెక్షనిస్ట్' భయం ఎక్కువగా ఉందని, ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఆందోళన ఉందని అర్థం.నీటిలో మునిగిపోవడం: మీ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారని అర్థం. మీ Emotional Intelligence తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది.3. "కలలు కనండి.. విజయం మీదే"మోటివేషనల్ స్పీకర్లు 'కలలు' అంటే కేవలం 'గోల్స్' అని చెప్తారు. కానీ సైకాలజీలో కలలు అంటే 'సెల్ఫ్-రిఫ్లెక్షన్'. కలలను కేవలం విజయం కోసం మెట్లుగా కాకుండా, మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దే 'గైడ్' లా చూడండి.4. కలలను మీ పర్సనాలిటీకి అద్దంగా మార్చుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కలల నుండి మీరు నేర్చుకోవాల్సింది ఇదే.Step 1: కలల డైరీ రాయండిప్రతిరోజూ ఉదయం లేవగానే మీరు కన్న కలలను ఒక డైరీలో రాయండి. అది ఎంత పిచ్చిగా ఉన్నా సరే. ఆ కలలో మీకు కలిగిన 'ఎమోషన్' (భయమా? ఆనందమా? కోపమా?) ఏంటో గుర్తించండి. కలలోని సంఘటనల కంటే ఆ 'ఎమోషన్' చాలా ముఖ్యం. ఇది మీ పాత ప్రోగ్రామింగ్ను 'Break' చేసి, నిజమైన మీరు ఎవరో చూపిస్తుంది.Step 2: కలల వెనుక ఉన్న మూలాన్ని వెతకండిఆ కల మీ పగటిపూట జీవితానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉందో విశ్లేషించండి. మీరు పగలు దేని గురించి భయపడుతున్నారో, అదే కలగా వస్తుంది. అక్కడ మీరు ఎక్కడ తగ్గుతున్నారో, దాన్ని మీ పర్సనాలిటీలో 'Build' చేయండి.Step 3: మాస్టరీఒక్కసారి మీ కలల భాష (Dream Language) మీకు అర్థమైతే, మీరు మీ సబ్-కాన్షియస్ మైండ్ను కూడా కంట్రోల్ చేయగలరు. అదే Lucid Dreaming కి పునాది. మీరు మీ అంతరాత్మతో నేరుగా సంభాషిస్తున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఒక 'హైయర్ లెవెల్' కి చేరుకుంటుంది.5. కలల విశ్లేషణఈ రోజు ఒక చిన్న పని చేయండి:* ఈ వారం మీకు వచ్చిన అతి ముఖ్యమైన కలని రాసుకోండి.* ఆ కలలో మీరు ఏ పాత్ర పోషించారు? (బాధపడేవారా? పోరాడేవారా? పారిపోయేవారా?)* మీ నిజ జీవితంలో మీరు కూడా ఆ పాత్రనే పోషిస్తున్నారా?కలలు మీ అంతరాత్మ ప్రతిబింబాలు!బ్రో, కలలు మనకు భవిష్యత్తును చెప్పవు, కానీ అవి మన వర్తమానాన్ని, మన అస్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు ఎవరో తెలుసుకోవాలంటే, మీరు నిద్రపోయినప్పుడు మీ మనసు ఏం చెప్తుందో వినండి."The dream is the small hidden door in the deepest and most intimate sanctum of the soul."-Carl Jungసైకాలజిస్ట్ విశేష్Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో బేబీ షవర్ లేదా సీమంతం వేడుకలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని కలకాలం పదిలపర్చుకునేలా మెటర్నిటీ ఫోటోషూట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తి తన భార్య బేబీ షవర్ కోసం వినూత్న ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో హెలికాప్టర్లో పూల వర్షం కురియడం విశేషంగా నిలిచింది. మేళతాళాలు, సంప్రదాయ వేషదారణలు, విందుభోజనాల మధ్య ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి జంట ఫోటోలకు పోజులిస్తుండగా, ఆకాశం నుంచి పూల వర్షాన్ని చూసి అర్పిత ఆశ్చర్య చకితురాలైంది. @maamantraventures అనే ఇన్స్టాగ్రాంలో వీడియోను షేర్ చేస్తూ, "లవ్ ఇన్ ఇది ఎయిర్..మంగళూరులో ఒక నిజమైన హీరో, తన భార్య బేబీ షవర్ కోసం హెలికాప్టర్ ఫ్లవర్ షవర్తో ఆమెను సర్ప్రైజ్ చేశాడు. మంగళూరులో మొదటిసారి! నిజంగా గుర్తుంచుకోవలసిన వేడుక!" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇదిచూసి నెటిజనులను భావోద్వేగానికి లోను చేసింది. View this post on Instagram A post shared by Akshitha Poojary (@akshupoojary) View this post on Instagram A post shared by MMV🫰🏻KUSHI Films (@maamantraventures)వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశాడు. నగర శివార్లలోని అడయార్ గార్డెన్లో అతిథులు హాజరు కాగా సీమంతం వేడుక మధ్య హెలికాప్టర్ ఈ జంటపై పూల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసిఅతిథులు కూడా ఆశ్చర్యంగా చూశారు. చాలామంది ఈ అద్భుత క్షణాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్నెటిజనుల స్పందనపురుషుడు నిజంగా భార్యను ప్రేమిస్తే.. అతని ప్రేమ ఎప్పటికీ అనంతం." అని ఒకరు, చేతిలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు మరొకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ డబ్బును ముగ్గురు అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి ఉంటే బావుండేది అని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.(విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట సంగీత్ వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. పదండి దాని సంగతులేంటో తెలుసుకుందాం.రష్మిక ఎప్పటిలాగానే డైమండ్ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్ హారం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో కొత్త ఫ్యాషన్ ట్రెండ్కు నాంది పలికాడు. తన వెడ్డింగ్ లుక్స్తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక సిల్వర్ కలర్ లెహంగాను ధరించింది.యూనిక్ ఎమరాల్డ్ నెక్లెస్విజయ్ ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. విజయ్ నెక్లెస్లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్ క్యాప్ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్మెంట్ రింగ్గా భావిస్తున్న విజయ్ పదహారు రాళ్ల డైమండ్ రింగ్ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్ క్రిస్క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. (విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!
‘‘నడక చాలు, మీకు జిమ్ అవసరం లేదు’’ అని ఎవరైనా చెప్పడం మనలో చాలా మంది విని ఉండొచ్చు. సాధారణంగా జిమ్కు వెళ్లలేకపోతున్న వారికి ఇది ఓదార్పుగా అనిపించవచ్చు. జిమ్కు డుమ్మా కొట్టడం దానికి బదులుగా నడకను ఎంచుకోవడం అంటే అది అంత సులువైన విషయం కాదు అలాగని అసాధ్యం కూడా కాదు. జిమ్ మానడం వల్ల కలిగే నష్టాలను నడకతో భర్తీ చేయడం సాధ్యమే అంటున్నారు వ్యాయామ నిపుణులు. వారు చెబుతున్న ప్రకారం...అలా చేస్తే లాభం లేదు...కారు దిగి ఆఫీసు వరకు నడవడం, షాపింగ్ మాల్లో తిరగడం, ఫోన్లో మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో నడవడం, పార్క్లో రిలాక్స్డ్గా నెమ్మదిగా వాక్ చేయడం... వంటి వాటివల్ల జిమ్ సెషన్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి వ్యక్తి శరీరంపై నిర్మాణాత్మక ఒత్తిడిని కలిగించవు. కార్డియో పేరిట ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్...వగైరాలు జిమ్లో అందుబాటులో ఉంటాయి. అటువంటి వ్యాయామాలతో కూడిన జిమ్ సెషన్ వదిలేస్తూ, ఆ నష్టం భర్తీ కావాలంటే ఏదో ఒక పని మీద కాకుండా నడవడం అనే పని మీద బయటకు వెళ్లాలి. అప్పుడే మన చేతులు సరిగ్గా కదులుతాయి. చూపు ముందుకు ఉంటుంది. ఒక్కో అడుగు సాధారణం కంటే ఎక్కువ దూరం పడుతుంటుంది. ఇలా నడిస్తే...భళా...స్మార్ట్వాచ్ లేదా ఫోన్ ఉంటే, ఒక సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్థిరమైన రీతిలో గంటకు 5 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా నడవాలి. అంటే దాని ద్వారా మనం 2.50 కి.మీ నడుస్తామన్నమాట. ఆ వేగంతో, చాలా మంది సాధారణ నడక నుంచి బయటపడి తేలికపాటి కార్డియో శైలిలోకి వెళతారు. శ్వాస కొంచెం లోతుగా మారుతుంది. కండరాలు సాధారణ ప్రయాణ వేగం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేయడానికి తగ్గట్టుగా వేడెక్కుతాయి. అలా 30 నిమిషాలు నాన్–స్టాప్ గా నడిస్తే గుండె, ఊపిరితిత్తులు రక్త నాళాలు గట్టి ప్రభావాన్ని ఎదుర్కొంటాయి.దీనికి రోజువారీ తప్పక చేయాల్సిన అవసరం కూడా లేదు. వారంలో నాలుగు రోజులు సరిపోతుంది. ‘‘దానిని ఒకేలా పరిగణించినప్పుడు మాత్రమే. నడక ఒక వ్యాయామం అవుతుంది. తొలుత 5 నిమిషాల పాటు సున్నితమైన వేగంతో ప్రారంభించి ఆపై తగిన వేగంలో స్థిరంగా నడవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా చేతులను వెనక్కి కట్టేయడం లాంటివి చేయకూడదు. చేతులను దాదాపు 90 డిగ్రీల వద్ద వంచి సహజంగా ఊగుతూ ఉండేలాచూడాలి. చదునైన నేలపై 30 నిమిషాల్లో 2.3–2.7 కి.మీ. లక్ష్యంగా పెట్టుకోవాలి. వేగాన్ని తగ్గించకుండా ఉండటానికి అవసరమయితే సంగీతం లేదా పాడ్కాస్ట్లను ఉపయోగించవచ్చు. వాక్ ముగిసే సమయంలో హృదయ స్పందన రేటు తగ్గడానికి 2–3 నిమిషాల పాటు నెమ్మదించిన నడకతో ముగించాలి.(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
హర్మోన్లు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయంటే..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. అది మీ శరీరంలో జరిగే Chemistry కూడా. చాలామంది తమ కోపానికి, బద్ధకానికి, ఆందోళనకు కారణం 'చేతకానితనం' అనుకుంటారు. కానీ, అది కేవలం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులు మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మనం ఒక వ్యక్తిని "కోపిష్టి" అంటాం, లేదా "చాలా ప్రశాంతమైన వ్యక్తి" అంటాం. కానీ ఒక వ్యక్తి మెదడులో నిరంతరం జరిగే రసాయన చర్యలే ఆ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ హార్మోన్లు మీ కళ్ళకు కనిపించవు కానీ, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా ఆలోచించాలో అవే నిర్ణయిస్తాయి.1. The Fantastic Four...మన ప్రవర్తనను ప్రధానంగా నాలుగు హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. వీటిని మనం 'హ్యాపీ హార్మోన్లు' అని పిలుస్తాం.Dopamine - The Reward Molecule: మీరు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు విడుదలవుతుంది. ఇది లేకపోతే మీరు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు.Serotonin - The Mood Stabilizer: ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక హోదాను నియంత్రిస్తుంది. ఇది తక్కువైతే వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్లడం, విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతుంది.Oxytocin - The Bonding Hormone: ఇది మనుషులతో మనల్ని కలిపి ఉంచుతుంది. ఇది ఎక్కువ ఉంటే మీరు నలుగురితో కలిసిపోయి ఉంటారు, తక్కువ ఉంటే ఒంటరితనం (Loneliness) ఫీలవుతారు.Endorphins - The Pain Killer: ఇవి ఒత్తిడిని, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.2. కార్టిసాల్: మీ పర్సనాలిటీకి శత్రువుమీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) విడుదలవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే, మీ మెదడులోని 'హిప్పోకాంపస్' (జ్ఞాపకశక్తికి సంబంధించింది) బలహీనపడుతుంది. దీనివల్ల మీరు త్వరగా మర్చిపోవడం, కోపపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం జరుగుతుంది. మీరు చేస్తున్న 'ట్రిగ్గర్' పనులన్నీ ఈ కార్టిసాల్ ని పెంచేవే!3. మోటివేషన్ vs బయోలాజికల్ ఫ్యాక్ట్స్సో-కాల్డ్ ట్రైనర్లు "నీ మైండ్ సెట్ మార్చుకో, అంతా మారుతుంది" అని చెప్తారు. అది నిజమే, కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి.