breaking news
Lifestyle
-
ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!
దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశలోని సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్ని భోపాల్కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.An MP IAS officer Sanskriti Jain, Collector Seoni,was given a unique farewell by her staff. Unheard of before.Many officers hv been popular during their postings owing to people-oriented works & honesty, yet this was something new.Let more officers be like her.@IASassociation pic.twitter.com/wsebdt9ELw— Abhilash Khandekar (@Abhikhandekar1) October 5, 2025 (చదవండి: డిజిటల్ డిటాక్స్లో ఉండగా ..వరించిన నోబెల్ బహుమతి! ట్విస్ట్ ఏంటంటే..) -
నోబెల్ వరించిన విషయం తెలియకుండానే..
కొన్ని సమయాల్లో ఊహకందని విధంగా అంతర్జాతీయ స్థాయి రేంజ్లో బహుమతి వరించినా..అది ఆ వ్యక్తికి తెలియకపోతే.. ఔను..! ఆ వ్యక్తి తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే..అదృష్టం వచ్చి ఒళ్లో వాలినా..తెలుసుకోలేకపోవడం అంటే..అంతకుమించిన దురదృష్టం మరొకటి ఉండదేమో కదూ. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ శాస్త్రవేత్త. చివరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. పైగా తనకు ఈ బహుమతి వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ శాస్త్రవేత్తే అమెరికాకు చెందని ఇమ్యునాలజిస్ట్ ఫ్రెడ్ రామ్స్డెల్. అతను డిజిటల్ డిటాక్స్ కోసం తన భార్యతో కలిసి అడవిలో సేద తీరుతున్నాడు. అలా అక్కడి పరిసరాలతో మమేకమవుతుండగా భార్య ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసింది. అది చూసి రామ్స్డెల్ అడివిలో ఉండే ఎలుగుబంటులను చూసి భయపడింది కాబోలు అనుకున్నాడు. తర్వాత ఆమె అసలు విషయం చెప్పడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అస్సలు ఇది ఊహించలేదంటూ రామ్స్డెల్ సంబరపడ్డట్లు నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్లమాన్ పేర్కొన్నారు. అమెరికాలోని మోంటాన పర్వత శ్రేణుల్లో ఎంజాయ్ చేస్తున్నా ఆ జంట ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్కు చేరుకుని నేరుగా న్యూయార్క్ టైమ్స్తో కాసేపు ముచ్చటించారు. తాను కచ్చితంగా నోబెల్ బహుమతి గెలుచుకుంటానని అస్సలు అనుకోలేదని, అస్సలు తాను పరిశోధన చేసిన విషయాన్నే మర్చిపోయానంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు రామ్స్డెల్. ఇక రామ్స్ డెల్కి రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై చేసిన ఆవిష్కరణలకు గానూ ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని రామ్స్డెల్ సీటెల్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన మేరీ బ్రంకో, జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన షిమోన్ సకాగుచిలతో పంచుకున్నారు. అంటే ఈముగ్గురికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ 11కోట్లు పైనే) నగదు లభిస్తుంది. కాగా రామ్స్డెల్ రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించే టీ కణాలకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతిని పొందారు. ఇక్కడ టీ కణాలు అనేవి ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు. ఇది శరీరంపై దాడి చేసే సూక్ష్మ జీవులను గుర్తించడానికి, లేదా కేన్సర్ కణాలను చంపడానికి సహాయపడతాయట. వాటిని తరుచుగా సెక్యూరిటీ గార్డ్లుగా వ్యవహరిస్తారు పరిశోధకులు. ఇక నోబెల్ కమిటీ సెక్రటరీ పెర్లమాన్ మిగతా ఇద్దరు పరిశోధకులు టచ్లో ఉన్నారని, కానీ ఈ 65 ఏళ్ల రామ్స్డెల్ని సంప్రదించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆయన తన ఫోన్ని ఏరోప్లేన్ మోడ్లో ఉంచడంతో సంప్రదించడం కష్టమైందని, అందువల్ల ఆయన భార్యకు సమాచారం అందించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇలా నోబెల్బహుమతి గెలుచుకున్న విజేతలను సంప్రదించడంలో ప్రతిసారి తమకు చాలా నిరాశ ఎదురవ్వుతోందని కమిటీ వాపోయింది. గతంలో సంగీతకారుడు బాబ్ డిలన్ విషయంలో రోజుల తరబడి సమయం పట్టిందని, మరొకరు ఈ బహుతిని గెలుచుకున్న రోజుల వ్యవధిలో మరణించారని నోబెల్ కమిటీ వెల్లడించింది.డిజిటల్ డిటాక్స్ అంటే..డిజిటల్ పరికరాల (స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివి) అన్నింటికి ఉద్దేశపూర్వకంగా విరామం ఇచ్చి..తోటి వ్యక్తులతో, పరిసరాలతో కనెక్ట్ అవ్వడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇది ఒత్తిడిని, నిద్ర సమస్యలను దూరం చేయడమే గాక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. (చదవండి: సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..) -
తొలి కార్పొరేట్ లైబ్రరీ..15 వేలకు పైగా పుస్తకాలు..
పఠనాసక్తి ఉన్న వారి కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంటాయని తెలుసు. అలాంటి వారికి సిటీలో గ్రంథాలయాలు ఎక్కడా అని భూతద్ధం పెట్టి వెతకాల్సిన పనిలేదు. వాటిని వేళ్లమీదే లెక్కబెట్టొచ్చు. వాస్తవానికి నగరంలో గ్రంథాలయాలు అరకొరా ఉన్నా.. ఆ లైబ్రరీలో ఉండే వసతులు నామమాత్రమే అని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఓ కార్పొరేట్ కంపెనీ అత్యాధునిక లైబ్రరీని నగరవాసుల కోసం అందుబాటులోకి తెచ్చిది. ఏమాత్రం లాభాపేక్ష, వ్యాపార కోణం లేకుండా పూర్తి అధునాతన వసతులతో సిటీలో ఓ లైబ్రరీ.. మంగళవారం ప్రారంభమైంది. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోని టాప్ 10లో ఒకటిగానే కాకుండా 7వ స్థానంలో నిలిచిన సంస్థ కోఫోర్జ్. ఈ కార్పొరేట్ సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ లైబ్రరీని నగరంలోని కొత్తగూడ జంక్షన్లో ప్రణవ్ బిజినెస్ పార్క్, 8వ ఫ్లోర్లో ఏర్పాటు చేసింది. గత సంవత్సరం ఫిబ్రవరి 2024లో నోయిడాలో మొదటి కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ తర్వాత రెండోది గురుగ్రామ్లో ప్రారంభించామని, ఇవి వేలాది సందర్శకుల రాకపోకలతో సందడిగా మారాయని, ఈ నేపథ్యంలో నగరంలో 3వ అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేశామని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. విశాలమైన..విశేషాల్లో మిన్న.. ఈ లైబ్రరీ పఠనాభిలాషులు ఎవరైనా సరే రావచ్చు. లోనికి ప్రవేశించిన తర్వాత ఒకసారి డిజిటల్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఆ తర్వాత కేవలం సైన్ ఇన్ అయ్యి ఎన్ని సార్లయినా రాకపోకలు సాగించవచ్చు. దాదాపు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 15,000 కంటే ఎక్కువ పుస్తకాలను అందించనున్న ఈ కోఫోర్జ్ పబ్లిక్ లైబ్రరీ వారాంతాలు, సెలవులలో సహా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సందర్శకులను స్వాగతిస్తుంది. ఏకకాలంలో 160 మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విభిన్న రకాల సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. లైబ్రరీ ఆధ్యంతం ఆహ్లాదకరమైన ఇంటీరియర్తో రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నో చాటింగ్, వర్కింగ్.. ఓన్లీ రీడింగ్.. ఒక అధునాతన కేఫ్కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సీటింగ్, లైటింగ్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ.. ఈ లైబ్రరీలో కాలక్షేపానికి చాటింగ్స్, ల్యాప్ టాప్పై ఆఫీస్ వర్క్స్ వంటివి అనుమతించరు. కేవలం పఠనాభిలాషుల కోసం మాత్రమే ఏర్పాటైన ఈ లైబ్రరీలో బుక్ రీడింగ్ సెషన్స్, బుక్ లాంచ్ సహా ఏ రకమైన గేదరింగ్స్కు అవకాశం లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. పుస్తకాలను చదువుకోవడం మాత్రమే ప్రధానం అయినప్పటికీ.. అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లాలంటే రిఫండబుల్ డిపాజిట్ కట్టి తీసుకెళ్లవచ్చు. కిడ్స్ స్పెషల్ జోన్.. ఈ లైబ్రరీలోనే ఒక కార్నర్లో కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు.. అందులో చిన్నారులకు ఉపయుక్తమైన పుస్తకాలు ఉంచారు. అదే విధంగా ఫిక్షన్, నాన్–ఫిక్షన్, పిల్లల సాహిత్యం నుంచి స్వచ్ఛంద సేవ, వ్యాపారం, ఆధ్యాతి్మకత, కళ, కృత్రిమ మేధస్సు, సాంకేతికత, ఫొటోగ్రఫీ, కవిత్వం.. సహా అన్ని విభాగాల్లో ప్రసిద్ధ పుస్తకాల సేకరణ ఉంది. ఈ సేకరణలో పెంగి్వన్, హార్పర్కాలిన్స్, అమర్ చిత్ర కథ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రెస్ సాహిత్య అకాడమీ వంటి 350కి పైగా ప్రముఖ ప్రచురణకర్తలకు చెందిన 13,000 పైబడిన రచనలు చోటు చేసుకోనున్నాయిు. లైబ్రరీ కేటలాగింగ్ నిర్వహణ పూర్తిగా డిజిటలైజ్ చేశారు. (చదవండి: క్యాషియర్ టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్) -
క్యాషియర్ టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
సినిమాలో ప్రొడక్షన్ విభాగంలో క్యాషియర్గా మొదలైన ప్రస్థానం.. చివరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకుంది.. హ్యాపీడేస్ సినిమాతో మొదలై.. క్రమంగా శేఖర్ కమ్ములతో ప్రయాణం సాగించారు. అలా ఆవకాయ బిర్యానీ సినిమాకు పనిచేశారు. ఈ క్రమంలో తన హార్డ్ వర్క్ నచ్చి శేఖర్ కమ్ముల మెచ్చుకున్నారు. తర్వాత లీడర్ సినిమాకు టీంలో చేరమని కబురు పంపారు. ఇదే ఆయన జీవితంలో కీలక మైలు రాయని, తెరవెనుక తాను పడిన కష్టమే తనను అనేక మెట్లు ఎక్కించిందని చెబుతున్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇర్ల నాగేశ్వర్రావు. పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా మాచవరంలోనే. పిడుగురాళ్లలో ఇంటరీ్మడియట్, నర్సరావుపేటలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఓ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్ చేరారు. దగ్గుబాటి రానా నటించిన లీడర్ సినిమాకు శేఖర్ కమ్ముల టీంలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. అలా క్లాప్ కొట్టడం, తర్వాత ఆర్టిస్టులను కో–ఆర్డినేషన్ చేయడం. అగ్ర నటులు గొల్లపూడి మారుతి రావు, నటి సుహాసిని, నటుడు హర్షవర్ధన్, హీరోయిన్ ప్రియా, కోట శ్రీనివాసరావు వంటి వారికి దగ్గరయ్యారు. వివిధ విభాగాల్లో.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం లొకేషన్స్ కోసం క్రమంగా ఫిదా సినిమాకు ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. తర్వాత లవ్ స్టోరీ సినిమాకూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఈ క్రమంలో పని నచ్చడంతో శేఖర్ కమ్ముల అమిగోస్ ప్రొడక్షన్స్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యారు. కుబేర విజయంలోనూ లొకేషన్స్ పరంగా కీలకపాత్ర పోషించారు. ‘నేను జీవితంలో మంచి చెడు పంచుకునే మొదటి వ్యక్తి శేఖర్ గారు. ఆయనతో నా 20 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా’ అని చెబుతున్నారు నాగేశ్వర్రావు. ప్రస్తుతం అమిగోస్ ప్రొడక్షన్ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!) -
విన్నింగ్ కెప్టెన్ న్యూ కెప్టెన్
విమానంలో క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ కనిపించడం విశేషం కాకనొవచ్చు. అయితే ఈసారి మాత్రం విశేషంగా మారింది. ఇండిగో ఆహ్వానం మేరకు విమానంలోకి అడుగుపెట్టిన కపిల్దేవ్ కొత్తగా కెప్టెన్గా ప్రమోట్ అయిన ప్రియాంక యూనిఫామ్కు చారలపట్టి పిన్ చేశారు. ఈ ఫోటోని విమానయాన సంస్థ ఇండిగో ‘ఎక్స్’లో తన అఫీషియల్ ఎకౌంట్లో షేర్ చేసింది. ‘ఇది చిరస్మరణీయంగా గుర్తుండి పోయే సందర్భం. కెప్టెన్ కావడం అనేది చిన్న విషయమేమీ కాదు. ప్రియాంకకు తన విజయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునే మధుర జ్ఞాపకం’ ... ఇలాంటి కామెంట్లు ఇండిగో పోస్ట్లో కనిపిస్తాయి.‘చూడముచ్చటైన దృశ్యం. గోవా టు దిల్లీ ఫ్లైట్లో ఈ అపురూప దృశ్యాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది’ అని రాశారు అదే ఫ్టైట్లో ప్రయాణించిన ఒక యూజర్. ‘ఫ్రమ్ ఏ విన్నింగ్ కెప్టెన్ టు ఏ న్యూ కెప్టెన్’ అన్నారు ఒకరు. ‘కెప్టెన్ ప్రియాంక నేపథ్యం ఏమిటి? ఆ స్థాయికి రావడానికి పడిన కష్టాల గురించి రాసి ఉంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండేది’ అని రాశారు ఒక యూజర్. Becoming a Captain is no small feat and having Mr. Kapil Dev pin her stripes made Captain Priyanka’s achievement a moment she’ll always treasure. There’s indeed no better way to say Hello, Captain! #goIndiGo@therealkapildev pic.twitter.com/09tgA7cowR— IndiGo (@IndiGo6E) October 4, 2025(చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!) -
నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!
కొన్ని నెలల క్రితం వరకు నేను ఆన్లైన్లో గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు వెచ్చించి ఆడేవాడిని. అలా కొంత డబ్బులు పోగొట్టుకున్నాను మరికొంత సంపాదించాను. నాలుగు నెలల క్రితం సైబర్ కంప్లైంట్ కారణంగా నా బ్యాంక్ ఖాతా సీజ్ చేసినట్లు బ్యాంకు వారు తెలిపారు. అంతకు మించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. నా జీతం అదే ఖాతాలో డిపాజిట్ అవుతుంది. నేను పనిచేస్తున్న కంపెనీకి ఈ విషయం చెప్పి ఎకౌంటు మార్చమని అడుగుదామనుకుంటే... ఆ కేసు విషయం అందరికీ తెలిసి, నా ఉద్యోగం పోతుందనే భయంతో చెప్పలేకపోతున్నాను. నెల జీతం వస్తోంది కానీ విత్ డ్రా చేయలేని పరిస్థితి. బ్యాంకు వారిని సంప్రదించినప్పటికీ పరిష్కారం దిశగా సమాధానం ఇవ్వడం లేదు. నా ఉద్యోగానికి ఎటువంటి ముప్పు రాకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పగలరు.– కృష్ణ చైతన్య, హైదరాబాద్ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ చట్టం, 2025 ఇటీవలే అమలులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటిని రెగ్యులేట్ చేయడం, వ్యసనాలకు దారి తీయకుండా చేయటం, ఆన్లైన్ ఫైనాన్షియల్ మోసాలను అరికట్టటం, కుటుంబాలను– యువతను కూడా ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉంచటం, దేశ ఖజానాకు భంగం కలిగించకుండా ఉండడం వంటివి ఈ చట్టం ముఖ్య ఉద్దేశాలు. ఈ చట్టం అమలులోకి రాకముందు చాలా ఉదంతాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో చాలా యాప్స్ ద్వారా ఆన్లైన్ మోసాలు జరిగాయి అని వేల సంఖ్యలో కంప్లైంట్లు ఇచ్చారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో వేల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు సీజ్ కూడా అయ్యాయి. బహుశా మీరు వాడిన బెట్టింగ్/గేమింగ్ యాప్ ఏదో ఒక నేరంలో ఉండి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో బ్యాంకు వారు కూడా ముందస్తు చర్యగా ఎకౌంటును సీజ్ చేయవచ్చు. అయితే అందుకు గల కారణాలను సదరు ఖాతాదారులకు ఇవ్వడం బ్యాంకు వారి బాధ్యత. ఇక దీని మూలంగా మీ ఉద్యోగానికి ఏదో జరిగిపోతుంది అనే కంగారు ప్రస్తుతానికి అవసరం లేదు. బ్యాంకు వారికి మీ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి గల కారణాలు అలాగే ఏదైనా పోలీసు వారు కానీ, మరి ఎవరైనా అధికారులుగానీ ఇచ్చిన ఆర్డర్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియజేయాలి అంటూ లిఖితపూర్వకంగా ఒక వినతిపత్రం ఇచ్చి అక్నాలెడ్జెమెంట్ తీసుకోండి. కుదరని పక్షంలో రిజిస్టర్డ్ ΄ోస్టు ద్వారా మీ దరఖాస్తును/వినతి పత్రాన్ని పంపవచ్చు. ఏదైనా పోలీసు కేసు వలన మీ ఎకౌంటు ఫ్రీజ్ అయిందని తెలిస్తే, సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టు లో సి.ఆర్.పి.సి సెక్షన్ 457 ప్రకారం ఒక దరఖాస్తు చేసుకొని ఎకౌంటును డీ ఫ్రీజ్ చేయించుకోవచ్చు. లేకపోతే నేరుగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి కూడా మీ అకౌంటును డీ ఫ్రీజ్ చేయమని కోరవచ్చు. అలాంటి కంప్లైంట్ ఏమీ లేకుండా ఒకవేళ బ్యాంకు వారు ఫ్రీజ్ చేసినట్టు అయితే అది కేవలం కొంతకాలానికి మాత్రమే చెల్లుతుంది. నేరంలో భాగంగా ఉన్న సొమ్మును అలాగే ఎకౌంట్లో ఉంచి మిగతా అకౌంట్ లావాదేవీలను డీ ఫ్రీజ్ చేయాలి అని కోర్టు ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇకపోతే ఏదైనా ఎఫ్.ఐ.ఆర్.లో మీరు నిందారోపితుడు అయి ఉంటే తప్ప మీ ఉద్యోగానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఎందుకంటే మీరు నేరుగా ఎటువంటి నేరం చేయలేదు కాబట్టి. గేమ్స్ ఆడిన వారిపై ప్రస్తుతానికి శిక్షలు లేవు కనుక మీరు ఈ విషయాన్ని మీ కంపెనీ వారికి చెప్పినా ఏమీ కాదు. అయితే అలా చెప్పే ముందు సైబర్ కంప్లైంట్లో మీరు నిందారోపితుడుగా (అక్యూజ్డ్ గా) ఉన్నారేమో చూసుకోండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: Success Story: ఇంటి పనులకే పరిమితమైన స్థాయి నుంచి డీఎస్పీ రేంజ్కి..!) -
సెకండ్ లైఫ్
అందరూ పనిచేసి రిటైర్ అయ్యే వయసులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు ఆరు పదుల వయసు దాటిన ఈ మహిళలు. ఇటీవల జరిగినపారిస్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది 60 ఏళ్ల జర్మన్ మోడల్ గినా. భారతదేశంలో రాజస్థాన్ వాసి 60 ఏళ్ల ముక్తాసింగ్(Mukta Singh) మోడలింగ్ను కెరియర్గా ఎంచుకొని, అందానికి కొత్త నిర్వచనం చూపుతోంది. అరవై ఏళ్ల వయసులో వీరి ఆరోగ్యకరమైన జీవనశైలి 20 ఏళ్ల యువతులకు కూడా స్ఫూర్తిని కలిగిస్తోంది.మలివయసును అందంగా తీర్చిదిద్దుకోవడానికి గినా, ముక్తా లనే ఉదాహరణగా తీసుకోవచ్చు.గినా డ్రెవాలోవ్సీ్క జర్మన్ మోడల్. కంటెంట్ క్రియేటర్. 60 ఏళ్ల వయసులో అందం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని కొత్తగా మలుచుకుంది. ఇటీవలపారిస్ ఫ్యాషన్ వీక్లో ఐకానిక్ లె డే ఫైల్ షో సందర్భంగా రన్ వే పై నడిచింది గినా. ఆమె ప్రదర్శన ఫ్యాషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రతిచోటా మహిళలు తమ బలాన్ని, సామర్థ్యాన్ని ఎంతలా నమ్ముకోవచ్చో లోకానికి చూపింది.బోల్డ్ విజన్..: గినా డ్రెవాలోవ్స్కీకంటెంట్ క్రియేటర్, ఫ్యాషన్ ప్రపంచంలోకి 58 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది గినా. ఐదు పదులు దాటిన మహిళలకు సాధికారత కల్పించడం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, స్వీయప్రేమను ప్రోత్సహించడమే లక్ష్యంగా కంటెంట్ను సృష్టించడం ప్రారంభించింది. 30 ఏళ్లపాటు ఫ్యాషన్ పరిశ్రమలోని దిగ్గజాలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెది. కమ్యూనికేషన్, మార్కెటింగ్లో రాణించింది. డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి తన ఉత్సాహకరమైన జీవనానికి ఊపిరిపోసింది.గినా సోషల్ మీడియా ద్వారా తన ప్రయాణాన్ని పంచుకుంటూ ‘58 ఏళ్ల వయసులో నేను సున్నా నుండి నా జీవితాన్ని ప్రారంభించాను. నచ్చిన పని, దూర దృష్టి, నా బలం, నమ్మకం, ఫీల్గుడ్ పవర్ను నా చుట్టూ ఉన్నవారిలో నింపడానికి ఇదో మార్గంగా ఎంచుకున్నాను. 60 ఏళ్ల వయసులోపారిస్లో రన్వేపై నడవడం సాధారణమైనది కాదు. అది నా వయసున్న ఎంతోమందికి సందేశం. వయసు మన ఆలోచనలను పరిమితం చేయదు’ అని తెలియజేసింది. ఆమె చేసిన ఈ పని చాలామందిని ఆకట్టుకుంది. వృద్ధాప్య జీవనాన్ని అందంగా మలుచుకోవాలనేవారికి గినా రోల్మోడల్గా నిలిచింది. వృద్ధాప్యంలోనూ ఆమె చర్మం, శరీరాకృతి, వెలుతురు నింపుకున్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. గినా కథ కేవలం ఫ్యాషన్ విజయం మాత్రమే కాదు. ఆమె పట్టుదల, శక్తి, జీవనశైలి, సానుకూల మనస్తత్వానికి నిదర్శనం. మహిళలు అనుకుంటే తమ జీవనాన్ని ఎలా మార్చుకోగలరో, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలరో, అద్భుత విజయాలను ఎలా సొంతం చేసుకోగలరో ఉదాహరణగా చూపిస్తుంది. కలలను కొనసాగించే విషయంలో వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని మరోమారు నిరూపించింది.స్టైలిష్ అమ్మమ్మ: ముక్తాసింగ్తెల్లని జుట్టుతో మోడలింగ్ను కెరీర్గా తీసుకుని విజయవంతంగా రాణిస్తోంది 62 ఏళ్ల ముక్తాసింగ్. తల్లి, అమ్మమ్మ నుండి ప్రేరణ పొందాను అని చెప్పే ముక్తా సింగ్ రాజస్థాన్ వాసి. తన సెకండ్ జర్నీ గురించి సోషల్ మీడియా ద్వారా వీక్షకులకు తరచూ చెబుతూనే ఉంటుంది. ఆత్మగౌరవాన్ని అందాన్ని పునర్ నిర్వచించడంలోని ప్రాముఖ్యతను వివరిస్తుంది. వయసు కారణంగా గుర్తింపును పరిమితం చేయలేమని చెబుతుంది. ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?50 ఏళ్ల వయసులో మోడల్ కావాలని నిర్ణయించుకొని, అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ముక్తాసింగ్ చాలా విమర్శలను ఎదుర్కొంది. ఎగతాళి చేసే కామెంట్స్కు బాధపడింది. కానీ, ఎవరి కోసమో తన తీరు మార్చుకోనవసరం లేదని, తనకు ఎంతో ఇష్టమైన పనిని ఎంచుకుంది. ముక్తా చిన్నతనంలో స్టైలిష్గా ఉండే వృద్ధమహిళలను ఎప్పుడూ మెచ్చుకునేది. ‘మా అమ్మమ్మపెద్ద వయసులోనూ బెంగాలీ కాటన్ చీరలలో ఎంతో అందంగా కనిపించేది. మరణశయ్యపై ఉండి కూడా మంచి దుస్తులు ధరించాలని కోరుకునేది. వృద్ధాప్యంలో స్టైలిష్గా ఉండటం గురించి ఆలోచనే అవసరం లేదనే మాటలను పట్టించుకోకూడదు. అది ఆత్మగౌరవానికి సంబంధించింది’ అని ముక్తా చెబుతుంది. ఇంగ్లిష్లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ముక్తా యుద్ధ విమాన పైలట్ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు పిల్లలను పెంచడంలో, కంటెంట్ రైటర్గానూ బిజీగా మారిపోయింది. ‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. నా పిల్లలు పెద్దవాళ్లయ్యాక వారిపాత చొక్కాలు, జీన్స్ వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయేదాన్ని. మెల్లగా వయసు పైబడటం జరిగిపోతూనే ఉంది. తెల్లబడుతున్న జుట్టుకు రంగు వేయాలన్న ఆలోచన కూడా లేదు. చాలా మంది జుట్టుకు రంగు వేసుకోకపోతే జీవితాన్ని వదులుకున్నట్టే అని చెప్పేవారు. కానీ, తెల్ల జుట్టుతోనే మెరుస్తాను చూడండి అని వారికి చెప్పేదాన్ని. ఇప్పుడు దానిని నిజం చేస్తున్నాను. మంచి పేరున్న కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నాను. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నాను. ఈ వయసులోనూ నా కలలను నెరవేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని వివరిస్తుంది ముక్తాసింగ్. ఆడ–మగ ఎవరైనా సరే, స్వీయ ఆవిష్కరణ, సాధికారత కోసం తప్పక ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని గినా, ముక్తా తమ జీవనం ద్వారా మనకు విలువైనపాఠాలు బోధిస్తున్నారు. -
గూగుల్ నుంచి గూగుల్ వరకు
లక్ష్యాన్ని వీడక ప్రయత్నిస్తూ ఉంటే విజయం ఏదో ఒకనాటికి వరిస్తుందని రాగిణి దాస్(Ragini Das) నిరూపించింది. 12 ఏళ్ల క్రితం గూగుల్ ఇంటర్వ్యూకు హాజరైన రాగిణి అందులో సెలెక్ట్ కాలేదు. దాంతో జొమాటో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంది. జొమాటోలో చేరి ఆ సంస్థ ఉన్నతికి తోడ్పడింది. ఇప్పుడు గూగుల్ రాగిణిని పిలిచి మరీ గూగుల్ ఇండియాకు ‘హెడ్ ఆఫ్ స్టార్టప్స్’గా నియమించింది. బాణం ఒకసారి గురి తప్పేది ఈసారి కచ్చితంగా గురికి చేరుకోవడానికే అని నిరూపించిన రాగిణి దాస్ పరిచయం.‘అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది’ అన్నాడో సినీ కవి. అందరి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు. కాని శ్రమ, పట్టుదల ఉంటే వెనుదిరిగిన చోటే మళ్లీ ముందడుగు వేయడం సాధ్యమని నిరూపించారు రాగిణి దాస్. ప్రస్తుతం ఆమె గూగుల్ మెచ్చిన బిజినెస్ స్ట్రాటజిస్ట్. అందుకే ఆ సంస్థ గూగుల్ ఇండియా స్టార్టప్స్ విభాగానికి ఇటీవల ఆమెను హెడ్గా నియమించింది. ఆశ్చర్యం ఏమంటే పన్నెండేళ్ల క్రితం అదే గూగుల్ సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లి వెనుదిరిగిన ఆమె ప్రస్తుతం అదే సంస్థలో ఉన్నత ఉద్యోగానికి ఎంపికవడం విశేషం.చురుకైన విద్యార్థినిహరియాణా రాష్ట్రం గురుగ్రామ్లో జన్మించిన రాగిణి– చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ్లో చదువుకున్నారు. చదువుతోపాటు అక్కడ ఆమె సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గాపాల్గొన్నారు. ఆ తర్వాత లాన్ కాస్టర్ యూనివర్సిటీ (ఇంగ్లాండ్) నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. అక్కడ చదువుతున్న సమయంలోనే స్టాండర్డ్ చాటర్డ్ బ్యాంక్తోపాటు ఇతర సంస్థల్లో ఇంటర్న్గా పని చేశారు రాగిణి. భారతీయ మార్కెట్కు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించడంపై ఆ సమయంలోనే దృష్టి సారించారు.గూగుల్ కాదు పొమ్మంది2012లో ట్రిడెంట్ గ్రూప్ ఇండియా సంస్థ ద్వారా తన కెరీర్ని ప్రారంభించారు రాగిణి. మొదట స్వదేశంలో మార్కెటింగ్ పర్యవేక్షించిన ఆమె ఆ తర్వాత యూరప్, అమెరికాల మార్కెటింగ్నూ నిర్వహించారు. సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు. 2013 ఆమె కెరీర్కు అత్యంత కీలకమైన సంవత్సరం. ఆ సమయంలో గూగుల్, జొమాటో సంస్థల్లో ఇంటర్వ్యూలకు వెళ్లారు రాగిణి. గూగుల్లో చివరి రౌండ్ దాకా నిలిచి, ఆ తర్వాత వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడు జొమాటో ఆమెను సగౌరవంగా సంస్థలోకి ఆహ్వానించింది.అలా జొమాటోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చేరిన రాగిణి అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో కీలకస్థానాల్లో పని చేశారు. 2017లో జొమాటో గోల్డ్ ఫౌండింగ్ టీంలో సభ్యురాలిగా మారి, సంస్థ ఉన్నతికి కృషి చేశారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ తదితర దేశాల్లో జొమాటో గోల్డ్ ఆరంభానికి ఆమె కీలకంగా వ్యవహరించారు. ‘జొమాటో నా కెరీర్ని తీర్చిదిద్దింది. నా భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాలు, స్నేహితులను అక్కడే పొందాను’ అని ఆమె అంటుంది.మహిళల కోసం...జొమాటో నుంచి బయటకు వచ్చాక 2020లో ఆనంద్ సిన్హాతో కలిసి ముంబయి కేంద్రంగా ఆమె లీప్.క్లబ్ అనే ఆన్ లైన్, ఆఫ్లైన్ క్లబ్ని స్థాపించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు, వృత్తి నైపుణ్యాలు, నెట్వర్కింగ్ అంశాలను చేరువ చేసేందుకు ఈ క్లబ్ పని చేసింది. ఈ ఏడాది మేలో దీన్ని నిలిపి వేసేనాటికి ఈ క్లబ్లో సుమారు 25 వేల మంది పెయిడ్ సభ్యులు ఉండటం విశేషం. ‘ఈ క్లబ్ వల్ల చాలా మంది మహిళలు మేలు పొందడం నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది రాగిణి. పలు కారణాలతో లీప్.క్లబ్ను ఆపేసిన అనంతరం తన పెంపుడు శునకం జిమ్మీతో ఉల్లాసంగా గడుపుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అదే సమయంలో గూగుల్ ప్రకటన ఆమెను ఆకర్షించింది.గూగుల్ నుంచి గూగుల్కు...గూగుల్ స్టార్టప్స్ ఇండియా హెడ్ స్థానానికి అభ్యర్థుల కోసం వెతుకుతున్న సమయంలో మరోమారు గూగుల్ గడప తొక్కారు రాగిణి. ఇన్నాళ్ల తన అనుభవం తప్పక ఆ స్థానాన్ని తనకు అందిస్తాయని నమ్మారు. ఆ నమ్మకం నిజమైంది. ఆమెను గూగుల్ ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలనకునే వారిని సమన్వయం చేసి, గూగుల్ ద్వారా వారికి తగిన ్రపోత్సాహం అందించడం, మెంటర్స్ను ఇవ్వడం, ఫండింగ్ రిసోర్సస్ను తెలియచేయడం ఆమె పని. ‘భూమిలాగే జీవితం కూడా గుండ్రంగా ఉంది’ అంటూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు రాగిణి. -
‘ఖ్యాల్ 50 అబౌవ్ 50’ పోటీ, రూ.కోటి బహుమతులు
ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది. ఈ దశలో విశ్రాంతి తీసుకుంటూ, కుటుంబంతో సమయం గడుపుతూ, తమకు ఇష్టమైన పనులను ఆనందంగా కొనసాగిస్తారు. అయితే దేశంలో 50 ఏళ్లకు పైబడి ఉన్నవారిలో ఎంతో ప్రతిభవున్నప్పటికీ దానిని ప్రదర్శించడానికి సరైన వేదికలు, అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో వయసు అనే సరిహద్దులను దాటుతూ, సీనియర్ సిటిజన్స్ ప్రతిభను వెలికితీసేలా 50 ఏళ్లు పైబడిన వారికి కళాత్మక వేదిక అందించాలనే లక్ష్యంతో ‘ఖ్యాల్ 50 అబౌవ్ 50’ అనే వినూత్న వేదిక ప్రారంభించింది. నగరంతో పాటు దేశమంతటా ఖ్యాల్ కమ్యూనిటీ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించి మొదటి పోటీ హైదరాబాద్లోని ‘అమేయా సోషల్’ వేదికగా నిర్వహించారు. – సాక్షీ, సిటీ బ్యూరో నటినయ్యా.. కానీ సింగింగ్ ఇష్టం.. నాకు సింగింగ్ అంటే ఇష్టం. కానీ నటన పరంగా మంచి అవకాశాలు వచ్చాయి. గాయనిగా సరైన సమయంలో అవకాశాలు అందుకోలేదు. ఈ వేదిక గురించి ఫేస్బుక్లో తెలుసుకుని వచ్చా. నాకు నచ్చిన కళని ప్రదర్శించా. వ్యక్తిగత ఆశయాలు సాధించుకునే అద్భుత అవకాశంగా భావిస్తున్నా. – మిర్చి మాధవి, సినీ నటి రూ.కోటి నగదు బహుమతులు.. 50 ఏళ్లకు పైబడిన వారు తమ జీవితం అక్కడితో ముగిసిందని, ఇంటికే పరిమితం కాకూడదని, కలను నెరవేర్చుకునేందుకు ఈ సంస్థ ఏర్పాటైంది. హిమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి ఈ వేదికను స్థాపించారు. ఈ ఆడిషన్స్లో 500 మందిని ఎంపిక చేసి అందులో టాప్–10 విజేతలకు ప్రత్యేక బహుమతులు, మిగతా వారికి కన్సోలేషన్ బహుమతులు అందిస్తారు. – ఎస్.రామ చంద్రన్, ఖ్యాల్ సౌత్ ఇండియా రీజినల్ హెడ్ ఆరోగ్య కళ.. యోగా.. నేను యోగా సాధకురాలిని, శిక్షకురాలిని. ఆరు పదుల వయసులో యోగా ఒక కళగా ప్రదర్శించడానికి అద్భుతమైన వేదిక లభించింది. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ, సామాజిక పరిరక్షణ అవసరమని ఈ వేదికలో భాగస్వామ్యం అయ్యా. ఈ వయసులో ఆరోగ్య సంరక్షణ గురించి తెలియజేసేలా అవకాశాన్ని వినియోగించుకుంటున్నా. – రాజేశ్వరి (60) యోగా నిపుణురాలు కళలు, క్రీడలు, వ్యాపారం, సాంకేతికత, సామాజిక అంశాలు.. ఇలా ఏ రంగానికి చెందిన వారైనా సరే, ఈ వేదికగా కొత్త సవాళ్లను స్వీకరిస్తూ, అంకితభావం, కళాత్మకతతో ఇతరులకు స్ఫూర్తినిచ్చే వారిని సత్కరిస్తుంది ఈ వేదిక. సరికొత్తగా రూపొందిన ఖ్యాల్ 50 అబవ్ 50 కాంటెస్ట్లో 50 ఏళ్లకు పైబడిన వారి ప్రతిభను ప్రపంచానికి చూపిస్తుంది. తమకు ఇష్టమైన రంగంలో పాల్గొనవచ్చని ఖ్యాల్ యాజమాన్యం చెబుతోంది. ఈ పోటీల్లో నగరం నుంచి విభిన్న రంగాలకు చెందిన సీనియర్ సిటీజన్స్ పాల్గొని పాటలు, వంటలు, నృత్యం, కథలు, చిత్రాలు వంటి కళలను ప్రదర్శించారు. ఈ ఆడిషన్స్లో సింగింగ్, యోగా, నటన వంటి సృజనాత్మక కళలతో ఆడిషన్స్లో పాల్గొన్నారు. -
రిపోర్టింగ్... ఓ వార్!
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్. అంతేకాదు ఎయిమ్స్లోని మెడికల్ స్కామ్నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్తో యుద్ధ ట్యాంక్ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం! జర్నలిజం.. వార్ రిపోర్టింగ్ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్ను తిరస్కరించి.. కీలకమైన అసైన్మెంట్స్కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లో ఉన్న తన పేరెంట్స్ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్ను పత్రికా ఆఫీస్కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు. సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే. -
ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’!
ఎంత వయసు వచ్చినా.. ‘చావు’ అంటే అందరికీ భయమే. అలనాటి పురాణ పురుషుల నుంచి ఈనాటి సామాన్య మానవుల దాకా మృత్యువు నుంచి దూరంగా పారిపోయి దీర్ఘాయుష్షుతో చిరంజీవిగా జీవించాలన్నఆరాటం ఈనాటిది కాదు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో తాజా స్టడీ కీలక విషయాలను వెల్లడించింది. దాకా మృత్యువు నుంచి తప్పించుకొని, దీర్ఘాయుష్షుతో జీవించాలన్న ఆరాటం మామూలుది కాదు. ఈ క్రమంలో ఎక్కువ కాలం జీవించాలంటే ప్రోయాక్టివ్గా, హ్యాపీగా, థరోగా, రెస్పాన్సిబుల్గా, హెల్పింగ్ నేచర్తో ఉంటే చాలు.. దీర్ఘాయువు మీ సొంతం అంటోంది ఒక స్టడీ.జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, చురుగ్గా ఉండటం, వ్యవస్థీకృతంగా ఉండటం బాధ్యతాయుతంగా ఉండటం వంటి నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలు అకాల మరణం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ‘పర్సనాలిటీ న్యూయెన్స్ అండ్ మోర్టాలిటీ రిస్క్: ఫోర్ లాంగిట్యూడినల్ శాంపిల్స్ రిపోర్ట్ ’ అనే శీర్షికతో ఈ స్టడీ కొన్ని విషయాలను తెలిపింది. పై లక్షణాలు బహిర్ముఖం లేదా మనస్సాక్షి వంటి విస్తృత వ్యక్తిత్వ వర్గాల వివరణ కంటే దీర్ఘాయువును మరింత ఖచ్చితంగా అంచనా వేస్తాయని తెలిపింది.. కష్టపడి పనిచేయడం లేదా సంతోషంగా ఉండటం వంటి లక్షణాలు ఆయుర్దాయాన్ని పెంచడంలో చాలా పెద్దపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు.అధ్యయనంలో ఏముందంటే!ఈ అధ్యయనం నాలుగు దీర్ఘకాలిక అధ్యయనాలలో వ్యక్తిత్వ డేటాను విశ్లేషించింది . ఈ లక్షణాలు మరణ ప్రమాదానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ట్రాక్ చేసింది. వయస్సు, లింగం,వైద్య పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసిన తర్వాత కూడా, తమను తాము చురుకుగా వర్ణించుకున్న వ్యక్తులు 21 శాతం తక్కువ మరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని ఇది వెల్లడించింది.ఉల్లాసంగా, బాధ్యతాయుతంగా, హార్డ్ వర్కింగ్, క్షుణ్ణంగా (thorough)సహాయకారిగా ఉండటం లాంటి లక్షణాలు మన ఆయువును నిర్దేశిస్తాయని వెల్లడించింది. మరోవైపు, తరచుగా ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల భావోద్వేగాలున్నవారి జీవితకాలం తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో సాంప్రదాయకంగా, మనస్తత్వవేత్తలు కల్మషం లేకుండా ఉండటం, మనస్సాక్షికి అనుగుణంగా ఉండటం, బహిర్ముఖత్వం, అంగీకారయోగ్యత, న్యూరోటిసిజం అనే ఐదు విస్తృత లక్షణాల ద్వారా వ్యక్తిత్వాన్ని కొలుస్తారు. కానీఈ స్టడీ సహ రచయిత రెనే మోటస్ ప్రకారం, ఈ "బిగ్ ఫైవ్" ముఖ్యమైన వివరాలను కోల్పోవచ్చు. బదులుగా, కష్టపడి పనిచేయడం లేదా సహాయకారిగా ఉండటం వంటి స్వీయ-వర్ణనలు ఆరోగ్యం, ఆయువు ప్రభావాలను కలిగి ఉన్న నిర్దిష్ట ప్రవర్తనలను సంగ్రహిస్తాయి. ఈ అధ్యయనంలో, సూక్ష్మ నైపుణ్యాలు పెద్ద వర్గాల కంటే ఎక్కువగా అంచనా వేసేవిగా మారాయి.వ్యక్తిత్వం ఆరోగ్య ప్రమాదాలను ఎలా అంచనా వేయగలదు?ఒక రోజు ఆరోగ్య ప్రమాదాలను బాగా అంచనా వేయడానికి రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు వ్యక్తిత్వ-ఆధారిత సాధనాలను ఉపయోగించవచ్చని ఈ పరిశోధన వైద్యులు సూచించారు. ఉదాహరణకు, ఆందోళన చెందుతున్న లేదా అస్తవ్యస్తంగా గుర్తించే వ్యక్తి లక్ష్య జీవనశైలి,మానసిక ఆరోగ్య మద్దతు నుండి ప్రయోజనం పొందవచ్చు. సహ రచయిత పారాయిక్ ఓ'సుయిల్లియాభైన్ ఏమంటారంటే..వ్యక్తిత్వం అనేది కేవలం ఒక సాధారణ ప్రభావం కాదు, ఇది దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను రూపొందించే రోజువారీ ప్రవర్తనలను కూడా ప్రతిబింబిస్తుంది.ఎక్కువ కాలం జీవించడానికి మీరు ఏ లక్షణాలను పెంపొందించుకోవాలి?అధ్యయనం ప్రకారం ఎంత ఎక్కువ చురుగ్గా ఉంటే అంత ఎక్కువ ఆయుష్షు ఉంటుంది. ఇది చాలా కీలకం. అలాగే అకాల మరణం నుంచి తప్పించుకోవచ్చు. ఇక లైవ్లీగా, ఒకరిగా సాయం చేసే గుణం, క్రమశిక్షణగా, బాధ్యతాయుతంగా ఉండటం అనేది తరువాత వరుసలో ఉంటాయి. లక్షణాలే ఆరోగ్యకరమైన అలవాట్లు, బలమైన సామాజిక సంబంధాలు, ఒత్తిడిని ఎదుర్కోవడానికి సాయపడతాయి. ఫలితంగా ఇవన్నీ దీర్ఘాయువును పెంచుతాయి. అలా కాకుండా తీవ్ర ఒత్తిడి, ఆందోళనలతో ఉంటే గుండె జబ్బులు, ఇన్ఫ్లమేషన్, అనారోగ్యకరమైన లక్షణాలను ప్రేరేపించడం ద్వారా మరణాల ప్రమాదాన్ని పెంచుతాయి.ఎక్కువ కాలం జీవించడానికి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, కానీ ఈ లక్షణాలతో ముడిపడి ఉన్న చిన్న రోజువారీ అలవాట్లను పెంపొందించుకోవడం సహాయపడుతుందని అధ్యయనం నొక్కి చెప్పింది. అంటే నిరంతరం చురుకుగా ఉండటం, నిబద్ధతగా ఉండటం, ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండటం, శారీరక , మానసిక శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే సరళమైన, సాధించగల దశలు.ఇదీ చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే! -
సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్... జెన్జీ సందడి
ఇటీవలి కాలంలో నగరం కేవలం ఐటీ హబ్గానే కాకుండా లైఫ్స్టైల్, కల్చరల్ ఈవెంట్స్కి అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ఈ నూతన ఒరవడిలో ఈ మధ్య ప్రధానంగా ఆదరణ పొందుతున్న సరికొత్త ట్రెండ్ క్యాండిల్ లైట్ ఈవెంట్స్. వాణిజ్య నగరంగా పేరుపొందిన హైదరాబాద్ ఇప్పుడు రాత్రి వేళల్లో మెరిసే మైనపు వెలుగుల్లో కొత్త మాయాజాలాన్ని సృష్టించిన అనుభూతిని కల్పిస్తుంది. చిమ్మ చీకటిలో చిరు వెలుగు అందించే క్యాండిల్ లైట్ ప్రత్యేక ఆకర్షణగా.. విభిన్నమైన వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రొటీన్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్కు భిన్నంగా క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఈ తరం ట్రెండ్గా నిలుస్తోంది. ట్రెండీ నైట్.. క్యాండిల్ లైట్ అన్న రీతిలో పలు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రస్తుత అధునాతన జీవనశైలితో పాటు ట్రెండింగ్ ఈవెంట్స్కు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇందులో భాగంగానే క్యాడిల్ లైట్ ఈవెంట్స్ తెరపైకి వచ్చాయి. ఈ కొత్త ట్రెండ్ మన జీవనశైలి మార్పును మాత్రమే కాదు, మన మానసిక అవసరాలను కూడా ప్రతిబింబిస్తోంది. శాంతి, ప్రేమ, కళలకు వేదికగా ఈ ట్రెండ్ రూపాంతరం చెందుతోంది. ఈ క్యాండిల్ లైట్ ట్రెండ్కి నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు మరింత క్రియేటివ్ ఐడియాలతో ముందుకు వస్తున్నాయి. క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్, థీమ్ బేస్డ్ క్యాండిల్ లైట్ పోయెట్రీ ఈవెనింగ్స్, మెడిటేషన్ సెషన్లు, క్యాండిల్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ ఆర్ట్ షోస్ వంటి కాన్సెప్ట్లు సరికొత్త అనుభూతులను అందిస్తున్నాయి. డార్క్ బీట్స్.. ఒక వైపు మ్యూజిక్ లవర్స్కి క్లబ్ల శబ్దాలు, ఈడీఎం బీట్స్ విసుగుతెస్తుంటే, మరోవైపు క్యాండిల్ లైట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ వారికి ఓ కొత్త అనుభూతి అందిస్తున్నాయి. పియానో, వయోలిన్, ఫ్లూట్ వంటి సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రశాంతంగా కొనసాగే ఈ లైవ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈవెంట్స్లో పాల్గొనడమంటే.. సంగీతంతో మనసు నిండిపోవడమే కాదు, ఆ మైనపు వెలుగుల్లో మన మనసు కూడా ప్రశాంతతను పొందుతుంది. ఇటీవల కూకట్పల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్కి యువత నుంచి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని క్యాండిల్లైట్ సంగీత కచేరీలలో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, తారామతి బరాదరి రిసార్ట్స్ వంటి వేదికల్లో శాస్త్రీయ, ఆధునిక సంగీతంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సీసం కొవ్వొత్తులతో అలంకరించబడి సంగీతకారులు వాయించే సంగీతంతో ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తాయి. ఈ కచేరీల్లో అర్జిత్ సింగ్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖ మ్యూజిక్ సెలబ్రిటీలు భాగం కావడం విశేషం. ఉత్తమ మూవీ సౌండ్ట్రాక్స్, కోల్డ్ప్లే, ఎడ్ షీరాన్ మిక్స్ వంటి థీమ్లు ఇందులో ఉంటాయి. చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!నగరంలో సరికొత్త ట్రెండ్గా క్యాండిల్ లైట్ ఈవెంట్స్చీకటి వెలుగుల సందడి.. : గోల గోలతో హంగామా చేసే పార్టీలు కాకుండా.. బంధువులు, స్నేహితులతో ఒక మధురమైన వేడుక జరుపుకోవాల నుకుంటున్నవారికి క్యాండిల్ లైట్ బర్త్డే పార్టీలు సరైన ఎంపికగా మారుతున్నాయి. చిన్న చిన్న డెకరేషన్, ఫెయిరీ లైట్స్, సున్నితమైన మ్యూజిక్, సొగసైన కేక్ కటింగ్.. ఇవన్నీ కలిపి ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు, టీనేజ్ యువత ఈ స్టైల్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.క్యాండిల్ నైట్ డిన్నర్.. : ప్రేమికుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న మరో ట్రెండ్.. క్యాండిల్ నైట్ డిన్నర్. ఒక టేబుల్, రెండు హృదయాలు, నెమ్మదిగా వెలిగే మైనపు వెలుగు, వెనకనుంచి వినిపించే ఓ మెలోడీ పాట.. ఇది కేవలం డిన్నర్ కాదు, ఒక జ్ఞాపకం. హైదరాబాద్లోని పలు హై ఎండ్ రెస్టారెంట్లు, రూఫ్టాప్ కెఫేలు, ప్రైవేట్ విల్లాస్, రిసార్టులు ఈ రకమైన డిన్నర్ అనుభూతికి ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నాయి. పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీ వంటి సందర్భాల్లో ఈ డిన్నర్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.మెంటల్ పీస్: ఉరుకుల పరుగుల బీజీ నగర జీవనశైలిలో కాసింత ప్రశాంతత కోసం వినూత్నమైన అనుభూతి కోసం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ అద్భుతమైన వేదికలుగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్: ఈ జెన్జీ బ్యాచ్ సోషల్ మీడియా యాప్స్లో తమను ప్రత్యేకంగా ప్రదర్శించు కోవడం ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయదగిన అందమైన ఫొటోలు తీసుకోవాలంటే క్యాండిల్ లైట్ సెట్టింగ్స్ వైరల్గా నిలుస్తున్నాయి. అరుదైనఅనుభూతి: ప్రతి ఈవెంట్ వ్యక్తిగతంగా ప్లాన్ చేయబడటం ఈ క్యాండిల్ లైట్ ఈవెంట్స్ ప్రత్యేకత. ఇష్టమైన వారి కోసం, వారికి నచ్చే సెట్టింగ్స్తో ఈ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
ఆదికవికి అనేక ప్రణతులు
భారతీయ సాహిత్యంలో ఆదికావ్యం శ్రీమద్రామాయణం. మానవ వికాసం కోసం, మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం వేదాల్లో చెప్పిన అంశాలనే సామాన్య మానవులకు కూడా అర్ధమయ్యేలా రామకథను ఆధారంగా చేసుకుని వాల్మీకి రామాయణాన్ని వ్రాశాడు. రామాయణాన్ని పరమ పవిత్ర భక్తి వేదంగా పఠిస్తూ పారాయణ చేసేవారు కొందరైతే, మహోత్కృష్ట్ట కావ్యంగా చదువుతూ ఆనందించేవారు కొందరు, మరికొందరు అందులోని కౌశల్యానికి ముగ్ధులైతే, ఇంకొందరు అందులోని మానవీయ విలువలను గ్రహించేవారు. రామాయణం భారతీయుల ఆత్మ... అయితే, యావత్ మానవజాతికి చుక్కాని వంటిదని చెప్పొచ్చు. నిత్యజీవితంలో నీతి నియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవడం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మానవ జీవన ప్రయాణమే ప్రామాణికం కాని కులగోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించినా అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అణగారిన కులాలలో పుట్టినా విలువలతో.. పవిత్రంగా జీవన పయనం సాగించే వారిని చేయి పట్టుకుని నడిపించక మానడు. అంటే ఆ దైవానికి మన గుణగణాలు ప్రధానం కాని కుల మతాలు ప్రమాణం కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి.రామాయణంలో హృదయాన్ని ద్రవింపజేసే చక్కని కథ ద్వారా మనవాళికి మార్గదర్శనం చేసే సుభాషితాలెన్నో చెప్పాడు వాల్మీకి. మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మమాలను ధర్మసూత్రాలను తాను విరచించిన రామాయణ కావ్యం విశదీకరించాడాయన. జగదానంద కారకుడు, శరణాగతవత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని దివ్య చరిత్రను, శ్రీరామనామ మాధుర్యాన్ని మనకందించిన కవికోకిల ఆదికవి వాల్మీకి మహర్షికి మానవాళి యావత్తు రుణపడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు.అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సంధులు, మధురమైన, ఆర్ద్రత కలిగించే వాక్యాలతో కూడిన శ్రీరామాయణ మహా కావ్యాన్ని మనకందించాడు వాల్మీకి మహర్షి. రామాయణంలో అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలైన శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్రధర్మం, మిత్రధర్మం, పతివ్రతా ధర్మాలతోపాటు ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్పరిపాలన, ఉపాసన రహస్యాలు, సంభాషణా చతురత, జీవిత విలువలు, ధర్మాచరణ వంటి అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏది లేదు.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాలి. ప్రతివారు రామాయణ కావ్యం చదివి, చక్కని గుణవంతులైతే వాల్మీకి ఋణం తీర్చుకున్నట్టే.– డి.వి.ఆర్. -
ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!