మీరు రోజుకు 30 నిమిషాలు ఎండలో తిరగకపోతే, లేదా వ్యాయామం చేయకపోతే.. మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా, మీ బయోలజీ మీకు సహకరించదు.4. బయోలాజికల్ రీ-ప్రోగ్రామింగ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ హార్మోన్లను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు?Step 1: శారీరక అడ్డంకులను బ్రేక్ చేయండిమీరు బద్ధకంతో ఉన్నప్పుడు "నేను సోమరిపోతుని" అని అనుకోవద్దు. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, నిద్ర లేవేమో అని విశ్లేషించండి. మీ బయోలాజికల్ సైకిల్ ని 'Break' చేసి, సరైన నిద్ర, ఆహారం వైపు అడుగు వేయండి.Step 2: హార్మోనల్ హ్యాకింగ్Dopamine Detox: సోషల్ మీడియా లైకుల ద్వారా వచ్చే తక్షణ డోపమైన్ని ఆపేసి, కష్టపడి ఏదైనా పని చేయడం ద్వారా వచ్చే డోపమైన్ని అలవాటు చేసుకోండి.Oxytocin Boost: తోటి మనుషులతో కనెక్ట్ అవ్వండి, ఇది మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది.Step 3: బయో-మాస్టరీఒక్కసారి మీ శరీరంలోని రసాయన శాస్త్రం మీకు అర్థమైతే, మీరు ఒక మాస్టర్ లా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో మీ హార్మోన్ల ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోగలరు.5. మీ హార్మోన్ల చెకప్ఈ రోజు మీరు ఈ చిన్న గమనికను గమనించండి.ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (ఉత్సాహమా లేక బద్ధకమా?) - ఇది మీ నిద్ర నాణ్యత మరియు డోపమైన్ లెవెల్స్ ని చెప్తుంది.సాయంత్రం వేళల్లో మీకు ఒత్తిడిగా అనిపిస్తుందా? - ఇది మీ కార్టిసాల్ లెవెల్స్ ని చూపిస్తుంది.మీరు ఫిజికల్ యాక్టివిటీ (వ్యాయామం) చేస్తున్నారా? - లేకపోతే మీ ఎండార్ఫిన్లు పని చేయడం లేదని అర్థం.మీ శరీరం మీ దేవాలయం!బ్రో, వ్యక్తిత్వం అంటే కేవలం మీ ఆలోచనలే కాదు, మీ శరీరం కూడా. మీరు మీ హార్మోన్లను పట్టించుకోకుండా, కేవలం మైండ్సెట్ మీద పనిచేస్తే అది పక్షవాతం ఉన్న వ్యక్తికి పరిగెత్తమని చెప్పినట్లే ఉంటుంది. మీ శరీరాన్ని సరిగ్గా చూసుకోండి, అప్పుడు మీ మైండ్ మీకు మద్దతు ఇస్తుంది."A healthy mind needs a healthy chemistry."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
C/O సుజాత టీ కొట్టు
‘‘ఉదయం ఆరు గంటలకు టీ కొట్టు దగ్గరకు వస్తాను. రోజంతా టీ కాస్తూనే ఉంటాను.. సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వెళతా. పదేళ్లుగా ఇదే నా పని. టీ కొట్టు మీద వచ్చిన ఆదాయంతో నేను, నా ఇద్దరు పిల్లలు బతుకుతున్నాం. ఈ ఆదాయంలోనే పిల్లలను చదివించుకుంటున్నా. మా అమ్మాయి కిందటేడాది నీట్లో మంచి ర్యాంకు సాధించింది. ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతోంది. మా అబ్బాయి సిద్దార్థ ఇంటర్ పూర్తి చేసి జేఈఈ చదివేందుకు సిద్దం అవుతున్నాడు.అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు..మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం తట్టుపల్లి గ్రామం మాది. మా దగ్గరి బంధువుల అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేశారు మా అమ్మనాన్నలు. ఉన్న ఊళ్లో కలిగిన దాంట్లో బాగానే ఉండేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. మేం చదువుకోలేదు. అందుకే, పిల్లలను బాగా చదివించాలనే ఆలోచనతో హైదరాబాద్కు వెళ్లాం. కానీ, మా ఆయనకు ఎక్కడా సరైన పని దొరకలేదు. ఆర్థిక భారం, అప్పులు మా ఆయన్ని కలిచి వేశాయి. దిక్కుతోచక ఓ రోజు క్షణంలో తీసుకున్న నిర్ణయం నన్ను, నా కుటుంబాన్ని ఒంటరిని చేసింది. భర్త తోడులేని ఆడది, ఇద్దరు పిల్లలతో పట్టణంలో ఎలా బతకాలనేది నా ముందు పెద్ద ప్రశ్నగా ఉండేది. పుట్టెడు దుఃఖంలో కూడా బిడ్డల భవిష్యత్పై మేం పెట్టుకున్న ఆశలు మదిలో మెదలుతూనే ఉండేవి. కానీ, పట్టణంలో బతకలేక ఊరి బాట పట్టాను.ఒంటరి పోరాటం.. ఊళ్లో కూలీ పనులకు పోయేదాన్ని. రోజులు గడిచిపోతున్నాయి. పిల్లల కడుపైతే నింపగలను కానీ, వారికి సరైన భవిష్యత్తును ఇవ్వగలనా.. అనేది పెద్ద సందేహంగా ఉండేది. అంతేకాదు, పిల్లలను బాగా చదివించాలని మా ఆయన, నేను పదే పదే అనుకునేవాళ్లం. ఆ మాటలు ఎప్పుడూ గుర్తుకువస్తుండేవి. పిల్లలను చదివించాలంటే మహబూబాబాద్లో ఉండాలనుకున్న. కానీ, అక్కడకెళ్లి ఎలా బతకాలి? టీ కొట్టు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంధువుల సహకారం, కొద్దిపాటి ΄÷దుపు మొత్తంతో మహబూబాబాద్లో చిన్న టీ కొట్టు పెట్టుకున్న. గత 10సంవత్సరాలుగా ఉదయం ఆరు గంటలకు రావడం. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లడం పనిగా పెట్టుకున్న. దీనిపై వచ్చిన డబ్బులతో మేం బతుకుతున్నం, పిల్లలనూ చదవిస్తున్న. నా ఒంటరి పోరాటాన్ని పిల్లలు అర్ధం చేసుకున్నారు. మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు అని వారికీ అర్ధమైంది. మా అమ్మాయి వైష్ణవి కిందటేడాది నీట్లో మంచి ర్యాంకు సాధించింది. ఎంబీబీఎస్ సీటు ΄÷ంది చదువుతోంది. కొడుకు సిద్దార్థ ఇంటర్ పూర్తి చేసి జేఈఈకు ప్రిపేర్ అవుతున్నడు. పిల్లలపై నా భర్త పెంచుకున్న ఆశలను నిజం చేయాలన్నదే నా తపన’ అంటూ వివరించింది సుజాత. టీ కొట్టు మీద వచ్చిన ఆదాయం ఇంటి కిరాయి, పోషణ, పిల్లల చదువుకు ఖర్చైపోతుంది. పిల్లలు వారి జీవితాల్లో వారు స్థిరపడాలంటే ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే తనకు ఎంతో అండగా ఉంటుందంటోంది సుజాత. – ఈరగాని బిక్షం, సాక్షి మహబూబాబాద్ఫొటోలు: మురళీ మోహన్ -
హోళీ..కలర్ఫుల్ టూర్ కోసం..!
యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.కృష్ణ జన్మభూమి వైభవంమధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్ డివోషనల్ ఆరాను క్రియేట్ చేస్తాయి.యమునా తీరంలో నిశ్శబ్ద వేదంవిశ్రామ్ ఘాట్ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. బ్రజ్ భూమిలో రంగుల ఋతువుమధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్ బ్యాక్గ్రౌండ్లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి. రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.‘రాధే రాధే’ అనే పలుకే మధురం...మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.చేయాల్సిన పనులుమధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్ హ్యాక్.వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.సందర్శనీయ స్థలాలుమధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేరు. బృందావన్ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.ఎలా వెళ్లాలి ?ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్ భూమిలో అడుగుపెడుతూనే ఆనందానుభూతిని కలిగిస్తుంది.ఎక్కడ ఉండాలి ?మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్లో తక్కువ ధరకే రూమ్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ వంటివి బుక్ చేసుకునే సమయంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. ఏం చూడాలి ? మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్ మందిరం, విశ్రామ్ ఘాట్, బృందావన్, గోవర్ధన్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్ లిస్ట్ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!) -
సంజూ సీక్రెట్.. ఆమెతో లవ్స్టోరీ! చారులత గురించి తెలుసా?
ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్ ఇవానియోస్ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. అయితే చారులత తన కెరీర్పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్పై ఫోకస్ పెట్టి కెరీర్లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..) -
జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..!
ఇంతవరకు చూసిన వెయిట్లాస్ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ప్రయత్నించాడో వివరించే వెయిట్లాస్ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. జిమ్, డైట్ పాటించకుండా ఆ టీనేజర్ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్ల తోపాటు బార్బెల్ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. మొదట్లో పుల్అప్బార్లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్అప్ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్తో ఇవాళ సుమారు 18 పుల్అప్లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్లాస్కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్లాస్ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!) -
పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!
వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడే సుమిత్ మిట్టల్ తన మొత్తం సక్సెస్ జర్నీని సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు. దాంతో కాల్సెంటర్లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్సెట్లో ఆల్ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్లో ఎంసీఏ చేసే రేంజ్కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్కు చేరుకున్నట్లు తెలిపాడు. చివరగా సుమిత్ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.Yes, I failed IIT JEE twiceYes, I failed in chemistry pre board examYes, my family faced financial crisisYes, I worked at a call centerYes, I completed my BCA from a distant collegeYes, I just started with teaching 4 students in a very small roomBut, I got AIR 4 in NIMCET… pic.twitter.com/OOasjxAVhm— Sumit Mittal (@bigdatasumit) February 24, 2026 (చదవండి: హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!) -
మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎందుకు?
చాలామంది "నాకు కోపం రాదు, కానీ ఎవరైనా తప్పు చేస్తేనే కోపం వస్తుంది" అని అంటుంటారు. ఇది నిజం కాదు. నిజానికి, ఎదుటివారు చేసే తప్పు మీ మెదడులో ఉన్న ఒక పాత గాయాన్ని లేదా ఒక భయాన్ని తాకడం వల్లే మీకు కోపం వస్తుంది. మన వ్యక్తిత్వాన్ని శాసించే ఈ 'ఎమోషనల్ ట్రిగ్గర్స్'ను మనం ఈరోజు డీకోడ్ చేద్దాం.1. The Anatomy of a Triggerట్రిగ్గర్ అనేది ఒక వ్యక్తి, ఒక మాట, ఒక శబ్దం లేదా ఒక సంఘటన. అది మన సబ్-కాన్షియస్ మైండ్లోని ఒక పాత బాధను లేదా అభద్రతా భావాన్ని వెలికితీస్తుంది.* ఉదాహరణకు ఆఫీసులో మీ బాస్ మీ పనిని విమర్శించారనుకోండి. మీకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు? అక్కడ ఆ పనిలోని తప్పు కంటే, మీ బాస్ మాట మిమ్మల్ని "నువ్వు అసమర్థుడివి" అని గుర్తుచేస్తోంది. ఆ 'అసమర్థత' అనే ఫీలింగ్ మీకు చిన్నప్పుడు స్కూల్ టీచర్ దగ్గర లేదా ఇంట్లో ఎదురై ఉండవచ్చు. అక్కడ బాస్ కాదు, మీలోని పాత గాయం ట్రిగ్గర్ అయ్యింది.2. ట్రిగ్గర్లను గుర్తించడం ఎలా?మనకు ట్రిగ్గర్ ఎప్పుడు అవుతుందో తెలియాలంటే, మన రియాక్షన్ను గమనించాలి.* Physical Signs: ట్రిగ్గర్ అయినప్పుడు ముందుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, దవడలు బిగుసుకుపోవడం లేదా కడుపులో కలత. ఇవి మొదలవ్వగానే, మీరు ఒక 'ట్రిగ్గర్ జోన్'లోకి వెళ్లారని అర్థం.* The Narrative: ఆ క్షణంలో మీ మైండ్ ఒక నెగటివ్ కథను అల్లుతుంది. "ఇతడు నన్ను తక్కువ చేస్తున్నాడు," "నాకు అన్యాయం జరుగుతోంది" అనే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే మిమ్మల్ని కోపంతో ఊగిపోయేలా చేస్తాయి.3. పది అంకెలు లెక్కపెడితే సరిపోదుమోటివేషనల్ స్పీకర్లు, ట్రైనర్స్... "కోపం వస్తే కళ్ళు మూసుకుని 10 వరకు లెక్కపెట్టు, అన్నీ మర్చిపో" అని చెప్తారు. ఇది కేవలం టెంపరరీ పరిష్కారం.కానీ మీలోని చీకటి కోణాలను (Shadows) మీరు అంగీకరించనంత వరకు ట్రిగ్గర్స్ మిమ్మల్ని శాసిస్తూనే ఉంటాయని సైకాలజీ చెప్తుంది. మీరు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తున్నారో, వారిలో మీకు నచ్చని లక్షణం మీలోనే ఎక్కడో దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.4. ట్రిగ్గర్స్ ని అధిగమించడంGenius Matrix Hub ఫిలాసఫీ Break, Build, Beyond ప్రకారం, మీ ఎమోషనల్ రిమోట్ ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి.Step 1: The Observer Stateట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఆ క్షణంలో "నేను ఈ కోపానికి బానిసను కాదు, ఇది నా పాత గాయం" అని మిమ్మల్ని మీరు గమనించండి (Observer mode). ఆ క్షణికావేశాన్ని 'Break' చేయడమే మీరు చేయాల్సిన మొదటి పని.Step 2: Trigger Rewiringమీ ట్రిగ్గర్ను ఒక లెసన్లా మార్చుకోండి. "ఈ వ్యక్తి నన్ను ఎందుకు బాధపెట్టాడు?" అని కాకుండా, "నాలో ఏ భయం ఈ వ్యక్తి మాటతో బయటపడింది?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ విశ్లేషణ మీలో ఎమోషనల్ స్ట్రెంత్ని 'Build' చేస్తుంది.Step 3: Emotional Freedom ఒక్కసారి మీ ట్రిగ్గర్స్ మీకు అర్థమైతే, ఎవరూ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. విమర్శలు చేసినా, అవమానించినా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇదే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ కు మాస్టర్ గా ఉంటారు.5. మీ ఎమోషనల్ మ్యాప్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.* ఈ వారం మీకు కోపం తెప్పించిన లేదా బాధపెట్టిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.* ఆ సమయంలో మీ మనసులో మొదట వచ్చిన ఆలోచన ఏంటి? (అది భయమా? అవమానమా? తక్కువగా చూస్తున్నారనే ఫీలింగా?)* ఆ భావన మీ చిన్నప్పుడు ఎక్కడ మొదలైందో ఒక్కసారి ఆలోచించండి.కోపం ఒక హెచ్చరిక, ఆయుధం కాదు!బ్రో, కోపం లేదా బాధ అనేది ఒక తప్పుడు రియాక్షన్ కాదు, అది ఒక హెచ్చరిక. "నీ మనసులో ఎక్కడో గాయం ఉంది, దాన్ని నయం చేయి" అని అది మీకు చెప్తోంది. ఆ హెచ్చరికను విని, ఆ గాయాన్ని నయం చేసుకోండి.గుర్తుంచుకోండి, "Between stimulus and response there is a space. In that space is our power and our freedom." (Victor Frankl). ఆ స్పేస్లో మీరు గెలిస్తే, మీ వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది.-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
చీకటి – వెలుగులు
సాఫ్ట్వేర్ రంగంలో ‘నైట్ డ్యూటీ’ అనే మాట వింటూనే ఉంటాం. బతుకు పోరాటంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లను ఊడ్చే మహిళా స్వీపర్లూ రాత్రిపూటే విధులను నిర్వర్తిస్తుంటారు. సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్ స్టేషన్ పరిసరాలలో రాత్రి రెండు గంటల సమయంలో రోడ్లను ఊడుస్తూ కనిపించింది కంతి రాణి. కాసేపు ఆమెతో మాట కలిపితే ఒంటిచేత్తో బతుకుబండిని ఎలా లాక్కొస్తుందో ఇలా మన ముందు ఆవిష్కరించింది..‘‘కష్టాలు వచ్చాయని ఆగిపోతమా? చావో బతుకో తేల్చుకోవాలి. రాత్రిపూట రోడ్లమీద పని అంటే మాకు భయమే ఉంటుంది. కానీ, బతుకు భయం అంతకన్నా పెద్దది. అందుకే, ధైర్యంగానే ఈ పని చేస్తుంటాం. రాత్రి ఏడు గంటలకు డ్యూటీలో చేరితే, మళ్లా తెల్లారి ఐదున్నర అయితది డ్యూటీ దిగేసరికి. ఇంటికి చేరేసరికి ఏడు గంటలు. రాత్రంగా రోడ్లు ఊడ్చి ఊడ్చి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాం. అందుకని, ముందుగా స్నానం చేసి, ఇంటి పనులు చేసుకొని, ఇంట్ల వాళ్లకు ఇంత వండిæపెట్టి, నేను తిని, పగటేల పన్నెండు గంటలకు పడుకుంట. మళ్లా సాయంకాలం ఐదు గంటలకు లేచి, పనులు చేసుకొని, ఏడు గంటలకు డ్యూటీకి పోత. పదహారేళ్లుగా ఇదే నా పని.. ఒంటి చేతి కష్టమే!మా ఊరు జనగాం దగ్గర వెలిగొండ. చిన్నతనంలోనే మా అమ్మనాయన నాకు పెండ్లి చేశారు. మా అమ్మనాయనకు ముగ్గురు ఆడపిల్లలం, ఓ మగపిల్లాడు. నా భర్త పేరు జక్రయ్య. మా నాయిన సొంత అక్క కొడుకు. చిన్నప్పుడు బావిలో పడి, ఓ కాలు పనిచేయదు. ‘కాలు సరిగా పనిచేయని వాడిని ఎవరూ పెండ్లి చేసుకోరు’ అని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండు మా నాయిన. నా పెళ్లి నాటికి నాకు పదిహేనేండ్లు కూడా లేవు. ఊళ్లో కొన్నాళ్లు ఉన్నం. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రు. బతుకుదెరువు కష్టమైతే హైదరాబాద్ వచ్చినం. మొదట హౌజింగ్ బోర్డ్ ఏరియా లో ఉండేవాళ్లం. అక్కడే ఉప్పర్ పనికి పోయిన, ఇండ్లల్ల పనిచేసిన. మా ఆయన పనికెళితే, పడిపోయేటోడు. దీంతో నేనే ఆయన్ని ఇంట్లో ఉంచి, పిల్లలను స్కూల్కు పంపించి, పనికి పోయేదాన్ని. ఆ తర్వాత తెలిసినవాళ్ల ద్వారా స్వీపర్ పనిలో చేరిన. అప్పుడు యాప్రాల్లోని బాలాజీ నగర్కి వచ్చి, ఇల్లు తీసుకొని ఉన్నం. పిల్లలను పదోతరగతి వరకు చదివించిన. ఆ తర్వాత పెండ్లిండ్లు చేసిన. అన్నీ ఒంటి చేత్తోనే. కలిగిన దాంట్లో సాయం...మా అక్కచెల్లెళ్ల లో ఒక చెల్లెలికి, భర్త చనిపోయి మస్తు కష్టపడుతుంది. తమ్మునికి ముగ్గురు ఆడపిల్లలు. తమ్ముడికి ఆరోగ్యం బాలేక చనిపోయాడు. దీంతో మా మరదలు పిల్లలను పెంచడానికి మా లెక్కనే కష్టపడుతుంటది. అందుకని నాకు కలిగినదాంట్లో వాళ్లకు సాయం చేస్తుంటాను. పిల్లల పెండ్లిండ్లకు అప్పు అయ్యింది, మెల్లగా తీర్చుకుంటున్న. పండగలొస్తే మహా కష్టం..బోనాలు, వినాయక చవితి, జెండా పండగల సమయాలలో, పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు .. చాలా పని ఉంటది. ఎంతంటే... మాపని ఘోరం అని చెప్పచ్చు. గుడుల దగ్గర, స్టేషన్, ట్యాంక్బండ్.. వేరే వేరే చోట్లల్లా డ్యూటీ ఉంటుంది. ఆ రోజుల్లో చెత్త చానా ఎక్కువ ఉంటుంది. ఊడ్చి ఊడ్చి చేయి రెక్కలు బాగా నొప్పి పెడతాయి. ప్రాణాలు అరచేతిలోనే..యాక్సిడెంట్లు అవుతుంటాయి. అర్థరాత్రి దాటిందంటే ట్రాఫిక్ ఉండదు కదా! బండ్లు, వ్యానులు మస్తు స్పీడ్గా పోతుంటయి. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా, ఊడుస్తుండగా యాక్సిడెంట్లు అయినయి. మా గ్రూప్లోనే నలుగురైదుగురు చనిపోయారు. పానాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తుంటాం. ఇది కాకుండా తాగినోళ్లు ఉంటారు. తాగి, రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్లు ఉంటారు. వాళ్లను జరగమంటే.. ఆ మత్తులో గలీజు మాటలు అనేటోళ్లు ఉంటారు. తిడుతుంటరు. మీద మీదకు వస్తుంటరు. పోలీసులు ఉంటారు. కానీ, రోజూ వాళ్లకు ఎన్నని చెబుతం. అందుకే, అలాంటోళ్ల నుంచి దూరంగా ఉంటూ మా పని మేం చేసుకుంటూ పోతుంటం. బతుకుదెరువు కోసం తప్పదు, అన్నీ భరిస్తాం. మా గ్రూప్లో పదిహేను మంది దాకా ఉంటాం. అందరివీ సమస్యలే. నెలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అంతకు మించి ఒక్కరోజు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతది. నెలంతా ఊడ్చితే పదివేల రూపాయల దాకా వస్తాయి. అందులోనే అన్నీ సర్దుకుంటాం. ఇప్పుడంటే నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. చిన్న చిన్న పిల్లలున్న తల్లుల కష్టం ఇంకా పెద్దది.ఒకరికి ఒకరం... మా గ్రూప్ వాళ్లం కలిసినప్పుడు ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుంటాం. కానీ, ఎవరి కష్టాలు వారివే. ఊడ్చి ఊడ్చి మెడలు గుంజుతాయి. మళ్లీ ఇంటికొచ్చి పనులు చేసుకోవాలి. ఈ పనిలో చేరిన కొత్తలో చేతనైంత కాలం పని చేసుకోవచ్చు అన్నారు. కానీ, అరవై ఏళ్లు దాటినవాళ్లు పని నుంచి దిగిపోయారు. వాళ్లకు పెన్షన్ ఏమీ లేదు. కానీ, వాళ్ల ఇంట్ల బిడ్డకో, కొడుకుకో మళ్లీ స్వీపర్ పని ఇస్తరు’ అంటూ రాత్రిళ్లు రోడ్లు ఊడ్చే పనుల్లోని చీకట్లను, బతుకులో నింపుకుంటున్న వెలుగును పంచుకుంది రాణి. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం
రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.కుటుంబం మీదే ఎందుకు?ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.కుటుంబానికి విముక్తి ఎలా? 1. Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.2. Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.3. ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.4. "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.5. కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.మీ కోసం ఒక చిన్న పరీక్ష...ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"కెరీర్లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.సైకాలజిస్ విశేష్కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
కట్టుకున్నవాళ్లనే కడతేర్చే కర్కశత్వానికి రీజన్ అదేనా..!
నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఇలాంటి హత్యోదంతాలు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు చినికి చినికి గాలివానగా మారి హత్యలకు దారితీస్తున్నాయి. కలకాలం కలిసిమెలిసి బతుకుతామని ప్రమాణం చేసిన వారే, కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు శత్రువులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఒక మేనియాగా మారింది. మద్యం, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల మాదిరిగా ఈ మహమ్మారి నిండుజీవితాలను కబళిస్తోంది. సామాజిక మాధ్యమ వేదికలపై ఏర్పడే పరిచయాలు, సరికొత్త ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలకు ఇవి వాహకాలుగా పనిచేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిన భార్యాభర్తలు క్రమంగా భావోద్వేగాలు పంచుకోలేక క్రమంగా ఆ బంధానికి దూరమవుతున్నారు. దీంతో ఆ స్థానంలోకి కొత్త వ్యక్తులు చేరుతున్నారని, దాంపత్య జీవితాల్లో కల్లోలం మొదలవుతుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత చెబుతున్నారు. ‘నేను, నా సుఖ సంతోషాలు, నా ఆనందం, నేను కోరుకున్న, నాకు ఇష్టమైన జీవితం.. అనే భావన ఒక నార్సిస్ట్ ధోరణికి దారితీస్తోంది. ఈ తరహా మానసిక ప్రవర్తన కారణంగానే కొత్త వ్యక్తులకు దగ్గరై సొంత మనుషులను దూరం చేసుకుంటున్నారని, అవసరమైతే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదని చెప్పారు. అస్తిత్వ పోరాటం.. మరోవైపు ఈ ప్రవృత్తి ఉన్నవారిలో ఐడెంటిటీ క్రైసిస్ భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. ఇతరులు తమను గుర్తించాలనే సంక్షోభంలో కొట్టుకుపోతున్నారు. ‘నిరంతరం తాము ఇతరులను ఆకర్షించాలని కోరుకుంటారు. తమను చూసినప్పుడు ఎదుటివారిలో ఎగ్జైట్మెంట్ కలగాలని భావిస్తారు. సోషల్ మీడియాలోని ఫాంటసీ కంటెంట్, థ్రిల్లర్ కంటెంట్ అలాంటి భ్రమలను సృష్టిస్తాయి. దీంతో కొత్త వ్యక్తులకు దగ్గరైన కొద్దీ సొంతవాళ్లకు దూరమవుతున్నారు.’ అని మరో మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఒక రహస్య జీవితానికి అవకాశం కల్పిస్తోంది. ఆ రహస్య జీవితంలోపడి చాలా దూరమే కొట్టుకుపోతున్నారు. ఇది క్రమంగా హింసా ప్రవృత్తికి దారితీస్తుందని పేర్కొన్నారు. ‘రెడ్ఫ్లాగ్స్’ ధోరణి.. వివాహేతర సంబంధాలతో రహస్య జీవితానికి అలవాటుపడిన వాళ్లు కుటుంబం నుంచి విడిపోయేందుకు ‘రెడ్ఫ్లాగ్స్’ ధోరణిని అనుసరిస్తారు. అంటే తమ రహస్య జీవితంలోకి ఇతరులు ప్రవేశిస్తారేమోనన్న అభద్రతా భావంతో భార్యాభర్తలు ఒకరినొకరు దూరం పెట్టేస్తారు. చివరకు తమ వస్తువులను తాకినా, ఫోన్ ముట్టుకున్నా భరించలేరు. ఒకరిపై మరొకరికి ద్వేషం పెరుగుతుంది. ఎలా అయినా వాళ్ల నుంచి దూరం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలనే మానసిక నిపుణులు ‘రెడ్ఫ్లాగ్స్’గా పరిగణిస్తున్నారు. నచ్చిన చాక్లెట్ తిన్నట్లుగా, నచ్చిన సినిమా చూసినట్లుగా ‘ఐ నో వాట్ ఐ వాంట్’ అనే భ్రమలో ఎలాంటి దుస్సాహసానికైనా తెగిస్తున్నారు. కట్టుకున్నవారిని కడతేర్చడం ద్వారా ఫ్రీడమ్ లభిస్తుందనే భావనతో జీవితకాల శిక్షను అనుభవిస్తున్నారు. పెళ్లి కాంట్రాక్ట్ కాదు.. భార్యాభర్తల బంధాల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిని ఒక కాంట్రాక్ట్గా భావించే స్వభావం వల్లనే ఇలాంటి పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. అనైతిక సంబంధాలను సమర్థించే విధంగా వస్తున్న సినిమాలు, రీల్స్, వెబ్సిరీస్లు సమాజాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథం కొరవడుతోంది. మితిమీరిన అహం వల్ల హత్యలకు పాల్పడుతున్నారు. – మమతా రఘువీర్, సామాజిక కార్యకర్త సానుకూల దృక్పథం ఉండాలి.. నార్సిస్ట్ ప్రవృత్తి తొలగిపోవాలంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలిని, చక్కటి సాంస్కృతిక, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా పాటించవలసిన ధర్మాన్ని, బాధ్యతలను గుర్తించాలి. మొదట అన్ని రకాల సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి, పెడధోరణుల నుంచి బయటపడేందుకు సొంతవాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. కానీ అడిక్ట్ కావొద్దు. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ (చదవండి: తరచుగా కళ్లను రుద్దితో..డార్క్ సర్కిల్స్ వస్తాయా..?) -
తరచుగా కళ్లను రుద్దితో..డార్క్ సర్కిల్స్ వస్తాయా..?
నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నేను ఉద్యోగం వల్ల రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సి వస్తోంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్తో పాటు స్వల్పంగా వాపు కూడా వస్తోంది. అలాగే నాకు అలర్జీ సమస్య ఉంది. తరచుగా కళ్లను రుద్దుకుంటూ ఉంటాను.కవిత, విశాఖపట్నంఈ రోజుల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్, వాపు చాలామందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య. ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అంటే ఆ భాగంలో చర్మం రంగు మారడం, నీడలా కనిపించడం లేదా లోతుగా కనిపించడం వల్ల ముఖం అలసినట్టు లేదా వయస్సు ఎక్కువగా ఉన్నట్టు అనిపించడం. ఇవి సాధారణంగా ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా అనేక కారణాల కలయిక వల్ల వస్తాయి. మీ విషయంలో రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, మొబైల్, ఇతర స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం వంటి జీవనశైలి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా అలర్జీ సమస్య ఉండటం, తరచుగా కళ్లను రుద్దుకోవడం కూడా డార్క్ సర్కిల్స్ను పెంచుతాయి. ముక్కు అలర్జీ లేదా సైనస్ సమస్యల వల్ల కళ్ల చుట్టూ రక్తప్రసరణ మారి నీలం లేదా ఊదా రంగులో వలయాలు కనిపించవచ్చు. తరచు రుద్దుకోవడం వల్ల చర్మంలో మెలనిన్ పెరిగి గోధుమరంగు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కొందరిలో కుటుంబ చరిత్ర, చర్మం పలుచగా ఉండటం లేదా కళ్లు లోతుగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజెన్ తగ్గి చర్మం వదులుగా మారుతుంది. దాంతో లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించి కళ్ల కింద నీలి ఛాయ పెరుగుతుంది.కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు. కొందరిలో గోధుమరంగు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో చర్మం పలుచగా ఉండడం వల్ల నీలం లేదా ఊదా రంగు రక్తనాళాలు కనిపిస్తాయి. మరికొందరిలో కంటి కింద లోతు ఉండటం వల్ల నీడలా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొవ్వు నిల్వ కావడం వల్ల వాపు లేదా బ్యాగ్స్ రూపంలో కనిపిస్తుంది. చాలా మందిలో ఇవన్నీ కలిసిన రూపం ఉంటుంది. అందుకే సరైన చికిత్స కోసం ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఈ పరీక్షల్లో చర్మం రంగు, లోతు, వాపు, అలర్జీ లక్షణాలు వంటి అంశాలను పరిశీలిస్తాం. అవసరమైతే హీమోగ్లోబిన్, ఐరన్, విటమిన్ బి12, థైరాయిడ్ పరీక్షలు కూడా సూచిస్తాం. అయితే, చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేయటం అవసరం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట అవసరం లేకుండా మేల్కొని ఉండకూడదు. కళ్లను రుద్దుకోవడం మానుకోవాలి. అలర్జీకి సరైన చికిత్స తీసుకోవాలి. చల్లని కంప్రెషన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, సమతుల్యాహారం తీసుకోవడం వల్ల మంచి మెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ సమస్య ఎక్కువగా ఉంటే పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్సలు సూచిస్తాం. సన్స్క్రీన్, విటమిన్ సి, తక్కువ శక్తి గల రెటినాయిడ్ను రాత్రిపూట వాడటం, కొజిక్ లేదా అజెలాయిక్ ఆమ్లం వంటి పిగ్మెంటేషన్ తగ్గించే క్రీములు ఉపయోగించడం చేస్తాం. అవసరమైన సందర్భాల్లో కెమికల్ పీల్స్ చేస్తాం. లోతు ఎక్కువగా ఉన్నవారిలో హయాలురోనిక్ ఆమ్ల ఫిల్లర్లు లేదా పీఆర్పీ చికిత్స ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే లేజర్ చికిత్సలు, రక్తనాళాలు స్పష్టంగా ఉంటే ప్రత్యేక లేజర్ విధానాలు, చర్మం వదులుగా ఉంటే చర్మాన్ని గట్టిపరచే చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు మాత్రమే పూర్తిగా సరిపోవు. స్టెరాయిడ్ కలిగిన ఫెయిర్నెస్ క్రీములను తప్పకుండా నివారించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఒకే ఒక్క వ్యాధి కాదు, అనేక కారణాల సంకేతం. పూర్తిగా మాయం కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోయినా, సరైన నిర్ధారణతో వ్యక్తిగతంగా అనుకూలమైన చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. డా. ఇందిర పవన్ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ (చదవండి: స్మార్ట్ ఫోన్లు వద్దు..ల్యాండ్లైన్ ఫోన్లే ముద్దు..!: పేరెంట్స్) -
స్మార్ట్ ఫోన్లు వద్దు..ల్యాండ్లైన్ ఫోన్లే ముద్దు..!: పేరెంట్స్
ప్రస్తుతం తల్లిదండ్రులకు ఈ జెనరేషన్ పిల్లలను పెంచడం బహుకష్టం. ఎందుకంటే స్మార్ట్ఫోన్లకు చిన్నప్పటి నుంచి అడిక్ట్ అయిపోతున్నారు ఈ తరం పిల్లలు. జస్ట్ మూడేళ్ల పిల్లలే స్మార్ట్ఫోన్ అంటూ పేచీలు, మారాంలు..అది ఇస్తే గానీ కుదురుగా ఉండరు. పైగా సాంకేతిక ప్రభావం చిన్నప్పటి నుంచి వారిపై ఉండటంతో సరిగా చదువుతారనే బెంగ ఎక్కువైపోతోంది తల్లిదండ్రుల్లో. పైగా రీల్స్ పిచ్చిలో..ఇన్ఫ్లుయెన్స్ర్ అవుతాననే అంటున్నారు తప్ప..ఇదివరకటి పిల్లల్లా ఇంజనీర్, డాక్టర్ అని చెప్పడం లేదు. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు అమెరికాలోని తల్లిదండ్రులు ఎలాంటి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారో తెలుసా..!?..అదేంటో తెలిస్తే కంగుతింటారు. చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా అమెరికాలో చాలా కుటుంబాలు తిరిగి ల్యాండ్లైన్ టెలిఫోన్లను ఇన్స్టాల్ చేస్తున్నాయట. సోషల్మీడియాఎక్స్పోజర్, ఆన్లైన్ భద్రత, పట్ల తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ధోరణి ఎక్కువైంది అక్కడ. కొన్ని కుటుంబాలు పిల్లల్లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అందిపుచ్చుకోవడానికి ఈ ల్యాంఢ్లైన్ టెలిఫోన్ మంచివని, యాప్లు, ఇంటర్నెట్ వంటి వాటి సాయం లేకుండా మంచిగా నేర్చుకోగలరని ప్రగాఢంగా నమ్ముతున్నారట. ఇలా అయితేనే పరధ్యానం లేకుండాం మంచి సంభాషణా చాతుర్యం పెరుగుతుందంటున్నారు. ఈ ఫోన్లు కాన్ఫిడెన్స్గా మాట్లాడగలరిని, తల్లిదండ్రలులు అంటున్నారు. అంతేగాదు ఈ ల్యాండ్లైన్ ఫోన్ ద్వారానే మర్యాదగా సంభాషించడం, సమాధానం ఇవ్వడం తెలుసుకోగలరని, ఎవరితోనైనా మాట్లాడటానికి జంకరని చెబుతుండటం విశేషం. అదీగాక ఈ ల్యాండ్లైన్ ఫోన్ల వల్ల సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వరు, బాధ్యతయుతమైన డిజిటల్ ఉపయోగం ఎలా అనేది కూడా తెలుసుకుంటారని అంటున్నారు. అంతేగాదు అక్కడ సైకాలజిస్టులు సైతం తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు ఉపయోగకరమైన మీడియా ప్లాన్ రూపొందిచాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతుండటం విశేషం. పైగా ఈ ధోరణిని భద్రత తోపాటు మంచి అర్థవంతమైన కమ్యూనికేషన్ పిల్లలలో ఉండాలని ఆకాంక్షిస్తూ చేస్తున్న వినూత్న ప్రయోగమని అక్కడి నిపుణులు సైతం దీనికి మద్దతు తెలుపుతున్నారట. మరి ఇదెంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే కదూ..!.(చదవండి: బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!) -
పిల్లలకు భిక్షం వెయ్యని కుబేరులు!