బాలీవుడ్ నిర్మాత, అందాల నటి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) గోర్ ధన (నిశ్చితార్థం) వేడుకలో తన దివంగత తల్లి మోనా శౌరీ (Mona Shourie)పై చూపిన ప్రేమ నెట్టింట విశేషంగా నిలుస్తోంది.బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా శౌరీ కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్ను త్వరలోనే పెళ్లాడనుంది. దీనికి సంబంధించి కపూర్ కుటుంబం గోర్ ధన వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పంచుకుంది అన్షులా. ఈ క్రమంలో తన దివంగత తల్లి మోనా శౌరీ కోసం అన్షులా కపూర్ ఒక సీటును ఖాళీగా ఉంచడం, అందులో తనతోపాటు తల్లి ఉన్న ఫోటోను ఉంచడం అందరి హృదయాలను కరిగించింది. తన జీవితంలో ముఖ్యమైన రోజున తన తల్లి మిస్ అవుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పింది. అమ్మ ప్రేమ.. అప్పటికీ... ఎప్పటికీ తమ చుట్టూనే ఉంటుంది. ఆమె మాట, ఆమె మాటల్లో పువ్వుల్లో ఆమె సీటులో, మా గుండెల్లో ఆమె ఎప్పుడూ శాశ్వతమే అని పోస్ట్ చేసింది. పర్పుల్ లెహంగాలో దేవకన్యలాఈ వేడుక కోసం అర్పితా మెహతా రూపొందించిన పర్పుల్ కరల్ లెహంగా, దానికి మ్యాచింగ్ చోళీ, దుప్పట్టాలో అన్షులా ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందమైన మేకప్ జడతో తన లుక్ను అందంగా అమిరాయి. మరోవైపు, రోహన్ నల్లటి షేర్వానీలో అందంగా కనిపించాడు. అంతేకాదు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ (బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి పిల్లలు) తమ సోదరి అన్షులా గోర్ ధన వేడుకకు హాజరై సందడి చేశారు. కాబోయే బావగారితో ఫోటోలకు పోజులిచ్చారు. అన్షులా-రోహన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నట్లు సమాచారం.కాగా బోనీ కపూర్ మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, 1996లో హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు కాగా జాన్వీ, ఖుషి కపూర్ శ్రీదేవి పిల్లలు. -
చేతిరాతతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా!
అంతా చేతిరాతలోనే ఉంది.. విషయ పరిజ్ఞానం నుంచి ఆరోగ్యం దాకా! మరి ఈ డిజిటల్ యుగంలో హ్యాండ్రైటింగ్ ప్రస్తావన? ఎలక్ట్రానిక్ వర్డ్స్తోనే అక్షరాభ్యాసం ప్రారంభించిన ఈ తరం హ్యాండ్ రైటింగ్కి అర్థాన్ని పర్ప్లెక్సిటీలో పరికిస్తుందేమో! ఆ పరిస్థితి రాకుండా పిల్లలు పెన్ను పట్టేలా చూడాల్సిన పని పెద్దలదే! దస్తూరి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటీ? అసలా రాతకు ఎందుకంత ప్రాధాన్యమివ్వాలి అనే అంశాల మీద ప్రముఖ హ్యాండ్రైటింగ్ ఎనలిస్ట్ అండ్ గ్రాఫోథెరపిస్ట్, విశ్రాంత ఆచార్యులు (సెస్, హైదరాబాద్) డాక్టర్ సి. రామచంద్రయ్య ఏమంటున్నారో తెలుసుకుందాం...చేతిరాతను మరచిపోతున్నామా? డిజిటల్ యుగంలో రాతకు కీ బోర్డ్ ప్రత్యామ్నాయమైంది. సెర్చింగ్ దగ్గర్నుంచి సందేశాలను చేరవేయడం దాకా అన్నిటికీ డిజిటల్ మాధ్యమమే! వ్యయప్రయాసల్లేని ఈ సౌకర్యం చెంతనుండగా చేతిరాతతో పనేముంటుంది? స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులకూ టాబ్లెట్లు, లాప్టాప్లు అందుబాటులోకి వచ్చాక పరీక్షల్లో మాత్రమే చేతిరాత అవసరమవుతోంది. ఆన్లైన్ పరీక్షలకు అదీ అనవసరమే అయింది. మన వ్యక్తిత్వం, అలవాట్లు ముఖ్యంగా మైండ్ – బాడీ కోఆర్డినేషన్ (సమన్వయం)కి సంబంధించి చేతిరాత ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు.ఎందుకంటే చేతిరాత అనేది నాడీ – కండరాల చర్య. మెదడు పంపే సందేశాలను బట్టే రాసే వేళ్లు కదులుతాయి. మరైతే ఒకే భాషలో ఒకే అంశాన్ని రాసేవాళ్లందరి చేతిరాత ఒకేరకంగా ఉండాలి కదా? అంటే ఏ ఇద్దరి చేతిరాత ఒకటిగా ఉండే అవకాశం లేదు. కారణం.. వాళ్ల సబ్కాన్షస్ మైండ్లోని ఆలోచన, సంఘర్షణలు. అందుకే చేతిరాతను మెదడు రాతగా అభివర్ణిస్తారు. మనిషి వయసుతోపాటు ఆలోచనలు, మానసిక స్థితిలో కలిగే మార్పులను బట్టి చేతిరాతా మారుతూంటుంది.విద్య, వైద్యం.. నేరపరిశోధన, వైవాహిక బంధాలు ఇలా చేతిరాతను విశ్లేషించే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. చేతితో రాసే, గీసే అంటే అక్షరాలు, అసంపూర్తి గీతలు– డూడుల్స్, బొమ్మలు, సంఖ్యలు వగైరా అన్నీ ఈ శాస్త్రం పరిధిలోకి వస్తాయి. వీటి ఆధారంగా మనిషి వ్యక్తిత్వాన్ని గుర్తించే ప్రక్రియ అనాదిగా పలు నాగరికతల్లో ఉంది. ఒక నిర్దిష్ట అంశంగా గ్రాఫాలజీకి నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రాఫాలజీ (graphology) మీద తొలిసారిగా 1622లో ఇటాలియన్ డాక్టర్, తత్వవేత్త కామిలో బాల్డి ఒక పుస్తకం రాశారు. చేతిరాతతో మనస్తత్వాన్ని విశ్లేషించడానికి లాటిన్ స్క్రిప్ట్నే సౌకర్యంగా భావిస్తారు. గ్రాఫాలజీ ఒక అకడమిక్ సబ్టెక్ట్గా ప్రవర్తనా శాస్త్రం కోవలోకి వస్తుంది. ఇది ఎక్కువగా మనస్తత్వశాస్త్రం, నాడీమండల శాస్త్ర విశ్లేషణలను గ్రహిస్తుంది. యూరప్, అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో గ్రాఫాలజీ కోర్సులున్నాయి. గ్రాఫాలజీ సంఘాలూ ఉన్నాయి. ఈ సబ్టెక్ట్ను సూడోసైన్స్ అని విమర్శించేవాళ్లూ లేక΄ోలేరు. అయినా రోజురోజుకూ దీని ప్రాముఖ్యం పెరుగుతూనే ఉంది. అమెరికాతో పాటు మన దగ్గరా పెద్ద పెద్ద కంపెనీలు కొన్నిరకాల పదవులకు అభ్యర్థుల చేతిరాతనూ పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. సంబంధిత రంగంలో అభ్యర్థికి పూర్వ అనుభవం ఉన్నప్పటికీ కొన్ని లక్షణాలను బేరీజు వేయడం కోసం అలా చేతిరాతనూ పరిగణిస్తున్నారు. ఇంకా విద్య, వైద్యం, వ్యాపారం, నేరపరిశోధన, వైవాహికబంధాలు వంటి విషయాల్లోనూ చేతిరాతను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆరోగ్య రాత.. వివిధరకాల వ్యక్తిత్వ లక్షణాలతో పాటు మెదడులో ఉద్భవించి నెమ్మదిగా భౌతికంగా వ్యక్తమయ్యే కొన్నిరకాల ఆరోగ్యసమస్యలనూ చేతిరాతతో గుర్తించవచ్చు. ఉదాహరణకు.. ఆత్మవిశ్వాసం/ఆత్మన్యూనత, అభద్రత, చికాకుపడటం, మొండితనం, సేవాతత్పరత, పట్టుదల, భావాలను వ్యక్తీకరించలేక΄ోవడం, ఏకాగ్రత లోపం, గతం గురించిన ఆందోళన, ఆధిపత్య ధోరణి, ఎవరో ఏదో అనుకుంటారని చేయాల్సిన పనులు చేయలేక΄ోవడం, ఆరోగ్య సమస్యలైన బీపీ, థైరాయిడ్, మైగ్రైన్, ప్రొస్టేట్, శ్వాసకోశ ఇబ్బందులు వగైరా దాదాపు వందకు పైగా లక్షణాలను చేతిరాతతో గుర్తించవచ్చు.గ్రాఫోథెరపీ.. గ్రాఫాలజీ ద్వారా గుర్తించిన సమస్యలను గ్రాఫోథెరపీతో నెమ్మదిగా సరిచేసుకోవచ్చు. ఈ థెరపీ రాసే వేలును ఒక పద్ధతి ప్రకారం కదిలించడం ద్వారా నాడీ సంకేతాలను మెదడుకు పంపి తద్వారా ఉపచేతన మనస్సును ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ సర్వరోగ నివారణి కాదు. అలాగని వైద్యచికిత్సకు ప్రత్యామ్నాయమూ కాదు. చేయించుకుంటున్న చికిత్సకు ఒక సపోర్ట్గా మాత్రమే ఈ గ్రాఫోథెరపీ (graphotherapy) పనిచేస్తుంది. ఆధునిక జీవనశైలి సైడ్ ఎఫెక్ట్స్ అయిన మానసిక ఒత్తిడి, ఆందోళనలు నెమ్మదిగా అనేక శారీరక సమస్యలుగా మారుతాయి. ఉదాహరణకు హైపర్టెన్షన్, థైరాయిడ్, మైగ్రేన్, నిద్రలేమి, ప్రిడయాబెటిక్ మొదలైనవి. కాగితం మీద రాయడం ద్వారా మన ఆలోచనలకు ఒక స్థిరత్వం వస్తుంది. మనసు నెమ్మదిస్తుంది. గ్రాఫోథెరపీ ‘నాడీ మార్పిడి’ అనే సూత్రీకరణపై పనిచేస్తుంది. అంటే మెదడుకున్న సామర్థ్యం – కొత్తనాడీ మార్గాలను ఏర్పరచుకునే, పాతవాటిని మార్చుకునే వాటిపై ఆధారపడింది కాబట్టి చేతిరాత (Hand Writing) అనేది కేవలం కాగితం, కలానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది మెదడుకు సంబంధించిన, స్వస్థత కలిగించే ప్రక్రియ. పిల్లలకు.. చేతిరాత విషయంలో పిల్లలకు సంబంధించి పరిశీలిస్తే.. పిల్లల మెదడు బాల్యదశలో పరిణతి క్రమంలో ఉంటుంది కాబట్టి పదహారేళ్లు నిండేవరకు వాళ్ల చేతిరాతను విశ్లేషించరు. కానీ పిల్లలు ఒకవేళ అభద్రతకు, డిప్రెషన్కు గురవుతున్నా, తమలో తాము చిరాకు పడుతున్నా చేతిరాతతో గుర్తించవచ్చు. వాళ్ల చేతిరాతను శాస్త్రీయబద్ధంగా మలచడం ద్వారా ఆ సమస్యలనూ అధిగమించవచ్చు. స్వీడన్లో 2009లో స్కూళ్లలో పెద్ద ఎత్తున డిజిటలైజేషన్ను ప్రవేశపెట్టింది. పుస్తకాల్లో చదవడం, రాయడం చాలావరకు తగ్గిపోయాయి. దానివల్ల జరిగిన నష్టాన్ని పదిహేనేళ్ల తర్వాత కానీ గుర్తించలేకపోయారు. పుస్తకాలను, చేతిరాతను తిరిగి ప్రవేశపెట్టాలని ఇటీవలే నిర్ణయించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లలో పలుపద్ధతుల్లో రాయిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అక్షరాలను కలిపి రాయడమే ఉత్తమమైనది. కలిపి రాయడం వలన మెదడులోని వివిధ భాగాలు ప్రేరేపితమవుతాయని, నేర్చుకోవడానికి ఈ ప్రక్రియ చాలా ఉపయుక్తమైనదని, టైపింగ్లో అలాంటి ప్రేరణ జరగలేదని తేలింది. నార్వే యూనివర్సిటీ 2020లో పన్నెండేళ్లు నిండిన పిల్లలపై ఈ అధ్యయనం చేసింది. స్వీడన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లలో చేతిరాతను తప్పనిసరి చేయాలన్న నిర్ణయాలకు ఆ అధ్యయనం తోడ్పడింది. మాడ్యూల్.. చేతిరాతలో.. లెటర్ ఫార్మేషన్, కనెక్టివిటీ, జోనింగ్, స్పేసింగ్, వేగం.. అనే అయిదు ప్రధానాంశాలుండాలి. గ్రాఫోథెరపిస్ట్ (graphotherapist) పర్యవేక్షణలో ఒక క్రమపద్ధతిలో వీటిని నేర్చుకునేందుకు గ్లోబల్ పెన్మాన్షిప్ అకాడమీలో పిల్లల కోసం ఒక మాడ్యూల్ను రూపొందించింది. ఈ డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి వీలున్న ఒకే ఒక మార్గం చేతిరాత. అందుకే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అదిరిపోవాల్సిన అందాల పోటీలు..భయం..భయంగా..!
ఫిలిప్పీన్స్లోని సెబులో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2025 గాలా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం ఎంతో ఆకర్షణీయంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా భయాందోళనలతో గందరగోళంగా మారిపోయింది. అందాల భామలు రన్వేపే హోయలు ఒలికిస్తున్న సమయంలోనే 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా పోటీదారులు భయంతో వేదిక నుంచి దూరంగా పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.ఫిలిప్పీన్స్ భూకంపంభూకంప కేంద్రం సెబు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగో నగరం వరకు భూకంపం సంభవిస్తుందని గుర్తించి ప్రజలకు అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా మరణించగా, 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ప్రకృతి విపత్తు అంతర్జాతీయ అందాల పోటీకి అంతరాయ కలిగించిందని అందాల పోటీ నిర్వాకులు తెలిపారు. అయితే మిస్ ఆసియా-పసిఫిక్ ఇంటర్నేషనల్ (MAPI) ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పైగా అక్టోబర్ 1న జరగాల్సిన అందాలపోటీలకు సంబంధించిన అన్ని ఈవెంట్లను రద్దుచేస్తున్నట్లు కూడా ప్రకటించారు నిర్వాహకులు. అంతేగాక మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ (MUPH) ఆర్గనైజేషన్ సోషల్మీడియా పోస్ట్లో ఈ ఘోర విపత్తుకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొంది. "ఈ ప్రకృతి విలయం నుంచి కోలుకునేలా తమ సోదరీసోదరీమణులకు అండంగా నిలబడతాం. ఈ విషాద సమయంలో ఫిలిప్పీన్స్ బలం, స్ఫూర్తి, స్థితిస్థాపకత కొనసాగేలా మనవంతుగా కృషి చేద్దాం." అని పోస్ట్లో పిలుపునిచ్చింది. కాగా, సెబులో 6.9 తీవ్రతతో ఘోర భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ విపత్తులో చిక్కుకున్న క్షతగాత్రులను సంరక్షించే పనులను వేగవంతం చేసినట్లు ఫిలిప్పీన్స్ భద్రతా అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by 𝐏𝐚𝐠𝐞𝐚𝐧𝐭 𝐄𝐦𝐩𝐫𝐞𝐬𝐬 (@pageantempress) (చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
సౌందర్య సంరక్షణకు 'డీఎన్ఏ డీకోడ్'..!
అందం కోసం మగువలు ఎంతలా డబ్బుని వెచ్చిస్తారో తెలియంది కాదు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్లో రకరకాల సౌందర్య ఉత్పత్తులు అతివలను ఆకర్షించేలా వస్తున్నాయి. అయితే అవి అందరికీ సరిపోడవు. కొందరు సరిపోయినట్లు మరికొందరిలో మంచి పలితాలు రావు. ఇలాంటి సమస్య లేకుండా..నిగనిగలాడే అందం కోసం మన డీఎన్ఏతోనే సరిచేసుకుందాం అంటున్నారు ఒలివా క్లినిక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.ఎన్.రేఖా సింగ్. మీ డీఎన్ఏలోని ప్రత్యేక అంశాల ఆధారంగా కూడా అందమైన చర్మం, కేశ సౌందర్యం పొందవచ్చునని చెప్పారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.అందం కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, ఫేస్వాష్లు వాడి ఇబ్బంది పడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. మన డీఎన్ఏని డీ కోడ్ చేస్తే చాలు..అపురూపమైన సౌందర్యాన్ని సొంత చేసుకోవచ్చని చెబుతున్నారు. మన డీఎన్ఏని డీకోడ్ చేస్తే..మన శరీరం, జుట్లు, బాడీ తత్వం ఎలా ఉంటుందన్నది ఇట్టే తెలిసుకోవచ్చు. మన శరీర డీఎన్ఏలో ముఖంపై పిగ్మెంటేషన్తోపాటు వెంట్రుకల కుదుళ్లు పోషకాలను సక్రమంగా అందుకుంటున్నాయా లేదా? చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందా? అన్న అనేక విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. జీన్-ఐక్యూ వంటి ప్రోగ్రామ్స్లో కేవలం లాలాజల నమూనా ద్వారా ఈ డీఎన్ఏ వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చికిత్స ప్రారంభిస్తామని వివరించారు. అత్యాధునిక మైక్రో అరే టెక్నాలజీ ద్వారా చర్మం, వెంట్రుకలు, జీవక్రియలు, జీవనశైలి వంటి విషయాలకు సంబంధించి130 జన్యువులు, 150 లక్షణాలను పరిశీలిస్తారు. ఇవన్నీ వెంట్రుకలు రాలిపోవడం, కొలెజన్కు జరుగుతున్న నష్టం, పోషకాలు వంటి వివరాలు అందిస్తాయి. పరిష్కార మార్గాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఆక్నేనే తీసుకుంటే.. ఒత్తిడి, కాలుష్యం తదితరాలు కారణమని అనుకుంటాం కానీ.. డీఎన్ఏ పరీక్షల ద్వారా శరీరంలో మంట/వాపు వచ్చిన తరువాత మీకు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే మీ చర్మం వేగంగా స్పందిస్తుందా? అన్నది తెలుస్తుందన్నమాట. అలాగే.. అతినీల లోహిత కిరణాలు, కాలుష్యాలను తట్టుకునే సామర్థ్యం మీ చర్మానికి ఎక్కువగా లేదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల ద్వారానే తెలుస్తుంది. వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి వివరాలు బోలెడన్ని తెలుస్తాయని డాక్టర్ రేఖా సింగ్ తెలిపారు. ఈ వివరాల ద్వారా ఒకొక్కరికి ఒక్కో రకమైన, సమర్థ పరిష్కార మార్గాలు సూచించవచ్చునని వివరించారు. దాంతో ఎలాంటి సౌందర్య చికిత్సలు తీసుకుంటే చాలు అన్నది అర్థం అవుతుంది. తదనుగుణంగా అనుసరిస్తే..అందమైన చర్మం, నిగనిగలాడే జుట్టుని సులభంగా పొందవచ్చట. అంటే మన జన్యువుల ఆధారంగా చర్మాన్ని రిపేర్ చేసుకోవడం. సమస్య ఎక్కడుందన్నది తెలిస్తే..పరిష్కరించడం మరింత సులభవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. డీఎన్ఏ డీకోడ్ అంటే..జన్యు సమాచారం (genetic information)ను అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. ఇది జీవుల శరీరంలో ఉన్న డియోక్సిరిబోన్యూక్లిక్ ఆమ్లం (DNA)లోని న్యూక్లియోటైడ్ క్రమాన్ని శాస్త్రవేత్తలు చదివి అర్థ చేసుకుంటారన్నమాట. దాంతో జీవి శరీర లక్షణాలను ఈజీగా అంచనా వేస్తారు పరిశోధకులు. అంటే ఉదాహరణకు, ఎత్తు, చర్మ రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి. డీఎన్ఏతో ముందుగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నది అంచనా వేయడమే కాదు, అందానికి మెరుగులు కూడా పెట్టుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.ఈ డీఓన్ఏ డీకోడ్తో శరీర లక్షణాలను అంచనా వేసి తగిన విధంగా డెర్మటాలజిస్టులకు సలహాలు సూచనలు ఇస్తారు. దీని సాయంతో వ్యద్ధాప్య ఛాయలను సైతం నివారించొచ్చుని కూడా చెబుతున్నారు. అంతేగాదు ఎలాంటి పోషకాహారం మన శరీరానికి అవసరం, ఎలాంటి జీవనశైలి మనకు సరిపోతుందనేది నిర్థారిస్తారట. ఫలితంగా అందరూ ఆశించే కలల సౌందర్యాన్ని చాలా ఈజీగా సొంత చేసుకోగలుగుతారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముందు ముందు ఈ డీన్ఏ డీకోడ్ సౌందర్య సంరక్షణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: తాగునీరు అంత విలువైనదా..?) -
తాగునీరు అంత విలువైనదా..?
ఉదయం బ్రష్ చేయడం మొదలు రాత్రి వరకు ఒక్కొక్కరు ఎంతో నీటిని వృథా చేస్తున్నాం.. అవసరం ఉన్నంత వరకు మాత్రమే భోజనం చేసే మనం.. నీటి పొదుపునకు మాత్రం ఏ మాత్రం విలువనివ్వడం లేదు. నిత్యం లక్షల లీటర్ల నీటిని డ్రైనేజీలో కలిపేస్తున్నాం. సింగపూర్ దేశం పేరు చెబితే వావ్.. అనే మనం అక్కడి తాగునీటి పరిస్థితి గురించి తెలిస్తే మాత్రం వామ్మో.. అనాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన 6వ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడి పరిస్థితులను వివరిస్తుంటే.. ఆలోచనలో పడాల్సిందే.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్)కు చెందిన 43 మంది విద్యార్థులు ఇటీవల సింగపూర్లో పర్యటించి వచ్చారు. ఆ బృందంలో ఆరో తరగతి చదువుతున్న అనమల నేహాశ్రిత కూడా ఉన్నారు. ఆ పర్యటన తనకు తాగునీటి విలువ తెలిసేలా చేసిందని, ఇకపై నీరు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని చెబుతోంది. ఈ సందర్భంగా చిన్నారి నేహా బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఇలా.. ‘నాలుగు రోజుల పర్యటనలో యూనివర్సల్ స్టూడియో, మెర్లైన్ పార్క్ సహా అనేక ప్రాంతాలు తిరిగాం. అన్నింటికంటే మరీనా బరాజ్ ఎన్నో విషయాలు నేర్పింది. సింగపూర్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నదులు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు చాలా తక్కువ. ఈ బరేజ్లో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు సముద్ర జలాలను తాగునీరుగా మారుస్తున్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి సింగపూర్ ప్రభుత్వం మలేషియా నుంచి కొనుగోలు చేస్తోంది. సీవేజ్, వేస్ట్ వాటర్ను రీసైకిల్ చేసి వాడుకుంటోంది. ఈ నీరు తాగడం ఇష్టం లేక బాటిల్ కొనుక్కోవాలంటే 2.8 సింగపూర్ డాలర్లు(రూ.193) వెచి్చంచాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, నీటి భద్రతను జాతీయ భద్రతగా భావిస్తున్న ఆ ప్రభుత్వం.. ఇలా అన్నీ చూసిన తర్వాత తాగునీటి విలువ ఏంటో తెలిసింది. మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాలుష్య, నీటి వృథా ఉండకూడదని తెలుసుకున్నా. ఇవి పాటించడంతో పాటు నాకు తెలిసిన వారికీ వివరిస్తూ పాటించాలని సూచిస్తా. దీనికోసం ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) తయారు చేస్తున్నా. నాలో మార్పు తీసుకువచ్చిన ఈ సింగపూర్ పర్యటనకు అవకాశం ఇచ్చిన స్కూల్, మాతో వచ్చి కొత్త విషయాలు నేర్పించిన టీచర్స్కు ధన్యవాదాలు’. -
సంకల్పమే శక్తి స్వరూపం..!
పల్లెటూరి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుకుంటుంది. కానీ ఎన్నో అడ్డంకులు. ఆటంకాలు. ఆడపిల్లకు అవసరమా అని ప్రశ్నలు. అయితే సంకల్పమే శక్తిగా ఆ అమ్మాయి అనుకున్నది సాధిస్తుంది. ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్న ‘కన్యాకుమారి’లో హీరోయిన్ గీత్ షైనీతన సంకల్పాల గురించి దసరా దాండియా గురించి చెబుతున్న విశేషాలు. ‘నేను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకున్నాను. స్కూలు ఫస్ట్ వచ్చాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. అయినా సరే నా కోరికలు ఏవీ మీరు పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటే డిగ్రీలో చేర్పించారు. ఇంత తెలివి పెట్టుకుని చీరల కొట్టులో సేల్స్గర్ల్లా చీరలు అమ్ముకుంటున్నాను’ అని తల్లిదండ్రులను, అన్నయ్యను నిలదీసి తన వేదనను చెప్పుకుంటుంది కన్యాకుమారి అనే అమ్మాయి ‘కన్యాకుమారి’ సినిమాలో.కన్యాకుమారిది ఒకటే కల. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనేది. కాని ఇంటి పరిస్థితులు, అమ్మాయి అనే కారణంతో చదివించక΄ోవడం... ఇవన్నీ ఆమె కలలను సగంలోనే తుంచేస్తాయి. కాని కన్యాకుమారి తన కలను లోలోపల సజీవంగా ఉంచుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి ప్రేమను గౌరవిస్తూనే, రైతుగా ఉండాలనే అతని అభిలాషను గౌరవిస్తూనే తన లక్ష్యం తీవ్రతను అందరికీ తెలియచేసి హైదరాబాద్కు వెళ్లి సాఫ్ట్వేర్ కోర్సులు చేయడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అమెరికాకు కూడా వెళ్లి వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుంటుంది.ఇటీవల ఇలాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కథ తెలుగులో లేదు. అందుకే ఓటీటీలో ‘కన్యాకుమారి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆ పాత్ర పోషించిన గీత్ సైనీకి ప్రేక్షకులు ఫుల్మార్కులు వేస్తున్నారు. గీత్తో సంభాషణ:మీ పేరు తెలుగు పేరనిపించడం లేదు.గీత్ సైనీ: మా పూర్వికులది రాజస్థాన్. మా తాతల కాలంలోనే అదిలాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. అదిలాబాద్లో నేను పుట్టి పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్లో మా కుటుంబం సెటిల్ అయ్యింది. మా నాన్న టీచర్. అమ్మ హౌస్ వైఫ్. యాక్టింగ్ మీద ఆసక్తి ఎలా?జ: స్కూల్లో బాగా అల్లరి చేసేదాన్ని. టీచర్లను ఇమిటేట్ చేసి ఫ్రెండ్స్ను నవ్వించేదాన్ని. డాన్సర్ కావాలనుకున్నాను. అయితే టెన్త్ క్లాస్ అయ్యాక అందరు ఫ్రెండ్స్ నా ఆటోగ్రాఫ్ బుక్లో ‘నువ్వు మంచి నటివి అవుతావు’ అని రాశారు. వారు రాసింది చూశాక నేను నటిని కావాలనుకునే కోరిక నాలో నా చుట్టూ ఉందనిపించింది. తొలి అవకాశం ఎలా వచ్చింది?జ: నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. థర్డ్ ఇయర్లో ఉండగా కాలేజీ ఈవెంట్లో డాన్స్ చేస్తే ఒక సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ‘అల’ అనే షార్ట్ఫిల్మ్ కోసం నన్ను సంప్రదించారు. అయితే ఈ అవకాశం వచ్చినట్టు నాన్నకు చెప్పే ధైర్యం లేక మెసేజ్ చేశాను– ఇలా చాన్స్ వచ్చింది... నో చెప్పేశాను అని. నాన్న కాసేపటికి ఫోన్ చేసి ‘మంచి డైరెక్టర్ అంటున్నావు కదా బేటా చేయి’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను.తొలి సినిమా అవకాశం?జ: సృజన్ అట్టాడ తన ‘పుష్పక విమానం’ కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన ఇస్తే నా ఫ్రెండ్ నా ఫొటోలు పంపింది. అలా ఆ సినిమాలోని రెండు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్లలో ఒకటిగా చేశాను. అయితే సృజన్ తీయబోతున్న ‘కన్యాకుమారి’ లో నాకు హీరోయిన్ చాన్స్ వస్తుందనుకోలేదు. శ్రీకాకుళం అమ్మాయిగా మారి ఆడిషన్ ఇచ్చాక ఆయన సంతృప్తి చెంది ఈ అవకాశం ఇచ్చారు. కన్యాకుమారి పాత్రను ఎలా ఓన్ చేసుకున్నారు?జ: నేను బయట మామూలుగా చాలా కామ్గా ఉంటాను. ఎవరైనా బాగా పరిచయమైతే ఇక నా వాగుడు తట్టుకోవడం కష్టం. ఆ లోపలి మనిషిని ఈ పాత్ర కోసం బయటకు తెచ్చాను. ఆడపిల్లలు తమ రెక్కలను పూర్తిగా సాచాలి. సీతాకోక చిలుకల్లా ఎగరాలి. అందుకే పోస్టర్లో సీతాకోక చిలుక ఉంటుంది. అలాంటి గట్టి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందులో చీరల పేర్లన్నీ చెప్పే క్లిప్ బాగా వైరల్ అవుతోంది. చిన్నపుడు మీరు దసరా ఎలా జరుపుకునేవారు?జ: ఆదిలాబాద్లో మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సరిహద్దు ప్రాంతం కాబట్టి. దసరా వస్తే బాగా దాండియా ఆడేవాళ్లం. బతుకమ్మ కూడా ఆడేదాన్ని. కన్యాకుమారి షూట్ సమయంలో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు దసరా వచ్చింది. అక్కడ దసరా సందడి వేరేగా అనిపించింది. వీధి వీధికి దుర్గ మంటపాలు, కోలాటం... చాలా సందడి చేశాం అందరం.నేటి అమ్మాయిలకు ఏం చెబుతారు?జ: ఏ సందర్భంలోనూ ఓటమి ఒప్పుకోవద్దు. కల ముగిసిపోయిందని అనుకోవద్దు. మరుగున పడ్డ లక్ష్యాలను తిరిగి సజీవం చేసుకుని పోరాడాలి. ఏదో ఒకరోజుకు గెలుస్తాం.– సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి (చదవండి: Vijayadashami: స్త్రీ శక్తే విజయ దశమి..) -
సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..
ఉన్నత చదువులు చదివించడం సాధ్యం కాదని ప్రతి మధ్యతరగతి తలిదండ్రులు అనుకుంటుంటారు. తమ తాహతకు మించి చదువులు అనవసరం అనే భావన చాలామంది పేరెంట్స్లో ఉంటుంది. కానీ ఇక్కడొక వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా..ఇద్దరి పిల్లల్ని డాక్టర్లుగా చేశాడు. ఏడు సార్లు ఫెయిలైనా..తన పిల్లలు ఏనాటికైనా సాధిస్తారనే భావించాడు. కొడుకులు కూడా అతడి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. స్ఫూర్తిదాయకమై కథ, పేరెంటింగ్కి గొప్ప నిర్వచనం కూడా.27 ఏళ్ల జినాల్, అతడి తమ్మడు 22 ఏళ్ల పారిన్ ష్రాఫ్లు వైద్యులుగా తీర్చిదిద్దడానికి తమ తల్లిదండ్రులు ఎంతలా కష్టపడ్డారో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డాక్టర్లు కానున్నా ఇద్దరు సోదరులు తమ ప్రస్థానం అంత ఈజీగా సాగాలేదన్నారు. తమ తాత గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోవడంతోనే డాక్టర్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. తమ తల్లిదండ్రుల జీవనాధారం సమోసాల దుకాణం. దాని మీద వచ్చే ఆదాయంతోనే కష్టపడి చదింవించారని తెలిపారు. అయితే నిట్ ఎగ్జామ్ ప్రిపేరవ్వతున్నప్పుడూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారో కూడా చెప్పారు. జినాల్ నీట్ కల దాదాపు సాధ్యం కాదనే పరిస్థితుల్లో ఉన్నట్లు నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. వరుసగా మూడుసార్లు ఫెయిలై ఇబ్బంది పడుతున్న తరుణంలో మరో ప్రయత్నంలో అనారోగ్యం బారినపడి ఎంతలా ఇబ్బంది పడ్డాడో వివరించాడు జినాల్. అలా ఏడుసార్లు ఫెయిలైనా తల్లిదండ్రులు ఏం పర్లేదు అంటూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రలు చూపిస్తున్న అపారమైన ప్రేమ తనలో కసిని పెంచి ఏడో ప్రయత్నంలో విజయం సాధించడమే కాదు మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు పెద్దవాడు జినాల్. ఇక సోదరుడు పారిన్ ష్రాఫ్ రెండో ప్రయత్నంలోనే విజయ కేతనం ఎగరవేశాడు. అంత బాగానే సాగింది అనుకునేలోపు ఆ సోదరులు కాలేజ్లో సీట్లు పొందడానికి 20 లక్షల బాండ్లను సమర్పించాల్సి ఉంది. తనఖా పెట్టడానికి ఎలాంటి ఆస్తి లేని ఆ నిరుపేద కుటుంబం మళ్లీ కుదేలు అయిపోంది. ఆ ఆపదను గట్టెక్కించడానికి తండ్రి స్నేహితులు మందుకు రావడం విశేషం. అంతేగాదు ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడంలో తమ గురువు రామానంద్ సార్ పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తమ ఆర్థిక పరిస్థితి గమనించి.. పలు స్కాలర్షిప్లు, మెంటర్షిప్లు, వంటి వాటి గురించి తెలియజేసి ప్రోత్సహించారని తెలిపారు. ఆ ఇరు సోదరులు వైద్య విద్య మూడో ఏడాది చదువుతున్నారు. ఇక తమ చదువు పూర్తి అయ్యిన వెంటనే పేద రోగులకు ఉచిత వైద్య అందించేలా చేయడమే తమ లక్ష్యం అని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఆ సరస్వతి పుత్రులకు ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి..(చదవండి: భారత్ జిమ్ సంస్కృతి బాగుంటుంది..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..) -
భారత్లోని జిమ్లే బాగుంటాయ్..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..
విదేశీయులు మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడటం కొత్తేం కాదు, గానీ తాజాగా జిమ్ పరంగా కూడా భారత్నే మేటి అనే కితాబిచ్చేసింది ఓ విదేశీ మహిళ. వాస్తవానికి మనకంటే అత్యాధునిక టెక్నాలజీని అనుసరించే పాశ్చాత్య దేశాలు..ఫిట్నెస్ విషయంలో మనకంటే ముందుంటారు. అలాంటిది భారత్లోని జిమ్ సౌకర్యమే బాగుటుందని చెబుతోంది. ఇక్కడ ట్రైనర్స్ శిక్షణే బాగుంటుందని, ఈ విషయంలో యూరప్ దేశాలు భారత్ని నేర్చుకోవాలంటూ చురకలంటిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఎనిమిదేళ్లకుపైగా భారత్లోనే నివశిస్తున్న విక్టోరియా చక్రవర్తి భారత్ జిమ్లో వ్యాయామాలు చేస్తున్నట్లు పేర్కొంది. యూరోపియన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ భారతీయ జిమ్ సౌకర్యం నుంచి చాలా నేర్చుకోవాలని అంటుంది. రూల్స్, సేవలు, వెసులబాటు వరకు అంతా సామాజిక వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఇరు దేశాల మధ్య జిమ్ సంస్కృతిలో చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగు పాఠాలను తప్పక నేర్చుకోవాలని అంటోంది. ఆ నాలుగు పాఠాలు.సరసమైన ధరలో జిమ్ సౌకర్యం దొరుకుతుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అలాగే తక్కువ ధరకే పూర్తి సౌకర్యాలందించే జిమ్లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిందికమ్యూనిటీ వెబ్: భారతీయ జిమ్లు సామాజికంగా కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, చిట్కాలు పంచుకుంటారు, ఒకరినొకరు గుర్తిస్తారు, ట్రైనర్ పేరును కూడా తెలుసుకుంటారు. యూరప్లోలా ఎవరికివారుగా ఉండరు. జిమ్లు సాధ్యమైనంత త్వరితగతిన తెరుచుకుంటాయి. నెల ఇట్టే గడిచిపోతుంది. విద్యార్థులు, కొత్తగా నేర్చుకునేవారికి ప్రత్యేక నిపుణుల సూచనతో కూడిన శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయంలో యూరప్ జిమ్లో వార్షిక ఒప్పందాలు ఉంటాయి. అవి కూడా కఠిన నిబంధనలని అంటోంది విక్టోరియా. అలాగే భారత్లో ట్రైనర్ల సలహాలు సూచనలకు అధనంగా సొమ్ము చెల్లించాల్సిన పని ఉండదు. భారత్లో ఫిట్నెస్ ట్రైనర్లు తమ శిక్షకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ కొరకు యూరప్లో అదనంగా చెల్లించాలని అంటోంది. ఫిట్నెస్ పరంగా భారత్ నుంచి యూరప్ చాలా నేర్చుకోవాలని, భారత్లా ఉండాలని అంటోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెతో ఏకభవించడమే కాదు, భారతీయ సంస్కృతిని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పారు పోస్టులyో. కాగా, సదరు ఇన్ఫ్లుయెన్సర్ విక్టోరియా గతంలో తనను చాలామంది భారత్కు వెళ్లవద్దని సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆమె ఇక్కడకి రావడమే గాక ప్రేమలో పడటమేగాక ఇక్కడే వ్యాపారాన్ని కూడా నిర్మించిన తన విజయవంతమైన ప్రస్థానాన్ని అంతకుమునుపే పంచుకుంది కూడా. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty)(చదవండి: నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..) -
నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్ఫుల్గా తినటం..మైండ్ఫుల్గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
విజయాలను ఒసగే విజయదశమి అంతరార్థం ఇదే..!
ఈ విజయదశమికి ఆత్మజ్ఞానాన్ని మన జీవితాలలో ఉదయించన్నవ్విండి అని పిలుపునిచ్చారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశింకర్. విజయదశమిని మనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకింటున్నాం, నిజానికి ఈ యుద్ధం మంచికి, చెడుకి మధ్య కాదు. వేదాంత పరంగా చూసినప్పుడు, బయట ప్రపంచంలో కనిపించే ద్వైతభావనపై అనంత వ్యాప్తమై ఒకటిగా మాత్రమే ఉన్న సత్యం సాధించే విజయిం అది. శుద్ధచైతన్య స్వరూపమైన జగన్మాతే అన్ని రూపాలు, నామాలలో న్నిండి ఉంది. ఈ విధంగా అంతట నిండి ఉన్న ఒకే ఒక్క దైవత్వాన్ని అన్ని రూపాలలోనూ దర్శించగలగటమే ఈ పండుగ పరమార్థం. దైవీభావనకు, ఆసురీభావనకు జరిగే ఈ యుద్ధం బయట ప్రపంచంలో మాత్రమే కాదు, అది మన మనసులో ఎపుుడూ జరుగుతూనే ఉంది. విజయదశమినాడు రావణుడి బొమ్మను దహనం చేయటం మనం చాలాచోట్ల చూస్తున్నాం. రావణుడు అహంకారానికి చిహ్నం. అహం అంటే 'నేను వేరు' అనే తప్పుడు భావన. దాంతో వాళ్ల చుట్టూ వాళ్లే గోడలు కట్టుకుంటాం. ఆ అహంకారన్ని అణిచేందుకు వాళ్లకంటే వేరుగా మరొకరు (నేను వేరు, అతడు/ఆమె వేరు అనే భావన) కావాలి. ఆత్మవిశ్వాసానికి ఆ అవసరం లేదు. తాము ఇతరుల కంటే గొప్పవాళ్లమని అహంకారులు అనుకుంటారు. ఇక రాముడు ఆత్మజ్ఞానాన్నకి ప్రతీక. శ్రీరాముడు ఆత్మను, ఆత్మజ్ఞానాన్ని కూడా సూచిస్తాడు. వ్యక్తిలో ఆత్మజ్ఞానం (రాముడు) ఉదయించినపుడు, లోపల ఉన్న అహంకారం, చెడు భావన రూపంలో ఉన్న రావణుడు సంపూర్ణంగా నశించిపోతాడు. దీనికి సూచనగా ఈరోజు మనం మనలో ఉన్న చెడు భావనలను జ్ఞానం అనే అగ్నికి ఆహుతి ఇస్తాం (సమర్పిస్తాము). ఆ విధంగా సమర్పించటం వల్ల మన అంతరంగ వికాసం ఆరంభం అవుతుంది. మనలో అద్భుతమైన ఆనందం పెలులబుకతుంది, అది మనకే కాక సమాజమంతటికి మంచి చేస్తుంది. ఈ సంత్సర కాలమంతా సేకరించుకుపి మన మనసులో పేరుకున్న ఇష్టాఇష్టాలు, రాగద్వేషాలపై మనం విజయిం సాధించటాన్ని ఈ విజయదశమి రోజు సూచిస్తుంది. దైవీభావనల ఎఱుక మనలో కలిగినపుడు అది నిజమైన విజయం. అపుడు మన జీవితంలో శాంతి, ఆనందం, సౌభాగ్యం కలుగుతాయ. చెడు భావనలు మనలను ఆక్రమించుకున్నప్పుడు మనం దుుఃఖాన్ని, కష్టాలనును అనుభవిస్తాము. అందుకే వేదకాలంలో ప్రజలు ఒకర్నొకరు పలకరించుకనేటపుుడు “ఆరోగ్యమస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు” (మీరు ఆరోగ్యంగా, తృప్తిగా ఉండాలి, మీ కార్యాలు శుభకరంగా జరగాలి) అన్న చెప్పేవారు. రావణ వినాశనం అనేది తిరుగులేని రామబాణంతో మాత్రమే జరుగగలదు. అదే విధంగా అన్నిరకాలైన చెడుభావనలు, మానసిక చాంచల్యాలపై ఆత్మజ్ఞానంతోనే విజయిం సాధించగలం. సరే, మరి ఈ ఆత్మజ్ఞానాన్ని పిందటిం ఎలా? (హిందీలో) విశ్రామ్ మే రామ్ హై (విశ్రాంతి లో రాముడు ఉన్నాడు) అన్న చెపునటులగా, ప్రగాఢమైన విశ్రాంతి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈనాటి సమాజంలో మనం చూస్తున్న అలజడులన్నిటికీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత లేకపోవటమే కారణం. “నే నెవరు?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే కాదు, మీరు ఎవరు కాదు అని కూడా అడగిండి. “నేను ఈ శరీరాన్ని కాదు, మనసును కాదు, బుద్ధిని కాదు...” ఇలా విచారించి చూసినపుడు చివరికి ఏం మిగులుతిందో గమన్నించిండి! ఈ విధంగా మన స్వస్వభావాన్ని గమనించుకోవటం అనేది మన ఆత్మను ఉత్తేజపరచి మనలో సింతృప్తిని పెంపొందిస్తుంది. ఒక మనిషి మనసులో ఈ ప్రశ్నలు రేకెత్తిన మరుక్షణమే అతని జీవితంలో కష్టాలు, చెడు భావనలు అంతరించిపోవట ఆరంభమవుతుంది. అయితే, ఎంత విచారించినా సరే మళ్ళీమళ్ళీ మన మనసు వేసే చిక్కుముళ్లలో మనం పడుతూనే ఉంటాం. ఇవి మనకు మనమే వేసుకుంటున్న బంధాలు. ఈవిధమైన గందరగోళ స్థితినే యోగులు మాయ అపి పిలిచారు. ఈ మాయ నుంచి బయటపడేందుకే మనక ధ్యానం అవసరం. అందుకే, ఈ ముసుగును తొలగించుకునేందుక అనేక మార్గాలు సూచించారు: మనం పండుగలు, ఉత్సావాల జరుపుకుంటాము, జగన్మాతను ఆరాదిస్తాం, దైవం మనలోపలే ఉన్నదని, అంతే కాక విశ్వమంతా స్వచ్ఛమైన చైతన్యంగా నిండి ఉన్నదని మనకు మనమే గుర్తుచేసుకుంటాం. ఈ సమస్త విశ్వం ఆ ఏకైక చైతన్యపు లీల. దీన్నే మనం పదేపదే తప్పక గుర్తు చేసుకోవాలి అని అన్నారు గురుదేవ్ రవిశంకర్.(చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు
మా కూతురికి పెళ్లి చేసి ఐదేళ్లవుతోంది. పెళ్లి చేసేటప్పుడు కట్నం కింద ఎకరా భూమి – ఒక ఇల్లు ఇచ్చాము. గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేశాము. ఇదేకాకుండా మా అమ్మాయి సొంత సంపాదన అయిన మరొక ఇంటి స్థలం కూడా ఉంది. మా అమ్మాయికి సంతానం లేరు. అయితే దురదృష్టవశాత్తూ మా కూతురు – అల్లుడు ఇటీవలే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు తన సొంతగా సంపాదించుకున్న భూమితోపాటు మేము ఇచ్చిన భూమి, ఇల్లు కూడా తిరిగి ఇచ్చేది లేదు అంటూ మా అల్లుడు గారి తల్లి – అక్క పేచీ పెడుతున్నారు. ఒక లాయర్ను సంప్రదించగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాకు ఏమీ రాదు అని చెబుతున్నారు. అది నిజమేనా?– రామ సుధ, సూర్యాపేటహిందూ వారసత్వ చట్టం, 1956 లోని సెక్షన్ 14 ప్రకారం ఒక హిందూ మహిళ వారసత్వం ద్వారా, వీలునామా ద్వారా, విభజన ద్వారా, మెయింటెనెన్స్లో (బకాయిలతో కలిపి) భాగంగా, మరొక వ్యక్తి నుంచి బహుమతిగా/గిఫ్ట్ ద్వారా ఆమె వివాహానికి ముందు, వివాహ సమయంలో లేదా వివాహం తరువాత, మరే ఇతర విధంగా సంక్రమించినప్పటికీ, స్వార్జితం ద్వారా లేదా ‘స్త్రీ ధనం’ రూపేణా వచ్చినప్పటికీ, అది ఆమె పూర్తి హక్కులు కలిగిన సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఇదే చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం వీలునామా రాయకుండా మరణించిన హిందూ మహిళ ఆస్తి ఈ కింది పేర్కొన్న వారికి (వారసత్వంగా) క్రమ పద్ధతిలో చెందుతుంది: అంటే మొదటి క్రమంలో ఉన్నవారు ఉంటే కేవలం వారికి మాత్రమే చెందుతుంది. వారు లేని పక్షంలో రెండవ నిబంధనలో చూపించిన వారికి, వారు లేకపోతే మూడవ వారికి, అలా ఎవరూ లేకపోతే ఆఖరున చూపిన వారికి చెందుతుంది.1) మొదటగా: కొడుకులకు, కూతుళ్లకు (కొడుకు కూతురు మరణించి ఉంటే వారి సంతానానికి) – భర్తకు2) రెండు: భర్త వారసులకు3) మూడు: తల్లికి– తండ్రికి4) నాలుగు: తండ్రి వారసులకు5) ఆఖరున: తల్లి వారసులకుఇక మీ విషయానికి వస్తే, మీ అమ్మాయికి మీరు ఇచ్చింది గిఫ్ట్ డీడ్ అని చెప్పారు. అది వరకట్నంగా ఇప్పుడు రుజువు చేయటం సాధ్యపడకపోవచ్చు. ఈ లావాదేవిని స్త్రీ ధనం లాగానే పరిగణిస్తారు. ఒకవేళ మీరు సంపాదించి తనకి ఇచ్చినప్పటికీ ఆ ఆస్తి మీ కూతురి స్వంత ఆస్తి అయిపోయింది. మీ అల్లుడిగారి తల్లి – అక్క కూడా బతికే ఉన్నారు కాబట్టి, పైన చూపిన విధంగా తన భర్త వారసులైన వారికే మీ అమ్మాయి ఆస్తి చెందుతుంది. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఒక కేసు పరిష్కరించే క్రమంలో ‘‘ఒక హిందూ మహిళకి పెళ్లి అయిన తర్వాత తన గోత్రం మారుతుంది. దానితో తన ఆస్తులు కూడా భర్తకి చెందుతాయి కానీ ఆమె తల్లిదండ్రులకు కాదు’’ అని పేర్కొంది. మీ అమ్మాయి భర్త, భర్త వారసులు లేని పక్షంలో మాత్రమే మీకు తన ఆస్తి వచ్చే అవకాశం ఉంది. అయితే మీ అమ్మాయికి ఇచ్చిన ఆస్తి ఒకవేళ తనకి వారసత్వంగా చెందినది అయితే మాత్రం, ఆ వారసత్వ మూలానికి తిరిగి వెళ్ళిపోతుంది. మీ వద్ద ఉన్న పత్రాలను తీసుకుని ఒకసారి లాయరు గారిని కలవండి. మీ కేసులో మీ పక్షాన ఏదైనా వీలు ఉంటే చూసి చెప్పవచ్చు. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కుమెయిల్ చేయవచ్చు. )(చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
'పెయింట్ ది సిటీ పింక్'..
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము కేన్సర్ అవగాహనకు అక్టోబర్ నెలను గుర్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఉషలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పెయింట్ ది సిటీ పింక్’ వార్షిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రసిద్ధ భవనాలను పింక్ లైటింగ్తో కాంతులీనేలా చేశారు. వీటిలో చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ–హబ్, ప్రసాద్ ఐమ్యాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్స్ వంటివి ఉన్నాయి. ప్రసిద్ధ భవనాలను గులాబీ రంగు లైట్లతో వెలిగించడం ద్వారా భాగ్యనగర నగరవాసుల దృష్టిని ఆకర్షించడం, రొమ్ము కేన్సర్ పై అవగాహన, ఆసక్తి కలిగించడం సంబంధిత లక్ష్యాలతో దీనిని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ తెలిపారు. (చదవండి: టాయ్పప్పీ స్ఫూర్తితో.. లెదర్ ఫ్యాషన్ యుటిలిటీ ఆవిష్కరణ) -
టాయ్పప్పీ స్ఫూర్తితో.. లెదర్ ఫ్యాషన్ యుటిలిటీ ఆవిష్కరణ
టాయ్ పప్పీ స్ఫూర్తితో మినీ లెదర్ బ్యాగ్ రూపకల్పన చేసింది ఎఫ్డీడీఐ విద్యార్థిని స్నిగ్ధప్రియ. తనలోని నైపుణ్యానికి పదునుపెట్టి తనదైన శైలిలో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మినీబ్యాగ్, స్లింగ్బ్యాగ్, స్పెక్ట్స్హోల్డర్ను తయారుచేసి తన క్రియేటివిటీని చాటింది. వీటిని రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో మంగళవారం ప్రదర్శించారు. కాగా స్నిగ్ధప్రియ ఎఫ్డీడీఐలో బీ.డీఈఎస్ లైఫ్స్టైల్ యాక్సెసరీస్ డిజైనర్ కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో వీటిని ఆవిష్కరించినట్లు ఆమె తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి.. భవిష్యత్తులో మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్నదే నా లక్ష్యం. ఆర్టిఫీషియల్ లెదర్తో ఈ మూడింటినీ తయారు చేశాను. టాయ్పప్పీ స్ఫూర్తితో వీటికి రూపకల్పన చేశాను. మినీ బ్యాగు తయారీకి ఆరు ఇంచుల లెదర్, ఒక బటన్ అవసరమైంది. దీనికి రూ.51 వ్యయం చేశాను. దీనికి స్పెక్ట్స్ హోల్డర్గా నామకరణం చేశాను. రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ క్యాంపస్ నూతన ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.– స్నిగ్ధప్రియ, ఎఫ్డీడీఐ విద్యార్థి (చదవండి: మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!) -
మచుపిచ్చుపై..భాగ్యనగర వాసుల సాహసయాత్ర.!
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన 15 మంది బృందం పర్వతారోహణ చేసి విజయవంతంగా నగరానికి తిరిగొచ్చారు. 50 సంవత్సరాల పైబడ్డ వీరంతా రెండేళ్ల క్రితం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహించి విజయవంతంగా తిరిగొచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మచుపిచ్చు సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4న ఈ యాత్రకు వెళ్లిన బృందం సెప్టెంబర్ 16న తిరిగొచ్చింది. మచుపిచ్చు అనేది ప్రపంచంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఇది దక్షిణ అమెరికా దేశం పెరూలో ఉంది. మచు పిచ్చు సముద్ర మట్టానికి 2,430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ఇంకా సామ్రాజ్యం. ఇది పెరూలోని మచుపిచ్చు జిల్లా, ఉరుబంబా ఫ్రావిన్స్, కుస్కో ప్రాంతంలో ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోని (50 మైళ్లు) కుస్కోకు వాయువ్యంగా పవిత్రలోయపై ఒక పర్వత శిఖరంపై ఉంది. దీని ద్వారా ఉరుబంబా నది ప్రవహిస్తోంది. ఎక్కువ మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మచుపిచ్చు ఇంకా చక్రవర్తి పాచాకుటి (1438–1472) కోసం నిర్మించిన ఒక ఎస్టేట్ అని నమ్ముతారు. ఫిట్నెస్ ప్రతీకగా..ఈ సాహసయాత్రలో ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు, డాక్టర్ ప్రవీణ్మారెడ్డి, డాక్టర్ శశికాంత్ గోడె, డాక్టర్ నిఖిల్ ఎస్ గడియాల్పాటి, డాక్టర్ గుమ్మి శ్రీకాంత్, డాక్టర్ సల్లేష్ విఠల, డాక్టర్ సంజయ్, ఐటీ ప్రొఫెషనల్స్ విజయభాస్కర్, శివశంకర్, పురుషోత్తం, కృష్ణమోహన్, ప్రసన్నకుమార్, రవి మేడిశెట్టి, అడ్వకేట్ రమేష్ విశ్వనాథ్, కాంట్రాక్టర్ పృద్వీధర్ పాల్గొన్నారు. సౌత్ అమెరికా–భారత్ (సాంబ) 20 డిగ్రీస్ పేరుతో వీరు ఈ సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్రావు వీరికి కెపె్టన్గా వ్యవహరించారు. మచుపిచ్చు పర్వతం ఆండీస్ పర్వతశ్రేణిలో ఒక భాగం. 48 గంటల పాటు నడక మార్గంలో ఈ పర్వతాన్ని అతికష్టంతో అధిరోహించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ప్రతీకగా తాము ఈ పర్వతారోహణ చేపట్టినట్లు వీరు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ప్రపంచంలోని మరిన్ని పర్వతాల సాహసయాత్ర చేయనున్నట్లు తెలిపారు. (చదవండి: క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..! దేశంలోనే ప్రప్రథమం..) -
క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..!
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్లో రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్లో క్యూట్ క్యూట్ పప్పీస్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు. మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్లో ఆవిష్కృతం కావడం విశేషం. క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం.. ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 50 రకాలకుపైగా పిల్లులు.. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు. ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్సైట్లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. – ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు (చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
మహిళల్లోనే మహాశక్తి
‘‘మనందరిలో ఓ దుర్గా మాత ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించగలం. స్త్రీలు అనుకుంటే ఎలాంటి సవాల్ని అయినా అద్భుతంగా ఎదుర్కొంటారని నా నమ్మకం’’ అంటున్నారు పూజా హెగ్డే(Pooja Hegde). సౌత్–నార్త్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఆమె ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు...ఈ నవరాత్రి రోజుల్లో మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోతాం. ఈ పండగ అప్పుడు కుదిరితే గుడికి వెళతాను. లేకపోయినా నాకు తరచూ గుడికి వెళ్లడం అలవాటు. మన ఎనర్జీ లెవల్స్ బాగుండటానికి మనం గుడికి వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం. గుడిలో కాలు పెట్టగానే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం క్షేమంగా ఉండటానికి ఆ ఎనర్జీ పనికొస్తుంది. అందుకే గుడికి వెళ్లడాన్ని నేను బాగా నమ్ముతాను. → నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను కానీ నాకు ఫాస్టింగ్ అంటే నమ్మకం. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉపవాసం ఉండేవారు. తొమ్మిది రోజులు కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు. అంత కఠినమైన ఉపవాసం ఆచరించేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ‘అంగారిక సంకష్ట చతుర్ది’ నాడు, మహా శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ చేస్తాను. → చాలా సంవత్సరాలుగా నేను దాండియా ఆడలేదు. ఓ పదేళ్ల క్రితం నా స్నేహితులతో కలిసి దాండియా ఆడటానికి వెళ్లాను. గర్బా డ్యాన్స్ పోటీ జరుగుతోందని అక్కడికి వెళ్లాక తెలిసింది. ఈ కాంపిటీషన్ కోసం కొన్నిగ్రూప్స్ సభ్యులు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి మరీ పాల్గొంటారని తెలిసి, ఆశ్చర్యపోయాను. వాళ్ల డ్యాన్స్ నిజంగా అద్భుతం. నేను కూడా ఒక గ్రూపులోకి వెళ్లి, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. → ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంది. మనలో ఆ శక్తి స్వరూపిణి దుర్గా మాత ఉందని గ్రహించాలి. నవరాత్రి అంటే మనలో ఉన్న ఆ దేవిలోని పలు షేడ్స్ని సెలబ్రేట్ చేయడమే. మన లోపల ఉన్న దైవిక స్త్రీత్వాన్ని గుర్తించడమే. అయితే నేనిప్పటివరకూ గమనించినంతవరకూ స్త్రీలకు ఏదైనా సవాల్ ఎదురైతే అద్భుతంగా అధిగమించే నేర్పు వారికి ఉందని తెలుసుకున్నాను. కానీ మనకు మనంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయం మనకు అర్థం కావాలి. లోపల దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించి ముందుకెళితే మన వల్ల కానిది ఏదీ లేదు.→ నవరాత్రి సమయంలో నాకు బాగా నచ్చినది ‘హవన్’ (హోమం). హవన్లో బియ్యం, నువ్వులు, ధాన్యాలు, నెయ్యి వంటివి సమర్పించి, ఆ దుర్గా మాత ఆశీర్వాదాన్ని కోరతాం. హవన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా నవరాత్రి అప్పుడు బంధువులు ఇంటికి వస్తుంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ‘హవన్’కి మాత్రం అందరూ హాజరవుతారు. అలాగే పసుపు ఆకు తింటాం. ఆ ఆకు నుంచి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నా చిన్నప్పటి తీపి గుర్తుల్లో ఇదొకటి.→ మా ఇంట్లో తొమ్మిది రోజులు పండగను చాలా శ్రద్ధగా చేస్తాం. ఇందాక నవరాత్రి సమయంలో ఆచరించేవాటిలో నాకు ‘హవన్’ ఇష్టం అని చె΄్పాను కదా. అష్టమి రోజున అది చేస్తాం. మేం లక్ష్మీ పూజ కూడా బాగా చేస్తాం. అలాగే ‘మాంజో లిరెట్టా గట్టి’ అని వంటకం చేస్తాం. కొబ్బరి తురుము, బెల్లం కలిపి ముద్దలా కలిపి, పసుపు ఆకులో పెట్టి ఉడికిస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓ పట్టు పడుతుంటాను. → దసరా అనగానే మనకు చెడుపై మంచి గెలుపు అనేది గుర్తొస్తుంది. నా వరకూ నా చుట్టూ ఉన్న చెడు గురించి, చెడు చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడంపైనే దృష్టి పెడతాను. వందకు వంద శాతం పని చేయడం... మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం... ఈ రెంటినీ ఫాలో అవుతాను. అప్పుడు ఎన్నో రెట్లు రూపంలో మంచి మన వద్దకు వస్తుందని నమ్ముతాను. ఇక చెడు చేసిన వారి గురించి ఆలోచించకుండా... మానవులకు అతీతమైన ‘ఉన్నత శక్తి’కి వదిలేస్తాను.నవరాత్రి సమయంలో మా ఇంట్లో బాగా భజనలు చేస్తాం. నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకే పద్ధతిలోనే పండగ జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు. కానీ మన ఆచారాలను మనం ఎప్పుడూ ఒకేలా పాటించాలి. ఇప్పుడు వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను చాలా పండగలను మిస్సవుతున్నాను. అయితే ఏ మాత్రం వీలు కుదిరినా పండగలప్పుడు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను.– డి.జి. భవాని -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!
వంటను రుచికరంగా వండటం కూడా ఓ ఆర్ట్. అయితే పోషకాలు కోల్పోకుండా, రుచికరంగా వండటం అంటే.. అది అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ విటమిన్లు పోకూడదన్న ఆత్రుతలో తక్కువగా ఉడకిస్తే..టేస్ట్ లేదనిపిస్తుంది. అలా కాకుండా అన్ని సరిపడేలా టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా వండాలంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఈ రూల్లో వంట చేస్తే..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయలా చూసేద్దామా మరి..!.రుచికంగా రెస్టారెంట్లో కనిపించినట్లుగా కలర్ఫుల్గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానం ఎక్కువసేపు ఉడకించడాన్ని నివారించడం తోపాటు, విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడూ 3-3-2-2 రూల్ని అనుసరించడం మేలని చెబుతున్నారు నిపుణులు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతోపాటు, పోషకాలని కూడా కోల్పోరట. మరి ఈ రూల్లో ఎలా వండాలంటే..ఆ రూల్లోని మ్యాజిక్..ఒక గిన్నెలో రెండు స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్వెజ్ని వేయాలి. ఆ తర్వాత ఒక వైపు మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇంకొక్కసారి తిప్పి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే చాలట, రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఉంటుందంట. అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామట. ఇలా గ్రిల్ చేసేవాటికి, మంటపై గిన్ని పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్లో కనిపించినట్లు ముక్కలనేవి వడలిపోవు, చూసేందుకు అందంగానూ, రుచికరంగానూ ఉంటుందట. ఇది మంచిదేనా..?ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తి అయిపోవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చట. అలాగే ముక్కలు లేదా మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుందట. పైగా కొత్తగా వంట చేసేవారికి మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ.. -
ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..
ఫస్ట్డే డ్యూటీ ఎవ్వరికైనా భయంగానే ఉంటుంది. ఆరోజు కొత్తగా విధుల్లోకి రావడం..ఎలా ప్రవర్తించాలి, ఉండాలి వంటి వాటి గురించి చాలా ఆందోళనగా ఉంటుంది. ఆ ఒత్తిడి మొత్తం.. అవతలి వ్యక్తి ఆ రెండు అక్షరాలకు కట్టుబడి స్పందించిన తీరుతోనే ఉఫ్మని ఎగిరిపోతుంది. అలాంటి సమయంలోనే ఆ పదం అర్థం, విలువ తెలుసొస్తుంది. నెట్టింట వైరల్గా మారిన కండక్టర్ ఫస్ట్ డే డ్యూటీ స్టోరీ..ఓ గొప్ప పాఠాన్ని నేర్పిస్తోంది. చూడటానికి మనకు సామాన్యంగా కనిపించే కొన్ని పదాలు, గొప్ప అర్థాన్ని, అమూల్యమైన పాఠాలను బోధిస్తాయి. అలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు బీఎంటీసీ వజ్ర బస్సులో కొత్తగా కండక్టుర్ జాయిన్ అయ్యాడు ఒక వ్యక్తి. తొలిరోజు డ్యూటీ కావడంతో చాలా ఆందోళనకు గురయ్యాడు. ఆ రూట్ వైపు టిక్కెట్లు ఇచ్చే విషయమై చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అయితే కొత్తగా వచ్చిన ఈ కండక్టర్కి మద్దతు తెలుపుతూ..సైలెంట్గా ప్రోత్సహించాడు ఆ బస్సు డ్రైవర్. ఎక్కిన జనాలందరికి టికెట్లు ఇచ్చేంతవరకు ఆపి..పోనిచ్చేవాడుడ డ్రైవర్. అలాగే ఎక్కిన ప్రయాణికులు కూడా అతడు ఆలస్యంగా టికెట్లు ఇస్తున్నాడని, ఓకింత అసహనానికి గురైనా..అతడి బాధను అర్థం చేసుకుని సహకరించారు. పైగా వచ్చే తదుపరి స్టాప్లలో జనం ఎక్కుతారని..ఇక్కడ నుంచి ఇంత ఖరీదంటూ కండెక్టర్కి సహాయం చేశారు కొందరు ప్రయాణికులు. నిశబ్దంగా వారంతా అందించిన ప్రోత్సాహం..అతడిలో నూతన ఉత్సాహాన్ని నింపి, మొత్తం టెన్షన్ ఉఫ్మని ఎగిరిపోయేలా చేశారు. ఏ వ్యక్తిలో అయినా ఆందోళన పోగొట్టాలంటే దయతో కూడిన సానుభూతి, ఓర్పుగా వ్యవహరించడమే అని ఆ ప్రయాణికులు, బస్సు డ్రైవర్ తమ చేతలతో తెలియ చెప్పారు. అక్కడకి ఓ ప్రయాణికుడు కొత్తగా డ్యూటీలోకి జాయిన్ అయ్యావా..? అని ప్రశాంతంగా అడిగిన తీరు కూడా అతనిలో ఆందోళన మొత్తం ఎగిరిపోయేలా చేసింది. పైగా ఆ వ్యాఖ్య కాస్త దయతో మిగతావారందరు సహాయం చేసేందుకు ఉపకరించింది. మనం నిశబ్దంగా అందించే ప్రోత్సాహం, ఓర్పు నుంచి కరుణ పుట్టుకొస్తుందని అవగతమయ్యేలా చేశారు. నిజానికి నటనతో కరుణను వ్యక్తపరచడం అనేది అసాధ్యమని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. అంతా క్షణాల్లో జరిగిపోవాలనే ఏఐ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరికి అయ్యిందానికి, కానిదానికి కస్సుబుస్సులాడటం అలవాటైపోయింది. ఓపిక అనే పదం ఎగిరిపోయింది. తరుణంలో ఈ ఘటన అందరిని ఆలోచింపచేసేలా పాత రోజుల్లోకి తీసుకెళ్లిందంటూ నెటజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఒక ప్రముఖ సంస్థలో జాయిన్ అయ్యిన కొత్త ఉద్యోగైనా.. అతడికి నిశబ్దంగా ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే..అద్భుతాలు చేస్తారు, వాళ్ల టాలెంట్ని వెలికితీయగలుగుతారు అనేందుకు నిదర్శనమే ఈ అరుదైన ఘటన. (చదవండి: ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..! రెండుసార్లు ఫెయిలైనా..) -
ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్టుని అధిరోహించిన తొలి వ్యక్తి..!
ఎవరెస్టు శిఖరం అధిరోహించడం అనేది ఔత్సాహిక పర్వతారోహకులకు అపురూపమైన కల. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారెందదో ఉన్నారు కూడా. అయినా ఆ పర్వతాన్ని అధిరోహించాలనే క్రేజ్ మాత్రం తగ్గదు పర్వతారోహకులకు. పైగా అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా ఉండే ఎముకల కొరికే చలి వంటి పరిస్థితులన్నింటినీ ఓర్చుకుంటూ అధిరోహించడం అంత ఈజీ కాదు. అలాంటిది ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే అధిరోహించాడు ఈ 37 ఏళ్ల వ్యక్తి. పైగా అక్కడ స్కీయింగా కూడా చేయడం మరింత విశేషం.అతడే పోలాండ్ దేశానికి చెందిన ఆండ్రెజ్ బార్గియల్. గతంలో అతడికి రెండు మూడుసార్లు ఇదే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా వెరవక మూడో ప్రయంత్నంలో దాదాపు 8,849 మీటర్లు (29,032 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఆక్సిజన్ సపోర్టు కూడా లేకుండా విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. శరదృతువులో మరింత క్లిష్టతరం ఉండే సమయంలో ఈ పర్వతాన్ని అధిరోహించి అందర్ని ఆశ్చర్యపోయేలా చేసే అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఈ మేరకు బార్గియల్ మాట్లాడుతూ.. ఈ సాహసాన్ని తన క్రీడా జీవితంలో అత్యంత ముఖ్యమైన మెలురాయిగా అభివర్ణించాడు. ఈ శిఖరాన్ని అధిరోహించే మార్గం ఎంత క్లిష్టతరమైందో కూడా వివరించాడు. ఏదేమైతేనేం..చివరికి అధిరోహించడమే గాక అంత ఎత్తులో చాలాసేపు గడిపాడు. పైగా అక్కడే స్కీయింగ్ చేయాలన్నది తన డ్రీమ్ అని, అది అనుకోకుండా ఇవాళ సాకారమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే తాను కష్టతరమైన శరదృతువులో ఖంబు హిమనీనదం ద్వారా అవరోహణ రేఖ నుంచి అధిరోహించే ప్లాన్ చేయడమనేది ఎంత పెద్ద సవాలో కూడా తనకు తెలసునని చెప్పుకొచ్చాడు బార్గియల్ఎలా సాగిందంటే..ఆయన ఈ ఎవరెస్టు శిఖరాన్ని సెప్టెంబర్ 19న నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి ప్రారంభించారు. అలా మొత్తం క్యాంప్లు I, II, III గుండా ఎక్కినట్లు తెలిపారు. ఇక సెప్టెంబర్ 21న క్యాంప్ IV నుంచి పర్వతం డెత్జోన్కి చేరుకున్నానని, ఇది సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేల మీటర్లు పైనే ఉంటుందని అన్నారు. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయన్నారు. అక్కడ నుంచి సుమారు 16 గంటల అధిరోహణ అనంతరం సెప్టెంబర్ 22కి శిఖరాన్ని చేరుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఎవరెస్టు శిఖరం అత్యంత ప్రమాదకరమైన విభాగాలలో ఒకటిగా పేర్కొనే ఖంబు ఐస్ఫాల్ గుండా స్కీయింగ్ చేసి బేస్ క్యాంపుకు చేరుకున్నాడు. అక్కడ అతనికి తన సోదరడు బార్టెక్ ఎగరువేసిన డ్రోన్ మార్గనిర్దేశం చేసినట్లు చెప్పుకొచ్చారు. నిజంగా అత్యంత ఎత్తైన పర్వతంగా పిలిచే ఈ ఎవరెస్టుని అధిరోహించడమే గ్రేట్ అంటే బార్గియల్ ఆక్సిజన్ బాటిల్ లేకుండా అధిరోహించడమే కాకుండా స్కీయింగ్ కూడా చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పారు. View this post on Instagram A post shared by Andrzej Bargiel (@andrzejbargiel) (చదవండి: నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..) -
విదేశీ పూలతో వింతగా..!
తెలంగాణలోనే అత్యంత ఖరీదైన బతుకమ్మను పేర్చి కూకట్పల్లికి చెందిన పలువురు అబ్బురపరుస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన గుండాల అర్చన విదేశాల నుంచి పూలను తెప్పించి గత మూడేళ్లుగా వింతగా బతుకమ్మను పేరుస్తున్నారు. మొదట తామర పువ్వు ఆకారంలోనూ, రెండో ఏడాది హంస ఆకారంలోనూ, ఈ ఏడాది ఏనుగు బొమ్మలతో కూడిన బతుకమ్మను పేర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి బతుకమ్మ కోసం థాయిలాండ్ ఆర్చిడ్స్, సింగపూర్ రోజెస్, బ్యాంకాక్ కాచెన్స్, బెంగళూరు బెజస్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ నుంచి జిప్సోమియా పూలను తెప్పించినట్లు చెబుతున్నారు. ఆకట్టుకున్న ‘భక్తి శక్తి’ నవరాత్రుల అర్థాన్ని బెంగళూరుకు చెందిన కూచిపూడి కళాకారులు నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సంగీత నృత్యోత్సవాలు– బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నాట్య గురువు వీణా మూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన కూచిపూడి దృశ్యాంశాలు వీక్షకులను సమ్మోహన పరిచాయి. పవిత్ర జలం, రంగోలి, ధూపం, దీపం, జాజ్రాలతో వేదికను శుద్ధి చేసే నృత్యం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా నర్తకి శ్యామక్రిష్ణ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నవదుర్గ తోలుబొమ్మలాట ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, ఆర్ వినోద్ కుమార్ పలువురు కళాకారులు పాల్గొన్నారు. (చదవండి: విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
ఐదేళ్ల వయసుకే చిన్నారి అవినా అరుదైన ఘనత..!
ఆ చిన్నారి వయసు ఐదేళ్లు.. అయితేనేం పనికిరాని వ్యర్థాలతో అద్భుతాలు సృష్టించింది.. బుజ్జి మెదడుకు పదునుపెట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సేవాతత్పరత, సామాజిక బాధ్యతను ఒంటబట్టించుకుంది. అనాథ పిల్లల కోసం వారు చేస్తున్న సేవలో తన పాత్రను గుర్తించి వ్యర్థాలతో చిన్నారులకు బట్టలు తయారుచేసింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. కాప్రా సాకేత్కు చెందిన పొట్టపాటి ప్రవీణ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. భార్య తేజస్విని సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు. వీరి ఐదేళ్ల కుమార్తె అవినా పొట్టపాటి బిల్లబాంగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో యూకేజీ చదువుతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే తల్లిదండ్రులతో పాటుగా అవినా కూడ తరచూ వారితో కలిసి వెళ్లేది. ఈ క్రమంలో తన వయసున్న తోటి పిల్లలకు సరైన దుస్తులు లేకపోవడం, చెప్పులు లేకపోవడం గమనించింది. వారికి తనవంతుగా ఎమైనా సాయం చేయాలనే తలంపుతో వ్యర్థాలతో దుస్తులు తయారు చేయడం మొదలుపెట్టింది. మూడేళ్ల వయసు నుంచే ఇంట్లో ఫ్లాసిక్ బ్యాగులు, ఫ్లాస్టిక్ కవర్లు, పేపర్ బ్యాగులతో దుస్తులు, చెప్పులు వంటి వస్తువులను తయారు చేయడం ప్రారంభించింది. కుమార్తె ఆసక్తిని గమనించి.. చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అవినాను ప్రోత్సహించారు. ఆమె మేధస్సుకు పదును పెట్టి ఫ్లాస్టిక్ వ్యర్థాలతో పలు రకాల దుస్తులను తయారు చేసింది. తమ కూతురు ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలనే కోరిక వ్యర్థాలతో తయారు చేసిన దుస్తులను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించారు. పలుమార్లు చేసిన ప్రయత్నం ఫలించి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆహా్వనం పొందారు. చిన్నారి అవినా అందరి సమక్షంలో ఫ్లాస్టిక్, పేపర్ వ్యర్థాలతో 7 రకాల అందమైన దుస్తులను తయారు ఆశ్చర్యపరించింది. అవినా సృజనను ప్రశంసిస్తూ ఆమెకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. చాలా గర్వంగా ఉంది.. అతి చిన్న వయసులో మా కుమార్తె ఇలాంటి రికార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మూడేళ్ల వయసు నుంచే వ్యర్థాలతో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేది. ఆ ఆసక్తిని గమనించి ప్రోత్సహించాం. తన ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పించారు. అవినా ప్రతిభ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడం సంతోషం కలిగించింది. – పొట్టపాటి ప్రవీణ్కుమార్, తేజస్విని దంపతులు (తల్లిదండ్రులు) -
అపజయం వెనుకే విజయం
నార్త్లో దాండియా కల్చర్ బాగుంటుంది. చిన్నప్పుడు మేం ముంబైలో ఉండేవాళ్లం. దసరా టైమ్లో మా కమ్యూనిటీలో దాండియా ఆడేవాళ్లు. అలా మా అపార్ట్మెంట్వాళ్లతో కలిసి లైట్గా దాండియా చేసిన గుర్తు ఉంది. కానీ పెద్దయ్యాక దాండియా ఆడలేదు. అయితే చేయాలని ఉంది.పండగ అంటే ఫ్యామిలీ రీ యూనియన్ అని నా ఫీలింగ్. నా చిన్నప్పుడు మా బంధువులందరం కలిసి పండగ జరుపుకునేవాళ్లం. అందరూ కలిసి పండగ వంటలు చేయడం చాలా బాగుండేది. అయితే పై చదువులు, కెరీర్... వీటివల్ల రాను రాను ఆ సందడి తగ్గిపోయింది. ఇప్పుడైతే వర్క్లో బిజీ అయ్యాను కదా... షూటింగ్స్, ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి పండగ సమయంలో ఇంటి దగ్గర ఉండటం తగ్గిపోయింది. ఆ పాతరోజులను తలచుకుంటూ ఉంటాను.‘‘అపజయం ఎదురైనప్పుడు జీవితం ఆగిపోయింది అనుకుంటే మనం ఆగిపోతాం... ఆ అపజయాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంటే ముందుకు సాగిపోతాం’’ అంటున్నారు శ్రీనిధి శెట్టి. అందాల పాటీల్లో ‘మిస్ సుప్ర నేషనల్ ఇండియా’ కిరీటం దక్కించుకోవడం నుంచి, ‘మిస్ స్మైల్’... వరకు పలు టైటిల్స్ శ్రీనిధి సొంతం. తొలి చిత్రం ‘కేజీఎఫ్’తో హీరోయిన్గా విజయవంతంగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఫుల్ బిజీ. ‘‘ప్రతి స్త్రీ అమ్మవారిలా ఓ శక్తి స్వరూపిణి’’ అంటూ ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.⇒ మా మంగళూరులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. నవరాత్రి సమయంలో గుడిలో జరిగే పూజలు చాలా వైభవంగా ఉంటాయి. ఈ దసరా టైమ్లో వీలైనప్పుడల్లా గుడికి వెళుతుంటాను. మైసూర్లో నవరాత్రి పూజలను ఘనంగా చేస్తారు. మైసూర్ ప్యాలెస్ని బాగా డెకరేట్ చేస్తారు. జాతర జరుగుతుంది. స్టాల్స్ పెడతారు. ‘మైసూర్ దసరా’ చాలా పాపులర్. ఈ పండగ సమయంలో సిటీ మొత్తం జనాలతో కిటకిటలాడిపోతుంది.⇒ ‘ఫాస్టింగ్’ అనేది సైంటిఫికల్లీ, ట్రెడిషనల్లీ మంచిది అని నా అభి్రపాయం. అయితే నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను. కానీ నాన్ వెజ్కి దూరంగా ఉంటాను. నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది కదా... అప్పుడు ఉపవాసం ఉంటాను. ఏకాదశి వస్తోందంటే చాలు... ‘నువ్వు ఫాస్టింగ్ ఉండాలి’ అని నా బాడీ నాకు గుర్తు చేస్తుంది. నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. ⇒ చెడుపై మంచి గెలవడం అనేది దసరా థీమ్. ఒక చెడు ఉంటేనే మంచి జరుగుతుంది. అపజయాలను నేను ఇలానే భావిస్తాను. ఫెయిల్యూర్ ఎదురైతేనే కదా సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తాం. సో... ఫెయిల్యూర్స్ని చెడుగా భావించను. చెడుని అంతం చేయడానికి అమ్మవారు ఏం చేసిందో మనందరికీ తెలుసు. అలాగే మనకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొందరు మహిళలు సపోర్ట్ని ఆశిస్తారు. కానీ మనకు మనమే సపోర్ట్ సిస్టమ్ అవ్వాలి. మన శక్తిని మనం గుర్తించగలగాలి. నాకు ఏదైనా చెడు ఎదురైందనుకోండి అది నా ‘స్టెప్పింగ్ స్టోన్’ అని నమ్ముతాను. జీవితం లో ఎదురయ్యే సవాల్ని అలా అనుకుంటే సక్సెస్ అయిపోతాం.⇒ స్త్రీలు ఇంటిల్లిపాదినీ చూసుకోవాలి. అది చాలా పెద్ద బాధ్యత. అయితే అందరి బాగోగులు చూస్తూ చాలామంది మహిళలు తమ గురించి పట్టించుకోరు. కానీ మన గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఇన్నర్గా మనం హ్యాపీగా ఉంటే చుట్టూ ఉన్నవాళ్లను మనం ఇంకా హ్యాపీగా ఉంచగలుగుతాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... అందర్నీ హ్యాపీగా ఉంచడమే మన పని అని ఫిక్స్ అయిపోకండి. మనం హ్యాపీగా, హెల్తీగా ఉండటం కూడా ముఖ్యం.చదవండి: ఈ టిప్స్ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!⇒ జీవితంలో ‘పాజిటివిటీ’ చాలా ముఖ్యం. ఒక పని చేసే ముందు ‘ఇది మనవల్ల అవుతుంది. చేసి తీరతాం’ అని పాజిటివ్గా ఆలోచించాలి. ఆ పాజిటివిటీ మనల్ని చాలా దూరం తీసుకెళుతుంది. చదువుకునే అమ్మాయిలకు, ఉద్యోగం చేసుకునేవారికి నేను చెప్పేదేంటంటే... ఏ విషయంలోనూ ‘నా వల్ల కాదు’ అనుకోకండి. స్త్రీలు తలచుకుంటే చేయలేనిదేం ఉండదు. పాజిటివ్ గా ఆలోచించండి. అంతా మంచే జరుగుతుంది. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఆటోమేటిక్గా మంచి దగ్గరవుతుంది. ఈ పద్ధతి ఫాలో అయితే జీవితం కష్టంగా ఉండదు... తేలికగా సాగిపోతుంది’’ అని చె΄్పారు. – డి.జి. భవాని -
రెస్టారెంట్లో పనిచేస్తూ రూ. 4 కోట్లు..! కానీ చివరికి..
ఆర్థిక భద్రత ముఖ్యమే. పొదుపుగా ఉండాలి. ఇవన్ని ఆర్థిక సూత్రాలే. కానీ వాటితోపాటు కాసింత సంతోషానికి, ఎంజాయ్మెంట్కి కూడా చోటివ్వాలి. లేదంటే ఈ జీవితం క్షణ భంగురం. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఊహకందని భవిష్యత్తు కోసం మరింత ఆరాటం, పొదుపు ఎంత అనర్థదాయకమో ఈ వ్యక్తిని చూస్తే తప్పక తెలుస్తుంది. ఉన్నంతలో సంతోషంగా ఉండటం వేరు. ఎప్పటికైనా అతి పొదుపు చివరికి వ్యథనే మిగులుస్తుంది అనేందుకు ఇతడే ఉదాహారణ.జపాన్కి చెందిన సుజుకి అనే వ్యక్తి ఒక రెస్టారెంట్లో పనిచేస్తుండేవాడు. అతడు చిన్నతనం నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. అందుకే పూర్తి సమయం ఉద్యోగానికే కేటాయించి, డబ్బులు ఆదా చేసేవాడు. చౌకగా లభించే అపార్టుమెంట్లో నివశించేవాడు. ఆఖరికి తన కాబోయే భార్యను కూడా తను పనిచేసే రెస్టారెంట్లోనే కలుసుకున్నాడు. అతడు చాలా పొదుపరి అని భార్యకు తెలుసు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతడు పుట్టాక కాస్తా ఖర్చులకు వెనకడాకపోయినా..మిగతా అన్నింటి విషయంలో చాలా స్ట్రిక్ట్గా పొదుపుగా ఉండేవాడు. జీవితంలో ఒక్కసారి కూడా రెస్టారెంట్ భోజనం చేయలేదు. ఏసీ కూడా ఉపయోగించకుండా లైఫ్ని గడిపేశాడు. కనీసం బైక్ లేదా కారు వంటివే ఉపయోగించ లేదు. ఉద్యోగానికి సైకిల్పైనే వెళ్లేవాడు. మాటల్లో చెప్పలేనంత పిసినారిలా బతికాడు. ఎలాగైతేనేం అతలా పొదుపుగా ఉండి ఏకంగా రూ. 4 కోట్లు దాక ధనం కూడబెట్టాడు. అయితే ఆ డబ్బుతో భార్యతో సంతోషంగా ఉందాం అనుకునేలోపు ఆకస్మికంగా చనిపోయింది. "ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం సుజుకి 65 ఏళ్లు. ఇన్నాళ్లు ఎంతలా కఠినంగా వ్యవహరించాను అని కుమిలిపోతున్నాడు. చిన్న చిన్న ఆనందాలు, కానీ సరదాలకు కానీ తావివ్వకుండా ఓ మర మనిషిలా బతికానే అంటూ రోదిస్తున్నాడు. ఎంతలా వెక్కి వెక్కి ఏడ్చినా..కాలాన్ని వెనక్కి తిప్పలేం. ఆ రోజులు మళ్లీ రావు. ఇప్పుడు ఈ డబ్బుని తానేం చేసుకోవాలి అని కన్నేరుమున్నీరుగా విలపిస్తున్నాడు." హాయిగా కడుపు ఆరగించుకునే సమయంలో మొలకలు, చిన్న చికెన్ ముక్కలతో కాలక్షేపం చేశాడు. ఇప్పుడు హాయిగా తిందామన్నా..శరీరం, వయసు రెండు సహకరించడం లేదు. పోనీ షికారు చేద్దామన్నా..రెండడుగులు వేస్తే..ఆయాసం, పైగా అక్కడి వాతావరణం పడక నానా ఇక్కట్లు పడుతున్నాడు. ఇతడిలాంటి వాళ్లెందరో జపాన్లో ఉన్నారట. గతంలో ఓ వ్యక్తి ఏకంగా పొదుపుకే జీవితాన్ని అంకితం చేసి రూ. 8 కోట్లు దాక కూడబెట్టి వార్తల్లో నిలిచాడట. ఈ ఘటనలు..డబ్బు సంపాదనే జీవితం కాదు. ధనం కూడబెట్టుకుంటే.నే.హాయిగా ఉంటాం అన్నది ఎన్నటికీ సరైనది కాదన్నది జగమెరిగిన సత్యం. ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు పెట్టాలి, పొదుపుగా ఉండాల్సిన చోట ఖర్చుని అదుపులో ఉంచాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడే మహనీయడని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక భధ్రత తోపాటు, ఆర్థిక స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వండి. అంతా అయిపోయాక ఏం చేద్దామన్నా..ఏం చేయలేం అని హెచ్చరిస్తున్నారు. (చదవండి: "మైక్ లేదు, వాయిద్యాలు లేవు" అద్భుతమైన గర్భా నృత్యం..! మాటల్లేవ్ అంతే..) -
పెళ్లి సందడి : మెహిందీ వేడుకలో అవికా గోర్ చేసిన పని వైరల్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి అవికా గోర్ (Avika Gor). 'ఆనంది' పాత్ర ద్వారా పాపులరైన అవికా తన చిరకాల ప్రియుడు, సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీ (Milind Chandwani)ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే.అవికా గోర్ తన రోకా, నిశ్చితార్థాన్ని ప్రకటించినప్పటి నుండి చాలా వార్తల్లో నిలిచింది. ఇటీవల జంట 'పాటి పత్ని ఔర్ పంగా' షోలో వారి మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అవికా గౌర్ చేసిన పని ఇంటర్నెట్లో అందరి హృదయాలను గెలుచుకుంది. దీంతో అవికా గోర్ మెహందీ వేడుక వైరల్గా మారింది. ఈ సంప్రదాయంలో భాగంగా, అవికా తన కాబోయే భర్త మిలింద్ చాంద్వానీ పేరును తన అరచేతిపై అందంగా రాసుకుంది. అంతేకాదు తన అత్తమామల పేర్లను కూడా అదే అరచేతిలో పండించుకోవడం విశేషంగా నిలిచింది. దీనితో పాటు, ఆమె కుటుంబ సభ్యుల పేర్లను కూడా మరొక అరచేతిలో రాయించు కుంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల వైబ్స్లో మరింత జోష్ వచ్చింది. దీనిపై అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మిలింద్ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవంగా అభవర్ణిస్తున్నారు. అవికా అందమైన కలర్ఫుల్ లెహంగా, ఆభరణాల్లో కనిపించింది, మరోవైపు, మిలింద్ రాజస్థానీ శైలి తలపాగాను ధరించాడు. ఇద్దరూ ఎంతో సంతోసంగా డ్యాన్స్ చేశారు. View this post on Instagram A post shared by Maroof Mian (@maroofmian.sayyed) ప్రస్తుతం మునావర్ ఫరూఖీ అండ్ సోనాలి బింద్రే హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాలిటీ షో,పతీ పత్ని ఔర్ పంగా-జోడియోం కా రియాలిటీ చెక్లో కనిపించే అవికా గోర్ ,మిలింద్ చాంద్వానీ, ఇటీవల జాతీయ టెలివిజన్ ద్వారా లైవ్లో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుంచి డేటింగ్ లో ఉన్న అవికా త్వరలోనే అతన్ని వివాహం చేసుకోబోతోంది. 2019లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మిలింద్ ను కలిసింది అవికా. 2025 జూన్ లో అవికా గోర్ ఎంగేజ్మెంట్ ప్రక్టించచారు. సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నారు. View this post on Instagram A post shared by Maroof Mian (@maroofmian.sayyed) -
ఆనందమే ఆరోగ్యం..!
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా పింక్ పవర్ రన్ ఆదివారం నిర్వహించారు. ఈ మారథాన్లో ప్రపంచ సుందరీమణులు, సినీ ప్రముఖులు, అధికారులు, వృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్ నిర్వహించారు. రన్లో పాల్గొనే వారికి అంతర్జాతీయ ఫిట్నెస్ నిపుణులు మెళకువలు నేర్పించారు. గత సంవత్సరం 10వేల మంది పాల్గొనగా.. ఈ యేడాది 20వేల మంది పింక్ పవర్ రన్లో పాల్గొన్నారు. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పింక్ పవర్ రన్ను మిస్ వరల్డ్ –2025 ఓపల్ సుచాత, మిస్ ఆసియా కృష్ణ, ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మపర్సన్ సుధారెడ్డి పలువురు ప్రముఖులతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు. కేన్సర్ మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పది కిలోమీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తిచేసిన ముగ్గురు మహిళలకు ట్రోఫీలతో పాటు ప్రైజ్ మనీ అందజేశారు. బ్రెస్ట్ కేన్సర్ అవగాహన రన్లో పాల్గొన్న ఏడు సంవత్సరాల పార్వతి, ఐదు కిలోమీటర్ల విభాగంలో ఐదు సంవత్సరాల కబీర్ సింగ్, వీల్ చైర్తో పాల్గొన్న నంద కిషోర్ అనే యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రన్లో పాల్గొన్న వారితో నెక్లెస్ రోడ్డు గులాబీ వర్ణంతో నిండిపోయింది. ప్రముఖుల సందడి.. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్పాస్ట్రక్చర్ లిమిటెడ్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ మారథాన్లో అంతర్జాతీయ మాజీ టెన్నిస్ క్రీడాకరుడు లియాండర్ ఫేస్, ప్రముఖ సినీ నటుడు బ్రహా్మనందం, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, సీరియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జ్యోషి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ జూలియా, పీవీ కృష్ణారెడ్డితో పాటు అధికారులు, ప్రముఖులు రన్లో పాల్గొన్నారు. (చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..) -
జంక్ ఫుడ్ మానేసి.. వ్యాయామం చేయండి..
జంక్ ఫుడ్ మానేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం వాకథాన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ నడకకు సమయం కేటాయించాలని సూచించారు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అవసరం లేని ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గోకల్రెడ్డి, రామకృష్ణ జనపాటి, సందీప్ పాల్గొన్నారు. రెయిన్ బో ఆస్పత్రిలో.. బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ హార్ట్ క్లినిక్ను పుల్లెల గోపీచంద్ ఆదివారం ప్రారంభించారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల తెలిపారు. అత్యాధునిక ప్రమాణాలతో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్ కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని గోపీచంద్ అన్నారు. జాతీయ ఉత్తమ బాల పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి పాల్గొన్నారు. -
ఓం శ్రీ శారదాయై నమః
దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు ఈమెను ఆరాధన చేస్తారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... అన్నిటికీ ఈమే అధిష్ఠాన దేవత. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించిన అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయి. కచ్ఛపి అనే వీణ; పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, హంసను అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకధాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయి. సరస్వతీ ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుంది. సకల చరాచరకోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి ఈమెది.సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలతో అమ్మను పూజించాలి.శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.మంత్రం: ’ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వత్యై నమ:’ అనే మంత్రాన్ని ఉపాసన చేయాలి. సరస్వతీదేవి ప్రీతిగా ఈ రోజున పుస్తకదానం చేయాలి. సరస్వతీ ద్వాదశ నామాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. నైవేద్యం: దధ్యాన్నం అంటే పెరుగన్నం, చక్కెర పొంగలి నివేదన చేయాలి.విశేషం: బెజవాడ కనకదుర్గమ్మకు నేడు సర స్వతీ మహాసరస్వతీ దేవి -
మార్పు అనివార్యం.. అనవరతం
ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఆగనిది ఒక్కటే: మార్పు. నిన్నటి సూర్యోదయం ఈ రోజు లేదు, ఈ రోజు విరిసిన పువ్వు రేపటికి ఉండదు. ప్రతి క్షణం విశ్వం తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. మనం పుట్టిన క్షణం నుండి, చివరి క్షణం వరకు, ప్రతి దశలోనూ మార్పు మనతోనే ప్రయాణిస్తుంది. నవశ్చలతి జీవనం, నవశ్చలతి విశ్వంనవం నవం నవాని నవాని నిత్యం చలతిజీవితం నిరంతరం కదులుతుంది, విశ్వం నిరంతరం కదులుతుంది. ప్రతి రోజు, ప్రతి క్షణం కొత్తదనంతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ శ్లోకం మార్పు అనేది విశ్వంలో, జీవితంలో నిరంతరంగా జరిగే ప్రక్రియ అని సూచిస్తుంది. ఇది మార్పు నిత్యత్వాన్ని, దాని ద్వారా కొత్త అవకాశాలు, కొత్త ప్రారంభాలు ఎలా ఏర్పడతాయో తెలియజేస్తుంది. ఈ నిరంతర చలనం జీవితాన్ని సజీవంగా, శక్తిమంతంగా ఉంచుతుంది.మార్పు అంటే భయపడాల్సిన ఒక గాలివాన కాదు, అది జీవితాన్ని సజీవంగా ఉంచే ఒక అనివార్యమైన శక్తి. మార్పు లేని జీవితం నిలచిపోయిన సరస్సులా మురికిగా మారుతుంది. మార్పును స్వాగతించినప్పుడే జీవితం ప్రవహించే నదిలా పవిత్రంగా, ఉల్లాసంగా ఉంటుంది.ప్రకృతిలో చూస్తే, ప్రతిదీ మార్పుకు లోబడే ఉంటుంది. వసంతంలో చిగురించిన ఆకు, ఆ తర్వాత ఎండిపోయి, రాలిపోయి, తిరిగి కొత్త జీవితానికి దారి చూపిస్తుంది. భూమిలో ఉండే ఒక చిన్న విత్తనం తన రూపాన్ని మార్చుకోవడానికి భయపడితే, అది ఎప్పటికీ ఒక పెద్ద చెట్టుగా మారలేదు. అలాగే, ఒక చిన్న గొంగళి పురుగు తన రూపాన్ని పూర్తిగా మార్చుకొని, రెక్కలు విప్పుకున్న రంగుల సీతాకోకచిలుకగా మారే అద్భుతమైన మార్పు, మార్పులో ఉన్న శక్తిని తెలియజేస్తుంది. ఈ మార్పు కేవలం భూమిపై మాత్రమే కాదు, అనంతమైన విశ్వంలో కూడా జరుగుతుంది. మనం రోజూ చూసే చంద్రుడు కూడా పౌర్ణమి నుండి అమావాస్యకు, అమావాస్య నుండి పౌర్ణమికి తన ఆకారాన్ని మార్చుకుంటూనే ఉంటాడు. ప్రతి క్షణం గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటూ ముందుకు కదులుతూ ఉంటాయి. ఈ విశ్వం కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.యది మార్గం న చలతి, కథం గమ్యతే లక్ష్యం ్ఢ చలనం ఏవ జీవనం, చలనం ఏవ గతిఃమార్గం కదలకపోతే, గమ్యాన్ని ఎలా చేరుకోగలం? కదలడమే జీవితం, కదలడమే గమనం. ఈ శ్లోకం మార్పు అనేది కేవలం ఒక పరిస్థితి కాదు, అది జీవిత ప్రయాణమే అని చెబుతుంది. మార్పు లేకపోతే, మనం ఎక్కడికీ చేరుకోలేము. ఈ శ్లోకం మార్పును ఒక అవరోధంగా కాకుండా, మన గమ్యానికి చేర్చే ఒక మార్గంగా చూడాలని ప్రోత్సహిస్తుంది.జీవితం ఒక నిరంతర ప్రవాహం. అందులో మార్పులు రావడం సహజం. వాటిని ఆనందంగా, ధైర్యంగా స్వీకరించాలి. ప్రతి మార్పు ఒక కొత్త ప్రారంభం. అది మనలోని సుప్తంగా ఉన్న శక్తులను, గుణాలను మేల్కొల్పి, మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే మార్గం. మార్పు అంటే భయపడటం కాదు, అది భవిష్యత్తు వైపు సాగే మన ప్రయాణంలో మనం నడిచే మార్గమే. ఆ మార్గాన్ని మనం ఉత్సాహంగా అన్వేషించినప్పుడు, జీవితం ఒక మహోన్నతమైన కళాఖండంగా మారుతుంది.ఈ సృష్టిలోని ప్రతి అణువు, ప్రతి కణం మార్పుతోనే పుట్టి, పెరుగుతూ, నశిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో జరిగే మార్పు కూడా అంతే శక్తివంతమైనది. బాల్యం నుండి వృద్ధాప్యానికి మన శరీరం మారినా, మనసు ఎన్నో పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతుంది. మన కష్టాలు, సవాళ్లు మనల్ని బలహీనపరచవు, అవి మనల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. మన ఆలోచనలలో, మన అలవాట్లలో వచ్చే మార్పులు మనల్ని నిన్నటి కంటే ఈ రోజు మెరుగైన మనిషిగా తయారు చేస్తాయి.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
హ్యాట్సాఫ్ మాష్టారు..! వైకల్యాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే..!