ఆస్తులు పంచడం పాత పద్ధతి. ఆశయాలు పంచడం కొత్త ఒరవడి. పిల్లలకి ఆస్తులు ఇస్తే వాళ్లు సోమరిపోతులు అవుతారని, అదే, కష్టపడే తత్వాన్ని ఇస్తే ప్రపంచాన్నే జయిస్తారని నమ్మిన కొందరు బిలియనీర్ తల్లిదండ్రులు తమ సంపదను సంతానానికి కాకుండా, సమాజానికి రాసిచ్చేస్తున్నారు! ‘‘మీ బతుకు మీరు బతకండి’’ అని పిల్లలకు చేయూతకు బదులుగా ‘చెయ్యి’స్తున్నారు.అమ్మానాన్న కోటీశ్వరులైతే ఇక వాళ్ల పిల్లల లైఫ్ (వాళ్లింకా లైఫ్లోకి అడుగుపెట్టక ముందే) సెటిలైపోయినట్లే. కాని, కొంతమంది సెలబ్రిటీ కుబేరుల కథ ఇందుకు భిన్నంగా ఉంది. కోట్ల ఆస్తులున్నా.. కష్టపడితేనే డబ్బు విలువ తెలుస్తుందని, సామాన్యుల్లాగే తమ పిల్లలు కూడా జీవించాలని వారి ఆకాంక్ష. అందుకే, ఆస్తులన్నీ ట్రస్టులకో, మంచి పనులకో రాసిచ్చేసి.. ‘వారసత్వ ఆస్తి’ అనే పాత పద్ధతికి నీళ్లొదులుతున్నారు. ఈ జాబితాలో బిల్ గేట్స్, జాకీ చాన్, మెకెంజీ స్కాట్ వంటి మహామహులు ఉన్నారు.ఒక్క డాలరూ ఇవ్వలేదు!బిల్ గేట్స్ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ బాస్. వరల్డ్ నెంబర్ వన్ రిచ్ డాడ్! ఆయన, మాజీ భార్య మెలిందా కలిసి టెక్ ప్రపంచాన్నే సమృద్ధం చేశారు. మరి వీళ్ల ముగ్గురు పిల్లల (కొడుకు, ఇద్దరు కూతుళ్లు) భవిష్యత్తు ఇంకెంత సమృద్ధిగా ఉండాలి? కానీ, అలా ఏం లేదు! రూ. 8,78,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా.. వారత్వంగా ఒక్క డాలరు కూడా ఇచ్చేది లేదని పిల్లలకి వాళ్ల చిన్నప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. ఆ డబ్బును ప్రపంచంలోని పేదరికాన్ని, రోగాల్ని తరిమికొట్టేందుకు ఉదారంగా ఇచ్చేస్తున్నారు. అలాగని మరీ ఖాళీ చేతులు చూపకుండా ముగ్గురు పిల్లలకీ తలా రూ.3 కోట్లు పాకెట్ మనీ రాసిచ్చారు! ‘‘పిల్లలకి కొండంత ఆస్తిని ఇచ్చేయటం వాళ్లకు చేసే మేలు కాదు.. అది వాళ్ల సొంత ఎదుగుదలకి అడ్డుగోడ అవుతుంది’’ – బిల్ గేట్స్ఆస్తి మొత్తం చారిటీకే!వారెన్ బఫెట్ పేరు వింటేనే ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం గౌరవంతో లేచి నిలుచుంటుంది. సుమారు రూ. 13,37,430 కోట్ల ఆస్తి ఉన్నా, ఈయన లైఫ్ స్టెయిల్ మాత్రం బొత్తిగా మిడిల్ క్లాస్లో ఉంటుంది. 1958లో కేవలం 31,500 డాలర్లకు (రూపాయలలో ఆనాటి ధర రూ. 1 లక్షా 50 వేలు) కొన్న పాత ఇంట్లోనే ఇప్పటికీ ఆయన నివసిస్తున్నారంటే ఆయన సింప్లిసిటీ ఎంత ‘ఆడంబరంగా’ ఉందో అర్థం చేసుకోండి. తన ముగ్గురు పిల్లలకి (ఇద్దరు కొడుకులు, ఒక కూతురు) తలో రూ. 200 కోట్లు ఇచ్చేసి, మిగిలిన 99 శాతం ఆస్తిని చారిటీకి రాసిచ్చేస్తానని ఆయన ఎప్పుడో చెప్పేశారు. ‘‘నేను బతికున్నప్పుడైనా, చనిపోయాకైనా సంపద అంతా సమాజానికే’’ అని ప్రకటించారు. ‘‘నా పిల్లలకి ఇప్పటికే కావాల్సినంత ఇచ్చాను. వాళ్ల లైఫ్ వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ అదనపు కోట్లు నాకెందుకు?’’ – వారెన్ బఫెట్ బాండ్ పేల్చిన బాంబ్సినిమాల్లో మాదిరిగానే ఖరీదైన కార్లు, అదిరిపోయే సూట్లు వేసుకుని తిరిగే ‘జేమ్స్ బాండ్’ డేనియల్ క్రెయిగ్, తన పిల్లలకి (ఇద్దరూ కూతుళ్లే) మాత్రం తన ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదని గన్షాట్గా చెప్పేస్తున్నారు. సుమారు రూ. 1,450 కోట్ల ఆస్తి ఉన్నా సరే, ‘‘నేను పోయేలోపు నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసేస్తా.. లేదంటే దానం చేసేస్తా’’ అని వారసులపైనే బాంబు పేల్చారు మన బాండ్. కనుక ఆయన కూతుళ్లిద్దరికీ ఈ భారీ ఆస్తి దక్కే అవకాశం లేదు. పిల్లలు తమ సొంత కాళ్ల మీద నిలబడి సక్సెస్ అవ్వాలన్నదే క్రెయిగ్ తాపత్రయం. అందుకు తగ్గట్లుగానే ఆయన కూతురు ఎల్లా అప్పుడే మోడలింగ్లో తన మార్క్ చూపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్డ్ మోడల్స్ ఏజెన్సీలో చేరి, పెద్ద పెద్ద ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీల మీద మెరిసిపోతోంది. ‘‘నాన్న నాకు బాట వేయకపోయినా.. నా దారి నేనే వేసుకుంటున్నా’’ అంటోంది. ‘‘వారసత్వంగా యావదాస్తినీ ముందే ఇచ్చేయటం నాకు నచ్చదు. వెళ్లేటప్పుడే అంతా ఇచ్చేయాలి లేదా అసలే ఇవ్వకుండా మానేయాలి’’ – డేనియల్ క్రెయిగ్కష్టపడితేనే కిక్కు‘స్టింగ్’ అనగానే మ్యూజిక్ అభిమానులకు ‘ఎవ్రీ బ్రీత్ యూ టేక్’ లాంటి అదిరిపోయే సాంగ్స్ గుర్తొస్తాయి. ఆయన అసలు పేరు మేథ్యూ థామస్ సమ్మర్. సుమారు రూ. 4,987 కోట్ల ఆస్తి వెనకేసిన ఈ మ్యూజిక్ లెజెండ్ వెనుక కనాకష్టంగా సాగిన ఒక గతం ఉంది. సెలబ్రిటీ అవ్వకముందు ఈయన బస్సు కండక్టర్గా, కూలీగా, ట్యాక్స్ క్లర్క్గా, టీచర్గా... ఇలా రకరకాల పనులు చేశారు. తన ఆరుగురు పిల్లలకి (నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు) కూడా కష్టమంటే ఏమిటో తెలియాలని వారసత్వంగా ఒక్క డాలర్ కూడా ఇవ్వకూడదని తీర్మానించుకున్నారు. సంతోషం ఏమిటంటే, స్టింగ్ పిల్లలు కూడా తండ్రి దగ్గర చేయి చాచకుండా, తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. కూతురు మిక్కీ నటిగా రాణిస్తుంటే, కొడుకులు ఇలియట్, జో తండ్రి బాటలోనే మ్యూజిక్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ‘‘కష్టపడితేనే సక్సెస్లో కిక్కు ఉంటుంది’’ అని అంటున్న ఈ ఫ్యామిలీ ఎంతైనా ‘రాకింగ్’ కదా!‘‘మా పిల్లలకి ముందే చెప్పేశా.. నేను చనిపోయే నాటికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలదని. ఎందుకంటే ఉన్నదంతా నేనే ఖర్చు పెట్టేస్తున్నానని. అలాగే, వాళ్ల భుజాలపై ట్రస్ట్ ఫండ్స్ అనే భారాన్ని వేయడం నాకు ఇష్టం లేదు’’– ‘స్టింగ్’నాకు ప్రపంచం ముఖ్యంసుమారు రూ.5,14,600 కోట్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న జుకర్బర్గ్, తన భార్య ప్రిసిల్లా చాన్తో కలిసి ఒక భారీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో తన మొదటి కూతురు మాక్స్ పుట్టినప్పుడే.. ‘‘మా దగ్గర ఉన్న ఫేస్బుక్ షేర్లలో 99 శాతం (సుమారు రూ. 3,75,000 కోట్లు) విరాళంగా ఇచ్చేస్తాం’’ అని ప్రకటించారు. జుకర్బర్గ్ ఫిలాసఫీ కొంచెం ఎమోషనల్, కొంచెం టెక్నికల్! ‘‘మా పిల్లలు (ముగ్గురూ కూతుళ్లే) ఎదిగే లోపు ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్గా మార్చాలి’’ అన్నది ఆయన తాపత్రయం. అందుకే ‘చాన్–జుకర్బర్గ్ ఇనీషియేటివ్’ ద్వారా 2100 కల్లా ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలకి చెక్ పెట్టాలని ఈ దంపతులు కంకణం కట్టుకున్నారు. తన కూతురికి రాసిన ఓపెన్ లెటర్లో జుకర్బర్గ్ ఒక మాట చెప్పారు: ‘‘మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీకు మాత్రమే కాదు.. రేపటి తరం పిల్లలందరికీ ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వడం మా బాధ్యత కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని. ‘‘మా పిల్లలకి వేల కోట్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును సెటిల్ చేయడం కంటే, అందరికీ సమానమైన అవకాశాలు ఉన్న ప్రపంచాన్ని సృష్టించటమే మా ధ్యేయం’’? – జుకర్బర్గ్ఎవరి దారి వారే వేసుకోవాలిమార్షల్ ఆర్ట్స్ కింగ్.. జాకీ చాన్. ‘రష్ అవర్’, ‘కరాటే కిడ్’ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఈ లెజెండ్ దగ్గర సుమారు రూ. 3,627 కోట్ల ఆస్తి ఉంది. కానీ, ఈ కుంగ్ఫూ మాస్టర్ తన పిల్లలకు (కూతురు, కొడుకు) చిల్లి డాలర్ కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 2011లోనే జాకీ చాన్ ఒక సంచలన ప్రకటన చేశారు: ‘‘నా ఆస్తిలో నా కొడుక్కి ఒక్క డాలర్ కూడా ఇవ్వను! దమ్మున్నవాడు తన దారి తనే వెతుక్కుంటాడు’’ అన్నారు. అందుకే తన ఆస్తినంతా చారిటీకే ఇచ్చేస్తున్నారు. ‘‘వాడికి (కొడుకు) గనుక సత్తా ఉంటే, వాడే సొంతంగా సంపాదించుకుంటాడు. ఒకవేళ వాడికి ఆ సత్తా లేకపోతే.. నేను ఇచ్చే డబ్బుని కూడా వాడు వృథాగా తగలేస్తాడు!’ – జాకీ చాన్ఇచ్చేదే లేదు..‘యాపిల్’ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కన్నుమూశాక, ఆ భారీ ఆస్తి అంతా ఆయన భార్య లారె¯Œ కు దక్కింది. ప్రస్తుతం సుమారు రూ. 1,21,498 కోట్ల ఆస్తిపరురాలు ఆమె. కానీ, లారెన్ మాత్రం ఆ కోట్లను దాచుకోవడం కంటే, సమాజానికి పంచడానికే మొగ్గు చూపుతున్నారు. ‘ఎమర్సన్ కలెక్టివ్’ అనే సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల మీద పోరాడటానికి ఏకంగా రూ. 29,050 కోట్లను కేటాయించారు. అయితే, తన ముగ్గురు (ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు) పిల్లలకి ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు... ఇవ్వకూడదని! ‘‘నా భర్తకి ఆస్తులు కూడబెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ వారసత్వ ఆస్తుల మీద నాకు కూడా ఆసక్తి లేదు. ఆ విషయం నా పిల్లలకి కూడా తెలుసు. ఒకవేళ నేను సరిపడా కాలం బతికితే గనుక.. ఈ ఆస్తి ప్రవాహం నా దగ్గరే ఆగిపోతుంది. నా తర్వాతి తరానికి దీన్ని మోసుకెళ్లనివ్వను’’ – లారెన్ పావెల్ జాబ్స్చిన్న చిన్న సంస్థలకు ఇస్తా..