పుట్టుకతో రెండు చేతులు లేవు. అయినా వెనుకడుగు వేయలేదు. అజేయంగా ముందుకు సాగి ఉన్నత చదువులు చదవడమే కాకుండా, పాఠాలు చెప్పే ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే టీచర్ అయ్యాడు. చేతులు లేకపోయినా..పిల్లలకు బోధించే విధానాన్ని చూస్తే.. ఎవ్వరి మనసైనా హత్తుకుంటుంది. ఓ గొప్ప స్ఫూర్తిని నింపుతుంది.జార్ఖండ్లోని దట్టమైన అడువుల మధ్యలో గుల్షన్ లోహార్ అనే ఉపాధ్యాయుడు ఆ యువ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. పుట్టుకతోనే చేతులు లేని ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు బ్లాక్బోర్డుపై రాస్తూ బోధిస్తున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. పైగా ఆ విద్యార్థుల్లో స్ఫూర్తిని కూడా నింపుతోంది. ఆయన ఎప్పుడు తన వైకల్యాన్ని అడ్డంకి కూడా చూడలేదు. చాలామంది ఇలా రెండు చేతులు లేకపోవడాన్ని శాపంగా చూస్తే..అదే తన బలంగా మార్చుకున్నాడాయన. అతడి ఎడ్యుకేషన్ జర్నీ దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన లోహార్ రోజు 74 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజ్కి వెళ్లేవాడట. తల్లి, సోదరుడు, అడగడుగునా సాయం అందించేవారట. బీఈడీ డిగ్రీకి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయంతో పూర్తి చేసినట్లు తెలిపారు. అలా టీచర్ ఉద్యోగం పొందాక..మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు అంతగా ఉపాధ్యాయులెవరు ఆసక్తి చూపరు కానీ లోహార్ అలాంటి పాఠశాలలనే ఎంచుకుంటారు. ఆయన పశ్చిమ సింగ్భూమ్లోని మారుమూల అడవులలో ఉన్న బరంగ గ్రామం పాఠశాల అనేక విద్యా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాంటి పాఠశాలకు టీచర్గా రావడమే కాకుండా పాఠాలు చెప్పే తీరు ఓ రేంజ్లో ఉంటుందిగణితాన్ని బోధించేందుకు తన కాలినే చేతిగా మార్చుకుని చెబుతున్న విధానం చూస్తే..చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.ఎందుకంటే దాన్ని భోధించాలంటే నోటితో సాధ్యం కాదు తప్పనిసరిగా బ్లాక్బోర్డుపై రాయక తప్పదు. తన వైకల్యాన్నే సవాలు చేసేలా చిన్నారులకు చెబుతున్న తీరు చూస్తే..మాష్టారు మీరు గ్రేట్ అని ప్రశంసించకుండా ఉండలేరు. అందుకు అతడి భార్య అంజలి, కూతురు సాయం అందిస్తారుట. అంతేగాదు అతడి సేవలను జార్ఖండ్ విద్యా ప్రాజెక్ట్ కౌన్సిల్ గుర్తించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అర్హుడని అభివర్ణించింది. అయితే లోహార్ మాత్రం వైకల్యం అనేది నేర్చుకోవడానికి, బోధనకు అడ్డంకి కాదు అని చెప్పాలనేదే తన ఆకాంక్ష అని చెబుతున్నాడు. (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
తల్లి కాబోతున్న సింగర్, మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ వైరల్
ఇండియన్ ఐడల్ స్టార్ సాయిలి కాంబ్లే తల్లి కాబోతోంది. ఈ గుడ్ న్యూస్ను తన భర్త ధవాల్తో కలిసి అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితాల్లోకి అద్భుతం రాబోతోందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అంతేకాదు దీనిక సంబంధించి బేబీ షవర్ ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. త్వరలోనే ఈ స్టార్ సింగర్ లాలి పాటలు పాడబోతోందంటూ అభిమానులు, తోటి కళాకారులు ఆమెకు అభినందనలు అందించారు.మెటర్నిటీ ఫోటో షూట్లో సాయిలి సాంప్రదాయ మహారాష్ట్ర స్టైల్లో ఆకుపచ్చ. నారింజ రంగు చీరలో మెరుస్తూ కనిపించింది.లుక్ను పూర్తి అందమైన రాణిహార్, కమర్బంధ్, మాంగ్ టీక చెవిపోగులతో తన లుక్మరింత అందంగా మల్చుకుంది. భార్యకు తగ్గట్టుగా ధవల్ తనదైన శైలిలో ముస్తాబయ్యారు. View this post on Instagram A post shared by Sayli Kamble Patil (@saylikamble_music)"మా హృదయాలు ఆనందం మరియు నిరీక్షణతో ఉప్పొంగిపోతున్నాయి! మా చిన్న అద్భుతం రాబోతోంది. చాలా సంతోసం. జీవితంలో అత్యంత అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభిస్తున్నాం. మరింత ద్విగుణీకృతమైన ఆనంద క్షణాలను అనుభవించేందుకు ఎదురు చూస్తున్నాం. 'కొంచెం స్టార్డస్ట్, కొంచెం స్వర్గం , జీవితానికి సరిడా ప్రేమ మా దారిలోకి వస్తున్నాయి.’ అంటూ పోస్ట్ చేశారు. కాగాఇండియన్ ఐడల్ సీజన్ 12లో తన అద్భుతమైన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న గాయని సాయిలీ. సాయిలీ తన చిరకాల ప్రియుడు ధవల్ను 2022, ఏప్రిల్లో వివాహం చేసుకుంది.చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
సూపర్ సప్పర్.. నగరంలో కొత్త తరహా కల్చర్ హవా
ఓ ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రపు వేళ, తరచూ వెళ్లే కేఫ్లకు బదులు, ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వెళ్లడం, ఎప్పుడూ కలవని మరికొందరితో కలిసి టేబుల్ పంచుకోవడం ఎలా ఉంటుంది?.. ఈ ఊహ నగరంలో వాస్తవరూపం దాలుస్తోంది.. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ట్రెండ్గా మారి ఇప్పుడిప్పుడే నగరంలోనూ అంకురిస్తున్న సప్పర్ క్లబ్లు రేపటి అనుభవాలను మాత్రమే కాదు కొత్త స్నేహాలను తీర్చిదిద్దే వేదికలుగా అవతరిస్తున్నాయి. రుచికరమైన ఆహారం ప్రశాంతమైన సంభాషణ, కొత్త రుచులను కనుగొనడం, ఒత్తిడి లేకుండా ముచ్చట్లు.. వీటన్నింటినీ అపరిచితులతో పంచుకోవడమే సప్పర్ క్లబ్స్ ప్రత్యేకత. – సాక్షి, సిటీబ్యూరో నగరంలో విస్తరిస్తున్న కొత్త తరహా కల్చర్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ క్లబ్స్ ప్రత్యేకమైన అనుభవం కోసం అతిథులను ఆహ్వానిస్తున్నాయి. ‘సప్పర్ క్లబ్లు తరచూ ఇళ్లలో నిర్వహించే సన్నిహిత భోజన అనుభవాలు. ఇక్కడ ఆహారంతోపాటు సంభాషణలు, పరిచయాలే ప్రధానం. రెస్టారెంట్ల మాదిరిగా స్థిరమైన మెనూ ఉండదు. వ్యక్తులు తమ కథలు చెప్పడం, కాలానుగుణ రుచులతో కొత్త వ్యక్తులను కలవడంపై మాత్రమే దృష్టి పెడతారు. తద్వారా వారు వండిన వంటకాలను కలిసి తినడం, భాగస్వామ్య టేబుల్పై కనెక్ట్ అవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.’ అని సప్పర్ క్లబ్స్ నిర్వహించే జైపూర్కు చెందిన సీమా సేథి అంటున్నారు. ఈ కొత్త ట్రెండ్కు సోషల్ మీడియా ప్రధాన ప్రేరకంగా మారింది. ప్రతి ఒక్కరూ తాము పంచుకోగల ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకుంటుండడం సప్పర్ క్లబ్స్కు ఊపునిస్తోంది. ‘ఎప్పుడూ కలవని వ్యక్తులతో ఓ ఇంట్లో జరిగే విందు పార్టీలో ఉన్నట్లు ఊహించుకోండి.. సప్పర్ క్లబ్.. కేవలం విందు కాదు.. ఇది ఒక వైబ్.. ఆకర్షణ వ్యక్తిగతంగా లీనమయ్యేలా చేస్తుంది. సాధారణ విందు విహారయాత్రకు భిన్నంగా ఉంటుంది.’ అని ముంబైలో సప్పర్ క్లబ్ హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు ప్రాచి గుప్తా అంటున్నారు. హోమ్లీగా.. జాలీగా.. ‘చెఫ్ తాజాగా క్యూరేట్ చేసిన ఆహారాన్ని తినాలనుకునే డైనర్లలో ఈ ఫార్మాట్ ఆదరణ పొందుతోంది. డైనర్లు ఒకే టేబుల్ వద్ద కూర్చునే కుటుంబ–శైలి విందు కావడం కూడా ఆకర్షణను పెంచుతుంది.’ అని పుణెకు చెందిన యాంపిల్ సప్పర్ క్లబ్ వ్యవస్థాపకురాలు చెఫ్ కౌసల్య పాటిల్ అన్నారు. నేటి తరం ప్రజలు కేవలం భోజనం కంటే ఎక్కువ కోరుకుంటున్నారని హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు సలోని గుప్తా అభిప్రాయపడ్డారు. నిర్ణీత మెనూ లేకపోవడం లాంటి ప్రత్యేకతలు సప్పర్ క్లబ్ల వైపు ఆకర్షించే బలమైన కారకాలుగా సీమా సేథి అంగీకరిస్తున్నారు. ‘ఇది ఆ నిర్దిష్ట సాయంత్రం కోసం మాత్రమే రూపొందిన అనుభవం..వ్యక్తిగతమైనది’ అని ఆమె చెప్పారు. ‘కోవిడ్–19 టైమ్లో దాదాపు రెండేళ్లు ఒంటరిగా ఇంట్లోనే గడిపాము. దీంతో మానవ సంబంధాలను పెంచుకోవడంపై ఆసక్తి పెరిగింది.’ అని గురుగ్రామ్లో బెంగాలీ సప్పర్ క్లబ్ టూంటూనీస్ టేబుల్ వ్యవస్థాపకురాలు టూనికా గుహా అంటున్నారు. వలస యువతతో ఊపు.. చదువుకోడానికి లేదా పని చేయడానికి వలస వచి్చన యువత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ ఇళ్లను కుటుంబాలను విడిచిపెట్టిన వారు.. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోడానికి సప్పర్ క్లబ్లు గొప్ప మార్గంగా మారాయి.. ‘ఇవి రెస్టారెంట్లు, బార్ల కంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తాయి. నగరాల్లోని ప్రజలు మంచి ఆహారం తినాలని, అలాగే మంచి స్నేహానుభవాన్ని పొందాలని కోరుకుంటారు’ అని నగరంలో సప్పర్ క్లబ్కు శ్రీకారం చుట్టిన ప్రణవి చెప్పారు. విభిన్న సంస్కృతులలో కమ్యూనల్ డైనింగ్ ఒక సంప్రదాయం. ప్రతి సమావేశం, దానితో ఆలోచనల మార్పిడి, విభిన్న ఆచారాలు, సంస్కృతులను మనకు పరిచయచేస్తాయి.’ అని మరో క్లబ్ నిర్వాహకులు కౌశల్య పాటిల్ అన్నారు. డిజిటల్ సంబంధాలపై ఆధారపడుతున్న యుగంలో సప్పర్ క్లబ్లు అవసరమైన పరస్పర సాన్నిహిత్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ఇలా ప్రారంభించి.. అలా లీనమై.. ఈ విందులో పాల్గొన్నప్పుడు తొలుత ప్రతి ఒక్కరూ కొంచెం ఇబ్బందికరంగా ప్రారంభిస్తారు. ఇక్కడికి చేరుకోడానికి వారు ఎంత ట్రాఫిక్ను ఎదుర్కొన్నారనే విషయాలనే మాట్లాడతారు. కానీ అలా అలా నగరంలో రుచికరమైన, ఉత్తమమైన మటన్ థాలీని ఎక్కడ దొరుకుతుందనే సంభాషణ నుంచి అలా అలా చర్చలు లోతుగా మారతాయి.. ‘దీనికి ఫ్యాన్సీ రెస్టారెంట్ అంత స్థలం అవసరం లేదు. ఇది సోషల్ మీడియా బజ్కు సరైనది. దీని ద్వారా నగరాల్లో హోస్ట్ల నెట్వర్క్ను నిర్మించవచ్చు. ‘ఆదాయాన్ని పొందడం కంటే మిన్నగా వ్యక్తిగత బ్రాండ్ కమ్యూనిటీని సప్పర్ క్లబ్లు నిర్మిస్తాయి’ అని సీమా సేథి అంటున్నారు. ఇదీ చదవండి : Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిప్రతి సమావేశం కంటెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగల కథగా మారుతుంది. సొంత నిబంధనల ప్రకారం ఆతిథ్యం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. మరింత ముఖ్యంగా, ఇది ఆహారం కోసం మాత్రమే కాకుండా పరిచయాల కోసం వచ్చే అతిథుల సర్కిల్ను సృష్టిస్తుంది, వర్క్షాప్లు, సహకారాలు, ప్రయాణ అనుభవాలు తదితర భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. (నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్)కేర్ ఫుల్.. కమ్యూనిటీ చిల్.. అపరిచితులతో కాబట్టి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. టేబుల్లో హద్దులను నిర్దేశిస్తారు. వస్తువులను సురక్షితంగా ఉంచుతారు. హాజరవుతున్నవారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారో? సప్పర్ క్లబ్ డిన్నర్ టేబుల్ సీటు బుక్ చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారో? అర్థం చేసుకోవడానికి విందుకు ముందే అవసరమైన సంప్రదింపులు ఉంటాయి. -
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఉన్నత చదువులు చదివినా..తండ్రి స్ఫూర్తితో ఇలా..!
మనసుకు నచ్చిన పనిచేస్తే అందులో కలిగే తృప్తి, ఆనందం వేరు అంటున్నారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ సాయినగర్లో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహను అలవాటు చేసిన తండ్రి స్ఫూర్తితో 2012లో ఈ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. అప్పటి నుంచి అనేక మంది అభాగ్యులను చేరదీసి వారికి అండగా నిలుస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో ప్రస్తుతం 65 మంది వృద్ధులను ఆదరిస్తున్నారు. వారినే తన తల్లిదండ్రులుగా భావిస్తూ నిరంతరం సేవలందిస్తున్నారు. జీహెచ్ఎంసీవారు, పోలీసు వారు తప్పిపోయిన అనాథలను తీసుకొచ్చి రాజేశ్వరి వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో.. వృద్ధాశ్రమంలో పక్షులు, బాతులు, చిలుకలు, పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. నిత్యం ఆశ్రమ పరిసరాలను శానిటేషన్ చేయిస్తూ శుభ్రతను పాటిస్తుంటారు. పలు ఆస్పత్రుల నిర్వాహకులతో చర్చించి వైద్యు పరీక్షలు చేయిస్తుంటారు. వృద్ధులకు కాలక్షేపానికి కథలు చెబుతూ ఆట పాటలు నిర్వహిస్తుంటారు. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం అంటూ అనాథలకు అండగా నిలుస్తూ.. తండ్రి స్ఫూర్తితో వృద్ధులను ఆదుకుంటున్నారు.. వృద్ధాశ్రమ నిర్వాహకురాలు రాజేశ్వరి. ఎందరో అభాగ్యులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో జన్మించి ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ సామాజిక స్పృహతో సమాజానికి తనవంతు సేవ చేస్తున్నారు. దివ్యాంగులకూ అండగా.. కూకట్పల్లి, బోయిన్పల్లిలోని ఆశ్రమాల్లో గత ఐదేళ్లుగా వయో వృద్ధులతో పాటు దివ్యాంగులైన మూగ, చెవిటి వారికి కూడా ఆశ్రయం కలి్పంచి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సేవే మహా భాగ్యంగా..నా చివరి మజిలీ వరకూ మాతృమూర్తులకు సేవ చేస్తూనే ఉంటా. ఆశ్రమానికి పలువురు దాతలు అందించే చేయూత ఎప్పటికీ మరువలేను. వారి సహకారంతోనే నా లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాను. కష్టంలోనూ వయో వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. వారి ఆనందమే నా ఆనందం. – రాజేశ్వరి, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు (చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే.) -
కలలు రుద్దితే కల్లోలమే..!
హైదరాబాద్కు చెందిన నిఖిల్కు డ్రాయింగ్ అంటే ఇష్టం. ఆర్కిటెక్చర్లో చేరాలనుకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితో ఐటీలో చేరాడు. కాని, రెండో సంవత్సరంలో తీవ్రమైన డిప్రెషన్ వల్ల డ్రాపవుట్ అయ్యాడు. విజయవాడకు చెందిన నందినికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి. కాని, పేరెంట్స్ ఒత్తిడి చేసి ఎంబీబీఎస్లో చేర్పించారు. ఫైనలియర్లో బర్నవుట్తో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమైంది. ఇది నిఖిల్, నందినిల సమస్య మాత్రమే కాదు. వేలాదిమంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య. తల్లిదండ్రులు తమ ఆశలు, కలలను పిల్లలపై రుద్దడం వల్ల, నచ్చిన కోర్సు చదవలేని పిల్లలు మానసిక సమస్యల పాలవుతున్నారు. దీనికి కారణం పేరెంట్ ప్రొజెక్షన్ ట్రాప్. ఏమిటీ ఉచ్చు? ‘‘నేను ఐఏఎస్ కాలేకపోయా, నా కుమారుడు ఐఏఎస్ కావాలి.’’ ‘‘నాకు డాక్టర్ సీటు రాలేదు, నా కూతురు డాక్టర్ అవ్వాలి.’’ ‘‘నా బిజినెస్ ఫెయిల్ అయింది, నా పిల్లాడు దానిని మళ్లీ నిలబెట్టాలి.’’చాలామంది తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తుంటారు. తమ నెరవేరని కోరికలు, అసంపూర్ణ కలలు, గుదిబండలా లోపల మిగిలిన ఆశలను పిల్లలపై బలవంతంగా మోపుతుంటారు. దీన్నే సైకాలజీలో ప్రొజెక్షన్ అంటారు. ఇది ఇండియన్ పేరెంట్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఏంటి నష్టం? తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద మోపినప్పుడు, పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్, సెల్ఫ్ వర్త్ సమస్యలు పెరిగినట్లు హార్వర్డ్ చైల్డ్ డెవలప్మెంట్ స్టడీలో వెల్లడైంది. భారతదేశంలో విద్యార్థుల్లో కనిపిస్తున్న అకడమిక్ బర్నవుట్కు ప్రధాణ కారణం తల్లిదండ్రుల అసాధారణ ఆశలు, కంపేరిజన్ ప్రెజర్ అని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ అధ్యయనంలో స్పష్టమైంది. 15–19 ఏళ్ల వయసులో ఆత్మహత్యలకు ప్రధాన కారణం విద్యాపరమైన ఒత్తిడేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా 2022 నివేదికలో స్పష్టంగా పేర్కొంది.ఎలాంటి ప్రభావం పడుతుందంటే... పిల్లల్లో ‘‘నేను ఎవరు? నాకు కావలసింది ఏమిటి?’’ అనే గందరగోళం మొదలవుతుంది.తల్లిదండ్రుల కల కోసం బతికేవాడు తన సొంత అస్తిత్వాన్ని కోల్పోతాడు.‘‘నాన్న నిరాశ చెందకూడదు... అమ్మ మాట వినకపోతే తప్పవుతుంది’’ అనే అపరాధభావం, భయం పిల్లల్లో ఆందోళన పెంచుతుంది. అతి ఒత్తిడి ఏకాగ్రతను తగ్గిస్తుంది. అందుకే తల్లిదండ్రులు అధిక అంచనాలు పెడితే పిల్లల పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ‘‘నా పేరెంట్స్ నా మనసు వినరు. వాళ్లకేం కావాలో అదే ముఖ్యం’’ అనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. దీంతో తల్లిదండ్రులకు ఎమోషనల్గా దూరమవుతారు. కొందరు పిల్లలు తిరుగుబాటు చేసి చదువు మానేస్తారు. మరికొందరు పేరెంట్స్ చెప్పిన దారిలో నడుస్తారు, కానీ జీవితాంతం అసంతృప్తితో ఉంటారు.సరే, ఏం చేయమంటారు? నిర్ణయం తీసుకునే ముందు మీ బిడ్డ మనసు వినండి. ‘నీకు ఏది ఇష్టం’ అనే ప్రశ్నను జెన్యూన్గా అడగండి. మీ కల, మీ బిడ్డ సహజమైన టేలెంట్ తో మ్యాచ్ అవుతుందా? అనే విషయమై ఆలోచించండి. స్పోర్ట్స్, ఆర్ట్స్, కోడింగ్, మెకానిక్స్, మ్యూజిక్... ఏది సహజంగా సూటవుతుందో తెలుసుకునేందుకు పిల్లలను ప్రయత్నించనివ్వండి. మార్కులు, ర్యాంకుల కన్నా కూడా వెల్ బీయింగ్ ముఖ్యం. ఎమోషనల్గా ఆరోగ్యంగా ఉన్న బిడ్డే దీర్ఘకాలంలో విజయం సాధించగల వయోజనుడిగా ఎదుగుతాడు. మీ బిడ్డకు ఏ కెరీర్ సరిపడుతుందో తెలుసుకునేందుకు సైకలాజికల్ అసెస్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్టింగ్ తో కెరీర్ కౌన్సెలింగ్ చేయించండి. పేరెంటింగ్ ఒక అద్దం లాంటిది. మీరు పిల్లలపై మీ ప్రతిబింబం మోపితే, వాళ్ల అసలు రూపం కనిపించదు. కానీ మీరు అద్దం శుభ్రం చేసి వాళ్లను వాళ్లుగానే చూసే ప్రయత్నం చేస్తే... మీ పిల్లల్లోని జీనియస్ ఆటోమేటిగ్గా వెలుగుతుంది.ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్రోజుకు 15 నిమిషాలైనా చదువుకు సంబంధంలేని విషయాలపై మాట్లాడండి. ‘‘నువ్వు ఫస్ట్ రాలేదు’’ అని చిన్నబుచ్చేకంటే, ‘‘నువ్వు ఎంత శ్రద్ధగా ప్రయత్నించావో చూశా, నాకు గర్వంగా ఉంది’’ అని చెప్పండి. ‘‘నీ కజిన్ ఎంత బాగా చదువుతున్నాడో చూడు’’ అని పోల్చవద్దు. అది ఆత్మన్యూనతను పెంచుతుంది. పిల్లల చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి ప్రశంసించండి. అది వారికి ప్రోత్సాహాన్నిస్తుంది. సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!
నేచురల్గా మెరిసే అందం ఆశికా రంగనాథ్ సొంతం! మినిమల్ స్టయిలింగ్ టిప్స్తోనే, ఒక కొత్త లుక్ని సింపుల్గా, క్లాసీగా, కంఫర్టబుల్గా చూపిస్తూ మ్యాజిక్ చేసేస్తోంది. ఆ విషయాలే మీకోసం! బయటకు వెళ్లేటప్పుడు నా ఫేవరెట్ హాక్ బ్రెయిడ్ వేసుకోవడం. బ్రెయిడ్ని ఓపెన్ చేస్తే వచ్చే సాఫ్ట్ వేవ్స్ నాకు బాగా ఇష్టం. బ్లాక్ డ్రెస్లు, క్రాప్టాప్స్ నా ఆల్టైమ్ ఫేవరెట్. యాక్సెసరీస్ విషయానికి వస్తే సింపుల్ జ్యూలరీనే ఎంచుకుంటాను. గ్లామర్ మొత్తం సింప్లిసిటీలోనే ఉంది ఆశికా రంగనాథ్. ఇక్కడ ఆమె ధరించే చీర..బ్రాండ్: సాయి తనార్య, ధర: రూ. 22,000, జ్యూలరీ బ్రాండ్: వివంత్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కనీ కనిపించని కనికట్టుమెడలో ఒక్కసారిగా స్టోన్స్ మాత్రమే మెరుస్తూ కనిపిస్తే అదే ఇన్విజిబుల్ చైన్ మ్యాజిక్. గొలుసు కనిపించకపోయినా, పెండెంట్ మాత్రం గ్లామర్తో మెరుస్తుంది. చీర మీద క్లాసీగా, గౌన్ మీద గ్లామరస్గా, డైలీ వేర్లో క్యూట్గా ఏ లుక్కైనా ఈ ఇన్విజిబుల్ చైన్ సెట్ అవుతుంది. చిన్న పెండెంట్ వేసుకుంటే సింపుల్గా, సాఫిస్టికేటెడ్ లుక్ ఇస్తుంది. పెద్ద స్టోన్ పెండెంట్ అయితే స్పాట్లైట్లో ఉండే జ్యూలరీ అవుతుంది. ఫొటోల్లో ఈ పెండెంట్ లైట్ని క్యాచ్ చేస్తూ అదిరిపోయే గ్లో ఇస్తుంది. హెవీ జ్యూలరీ మానేసి, ఈ ఇన్విజిబుల్ చైన్ విత్ పెండెంట్ని వేసుకుంటే, నేచురల్ బ్యూటీ ఇంకో లెవెల్కి హైలైట్ అవుతుంది. జుట్టు లూజ్ వేవ్స్గా వదిలేస్తే క్లాసీ లుక్, హై బన్ చేస్తే ఎలిగెంట్ లుక్ మీ సొంతం. మార్కెట్లో గోల్డ్, సిల్వర్, కలర్ఫుల్ డిజైన్స్ లైట్వెయిట్ ఆప్షన్లతో దొరుకుతున్నాయి. ఇదొక ఆభరణం మాత్రమే కాదు, అది న్యూ ఏజ్ ట్రెండ్, స్టయిల్ సీక్రెట్ కూడా! (చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!) -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
E–ఈక్వల్ M–మ్యారేజ్ I–ఇన్స్టాల్మెంట్
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసిచూడు.. అని సామెత. రెండూ జటిలమైనవేనని అర్థం. ఇంటి కోసం అప్పు చేసినా తప్పు లేదు. అదొక నీడగా మిగులుతుంది. కానీ పెళ్లి? కం పాటబులిటీ కుదిరితే కుటుంబంగా స్థిరపడుతుంది. లేదంటే చేదుజ్ఞాపకంగా వెంటాడుతుంది. అయినా అంతా బాగుంటుందనే ఆశతో ఏడడుగుల ప్రయాణానికి సిద్ధపడినా.. దానికోసం లక్షలకు లక్షలు అప్పు చేయాల్సిన అవసరం ఉందా అని! ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరే పెట్టుకుంటున్నారు. అది వాళ్లిద్దరి జీవితాలకు తీరని రుణంగా పరిణమించి.. ఈఎమ్ఐల రూపంలో జీతాలనే మింగేస్తోంది. దాని గురించే ఈ కథనం..సాత్విక్ది మార్కెటింగ్ జాబ్, మానస ఒక కార్పొరేట్ కంపెనీలో లీడ్ రోల్లో ఉంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా, డెస్టినేషన్ వెడ్డింగ్. దాదాపు 80 లక్షల రూ పాయలకు పైనే ఖర్చయింది. ఆ భారం ఇరువైపుల తల్లిదండ్రుల మీద పడకుండా వీళ్లిద్దరే షేర్ చేసుకున్నారు. సేవింగ్స్ నుంచేనా ఖర్చు చేసింది అని అడిగితే.. ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్, ఎయిటీ పర్సెంట్ లోన్ అనే చెప్పారు ముక్తకంఠంతో. పెళ్లయి మూడేళ్లవుతోంది. ఆ ఖర్చుకు ఇంకా ఈఎమ్ఐ చెలిస్తునే ఉన్నారు. ఆ లోన్ తీరేదాకా పిల్లలు వద్దు అనుకుంటున్నారట. ఆ మాటతో మానస వాళ్ల మామ్మ హతాశురాలైంది. ఇదెక్కడి చోద్యమంటూ విచారపడింది.సర్వేలే సాక్ష్యం‘ఇండియా లెండ్స్’ చేసిన సర్వే మేరకు సొంత ఖర్చుతోనే పెళ్లిచేసుకోవాలనుకుంటున్న 26 శాతం అమ్మాయిలు, అబ్బాయిలు.. ఆ ఖర్చును పర్సనల్ లోన్తో భర్తీ చేసుకుంటున్నార ట. వాళ్లలో చాలామంది పెళ్లికి సంబంధించి ఒక్క ఈవెంట్కే రూ. లక్ష నుంచి రూ. అయిదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీని మీదే వెడ్డింగ్వైర్ ఇండియా అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఒక్క నిరుడే మన దేశంలో పెళ్లి ఖర్చు అమాంతం రూ. 29.6 లక్షలకు చేరినట్టు తేలింది. పెళ్లి జంటల్లోని మూడోవంతు జంటలు తమ పెళ్లికి రూ. 30 లక్షలకు పైనే వెచ్చిస్తుంటే మిగిలిన జంటలు రూ. 50 లక్షలకు పైగా ఖర్చుపెడుతున్నారని ఆ సర్వే నివేదిక.అప్పులు బారెడు... జీతం మూరెడుగానే! డబ్బు ఖర్చు పెట్టడం చాలా ఈజీ. కూడబెట్టడమే బహు కష్టం. రూ. లక్ష సమకూర్చుకోవడానిక్కూడా కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది మూడు లేదా అయిదురోజుల పెళ్లిలోని ఒక్కో వేడుకకు రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల దాకా పెట్టే ఖర్చు జీవితానికి ఎంత భారమవుతుందో తెలుసా! ఆ అప్పు తీర్చడానికి ఆ జంటలు.. అప్పుడే పిల్లల్ని వద్దనుకోవడం దగ్గర్నుంచి ఇల్లు, ఇతర స్థిర, చరాస్తులను సమకూర్చుకోవడం దాకా అన్నిటినీ వాయిదా వేసుకుంటున్నారు. అ పార్ట్మెంట్ డౌన్పేమెంట్కి పనికొచ్చే డబ్బును, భవిష్యత్ ప్రణాళికలను.. ఆఖరకు ఇన్సూరెన్స్ పాలసీలను సైతం బ్రేక్ చేసి మరీ పెళ్లి బట్టలు, ఈవెంట్ డెకరేషన్ కోసం చేసిన అప్పు తీరుస్తున్న జంటలున్నాయి. ఇలా ఆ లోన్ వాళ్ల పెళ్లిని మధుర జ్ఞాపకంగా మలచకపోగా సంసారాన్ని చింతల చితిగా మారుస్తోంది.క్రైసిస్లో కాపురాలుదరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ను బట్టి వెడ్డింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఏడాదికి పది నుంచి 24 శాతం దాకా మంజూరవుతున్నాయట. వీటికి కట్టలేకుండా పేరుకుపోయిన ఈఎమ్ఐల వడ్డీ వచ్చి చేరి.. ఎంత జీతం వచ్చినా, అత్యవసరాలకే ఎసరు వస్తోంది. ఈ క్రైసిన్ కాపురంలో కలతలను రేపుతోందంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. పెరుగుతున్న రుణభారాన్ని తీర్చడానికి ఓవర్ టైమ్, పార్ట్టైమ్ జాబ్ల కోసం వెదుక్కుంటున్న జంటలూ ఉన్నాయి. నెల తిరిగేసరికల్లా వచ్చే ఈ ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక భార్యాభర్తల డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్స్ కలహాలతో ముగుస్తున్నాయి. ఎడమొహం పెడమొహంగా ఉదయాలు మొదలవుతున్నాయి.అప్పు తప్పు కాదు కానీ.. లోన్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఎందుకు తీసుకుంటున్నాం.. దేనిమీద ఖర్చు పెడుతున్నామనే ఎరుక, స్పష్టత చాలా అవసరం అంటున్నారు ఆర్థికవిశ్లేషకులు. ఇల్లు కట్టుకోవడానికో, వ్యా పారం ప్రారంభించడానికో, మెరుగైన ఉ పాధి అవకాశాలను కల్పించే చదువుకోసమో అప్పు చేయడం సబబే. కానీ.. పైసా రాబడి లేనిచోట అప్పు చేసి మరీ డబ్బును వెదజల్లడం తెలివైన నిర్ణయం కాదని చెబుతున్నారు. పరస్పర గౌరవ మర్యాదలు, సర్దుబాట్లు, ప్రేమాభిమానాలతో పెళ్లి చేసుకోవాలి. మంచి కుటుంబంగా స్థిరపడాలి. కానీ ఆడంబరాల వేడుకగా.. ఫొటోలు, వీడియోలతో కనిపించే అప్పుగా కాదని సూస్తున్నారు ఆర్థికనిపుణులు, విశ్లేషకులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు. కలలు సాకారమవ్వాల్సిందే! మధురమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవాల్సిందే! కానీ ఈ రెంటికి మూల్యం మన జీవితం కాకూడదు! అప్పుడే సాకారమైన కలలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మన మ్యారేజ్ ఇండస్ట్రీ ఏటా కోటి పెళ్లిళ్లతో 10.79 లక్షల కోట్ల టర్నోవర్గా పురోగమిస్తోంది. ఫుడ్ అండ్ గ్రాసరీ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రధాన, ప్రభావవంతమైన ఇండస్ట్రీగా విరాజిల్లుతోంది. -
గుండెకు అండగా ఉందాం
ఈ ఏడాది ‘వరల్డ్ హార్ డే’ థీమ్ ‘ఒక్క స్పందననూ మిస్ కాకండి’ (డోంట్ మిస్ ఏ బీట్) అని. అంటే... గుండెను రక్షించుకోవడంలో ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనీ, గుండె ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్గానీ లేదా అదే చేసే హెచ్చరికలుగానీ ఏవీ మిస్ కాకుండా చూసుకోవాలనే సందేశాన్ని ఈ థీమ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గుండె సంరక్షణ కోసం సీనియర్ కార్డియాలజిస్టులు... పాఠకులతో పంచుకుంటున్న అత్యంత కీలకమైన విషయాలివి.భారతదేశంలో గుండెజబ్బుల విస్తృతి కాస్తంత బెంబేలెత్తించేలాగే ఉంది. గతంలో అంటురోగాల శకం ముగిసి, ఇప్పుడు జీవనశైలితో వస్తున్న ‘నాన్ కమ్యూనికబుల్ జబ్బులు’ విస్తరిస్తున్న శకంలో... అన్ని జబ్బులతో పోలిస్తే గుండెజబ్బుల వాటా తక్కువేమీ కాదు. పైగా అన్ని నదులూ పరుగెత్తేది సముద్రం వైపే అన్నట్టుగా... అన్ని జబ్బులూ నడిచేది గుండెజబ్బులవైపే. ఉదాహరణకు అది డయాబెటిస్గానీ, హైబీపీగానీ, స్థూలకాయం, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇవన్నీ పెరుగుతూ పెరుగుతూ చివర్న గుండెజబ్బుల దిశగా పయనిస్తున్నాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతి జబ్బూ అది హార్ట్ ఎటాక్గానో, బ్రెయిన్ స్ట్రోక్గానో పరిణమించేదే అనడంలో సందేహం లేదు. → హృద్రోగం వృద్ధాప్య రోగం కాదు... గతంలో గుండెజబ్బులనేవి కాస్తంత వయసు పెరిగాకే కనిపించేవి. ఇప్పుడు అవి కూడా చాలా త్వరితంగా వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి యువతలో సైతం కనిపిస్తున్నాయి. అందుకే చాలా సందర్భాల్లో వీటిని నిశ్శబ్ద ఉత్పాతాలు (సైలెంట్ ఎపిడెమిక్స్) అని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. → ఆ తెలుగు వాడుక మాట అక్షరాలా నిజం... మన తెలుగు వాడుక మాటల్లో ‘గుండెల్ని పిండేసేలాగా...’ అన్నది ఓ జాతీయం. ఒత్తిడి విషయంలో ఆ నుడికారం అక్షరసత్యం. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది ‘గుండెలను పిండేస్తుంది’! మానసిక ఒత్తిడి అనేది ఓ భావోద్వేగపూరితమైన ఎమోషన్గా చెప్పడం సరికాదు. ఆ భావోద్వేగం కాస్తా తన భౌతిక లక్షణాలతో గుండెజబ్బుగానో, గుండెపోటుగానో కనిపించడం చాలా సాధారణం. ఎందుకంటే... మానసిక ఒత్తిడి పెరగగానే... రక్తనాళాల్లో రక్తపోటూ పెరుగుతుంది. రక్తపోటు కాస్తా గుండెపోటుగా పరిణమించడం మనకు తెలిసిన విషయమే. మనం సంప్రదాయంగా పాటించే కొన్ని అంశాల్లో దీనికి విరుగుడు దాగుంది. అవే... యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు. వీటి సాయంతో మన నరాలను హాయిపరచడం మొదలుపెట్టగానే... రక్తనాళాల్లో పోటెత్తే రక్తప్రవాహాన్నీ అది జోకొడుతుంది. దాంతో బీపీ తన నార్మల్ ఒత్తిడికి వచ్చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ తప్పుతుంది. అందుకే ఇప్పుడు డాక్టర్లు కూడా మందులతో పాటు... ఈ మార్గాలూ ప్రిస్క్రిప్షన్లో సూచిస్తున్నారు. → డాన్సులూ డేంజరస్గా మారిన డేస్ ఇవి! ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నవారికి తెలియని విషయాలేమీ కావివి. అవేమిటంటే... మంచి వయసులో ఉన్న యువత కూడా డాన్స్ చేస్తూనో, క్రికెట్ ఆడుతూ ఆడుతూనో, జిమ్లో వ్యాయమం చేస్తూనో యువతీ యువకులు కుప్పకూలిపోతున్నారు. దీన్ని నివారించదగిన అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ శక్తిని ఒకేసారి ఇచ్చే హై–ఎనర్జీ డ్రింకులూ, వ్యాయామంతో పాటు స్టెరాయిడ్స్ తీసుకుంటున్న ఉదంతాలూ, ఒకే చోట కూర్చుని చేసే వృత్తివ్యాపకాలూ, చురుగ్గా కదలడానికి అంతగా ఇష్టపడని జీవనశైలీ... ఇవన్నీ ఇలా ఆకస్మికంగా గుప్పెడంత గుండెను కుప్పకూల్చే ముప్పును పెంచుతున్నాయి. వీటి నివారణ చాలా సింపుల్. క్రమం తప్పకుండా చేసుకునే కొన్ని సాధారణ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలతో పెద్ద పెద్ద గుండె ముప్పులనూ నివారించుకోవచ్చు. అలా నిబ్బరంగా, నిశ్చింతగా ఉండవచ్చు. → నివారణ చాలా సింపుల్... అదే టైమ్లో బోలెడంత పవర్ఫుల్...నిజానికి గుండెజబ్బుల నివారణ చాలా చాలా సింపుల్. మనం సంకల్పంతో నిలిపేయగలిగే పొగతాగే అలవాటు, మద్యం అలవాట్లనుంచి దూరంగా ఉంటే చాలు. అదే సమయంలో అన్నంలో తగినన్ని ఆకుకూరలూ, కాయగూరలతో పాటు తాజా పండ్లు తీసుకోవడం వంటి మంచి రుచికరమైన మార్గంలో వెళ్లడం ద్వారా గుండెజబ్బుల్ని సమర్థంగా నివారించవచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, బరువు ఆరోగ్యకరమైన లిమిట్లోనే ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమైనవి. ఇక్కడ కాస్తంత కష్టమైనదైనా కన్సిస్టెంట్గా అంటే క్రమం తప్పకుండా పై అలవాట్లను కొనసాగించడంతో గుండె ఆరోగ్యాన్ని పదికాలాల పాటు పదిలంగా పదిలపరచవచ్చు.→ గాలినీ, కలుషితాలనూ తేలిగ్గా తీసుకోకండి... మనం పీల్చే గాలి శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. అంటే... వాహనాల పొగతో లేదా కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకోవడాన్ని వీలైనంతగా తప్పించుకోవాలి. వాటిలో ఉండే కాలుష్యపదార్థాలు, ధూళిదూసరాలూ రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని వేగవంతం చేస్తాయి. అలా గుండెజబ్బులూ వేగంగా వచ్చేలా చేస్తాయి. కాలుష్యం పెరిగిన కొద్దీ రక్తం తాలూకు ఎరుపు రంగు డేంజర్ మార్క్లా కనిపిస్తుంది. అదే వీలైనంతగా పచ్చటి పరిసరాల్లోనే ఉండటం ప్రారంభిస్తే గుండె ఆరోగ్యమూ పదికాలాలు పచ్చగా ఉంటుంది. → మహిళల గుండెలకు మరింత ముప్పు... మహిళలు కుటుంబ ఆరోగ్యానికి ప్రాథమ్యం ఇచ్చి, చాలావరకు తమ ఆరోగ్యానికి రెండో ప్రాధాన్యమిస్తారు. వారు తమలో కలిగే అలసటను ఇంటి పనులతో వచ్చిన నీరసంగా అనుకుంటారు. తమ అజీర్ణ సమస్యను గ్యాస్ సమస్యగా భావిస్తారు. తమ గుండెనొప్పిని ఛాతీనొప్పిగానే తీసుకుంటారు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగున్నట్టుగా వాళ్ల గుండె బాగుంటేనే మిగతా ఇంటి సభ్యుల గుండె సంస్పందనలూ బాగుంటాయి. ‘డోంట్ మిస్ ద బీట్’ అనే థీమ్ను తమకు అనువుగా ఆలోచిస్తే.. మహిళలకే అది ఎక్కువగా అనువర్తిస్తుంది. → అనుక్షణం... రక్షణకు అనువైన క్షణమే... ఆకస్మిక గుండె జబ్బు ముప్పు నుంచి కా పాడాలంటే అనుక్షణం అనువైన క్షణమే. అందుకే గుండెజబ్బు లక్షణాలు కనిపించినప్పుడు దాన్నుంచి రక్షించాలంటే ప్రతి ఒక్కరూ కార్డియాక్ పల్మునరీ రిససియేషన్ అనే సీపీఆర్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా గుండె పట్టుకుని కుప్పకూలిపోతే ఒకచేతి వేళలలో మరో చేతివేళ్లు దూర్చి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుండెపై క్రమబద్దంగా, లయబద్ధంగా, నేర్పుగా కదిలిస్తూ ‘సీపీఆర్’ నిర్వహించే నైపుణ్యాలను నేర్చుకోవాలి. అది ఇల్లూ, వాకిలీ, పనిప్రదేశం ఇలా ఎక్కడైనా, ఎవరైనా అభ్యసించగల సింపుల్గా చేయగలిగే ఈ ప్రాణరక్షణ నైపుణ్యం చేతుల్లో దాగి ఉండే అభయహస్తాలవుతాయవి. → చివరగా... మనం పుట్టిన నాటి నుంచీ క్షణం కూడా ఆగకుండా... ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా ఒక జీవితకాలం పాటు సంస్పదిస్తూ ఉండే ఆ గుండెను గౌరవిస్తూ... దాన్ని మాటువేసి కాటు వేసే అన్ని రకాల అవాంతరాల నుంచి కా పాడుకోడానికి బిక్కు బిక్కుమని భయపడకుండా ఉండటానికి గడియారంలో టిక్కు టిక్కుమనే ఏ బీట్నూ మిస్ కాకుడదంటూ లబ్డబ్ మంటూ స్పందించే ‘హార్ట్’ డే థీమ్కు భాష్యం చెప్పుకోవాలి.డా. ఎంఎస్ఎస్ ముఖర్జీసీనియర్ కార్డియాలజిస్ట్ నిర్వహణ:యాసీన్ -
పయనమే జీవనం..
‘ఇల్లే తీర్థం–వాకిలే వారణాసి–కడుపే కైలాసం’ అనుకుంటారు కొందరు. కొందరు మాత్రం ‘ప్రపంచమే అతి పెద్ద ఇల్లు’ అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. ఒక వయసు దాటిన తరువాత ‘ఈ వయసులో ప్రయాణం ఏమిటి’ అనుకుంటారు ఇంకొంతమంది. అయితే ప్రయాణం వయసెరుగదు. ఎందుకంటే వయసు భారాన్ని అధిగమించే ఉత్సాహం ప్రయాణాలలో ఉంది. అలాంటి ఒక ఉత్సాహవంతురాలు ఇందిర. కేరళకు చెందిన ఇందిర ఎం. ఉపాధ్యాయురాలు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత 35 దేశాలు పర్యటించింది.కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని చిన్నప్పుడు కలలు కనేది ఇందిర. అయితే అరవై ఏళ్ల వయసులోగానీ ఆ కల నెరవేరలేదు. సౌత్ ఆఫ్రికన్ సవానా తన తొలి ఇంటర్నేషనల్ ట్రిప్. తొలి ప్రయాణ విశేషాల గురించి అపురూపంగా చెబుతుంది. జీవవైవిధ్యంతో అలరించే ప్రకృతి, బిగ్ఫైవ్లాంటి వన్య ప్రాణులు, వైవిధ్యమైన వాతావరణం... స్థూలంగా తొలి పర్యటన ఇందిరకు ఎంతో సంతోషాన్నిచ్చింది.చదవండి : బాలీవుడ్ని వదిలేసి, వ్యవసాయంలోకి..కట్ చేస్తసఫారీలో తాను చూసిన ఏనుగులు, సింహాల గురించి చిన్నపిల్లలా ఉత్సాహపడుతూ... ‘ప్రయాణాల పుణ్యమా అని నాకు ఎంతోమంది స్నేహితులయ్యారు. జీవితంతో పాటు రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం. మాలో చాలామందికి ఒకేరకమైన జీవితానుభవాలు ఉన్నాయి. నా స్నేహబృందంలో వివిధ వయసుల వాళ్లు,ప్రాంతాల వాళ్లు ఉన్నారు. అయితే మా స్నేహానికి వయసు,ప్రాంతం ఎప్పుడూ అడ్డుగోడ కాలేదు’ అంటుంది ఇందిర.పెళ్లికావడానికి ముందు ప్రయాణాలు చేయాలనే ఉత్సాహం ఉన్నా ఆమె దగ్గర సరిపడా డబ్బు ఉండేది కాదు. ఉద్యోగం వచ్చి, పెళ్లయిన తరువాత కుటుంబ ఖర్చులు, బాధ్యతల వల్ల ప్రయాణాలు చేయలేక పోయింది. ‘సోలో ట్రావెలింగ్ గురించి ఆలస్యంగా తెలిసింది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను నేను లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడింది’ అంటుంది ఇందిర.ప్రతి ప్రయాణంలో ఆమె ఎన్నో అనుభవాలను మూటగట్టుకుంది. ఇస్తాంబుల్లో ఉన్నప్పుడు సూట్కేస్ కోడ్ మరిచి పోయింది. జపాన్లో ఒకరోజు గాయపడింది... ఇలాంటి ఎన్నో సందర్భాలలోనూ ఎవరో ఒకరు ఆమెకు సహాయంగా నిలిచేవారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, దయాగుణం అనుకోని అతిథిలా వచ్చేది.సోలో ట్రావెల్ను ఎంజాయ్ చేసినట్లే గ్రూప్ ట్రావెల్ను కూడా ఎంజాయ్ చేసింది ఇందిర. ‘గ్రూప్తో కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబసభ్యులతో ఉన్నట్లుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరికి సహాయపడతారు’ అంటున్న ఇందిర ఇప్పటివరకు 35 దేశాలకు వెళ్లింది. మరిన్ని దేశాలకు వెళ్లడానికి సన్నద్ధం అవుతోంది. తాజాగా స్కాండినేవియా దేశాల పర్యటనకు సిద్ధం అవుతోంది.తొలి ప్రయాణానికి సంబంధించి పిల్లలు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మొదటి ప్రయాణ సమయంలో ఖర్చు గురించి ఆలోచించాను. అయితే విలువైన ప్రయాణ అనుభవాల ముందు ఆ ఖర్చు ఒక లెక్కే కాదని తెలుసుకున్నాను. ప్రయాణాన్ని ఇంత బాగా ఆస్వాదిస్తానని ఊహించలేదు. తొలి ప్రయాణం అనేది నేను ప్రయాణాలను ఇష్టపడేలా చేసిన ఒక ట్రిగ్గర్.చదవండి: ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి ఎప్పుడూ ఉండే ఇంటిని దాటి మనల్ని మనం కనుగొనడంలో ఒక నిర్దిష్ట నిశ్శబ్ద శక్తి ఉంది. నేను చాలా ఆలస్యంగా ప్రయాణాలు ప్రారంభించాను. చాలా ముందుగానే మొదలు పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తోంది. సోలో ట్రావెల్కు చాలామంది వెనకాడుతుంటారు. అయితే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.– ఇందిర ఎం -
కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!