లాకర్ ఖాళీ అయ్యే వరకు ఇచ్చేస్తూనే ఉంటా అంటున్నారు మెకెంజీ స్కాట్. జెఫ్ బెజోస్తో విడాకుల తర్వాత అమెజాన్ షేర్లలో పాతిక శాతం మెకెంజీకి దక్కాయి. ఆ లెక్కన చూస్తే ఈమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ సుమారు రూ.2,80,170 కోట్లు. ఆమెకు నలుగురు పిల్లలు (ముగ్గురు కొడుకులు, ఒక కూతురు) ఉన్నా, వాళ్లకు వారసత్వంగా ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి! 2019లో జెఫ్ బెజోస్కు విడాకులు అవ్వగానే ఆమె ఒక లెటర్ రాశారు. ‘‘నా దగ్గర అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉంది. ఆ డబ్బుని అందరితో పంచుకుంటాను. నా దగ్గర ఉన్న లాకర్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు నేను దానిని ఇచ్చేస్తూనే ఉంటా..’’ అని ఆ లెటర్ సారాంశం. 2021లోనే ఆమె దాదాపు రూ. 24,843 కోట్లను ఎవరూ పట్టించుకోని చిన్న చిన్న సంస్థలకు దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు.‘‘పిల్లలకి గుట్టల కొద్దీ ఆస్తిని దాచిపెట్టడం కంటే, ఆ డబ్బుతో సమాజంలోని లోటుపాట్లను సరిదిద్దడమే నాకు ముఖ్యం’’ – మెకెంజీ స్కాట్ మొత్తానికి ఈ కుబేరులందరూ చెప్పే నీతి ఒక్కటే, ‘పిల్లలకి ఆస్తిని ఇవ్వడం కంటే, ఆ ఆస్తిని సంపాదించే తెలివితేటల్ని ఇవ్వడమే అసలైన గిఫ్ట్!’ అని. నిజమే కదా, వారసత్వం అనేది బ్యాంక్ అకౌంట్లోంచి ఏటీఎం ద్వారా ప్రవహించకూడదు. కష్టించి పని చేసే గుణంగా సంక్రమించాలి. సాక్షి స్పెషల్ డెస్క్ (చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్డోస్లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్స్టిక్లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!
ఒకప్పుడు పిల్లలు ‘పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను’ అనేవారు, కానీ నేడు ‘ఇన్ఫ్లూయెన్సర్ అవుతాను’ అంటున్నారు. చదువును పక్కన పెట్టి, గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ, నిరంతరం రీల్స్ షూటింగులతో బిజీగా ఉంటున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం అలవాటు కాదు, ఒక తీవ్రమైన మానసిక పరిణామం. చేతిలో స్మార్ట్ఫోన్, కళ్ళల్లో రీల్స్ కలలు ఉన్న టీనేజర్లను సరిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు.మెదడులో డోపమైన్ యుద్ధంటీనేజర్ల మెదడులో ‘ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్’ (నిర్ణయాలు తీసుకునే భాగం) పూర్తిగా అభివృద్ధి చెందదు. కాని, ఆనందాన్ని వెతికే ‘రివార్డ్ సిస్టమ్’ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా వీడియో గేమ్స్ ‘వేరియబుల్ రివార్డ్స్’ సూత్రంపై పనిచేస్తాయి. స్వైప్ చేసిన ప్రతిసారి, తర్వాతి వీడియోలో ఏముందో తెలియని ఆ కుతూహలం మెదడులో డోపమైన్ను విడుదల చేస్తుంది. చదువులో ఫలితం రావడానికి ఏడాది పడుతుంది కాని, రీల్కు లైక్స్ రావడానికి సెకన్లు చాలు. అందుకే ఈ ‘తక్షణ తృప్తి’ కోసం మళ్లీ మళ్లీ రీల్స్ చూస్తుంటారు, చేస్తుంటారు. చదువు వర్సెస్ వైరల్ ఫేమ్చాలామంది టీనేజర్లు చదువు మానేసి రీల్స్ చేయడం వెనుక ‘గుర్తింపు కాంక్ష’ ఉంటుంది. కాని, పదివేల మంది ఫాలోవర్లు ఉండటం వల్ల జీవితం సెటిల్ అయిపోదు. సోషల్ మీడియా అల్గారిథమ్స్ మారగానే ఆ గుర్తింపు కనుమరుగవుతుంది.నిరంతరం షూటింగులు, ఎడిటింగ్ ఆలోచనలతో ఉండటం వల్ల మెదడు ‘హైపర్–యాక్టివ్’ స్థితిలో ఉంటుంది. ఫలితంగా, నిశ్శబ్దంగా కూర్చుని చదువుకోవడం వారికి అసాధ్యంగా మారుతుంది.చదువును నిర్లక్ష్యం చేస్తూ, కేవలం ‘వైరల్’ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీనేజర్లను డీల్ చేయడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. వారిని మొండితనం వైపు నెట్టకుండా, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడానికి ఉపయోగపడే ఐదు కౌన్సెలింగ్ చిట్కాలు మీకోసం.1. ‘వై నాట్’కి బదులుగా ‘హౌ’పిల్లలు రీల్స్ చేస్తామంటే ‘వద్దు, చేయకూడదు’ అని మొండిగా చెప్పకండి. అది వారిని తిరుగుబాటు వైపు నెడుతుంది. ‘నువ్వు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకోవడం మంచిదే కాని, ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ కావాలంటే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్క్రిప్ట్ రైటింగ్, అనలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అవి నీకు చదువు ద్వారానే వస్తాయి’ అని వారితో ఒక ప్రొఫెషనల్లాగా మాట్లాడండి. చదువును వారి ఎదుగుదలకు ఒక అడ్డంకిగా కాకుండా, ఒక సాధనంగా చూపించండి.2. ‘ఇన్స్టంట్ ఫేమ్’ వర్సెస్ ‘లాంగ్ టర్మ్ సెక్యూరిటీ’ టీనేజర్లకు భవిష్యత్తు గురించి స్పష్టత ఉండదు. అందుకే క్లాసులో వచ్చే మొదటి ర్యాంక్ కంటే రీల్స్కు వచ్చే లైక్స్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ‘ఈ రోజు వైరల్ అయిన వీడియో రేపు ఉండదు. కాని, నువ్వు సంపాదించే డిగ్రీ లేదా నైపుణ్యం జీవితాంతం నీకు అన్నం పెడుతుంది’ అని సోషల్ మీడియా వెనుక ఉన్న ‘షెల్ఫ్ లైఫ్’ గురించి వివరించండి. ముఖ్యంగా ఫేడౌట్ అయిపోయిన పాత ఇన్ఫ్లూయెన్సర్ల ఉదాహరణలు చెప్పండి.3. ‘ప్రొడక్షన్ టైమ్’ ఫిక్స్ చేయండిపిల్లలు చదువు మధ్యలో రీల్స్ షూటింగ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. వారానికి ఒక రోజు, రెండు గంటలు మాత్రమే షూటింగ్ సమయంగా కేటాయించండి. మిగిలిన ఆరు రోజులు చదువుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నీ చదువు గ్రాఫ్ పడిపోతే, ఈ షూటింగ్ టైమ్ రద్దవుతుంది’ అనే పాజిటివ్ కండిషన్ పెట్టండి.4. అకడమిక్ రివార్డ్ సిస్టమ్వారికి నచ్చిన రీల్స్ చేసే హక్కును వారు ‘సంపాదించుకోవాలి’. ఉదాహరణకు ఒక చాప్టర్ పూర్తి చేస్తే 15 నిమిషాల ఎడిటింగ్ టైమ్. వీక్లీ టెస్ట్లో మంచి మార్కులు వస్తే, ఒక కొత్త రీల్ షూట్ చేసుకునే అవకాశం. ఇలా చేయడం వల్ల వారు చదువును ఒక శిక్షలా కాకుండా, తమకు నచ్చిన పనిని చేయడానికి ఒక మార్గంగా చూస్తారు.5. డిజిటల్ ఐడెంటిటీని గౌరవించండిపిల్లలకు గుర్తింపు కావాలి. ఇంట్లో ఆ గుర్తింపు దొరకనప్పుడు వారు బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తారు. అందుకే రీల్స్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తించండి. వారిని ఒక ‘క్రియేటర్’గా గౌరవిస్తూనే, ఒక ‘స్టూడెంట్’గా బాధ్యతలను గుర్తు చేయండి.నైవర్ మైండ్..!ప్రతిరోజూ మన మెదడులో దాదాపు 50 వేల నుంచి 70 వేల ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. వీటిలో సుమారు 60 నుంచి 70 శాతం ప్రతికూలమైన ఆలోచనలే! కాబట్టి పరీక్షల సమయంలో తలెత్తే ప్రతికూల ఆలోచనలను పెద్దగా పట్టించుకోకండి. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! లోపాలను దాచొద్దు..) -
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎత్తైన దిండ్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే
దిండు లేకుండా నిద్ర పోవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గి గ్లాకోమా తీవ్రత తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి దారితీసే కారణాలలో గ్లాకోమా ఒకటి. దీనికి ప్రధాన కారణం కంటిలో ఉండే అధిక ఒత్తిడి దృష్టి నరాన్ని దెబ్బతీయడం. ఎత్తైన దిండ్లు లేదా ఒకటి కంటే ఎక్కువ దిండ్లను వాడటం వల్ల మెడలోని జుగులార్ వెయిన్పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి ద్రవం సరిగ్గా బయటకు వెళ్లలేక, కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి దృష్టి నరాన్ని (ఆప్టిక్ నెర్వ్)ప్రభావితం చేస్తుంది. ఇది గ్లాకోమా రావడానికి కారణం అవుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో ప్రచురించిన ప్రకారం, ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 144 మంది గ్లాకోమా రోగులను పరీక్షించారు. కూర్చున్నప్పుడు, రెండు దిండ్లతో పడుకున్నప్పుడు, దిండు లేకుండా పడుకున్నప్పుడు వారి కంటి లోపల ఉండే ఒత్తిడిని ప్రతి రెండు గంటలకు ఒకసారి 24 గంటల΄ాటు పరిశీలించారు. దిండ్లతో తల ఎత్తుగా పెట్టి పడుకున్నప్పుడు, దాదాపు మూడింట రెండు వంతుల మంది రోగులలో కంటిలో ఒత్తిడి పెరిగినట్లు వారు గమనించారు. యువకులు, ప్రైమరీ ఓపెన్–యాంగిల్ గ్లాకోమా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు ప్రాథమికమైనవే అయినప్పటికీ, గ్లాకోమా ఉన్నవారు తాము నిద్రించే విధానంలో జాగ్రత్త వహించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. -
కోపానికి టాటా చెప్పేద్దాం!