ఇప్పుడంతా డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ప్రతిదీ ఆన్లైన్ మయం. ఫోన్స్క్రీన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడకుండా పనులు అవ్వని కాలం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో..చాలామంది వెన్నునొప్పి, కాలునొప్పి వంటి సమస్యల కంటే కంటి సమస్యల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంది. అందుకు చిన్న, పెద్ద అనే భేధం లేదు. ఇక్కడ అనన్య దేశాయ్ అనే టీనేజర్ టెక్కీ కూడా ఇలానే బాధపడుతోంది. నిద్ర లేవడంతోనే నేరుగా వేటిని చూడలేదు. చాలాసేపు వరకు చూపు స్పష్టంగా కనిపించదామెకు. ఆమె తీవ్రమైన మయోఫియాతో బాధపడుతోంది. ఆమె అమ్మమ్మ గ్లాకోమాతో ఇబ్బందిపడటం దగ్గర నుంచి చూసిన ఆమె తన సమస్యను మరి ఆ స్థాయిలోకి రానివ్వకూడదనుకుంది. అలా పుట్టుకొచ్చిందే కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వెబ్సైట్. ఏంటిది..? ఇది మన కళ్లను ఎలా సంరక్షిస్తుందంటే..అనన్య ఆన్లైన్ తరగతులు, ఇంటర్లో నోట్స్, కోడింగ్ అసైన్మెంట్లు వంటి అన్నింటి కోసం గంటల తరబడి స్క్రీన్లపై ఆధారపడాల్సి వచ్చింది. దాంతో తలనొప్పి, కంటి ఒత్తిడి వంటి పరిస్థితులను ఎదుర్కొని మెరుగైన చూపుని ఎంతమేర కోల్పోయిందో తెలుసుకుంది అనన్య. దాంతో తీవ్రమైన మయోపియా బారిన పడింది. దీని కారణంగా అనన్య కంటి లెన్స్ లేదా కళ్ల జోడులు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. అందుకామె కంటి చూపుని తేలిగ్గా చూడొద్దని హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి వల్లే తనకు స్క్రీన్ వాడకం ఎక్కువైందని అది మొత్తం జీవితాలనే మార్చేసిందని అంటోంది. తనకున్న కోడింగ్ అభిరుచితో ఈ సమస్యకు చెక్పెట్టగలనా అని ఆలోచించడం ప్రారంభించింది. అలా పుట్టుకొచ్చిందే ఈ విజువల్ ఐస్ వెబ్సైట్. ఏంటి వెబ్సైట్..ఇది డిజిటల్ కంటి ఒత్తిడిని అధిగమించడంలో హెల్ప్ అవుదుంది. ఇది 20-20-20 రూల్తో రూపొందించింది. ఏఐ ఆధారిత ఆరోగ్య చిట్కాల్లో ఈ 20 రూల్ కంటి ఆరోగ్యానికి హెల్ప్ అవుతుందని తెలుసుకుంది అనన్య. అదే ఆమెకు కంటి ఆరోగ్యాన్ని కాపాడే వెబ్సైట్ని రూపొందించేందుకు ప్రేరణ ఇచ్చింది. అలా అనన్య కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(CVS)గా పిలిచే ఈ డిజిటల్ కంటి ఒత్తిడిని నివారించడానికి ఈ ఐస్ వెబ్సైట్ని రూపొందించింది అనన్య. తనకున్న కోడింగ్ సామర్థ్యంతో ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే..ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ల నుంచి విరామం తీసుకుని 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడటం. అదే ఈ వెబ్సైట్లో ఉంటుంది.ఎందుకు మంచిదంటే..ఇది కంటి ఫోకసింగ్ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. కార్నియల్ ఉపరితలాన్ని రీహైడ్రేట్ చేయడానికి, రెప్పవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇంటెన్సివ్ స్క్రీన్ పనిలో నిమగ్నమైన వ్యక్తులకు దృశ్య అలసట, కంటి ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఈ వెబ్సైట్ మన కంప్యూటర్ స్క్రీన్పై ఫోకస్ టైమర్ ద్వారా 20 నిమిషాల రిమైండర్ ప్రతిసారి దీన్ని గుర్తు చేస్తుందని చెబుతున్నారు. కాగా, అనన్య ఇలాంటి కంటి ఆరోగ్యానికి సంబంధించిన 20-20-20 రూల్ తోపాటు, ఆకుకూరలు, నట్స్, కంటి వ్యాయమాలతో తన దృష్టిని మరింతగా మెరుగుపరుచుకున్నట్లు వెల్లడించింది. ఇక్కడ తన కంటి పరిస్థితి కారణంగా ఎదురైన సవాళ్లు ఆవిష్కరణకు నాందిపలికింది. ఇక్కడ అనన్య స్టోరీ ప్రతి ఒక్కరూ తమకెదురైనా కష్టాన్ని లేదా సమస్యను మరో దృక్పథంలో చూడండి తప్ప నిరాస నిస్ప్రుహలకు లోనవ్వకూడదని తెలుపుతోంది. (చదవండి: Dussehra 2025: ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..) -
మటన్ Vs చికెన్ ఆరోగ్యానికి ఏది మంచిది..!
మాంసాహారం పట్ల మన ప్రేమకు హద్దే లేదని...ఏటా దేశవ్యాప్తంగా హాంఫట్ అనిపిస్తున్న టన్నుల కొద్దీ భిన్న రకాల మాంస విక్రయాలు నిరూపిస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా నాన్ వెజ్ ప్రియత్వం అంతకంతకూ ఇనుమడిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక వండేశైలులు మేళవించే ముడి దినుసుల బట్టి రుచి ప్రాచుర్యాలు మారవచ్చేమో గానీ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటోంది. ఈ మాంసాహారాల్లో మటన్ చికెన్ అత్యధిక శాతం మంది తీసుకునే ఆహారం అనేది తెలిసిందే.మాంసం పట్ల ప్రేమ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో మేక మాంసం ప్రసిద్ధి చెందినప్పటికీ, దేశంలోని ఉత్తర ప్రాంతంలో చికెన్ ఆధిపత్యం చెలాయిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం కోడి, మేక మాంసం రెండూ ఇష్టపడతాయి.మటన్ వద్దు.. చికెన్ ముద్దు...అయితే గత కొంతకాలంగా వైద్యులు చెబుతున్న ప్రకారం గానీ, పోషకాహార నిపుణుల సూచనలను బట్టి గానీ చూస్తే మటన్ లేదా మేక/గొర్రె(mutton) మాంసంతో పోలిస్తే చికెన్ /కోడి(chicken) మాంసం అత్యంత ఆరోగ్యకరం. మేక మాంసం అనారోగ్యకరం. అయితే దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది ఓ తాజా అధ్యయనం.అధ్యయనం ఏం చెబుతుంది?ముడి మేక కోడి మాంసం మధ్య పోలికను చూపించే ఇఎస్డిఎ ఫుడ్ డేటా సెంట్రల్కు చెందిన డిజిటల్ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, మటన్ చికెన్ రెండింటిలో ప్రోటీన్ స్థాయిలు దాదాపు సమానంగా ఉన్నాయని, కానీ మేక మాంసం ఇనుము, పొటాషియం రాగి వంటి ఖనిజాలను అలాగే శాట్యురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను గణనీయంగా తక్కువగా కలిగి ఉంటుందని పేర్కొంది. అది మేక మాంసాన్ని గుండెకు ఆరోగ్యకరమైన ఎంపికగా చేస్తుంది, ఇది కోడి మాంసంతో పోల్చదగిన ప్రోటీన్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రెండు మాంసాలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉన్నాయని అధ్యయనం చెబుతుంది. ఇది కండరాల పెరుగుదలకు మెరుగైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.మేక మాంసం కోడి మాంసం రెండూ సహజంగా జంతు ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటాయి. అయితే వాటి పోషక విలువలు ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలలో మాత్రం చాలా తేడా ఉంది. ప్రోటీన్ విషయానికి వస్తే, కోడి మాంసం మేక మాంసం కంటే కొంత ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది. ఒక 100 గ్రాముల కోడి మాంసంలో దాదాపు 21.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అయితే అదే ఒక 100 గ్రాముల మేక మాంసం దాదాపు 20.6 గ్రాముల ప్రోటీన్లను అందిస్తుంది. రెండు మాంసాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ని కలిగి ఉంటాయి, ఇది కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు కూడా అవసరం.ఎందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది?మేక మాంసం చికెన్ కంటే తక్కువ మొత్తం కొవ్వు, శాట్యురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది 3–ఔన్సులకు దాదాపు 2.6 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. అంతేకాకుండా, మేక మాంసంలో ఇనుము జింక్ (Zinc) వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. మరోవైపు కోడి మాంసంలో బి5, బి6, డి, ఇ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శక్తి జీవక్రియతో పాటు ఎముక ఆరోగ్యానికి ఉపయుక్తం.ఏది మంచిది?క్లుప్తంగా చెప్పాలంటే, మేక మాంసం. కోడి మాంసం రెండూ అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో అధిక–నాణ్యత ప్రోటీన్ను అందిస్తాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాబట్టి ఒకటి మంచిది కాదు మరొకటి మంచిది అనే తీర్పులు సరైనవి కావని స్పష్టం చేస్తోది. ఈ రెండింటిలో ఒక ఎంపిక ప్రధానంగా వ్యక్తిగత పోషక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, మెరుగైన ఆరోగ్యం కోసం నాన్ వెజ్ ఆహారాన్ని మితంగా తీసుకోవడం మాత్రమే ఉత్తమం.చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే.. -
దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండమని చెబుతున్నారు సూరత్కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి. మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు. హెల్దీగా ఉండేలా..హైడ్రేటెడ్గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. పెయిన్ కిల్లర్స్కి దూరం..ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు. శరీరం మాట వినండి..గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు. View this post on Instagram A post shared by Krunal Shah (@dr.krunal_shah_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
డ్రగ్స్ రహిత దేశం కోసం సైక్లింగ్..
ధ్యానంపై అవగాహన కల్పించడంతో పాటు భారత ప్రభుత్వ ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’కు మద్దతు ఇవ్వడంలో భాగంగా సైక్లింగ్ ప్రయాణం చేపట్టిన తరుణ్ పర్మార్ నేడు హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. అహ్మదాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీషనర్ తరుణ్ పర్మార్ సెపె్టంబర్ 13న నోయిడా నుంచి మొదలు పెట్టిన ఈ సైక్లింగ్ 7 రాష్ట్రాలు, ప్రముఖ నగరాల్లో అవగాహన కల్పిస్తూ రోజుకు దాదాపు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా నేడు హైదరాబాద్కు చేరుకుని రేపు నగరంలోని కన్హా శాంతి వనం – హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వేదికగా తన సైక్లింగ్ ప్రయాణాన్ని ముగించనున్నారు. తరుణ్ పర్మార్ ఈ అవగాహన సైక్లింగ్ ప్రయాణంలో భాగంగా మొత్తం 1700 కి.మీ సైక్లింగ్ చేసి ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా తరుణ్ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. సైక్లింగ్, ధ్యానం తన జీవన గమ్యాలే తన సంతృప్తి అని పేర్కొన్నారు. ధ్యానం తన జీవితాన్ని మార్చేసిందని, మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. (చదవండి: రొమ్ము కేన్సర్ అవేర్నెస్ రన్.. ‘పింక్థాన్’) -
రొమ్ము కేన్సర్ అవేర్నెస్ రన్.. ‘పింక్థాన్’
బ్రెస్ట్ కేన్సర్పై అవగాహన కల్పిండమే లక్ష్యంగా హైదరాబాద్తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లో పింక్థాన్ రన్ నిర్వహించనున్నారు. జైడస్ లైఫ్సైన్సెస్ ఆధ్వర్యంలో డిసెంబరు 21న నిర్వహించనున్న ఈ రన్లో 30 వేల మందికి పైగా మహిళలు పాల్గోనున్నారని, ఇందులో అల్ట్రా రన్స్, రీలే రన్ ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి నెల మూడు నిమిషాల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ మహిళల ప్రాణాలను రొమ్ము కేన్సర్ నుంచి కాపాడగలదని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరి్వల్ పటేల్ తెలిపారు. పింక్థాన్తో మరింత మందిని చైతన్యపరచడమే లక్ష్యమన్నారు. దేశంలో యేటా రెండు లక్షల మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బాధితులు అవుతున్నారని ఫిట్నెస్ ఐకాన్ పింక్థాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ అన్నారు.27న నేచర్ క్యాంప్ ఫారెస్ట్ ట్రెక్పార్కులో నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్పార్కులో 27 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకూ నేచర్ క్యాంప్ ఉంటుందని తెలిపారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నోక్టర్నల్ వాక్, నైట్æ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, బర్డ్ వాచింగ్ ఉంటాయన్నారు. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో బర్డ్ వాక్లో పిల్లలు, పెద్దలు పక్షుల జాతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 73823–07476, 94935–49399లను సంప్రదించాలని సూచించారు. (చదవండి: 'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!) -
‘ప’ చీమ ‘ఉ’ చీమ : సంసారం, వైరాగ్యం ఇంట్రస్టింగ్ స్టోరీ
ఒక వ్యక్తి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకొని ‘బాబోయ్! ఈ స్తంభం నన్ను వదిలి పెట్టటం లేదండోయ్!’ అంటూ అరిచాడట. సంసారం కూడా ఇంతే. సంసారం మనల్ని పట్టుకున్న దనుకొంటారు చాలామంది. కానీ సంసారాన్నే మనం పట్టుకొని సతమత మవుతున్నామని గ్రహించరు. సంసారంలోని సారం తెలిస్తే ఎవరూ బాధపడరు. చావుపుట్టుకల తగలాటమే సంసార సారం. భార్యాబిడ్డలు, ఇల్లూవాకిలి, పొలమూ పుట్ర ఇవన్నీ సంసారమను కొంటున్నాం. ఇవన్నీ జనన మరణాల మధ్య రాగంతో ఏర్పాటు చేసుకొన్న సామగ్రి.జనన మరణాత్మకమైన సంసారంలో రాగద్వేషాలు వదలి తామరాకుపై నీటిబొట్టు లాగా ఉండగలిగితే ఈ సంసారం మనిషినేమీ చేయదు. అలాకాక రాగద్వేషాలతో వీటన్నిటి మీద ఆసక్తి కలిగి ఉన్నంతకాలం అది మనల్ని పట్టుకున్నట్లనిపిస్తుంది. సరిగ్గా దీనికి ఉదాహరణే స్తంభాన్ని కౌగలించుకోవటం! వైరాగ్య భావం అలవాటు చేసుకుంటే సంసారంలో ఆసక్తి ఉండదు. వైరాగ్యం పొందే విధం కోసం సద్గ్రంథ పఠనం చేసి, గురూపదేశం పొందాలి. మనిషి సంసారాన్ని తానే వరించి తెచ్చుకొన్నాడు తప్ప అది పట్టుకోలేదు.‘ఉ’ అనే చీమ ఉప్పుగట్టు మీదనే ఉంటూ ఉప్పే తింటుండేది. అలాగే ‘ప’ అనే చీమ పంచదార గుట్ట మీద ఉంటూ పంచదార తింటూండేది. ఒకసారి ‘ప’ అనే చీమ ‘ఉ’ అనే చీమతో ‘మిత్రమా! కొంచెం పంచదార చవి చూడు. ఎంత తియ్యగా ఉంటుందో!’ అని అన్నది. సరే అలాగే అని కొద్దిగా పంచదార రుచి చూచి ‘అబ్బే! తియ్యగా ఉన్నట్లే లేదోయ్ మిత్రమా’ అంది ‘ఉ’ అనే చీమ. ‘అయితే ఒక పని చెయ్యి! నీ నోట్లో ఉప్పుకణాలున్నాయి. వాటిని పూర్తిగా ఉమ్మివేసెయ్యి. అప్పుడుగాని పంచదార రుచేమిటో నీకు తెలీదు’ అన్నది పంచదార చీమ.‘అంతర్లవణమేవాస్తి బహిర్వమతుమే సఖా’ అనే సూక్తి ఈ విషయాన్నే సూచిస్తున్నది. ఈ మాదిరిగానే గుండెనిండా రాగద్వేషాలు, వ్యామోహాదులను నింపుకొని ఉన్నవానికి గురుబోధ ఎక్కడ ఎక్కుతుంది? వైరాగ్యం ఎలా కుదురుతుంది? వైరాగ్యం కుదరాలంటే అవన్నీ ముందు వదిలించుకోవాలి!-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
లిపోప్రొటీన్(ఎ)తో గుండెకు ప్రమాదం..!
గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే జన్యు ఆధారిత సమస్య లిపోప్రొటీన్(ఎ) పై అవగాహన లోపం శాపమవుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ నవార్టిస్ బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుంటే అందులో 5వ వంతు భారతీయులే ఉండటానికి కారణం లిపోప్రొటీన్(ఎ) అని వీరు స్పష్టం చేశారు. మన దేశీయుల్లో 34% మందికి లిపోప్రొటీన్(ఎ) స్థాయి అధికం కాబట్టి ముందస్తు రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తించడం కీలకమని అపోలో ఆస్పత్రి కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేశారు. ఈ లిపోప్రోటీన్ రక్త నాళాల గోడలలో పేరుకుపోయి, LDL కొలెస్ట్రాల్ మాదిరిగానే ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు శరీరంలోని ఇతర భాగాల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోకులు, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.కేవలం రక్తపరీక్షతో పెను ప్రమాదాన్ని నివారించవచ్చనే విషయం చాలా మందికి తెలీదని హార్ట్ హెల్త్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఆరోగ్య కార్యక్రమాల్లో లిపోప్రొటీన్(ఎ) పరీక్షను భాగం చేయాలని ప్రభుత్వాలను వైద్యులు కోరారు. (చదవండి: పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..) -
పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..
హైదరాబాద్ నగరంలో పెళ్లి చేయాలంటే ఇంటి ముందు పందిరి వేసుకునేంత ప్రదేశం దొరకడం కష్టంగా మారింది. ఇరుకిరుకు రోడ్లు, నిత్యం వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు నిత్యకృత్యాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్థిక స్థోమత ఉన్నవారు రూ.లక్షలు చెల్లించి ఫంక్షన్ హాల్కు వెళ్లిపోతున్నారు. మరికొంత మంది భారీ ఎత్తున పూల తోరణాలు, సెట్టింగులతో ముస్తాబు చేసి, స్టేటస్ చూపిస్తున్నారు. పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. కల్యాణ మండపం ఖర్చులు పెట్టుకోలేని పేదలకు అండగా నిలిచేందుకు త్యాగరాయ గానసభ ముందుకొస్తోంది. పేద కుటుంబాల వివాహాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్, పెళ్లి కుమార్తెకు బంగారు తాళిబొట్టు, చీర, కాలి మెట్టెలు ఇస్తున్నారు. 150 మంది వరకు బందువులకు ఉచితంగా శాఖాహార భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే వివాహం అనేది పెద్దలు కుదుర్చిన సంబంధాలకు మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. ప్రేమ వివాహాలు వంటి వాటికి ఇక్కడ స్థానం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 97 వివాహాలు త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 97 వివాహాలకు ఉచితంగా ఫంక్షన్ హాల్ అందించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఫంక్షన్ హాల్కు వెళ్లే ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు ఇక్కడ ఆసరా లభిస్తోంది. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా త్యాగరాయ గానసభలో వివాహం చేసుకున్న కుటుంబాలకు కల్యాణ లక్ష్మి పథకంలో త్వరితగతిన ప్రోత్సాహకాలను అందిస్తోంది. వివరాలకు ఫోన్: 93999 20008. (చదవండి: ఇల్లే గ్రంథాలయం..! హోమ్ లైబ్రరీ కోసం..) -
ఆవగింజంత విశ్వాసం.. అద్భుత విజయాలు
కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్ప జీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకర యుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు ప్రతిరోజూ తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే ఒక్కొక్కరుగా వచ్చి తనతో తలపడమంటూ తొడలు కొట్టి సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు అనేవాడి రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, యుద్ధం జరగకుండానే విజేతలెవరో నిర్ణయమైంది. విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు యుద్ధరంగ ప్రవేశం చేసి, గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమ ఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతు ను మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు అలా గొప్ప విజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు.దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా సైద్ధాంతికంగా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’ లోకి వారు ఎదగ లేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల కండలు, మారణాయుధాలు, పెడబొబ్బలు వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మక సజీవ విశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. కేవలం ఆవగింజంత విశ్వాసంతో అత్యద్భుత కార్యాలు చెయ్యొచ్చని యేసుప్రభువు బోధించాడు. ఆవగింజ నలుసంతే ఉండొచ్చు కాని అది ఒక విత్తనం కనుక అందులో జీవం ఉంటుంది. నేలలో పడ్డ నలుసులో వెయ్యేళ్ళయినా మార్పు రాదు కాని నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్నిరోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతికుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి మొక్కగా ఎదుగుతుంది. ఆవగింజలో, ఆ మాటకొస్తే ప్రతి విశ్వాసిలో దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో అంకురించినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్ చెప్పే గొప్పసత్యం.చదవండి: Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్ భయం నీడలాంటిది. సూర్యుడు వెనకుంటే నీడ మన ముందుండి భయపెడుతుంది. దేవుడు మన ముందుంటే భయం అనే మన నీడ మన వెనక్కి పారిపోతుంది. కండబలంతో కాక, దేవుని పట్ల విశ్వాసమనే ఆయుధంతోనే వాటిపై విజయం సాధించగల మన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెలలేని ఆత్మీయ పాఠం.– సందేశ్ అలెగ్జాండర్ -
ఇల్లే గ్రంథాలయం..! హోమ్ లైబ్రరీ కోసం..
ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎంచుకుంటున్నారు. అక్కడ ఒక పుస్తకాల రాజ్యం ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో నగరవాసులు తమ సొంతింట్లో ఇలాంటి హోమ్ లైబ్రరీల ఏర్పాటుపై విశేషమైన ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి వద్ద ఎక్కువ సమయం గడిపే అలవాటు పెరగడంతో జీవనశైలిలో వచ్చిన మార్పుల్లో ఒకటిగా హోమ్ లైబ్రరీని చెప్పొచ్చు. నిజానికి పఠనాసక్తిని తగ్గించే కారణాల్లో ఒకటైన సోషల్ మీడియా మరోవైపు దాని పెరుగుదలకూ దోహదం చేస్తోంది. తరచూ పుస్తకాల రివ్యూలతో పాటు తాము చదివిన పుస్తకాల విశేషాలను అనేక మంది పంచుకుంటుండటంతో అది ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాకుండా నగరంలో తరచూ ఏర్పాటవుతున్న పుస్తక ప్రదర్శనలు కూడా కొని తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవాల్సిన పుస్తకాలను పెద్ద సంఖ్యలో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి అనేకానేక కారణాలతో హోమ్ లైబ్రరీల అవసరాన్ని నగరవాసులు గుర్తిస్తున్నారు. నా ఇల్లే.. నా లైబ్రరీ.. పఠనాసక్తి ఉన్న నగరవాసులు తమ ఇంట్లో ఎవరి స్థాయిలో వారు పుస్తకాల కోసం ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నారు. ఆయా ఇళ్లలో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ‘రీడింగ్ కార్నర్’ అనో, లేక ‘బుక్ నుక్’, లేదా ‘పర్సనల్ లైబ్రరీ’.. తదితర పేర్లతో పలు రూపాల్లో ప్రత్యేక స్థలాన్ని ఇంటి డిజైన్లో భాగంగా చేర్చడం ఓ కొత్త ట్రెండ్ అయింది. ఐటీ ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా హౌస్వైఫ్లు, స్టూడెంట్లు కూడా తమ అభిరుచులు, అవసరాల మేరకు పుస్తకాలను చదువుకోడానికి ఓ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటుండటం కనిపిస్తోంది. వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి హోమ్ లైబ్రరీ ఏర్పాటుకు నగరవాసులు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా ఒక మోస్తరు స్థలంలో తగిన వసతులతో హోమ్ లైబ్రరీ ఏర్పాటుకు రూ.30 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతోందని ఇంటీరియర్ డిజైనర్స్ చెబుతున్నారు. వీటిలో ఉండే పుస్తకాల బుక్ షెల్వ్లు, చదువుకునేందుకు టేబుల్, సౌకర్యవంతమైన కురీ్చలు, మంచి లైటింగ్, వాల్ డెకార్ ఇవన్నీ కలిపి హోమ్ లైబ్రరీని ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. ఇక ఖరీదైన విల్లాలలో, అపార్ట్మెంట్స్లో అయితే రూ.3 లక్షల వరకు ఖర్చుతో లగ్జరీ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మొబైల్కి బై చెప్పేస్తూ.. పుస్తకాల పట్ల అమిత ప్రేమ కలిగిన వారు మాత్రమే కాకుండా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని దూరం చేయడం కోసం పలువురు తల్లిదండ్రులు దీనిని ఒక తెలివైన మార్గంగా మార్చుకుంటున్నారు. పిల్లలలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించేందుకు తమస్థాయిలో తాము హోమ్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు బిల్డర్లు ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో కామన్ లైబ్రరీలను కూడా తమ ప్లాన్స్లో భాగం చేస్తున్న సంగతి గమనార్హం. ప్రశాంతత కోసం.. ఇంటర్నెట్, ఈ–బుక్స్ విస్తృతంగా ఉన్నా, ఫిజికల్ బుక్స్తో గడిపే అనుభూతి అపూర్వం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గతంలో పుస్తకం అంటే జ్ఞానం పెంచుకోవడానికి మార్గంగా ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. దాంతో.. పుస్తకం ఇప్పుడో సైకలాజికల్ థెరపీగా మారిపోయింది. ‘ప్రపంచ జ్ఞానం కోసం కాకుండా, ప్రశాంతత కోసం చదువు’ అనే ఆలోచనలతో హోమ్ లైబ్రరీ ట్రెండ్ ఊపందుకుంటోంది. రూ.వేల నుంచి రూ.3 లక్షల దాకా ఖర్చుచదవడం పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇళ్లలో వ్యక్తిగతీకరించిన, మేధోపరమైన స్థలాలను సృష్టిస్తోంది. చిన్న అపార్ట్మెంట్లలో కూడా లైబ్రరీలను నిర్మించడానికి మెట్ల కింద ప్రాంతాలు, లివింగ్ రూమ్ మూలలు, టీవీ యూనిట్లు వంటి ప్రదేశాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారు. అధునాతన స్టైల్స్కు నిదర్శనంగా.. ముదురు రంగులు, క్లాసిక్ నమూనాలు కాలాతీత పుస్తక సేకరణలను కలిగి ఉన్న ప్రసిద్ధ డిజైన్ ట్రెండ్ను డార్క్ అకాడెమియా అని పిలుస్తున్నారు. లైబ్రరీలను లివింగ్ రూమ్లు లేదా హోమ్ ఆఫీస్ల వంటి ఇతర గదులతో కలిపి కుట్టేస్తూ ద్వంద్వ–ప్రయోజన ప్రదేశాలను ఆవిష్కరిస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్, మంచి లైటింగ్, అలంకార వస్తువులు వంటివి మేళవించి స్టైలిష్ రీడింగ్ నూక్స్ను డిజైన్ చేస్తున్నారు. అధునాతన స్టైల్స్కు నిదర్శనంగా.. ముదురు రంగులు, క్లాసిక్ నమూనాలు కాలాతీత పుస్తక సేకరణలను కలిగి ఉన్న ప్రసిద్ధ డిజైన్ ట్రెండ్ను డార్క్ అకాడెమియా అని పిలుస్తున్నారు. (చదవండి: ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను!) -
ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను!
నా వయసు 32 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు పని ఉంటుంది. ఇంటికి వచ్చాక వంట, పిల్లాడి హోంవర్కు, ఇల్లు చూసుకోవడం అన్నీ నామీదే పడతాయి. నా భర్త కూడా ఇంకో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగి. ఇంటి పనుల్లో అసలు సహాయం చేయడు. దీనివల్ల నాకు ఎప్పుడూ అలసటగా, చిరాకుగా అనిపిస్తుంటుంది. దీనికితోడు నాభర్త, అత్తమామలు ఇప్పుడు ఇంకో బిడ్డ కావాలని ఒత్తిడి చేస్తున్నారు. బ్యాంక్ పనిలో వత్తిడి, అత్త మామల విమర్శలు, భర్త సపోర్ట్ లేకపోవడం... ఇలా వీటన్నిటి మధ్య చాలా అశాంతికి లోనవుతున్నాను. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. – దీపిక, నిజామాబాద్ మీది మన సమాజంలో చాలామంది మహిళలు ఎదుర్కొనే పరిస్థితే! పని, ఇల్లు రెండూ ఒంటరిగా మేనేజ్ చేయడం వల్ల అలసట, చిరాకు రావడం సహజం. అందుకే ముందుగా మీ భర్తతో ఓపిగ్గా మాట్లాడి అతను కూడా ఇంటి పనులు పంచుకోవడం అవసరమని చెప్పండి. చిన్న చిన్న పనులలో అయినా సరే అతను చేసే సహాయం మీ అలసటను తగ్గించడమే కాకుండా మీ మధ్య బంధాన్ని మరింత దృఢం చేస్తుందని అతనికి అర్థం అయ్యేలా వివరించండి. మీ అత్తమామలు, భర్త, ఇంకో పిల్లాడు కావాలని వత్తిడి తెస్తున్నారని చెప్పారు. పిల్లల విషయం అనేది మీరు, మీ భర్త కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప మీ అత్తమామలు నిర్ణయించే విషయం కాదని మీ ఆయనకి నచ్చ చెప్పండి. మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సిద్దం కాకతే కేవలం వాళ్ళ వత్తిడి మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత కాలం మీ అత్త మామలని మీ ఇంట్లోనే ఉండమని మీ బాబును చూసుకోవడంలో, ఇంట్లో పనుల్లో సహాయం చేయమని అడగండి. వాళ్ళు అందుకు ఒప్పుకుంటే అప్పుడు రెండో పిల్లాడి గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగం, కుటుంబం రెండూ కలిపి నడపడం కష్టం అయినా, అసాధ్యం అయితే కాదు! ఇంట్లో పనుల కోసం పని వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. ఆఫీస్ లో కూడా అన్ని పనులు మీ నెత్తిమీద వేసుకోకుండా మిగిలిన మీ వారికి కూడా డెలిగేట్ చేయడం నేర్చుకోండి. అలాగే మీకోసం రోజుకు కొంచెం సమయం కేటాయించండి.. కాసేపు నడక, ధ్యానం, సంగీతం, లేదా మీకు ఇష్టమైన పనులు చేస్తూ రిలాక్స్ అవ్వండి. వర్క్, పర్సనల్, ఫ్యామిలీ లైఫ్ను, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే, మీ వత్తిడి క్రమేణా తగ్గుతుంది. కావాలంటే మీ దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఒకసారి కౌన్సెలింగ్కి వెళ్తే కౌన్సిలర్స్ మీకు సరైన నిర్ణయం తీసుకునేందుకు సహాయం చేస్తారు. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: డిప్యూటీ కలెక్టర్గా స్విగ్గీ డెలివరీ బాయ్..! తండ్రి మేస్త్రీ, డ్రీమ్ ఆకాశమంత..) -
డిప్యూటీ కలెక్టర్గా స్విగ్గీ డెలివరీ బాయ్..! తండ్రి మేస్త్రీ, డ్రీమ్ ఆకాశమంత..
అతడి డ్రీమ్ ఆకాశమంత..కానీ కుటుంబ నేపథ్యం ప్రకారం అంత ఈజీ కాదు. అయినా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆహర్నిశలు కష్టపడి అనుకున్నది సాధించి తనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలిచాడు. నాడు డెలివరీ బాయ్ అనిపిలిచినవాళ్లే..గౌరవంతో లేచినిలబడే స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అతడి ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాట ఫలితం.అతనే జార్ఖండ్(Jharkhand)కి చెందిన సూరజ్ యాదవ్(Suraj Yadav). అతడి తండ్రి సాధారణ మేస్త్రీ. అతడి కుటుంబం తరుచుగా ఆర్థిక సమస్యలతో అల్లాడుతుండేది. కానీ ఈ పరిస్థితలు ఎలా ఉన్నా అతడి కల మాత్రం ఆకాశమంత పెద్దది పెట్టుకున్నాడు. అయితే అతడు జీవనోపాధి కోసం తన స్నేహితులు సాయంతో సెకండ్హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి ఫుడ్ డెలివరి ఏజెంట్గా, బైక్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఇక అతడి సోదరి ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అతడి స్నేహితులు, భార్య భావోద్వేగ పరంగా మద్దతిస్తూ ప్రోత్సహించేవారు. పగలంతా ఈ ఉద్యోగాలతో తన శరీరం ఎంతలా అలిసిపోయి విశ్రాంతి కోరేదో తనకే తెలుసనని, అయితే తన డ్రీమ్ తనని బలంగా ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చాడు. అలా సూరజ్ ఎనిమిదేళ్ల కష్టానికి ఫలితంగా..జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో ఉత్తీర్ణుడై..110వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్(Deputy Collector)గా నియమాకం పొందాడు. ఇక ఇంటర్వ్యూలో బోర్డు మెంబర్లకి తన డెలివరీ ఉద్యోగం సమయ నిర్వహణను, లాజిస్టిక్స్కి సంబంధించిన విలువైన పాఠాలు నేర్పించిందని వివరించి మెప్పించాడు. నిర్వాహకుడిగా తనకు సహాయపడ్డ ఈ నైపుణ్యాలే తన ఉద్యోగంలో తనకెంతగానో తోడ్పడతాయని కూడా ఆత్మవిశ్వాసంగా చెప్పాడు. ఇక సూరజ్ ఈ విజయం అందుకున్న వెంటనే చాలా భావోద్వేగంగా అనిపించిందని, ఈ విషయం తన భార్యతో ఫోన్లో చెప్పిన వెంటనే తనివితీర ఏడ్చేశామని ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు కూడా. ఎనిమిదేళ్ల వివాహ అనంతరం తమ కలలన్నీ నిజమవుతున్న వేళ అని చాలా ఆనందంగా చెప్పుకొచ్చాడు సూరజ్. అంతేగాదు ఇంతకుముందు అందరూ స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy Delivery Boy) అనిపిలిచేవారు కానీ ఇప్పుడూ డిప్యూటీ కలెక్టర్గారు అని గౌరవంగా పిలుస్తారని సగౌర్వంగా చెప్పాడు. ఇక తాను చేసిన రెండు ఉద్యోగాలు చాలా అమూల్యమైన పాఠాలు నేర్పించాయని, ఒకటి మనగడ ఎలా అనేది, మరొకటి సేవ చేయడం ఎలాగో తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. ఇక్కడ సూరజ్ కథ దృఢ సంకల్పం గురించే కాదు ఏ పనైనా చులకనగా కాదు నిబద్ధతతో చేస్తే..సక్సెస్కి మార్గం ఏర్పడుతుందని చాటి చెప్పాడు.(చదవండి: ఆ టీనేజర్ స్థైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..! ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు..) -
ఆ టీనేజర్ స్థైర్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే..! ఆమె కథ వింటే కన్నీళ్లు ఆగవు..
ఆమె అందరిలా ఆడుతూ పాడుతూ జీవించలేదు. తన వయసు పిల్లలతో సరదా ఆటలు ఆడలేపోయింది. అయినా జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగే నేర్చుకుంది. తన జీవితాన్ని కబళించాలని చూసిన వ్యాధికే చుక్కులు చూపించేలా జీవించింది. బాధించే వ్యాధిని ఉన్నతంగా జీవించేందుకు మార్గంగా మలుచుకోవడం ఎలాగో తన సోషల్ మీడియా పోస్ట్లతో చెప్పి..అందరినీ కదిలించింది, ఆలోచించేలా చేసింది. ఆ మహ్మమ్మారిపై ఆ టీనేజర్ చేసిన పోరాటం వింటే కన్నీళ్లు ఆగవు. మరణమే శోకించేలా బతికి చూపించి..తనలా కేన్సర్తో పోరాడుతున్న వాళ్లకి ఆదర్శంగా నిలిచింది.ఆ అమ్మాయే అమెరికాలోని విస్కాన్సిన్కు చెందిన 14 ఏళ్ల జుజా బీన్. అందరిలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన మూడేళ్ల ప్రాయానికే కేన్సర్ బారిన పడింది. ఏదోలా చికిత్సలు తీసుకుని కోలుకుంది అనేలోపు మరోసారి అంటే ఎనిమిదేళ్ల ప్రాయంలో మరోసారి ఆ మహమ్మారి బారిన పడింది. ఇలా చిన్న పిల్లలో రావడం అత్యంత అరుదు. దీని కారణంగా బాల్యమంతా ఆస్పత్రుల చుట్టు, చికిత్సలు తీసుకోవడంతోనే సరిపోయింది ఆమెకు. అయితేనేం ఈ మహ్మమ్మారి పెడుతున్న ట్రబుల్స్కి ఆ టీనేజర్ జీవితం విలువ ఏంటో తెలుసుకోగలిగానూ, మంచి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాని, సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చి..అందర్నీ ఆశ్చర్యపోయాలా చేయడమే కాదు..జీవితం గొప్పదనం ఏంటో తెలుసుకునేలా చేసిది. అంతేగాదు జీవితం పరమార్థం అంటే ఏంటో తన కేన్సర్ పోరాటంతో ఎదుర్కొన్న వాటిని ప్రస్తావిస్తూ..నెటిజన్లే ఇంప్రెస్ అయ్యేలా చేసింది. అంతేగాదు ఆ పోస్టుల్లో ఆమె చికిత్సలు తీసుకునే విధానం, ఎదుర్కొంటున్న బాధలను వివరిస్తూ..స్ఫూర్తిదాయకంగా మాట్లాడే మాటలు ఎందరినో కదిలించాయి. ఆమె బతకాలని ఆకాంక్షించలా ఆశీర్వాదాలు వెల్లువెత్తాయి కూడా. కానీ అవేం ఆ విధి ముందు ఫలించలేదు. చివరికి కేన్సర్తో పోరాడుతూనే 14 ఏళ్లకే చనిపోయింది జూజూ. రెండు వారాల క్రితం ఆమె చేసిన పోస్ట్ ఇప్పటికీ నెటిజన్ల ముందు కదలాడుతుంది. ఆ పోస్ట్లో ఏ రాసిందంటే..తాను గనుక ఈ మహమ్మారి నుంచి బయటపడితే..ఈ సెప్టెంబర్ మాసం, బాల్య కేన్సర్ అవగాహన నెలగా పాటిస్తారు. కావున తాను ఈ వ్యాధిపై అవగాహన కల్పించేలా తన కథను పంచుకుంటానని రాసింది. కానీ ఆ అమ్మాయి ఆ కోరిక తీరకుండానే మృత్యు ఒడికి వెళ్లిపోవడం అందర్నీ కంటతడిపెట్టేలా చేసింది. అంతేగాదు ఆమె తన కేన్సర్ పోరాట సమయంలో పెట్టన ఓ ఆసక్తికర పోస్టు ఎంత భావోద్వేగంగా ఉందంటే..అందరూ పొందే సాధారణ సౌకర్యాలకు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. రుచికరమైన భోజనం, మంచి డ్రెస్సింగ్ స్టైల్, జంతువులతో గడపడం వంటి వాటిని ఆ వ్యాధి నుంచి బయటపడ్డ కొన్ని రోజుల్లోనైనా పొందగలిగా నేను గ్రేట్ అని చెప్పడం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. కానీ జుజు ఉన్నన్నాళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది, పైగా మరణ శాసనాన్నే మార్చేలా బతికేసాహసం చేసి అందరితచేత శెభాష్ అనిపించుకుంది కూడా. కాగా, జూజూ గత 11 ఏళ్లుగా అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనే రక్త క్యాన్సర్తో బాధపడుతోంది. ఏకంగా మూడు సార్లు ఎముక మజ్జ మార్పిడి చేయించుకుంది. ఇంత భారమైన బాధలో కూడా నెటిజన్లతో తన భావాలను పంచుకునేది. ఈ పరిస్థితిలో మీకు ఎలా అనిపిస్తుంటుందని ఒక నెటిజన్న అడిగిన ప్రశ్నకు..నా వయసు అమ్మాయిల మాదిరిగా లేకపోయాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పి మారు మాట్లాడకుండా చేసింది. చిన్నగా ఉన్నప్పుడూ జుట్టు ఎందుకు రాలుతుందో తెలియలేదు. పెద్దఅయ్యాక లెక్కలేనన్ని సార్లు జుట్టు ఊడిపోవటంతో తాను సాధారణ అమ్మాయిని కాదని చమత్కరిస్తూ..కన్నీళ్లు వచ్చేలా చేసింది. ప్రస్తుతం జుజూ తల్లిదండ్రులు ఆమెలాంటి కేన్సర్ బాధితులకు చికిత్స అందేలా గో ఫండ్ వెబ్పేజ్లో సాయం అభ్యర్థిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే ఆమె కేన్సర్ జర్నీ ఇన్స్టాగ్రామ్కి ఏకంగా ఒక మిలియన్కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. (చదవండి: 'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!) -
అగరుబత్తీలు వెలిగించడం..సిగరెట్లు కాల్చడం లాంటిదా..?
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంటూ టీవీలో వచ్చే అగరుబత్తీల యాడ్లు మనల్ని ఎంతలా ప్రేరేపిస్తాయంటే..అవి తెచ్చుకున్న వెంటనే ఉపయోగించాలనే ఆత్రుతను పెంచేస్తాయి. అదీగాక వాటి గుబాళింపు మనకు దేవాలయంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి. పైగా ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ప్లేవర్ల అగరుబత్తీలు వచ్చేశాయి కూడా. ముఖ్యంగా భారతీయ గృహాల్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక స్వాంతనను అందించడంలో ముందుంటాయి. అలాంటి అగరబత్తీలు వెలిగించడం, అచ్చం సిగరెట్లు కాల్చడం లాంటి అనారోగ్యానికి దారితీస్తుందా..?.ఔనని చెబుతున్నారు వైద్య నిపుణులు. సిగరెట్లు ఏవిధంగా ఊపిరితిత్తులకు హానికరమో అలానే అగరుబత్తీలు కూడా ప్రమాదమని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.ఇవి ఊపరితిత్తులకు ఎలా హానికరమో డెహ్రాడూన్కి చెందిన పల్మోనాలజిస్ట్ డాక్టర్ సోనియా గోయెల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ అగరుబత్తీలు ఊపిరితిత్తులకు హాని కలిగించే కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, అవి అచ్చం పొగాకు మాదిరిగా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి వచ్చే పొగ ఊపరితిత్తులకు నెమ్మది నెమ్మదిగా విషంలా మారుతుందని అన్నారు. ఏవిధంగా అంటే..అగర్బత్తీలు సూక్ష్మ కణ పదార్థం (PM2.5), కార్బన్ మోనాక్సైడ్, అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారామె. ఈ కాలుష్య కారకాలు మన ఇండోర్ గాలిని కలుషితం చేస్తాయని, ముఖ్యంగా మూసి ఉన్న ప్రదేశాల్లో శ్వాస తీసుకోవడం సురక్షితం కాదని తెలిపారామె. అంతేగాదు ఒక అగరబత్తిని ాకాల్చడం అంటే ఒక సిగరెట్ని కాల్చినంత ప్రమాదమని సోనియా అన్నారు. అంటే ధూమపాన అలవాటు లేకపోయినా..ఈ విధంగా పొగాకు సంబంధింత అనారోగ్యాల బారినపడతామని వెల్లడించారు.అధిక ప్రమాదం ఎవరికంటే..పిల్లలు, వృద్ధ కుటుంబ సభ్యులు, ఉబ్బసం లేదా ఊపరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ అగరబత్తులను కాల్చడం ప్రాణాంతకమవుతుందని అన్నారు. ఒక్కోసారి అలెర్జీలు, దీర్ఘకాలిక దగ్గు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల తలెత్తుతాయి. అలాగే సరైన వెంటిలేషన్ ఇంటిలో ఈ అగరబత్తీలు వెలిగిస్తే.. సంత్సరాల బడి ఆ పొగాకు బహిర్గతమైన ఆ ఇంటి సభ్యులకు బ్రోన్కైటిస్, ఉబ్బసం, COPD, ఊపరితిత్తుల కేన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అధికమవుతుందని అన్నారు. సరైన వెంటిలేషన్ ఉన్న ఇంటిలో వీటని ఉపయోగించినట్లయితే సమస్య ఉండదని అన్నారు. అలాగే ఆ సమయంలో కిటికీలు, ఫ్యాన్లు ఆన్ చేయడం వంటివి నష్టాన్ని చాలామటుకు తగ్గిస్తాయని అన్నారు. ఇంటిలో చక్కటి గాలి ప్రవాహం ఉంటే ఎలాంటి సమస్య ఉండదని అన్నారామె. ప్రత్యామ్నాయాలు..ఈ అగరుబత్తీలు లేకుండా ఆచారాలు అసంపూర్ణం అనిపిస్తే..నూనె డిఫ్యూజర్లు, ఎలక్ట్రిక్ డయాలు ఉపయోగించండి. లేదా సహజ సూర్యకాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఊరితిత్తుల సమస్యల బారిన పడకుండా ఉండటమే గాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలుగుతామని అన్నారు డాక్టర్ సోనియా. View this post on Instagram A post shared by Dr.Sonia Goel | Pulmonologist 🫁 (@dr.soniagoel) -
ఔషధాలకు లొంగని అధిక రక్తపోటు..! సర్వేలో షాకింగ్ విషయాలు
ఇటీవలకాలంలో చాలామంది ఔషధాలకు లొంగని రక్తపోటుతో బాధపడుతున్నారు. అంతేగాదు ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రకారం..సుమారు 20 కోట్ల మందికి పైగా అధిక రకపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. అందులో రెండు కోట్ల మంది ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకున్నట్లు నివేదికల్లో తేలింది. ప్రస్తుతం ఇది అత్యంత అత్యవసర ప్రజారోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి దీనిపై వర్క్షాష్ నిర్వహించింది. ఆ ఆస్పత్రి వైద్యులు దేశంలో క్రమంగా రెసిస్టెంట్ హైపర్టెన్షన్ క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడమే అందుకు మంచి ఫలితాలనందిస్తున్న మూత్రపిండ నిర్మూలన చికిత్స(Renal Denervation - RDN) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మేరక సదరు ఆస్ప్రతి వైద్యులు ఈ రెసిస్టెంట్ హైపర్టెన్షన్(అధిక రక్తపోటు) కారణంగా తరచుగా తలనొప్పి, తలతిరగడం, ఊపిరి ఆడకపోవడం లేదా అప్పుడప్పుడు ఛాతీలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. అదీగాక కాలక్రమేణా, నిరంతరం పెరిగిన రక్తపోటు హృదయనాళ వ్యవస్థ, ఇతర ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చిరించారు. అందువల్ల ముందుగా ఈ అధిక రక్తపోటుని 10 mmHg తగ్గించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 20%, స్ట్రోక్ ప్రమాదాన్ని 27% మేర తగ్గించగలమని క్లినికల్ అద్యనాలు వెల్లడించాయని చెప్పారు. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న యాంటీహైపర్టెన్సివ్ మందులు చాలా మందికి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ..గణనీయమైన సంఖ్యలో కొందరు రోగుల్లో ఈ నియంత్రణ కష్టంగా ఉందన్నారు. అలాంటి పేషెంట్లకు ఈ రీనల్ డెనర్వేషన్ (RDN) అనేది ఒక ఆశాజనకమైన చికిత్స అని చెప్పారు. అంతేగాదు ఆ చికిత్స పొంది.. మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్న రోగుల గురించి కూడా ఈ వర్క్షాప్లో వివరించారు.ఈ నియంత్రణలేని అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా అధిక ఆరోగ్య సంరక్షణ ఖర్చులు భారాన్ని మోపడమే గాక, ఆస్పత్రి పాలయ్యేలా చేస్తుందని నొక్కి చెప్పారు. అందువల్ల ముందుగానే ఈ అధిక రక్తపోటును ఆర్డీఎన్ వంటి చికిత్సలతో మెరుగుపరుచుకుంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతామని అన్నారు వైద్యులు. (చదవండి: 'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా) -
నటి శివానీ నగరం దసరా స్పెషల్..ఆ నమ్మకంతోనే ముందుకు
‘‘దుర్గా మాతని శక్తి స్వరూపిణి అంటారు. ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా దుర్గా మాత ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఎలాంటి క్లిష్టమైన సవాల్ను ఎదుర్కొనాల్సి వచ్చినా బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు... సక్సెస్ అవుతూ, వారిని వారు సంరక్షించుకోగలుగుతున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే దసరా మహిళలందరికీ పెద్ద పండగ’’ అని అన్నారు యువ నటి శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు శివానీ. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగు తెరపై ఈ మధ్య మెరిసిన నవ తారల్లో తెలుగమ్మాయి శివానీకి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విజయోత్సాహంలో ఉన్న శివానీ దసరా, బతుకమ్మ పండగ విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. మా కుటుంబానికి ‘దసరా’ చాలా పెద్ద పండగ. మేం అందరం కలిసి చాలా సందడిగా దసరా నవరాత్రులను చేసుకుంటాం. అలాగే బతుకమ్మ పండగను కూడా సెలబ్రేట్ చేస్తాం. రంగు రంగుల పువ్వులు సేకరించి, మా కుటుంబంలోని మహిళలతో పాటు అ పార్ట్మెంట్లోని మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం. దసరా అనగానే నాకు అమ్మవారు గుర్తుకు వస్తారు. మనకు ఉన్న చెడు వెళ్లిపోయి మనల్ని అమ్మవారు గుడ్ డేస్, గుడ్ స్ట్రెంత్తో ఆశీర్వదిస్తారు. మేం ఆ రోజు బంగారం కొంటాం. తొమ్మిదో రోజు ఆయుధ పూజ చేస్తాం. మా ఇంట్లో ఉన్న కార్లు, బైక్లకు పూల మాల వేసి, పూజలు చేస్తాం. ఇంటిని బాగా అలకరించుకుంటాం. బూరెలు, పాయసం, పులిహోర... ఇలా రకరకాల వంటకాలు చేసి, దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెడతాం. ఇక నా జీవితంలో దసరా పండక్కి ప్రత్యేకమైన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను. కొన్ని పండగలకు మా కజిన్స్ మా ఇంటికి వస్తారు. కొన్నిసార్లు మేం వాళ్ల ఇంటికి వెళ్తాం. అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం. దసరా పండగకి సంబంధించి నా స్కూల్ డేస్లో కానీ, కాలేజ్ డేస్లో కానీ ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు. అయితే అవకాశం వస్తే ఆ తరహా పాత్ర చేయాలని ఉంది. ఎందుకంటే ఆ పాత్రలో కొంత మహిళా సాధికారత ఉంటుందని నా నమ్మకం. ఓ నటిగా నాకు స్థిరత్వం, ఓపిక చాలా ముఖ్యం. దసరా అంటే క్లిష్టపరిస్థితులను దాటుకుని, విజయం సాధించడం. అందుకే మనకు ఓపిక, నమ్మకం ఉండాలి. చెడు రోజులను బలంగా ఎదుర్కొని, హుందాగా నెగ్గుకు రాగలగాలి. చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలుకోల్కతాలో దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. నా జీవితంలో ఒక్కసారైనా నేను కోల్కతా వెళ్లి, దుర్గామాత పూజలో పాల్గొనాలని ఉంది. కొన్నిసార్లు నేను హైదరాబాద్లో బెంగాలీ సమితులకు వెళ్తాను. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ఏదో ఒకరోజు తప్పకుండా వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటాను. అక్కడ దుర్గామాతకు హారతి ఇస్తారు. ఆ సమయంలో బెంగాలీ మహిళలు తెల్లచీర ధరించి, నుదుట ఎరుపు రంగు బొట్టు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఇక దసరా ఫెస్టివల్కి నా కాలేజీ డేస్ నుంచి దాండియా, గర్బా ఆడటం అలవాటు. ఎవరు దాండియా, గర్బా ఫెస్టివల్స్ను ఏర్పాటు చేసినా అక్కడికి మేం గ్రూప్గా వెళ్లి రాత్రంతా ఆడేవాళ్ళం. అంత క్రేజీగా ఉండేది. నాకు అది లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇదీ చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్నేను స్పిరిచ్యువల్ పర్సన్నిబాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడనే కాదు... అవకాశం దొరికినప్పుడల్లా దేవాయాలకు వెళ్తుంటాను. గుడిని ఇల్లుగా భావిస్తాను. అలాగే ఇంటిని కూడా దేవాలయంలా అనుకుంటాను. మా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉంటారు. నేను ఎక్కడకి వెళ్లినా, ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నన్ను రక్షిస్తుందని నా నమ్మకం. నన్నే కాదు... అందర్నీ రక్షిస్తుంటుందని భావిస్తాను. ఈ నమ్మకం వల్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం. ఉపవాసం అంటే స్వీయ నియంత్రణఉపవాసం గురించి ఎవరి వ్యక్తిగత అభి్ర΄ాయాలు వారికి ఉండొచ్చు. దసరా సమయంలో ఇప్పటివరకు నేనైతే ఉపవాసం ఉండలేదు. మా అమ్మ, అమ్మమ్మగార్లు ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల స్వీయ నియంత్రణ కలుగుతుంది. అమ్మవారికి మన వంతుగా ఏదో ఇచ్చిన ఓ సంతృప్తి ఉంటుంది.ఓపికతో ఉండాలి మనకు మనమే స్ఫూర్తిగా నిలవాలంటే ముందు మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే మనకు మనం ఇచ్చుకునే మోటివేషన్. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం వస్తుందంటారు. సహనంగా ఉంటే ఏ పనైనా సరిగ్గా అవుతుంది. అందుకే నా ఓర్పే నా శక్తి అని నమ్ముతాను. – ముసిమి శివాంజనేయులు -
'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా
సుదీర్ఘకాలం బతికి రికార్డులు సృష్టించి వృద్ధుల గురించి వార్తల్లో తెలసుకోవడమే గానీ నేరుగా చూసిన దాఖలాలు ఉండవు. కానీ అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు అలాంటి వృద్ధురాలిని కలవడమే కాదు, ఆమెతో మాటలు కలిపారు. అయితే ఒబామా- బామ్మతో సంభాషించిన మాటలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..102 ఏళ్ల సుసాన్ అనే బామ్మని కలిసి ఆమెతో మాటలు కలిపారు. ఆమెను చూడగానే ఒబామా మీరు ఈ వయసులో ఇంత అందంగా కనిపించడంలోని సీక్రేట్ ఏంటని నేరుగా ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత ఒబామా నేను మిమ్మల్ని కలిసి ఏ అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు అని నవ్వేశారు. అయినప్పటికీ అడుగుతున్నా..ఇంతటి వృద్ధాప్యంలోనూ అందంగా ఉన్న మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది . అయితే ఇంతలా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏం తింటారు. బహుశా మీ డీఎన్ఏ మంచిదేమో అంటూ చమత్కిరించారు. దానికి ఆ వృద్ధురాలు సుసాన్ నవ్వుతూ.. ఆకుకూరలు, కార్న్ బ్రెడ్ అని మెల్లిగా చెప్పింది. ఆ వృద్ధురాలని పర్యవేక్షించే ఆమె కూడా ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ..ప్రతి ఉదయం బేకన్ అని చెప్పింది. అందుకు ఒబామా ఒక్కసారిగా నవ్వేశారు. బహుశా ఇది డాక్టర్లు సూచన కదూ అని చమత్కరించారు. చివరగా ఆ వృద్ధురాలు మీరు నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞుతురాలిని అని హృదరపూర్వకంగా అందామె. ఇక ఒబామా ఆమెకు వీడ్కోలు చెబుతూ..ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులను కలవడం అస్సలు మిస్ అవ్వను అని ఆమెకు చెబుతూ నిష్క్రమించారు. అందుకు సంబంధించిన వీడియోకి ఒబామా "102 ఏళ్ల వయసులో నేను కూడా మీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. Susan, I hope I look as good as you at 102! pic.twitter.com/01CSm85krS— Barack Obama (@BarackObama) September 22, 2025 (చదవండి: స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్
దేవి నవరాత్రులతో యావత్తు దేశం ఆధ్యాత్మిక వాతవరణంతో అలరారుతోంది. ఎటు చూసిన దుర్గామాత నామస్మరణతో మారు మ్రోగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా పోస్ట్లో..శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ భక్తికి నెలవు ఈ తొమ్మిది రాత్రులు అని అన్నారు. పైగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరితోచినట్లుగా వారు తమ భక్తి కొలదీ అమ్మను కొలుచుకుంటారు. అయితే వాటితోపాటు ఈ కీర్తనను కూడా వినండి అంటూ భక్తును ప్రోత్సహించారు. దీంతో ఒక్కసారిగా ఆ పాట నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఈ నవరాత్రులు ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం ఆచారం. ఒకటి చైత్రమాసంలో జరుపుకునే శారద నవరాత్రులు కాగా, మరొకటి ఆశ్వీయుజ మాసంలో జరుపుకునే దుర్గా నవరాత్రులు. అయితే ఈసారి దుర్గమ్మను కొలుచుకునేందుకు సంగీతాన్ని కూడా జోడించండి అని భక్తులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతేగాదు పండిట్ జస్రాజ్ పాటను షేర్ చేస్తూ ఈ తొమ్మిది రోజులు ఈ పాట వింటూ..అమ్మవారికి కృపకు పాత్రులకండి అంటూ సోషల్మీడియా పోస్ట్ ఎక్స్లో పేర్కొన్నారు. नवरात्रि पर देवी मां की आराधना मन को असीम शांति से भर देती है। माता को समर्पित पंडित भीमसेन जोशी जी का यह भावपूर्ण भजन मंत्रमुग्ध कर देने वाला है…https://t.co/bMydkzyjPp— Narendra Modi (@narendramodi) April 1, 2025 కాగా, మోదీ కూడా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గమ్మ వారిని ధ్యానిస్తానని గతంలో చెప్పారు. అలా చేయడం వల్ల తనలోని శక్తి మరింతగా జాగృతమై మంచి ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి వీలవుతుందని కూడా అన్నారు. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు కూడా భక్తిభావాన్ని పెంపొందించే ఇలాంటి పోస్టులనే మరిన్ని చేయమని మోదీని పోస్ట్లో కోరారు. ఇక పండిట్ పండిట్ జస్రాజ్ దుర్గమ్మపై పాడిన అందమైన పాట ఏంటంటే యాదేవి సర్వభూతేషు.. అంటూ సాగే రమ్యమైన పాట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై క్లిక్ చేసి ఆస్వాదించండి మరి..!. కీర్తనలు భగవంతునికి చేరువయ్యేలా చేస్తాయా?కీర్తనలు భక్తి మార్గాన్ని చేరుకోవడంలో హెల్ప్ అవుతాయనేది పురాణ వచనం. నవవిధ భక్తుల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నాయి పురాణాలు. అందుకే మోదీజీ ఈ శరన్నవరాత్రులను కీర్తనలు, భజనల సాయంతో అమ్మవారిని కొలుచుకుందామని పిలుపునిచ్చారు. రామదాసు, అన్నమయ్య, కబీర్ దాస్, మీరాబాయి వీరంతా కీర్తనలతో ఆ భగవంతుడుని వశం చేసుకోవడమే కాదు ఆయనకు ప్రీతీపాత్రులైన భక్తులుగా మారిపోయారు. అంతేగాదు ఆధ్యాత్మికత శక్తికి నెలవైనే ఈ భారతవని..ఎందరో విదేశీయులను తనవైపుకి తిప్పుకుని భక్తిమార్గంలో నడిచేలా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కూడా. (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోయిందా..? విస్తుపోతున్న ఉక్రెయిన్ మహిళ) -
సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..!
ఈ నవరాత్రుల ఉపవాసాల్లో సగ్గుబియ్యంతో చేసిన వంటకాలనే ఆరగిస్తుంటారు చాలామంది . ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసే స్వీట్లు రుచి తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. అలాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..? వేటితో తయారు చేస్తారు..? మొత్తం విధానం ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా.!కొంచె ఒంట్లో నలతగా ఉన్నా..లేదా ఏం తిన్న జీర్ణం కాక ఇబ్బందిగా ఉన్నా..శరీరానికి సత్తువనిచ్చేలా ఈ సగ్గుబియ్యం జావాని వెంటనే తీసుకుంటుంటారు. ఇది తేలిగ్గా అరిగిపోతుంది. పైగా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఉపవాసాల్లో స్ప్రుహ తప్పిపోకుండా ఎనర్జిటిక్గా ఉండేందుకు తప్పనిసరిగా ఈ సగ్గుబియ్యంతో చేసే పాయసం, లేదా రెసిపీలు తీసుకుంటుంటారు భక్తులు. మరి ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయంటే..కస్సావా దుంప నుంచి ఈ సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. ఈ దుంపనే కర్రపెండలం అనికూడా అంటారు. వీటిని ముందుగా శుభ్రం చేసుకుని తొక్క యంత్రం సాయంతో చక్కగా బయటి చర్మాన్ని ఒలిచేస్తారు. ఆ తర్వాత వాటిని పాలు, పిండి మిశ్రమంగా ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత పూర్తిగా శుద్ధి చేసి ఎండబెట్టి..ఈ స్టార్చ్ పేస్ట్ను వరుస యంత్రాల ద్వారా పంపుతారు. చివరి దశలో ఎండిన మిశ్రమాన్ని చూర్ణం చేసి, జల్లెడ ద్వారా పంపి చిన్న చిన్న ముత్యాల లాంటి బంతులను తయారు చేస్తారు. వీటినే సబుదాన లేదా సగ్గుబియ్యం అని పిలుస్తారు. తర్వాత వీటిని ప్యాక్ చేసి అమ్మకానికి రెడి చేస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది తమిళనాడులోని సబుదాన కర్మాగారంలో చ్రితించిన వీడియో. దీంతో వడలు, దగ్గర నుంచి ఖిచ్డి, పాయసం వంటి పలు రెసిపీలను తయారు చేస్తారు. View this post on Instagram A post shared by ABHISHEK ASHRA 💫🧿 (@thefoodiehat) (చదవండి: రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్! మైసూర్ ప్యాలెస్లో నవరాత్రి ఉత్సవాలు) -
'ఆడ'నే చిదిమేసి..!
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. రాజ్యాలు ఏలుతున్నా.. అంతరిక్షంలో అడుగిడుతున్నా.. ఇప్పటికీ ఆడపిల్ల పట్ల వివక్ష కొనసాగుతోంది. పెళ్లయిన ప్రతి మహిళ తన కడుపు పండాలని కోరుకుంటుంది. ఆ సంతోషం కడుపులో పడగానే తమ ప్రతిరూపాన్ని చూసుకునేందుకు నవమాసాలు నిరీక్షిస్తుంది. తల్లికి ఆడ, మగ అనే భేదం ఉండకపోయినా.. భర్త, అత్తమామలకు మాత్రం ఇప్పటికీ మగపిల్లాడిపైనే మనసు. గర్భం దాల్చడమే ఆలస్యం.. ఏ డాక్టర్ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుందోనని ఆరా తీయడం మొదలవుతోంది. ఆడపిల్ల కడుపులో ఉందని తెలిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు చిదిమేయాలనే ఆలోచన పురుడుపోసుకుంటుంది. ఇలా ఎంతో మంది ఆడపిల్లలు భూమిపై పడకుండానే రక్తపు ముద్దలుగా గాల్లో కలిసిపోతున్నారు. ఈ తంతు నిత్యకృత్యమైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో అధికారికంగా 246 స్కానింగ్ కేంద్రాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్ అయ్యాయి. అనధికారికంగా పదుల సంఖ్యలో స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్, కొత్తబస్టాండ్, ఎన్ఆర్ పేట ప్రాంతాల్లోని పలు స్కానింగ్ కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో యథేచ్ఛగా స్కానింగ్ ద్వారా లింగనిర్ధారణ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆడపిల్లగా నిర్ధారణ అయితే రూ.5వేలు, మగబిడ్డ అని తేలితే రూ.8వేలు వసూలు చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడబిడ్డ అని తేలితే వైద్యులను కలిసి అబార్షన్(భ్రూణహత్యలు) చేయించుకుంటున్నారు. ఇందుకోసం రూ.20వేల నుంచి రూ.30వేల దాకా వసూలు చేస్తున్నారు. స్కానింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఇక్కడ ఎలాంటి లింగనిర్ధారణ చేయబడదని ప్రకటనలు మాత్రమే ఉంటాయి. కానీ కొన్ని కేంద్రాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగుతోంది. ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలులోని కొత్తబస్టాండ్ ప్రాంతాల్లోని పలు కేంద్రాల్లో ఆర్ఎంపీలే స్కానింగ్ చేస్తుండటం గమనార్హం. ఆఇటీవల కొత్తబస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డు వద్దనున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 9 నెలల గర్భిణికి అబార్షన్ చేయాలని ప్రయత్నించారు. చివరి నిమిషంలో ఆ గర్భవతి భయపడి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి ఆసుపత్రిలో ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురికి అబార్షన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినా అధికారులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. అబార్షన్లతో తీవ్ర అనారోగ్యం మాకు మగబిడ్డే కావాలని, కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలియగానే కొందరు తరచూ అబార్షన్లు చేయిస్తుంటారు. ఇది ఆ తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తరచూ గర్భం దాల్చడం వల్ల బీపీ, రక్తహీనత, షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జని్మంచే పిల్లలు సైతం నెలలు నిండకముందే జని్మస్తారు. ఇది శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుట్టబోయే బిడ్డ సరిగ్గా ఎదగనప్పుడు, తల్లికి నియంత్రించలేని బీపీ ఉన్నప్పుడు, 3, 4వ స్టేజిలో తల్లికి క్యాన్సర్ ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో అబార్షన్ చేయాల్సి ఉంటుంది. అది కోడుమూరులోని బాషా నర్సింగ్ హోం. ఆదివారమైనా ఎంతో రద్దీగా ఉంది. ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రం వద్ద గర్భవతులు పదుల సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. ఓ గర్భవతికి లింగనిర్ధారణ చేయించాలని ఓ బృందం వచ్చింది. వారు అనుకున్నట్లే వైద్యులకు విషయం చెప్పారు. వారు చెప్పినట్లే అక్కడి వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో ఉన్నది ఏ బిడ్డో చెప్పేశారు. అంతే రెడ్ హ్యాండెడ్గా ఆ వైద్యురాలిని అధికారులు పట్టుకున్నారు. కర్ణాటక స్టేట్ పీసీ పీఎన్డీటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వివేక్ దొరై సమాచారం ఇవ్వడంతో ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ సంయుక్తంగా ఈ దాడులు చేశారు. ఈ మేరకు హాస్పిటల్ను సీజ్ చేశారు. ఇదే విషయంలో పదేళ్ల క్రితం ఓ ట్రైనీ కలెక్టర్ నేతృత్వంలో ఈ ఆసుపత్రిపై డెకాయిట్ ఆపరేషన్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆసుపత్రిని సీజ్ చేశారు. రెండురోజుల్లోనే ఆసుపత్రిలో మరో ద్వారం తెరిచి మరో స్కానింగ్ మిషన ద్వారా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా మొదలుపెట్టడం గమనార్హం. అధికారులు విధి నిర్వహణలో ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారో ఈ ఆసుపత్రిని చూస్తే అర్థమవుతుంది.ఇటీవల నందికొట్కూరులో గడివేముల మండలం గని గ్రామానికి చెందిన గర్భిణికి అక్కడి ఆర్ఎంపీ అబార్షన్ చేయడంతో ఆమె మరణించింది. వివరాలు ఆరా తీయగా ఆమెకు కర్నూలులోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్ చేయగా లింగనిర్ధారణ చేశారని తేలింది. ఈ ఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని పీసీ పీఎన్డీటీ యాక్ట్ బృందం ఏడాది కాలంగా జిల్లాలో 36 డెకాయిట్ ఆపరేషన్లు(దాడులు) నిర్వహించినట్లు లెక్కలు రాసుకున్నారు. అందులో అన్ని స్కానింగ్ సెంటర్లు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు. మరి కర్ణాటక అధికారుల డెకాయిట్ ఆపరేషన్లో కోడుమూరు ఘటన వెలుగులోకి రావడం చూస్తే ఇక్కడి అధికారుల పనితీరు ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.దాడులు ముమ్మరం చేస్తాం పీసీ పీఎన్డీటీ చట్టం ప్రకారం లింగనిర్ధారణ చేయడం నేరం. లింగనిర్ధారణ, గర్భస్రావాలు చేసిన, చేయించిన ఇద్దరికీ శిక్షలు తప్పవు. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా ఉంటుంది. స్కానింగ్, అబార్షన్ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డెకాయిట్ ఆపరేషన్లు చేస్తున్నాం. ఇకపై మరింత ముమ్మరం చేస్తాం. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్ఓ, కర్నూలు తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య జిల్లాలో ఆడ, మగపిల్లల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. వెయ్యి మంది మగపిల్లలు ఉంటే ఐదేళ్ల క్రితం 920 మంది ఆడపిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 900లోపు చేరుకుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్షరాస్యత తక్కువగా ఉండే ఆదోని, కర్నూలు డివిజన్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది. కోసిగి, నందవరం, సి.బెళగల్, గూడూరు, కల్లూరు, జూపాడుబంగ్లా, హోళగుంద, హాలహరి్వ, ఆలూరు, ఆస్పరి, కోడుమూరు, గోనెగండ్ల, వెల్దుర్తి, తుగ్గలి మండలాల్లో మగవారి కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
జర్మన్ ఫెస్ట్.. జాయ్ మస్ట్..
జర్మనీ దేశం గురించి తెలియని సిటిజనులు ఉంటారేమో కానీ అక్టోబర్ ఫెస్ట్ గురించి తెలియని పార్టీ ప్రియులు ఉండరు. సెపె్టంబర్ నెలాఖరులో మొదలై అక్టోబరు తొలివారం వరకూ జరిగే ఈ వార్షిక ఈవెంట్ను అంతర్జాతీయంగా అక్టో బీరు ఫెస్ట్ అని కూడా బీర్ లవర్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇంటర్నేషనల్ ఇష్టాలన్నింటినీ ఒడుపుగా ఒడిసిపట్టుకుంటున్న నగర పార్టీ సంస్కృతిలో ఈ పండుగ కూడా కలగలిసిపోయింది. జర్మనీ దేశపు సంప్రదాయ బీరోత్సవం ఈ అక్టోబరు ఫెస్ట్. బీర్ ప్రియులకు హుషారెత్తించే ఈవెంట్లతో జర్మనీ రాజధాని నగరమైన మ్యునిచ్లో దీనిని భారీ ఎత్తున నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బీర్ లవర్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. స్పెయిన్లో జరిగే టమాటినా ఫెస్ట్ లాగే జర్మనీలో జరిగే ఈ వేడుక కూడా బాగా పాపులర్. క్రేజీ.. ఈవెంట్.. ‘మద్యపాన ప్రియులందు బీరు పాన ప్రియులు వేరయా’ అంటారు కొందరు. నిజానికి మందుబాబుల్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే బీరును ఇష్టపడేవారు తక్కువే. అదే సమయంలో ‘బీర్బ’ల్లు అనిపించుకునే చాలా మంది దీన్ని ఒక మత్తుని అందించే డ్రింక్లా కాక కాలక్షేపపు పానీయంలా భావిస్తారు. అయితే మత్తు కోసం స్ట్రాంగ్ బీర్లు గటగటా లాగించే వారిని పక్కన పెడితే.. కాఫీషాప్లు, కెఫేల తరహాలో నగరంలో వీటి తయారీకి సేవనానికి ప్రత్యేక బ్రూవరీలు సైతం ఉన్న నేపథ్యంలో అక్టోబర్ ఫెస్ట్ మరింత క్రేజీగా మారుతోంది. నగరంలో సందడి షురూ.. ఈ ఫెస్ట్ సందర్భంగా నగరంలోని హోటళ్లు, పబ్స్, కేఫ్లు, రెస్టారెంట్స్.. జర్మన్ వంటకాలతో పాటు బీర్తో కూడిన ప్రత్యేక మెనూ అందిస్తాయి. ఈ కార్యక్రమాలు సంప్రదాయ జర్మన్ రుచికరమైన వంటకాలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో బవేరియన్ వాతావరణాన్ని పునఃసృష్టిస్తాయి. స్థానికులు మ్యూనిచ్కు ప్రయాణించకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ పండుగను ఆస్వాదించిన అనుభూతిని అందిస్తున్నాయి. బ్రాట్వ్రాస్ట్, సౌర్క్రాట్, ష్నిట్జెల్ బవేరియన్ క్రీమ్ వంటి జర్మన్ వంటకాలతో ప్రత్యేక మెనూ రూపొందిస్తాయి. ఈ ఈవెంట్లలో లైవ్ జర్మన్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సంప్రదాయ జానపద సంగీతం కొన్నిసార్లు బవేరియన్–శైలి దుస్తులు ఉంటాయి. మద్యపానం అలవాటు లేనివారికి ఇక్కడ సాఫ్ట్, ఎనర్జీ డ్రింక్స్ కూడా రెడీగా ఉంటాయి. అదిరిపోయే డీజే మ్యూజిక్ కిక్ ఎలాగూ ఉంటుంది. వీటికి తోడుగా రకరకాల కాంటెస్ట్లు, సరదా గేమ్స్, క్విజ్ వంటివి యూత్కి ఎంజాయ్మెంట్ ఇస్తాయి. ఇక ఫైర్తో, బాటిల్స్తో రకరకాల విన్యాసాలు చేసే జగ్లర్స్, నృత్యాలతో అదరగొట్టే డ్యాన్స్ ట్రూప్స్.. వగైరా చిల్డ్ డ్రింక్స్కి ఛీర్స్ చెబుతాయి. ‘బీర్ మాత్రమే కాదు ఫుడ్ని, విందు వినోదాలను కోరుకునే యూత్ కోసం ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. మా అక్టోబర్ ఫెస్ట్ వినోదప్రియులు ఎవరినీ నిరాశపరచదు’ అని ఆరెంజ్ బైస్కిల్ ఎండీ భవ్యగవర చెప్పారు. ఈ వేడుక కోసం నగరం నుంచి జర్మనీ వరకూ రాకపోకలు సాగించే పార్టీ ప్రేమికులు కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు.సాంస్కృతిక ఉత్సవం.. అక్టోబర్ ఫెస్ట్ అనేది జర్మన్ దేశపు సంస్కృతిలో ఒక భాగం. ఈ వేడుకలో బీర్ ప్రధానమైన అంశమే అయినప్పటికీ విభిన్న రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నగరంలో గత కొంత కాలంగా ఈ ఫెస్ట్ను చాలా ఇష్టంగా ఆదరిస్తున్నారు. మా సంస్థ ఆధ్వర్యంలో కూడా ఏటా ఈ ఫెస్ట్ను ఒక రోజు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారి కోసం ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించనున్నాం. – సందీప్, గోతె జంత్రమ్ (జర్మన్ కల్చరల్ సెంటర్) జర్మనీలో మొదలైంది.. సెంట్రల్ మ్యూనిచ్లోని థెరిసియన్ వైస్ ఫెయిర్ గ్రౌండ్లో గత శనివారం అక్టోబర్ ఫెస్ట్ మ్యునిచ్ నగర మేయర్ ఘనంగా ప్రారంభించారు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ ఉత్సవంగానే కాదు జానపద కళల ఉత్సవంగా పిలుస్తారు. ఇది పేరుకు భిన్నంగా, ఆక్టోబర్ ఫెస్ట్ ఎల్లప్పుడూ సెపె్టంబర్లో ప్రారంభమవుతుంది. సాధారణంగా సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది. జర్మనీ దేశపు ఈ ప్రధాన పర్యాటక కార్యక్రమం ప్రస్తుతం 190వ సారి జరుగుతోంది. ఈ ఏడాది కనీసం 6 మిలియన్ల మంది సందర్శకులు వస్తారని అంచనా. అయితే 2023లో ఎప్పుడూ లేని విధంగా 7.2 మిలియన్ల మంది హాజరుకావడం ఓ రికార్డ్. ఈ సందర్భంగా వీరు సేవించిన బీరు మొత్తం పరిమాణం 1.95 మిలియన్ గ్యాలన్లు. ఈ సంవత్సరం ఫెస్ట్లో «బీర్ దరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సుమారు 15 యూరోల నుంచి 17 యూరోల మధ్య అంటే మన రూపాయలలో చెప్పాలంటే రూ.1500పైనే.. ఈ ఫెస్ట్లో భాగంగా పలువురు వ్యాపారులు టెంట్స్ ఏర్పాటు చేస్తారు. ఆయా టెంట్స్ అందించే ప్యాకేజీల్లో సందర్శకులు బీరు తాగడంతో పాటు, వినోద యాత్రలకు వెళ్లవచ్చు. (చదవండి: భారత్లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు) -
ఫైర్ ముఖ్యం
‘ఆశలు ఉండగానే సరిపోదు ఆశయ సాధనకు కృషి చేయాల్సిందే! అప్పుడే సరైన ఫలితాన్ని సాధించగలం అంటోంది 19 ఏళ్ల కాట్రావత్ అంజలి. సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా తాల్ సైనిక్ క్యాంపులో ఉస్మానియా వర్సిటీ సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థిని, ఎన్సిసి క్యాడెట్ అంజలి ఫైరింగ్ విభాగంలో తన ప్రతిభను చూపింది. పతకాలూ సాధించింది. నవ శక్తికి ప్రతీకగా నిలుస్తున్న మహబూబ్నగర్ వాసి అంజలి చెబుతున్న విషయాలు ఆమె మాటల్లోనే..‘‘మా నాన్న నర్సింహ లారీ డ్రైవర్. అమ్మ దుర్గ గృహిణి. పుట్టిందీ, పెరిగిందీ మహబూబ్నగర్లోని పిల్లలమర్రి. ఓయూ సైఫాబాద్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీతో పాటు ఆ కాలేజీలో ఎన్సిసిలో సి–సర్టిఫికెట్ చేస్తున్నాను. ఈ యేడాది ఢిల్లీలో జరిగిన టీఎస్సీ (తాల్ సైనిక్ క్యాంప్)లో పాల్గొనే అవకాశం లభించింది. ఇది జాతీయ స్థాయి ఈవెంట్. ఆర్మీ వింగ్కి మాత్రమే అవకాశం ఉండే ఈవెంట్ కూడా. ఐయుసి, ఐజిసి, టీ ఆర్జీ.. ఇలా లాంచింగ్ వరకు దశల వారీగా శిక్షణ తీసుకుంటూ, పోటీలో పాల్గొంటూ, సక్సెస్ సాధిస్తేనే టీఎస్సీకి ఎంపిక కాగలం.ప్రత్యేక శిక్షణనేను పాల్గొన్నది ఫైరింగ్ అప్లికేషన్. దీనికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రతిరోజూ చేయాల్సిన వ్యాయామాలు, మోటివేషన్ క్లాసులు, ఫైరింగ్లో ఏ మోడ్పాయింట్ ఎలా తీసుకోవాలనేది శిక్షణలో భాగం. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఉండే ట్రైనింగ్తో పాటు రేంజ్ సెక్షన్ దగ్గర ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. భుజ బలానికి ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయి. స్పోర్ట్స్ సైకాలజిస్ట్ల క్లాసులు ఉంటాయి. మానసికంగా ఒకే విషయంపైన ఏకాగ్రత ఉండేలా శిక్షణ ఇస్తారు. పాయింట్ 22 బోర్ రైఫిల్ బరువు 3–4 కేజీలు ఉంటుంది. దీనిని మోయడమే కాదు, అదే సమయంలో ఫైర్ చేయడానికి చాలా శక్తి కావాలి. ఇందుకోసం బలం పెరిగేలా ఆహార నియమాలు, డిప్స్, పుషప్స్, కోర్మజిల్ స్ట్రెంథెనింగ్ .. వంటివి రోజూ సాధన చేస్తూ ఉండాలి.స్ఫూర్తిని నింపే ఈవెంట్.. జాతీయ స్థాయిలో జరిగే టీఎస్సీలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఉన్న 17 డైరెక్టరేట్స్ నుంచి మంచి శిక్షణ తీసుకున్న విద్యార్థులు పాల్గొంటారు. ప్రతి డైరెక్టరేట్ నుంచి 40–50 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారు. ఇందులో మన ప్రాంతం నుంచి నేను పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చింది. జాతీయ స్థాయి శిక్షణ పొందిన విద్యార్థులను కలుసుకోవడం, వారి సంస్కృతి గురించి తెలుసుకోడం, పోటీలో పతకాలు సాధించడమూ చాలా సంతోషాన్నిచ్చింది.ఆశ .. ఆశయంచిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని, డిఫెన్స్లోకి వెళ్లాలనేది నా ఆలోచన. దానికి తగినట్టుగా నాకున్న ఆసక్తిని గమనించి, మా ఎన్సీసీ అసోసియేట్ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ పల్లటి నరేష్ ఆసక్తి ఉందా అని అడిగారు. నా ఆనందం మాటల్లో చెప్పలేను. నాకు ఇష్టమైన రైఫిల్ ట్రైనింగ్లో మిస్ కాకుండా పాల్గొనడం మొదలుపెట్టాను. ఈ ట్రైనింగ్ వల్ల కొన్ని నెలలుగా కాలేజీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్లాసులు, ల్యాబ్స్ మిస్ అయ్యాను. మా లెక్చరర్స్ సపోర్ట్ ఉండటం మరింత బలాన్నిచ్చింది. ఇప్పుడు ఫైనలియర్ కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. స్టేట్ పోలీస్ ట్రైనింగ్కి అప్లికేషన్ పెట్టుకున్నాను. సెంట్రల్ డిఫెన్స్లో పాల్గొనాలనేది నా ఆశ. అందుకు తగిన ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అని ఆనందంగా వివరించింది అంజలి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇద్దరు పిల్లల తల్లి వెయిట్ లాస్ సీక్రెట్: ఏకంగా 84 కిలోల నుంచి 56 కిలోలకు తగ్గి..
బరువు తగ్గడం అంత ఈజీ టాస్క్ కాదు. నిబద్ధత, స్థిరమైన మైండ్సెట్ ఉంటేనే అనకున్న లక్ష్యాన్ని చేధించి బరువు తగ్గగలం. లేదంటే కష్టమే. అందులోనూ పిల్లల్ని కన్న తల్లులకు బరువు తగ్గడం మరింత క్రిటికల్ టాస్క్. ఓపక్క ఇంటి బాధ్యతలు, మరోవైపు కెరీర్ చూసుకుంటూ..వ్యక్తిగతంగా సమయం కేటాయింటం అంటే మాములు విషయం కాదు. అయినప్పటికీ..అన్నింటిని అధిగమించి బరువు తగ్గడంలో మంచి సక్సెస్ అందుకుంది ఈ పిల్లల తల్లి. అందుకోసం తానేం ఏం చేసిందో, తనకు హెల్ప్ అయిన చిట్కాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. అవేంటంటే..డాక్టర్, ఎంటర్ప్రెన్యూర్ భావన ఆనంద్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం అధిక బరువుతో బాధపడుతుండేది. ఆమె 2022 ఆ టైంలో ఏకంగా 84 కిలోల మేర అధిక బరువు ఉండేది. అలాంటి ఆమె ఈ ఏడాది కల్లా స్మార్ట్గా మారడమేగాక విజయవంతంగా 56 కిలోలకు చేరుకుంది. అంతలా మారిపోయిన ఆమె లుక్ని చూసి ఆమె స్నేహితులు, సన్నిహితులు విస్తుపోయారు. "ఆ మూడు అలవాట్లే తన జీవితాన్ని మార్చాయ్" అనే క్యాప్షన్ని జోడించి మరీ తన వెయిట్ లాస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకున్నారామె. ప్రతిరోజు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేయండి అదే మీ శరీరంలో పెనుమార్పు తీసుకొస్తుందని నమ్మకంగా చెబుతోందామె.27 కిలోలకు పైగా బరువు ఎలా తగ్గిందంటే..ఫిట్నెస్ ఔత్సాహికురాలు భావన ఆనంద్ వీడియోలో ఇలా చెప్పుకొచ్చింది. చాలామంది అలా ఎలా మారిపోయవని ప్రశ్నిస్తున్నారని, ఆ నేపథ్యంలోనే తాను ఫాలో అయ్యిన మూడు చిట్కాలను పంచుకుంటున్నా అంటూ చెప్పడం ప్రారంభించారామె. ఇదేం షార్ట్ కట్ కాదు. తన జీవనశైలిలో ఆ మూడు అలవాట్లను భాగం చేసుకోవడంతోనే తన జీవితం ఇంతలా మారిపోయిందని పేర్కొంది. వ్యాయామ దినచర్యలో రెసిస్టెన్స్ శిక్షణ..తాను చేసే వ్యాయామాలపై ఫోకస్ పెడతానంటోంది. కాలక్రమేణ అవి మంచి పురోగతిని సాధించడంలో హెల్ప్ అవుతాయని చెబుతోంది. ప్రోటీన్-రిచ్ మీల్స్కి ప్రాధాన్యత..ప్రతిరోజు ప్రోటీన్ ప్యాక్డ్ మీల్స్ తీసుకునేలా చూసుకుంటానంటోంది. ప్రోటీన్ రిచ్ వంటకాలు కండరాల పెరుగుదల, కోలుకోవడం, మొత్తం పోషకాహర సమతుల్యతకు అత్యంత ముఖ్యమైనవని నొక్కి చెబుతోంది. సరైన నిద్ర..తన వెయిట్ లాస్ జర్నీలో ఇది అసలైన గైమ్ ఛేంజర్ అని అంటోంది. రాత్రి త్వరగా భోజనం చేయడం, ఉదయాన్నే నిద్రలేవడం వల్ల శరీరానికి ఓ నిర్థిష్ట దినచర్యను అనుసరించేలా చేయగలుగుతాం. దాంతో అది సవ్యంగా పనిచేసేందుకు దారితీస్తుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. తనకు ఈ వెయిట్లాస్ జర్నీలో ఆ మూడే బరువు తగ్గేందుకు ఉపకరించాయని వాటిని సక్రమంగా బ్యాలెన్స్ చేయగలిగితే ఎవ్వరైనా బరువు తగ్గడం సులభమేనని చెప్పుకొచ్చింది. కాగా, గతంలో భావన ఆనంద్ తన మహిళా అనుచరులకు 30 ఏళ్ల తర్వాత కండరాల నష్టం కారణంగా కోల్పోయిన శక్తిని ఎలా తిరిగి పొందాలో మార్గనిర్దేశం చేసింది. హార్మోన్ల మార్పు వల్ల 30 ఏళ్ల దాటిని ప్రతి స్త్రీకి శరీరంలోని శక్తి సన్నగిల్లుతుందని, జీవక్రియ నెమ్మదిస్తుందని చెప్పుకొచ్చారు. దీన్ని మనం బల శిక్షణ, అధిక ప్రోటీన్ భోజనం, మంచి నిద్ర వంటి అమేజింగ్ అలవాట్లను జోడించి.. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండని పిలుపునిస్తోంది డాక్టర్ భావన ఆనంద్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Bhawana Anand (@dr.fitmum) (చదవండి: టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. పట్టువదలని విక్రమార్కుడులా..) -
టెన్త్ ఫెయిల్యూర్ ఐపీఎస్ అధికారి స్టోరీ..! మూడుసార్లు ఫెయిల్.. నాల్గోసారి పాసైనా..
పదోతరగతి కూడా పాసవ్వలేదు.. ఇంకేం చదువుతాడు అని అనేస్తారు. కానీ కొందరూ పది ఫెయిలైనప్పటికీ..తర్వాత నెమ్మదిగా సక్సెస్ని అందుకోవడం ప్రారంభిస్తుంటారు. అలానే సాగింది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ ప్రస్థానం. పదోతరగతి ఫెయిలై..సాదాసీదాగా చదివే ఈ అబ్బాయి ఈ రేంజ్లో అందుకోవడం చూసి అంత విస్తుపోయారు. అతడికి ఈ సివిల్స్ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నిసార్లు ఓటమి పలకరించిందో తెలిస్తే చెమటు పడతాయి. పోని విజయ దక్కింది అనుకుంటే అనుకున్న డ్రీమ్ జాబ్ దక్కక నిరుత్సాహం నిలువెల్ల వెంటాడుతున్న తగ్గేది లే అంటూ పోరాడి దక్కించుకున్న గెలుపు కథ ఇది. ప్రతిష్టాత్మకమైన ఈ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేరవ్వుతున్న వాళ్లకు ఈ ఐపీఎస్ స్టోరీ ఓ ప్రేరణ. అతడే ఈశ్వర్ గుర్జార్. రాజస్థాన్లోని భిల్వారాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సువాలాల్ ఒక కిరాణ దుకాణం నడిపేవాడు. తల్లి సుఖి దేవి గృహిణి. చదువులో యావరేజ్ స్టూడెంట్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఫెయిలై తీవ్ర డిప్రెషన్కి గురయ్యాడు. కానీ అతడి తండ్రి అందరి నాన్నల్లా కోప్పడకుండా.. ఏం కాదు మరోసారి ప్రయత్నించు పర్లేదని వెన్నుతట్టాడు. అదే అతడికి మనోబలాన్నిచ్చి పదోతగరతి పాసైయ్యేందుకు దారితీసింది. అలా 2012లో 54% మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక పన్నెండో తరగతి బోర్డు పరీక్షలలో 68% మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి 2019లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. అయితే అతడు తన సక్సెస్ని అక్కడితో ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ (UPSC Civil Services Exam)ని ఎంచుకున్నాడు.వైఫల్యాలు అధిగమించి గెలుపొందిన తీరు..2019 తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. 2020లో ఇంటర్వ్యూ దాక చేరుకున్నా..నిష్క్రమించాల్సి వచ్చింది. చివరికి 2021లో మరోసారి ఓటమిని చవిచూడక తప్పలేదు. ఎట్టకేలకు 2022 నాల్గో ప్రయత్నంలో సివిల్స్ని క్లియర్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 644ని సాధించి ఐఆర్ఎస్ కేడర్కి ఎంపికయ్యారు. కానీ ఆయన చిరకాల వాంఛ ఐపీఎస్ అందుకోసం మరోసారి ప్రయత్నించారు. అలా 2023లో, అతను ఆల్ ఇండియా ర్యాంక్ 555తో IPS అధికారి కావాలనే తన కలను సాకారం చేసుకున్నారు. కానీ తన ర్యాంకు మరింత మెరుగుపడేలా చేసి పూర్తి స్థాయిలో ఐపీఎస్ హోదాని అందుకోవాలని 2024లో మరోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఈసారి ఏకంగా 483 ర్యాంకుతో మరింతగా మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ గుర్జార్ సెప్టెంబర్ 2025 వరకు, IPS సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్నాడు. కృషి, ఓర్పు పట్టుదలతో ఎంతటి కఠినమైన సవాలునైనా ఢీకొట్టి సక్సెస్ని అందుకోవచ్చని ప్రూవ్ చేశారు. ఓటమి ఎదురైనప్పుడల్లా గెలుపుకి దార్లు వెతికే ప్రయత్నంలో ఉన్నాం అనుకుంటూ ఓర్పుతో ముందుకు సాగాలనే గొప్ప సందేశం అందిస్తోంది ఈ ఐపీఎస్ అధికారి ఈశ్వర్ గుర్జార్ సక్సెస్ స్టోరీ.చదవండి: ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..! -
ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!
ఆరోగ్యమే మహాభాగ్యం అని కొందరూ ఫిట్నెస్కి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..ఆరోగ్యం పోతే అంత ఈజీ కాదు ఇదివరకటిలా ఉండటం. అలానే భావించి ఇక్కడొక అమ్మాయి ఏకంగా రూ. 60 వేల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుంది. ఆమె డేరింగ్కి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు..మేడమ్ మీరు చాలా గ్రేట్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాల షిఫ్ట్లు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. కంఫర్ట్ జోన్లో ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా కుదిరే ఛాన్స్ లేదు. అందువల్ల యువత చిన్న వయసులోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉపాసన అనే భారత యువతి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో వింటే విస్తుపోతారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఫ్రెంచ్ అసోసీయేట్గా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60 వేలు దాక సంపాదిస్తున్నట్లు పేర్కొంది. తన ఉద్యోగం చేయడం అత్యంత సులభమని, కాకపోతే నైట్ షిఫ్ట్ల్లో పనిచేయాల్సిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రతి మూడో రోజు తలనొప్పి, ఎసిడిటీ, తక్కువ రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరంగా సేఫ్గానే ఉన్నా..అందువల్ల ధైర్యంగా అంత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ధీమాగా వదిలేశానని తెలిపింది. డబ్బు తాత్కాలికం, అదే ఆరోగ్యం పాడైతే మళ్లీ యథాస్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే తాను డబ్బు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపై దృష్టిపెట్టా, మళ్లీ యథావిధిగా తన జీవితంలో సక్సెస్ని అందుకుంటానా లేదా అనేది తెలియదు. చూద్దాం ఏ జరుగుతోందో అంటూ ముగించింది తన పోస్ట్ని. అందుకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లంత ఆమె సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాదు.. మీ అర్హతకు తగిన ప్రతిదీ మీరు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upasana (@upasanaa._)(చదవండి: -
మీరు ఆట్రోవర్టా? యాంబివర్ట్కీ ఆట్రోవర్ట్కీ ఏంటి తేడా
అంతర్ముఖత్వం.. బహిర్ముఖత్వం.. ఈ రెండూ ఉండే ఉభయముఖత్వం.. మొత్తం ఈ మూడింటి గురించీ, ఈ తరహా వ్యక్తుల గురించీ అందరూ వినే ఉంటారు. సమాజంలో ఉండే వాళ్లంతా ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఒక దాన్లో ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ, కాదట. కొత్త తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారట. ఈ వ్యక్తులకు ‘ఆట్రోవర్ట్’ అనే పేరును ఖరారు చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మేధావులు ఈ కోవకు చెందుతారట. -సాక్షి నేషనల్ డెస్క్ లండన్కు చెందిన ప్రసిద్ధ సైన్స్ మ్యాగజైన్ ‘న్యూ సైంటిస్ట్’లో ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి ‘ఆట్రోవర్ట్’ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, దీనిపై ఏకంగా ‘ద గిఫ్ట్ ఆఫ్ నాట్ బిలాంగింగ్’ అనే పుస్తకమే రాశారు. ‘మనలో కొంతమంది అంతర్ముఖులు ఉంటే, మరికొందరు బహిర్ముఖత్వంతో ఉంటారు. ఈ రెండు వ్యక్తిత్వ లక్షణాలూ ఉన్నవాళ్లూ ఉంటారు. కానీ, ఆట్రోవర్ట్లు అలా కాదు, వీరు చాలా ప్రత్యేకం’ అంటారు కమిన్స్కి.చదవండి: World Rose Day.. నేపథ్యం ఇదీ!ఈ మూడూ తెలిసినవేఇంట్రావర్టులు లేదా అంతర్ముఖులు.. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తారు. బయటి వ్యక్తుల నుంచి ప్రేరణ పొందరు. తమకు తామే ప్రేరణ. ఎక్స్ట్రావర్టులు లేదా బహిర్ముఖులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. నలుగురితో కలివిడిగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. యాంబివర్ట్ లేదా ఉభయముఖత్వం ఉన్నవాళ్లు. ఈ రెండు లక్షణాలూ కలిసి ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరితనాన్ని, మరికొన్నిసార్లు నలుగురితో కలవడాన్ని ఇష్టపడతారు.భిన్నమైన ఆలోచనా విధానం‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదులే’ అనే టైపు ఈ ఆట్రోవర్ట్లు. వీరు నలుగురూ ఆలోచించే పద్ధతికి భిన్నంగా, స్వతంత్రంగా ఆలోచిస్తారు.భావోద్వేగాల నియంత్రణ : ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడరు. తమ సమస్యను నలుగురిలో పెట్టరు. అలాగని ఒక్కళ్లూ కూర్చుని మథనమూ చేయరు. వ్యక్తిగతంగా తాము నమ్మినవాళ్లతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి, సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.ఏంటి తేడా? యాంబివర్ట్కీ ఆట్రోవర్ట్కీ ఏంటి తేడా అని చాలామందికి అనిపించ వచ్చు. చాలా తేడా ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి యాంబివర్ట్లు అంతర్ముఖులుగానో, బహిర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే.. కొన్నిసార్లు ఎవ్వరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు. కానీ ఆట్రోవర్ట్లు అలాకాదు. సమయం, సందర్భం బట్టి మారిపోయే వ్యక్తిత్వం కాదు వీళ్లది.సామాజిక సంబంధాలు : వీళ్లు పార్టీల వంటి వేడుకలకు హాజరవుతారు. కానీ, అందరి దగ్గరకూ వెళ్లిపోరు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అంత వేగంగా కలిసిపోరు. వ్యక్తులను అంచనావేసి, కొద్దిమందితోనే మాట్లాడతారు.ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే వ్యక్తిగత సంబంధాలు, పనితీరును ఇష్టపడతారు.వ్యక్తులతో సంభాషణల్లో పాలుపంచుకోవడానికంటే వాటిని పరిశీలించడానికి ఆసక్తి చూపుతారు.సమూహంలో ఉంటేనే మెదడు యాక్టివ్గా పనిచేయడం, శక్తిని పొందడం ఉండదు.నాయకత్వ లక్షణాలుస్థిరత్వం, ధైర్యానికి వీరు ప్రతీకలు. ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్య వచ్చి కిందపడినా తమంతట తామే తొందరగా పైకి లేవగలరు.వీళ్ల దృష్టిలో నాయకత్వం అంటే అజమాయిషీ కాదు. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఎదుటివారి పరిస్థితినీ అర్థం చేసుకుంటారు.బలమైన, నమ్మకమైన బంధాలుప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ వంటి వాళ్లు ఈ ఆట్రోవర్ట్ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. వీళ్లు స్వతంత్ర భావాలతో ఉంటారు. సృజనాత్మకత వీరి సొంతం. సంప్రదాయ ధోరణిలో పోరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు. నా దగ్గరకు వచ్చే వారిలో ఇంట్రావర్ట్లు, ఎక్స్ట్రావర్ట్లు, యాంబివర్ట్లు.. ఈ మూడు రకాల వ్యక్తిత్వాలూ కానివారిని నేను గమనించాను. వీళ్ల దృష్టిలో ఎక్కువమందితో సంబంధాలు ముఖ్యం కాదు. ఉన్నవి కొన్నయినా.. అవి బలంగా, నమ్మకంగా ఉండేలా చూసుకుంటారు. సామాజిక సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఇట్టే ఆకళింపు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు, ఎదుటివారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. – రామి కమిన్స్కి, సైకియాట్రిస్ట్ -
వంద పూలై విరిసే జ్ఞాపకాలు!