కోపం వలన గుండె సంబంధిత జబ్బులు రావచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. చిన్నపాటి కోపమైనా సరే అది రక్తనాళాలను ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవన శైలి వలన ఇప్పటికే పలు రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. సీటులో నుంచి కదలకుండా ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వలన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చే కోపం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.కేవలం ఎనిమిది నిమిషాల పాటు ఉండే కోపం అనే భావోద్వేగం వల్ల రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోతుంది. అంతే కాదు కేవలం 8 నిమిషాల పాటు వచ్చే కోపం వలన దాని ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని గుర్తించారు. దీనితో పాటు ఎక్కువ కోపంగా ఉండటం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.పరిశోధనలో అసలేం తెలుసుకున్నారు?అమెరికాలోని వివిధ సంస్థల నిపుణులు చేసిన పరిశోధనలో దాదాపు 300 మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్దవయస్సు వారిని ఎనిమిది నిమిషాల పాటు కోపంగా ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతూ అధ్యయనం చేశారు. దీని ద్వారా వారు పొందిన ఫలితాలను బట్టి ఈ అధ్యయనం చేశారు. అయితే, విచారం లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు గుండె ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే...బాగా కోపం వచ్చినప్పుడు లోతుగా డీప్ బ్రీత్ తీసుకోవడం లేదా 10 వరకు అంకెలు లెక్కపెట్టడం బెటర్. కోపం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి.రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి.రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ధ్యానం లేదా యోగా రెగ్యులర్గా చేయడం అలవాటు చేసుకోవాలి. మీ కొలెస్ట్రాల్ లెవల్స్ మేనేజ్ చేసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. చదవండి: ముప్పై ఏళ్లకే ఎముకలు గుల్లబారుతున్నాయి -
Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్
Yoga రోజూ ఎకువసేపు కూర్చుని పనిచేసేవారిని క్రమంగా నడుం నొప్పులు వెంటాడుతుంటాయి. ఈ నొప్పి నుంచి ఉపశమనం అందించే ఆసనాల్లో సాధన చేయదగిన ముఖ్యమైన శ్రేణిలో నిలిచే ఆసనం ఉత్కటాసనం. ‘ఉత్కట’ అంటే శక్తిమంతమైన/తీవ్రమైన అని అర్థం. ఈ ఆసనం శరీరానికి బలాన్ని, స్థైర్యాన్నీ ఇస్తుంది.ఉత్కటాసనం ప్రయోజనాలు...కాళ్ల కండరాలు, తొడలు కండరాలు బలపడతాయి. రక్తప్రసరణ, శ్వాసక్రియ మెరుగుపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరిగి అధికబరువు సమస్య తగ్గు ముఖం పడుతుంది. కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పొట్ట భాగం, వెన్నెముకకు సపోర్ట్ పెరుగుతుంది. బ్యాలెన్స్– స్టెబిలిటీ మెరుగు పడుతుంది. శరీర సమతుల్యత పెంపొందుతుంది. మెటబాలిజం ఉత్తేమవు తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగు పడుతుంది, శరీరానికి ఉత్సాహం వస్తుంది. మనసుకు ఏకాగ్రత ఫోకస్ పెరుగుతాయి.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియోజాగ్రత్తలు...మోకాళ్ల నొప్పి/ వెన్నునొప్పి / డిస్క్ సమస్య ఉన్నవారు డాక్టర్ లేదా యోగా గురువు పర్యవేక్షణలో చేయాలి. బీపీ లేదా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. మోకాళ్లు పాదాల వేళ్లకు ముందుకు వెళ్లకూడదు. వెన్నెముక నిటారుగా ఉంచాలి – వంగిపోవద్దు. గర్భిణులు తప్పనిసరిగా గైడెన్స్తో మాత్రమే చేయాలి. ∙మొదట 10–20 సెకండ్లు హోల్డ్ చేయండి. తర్వాత 3–5 రిపిటేషన్స్ చేయాలి. శ్వాస నెమ్మదిగా, సమంగా ఉంచాలి. - పాతర్ల అనిత, యోగా ట్రైనర్ ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?శక్తిని ఇచ్చే ఉత్కటాసనం చేసే విధానం..ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. కుర్చీలో కూర్చున్నట్టు మోకాళ్లను ముడుచుకుని కిందకు వంగాలి. మోకాళ్లు ముందుకు పడకుండా జాగ్రత్త పడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ స్థితిలో పొట్ట భాగాన్ని లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. దృష్టి నాసికా పుటాలపై లేదా ముందు ఉన్న ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ∙5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. -
ముసుగు వెయ్యొద్దు మనసు మీద..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది తమలో ఉన్న లోపాలన్నింటినీ కప్పెట్టేసి, ఒక పర్ఫెక్ట్ ముసుగు వేసుకోవడం అనుకుంటారు. "నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండాలి", "నాకు అసలు భయం వేయకూడదు" అని తమకు తాము అబద్ధాలు చెప్పుకుంటారు.కానీ సైకాలజీ ప్రకారం, మీలోని లోపాన్ని మీరు అంగీకరించనంత కాలం, దాన్ని మీరు మార్చలేరు. అంగీకారం (Acceptance) అనేది బలహీనత కాదు, అది మార్పుకు అవసరమైన అసలైన ధైర్యం.అంగీకారమే మార్పుకు ద్వారంకార్ల్ రోజర్స్ తన 'Client-Centered Therapy'లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మనం మనలోని ఏదైనా ఒక నెగటివ్ లక్షణాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని అసహ్యించుకుంటున్నంత కాలం, మన మెదడు ఆ లక్షణాన్ని డిఫెన్స్ మోడ్లో రక్షిస్తుంది. ఉదాహరణకు, అతిగా కోపం రావడం లేదా అసూయ పడటం.కానీ, "అవును, ప్రస్తుతం నాలో ఈ కోపం ఉంది" అని మీరు ఎప్పుడైతే నిజాయితీగా అంగీకరిస్తారో, అప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళన (Anxiety) తగ్గుతుంది. ఆ ప్రశాంతతలోనే మార్పు సాధ్యమవుతుంది.ముసుగుల భారంసో-కాల్డ్ ట్రైనర్లు మిమ్మల్ని ఎప్పుడూ "నటన" చేయమని ప్రోత్సహిస్తారు. "నీ బలహీనతలను ఎవరికీ చూపించకు, పులిలా గర్జించు, లోపల ఏమున్నా బయటకు మాత్రం తోపులా కనిపించు" అని చెప్తారు.ఇది మీలో 'Incongruence' (అంతర్ఘర్షణ) పెంచుతుంది. బయట మీరు గొప్పగా నటిస్తున్నా, లోపల మీ 'Real Self' కు అది అబద్ధం అని తెలుసు. ఈ అబద్ధం మీ సెల్ఫ్-ఎస్టీమ్ (Self-esteem) ని దెబ్బతీస్తుంది. నిజమైన వికాసం అంటే లోపాలను దాచడం కాదు, వాటిని అంగీకరించి, బాధ్యత తీసుకోవడం.అంగీకారం అంటే రాజీ పడటం కాదు"నన్ను నేను ఇలాగే ఒప్పుకుంటే ఇక నేను ఎప్పటికీ మారలేనేమో?" అని చాలామందికి అనుమానం ఉంటుందిResignation (నిరాశ): "నేను ఇంతే, నా జీవితం మారదు" అని వదిలేయడం బలహీనత.Acceptance (అంగీకారం): "ప్రస్తుతానికి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నా వాస్తవం. ఇక్కడి నుండి నేను ఎలా ముందుకు వెళ్ళాలి?" అని ఆలోచించడం బలం.ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. "నాకు భయం లేదు" అని నటించడం కంటే, "అవును, నాకు స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉంది.. ఈ భయాన్ని జయించడానికి నేను ఏం చేయాలి?" అనడం నిజమైన పర్సనాలిటీ గ్రోత్.అంగీకార ప్రక్రియGenius Matrix మోడల్ ఉపయోగించి మనల్ని మనం ఎలా అంగీకరించాలో చూద్దాం.Step 1: అవమానాన్ని బద్దలు కొట్టండిమన లోపాలను ఒప్పుకోవడానికి మనకు అడ్డుపడేది 'సిగ్గు' (Shame). "నాలో ఈ లోపం ఉందని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు?" అనే భయాన్ని 'Break' చేయండి. మీ లోపాలు మిమ్మల్ని తక్కువ మనిషిని చేయవు, అవి మిమ్మల్ని ఒక 'మనిషి'గా చూపిస్తాయి.Step 2: నిజాయితీ గల పునాదిమీ బలహీనతలను ఒక పేపర్ మీద రాయండి. వాటిని చూసి బాధపడకండి. "అవును, ఇవి నాలో ఉన్నాయి" అని గట్టిగా చదవండి. ఎప్పుడైతే మీరు వాటిని వెలుగులోకి తెస్తారో, వాటికి మిమ్మల్ని భయపెట్టే శక్తి పోతుంది. ఇక్కడే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది 'Build' అవుతుంది.Step 3: పరిపూర్ణతకు ఆవలపరిపూర్ణత (Perfection) అనేది ఒక భ్రమ. మనం మనుషులం, దేవుళ్ళం కాదు. మన లోపాలను అంగీకరిస్తూనే, వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.మీతో మీరు సంధి చేసుకోండిఈ రోజు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ చిన్న పని చేయండి.మీలో మీకు నచ్చని మూడు విషయాలను గుర్తించండి. ఉదా: బద్ధకం, అసూయ, ఫిజికల్ అప్పియరెన్స్.ఆ మూడు విషయాల వైపు చూస్తూ.. "నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను" అని మనసులో అనుకోండి.ఈ అంగీకారం తర్వాత మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి.గాయాలే మీ గుర్తులు!బ్రో, ఒక పగిలిన కప్పును బంగారంతో అతికించినప్పుడు (Kintsugi Art), అది మామూలు కప్పు కంటే ఎక్కువ విలువను, అందాన్ని పొందుతుంది. మన లోపాలు కూడా అంతే. వాటిని దాచకండి, వాటిని అంగీకరించి గౌరవించండి. అప్పుడే మీరు మీ Real Personality ని ప్రపంచానికి చూపగలరు.గుర్తుంచుకోండి, "You can't heal what you don't reveal."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Inner Critic: మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!) -
ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి
మహిళల ఆరోగ్యంలో ఎముకల క్షీణత (ఆస్టియో పోరోసిస్) ఒక ప్రధాన సంక్షోభంగా మారుతోంది. ఒకప్పుడు మెనోపాజ్ దాటిన మహిళల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి నేడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ప్రీ–మెనోపాజల్ ఆస్టియో పోరోసిస్గా పిలిచే ఈ ఎముకల బలహీనత గత దశాబ్దంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్లకే...ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను (బోన్ డెన్సిటీ) 25 నుంచి 30 ఏళ్ల మధ్యే సాధిస్తుంది. ఒకసారి 30 ఏళ్లు దాటాక, కొత్త ఎముక ఏర్పడే వేగం కంటే పాత ఎముక అరిగి పోయే వేగం పెరుగుతుంది.80%భారతదేశంలో సుమారు 6.1 కోట్ల మంది ఆస్టియో పోరోసిస్తో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 80% మంది మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశం.20–25%పట్టణ ప్రాంతాల్లో నివసించే 30 ఏళ్ల పైబడిన మహిళల్లో సుమారు 20% నుంచి 25% మందికి ఆస్టియో పీనియా (ఎముకలు పల్చబడటం – ఇది ఆస్టియో పోరోసిస్కు ముందు దశ) ఉన్నట్లు గుర్తించారు.70–80%∙భారతదేశంలోని మెట్రో నగరాల్లో 30 ఏళ్ల మహిళల్లో దాదాపు 70% నుంచి 80% మంది విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.50 ఏళ్లు∙50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఎముక విరుపునకు గురవుతున్నారు.15%∙ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను 30 ఏళ్ల నాటికి చేరుకోవాల్సి ఉన్నా.. సరైన పోషకాహారం లేక పోవడం వల్ల 15% మంది మహిళలు అసలు గరిష్ట సాంద్రతను చేరుకోవడంలో విఫలమవుతున్నారు, దీనివల్ల వీరికి 45 ఏళ్లకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోంది.20%∙మెనోపాజ్ ప్రారంభమైన మొదటి 5 నుంచి 7 ఏళ్లలోనే మహిళలు తమ శరీరంలోని మొత్తం ఎముక ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతున్నారు.2040∙ప్రస్తు్తతం 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు, తమ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, 2040 నాటికి దేశంలో హిప్ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.21.2%∙ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 21.2% మందికి ఆస్టియో పోరోసిస్ ఉందిముందు జాగ్రత్తలే ముఖ్యం∙ప్రతిరోజూ శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, రాగులు వంటివి తీసుకోవాలి ∙రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు సహజమైన ఎండ తగిలేలా చూసుకోవాలి ∙కేవలం నడక సరి పోదు, ఎముకలపై ఒత్తిడి కలిగించే వెయిట్–బేరింగ్ వ్యాయామాలు, యోగా ఉండేట్లు చూసుకోవాలి ∙50 ఏళ్లు దాటిన మహిళలు, ప్రమాద సూచనలు ఉన్నవారు తప్పనిసరిగా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి.ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం కేవలం వృద్ధాప్యంలోనే కాదు, యవ్వనం నుంచే ప్రారంభమవడం ఎంతో ముఖ్యం. అందుకోసం తగిన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
పరిశోధనల్లో దారి దీపాలు
‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.సైన్స్లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తితోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనే మాటకుకాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. సైన్స్ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...శాస్త్రరంగంలో ‘షా’జీఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్ కంట్రోల్ సెంటర్ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్ మిషన్’కు అధ్యయన డైరెక్టర్గా, రిసోర్సెస్–2 ఏకి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్ ‘ఆత్య–ఎల్1’కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా సేవలందించడం ఆమె కెరీర్లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజినీరింగ్లపై రచనలు చేశారు.ఆకాశదేశాన...చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్.సైంటిఫిక్ ఫిలాసఫీకంప్యుటేషనల్ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్ లెర్నింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) తొలి మహిళా డైరెక్టర్గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్’ విభాగంలో ఇన్ఫోసిస్ ప్రైజ్, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్లు గెల్చుకున్నారు. .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.అప్పుడే మహిళల పురోగతిగౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో బయో–ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్వారి ప్రోత్సాహమే నా బలంసైన్స్ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నా కెరీర్ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.– డాక్టర్ సుధా కళ్యాణి, సీనియర్ మేనేజర్ అండ్ హెడ్, లైఫ్ సైన్స్ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్ పార్క్కాదంబిని గంగూలీకలకత్తా మెడికల్ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్గా చరిత్ర సృష్టించారు.మేరీ పూనెన్ లూకోస్భారతదేశంలో తొలి మహిళా సర్జన్ జనరల్ మేరీ పూనెన్ లూకోస్. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.ఆనందీ బాయి జోషిపాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.జానకీ అమ్మాల్ఎడవలత్ కక్కట్ జానకి అమ్మాల్ ప్రసిద్ధ బోటనిస్ట్. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్లోని సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ తొలి డైరెక్టర్ (1952)కమలా సోహోనీకమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళ.అసిమా ఛటర్జీఅసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్లో డాక్టరేట్ పొందిన తొలి మహిళ.కమల్ జయసింగ్ రణదివేకమల్ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో తొలిసారిగా టిష్యూ కల్చర్ రిసెర్చ్ ల్యాబ్ని ప్రారంభించారు.బీబా చౌదరిభారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.పూర్ణిమా సిన్హాభౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.అన్నా మణిఅన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్ ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్కు సంబంధించి విశేష కృషి చేశారు. -
టూత్పిక్తో టవర్ నిర్మించి రికార్డు సృష్టించాడు..!
ఒక రంగంపై మంచి ఆసక్తి ఎంతటి అనితరసాధ్యమైనదైనా సాధించేలా చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ యువకుడు. అతడికి ఇంజనీరింగ్ పట్ల ఉన్న మక్కువ ఏకంగా అత్యంత అల్పమైన టూత్పిక్లతో టవర్ నిర్మించేలా చేసి, గిన్నిస్ రికార్డులకెక్కేలా చేసింది. ఆ కుర్రాడు ఎవరంటే..యునైటెడ్ స్టేట్స్లోని ఇల్లినాయిస్లోని నేపర్విల్లేకు చెందిన ఎరిక్ కేబుల్ అనే యువకుడు ఇంజనీరింగ్ పట్ల తనకున్న ప్రేమను రికార్డు క్రియేట్ చేసే విజయంగా మార్చుకున్నాడు. నెలల తరబడి టూత్పిక్లు జిగురు మాత్రమే ఉపయోగించి 17 అడుగుల ఎత్తైన టవర్ని నిర్మించాడు. ఈ నిర్మాణం ఎత్తు 5.28 మీటర్లు. ఇది పూర్తిగా టూత్పిక్తో నిర్మించిన ఎత్తైన భవనంగా నిలిచి..గిన్నిస్ రికార్డులకెక్కింది.ఆ యువకుడు ప్రసిద్ధ ఈఫెల్ టవర్ని ప్రేరణగా తీసుకుని ఈ ఎత్తైన టవర్ని నిర్మించినట్లు తెలిపాడు. ఆ యువకుడు ఎరిక్ 2020లో పాప్సికల్ స్టిక్స్తో ఎత్తైన టవర్ని నిర్మించి రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా ఇప్పుడు ఈ టూత్పిక్లతో తన రికార్డుని తానే బ్రేక్ చేశాడు. చిన్న వయసులో రికార్డులు సృష్టించడం ఒక థ్రిల్లింగ్ అనుభవం అని, అందుకే మళ్లీ మళ్లీ అలాంటిదే చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంటుందంటున్నాడు ఎరిక్. అయితే ఈసారి మరింత కఠినతరమైనది నిర్మించాలనే ఛాలెంజ్ తీసుకున్నానని అన్నాడు. ఆ నేథ్యంలో ఇలా టూత్పిక్లు ఎంచుకున్నానట్లు తెలిపాడు. ఇవే ఎందుకంటే పాప్సికల్ స్టిక్స్ అంత బలంగా ఉండదు కాబట్టి వీటితే నిర్మిస్తేనే కథ అసలైన టాలెంట్, కిక్ అని అంటున్నాడు ఎరిక్. ముందుగా చిన్న చిన్న నిర్మాణాలను నిర్మించడం సాధన చేసి..ఆ తర్వాత పెద్ద టవర్ని నిర్మించేందుకు ఉపక్రమించానని అంటున్నాడు. ఆ టవర్ లోపలి ప్రత్యేక విభాగాలను ఇంటివద్ద నిర్మించి ఆ తర్వాత నేపర్విల్లేలోని ఒక బహిరంగ కార్యక్రమంలో దాన్ని నిర్మించినట్లు వివరించాడు. STEM (స్టెమ్) అనే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కలయికతో కూడిన ప్రతిష్టాత్మక కోర్సుపై ఉన్న మక్కువ వల్లే రికార్డు స్థాయిలో ఈ టూత్పిక్ టవర్ని నిర్మించాడు. (చదవండి: రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!) -
ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్
లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించాయి.కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ రాయల్ లుక్లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్ వివాహంలో వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్, సాంప్రదాయ హరామ్లు, స్టేట్మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్, చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు. ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్తో రూపొందించారట. విజయ్ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒక దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers) తీర్చిదిద్దింది.పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టిన్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation) దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.దేవతలా రష్మిక మందన్నవివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్ను క్రియేట్ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో కళకళలాడుతూ అలరించారు. -
రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!
టాలీవుడ్ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్ వేర్లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్తో డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ సైతం బంగారు థ్రెడ్వర్క్తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్లైన్ నుంచి లేయర్డ్ ఆభరణాలు, చోకర్లు ఆ చీర లుక్ని మరింత హైలెట్ చేశాయి.అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్ వేర్ ఐవరీ ధోతీ సిల్హౌట్ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్ చేశాయి.(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..)