జ్ఞాపకాలు గతం ఇనప్పెట్టెలో భద్రంగా ఉంటాయి. దాని మూత తీయాలని అనుకున్నప్పటి నుండి మానసిక వైబ్రేషన్కు గురవుతాం. చిన్ననాటి స్మృతులు ముసురుకుంటాయి. సాధారణంగా పదేళ్ళ వరకు బాల్యదశ ఉంటుంది. ఈ స్లాట్ మనిషికి స్వర్ణయుగం. ప్రతిక్షణం కుటుంబంలో, సమాజంలో, వీధిలో, ఊరిలో, బడిలో, పక్కింట్లో ప్రతిచోట ప్రతి అనుభవం గుండె గోడలమీద బొమ్మ కడుతుంది. నలుపు తెలుపు రంగుల్లో సినిమా రీల్లాగా గర్గర్ మని ఒక్కో సంఘటన మనసు తెర మీద కదలాడుతుంది.ఒక పండగని జ్ఞాపకం అయితే మరింత సంబరం. పూలదొంతర అల్లాలంటే ఒళ్ళంతా పులకరింతే. గత పరిమళాల జల్లుల్లో తడిసి ముద్దవడమే. బతుకమ్మ పండుగ రంగుల హరివిల్లుల్ని తెంపి వెన్నెల్లో ఆరేసి, వర్షంలో తడిసిన మట్టి సుగంధాలలో నానబెట్టి, కొత్త రంగురంగుల కాంతి తరంగాలని వాటికి పట్టించి నూటొక్క మొగ్గల్ని, పూలని, ఆకుల్ని తొడిగిన పూగుత్తుల్ని పేర్చాలంటే అంత సులభం కాదు. ఇలాంటప్పుడే గత అవిస్మృత ఖజానా విలువ తెలుస్తుంది. పూలను పరిరక్షించే ఇనప్పెట్టె తయారు కానందుకు బాధ. పుప్పొడిలా రాలిన కనబడని కన్నీటి తుంపరల్ని ఎలా, ఎక్కడని దాచగలం.మాది ఊరు కాని ఊరు. పట్టణంలో ఒదిగి ఉన్న ఊరు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ. మా ఇంటి చుట్టూరా అనేకానేక చిన్నా పెద్దా ప్రాచీన గుళ్ళు, చారిత్రక ప్రదేశాలు. ఇంటికి కాస్త దూరంలో మూడు పెద్ద గుట్టల మధ్య పద్మాక్షి గుడి. గుడి కింద నీటి గుండం. అందులో బంగారు జింక ఆకర్షణలా తామరాకులు, పూలు! గుట్టల మీద సీతా ఫలాలే కాదు, ఎన్నో రకాల పూలు, గునుగు పూలు, తంగేడు, గన్నేరు పూలు... ఎన్నెన్నో.మా ఇంట్లో నాకన్నా చిన్నది చెల్లెలు. ఇంటిపక్కన పాటకుల ఇంట్లో ఓ చిట్టెమ్మ. ఇంటి పక్కల చుట్టాలు, పరిచయస్తుల ఇళ్ళల్లో ఆడపిల్లలు. వీళ్లు బొడ్డెమ్మ ఆడేవాళ్లు.భాద్రపదం ప్రకృతి పచ్చదనానికి గర్భ శిశువు. ఈ మాసం ప్రకృతి పరవశించే నిండు చూలాలు. బొడ్డెమ్మ వస్తుందంటేనే పూలవేట షురువయ్యేది. ఆడపిల్లల్ని బొడ్డి అంటారు. బొడ్డి అంటే చిన్నది అని అర్థం. ఈ ఆడపిల్లలు ఆడే బొడ్డెమ్మ ఒక ప్రత్యేక పండగ. ఎవరి ఇంట్లోనూ పదిమంది ఆడే ఆట స్థలం ఉండేది కాదు. గుడిలోనో, ఏదో ఓక బహిరంగ ప్రదేశంలోనో వాళ్ళు వెదురుతో చేసిన చిన్న చిన్న సిబ్బుల్లో పూలు పట్టుకుని అక్కడికి చేరేవారు. అక్కడ కుమ్మరాయన మట్టితో బొడ్డెమ్మ గద్దె తయారు చేసేవాడు. కిందివైపు పెద్దగా పైవైపు చిన్న ఆకారంతో మట్టితో చతురస్రాకారంతో గద్దె కట్టేవాడు. దానికి నాలుగు దిక్కులా ప్రమిదలు పెట్టేవాడు. దానిలో రోజుకొక్కరు 9 రోజులు 9 ఇళ్ళలోంచి నూనె తెచ్చేవారు. దాని చుట్టూ రోజూ కొత్తగా ముగ్గులు వేసేవారు.ఈ పనంతా బాలికలే చేసేవారు. ఊరి వడ్రంగి కర్రతో బొడ్డెమ్మ గద్దె చేసి ఇచ్చేవాడు. దానికి పసుపు, తెలుపు రంగులు వేసేవారు. దానిమీద కూడా ప్రమిదలు ఉండేవి. మధ్యలో పిల్ల బతుకమ్మని చెక్కేవాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని డెబ్బై ఐదేళ్ల తర్వాత అలాంటి కర్ర బొడ్డెమ్మ వస్తువుని ఆద్యకళ మ్యూజియం కోసం సేకరించాను. మగపిల్లల టీం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ కోసం సంచులు పట్టుకుని పూలవేటకు వెళ్ళేవారం. గునుగు పూలు తెచ్చి రకరకాల రంగులద్దేవాళ్ళం. తంగేడు పూలు, ఆకులు, కొమ్మలతో తెంపేవాళ్ళం. ఇంటికి వచ్చి పూలను వేరు చేసేవాళ్ళం. జలాశయాల్లోంచి తెచ్చిన తామర ఆకుల్ని సిబ్బుల కింద ఉంచేవాళ్ళు. కొంతమంది ఎర్రని తామరపూవుని పైన అలంకరించేవాళ్ళు. పై భాగాన పసుపు ముద్ద పెట్టి గౌరమ్మ తల్లిగా సంభావించేవారు. మరికొందరు గుమ్మడి ఆకుల్ని సిబ్బులో పరిచి బతుకమ్మ పైన గుమ్మడిపూవుని ఉంచేవారు. పూవు మధ్య భాగం కేసరాలు ఉండేచోట పసుపు రంగు ఉండేది. దాన్నే గౌరమ్మగా భావించేవారు. మేం ఇంత కష్టపడితే మాకు దక్కేది ఆట పాటల తర్వాత అక్కలు, అమ్మలు పెట్టే ప్రసాదం. రోజుకో తీరొక్క ప్రసాదం. ఇంటికోరకం ప్రసాదం తెచ్చి అన్నీ ఒక్కో గంపలో వేసి వాళ్లు తిని మాకు పెట్టేవారు. ఆ రుచే వేరు. తలుచుకుంటేనే నోరూరుతుంది. బొడ్డెమ్మ, బతుకమ్మలను తలకెక్కించుకునే సందర్భంలో ఆకులతో చేసిన పీకలు ఊదేవాళ్ళం. మరికొందరి దగ్గర కర్రతో చేసిన గొట్టం ఉండేది. ఎండిన గింజల్నో, కాగితం తుంచి దాన్ని నమిలి చేసిన ముద్దనో కర్ర బర్మారులో పెట్టి బాగా ఊదేవాళ్లం. అది పిస్తోలు పేల్చినట్లు శబ్దం అయ్యేది. ఎవరి శబ్దం పెద్దగా ఉంటే వారిపై ప్రశంసల పూల జల్లు పడేది. అలా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగేది. ఆరో రోజు అరెం. అంటే ఆరోజు బతుకమ్మ పేర్చరు. సెలవుదినం. ఆట ఉండదు. మాకు కూడా కాస్త తీరిక దొరికేది. కాకపోతే బతుకమ్మ ప్రసాదం దొరికేది కాదు. పండుగ తొమ్మిది రోజులు చాలా ఇండ్లల్లో శాకాహారమే ఉండేది. కొత్త ధాన్యంతో, పప్పులతో తయారు చేసిన రుచి ఈనాటికీ గుర్తు చేసుకుంటే నోరూరుతుంది. బతుకమ్మ తొమ్మిది రోజులు ఆట పాటలతో గడిచేది. అక్కలు, చెల్లెల్లు, కోడళ్ళు, మరదళ్లతో సందడిగా గడిపిన క్షణాలు ఈ తరాలకు దక్కని మహోత్కృష్ట గడియలు.బతుకమ్మలనే కాదు ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రపరిచి అలంకరించేవారు. ఇళ్ళు ముందు భాగం ముగ్గులు రంగులతో మెరిసిపోయేవి. వివిధ రకాల పూలు ఒక్కచోట ఉంచడం వల్ల చక్కని సువాసనలతో ఆ ప్రదేశం ఎంతో బాగుండేది. బతుకమ్మలపై కొందరు అగరుబత్తీలు పెట్టేవారు. చాలా కాలం దాచిపెట్టి పండుగ రోజున కట్టుకునే పీతాంబరం, పాత చీరల ప్రత్యేక వాసన ఇంకా పీల్చుతున్నట్లే ఉంటుంది. రోజూ అలికిన తాజా వాసన సైతం పండగ ప్రత్యేకతని చెప్పకనే చెప్పేది.బాలికల గుంపు చిన్న మగపిల్లగాళ్ల గుంపు, యువతుల గుంపు, తల్లుల గుంపు, అమ్మమ్మ నానమ్మల గుంపు ఇలా ఎవరి గుంపు వారిదే. ఎవరి స్నేహితులతో వారు కలిసిమెలసి ఉండేవారు. హాస్యం వందపూలై పూసేది. సామెతలతో సంభాషణ నవరసాలతో ఆకట్టుకునేది. వరసలను బట్టి హాస్యం, చతురోక్తులు ఉండేవి. ఇది పండుగ సంబరాన్ని మరింత పెంచేది. ఊరు ఊరంతా గాన ప్రవాహంలో ఈదేది. చెరువు గట్టో, నీటి గుండాల పక్కనో వాళ్ల నృత్యంతో భూమి పులకరించేది. సంధ్యాసమయంలో ప్రకృతిని చూసి మా ఒడలు పులకరించేది. నాడు బతుకమ్మ ప్రకృతి పండుగ. నా జ్ఞాపకాలలో ఆనాటి ప్రాకృతిక సౌందర్యం చూడడం కోసం ఊరూ, వాడా, అడవీ, పల్లె తిరుగుతూనే ఉన్నాను. ఏదో తెలియని శూన్యం. నా జీవితకాలం అంతా పద్మాక్షి గుట్ట కింద నీటి గుండంలోని తామర పూవుల సువాసన ఇంకా వెన్నాడుతోంది. కొండమీది గోగుపూలు రమ్మని చేతులు చాస్తున్నాయి. పండిన సీతాఫలాల సువాసన, రుచి, బతుకమ్మ ప్రసాదాలు తిన్నాక చాలా గంటల వరకు చేతికంటిన కమ్మని సువాసన కోసం మళ్లీ బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపు! స్త్రీలు పాడే పాటలు చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పేర్పులోని నేర్పు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళ కళాత్మక భావనల్నిచూసి వారిపై ఎనలేని ప్రేమ, గౌరవం కలిగేది. ఊరు ఊరంతా ఒక్కటై చేసుకునే పండుగ పట్ల గౌరవం ఇనుమడించేది. పండుగ కాలంలో స్త్రీలు మిగతా వాళ్ళని గౌరవంగా చూసేవాళ్ళు. అందరూ సమానమే. ఎందుకంటే అందరూ సుమంగళులే. అంటే గర్భం ధరించి పిల్లల్ని కనగలిగే అర్హత ఉన్నవాళ్ళే. వాళ్లే బతుకమ్మ ఆడాలి. వాయనాలు పెట్టుకోవాలి.– జయధీర్ తిరుమలరావు -
ఏఐ జనరేటెడ్ ఇమేజ్లతో తస్మాత్ జాగ్రత్త..!
నయా ట్రెండ్గా నానో బనానా ఏఐ పోటోల సందడి మాములుగా లేదు. ఈ ట్రెండ్ చీరల దగ్గర నుంచి నవరాత్రుల సెలబ్రేషన్స్ వరకు పాకేసింది. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఓ అద్భుతాన్ని సృష్టిస్తున్నా.. మన గోప్యతకు ముప్ప తప్పదనేది గ్రహించాలి. నిజానికి ఇది ఎంతవరకు ఉపయోగించడం మంచిదనేది సవివరంగా తెలుసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. మన వ్యక్తిగత ఫోటోలను నచ్చిన విధంగా ఈ సరికొత్త ట్రెండ్ సాయంతో చూసుకోవడం అనేది వావ్..! అనిపిస్తున్నా..కొంత ప్రమాదం కూడా లేకపోలేదన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే..మన ఫోటోలను ఏఐ ఫ్లాట్ఫామ్కి అప్పగించడం వల్ల గోప్యత నుంచి సామాజిక హాని వరకు చాలా గణనీయమైన ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ హవా నడుస్తుందని మీ వ్యక్తిగత ఫోటోలను అప్పగించే ముందు ఎదురయ్యే ప్రమాదాలను గురించి కూలంకషంగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటంటే..AI జనరేటర్లకు ఫోటోలను ఫీడ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు..డీప్ఫేక్ క్రియేషన్:ఏఐ మీ ఫోటోలను ఉపయోగించి నమ్మదగిన డీప్ఫేక్లను సృష్టించగలదు. ఫలితంగా మీ గుర్తింపుకు, ప్రతిష్టకు నష్టం, పైగా వేధింపులు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా నానో బనానా ఏఐ జెనరేటెడ్ చిత్రాల వల్ల ఇది మరింత ఎక్కువ.ఫోటోలపై నియంత్రణ కోల్పోవడంఒక్కసారి ఏఐ జనరేటర్లకు ఫోటోలను అప్లోడ్ చేసినట్లయితే. .అవి ఎలా ఉపయోగించుకుంటున్నారనేది తెలియదు. పైగా ఆ చిత్రాల సాయంతో లొకేషన్ డేటా, వ్యక్తిగత వివరాలు సామాజిక కనెక్షన్లతో సహా సమాచారాన్ని గ్రహించేస్తాయి. అదీగాక డిజిటలైజ్ చేసిన మీ చిత్రం అనంతంగా లేదా మీ అనుమతి లేకుండానే మారిపోవచ్చు. ఇది ఒకరకంగా హింసాత్మక, లేదా తప్పుదారి పట్టించే అవకాశం కూడా లేకపోలేదని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇమేజ్ ప్రామాణికత క్షీణించటం: ఇమేజ్ ప్రామాణికత నష్టపోతుంది. ఎందుకంటే నకిలీ ఫోటోల మధ్య ఏది అసలైనది అనేది గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా జర్నలిజం, ప్రకటనలకు సంబంధించిన దృశ్య కంటెంట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.అనుమతి లేకుండానే వాణిజ్య వినియోగం: AI ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన ఫోటోలను అనుమతి లేకుండానే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. గోప్యతకు భంగం, డేటా దుర్వినియోగం: ఏఐలో అప్లోడ్ అయిన ఫోటోలు బయోమెట్రిక్ డేటాకు యాక్సెస్ అయ్యి మీ గుర్తింపుకు అంతరాయం ఏర్పడవచ్చు. అంతేగాదు కొన్ని కంపెనీలు ఈ ఫోటోలను ఇతరత్రగా షేర్ చేయడం లేదా విక్రయించే అవకాశం లేకపోలేదు.వివక్షత, పక్షపాత ధోరణి: తరచుగా కొన్ని సమూహాలు స్టీరియో టైపిక్ మైండ్తో.. మీ ఫోటోని లోపభూయిష్ట నమునాలుగా ఫీడ్ చేసి వివక్షతకు ఆజ్యం పోయడమే గాక జాతిపరమైన ప్రొఫైలింగ్ లేదా సవరణలతో అందం ప్రమాణాలను వక్రీకరించే సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు..!) -
కార్చే కన్నీరు సైతం... క్వాలిటీ కోల్పోతోంది...
నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో అన్నారో సినీకవి. అయితే నగరవాసుల కంట్లో నీరున్నా...ఆ కన్నీరెనకాల క్వాలిటీ సున్నా అంటున్నారు నేత్ర వైద్యులు. అదేంటీ నవ్వలేక ఏడుస్తుంటే అందులో నాణ్యత కూడా ఉండాలా? అంటే...అవును ఉండాల్సిందే అని వైద్యులు అంటున్నారు. నవ్వే మనిషిని చూసి శభాష్ అంటాం...ఏడ్చే మనిషిని చూసి పాపం అనుకుంటాం... మానవ శరీరంలో కలిగే ప్రతీ మార్పూ భావోద్వేగాల ప్రతిరూపమే. మనం మంచిదని, చెడ్డదని మరొకటని అనుకున్నా..అవన్నీ మనకు అవసరమైనవే... అప్రధానం కానివే... ఈ నేపధ్యంలోనే కొన్ని రకాల భావోద్వేగాల ఫలితంగా పుట్టే కన్నీరు కూడా చాలా ముఖ్యమైనదే. అంత ముఖ్యమైన కన్నీటిలో ఇప్పుడు నాణ్యత లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.టియర్స్...వండర్స్...ఆపుకోలేక ఏడుస్తామేమో గానీ ఎవరూ చూడకూడదనుకుని తుడిచేస్తాం...ఎవరైనా చూస్తే సిగ్గుపడతాం.. కానీ తేలిగ్గా తీసుకోవద్దు... కన్నీటి తయారీ వెనుక పెద్ద తతంగమే ఉంది. కన్నీళ్లు కంటిలోపలి మూడు పొరల నుంచి తయారవుతాయి. అందులో బయట ఉండేది ఆయిలీ పొర, మధ్యలో ఉండేది నీటి పొర, లోపల ఉండే మ్యూకస్ పొర...ఈ మూడింటిని కలిపి టియర్ ఫిల్మ్గా పేర్కొంటారు. కంట్లో ఉబికే కన్నీరు ఈ 3 పొరలు సక్రమంగా పనిచేసినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కపొర దెబ్బతిన్నా కన్నీరు నాణ్యత కోల్పోతుంది.పొరను కాటేస్తున్న తెర...కంటి నీటి క్వాలిటిని దెబ్బతీస్తున్నవాటిలో స్క్రీన్ టైమ్ ప్రధానమైంది. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ లేదా మొబైల్... ఏదైనా సరే అతిగా అదే పనిగా చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి అనేది తెలిసిందే.. కళ్లు పొడిబారడం వల్ల వచ్చే సమస్యే కన్నీటి క్వాలిటీని దెబ్బ తీస్తోంది. అందుకే కళ్లు ఎర్రబారినా ఇంకే సమస్య వచ్చినా తొలుత కన్నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తారు. స్కాన్ చేసి టియర్ క్వాలిటీని నిర్ధారిస్తారు. ఈ సమస్య పరిష్కారంగా లిపి ఫ్లో ట్రీట్మెంట్ వంటివి చేస్తారు తద్వారా కంటి నీటి క్వాలిటీ పెరుగుతుంది. కన్నీటి క్వాలిటీ తగ్గినప్పుడు నీటిలో ఉప్పు శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని శరీరం అంగీకరించదు. దాని వల్ల కళ్లు మరింత ఎర్రబారడం...వంటి సమస్యలు వస్తాయి. లాక్రిమల్ గ్రంథి అనుబంధ గ్రంథుల పనిచేయకపోవడం వల్ల తగినంత కన్నీటి ఉత్పత్తి సైతం జరగదు.కన్నీటి క్వాలిటీ కోసం...టియర్ ఫిల్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గతంలో పెద్ద వయసు లక్షణంగా భావంచేవాళ్లం. అయితే వయసులకు అతీతంగా ప్రస్తుతం సిటిజనుల్లో చాలా మందిలో కనపడుతున్న సమస్య. దీని చికిత్సలో భాగంగా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లు శుభ్రం చేసుకోవడం, గోరువెచ్చని నీటితో కంటిపై కాపడం పెట్టుకోవడం...వంటి చిట్కాలతో పాటు కొన్ని మందులు కూడా పనిచేస్తాయి. మరికొన్ని జాగ్రత్తలు...తగినంత నీరు తాగుతుండాలి..కంప్యూటర్స్, మొబైల్స్ తదితర డిజిటల్ స్క్రీన్స్ను చూస్తున్నప్పుడు తరచుగా కనురెప్పలు మూసి తెరుస్తుండాలి.ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ మిషన్లులతో పాటు కంటిని పొడిబార్చే గాలులకు దూరంగా ఉండాలి.కన్నీటి ఉత్పత్తిని పెంచేందుకు తరచుగా సుతిమెత్తని వెచ్చని ఒత్తిడి వాటిపై కలిగిస్తుండాలి.ఒమెగా–3 పుష్కలంగా కలిగి ఉన్న వాల్నట్స్, సాల్మన్ చేప, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో జత చేయాలి.కళ్లను సున్నితంగా మాత్రమే తాకాలి..కార్నియాకు ఒత్తిడి కలిగించేలా రఫ్గా, తరచుగా నులమడం వంటివి చేయకూడదు.రోజుకి తగినంత అంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.స్మోకింగ్, ఆల్కహాల్ వినియోగం కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీయడంతో పాటు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల పొడి కన్నీటి పొర ఉన్న రోగులలో దృష్టి నాణ్యత కాంట్రాస్ట్ సున్నితత్వం మెరుగుపడతాయి,అధునాతన నాన్–ఇన్వాసివ్ టియర్ ఫిల్మ్ ఇమేజర్స్ వంటి కొత్త సాంకేతికతలు, కన్నీటి పొర సబ్లేయర్ల వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తాయి, నేత్ర వైద్యులు పరిస్థితిని నిర్ధారించడానికి పర్యవేక్షించడంలో సహాయపడతాయి.కన్నీరు కూడా విలువైనదే...తప్పకుండా ఉండాల్సిన శరీరధర్మాల్లో కన్నీరు కూడా ఒకటి. ఆ కన్నీరులో కూడా విభిన్న రకాలు మిళితమై ఉంటాయి. కంటి పనితీరు బాగుండడానికి అవన్నీ నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. వాటి నాణ్యత లోపం ఏర్పడినప్పుడు తప్పకుండా కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. సో.. చాలా సార్లు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో భాగంగా కన్నీరు కూడా పరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి కృత్రిమ మార్గాల ద్వారా కూడా కన్నీటిని రప్పించి మరీ నాణ్యతా పరీక్షలు జరుపుతాం. పరీక్ష ఫలితాన్ని బట్టి కంటి సమస్యల పరిష్కారానికి చికిత్స అందిస్తాం.–డా.రూపక్కుమార్ రెడ్డి, నేత్రవైద్య నిపుణులు(చదవండి: యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం) -
ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..
సాయంకాలాన.. సాగర తీరాన అన్నట్లు.. ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది.. నగరంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హారి్టకల్చర్ ఎక్స్పో.. ప్రదర్శనలో వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీలు ఏర్పాటు చేసిన స్టాల్స్లో పలు రకాల ఇండోర్, అవుట్డోర్ ప్లాంట్స్ సందర్శకులను అలరిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నాయి. దీంతో పాటు ఈ ఎక్స్పోలో మనసుదోచే అక్వేరియం మోడల్స్, అందులో పెంచుకునే వివిధ రకాల చేపలు, అదే విధంగా గాజు, పింగాణి పాత్రలు, అందమైన ఇంటీరియర్స్, బాల్కనీని అలంకరించే పలు డెకరేటివ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇండోర్ ప్లాంట్స్లో ప్రధానంగా చెప్పుకునేది లక్కీ బాంబు ప్లాంట్. ఇది ఒక గాజు పాత్రలో నీరు, రంగు రంగు రాళ్ల మధ్య పెరిగే ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. మనం ఎవరికైనా పుట్టిన రోజు, స్వాగతం పలుకుతూ ఇచ్చేందుకు పిల్టోనియా అనే గిఫ్టింగ్ ప్లాంట్ ఎంతో ఆకర్షణీంగా కనిపిస్తుంది. దీనిని ఆఫీస్ టేబుల్పై, ఇంట్లోనూ పెట్టుకోవచ్చు.కాక్టస్ ఫ్యామిలీకి చెందిన ఇండోర్ ప్లాంట్స్ నారింజ, ఎరుపు వర్ణంలో ఎంతో అందంగా ఉంటాయి. తక్కువ నీటిని తీసుకొని పెరిగే ఈ మొక్కలు ఇంట్లో ఎంతో అలంకరణగా ఉంటాయి.స్నేక్ ప్లాంట్గా పిలుచే ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫయ్యర్గా పనిచేస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మన ఇంట్లోని గాలని శుద్ధి చేస్తుంది. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది.ఇంట్లో వాస్తు దోషం, ధన అభివృద్ధి కలుగుతుందనే నమ్మకంతో ఇండోర్లో జెడ్ ప్లాంట్ మొక్కను ఎక్కువగా పెంచుకుంటారు. ఈ మొక్కను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.వాటర్ సేవింగ్ ప్లాంట్స్గా పిలువబడే సకులెట్స్ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి ఎంతో మంది ఇష్టపడతారు. వీటిని ఇంటి గుమ్మం వద్ద స్వాగతం పలికే మొక్కలుగా, నెగిటివిటీని పాజిటివిటీగా మార్చే మొక్కలుగా పిలుస్తుంటారు. నవంబర్ నెలలో వీటికి పూచే పూలు వివిధ రంగుల్లో ఆకర్షిస్తాయి. రణపాల ఈ మొక్క ఆకులు తరచూ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, రాకుండా అరికట్టేందుకు అవకాశముంటుంది. మింట్ తులసి ఈ మొక్క ఆకును రోజు ఒకటి తీసుకుంటే మౌత్ ప్రెష్నగర్గా పనిచేస్తుంది. నోట్లో, గొంతులో ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని కొంత వరకూ అరికట్టవచ్చు. లావెండర్ మాసుపత్రి ఈ మొక్క ఇంట్లో ఉంటే దొమల నివారణకు ఉపయోగపడుతుంది. అందే ఈ మొక్కను మస్కిటోఫ్రెనర్గా పిలుస్తారు. వీటితో పాటు 40కి పైగా రాకాల బోన్సాయి మొక్కలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఇంట్లో అలంకరణగా అమర్చుకోవచ్చు. ఆక్వేరియంలో చిన్న పాటి దట్టమైన అడవిని తలపించే విధంగా గాజు, పింగాణి పాత్రల్లో అమర్చిన ఫారెస్ట్ ప్రేమ్లు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. వీటికి నెలలో ఒక్కసారి వాటర్ స్ప్రే చేస్తే చాలు నెల మొత్తం ఇంట్లో ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇంటి పెరట్లోనే మెడిసిన్.. మొక్కలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి. వాము చెట్టు ఈ మొక్క ఆకులు తరచూ తీసుకుంటే దగ్గు, ఆయసం వంటి వాటిని అరికట్టేందుకు అవకాశముంటుంది. -
వాడవాడలా పూలగోపురాల హడావిడి
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ.. ఆట చిలుకలార గౌరమ్మ.. పాట చిలుకలార గౌరమ్మ.. అంటూ సాంస్కృతిక నగరమైన హైదరాబాద్లో బతుకమ్మ ఉత్సవాల సందడి మొదలైంది.. నేటి (ఆదివారం) నుంచి.. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. వాడవాడలా పూల గోపురాల హడావుడి మొదలైంది. పలు ప్రాంతాల్లోని ప్రాంగణాల్లో పండుగ సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.. విద్యుత్ దీపాల వెలుగులతో ప్రత్యేక అలంకరణ చేసింది..ప్రధాన కూడళ్లు మొదలు.. చెరువులు, కుంటలు ఉత్సవాలకు వేదికలు కానున్నాయి.. పూలపండుగకు మహానగరం సన్నద్ధమైంది. బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ట్యాంక్ బండ్, నెక్లెస్రోడ్డు తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ వెలుగులతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించారు. సాధారణ మహిళల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకూ అన్ని వర్గాల వారూ వేడుకల్లో భాగస్వాములయ్యే విధంగా ఏర్పాట్లు చేపట్టింది. గ్లోబల్సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ సాంస్కృతిక నగరంగా కూగా ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉంది. నిజాం కాలం నుంచే నగరంలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వైవిధ్యభరితమైన సంస్కృతుల పాదులాంటి భాగ్యనగరంలో శతాబ్దాల క్రితమే అందమైన బంతిపూల బతుకమ్మలు, నూటొక్కతీరు పూల బతుకమ్మలు కొలువుదీరాయి. అప్పట్లో ప్రతి సంవత్సరం స్వచ్ఛంగా, నిండుగా ప్రవహించే మూసీనది ఒడ్డున ఎంగిలిపూల బతుకమ్మలు మొదలుకొని సద్దుల బతుకమ్మల వరకూ తొమ్మిది రోజుల పాటు మహిళలు వేడుకలను నిర్వహించేవారు. దీంతో మూసీనది పరీవాహక ప్రాంతమంతా నిలువెత్తు శతాబ్దాల చరిత్ర..ఇంద్రధనస్సు నేలపై పరుచుకున్నట్లు అందంగా తళుకులీనుతూ కనువిందు చేసేది. వందలాది చెరువులు, కుంటలతో, అందమైన ఉద్యానవనాలతో కూడిన భాగ్యనగరానికి బతుకమ్మ పండుగ మొదటి నుంచి బంగారు కాంతులద్దింది. కుతుబ్షాహీల కాలం నుంచే హైదరాబాద్లో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ చేసుకున్నారు. అప్పటి రాజు ఇబ్రహీం కులీకుతుబ్షాను పొగుడుతూ మహిళలు పాడుకున్న బతుకమ్మ పాటలే ఇందుకు నిదర్శనమని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి తెలిపారు. ఆ తరువాత నిజాం కాలం నాటికి బతుకమ్మ పండుగ మరింత వైభవోపేతంగా జరిగింది. ప్రకృతి ఉత్సవం.. పెత్తరమవాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ ఆఖరు రోజు నవమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, ముత్యాలపూలు, కట్ల పువ్వులు, తీగెమల్లె పువ్వులు, డిసెంబరాలు వంటి పూలతో అమ్మాయిలు బతుకమ్మలను పేర్చుతారు. ఇంట్లో అమ్మాయిల వయసుకు తగిన విధంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బతుకమ్మ ఎత్తు పెంచుకోవడం, తమ స్థాయికి తగిన విధంగా పెద్ద పెద్ద బతుకమ్మలను అలంకరించుకొనే సంప్రదాయం నగరంలో బలంగానే ఉంది. కూకట్పల్లి, మియాపూర్, తదితర చోట్ల ఏటా బాహుబలి బతుకమ్మలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సారి ఎల్బీస్టేడియంలోనూ అతిపెద్ద బతుకమ్మను అలంకరించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేపట్టింది. సద్దుల సమర్పణ.. సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి తృణధాన్యాలు, బెల్లంతో మలీద ముద్దలు చేసి సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మకు సద్దులు సమరి్పస్తారు. బతుకమ్మ పండుగ రోజున పసుపుతో చేసిన గౌరమ్మను పూలమధ్యలో అలంకరించి పూజిస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాస దీక్షలో మహిళలు బతుకమ్మ పండుగ అనంతరం తాము తెచ్చిన సద్దులు ఆరగించి దీక్ష విరమిస్తారు. నిలువెత్తు పూలగోపురాల్లా, ఎత్తయిన పూల శిఖరాల్లా రంగురంగుల పూలతో ఎంతో అద్భుతంగా కనిపించే బతుకమ్మ ఇక్కడి ప్రజలకు ఆరాధ్యం. ‘బతుకమ్మ’ అంటే బతుకును ఇచ్చే తల్లి అని అర్థం. ఆ మాటకొస్తే కాకతీయుల కాలంలో పోరుభూమిలో ఉన్న రాణి రుద్రమ దేవిపై శతృవు కత్తి దూసినప్పుడు ఓ మహిళ అడ్డంగా వెళ్లి ఆమె ప్రాణాలు కాపాడి బతుకునిచి్చందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలా అనేక శతాబ్దాలుగా తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ఆది నుంచి వేదికగా నిలిచింది. మూసీనది ఒడ్డున.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ మహిళలు పాడుకునే పాటలతో తొమ్మిది రోజుల పాటు నగరంలో సందడి కనిపించేది. ఈ వేడుకలకు నిజాం నవాబులు తగినవిధంగా ఏర్పాట్లు చేసేవారు. పండుగ సందర్భంగా చెరువులు, కుంటల వద్ద, మూసీనది ఒడ్డున మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకొనేవారు. మహబూబ్ అలీఖాన్ కాలంలో హిందువుల పండుగలకు అనూహ్యమైన ఆదరణ, ప్రాచుర్యం లభించాయి. మూసీనది వరదలు పోటెత్తి నగరాన్ని అతలాకుతలం చేసినప్పుడు, ఎంతోమంది ఆ వరదల్లో విగత జీవులయ్యారు. ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. ‘తళతళ మెరుపులు మెరవంగా ఉయ్యాలో, పెళపెళ పిడుగులు రాలంగా ఉయ్యాలో, కురిసింది వాన ఉయ్యాలో.. పట్నంబులోన ఉయ్యాలో.. పొంగిందీ మూసీ ఉయ్యాలో.. మునిగిందీ ఊరు ఉయ్యాలో..’ అంటూ ఆ నాటి విషాదాన్ని పాటల రూపంలో పాడుకున్నారు. (చదవండి: బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం: ఉత్సవాల షెడ్యూల్ ఇదే!) -
ఫస్ట్ క్లాస్ జర్నీ
కాస్త సరదాగా చెప్పుకోవాలంటే... ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అనే ఆరుద్ర మాట సురేఖ యాదవ్కు వర్తించదు. నిజానికి రైలే ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఆసియా ఫస్ట్ ఉమెన్ ట్రైన్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సురేఖ రిటైర్ అయింది. ఆమె ఒక రైలుబడి. ఆ బడిలో ఎన్నో విలువైన పాఠాలు ఉన్నాయి. భావితరాలకు మార్గదర్శకాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని సతారలో పుట్టి పెరిగింది సురేఖ. అయిదుగురు పిల్లల్లో పెద్దది. తండ్రి రామచంద్ర భోంస్లే రైతు. సతారాలోని సెయింట్ పాల్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకున్న సురేఖ వృత్తివిద్యా కోర్సులో చేరింది. ఆ తరువాత.. కరాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో డిప్లమా, బీఎస్సీ(మ్యాథ్స్), బీయీడీ చేసింది.టీచర్ కాదు రైలు డ్రైవర్బీయీడీ చేసిన సురేఖ టీచర్ కావాలనుకునేది. అయితే ఆమెకు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసుకొని సెంట్రల్ రైల్వేస్లో ట్రైనీ అసిస్టెంట్ డ్రైవర్గా చేరింది. 1985లో కల్యాణ్ ట్రైనింగ్ స్కూల్లో ఆరు నెలల పాటు శిక్షణ తీసుకుంది. అసిస్టెంట్ డ్రైవర్గా ఆమె వృత్తి ప్రయాణం మొదలైంది. వాడి బందర్, కల్యాణ్ల మధ్య నడిచే గూడ్స్ ట్రైన్లో ఇంజిన్ రన్నింగ్ కండీషన్, సిగ్నల్స్... మొదలైన వాటిని పర్యవేక్షించేది. కొన్ని సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో గూడ్స్ డ్రైవర్గా బాధ్యతలు స్వీకరించింది. ఆ తరువాత వెస్ట్రన్ ఘాట్ రైల్వేస్లో డ్రైవర్గా పనిచేసింది.→ దక్కన్ క్వీన్ డ్రైవ్ చేసిన క్వీన్దక్కన్ క్వీన్(డైలీ పాసింజర్ ట్రైన్) డ్రైవర్గా పాసింజర్ ట్రైన్ను నడిపిన ఆసియాలోని తొలి మహిళగా గుర్తింపు పొందింది సురేఖ. ఘాట్ లైన్ కోసం రెండు–ఇంజిన్ల ప్యాసింజర్ ట్రైన్ నడపడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంది. గతంలో మహిళలు ఎవరూ ఘాట్ లైన్లో ట్రైయిన్ నడపక పోవడం వల్ల పై అధికారులకు సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంది సురేఖ. ‘దక్కన్ క్వీన్ ట్రైన్ నడపాలనేది నా కలగా ఉండేది. ఎందుకంటే మహిళ పేరుతో నడిచే రైలు అది. ఆ పేరులో రాజసం ధ్వనిస్తుంది. ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. భారతీయ రైల్వే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఉంది. మహిళలకు ప్రత్యేకించిన ట్రైన్స్ను నడపడం కూడా సంతోషంగా ఉంది’ అంటుంది సురేఖ.→ గురువుగా...ఎక్స్ప్రెస్ మెయిల్ డ్రైవర్గా 2011లో ప్రమోట్ అయిన సురేఖ ఆ తరువాత కల్యాణ్లో డ్రైవర్స్ ట్రైనింగ్ సెంటర్ (డిటీసి)లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా పాఠాలు బోధించింది. మన దేశంలో ట్రైన్ నడిపిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది. 2011లో 50 మంది మహిళలు సబర్బన్, గూడ్స్ ట్రైన్ డ్రైవర్లుగా ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి...సురేఖ.→ ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై...‘ఆడవాళ్లు ట్రైన్ డ్రైవర్ ఏమిటి! అని ఆశ్చర్యపోయే రోజుల్లో కూడా నా కుటుంబం, మిత్రులు, బం«ధువుల నుంచి ప్రోత్సాహం లభించింది. ఆ ప్రోత్సాహమే ఉత్సాహమై నన్ను ముందుకు నడిపించింది. వృత్తిజీవితంలో నాకు ఎలాంటి వివక్షా ఎదురుకాలేదు. ట్రైన్ ఎక్కిన తొలి క్షణం నుంచి మరే విషయాలు మదిలో రాకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది సురేఖ. నిజానికి ఆమె రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆ ఉద్యోగమే ఆమెను చరిత్రలో గుర్తింపు తెచ్చుకునేలా చేసింది.ఘనమైన వీడ్కోలుసురేఖ యాదవ్ ఫేర్వెల్ సెలబ్రేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ)లో ఘనంగా జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన సురేఖ ఆత్మీయలు, స్నేహితులు, బంధువులు, రైల్వే ఉద్యోగులు ఆమె మెడలో పూలమాలలు వేశారు. డోళ్లు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘సురేఖ రిటైర్ అయినప్పటికీ... ఆమెలోని శక్తి సామర్థ్యాలు రిటైర్ కావు. అవి ఎప్పుడూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి’ అన్నారు వక్తలు.కష్టం లేదు... ఎప్పుడూ ఇష్టమే!‘ట్రైయిన్ నడపడం అంటే మాటలా!’లాంటి మాటలు వినిపించినప్పటికీ నేను ఎప్పుడూ భయపడలేదు. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా శిక్షణ తీసుకున్నాను. ఈ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యోగం ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. కుటుంబ, వృత్తి బాధ్యతలను జాగ్రత్తగా సమన్వయం చేసుకునేదాన్ని.– సురేఖ యాదవ్ -
హార్ట్ ఫేవరెట్.. హార్టికల్చర్ షో : రూ.30 నుంచి 3 లక్షల దాకా!
నగర వేదికగా ప్రకృతి ప్రేమికుల హార్ట్ ఫేవరెట్ అయిన హారి్టకల్చర్ షో మరో మారు అలరిస్తుంది. నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈ 18వ నర్సరీ మేళా–2025 గురువారం గ్రాండ్గా ప్రారంభించారు. ఇందులో వివిధ రకాల మొక్కలు రూ.30 నుంచి రూ.3 లక్షల ధరల్లో గార్డెనింగ్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నగరవాసులకు అందుబాటులో ఉండనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. – ఖైరతాబాద్/లక్డీకాపూల్ రాష్ట్ర ఉద్యానవన శాఖ టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రీనరీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని నర్సరీ మేళా పేరుతో ఆల్ ఇండియా హారి్టకల్చర్ షో అందుబాటులోకి తీసుకొచ్చింది. భిన్న రకాల మొక్కలు, విభిన్న రకాల పుష్పజాతులు, ఔషధ, అరుదైన మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అరుదైన మొక్కలు, విత్తనాలు తీసుకొచ్చి 150 స్టాళ్లలో ఏర్పాటు చేశారు. కిచెన్, అవుట్డోర్, బల్బ్, సీడ్, సీడ్లింగ్స్, ఇండోర్, ఆడినియం, బోన్సాయ్, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్తో పాటు ఎగ్జాటిక్ ప్లాంట్స్, వాటర్ లిల్లీస్, కోకో పీట్, గార్డెన్ ఎక్విప్మెంట్, ఫామ్ ఎక్విప్మెంట్ వంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!ఎగ్జాటిక్ ప్లాంట్స్ ప్రత్యేకం.. నర్సరీ మేళాలో వెస్ట్ బెంగాల్లోని కాలీపంగ్ నుంచి ప్రత్యేక ఎగ్జాటిక్ ప్లాంట్స్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రదర్శన ఇన్ఛార్జి ఖాలీద్ అహ్మద్ పేర్కొంటున్నారు. ఈ మేళాలో ఏపీ, కడియం, కోల్కతా, ఢిల్లీ, హర్యాణ, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నై, వెస్ట్ బెంగాల్ తదితర ప్రాంతాల నర్సరీలు భాగస్వామ్యం అయ్యాయి. నాటు కూరగాయలు, బొబ్పాయి, మునగ మొక్కలతో స్నేహ నర్సరీ ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల వాతావరణానికి అనుకూలమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. -
మౌనమేలనోయి.. యువతను వెంటాడుతున్న షైనెస్
కొన్ని సందర్భాల్లో సైలెన్స్ ఎంత ప్రశాంతతనిస్తుందో.. మరికొన్ని సందర్భాల్లో సైలెన్స్..అంత వైలెంట్గా ఉంటుంది.. ఈ విషయం మనలో చాలా మంది గ్రహించే ఉంటాయి. కానీ ప్రస్తుత తరంలోని కొందరు యువత ఇదే సూత్రంగా పాటిస్తున్నారు. కంఠానికి కళ్లెం వేస్తున్నారు. ఎప్పుడూ మౌనంగా కూర్చుంటూ.. ఫోన్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితికి వెళ్లి పోతున్నారు. ఏది చెప్పాలన్నా సైగలతోనూ.. మెసేజ్లు, చాటింగ్ రూపంలోనో తప్ప ఎదురుపడి మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గట్టిగా మాట్లాడితే షైనెస్ ఫీల్ అవుతున్నారు.. ఫోన్ అడిక్షన్ కారణంగా బయటి వారితోనే కాదు.. ఏకంగా ఇంట్లో వారితోనూ మాట్లాడలేని స్థితికి చేరుకుంటున్నారు పలువురు నగరవాసులు. దీంతో గత్యంతరం లేక మానసిక వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి తప్పడం లేదని వాపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఫోన్ అడిక్షన్తో భావప్రకటనకు బ్రేక్ నైపుణ్యాన్ని కోల్పోతున్న నగర యువత ప్రతిదానికీ బిడియపడుతున్న పరిస్థితులు వాట్సాప్ మెసేజ్లు, చాటింగ్తోనే భావప్రకటన కుటుంబ సభ్యులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి మానసిక వైద్యులను సంప్రదిస్తున్న పలువురు వాక్చాతుర్యం ఒక అద్భుతమైన కళ.. మనసులోని భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించేది ‘మాట’ ఒక్కటే. పిల్లలు గలగలా మాట్లాడేస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది. మరికంత మంది తమ వాగ్ధాటితో కట్టిపడేస్తూంటారు. కానీ ఇటీవల కాలంలో మాటలు మౌనం దాల్చుతున్నాయి. మొబైల్ఫోన్ మాయాజాలంలో యువత కొట్టుకుపోతోంది. సూటిగా, స్పష్టంగా మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. నగరంలో ఈ తరహా ‘షైనెస్’ తీవ్ర సమస్యగా మారుతోందని పలువురు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య అనేక మందిని విస్మయానికి గురిచేస్తుంది. డిగ్రీలు, పీజీలు వంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన వాళ్లు కూడా తమ భావాలను స్పష్టంగా వెల్లడించలేకపోతున్నారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను తెలియజేసేందుకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఏది కావాలన్నా వాట్సాప్లోనే.. ‘ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. బీటెక్ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచి్చనా పలుకరించదు. తన లోకం తనదే.. అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు ఏది కావాలన్నా.. తండ్రికి వాట్సాప్లో మెసేజ్ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వారం రోజుల క్రితం హిమాయత్నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురుతో కలిసి మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించారు. అడిక్షన్తో మానసిక సమస్యలు.. ఇంటికి వచ్చిన అతిథులను కనీసం బాగున్నారా.. అని కూడా పలకరించలేని పరిస్థితి. నిజానికి ఇది కేవలం ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు.. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల పరిస్థితి ఇదే.. ఈ తరహా షైనెస్తో బాధపడుతున్నవారు నగరవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇరవై నాలుగు గంటలూ మొబైల్ ఫోన్లకు అతుక్కొనిపోవడం వల్ల..బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నారు. రోజు రోజుకు ఇలాంటి మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఈ ‘షైనస్’ (బిడియం) ఇటీవల కాలంలో ఒక సవాల్గా మారిందని సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు చదువుల్లో ఉన్నత ర్యాంకులు సాధించినప్పటికీ భావప్రకటనా నైపుణ్యంపై మాత్రం పట్టు కోల్పోతున్నారని చెబుతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.పరిష్కార మార్గాలు.. అలాంటి వారితో నిత్యం ఏదో ఒక విషయంపై ఇంట్లో వారు నిరంతరం సంభాషించాలి.ఇరువై నాలుగు గంటలూ ఫోన్కు అతుక్కుపోయి మాట్లాడలేకపోతున్న పిల్లలను గుర్తించడంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావాలి. అలాంటి పిల్లలను నెమ్మదిగా మాటల్లోకి దింపి సంభాషణలను పొడిగించాలి. ఇది ఒక ప్రణాళిక ప్రకారం కొనసాగించాలి. ఆ పిల్లల వాక్చాతుర్యాన్ని, భావప్రకటన నైపుణ్యాన్ని ప్రశంసించాలి. ప్రసంగాలను ప్రోత్సహించాలి. క్రమంగా మొబైల్ అడిక్షన్ను తగ్గించాలి అంటున్నారు మానసిక నిపుణులు. భావప్రకటనను కోల్పోతూ.. ‘ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇతరత్రా సమాజిక మాధ్యమాల్లో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్టు చేస్తారు. కానీ ఆయా వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా విషెస్ కూడా చెప్పలేకపోతున్నారు.’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పిల్లలు ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. యువతలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్ ఫోన్పై ఆధారపడడం, ఏదైనా సందేహం వచి్చన పెద్దలను అడగకుండా గూగుల్ లేదా ఇతర యాప్స్లో సెర్చ్ కొట్టడం తద్వారా వారికి కావాల్సిన సమాచారం తెలుసుకోవడం కూడా ఓ కారణమే. తద్వారా తమలోని భావప్రకటనా నైపుణ్యాన్ని కోల్పోతున్నారని తెలుస్తోంది. నిత్యం ఒంటరిగా ఫోన్తో కాలం గడపడం ద్వారా ఎవరితోనూ పరిచయాలు లేక.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక, ఏదైనా మాట్లాడితే ఏమంటారోననే భయంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. పదేళ్ల నుంచి పాతికేళ్ల వరకూ.. సాధారణంగా పిల్లల మాటలతోనే ఇళ్లల్లో సందడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పదేళ్ల పిల్లల నుంచి పాతికేళ్ల యువత వరకూ ప్రతి ఒక్కరికీ మొబైల్ఫోన్ ఒక్కటే ప్రపంచంగా మారింది. దీంతో ఇంట్లో, బయట ఆ మొబైల్లోనే మునిగిపోతున్నారు. చివరికి రోడ్డుపై నడిచినా, బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణం చేసినా సరే మొబైలే కాలక్షేపం.. దీని కారణంగా ఇతరులతో మాట్లాడే లక్షణాన్ని కోల్పోతున్నారు.. మరీ ముఖ్యంగా తమలోని భావాలను చెప్పేందుకు, పంచుకునేందుకు తీవ్రమైన షైనెస్కు గురవుతున్నారు.‘ఇలాంటి పిల్లలు ఎదుటి వ్యక్తి ముఖంలోకి సూటిగా చూసి స్పష్టంగా మాట్లాడలేరు. ఈ షైనెస్ లక్షణం కారణంగా.. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సాప్లో మెసేజ్ పోస్టు చేయడం అలవాటుగా మారుతోంది.’ అని డాక్టర్ సంహిత చెబుతున్నారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
బోన్ బ్రోత్ బ్రేక్ ఫాస్ట్..! నాజుకైన శరీరాకృతికి బెస్ట్ రెసిపీ..
బాలీవుడ్ నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్ను బ్రేక్ చేసింది. చండీగఢ్కి చెందిన ఆమె ఎమ్టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. అంతేగాదు బాలీవుడ్ బుల్లి తెర షో బిగ్బాస్ పదవ సీజన్లో రన్నరప్గా నిలిచిందామె. 2007లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల మెప్పు పొందింది. అంతేగాదు ఆమె ఫిట్నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్లోనే. ఫిట్నెస్ మోడల్ కూడా. అలాంటి ఆమె అంత అందమైన శరీరాకృతి కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బయటపెట్టింది. అది ఎవ్వరికైనా మంచి శరీరాకృతిని అందివ్వడమే కాదు, చర్మ సౌందర్యానికి మంచిదని చెబుతున్నారామె. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా..!.37 ఏళ బానీ జె కండరాలు, సన్నని శరీరాకృతికి పేరుగాంచిన నటి. కఠిన వ్యాయామ నియమావళి, ఆరోగ్యకరమైన ఆహారానికి పేరుగాంచిన బ్యూటీ ఆమె. ఇటీవల ఓ ఇంటర్యూలో తన ఫిట్నెస్ సీక్రెట్ని పంచుకుంది. తన గ్లామర్ని ఇనుమడింప చేసే రెసిపీని గురించి వెల్లడించింది. తాను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనమే తింటానని, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్గా బోన్ బ్రోత్ తీసుకుంటానని అంటోంది. ఇది చర్మానికి చాలా మంచిదని, కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది. బోన్ బ్రోత్ అంటే..ఏంటీ వింత వంటకం అనుకోకండి. అదేనండి బోన్సూప్. చికెన్ లేదా మటన్ బోన్లను సుగంద్రవ్యాలతో కలిపి బాగా ఉడికించిన రసం లాంటి సూప్నే బోన్ బ్రోత్ అనిపిలుస్తారు. బానీ జె ఉపవాసం విరమించడానికి, ప్రతి ఉదయం దీన్ని తప్పనిసరిగా తీసుకుంటానని, అదే తన చర్మాన్ని సంరక్షణలో తోడ్పడుతుందని అంటోంది. అదీగాక తన శరీరాన్ని స్లిమ్గా కనిపించేలా చూపించడంలో దోహదపడుతుందని కూడా అంటోంది. అతాగే రుచి కోసం ఈ సూప్లో కొన్ని ఇతర కూరగాయలు కూడా జోడిస్తామని అంటున్నారామె. ఫలితంగా ఆ సూప్లో వివిధ ఖనిజాలు, కొల్లెజెన్, అమెనో ఆమ్లాల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతోంది. సేవించేటప్పుడూ పూర్తిగా వడకట్టి తీసుకుంటానని చెబుతోంది ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు బానీ జె. అంతేగాదు ఆమె తరుచుగా తన వ్యాయామా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఆమె దాదాపు 80 కిలల బరువులు ఎత్తడం నుంచి మొదలు పెట్టి 150 కిలోల బరువులు వరకు ఎత్తుతారామె. కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఆహారాలు పెద్ద మార్పునే తీసుకొస్తాయనడానికి ఈ నటి తీసుకునే బ్రేక్ఫాస్ట్నే ఉదాహారణ. అందుకే శరీరానికి సరిపడేది ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో భాగం చేసుకుని మరింత సురక్షితంగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.(చదవండి: హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..) -
తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ
ఇంటి పెద్దనే కొల్పోతే ఆ కుటుంబం ఓ పెద్ద కుదుపుకులోనై కోలుకోవడం అంత సులభం కాదు. ఆదుకునే వాళ్లు ఉంటే పర్లేదు, బరువు అనుకుంటే ఆ కుటుంబ ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతూ నరకం చవిచూస్తుంది. అలాంటి సమయంలో స్థిరమైన తెగువతో పోరాడే వాళ్లే..యావత్తు ప్రపంచం తమవైపుకి తిప్పుకునేలా సక్సెస్ని అందుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుంది ఈ సాఫ్ట్వేర్ ఇంజీనర్. ఆమె సక్సెస్స్టోరీ ఆర్థిక ఇబ్బందులతో గెలుపుని అందుకోలేకపోతున్నామని సతమతమై యువతకు ఆదర్శం. నెట్టింట ఈ టెక్కీ స్టోరీ వైరల్గా మారింది. రెడ్ఇట్లో వ్యవసాయ కుటుంబ నేపథ్యానికి చెందని ఓ యువతి తాను టెక్నాలజీ రంగంవైపు అడుగులు వేసి ఎలా గొప్ప సక్సెస్ని అందుకుందో నెట్టింట షేర్చేసుకుంది. సుమారు వంద కుటుంబాలు ఉండే ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తాను టీనేజ్ వయసులోనే తండ్రిని కోల్పోయానంటూ మర్చిపోలేని నాటి ఆవేదనను గుర్తుచేసుకుంది. తన తండ్రి ఒక రైతుగా అవిశ్రాంతంగా పనిచేసేవాడని, ఉన్నటుండి వచ్చి పడిన అనారోగ్యం ఆయన్ను మింగేసిందంటూ తనకు కన్నీళ్లు మిగిల్చిన నాటి విషాదం గురించి చెప్పుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుమట్టాయని, మరోవైపు బంధువులు తమను దూరం పెడుతూ ఎంత మానసిక ఆవేదన కలిగించారో చెప్పుకొచ్చింది. డబ్బుంటేనే బాంధవ్యాలని గ్రహించేలోపే కళ్లముందు అంతా చీకటి, ఈ సమస్య నుంచి గట్టేక్కుతామో లేదో తెలియని పరిస్థితి..ఆ సమయంలో తనకు చదువే వీటన్నింటికి పరిష్కారమని ప్రగాఢంగా నమ్మింది. ఎంతటి ఆర్థిక పరస్థితుల్లోనూ కూడా చదవడం ఆపలేదు, పైగా పాఠశాల నుంచి కాలేజీ వరకు అన్నింట్లోనూ టాపర్గా నిలింది. అలా ఆమె కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేరయ్యి వందలోపు ర్యాంక్ సాధించింది. ఆ నేపథ్యంలోనే ఆమెకు బెంగళూరులోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందే ఛాన్స్ అందుకుంది. అదే ఆమె జీవితాన్ని పెద్ద యూటర్న్ తీసుకునేలాచేసింది. ఓ పక్క పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు తన లక్ష్యాన్ని మరింతగా పెంచేశాయి.పట్టుదలతో ఈ ఆర్థికకష్టాలకు చెక్పెట్టేలా మంచి కెరీర్ని ఏర్పరచుకునేలా సన్నద్ధమైంది. అలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టి..సుమారు ఆరు ఏళ్ల నిర్విరామ కృషితో..దాదాపు రూ. 80 లక్షల వార్షిక ప్యాకేజ్ని అందుకుని అందరినీ విస్తుపోయేఆల చేసింది. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకునే స్థాయికి చేరుకోవడం గురించి ఆలోచిస్తే చాలా గర్వంగా అనిపిస్తోందంటూ ఆనందం వ్యక్తం చేసింది. అమూల్యమైన మాటలు..తండ్రి లేకపోవడం అనేది పూడ్చుకోలేని బాధ అయినా..తాను సాధించిన ఈ విజయాన్ని తన తండ్రి ఎక్కడ నుంచే చూస్తూనే ఉంటాడని, ఆనందపడతానని నమ్ముతానని అంటోందామె. అలాగే తనలాంటి కష్టాలు అనుభవించే వాళ్లేందరో ఉన్నారని, వారందరూ కష్టాలను దురదృష్టంగా చూడకపోతే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని అంటోంది. ఎప్పుడైనా చుట్టుముట్టే కష్టాలు, కన్నీళ్లు ఎన్నింటినో నేర్పించడమే కాదు.. లక్ష్యంపై ఫోకస్ని చెదరిపోనీవ్వకుండా చేసే సోపానాలని అంటుంది. చూసే దృక్పథం మీదే సక్సెస్ అదృష్టం ఆధారపడి ఉంటుందని చెబుతోంది. బాధలు ఎప్పుడు బరువు కాదు బాధ్యతగా వ్యవహరించడం నేర్పిస్తాయి, బలోపేతంగా ఉండటం ఎలానో తెలియజేస్తాయని చెబుతోంది. అందుకు కావాల్సింది ఓర్చుకునే సహనం, పట్టుదల అని, అవే అసలైన ఐశ్వర్యాలని మరవకండి అంటూ పోస్ట్ని ముగించింది. నెటిజన్లు సైతం అద్భుతం మీ విజయం అంటూ ఆ టెక్కీని ప్రశంసించారు. అంతేగాదు మరోనెటిజన్ తాను కూడా అలానే కష్టపడి చదివి పైకొచ్చానని, మీ సక్సెని ఇక్కడితో ఆపోద్దు, ఈ ప్రపంచం నీదే అని ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: 'రిచ్'..రుచి! ఇడ్లీ రూ.1200, చాక్లెట్ రూ.1800) -
'రిచ్'..రుచి! ఇడ్లీ రూ.1200, చాక్లెట్ రూ.1800
ఇరానీ చాయ్, కబాబ్లు, బిర్యానీలకు సిటీ ప్రసిద్ధి చెంది ఉండవచ్చు.. కానీ ఇప్పుడు ఖరీదైన రుచులకూ కేరాఫ్గా మారుతోంది. తమ దగ్గర ఉన్న విలాస విందు గురించి రెస్టారెంట్స్, తాము రుచిచేసిన కాస్ట్లీ ఫుడ్ గురించి నగరవాసులు సోషల్ వేదికలపై పంచుకుంటూ రిచ్ రుచుల వెల్లువకు కారణమవుతున్నారు. ఫలితంగా బంగారంతో చుట్టిన ఇడ్లీలు, రాజకుటుంబానికి సరిపోయేంత పెద్ద పళ్లెంలో విందులకు కూడా నగరం పేరొందుతోంది. అనేక మందికి ఇదో ఖరీదైన రుచికరమైన యాత్ర. ఈ వంటకాలు కేవలం భోజనం మాత్రమే కాదు, అవి జ్ఞాపకాల్లో ఒదిగిపోయే అనుభవాలు కూడా అంటున్నారు ఫుడ్ లవర్స్. ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి తినడం.. ఇప్పుడు అభిరుచులు నెరవేర్చుకోవడానికి తినడం దాకా పరిణామం చెందింది. ఆకలికి హద్దు ఉంటుందేమో కానీ అభిరుచులకు ఉండదు కదా.. అలాగే ఇప్పుడు ఆహార అభిరుచులు కూడా కొత్త పుంతలు కాస్ట్లీ వింతలుగా మారుతున్నాయి. ఈ సోషల్ మీడియా యుగంలో తినడం మాత్రమే కాదు ఆనందించడం.. ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవడం కూడా అలవాటైంది. ఇన్స్టాలో పోస్ట్ చేయాలంటే ఇరానీ చాయ్ సరిపోదు.. ఇడ్లీ రూ.1200 ఉండాల్సిందే అనేది సిటీ సోషల్‘ఇçషు్టల’ మాట బాట. అలాంటి వారి కోసం నగరంలోని పలు రెస్టారెంట్స్, కేఫ్స్, ఐస్క్రీమ్ పార్లర్స్.. వైవిధ్య భరితంగా అదే సమయంలో అత్యంత విలాసవంతమైన రుచులను అందిస్తున్నాయి. అలాంటి కాస్ట్లీ వంటకాల్లో కొన్నింటి విశేషాలు.. బంజారాహిల్స్లోని లెవాంట్ రెస్టారెంట్లో ఉన్న మషావి ముషాకల్ ప్లేట్ ధర: రూ.3,300.. నగరంలో ఫైవ్స్టార్ హోటల్స్ను మినహాయిస్తే.. రెస్టారెంట్స్లోని ఖరీదైన ప్లేట్ ఇదే. దీనిలో వడ్డించే మిడిల్ ఈస్టర్న్ విందు మాంసం ప్రియులను చవులూరిస్తుంది. బాషా షీష్, అదానా కబాబ్, లాంబ్ చుకాఫ్, బాల్కా షీష్, లెవాంట్ జాయేనా.. గ్రిల్ చేసి స్టైల్గా వడ్డిస్తారు. ఇది రోజంతా తినాల్సిన భోజనాన్ని సులభంగా భర్తీ చేయగలదు. ఐటీసీ కోహినూర్లో అందించే హైదరాబాదీ బిర్యానీ దమ్ పుఖ్త్ బేగం ధర రూ.2500. ప్రీమియం కుంకుమ పువ్వు, సువాసనగల బాస్మతి బియ్యం లేత మాంసంతో మేళవించి వండుతారు. ఈ బిర్యానీ ఒక హ్యాండిలో అందంగా కనిపిస్తుంది. బంజారాహిల్స్ లోని కృష్ణ ఇడ్లీని 24–క్యారెట్ గోల్డ్ ఇడ్లీగా పేర్కొంటారు. ఈ ఇడ్లీ ప్లేట్ ధర: రూ.1200 ఇది దక్షిణ భారతదేశంలోని పేరొందిన అల్పాహారం.. రెండు మృదువైన ఇడ్లీలు తినదగిన బంగారు ఆకులతో కప్పబడి, గులాబీ రేకులను చల్లి, సాంబార్ చట్నీలతో వడ్డిస్తారు. బహుశా ఇడ్లీని ఇంత అందంగా ఎప్పుడూ చూసి ఉండరు. బంజారాహిల్స్, హిమాయత్నగర్లలోని హుబెర్ – హోలీ అందించే మైటీ మిడాస్ గోల్డ్ ఐస్ క్రీం ధర: రూ.1200. ఇది కేవలం డెజర్ట్ కాదు, ట్రెజర్ అని చెప్పొచ్చు. బెల్జియన్ చాక్లెట్, ప్రాలైన్ బాదం, మాకరూన్లు, చాక్లెట్ నిండిన బాల్స్. 24 క్యారెట్ తినదగిన బంగారు ఆకులో చుట్టబడిన చాక్లెట్ బార్తో తయారైంది. ఇది ఆర్డర్ ఇచ్చాక స్వీకరించడానికి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. బంజారాహిల్స్లోని రోస్ట్ సిసిఎక్స్లో యానిమేటెడ్ చాక్లెట్ అందుబాటులో ఉంది. దీని ధర: రూ.1800 ప్లస్ పన్నులు అదనం. ఈ షోటాపర్ డెజర్ట్, అందమైన జంతువులు లేదా కార్టూన్ పాత్రలుగా మలిచారు. నగరంలోని అత్యంత అందమైన అత్యంత ప్రీమియం డెజర్ట్లలో ఒకటిగా పేరొందింది.నగరంలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్, ది వెస్టిన్లోని ప్రీగో అత్యంత ఖరీదైన బిర్యానీలను అందిస్తాయని సమాచారం. ధరలపై స్పష్టత లేనప్పటికీ అక్కడ బిర్యానీల ధర రూ.6వేల వరకూ ఉంటుందని తెలుస్తోంది బంజారాహిల్స్లోని హౌస్ ఆఫ్ దోసె, నగరంలోనే అత్యంత ఖరీదైన దోసెను అందుబాటులోకి తెచి్చంది. దీని ధర సుమారు రూ.1000 పైనే ఉంది. అయితే ఇది ఆర్డర్పై మాత్రమే అందిస్తారు. దీని తయారీలో తినదగిన బంగారు పూత, వేయించిన జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యి చట్నీలు లభ్యత: కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే తయారు చేస్తారు. గింజలు నెయ్యితో వస్తుంది. ఈ బంగారు దోసె ఆహార ప్రియులకు, వారాంతాల్లో ఆకర్షణగా మారింది. (చదవండి: ప్లాంట్స్.. దోమలకు చెక్..!) -
ప్లాంట్స్.. దోమలకు చెక్..!
విష జ్వరాలు, డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్గున్యా వంటి ఎన్నో రకాల వ్యాధులు దోమ కాటుతో వస్తాయి. దోమ కాటు వేసిందా ఎంతటి వారైనా మంచాన పడాల్సిందే. మరి అలాంటి దోమల నివారణకు ఎవరో వచ్చి దోమల మందు పిచికారీ చేస్తారని ఎదురు చూడకుండా ఇంటి పెరట్లోనో, బాల్కనీల్లోనో చిన్న కుండీల్లో ఈ మొక్కలను పెంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి ఒక్క దోమల నివారణకే కాకుండా వంటింటికీ ఉపయోగపడతాయని అంటున్నారు. రసాయన లిక్విడ్లకు బదులుగా సహజ సిద్ధంగా దోమల నివారణ ఆరోగ్యం, పర్యావరణానికి మంచిదని బోటనీ ప్రొఫెసర్ దిలీప్ చెబుతున్నారు. మొక్కలు పెంచే సమయంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. పాత కాలంలో ఇంటి ఆవరణలో తులసి మొక్కకు పూజలు చేసేవారు. ఉదయం లేచి స్నానం చేసి, తులసి గుండం వద్ద దీపం వెలిగించేవాళ్లు. అది ఆధ్యాత్మికంగా, అందులో ఔషధ గుణాలు ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మొక్కల ఆకుల వాసనతో దోమలు దూరమవుతాయట. వంటింట్లో మనకు నిత్యం కనిపించే పుదీనా ఆకు ఘాటైన వాసనలకు దోమలు దూరమవుతాయట. పుదీనా పెంచుకుంటే ఒక వైపు దోమల నివారణ, మరో వైపు వంటకు అవసరమైన పుదీనా ఆకు సొంతంగా పెంచుకున్నట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్ అందుబాటులో ఉంటాయి. నిమ్మ గడ్డి వాసనకు దోమలు దూరం కావడంతో పాటు వంటల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. సిట్రోనెల్లా గడ్డిలో సిట్రోనెల్లాల్, సిట్రోనెల్లోల్, జెరానియోల్ కలిసి ఉంటాయి. ఇది ఘాటైన వాసనలను వెదజల్లుతుంది. ఈ వాసనకు దోమలు తరలిపోతాయి. రోజ్మెరీ కొమ్మలను కాల్చినా, నూనె వాడినా దోమలు దూరమవుతాయి. కుప్ప చెట్టు రసాయనాల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఇంట్లో లావెండర్, బంతి మొక్కలు పెంచుకుంటే వాటి పువ్వులు సువాసనలు వెదజల్లుతాయి. కలర్ఫుల్గా ఉండే పువ్వులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రిలాక్స్గా అనిపిస్తుంది. వీటిలో లినాలూల్, కర్పూరం సమ్మేళనాలు ఉంటాయి. వీటి సువాసన, నూనె దోమలను తరిమేస్తుంది. (చదవండి: మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..) -
కండక్టర్ కమ్ బుక్ కలెక్టర్ స్టోరీ..!
‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అన్న కందుకూరి వీరేశలింగం మాటను నిజం చేశాడు కర్ణాటక, హరెలహళ్లికి చెందిన అంకే గౌడ. ఇప్పుడతని వయసు 75 ఏళ్లు. పుస్తకాలను కొని చదివి, భద్రం చేసే పనిని తన 20వ ఏట మొదలుపెట్టాడు. ఇప్పటివరకు పోగైన రెండు కోట్ల పుస్తకాలతో ‘బుక్ మానే (బుక్ హౌజ్)’ పేరుతో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసి.. దాన్నే తన నివాసంగా మలుచుకున్నాడు. కండక్టర్.. బుక్ కలెక్టర్అంకే గౌడ్ ఓ వైపు కన్నడ సాహిత్యంలో పీజీ చదువుతూనే మరో వైపు బస్ కండక్టర్గా ఉద్యోగంలో చేరాడు. చిన్నప్పటి నుంచీ పుస్తకం పఠనం మీద ఆసక్తి మెండు. దానికి కాలేజీలో తన ప్రొఫెసర్ అనంతరాము ప్రభావం, స్ఫూర్తీ తోడవడంతో పుస్తకాలను కొనడమూ మొదలుపెట్టాడు. కండక్టర్గా తనకొచ్చే జీతంలో ముప్పావుభాగం పుస్తకాల కొనుగోలు మీదే వెచ్చించేవాడు. పెళ్లయి, పిల్లాడు పుట్టి బాధ్యతలు పెరిగినా ఇంటి ఖర్చులను తగ్గించుకునేవాడు కానీ పుస్తకాల బడ్జెట్లో కోత పెట్టేవాడు కాదు. అతని ఆ ఆసక్తిని, అలవాటును సహధర్మచారిణి విజయలక్ష్మి గౌరవించి.. ఉన్నదాంట్లోనే పొదుపుగా సంసారం చేయసాగింది. చివరకు తనకు నచ్చిన, లోకం మెచ్చిన పుస్తకాలను కొనడానికి అంకే గౌడ .. మైసూరులోని తమ ఇంటిని అమ్మినా మారుమాట్లాడకుండా భర్తను అనుసరించింది ఆమె. ప్రస్తుతం ‘బుక్ మానే’లోనే ఓ మూల ఆ కుటుంబం నివాసముంటోంది. అందరికీ ఉచితం1832 నాటి రాతప్రతులు సహా దేశ, విదేశీ భాషలన్నిటిలోని అరుదైన సాహిత్యం అంకే గౌడ ‘బుక్ మానే’లో కనిపిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, మైథాలజీ, ఫిలాసఫీలకు సంబంధించిన పుస్తకాలూ దొరుకుతాయి. ఈ లైబ్రరీకి ఎవరైనా వెళ్లి కావల్సిన పుస్తకాలను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ప్రవేశ రుసుము కానీ, పుస్తకానికి అద్దె కానీ లేదు. పూర్తిగా ఉచితం. బడి పిల్లలు, రీసెర్చ్ స్కాలర్స్, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్నవాళ్లు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఈ లైబ్రరీకి రెగ్యులర్ విజిటర్స్. పర్యాటకుల గురించైతే విడిగా చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో ‘బుక్ మానే’ను చూడ్డానికి వస్తూంటారు. ‘పుస్తక పఠనం మీద ఆసక్తి, జ్ఞానతృష్ణ ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమకు కావల్సింది చదువుకోగలిగేలా ఈ లైబ్రరీని మలచాలి.. ఓ నాలెడ్జ్ హబ్గా మార్చాలన్నదే నా కల, భవిష్యత్ లక్ష్యం’ అంటాడు అంకే గౌడ. (చదవండి: సరదా సరదా దొంగతనాలు: క్లెప్టోమేనియా!) -
అంధుల T20లో వైజాగ్ అమ్మాయి
‘నాకు బాల్ కనపడదు. కాని నా మైండ్తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’ అంటోంది విశాఖ అంధబాలిక పాంగి కరుణ కుమారి. పదో తరగతి చదువుతున్న కరుణ బ్యాటింగ్లో దిట్ట. అందుకే నవంబర్ 11న ఢిల్లీలో తొలిసారి నిర్వహించనున్న అంధుల టి20 వరల్డ్ కప్కి భారత జట్టులో ఎంపికైంది. తెలుగువారు సంతోషపడాల్సిన సందర్భం ఇది. స్ఫూర్తినిస్తున్న కరుణ కుమారి పరిచయం.స్కూలు పుస్తకాల్లో అక్షరాలు కనపడటం లేదని చదువు మానేసి ఇంట్లో కూచున్న అమ్మాయి నేడు భారత దేశ అంధ మహిళల క్రికెట్ జట్టులో స్థానం సం పాదించింది. ఆ అమ్మాయి పాంగి కరుణకుమారి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన అరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఢిల్లీలో నవంబర్ 11 నుంచి జరగనున్న అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో ఆమె భారత్ తరఫున ఆడనుంది. అంధ మహిళల కోసం టి20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ప్రథమం.ఆమె ఆల్రౌండర్వంట్ల మామిడిలో కూలినాలి చేసుకునే రాంబాబు, సంధ్యల మొదటి కుమార్తె కరుణ పుట్టుకతోనే దృష్టిలోపంతో పుట్టింది. ఒక కన్ను కొద్దిగా మరో కన్ను పూర్తిగా కనిపించేది కాదు. ఏడవ తరగతి వచ్చేసరికి చూపు దాదాపుగా పోవడంతో చదువు మానేసి ఇంట్లో కూచుంది. అయితే చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండేది. ఫోన్లో క్రికెట్ చూసేది. ఈ విషయం తెలిసి అంధ బాలికలను వెతికి చదివించే బాధ్యతతో విశాఖ అంధ బాలిక ఆశ్రమ పాఠశాల వారు కరుణ తల్లిదండ్రులను ఒప్పించి తమ స్కూల్లో చేర్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల అక్కడ కరుణ తిరిగి చదువులో, ఆటల్లో పడింది. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పీటీ మేడమ్ కరుణనుత్సహించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. మూడింటిలో ప్రతిభ చూపుతూ ఆల్రౌండర్గా ఎదిగింది కరుణ. నేషనల్ సెలక్షన్స్లో భాగంగా 2023లో హైదరాబాద్లో, 2024లో హుగ్లీలో, 2025లో కొచ్చిలో మేచెస్ ఆడింది. సెలెక్టర్ల దృష్టిలో పడింది.60 బాల్స్లో 100 పరుగులుఅంధ మహిళల టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో 20 రోజుల క్యాంప్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్లో కరుణ 60 బంతుల్లో 100 పరుగులు చేయడమే కాక 114 నాటౌట్గా నిలిచింది. బౌలింగ్లో, ఫీల్డింగ్లో కూడా ప్రతిభ చూపింది. దాంతో భారత జట్టుకు కరుణను సెలెక్ట్ చేశారు. ‘నాకు బాల్ కనపడదు. కాని దాని రాకను పసిగట్టగలను. బాల్ రాకను అర్థం చేసుకోలేనప్పుడు అది ఒంటికి తగిలి దెబ్బలయ్యేవి’ అని తెలిపింది కరుణ. ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. ఇన్ని ప్రతికూలతల్లోనూ ప్రతిభ చూపుతోంది కరుణ.ఆరు దేశాలతో...అంధ మహిళల టి20 వరల్డ్ కప్లో మొత్తం ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో మ్యాచ్లు జరుగుతాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, నే పాల్, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కలిసి 21 లీగ్ మేచ్లు, 2 సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ను ఆడనున్నారు. ఈ వరల్డ్ కప్లో మన దేశం కప్పు గెలవాలని, మన కరుణ గొప్ప ప్రతిభ చూ పాలని కోరుకుందాం. -
సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని థార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..) -
పేరెంటింగ్ విషయంలో బీకేర్ఫుల్..! ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..
పిల్లలు ప్రవర్తనా తీరు వల్లే వాళ్ల తల్లిందండ్రులకు గుర్తింపు లేదా అవమానం అనేవి రావడం జరుగుతాయి. అందుకే పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలని అంటుంటారు. వాళ్లు గనుక ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఊహకందని ఘనకార్యం చేసి వస్తే..ఇక తల్లిదండ్రులకు చీవాట్లు, అవమానాలు తప్పవు. అంతవరకు అయితే పర్లేదు, వారి కారణంగా కోర్టులపాలై, కోట్ల కొద్ది జరిమానాలు ఎదుర్కొంటే ఆ తల్లిదండ్రులకు కనడమే నేరంగా మారుతుంది. అలాంటి దురదృష్టకర ఘటనే పాపం ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిందండ్రులకు ఎదురైంది.అసలేం జరిగిందంటే..ఆ యువకులను చూస్తే..అబ్బా ఇలాంటి పుత్రులు పగవాడికి కూడా వద్దు అని అస్యహించుకునేంత దారుణానికి ఒడిగట్టారు ఆ ఇద్దరు. వాళ్లు చేసిన పని వింటే ఎవ్వరికైనా చిర్రెత్తికొచ్చి తిట్టిపోసేలా ఉంది. ఈ ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. అక్కడ ప్రసిద్ద హైడిలావ్ హాట్పాట్ రెస్టారెంట్లో టాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు 17 ఏళ్ల యువకులు మద్యం తాగి ఆ మత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించారు. సమీపంలోని టైబుల్ ఎక్కి సంప్రాదాయ చైనీస్ హాట్పాట్ శైలిలో మాంసం, కూరగాయలు వండటానికి ఉపయోగించే కమ్యూనల్ సూప్లో మూత్రం పోశారు. ఆ ఇరువురు ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 24, 2025న ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్లో జరిగింది. అయితే ఆ కలుషితమైన రసాన్ని కస్టమర్లు సేవించినట్లు ఆధారాలు లేవు. అందుకుగానూ సదరు బ్రాంచ్ హైడిలావ్ రెస్టారెంట్ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి మార్చి 8లోపు సందర్శించిన దాదాపు నాలుగువేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. అంతేగాదు ఈ ఘటనకు పరిహారం కావాలంటూ సదరు రెస్టారెంట్ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన కారణంగా తమ రెస్టారెంట్ పరవు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది, పైగా కస్లమర్ల నమ్మకానికి భంగం కలిగేలా చోటు చేసుకుందని అందుకుగానూ తమకు సుమారు రూ. 28 కోట్లు దాక నష్ట పరిహారం చెల్లించాలని కోరింది. ఈ కేసుని విచారించిన షాంఘై కోర్టు..ఇది అవమానకరమైన చర్యగా పేర్కొంటూ..టేబుల్వేర్ని కలుషితం చేయడమే గాక ప్రజలకు కూడా అసౌకర్యం కల్పించారంటూ మండిపడింది. ఈ టీనేజర్లు ఇద్దరు సదరు రెస్టారెంట్ ఆస్తిహక్కులు, ప్రతిష్టను ఉల్లంఘించారని పేర్కొంది. అంతేగాదు ఈ టీనేజర్ల తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ బాధ్యతల్లో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది. అందుకుగానూ ఆ పేరెంట్స్ని సందరు రెస్టారెంట్కి రూ. 2 కోట్లుదాక నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరిచ్చింది. అలాగే ఆ టీనేజర్ల తల్లిదండ్రులు సదరు రెస్టారెంట్కి బహిరంగంగా క్షమాపణుల కోరుతూ.. వార్తపత్రికలో ప్రచురించాలని కూడా ఆదేశించింది. అందుకేనేమో మొక్కై వంగనిది.. మానై వంగునా అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే సరిగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే వాళ్లు చేసే ఘనకార్యలకు ఫలితం అనుభవించక తప్పదు. పేరెంటింగ్ విషయంలో ప్రతి తలిందండ్రులు చాలా కేర్ఫుల్గా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: రండి.. ఫొటో దిగుదాం’) -
‘రండి.. ఫొటో దిగుదాం’
అది తెలంగాణ రాష్ట్రంలోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లోని మొదటి అంతస్తు.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతం.. అమీర్పేట నుంచి అక్కడకు రీలోకేట్ అయిన పాస్పోర్టు సేవా కేంద్రం (పీఎస్కే) ప్రారంభమైంది. కేంద్ర విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలో (ఎంఈఏ) సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న చీఫ్ పాస్పోర్టు ఆఫీసర్ డాక్టర్ కేజే శ్రీనివాస ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫొటో సెషన్ నడిచింది. పాస్పోర్టు కార్యాలయం, పీఎస్కే ఉద్యోగులు, అతిథులు ఆయనతో ఫొటోలు దిగారు. టోలిచౌకి నుంచి రాయదుర్గానికి రీలోకేట్ అయిన పీఎస్కేను ప్రారంభించాల్సి ఉంది. అందరూ అక్కడకు వెళ్లే హడావుడిలో ఉండగా.. ‘రండి ఫొటో దిగుదాం’ అనే మాట శ్రీనివాస నోటి వెంట వచి్చంది. అక్కడ ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహా్వనించిన ఆయన రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ స్నేహజ జోన్నలగడ్డతో కలిసి ఫొటోలు దిగారు. ‘మా కేంద్రాలు సజావుగా నిర్వహించడానికి మీరూ కీలకమే’ అంటూ ఆ పారిశుద్ధ్య, సెక్యూరిటీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని చూసి అక్కడి వాళ్లంతా అవాక్కయ్యారు.ఎవరీ శ్రీనివాస? బెంగళూరుకు చెందిన కోటేహాల్ జయదేవప్ప శ్రీనివాస మైసూర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసించారు. 2002 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. బెంగళూరులోని రీజనల్ పాస్పోర్టు కార్యాలయం నుంచి పాస్పోర్టు పొందడానికి శ్రీనివాస 1997లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో దాని కోసం ఉదయం 5 గంటలకే ఆర్పీఓ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అన్ని వెరిఫికేషన్లు పూర్తయి, పాస్పోర్టు పొందడానికి 60 రోజులు వేచి ఉన్నారు.ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న శ్రీనివాస తాను ఐఎఫ్ఎస్ అధికారి అయిన తర్వాత పాస్పోర్టు జారీలో సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలకీ మొబైల్ పాస్పోర్టు సేవా వ్యాన్లు మొదలు చిఫ్ బేస్ట్ ఈ–పాస్పోర్టుకు రూపం ఇవ్వడంలోనూ పాత్ర కీలక పాత్ర వహించారు.. (చదవండి: ఓవైపు అసిస్టెంట్ కమిషనర్గా..మరోవైపు కళాకారిణిగా..) -
ఓవైపు అసిస్టెంట్ కమిషనర్గా..మరోవైపు కళాకారిణిగా..
నృత్యం ఓ తపస్సు.. ఇందులో రాణించాలంటే.. ఏదో నేర్చుకున్నామంటే సరిపోదు.. ఓ యజ్ఞంలా నిత్యం సాధన చేయాలి.. అలాంటి ఓ గొప్ప కళపై ఆమె ప్రాణం పెట్టేశారు. ఎంతలా అంటే.. ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యసించేంతలా. ఆమె ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇన్చార్జ్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న వెంట్రప్రగడ వాణి భవాని. ఓ వైపు అధికారిగా, మరోవైపు కళాకారిణిగా, గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తన అడుగుజాడలనే అనుసరిస్తూ చిన్న వయసులోనే నృత్యంలో ప్రతిభ చూపుతున్న తన కుమార్తెకు కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు.. వివిధ కళారూపాల సమాహారం నృత్యం. సంగీతం, సాహిత్యం, మానసిక శాస్త్రం ఇలా అనేక కళలు కలిస్తేనే నృత్యం. అలాంటి కళతో నాకు బాల్యంలోనే పరిచయం ఏర్పడింది. క్రమంగా నా జీవితంతో పెనవేసుకుపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాభ్యాసం సమయంలో డాన్స్ క్లాస్ ఉండేది. టీచర్లు కూడా ప్రోత్సహించేవారు. అప్పటినుంచే నృత్యం పట్ల మక్కువ ఏర్పడింది. భక్తి శ్రద్ధలతో ఎలాగైనా ఈ కళలో మాస్టర్ కావాలని సంకల్పించా. దీనికి కళాతపస్వి కె.విశ్వనాథ్ ‘స్వర్ణ కమలం’ మరింత స్ఫూర్తినిచ్చింది. చివరికి ఆయన సమక్షంలోనే అరంగేట్రం పూర్తిచేశా.ఆరంభం ఇలా.. ఇంటర్ కోసం హైదరాబాద్ వచ్చాం. నల్లకుంటలోని అమ్మమ్మ ఇంట్లో ఉండే వాళ్లం. అక్కడ సుప్రసిద్ధ నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గర చేరాను. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నాన్నగారు హఠాత్తుగా మరణించారు. దీంతో కారుణ్య నియామకంలో ఆయన ఉద్యోగం ఇచ్చారు. కరీంనగర్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దీంతో నృత్యాభ్యాసం ఆగిపోయే పరిస్థితి. ఎలాగైనా కొనసాగించాలన్న నా సంకల్పానికి అమ్మ, సోదరి అండగా నిలిచారు. నాట్య గురువు ప్రోత్సాహంతో వారంతాల్లో 160 కిలోమీటర్లు ప్రయాణించి అభ్యాసం పూర్తిచేశా. ఇప్పటి వరకూ 75 కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందా. నా భర్త భరణి, అత్తగారింటి సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. నా కుమార్తె అనన్య సైతం నాట్య గురువు మద్దాలి ఉషా గాయత్రి దగ్గరే శిక్షణ పొందుతోంది.ఏకాగ్రత పెరుగుతుంది..ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. పర్యావరణ పరిరక్షణ, నాట్యం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నా. నృత్యం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి.. ఇది కదలికల ద్వారా చేసే ధ్యానం లాంటిది. అర్థంతో, లయతో కదలికలను సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో భంగిమలను సరిగ్గా ప్రదర్శించగలగాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. సంప్రదాయ నృత్యం రూపకల్పనలో కుడివైపు, ఎడమవైపు కదలికలు ఉంటాయి. దీనివల్ల మెదడులోని ఇరు భాగాలనూ సమానంగా ఉపయోగించే సామర్థ్యం కలుగుతుంది. దుస్తులు, ఆభరణాలు, మేకప్, రంగాలంకరణతో సహా నృత్యంలో అనేక అంశాలుంటాయి. దీనికి ఎంతో ఓపిక అవకసం. నేటి తరం పిలల్లోని అసహనాన్ని నృత్యాభ్యాసం నివారిస్తుంది. గురువులకు ఇచ్చే గౌరవం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని, పక్షులను కాపాడటం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా. (చదవండి: మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..) -
మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..
ఓ మైపు మాన్సూన్ సీజన్ ముగింపు దశకు చేరుకొంది. దీంతో పాటు ట్రెక్కింగ్ సీజన్ మొదలవుతోంది.. ప్రస్తుత వాతావరణం ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉండడంతో నగరంలోని ఔత్సాహికుల్లో జోష్ నెలకొంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో యువత ట్రెక్ పాయింట్లలో, పలు పర్యాటక ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో కనువిందు చేసే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్వతాలు, లోయలు, జలపాతాలకు బ్యాక్ప్యాక్తో పయనమవుతున్నారు. రుతుపవనాలు ముగింపు సీజన్లో ట్రెక్కింగ్ ట్రెండ్ పీక్స్కు చేరుతుంది. దీంతో నగరం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని ట్రెక్ పాయింట్లకు నగర పర్యాటకుల సందడి మొదలైంది. వర్షాలు పర్వతాలపై అద్భుతమైన పచ్చదనాన్ని పరుస్తాయి. మరోవైపు పర్వతాలపై నుంచి ఎగసిపడే జలపాతాలు ప్రకృతి సోయగాన్ని రెట్టింపు చేస్తాయి. పచ్చని లోయలు, కొండ ఉపరితలాలపై పొగమంచు దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. పచి్చకబయళ్ళు, పూలతో నిండిన గుట్టలు ట్రెక్కింగ్కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వీటన్నింటి మధ్య నడుస్తూ చిరు చినుకుల్లో తడుస్తూ మధురానుభూతులను పోగు చేసుకోడానికి ట్రెక్కర్స్ ఉత్సాహం చూపుతుంటారు. మన సిటీకి.. ‘మహా’ ఇష్టం.. మహారాష్ట్రలోని పలు ట్రెక్ పాయింట్స్ నగరవాసులకు ఇష్టమైన జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా లోనావాలాలోని రాజ్మాచీ ట్రెక్ ఒకటి. మబ్బులు, లోయలు, జలపాతాలతో ఈ ట్రెక్ ఆద్యంతం అలరిస్తుంది. అలాగే అహ్మద్నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర ఘడ్ ట్రెక్ కూడా నగర ట్రెక్ కమ్యూనిటీలో బాగా పాపులర్. పశ్చిమ కనుమల్లోని పురాతన కొండపై కోటకు నడకమార్గం ప్రకృతి ప్రేమికులతో పాటు సాహసికులకు కూడా ఇష్టమైన రూట్. గుహలు, కోట అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యం కూడా దీని సొంతం. ప్రారంభకులకు అనుకూలమైనది. అదే విధంగా టోర్నా.. ఫోర్ట్ ట్రెక్ కూడా మరో క్రేజీ ట్రెక్. టోర్నా ఫోర్ట్ ట్రెక్ లేదా ప్రచండగడ్, పుణె సమీపంలో ఒక రోజు ట్రెక్, ఇది 4,603 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరానికి 2–3 కి.మీ (ఒక వైపు) ట్రైల్తో సవాలుతో కూడుకున్న ట్రెక్. ఛత్రపతి శివాజీ మహరాజ్ మొదటి కోటగా చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ సీజన్లో ఫ్లవర్ బెడ్స్తో చక్కని దృశ్యాలను అందిస్తుంది. ట్రెక్ చకచకా..గో కర్ణాటక.. ట్రెక్కర్స్కు కలల ప్రదేశం కర్నాటకలోని చిక్ మగళూరులోని కుద్రేముఖ్ ట్రెక్. సుమారుగా 19–21 కి.మీ (రౌండ్ ట్రిప్) దూరం ఉండే ఈ ట్రెక్, కాస్తంత అనుభవం ఉన్న ట్రెక్కర్స్కు బెస్ట్. ఈ ట్రెక్ 1,892 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం దట్టమైన గడ్డి భూములు, షోలా అడవులకు ప్రసిద్ధి. ఈ ట్రెక్లో ప్రవాహాలను దాటుతూ, ‘ఒంటరి చెట్టు‘ (ఒంటిమార) వంటి ప్రదేశాల గుండా ప్రయాణించి, శిఖరాన్ని చేరుకోవాలి. ఈ ట్రెక్కు రోజూ పరిమిత సంఖ్యలో మాత్రమే ట్రెక్కర్స్కు అనుమతిస్తారు. సాధారణంగా జూలై నుంచి నవంబర్ వరకు సీజన్. దీనికి సమీపంలోనే నేత్రావతి ట్రెక్ కూడా ఉంది. స్కందగిరి హిల్స్ : బెంగళూరు నుంచి 60–65 కి.మీ దూరంలో ఉన్న స్కందగిరి హిల్స్ కూడా కాసింత కఠినమైన సవాలుతో కూడిన ట్రెక్ పాయింట్. కర్ణాటక అటవీ శాఖ పోర్టల్ ద్వారా ట్రెక్ను ముందస్తు బుక్ చేసుకోవాలి. ముల్లయనగిరి ట్రెక్ కర్ణాటకలోని ఎత్తయిన శిఖరం వరకూ హైకింగ్. ఇది కూడా కాస్తంత కఠినమైనదే. ఈ కాలిబాట సర్పధారి నుంచి ప్రారంభమవుతుంది. ఒక వైపు ట్రెక్కి దాదాపు గంటన్నర నుంచి రెండున్నర గంటలు పడుతుంది. ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, చిన్న గుహలను కలిగి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం సందర్శకులు సెపె్టంబర్ నుంచి మార్చి వరకు ఎంచుకోవచ్చు. ఇవే కాక మిగతా రాష్ట్రాల్లోని ప్రాంతాలైన కూర్గ్, మున్నార్, వాయనాడ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా ట్రెక్స్ నిర్వహిస్తున్నారు. తమిళనాట.. ట్రెక్ బాట.. అందరికీ తెలిసిన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన కోడైకెనాల్, ఊటీ ట్రెక్కింగ్కు పేరొందాయి. ముఖ్యంగా ఊటీలోని దొడ్డబెట్ట పీక్స్ ట్రెక్ బాగా ఫేమస్. అలాగే యెలగిరి హిల్స్లోని స్వామి మలాయ్ హిల్స్ ట్రెక్ సైతం మాన్సూన్లో సిటీ ట్రెక్కర్స్ను ఆకట్టుకుంటోంది.మార్గదర్శకాలు తప్పనిసరి.. మాన్సూన్ ట్రెక్కింగ్ అనేది సాహసాలను ఇష్టపడుతూ.. ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించే అరుదైన అవకాశం. వర్షపు వాతావరణంలో ఇది మరిచిపోలేని అనుభవంగా నిలుస్తుంది. ట్రెక్కింగ్లో సాధారణంగా రాత్రిపూట బసలు ఉంటాయి. స్థానిక నిర్వాహకుల ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా స్వతంత్రంగానూ నిర్వహించవచ్చు. నగరం నుంచి అనేక సంస్థలు ఈ ట్రెక్స్ నిర్వహిస్తున్నాయి. రూ.3వేల నుంచి మొదలుకుని ట్రెక్స్ ఏర్పాటు చేస్తున్నాయి. సరైన సంస్థను, పర్యవేక్షణలో నిపుణులైన ట్రెక్కర్స్ మార్గదర్శకత్వంలో మాత్రమే ట్రెక్కింగ్ సురక్షితం. -
జితాంక్ జీత్ గయా!
మొన్నటి వరకు...‘జితాంక్ సింగ్ గుర్జార్ పేరు విన్నారా?’ అనే ప్రశ్నకు వెంటనే వచ్చే జవాబు... ‘సారీ... తెలియదు’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పరిచయం అయింది. ‘ఎవరీ జితాంక్ సింగ్ గుజ్జార్?’ అని సెర్చ్ ఇంజిన్లను అడిగేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సింగ్. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (టిఐఎఫ్ఎఫ్)లో జితాంక్ సింగ్ గుర్జార్ తీసిన విముక్త్ (ఇన్ సెర్చ్ ఆఫ్ ది స్కై) ప్రతిష్ఠాత్మమైన నెట్పాక్ (నెట్వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియా సినిమా) అవార్డ్ గెలుచుకుంది.పక్కా పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్ల జితాంక్ ప్రకృతి ప్రపంచానికి చేరువయ్యే అవకాశం దొరికింది. రణగొణ ధ్వనులు లేని ఆ ప్రశాంతత బాగా ఇష్టంగా ఉండేది. తనకు ఆశ్చర్యంగా అనిపించేవాటిని, అద్భుతంగా అనిపించేవాటిని అందమైన కథలుగా చెబుతుండేవాడు. ఆ కథలు చెప్పే అలవాటే జితాంక్సింగ్ను సినిమా ప్రపంచంలోకి తీసుకువచ్చింది.గ్రామీణ ప్రపంచం... కథల చలమగ్రామీణ ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పడం అంటే జితాంక్కు ఇష్టం.‘ది మోస్ట్ పర్సనల్ ఈజ్ ది మోస్ట్ క్రియేటివ్’ అనే విలువైన మాట అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘విముక్త్’ కథకు స్క్రీన్ప్లే సమకూర్చి సినిమాగా మలిచాడు. ఇది నిర్మాత పూజా విశాల్ శర్మ రాసిన కథ. నటులు, సాంకేతిక వర్గం ఫైనల్ అయ్యాక... ‘ఇదీ కథ’ అని వారికి చె΄్పాడు. ప్రతి క్యారెక్టర్ గురించి విశ్లేషించి వివరంగా చె΄్పాడు. నటులు తమ క్యారెక్టర్లలో పూర్తిగా మమేకం కావడానికి ఎన్నో వర్క్షాప్లు నిర్వహించాడు.కుంభమేళాలో షూటింగ్జనసముద్రంలో మహా కుంభమేళాలో షూటింగ్ అంటే మాటలు కాదు. తమది చిన్న యూనిట్ కావడంతో ప్రతి సీన్ గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నాడు. ఏ దృశ్యాన్ని ఎక్కడ చిత్రించాలనేదాని కోసం ఎన్నో స్థలాలను పరిశీలించాడు. సరిౖయెన లొకేషన్లను ఎంపిక చేసుకోవడం ఒక సవాలు అయితే, జనమూహాలలో సహజ చిత్రీకరణ అనేది మరో సవాలు. ఎలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విజయవంతంగా షూటింగ్ పూర్తిచేశాడు జితాంక్.‘మహాకుంభమేళా సన్నివేశాలు లేక΄ోతే ఈ సినిమాయే లేదు. కాబట్టి కుంభమేళాలోని సన్నివేశాలనే మొదట చిత్రీకరించాం. ఆ తరువాత మధ్యప్రదేశ్లోని బరై, పద్వా గ్రామాలలో షూటింగ్ చేశాం’ అంటాడు జితాంగ్ సింగ్. ‘గ్రామీణ ప్రాంత కథలు మాత్రమే కాదు పట్ణణాలలోని ఎన్నో సంక్లిష్ట జీవితాలకు చిత్రరూపం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటున్నాడు జితాంక్ సింగ్ గుర్జార్.ప్రాంతీయ భాషలో తీసిన చిత్రాన్ని ప్రపంచం మెచ్చిందిఆ దంపతులకు వయసు పైబడుతోంది. జీవనాధారమైన తమ పొలాన్ని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఒక్కగానొక్క కొడుకు నారన్కు మేథో సామర్థ్యాలు లేవు. మానసికంగా అస్థిరంగా ఉంటాడు. ఒకవైపు నారన్ను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండాలి. మరో వైపు ఆర్థిక కష్టాలు. ఎన్నో సమస్యల మధ్య ఒక పరిష్కారాన్ని ఆశిస్తూ మహాకుంభమేళాకు వారి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే తమ కష్టాలు తీరుతాయని వారు ఆశిస్తారు. గ్రామీణ భారత జీవితం, నమ్మకాలు, అపనమ్మకాలకు, అదృష్ట దురదృష్టాలకు అద్దం పట్టిన సినిమాగా ‘విముక్త్’ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బ్రజ్ భాషలో తీశారు. కేవలం పదకొండురోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సెంటర్ పీస్ సెక్షన్లో ప్రదర్శించారు. (చదవండి: Weight Loss Story: బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..) -
బొద్దుగా ఉన్నోడు కాస్త స్లిమ్గా..! జస్ట్ మూడేళ్లలో 76 కిలోలు తగ్గాడు..
బొద్దుగా ఉన్న వ్యక్తులు బరువు తగ్గడం కష్టమేమో అనుకుంటారు. కొందరి అధిక బరువు.. వామ్మో! ఇంత లావు అనేలా ఉంటుంది. అంతలా లావుగా ఉండి కూడా చాలా స్మార్ట్ లుక్లోకి మారిపోవడమే కాదు వెయిట్లాస్ అవ్వాలనుకునే వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందంటే..హీరోని తలపించేలా అతడి ఆహార్యం అత్యంత అందంగా మారిపోయింది. తనకు ఇదెలా సాధ్యమైందో కూడా ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. మరి అంతలా బరువు తగ్గేందుకు అతడు ఏం ట్రిక్ ఫాలో అయ్యాడో సవివరంగా తెలుసుకుందాం..!ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తున్న అతడి స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..ఆ యువకుడే ఫిట్నెస్ ఔత్సాహికుడు నమన్ చౌదరి. బరువు తగ్గడం బోరింగ్గా, క్లిష్టంగా ఉండకూడదని చెబుతున్నాడు. కేవలం తెలివిగా తినడం ఎలాగో తెలుసుకుంటే చాలు వెయిట్లాస్ అవ్వడం చాలా సులభమని చెబుతున్నాడు. అందుకోసం తాను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటూ..నిబద్ధతో ఉండటం నేర్చుకోవాలని చెబుతున్నాడు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి, ఆకలిని నియంత్రించడమే కాకుండా కొవ్వు తగ్గడానికి మద్దతిస్తుందని చెబుతున్నాడు. ఆ విధంగానే తాను మూడేళ్లలో 150 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకున్నాని, అలా మొత్తం 76 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. అంతేగాదు బరువు తగ్గడానికి ఉపకరించిన తన ప్రోటీన్ భోజన ప్రణాళికను కూడా పంచుకున్నాడు.ప్రోటీన్ ఫుడ్ ప్లాన్..ఉదయం అల్పాహారం (400 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)ఎంపిక 1: 4 గుడ్డులోని తెల్లసొన + ఉల్లిపాయలు, టమోటాలతో గిలకొట్టిన ఆమ్లెట్, క్యాప్సికమ్ పాలకూరతో 50 గ్రా పనీర్ బుర్జీ, మల్టీగ్రెయిన్ టోస్ట్.ఎంపిక 2 (గుడ్లు లేకుండా): కూరగాయలతో 60 గ్రా సోయా ముక్కలు స్టైర్-ఫ్రై, 50 గ్రా తక్కువ కొవ్వు పనీర్ గ్రిల్, ఒక చిన్న మల్టీగ్రెయిన్ టోస్ట్.లంచ్ (350 కిలో కేలరీలు, 30 గ్రా ప్రోటీన్)లంచ్ కోసం, ఇది తేలికగా ఉంచడం గురించి కానీ భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండాలి. అతను 100 గ్రాముల సోయా ముక్కలు కర్రీ, 100 గ్రాముల ఉడికించిన బ్రోకలీ, ఒక చిన్న రోటీని ఎంచుకున్నాడు.సాయంత్రం స్నాక్ (200 కిలో కేలరీలు, 20 గ్రా ప్రోటీన్)చిప్స్ లేదా స్వీట్లకు బదులుగా, నామన్ 150 గ్రాముల తక్కువ కొవ్వు పనీర్ టిక్కాను ఎంచుకున్నాడు, పెరుగు, నిమ్మకాయ, సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసి, గ్రిల్ చేసిన లేదా వేయించినది.డిన్నర్ (350 కిలో కేలరీలు, 35 గ్రా ప్రోటీన్)నామన్ డిన్నర్ కోసం ఉడికించిన పప్పు (పప్పు), వేయించిన టోఫు లేదా పనీర్, కూరగాయలు దోసకాయ, టమోటా సలాడ్ ఒక చిన్న రోటీ తీసుకున్నట్లు తెలిపాడు.రోజువారీ మొత్తంకేలరీలు 1300–1400 కిలో కేలరీలు, దాదాపు 120 గ్రా ప్రోటీన్తో ఉంటాయి. ఇదే నమన్ కడుపు నిండి ఉండటానికి తోడ్పడింది. పైగా అతని వ్యాయామాలకు ఇంధనంగానూ, కండరాలను కోల్పోకుండా కొవ్వును కరిగించడానికి సహాయపడింది. నామన్ పంచుకున్న వాటిలాగే ప్రోటీన్ అధికంగా ఉండే తేలికైన భోజనం తినడం వల్ల కొవ్వు తగ్గడం వాస్తవికంగా స్థిరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా విపరీతమైన డైట్స్ అవసరం లేదు. జస్ట్ ప్రోటీన్ అధికంగా, సమతుల్య పద్ధతిలో తింటే బరువు అదుపులో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Naman Chaudhary (@sweat_with_nc) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..) -
రుచికరంగా..ఆరోగ్యంగా తిందాం ఇలా..!
ఆరోగ్యంగా తినాలంటే ఉప్పు , గ్లూకోజ్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ మన నాలుక టేస్ట్ కావాలంటూ..పోషకాలు లేని ఆహారంవైపే పరుగులు తీస్తుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసి, అధికం సోడియంతో ఉండే వాటినే మనసు కోరుకుంటుంది. ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకూడదంటే చక్కెర, ఉప్పు తగ్గించడం తప్పనిసరి. మరి ఇలా నాలుకను కట్టేసేలా టేస్ట్ లెస్గా తినడం అందరి వల్ల కాదు. అలాంటప్పుడు ఇలా తెలివిగా రుచిని మిస్ కాకుంకా, పోషకాలు పోకుండా ఆరోగ్యంగా తినాంటే ఇలా ట్రై చేయండని చెబుతున్నారు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జమునా. మరి అదెలాగో తెలుసుకుందామా..!.రుచిని కోల్పోకుండా సంతృప్తికరంగా తినాలనకుంటే ఉమామి రుచి బెస్ట్ అంటున్నారామె. అదేం రుచి అంటే..ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్ని ఎలివేట్ చేసేలా రిచ్నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. అంటే ఉప్పు తక్కువగా ఉన్న మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే చప్పిడి భోజనం తిన్నామనే ఫీల్ రాదట. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకే తక్కువ సోడియం ఉన్న ఆహారాలకు ఉమామి రుచిని పెంచే పదార్థాలను జోడిస్తే..ఆహారం రుచికరంగా మారుతుంది, ఆరోగ్యకరంగా తినే అవకాశం ఉంటుందని జపన్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో అధికంగా ఉండే గ్లూటామేట్ సంతృప్తిని అందించి, స్నాక్స్ అవసరాన్ని తగ్గిస్తుందట. అందుకోసం..ఉమామి రుచి కోసం మోనోసిడియం గ్లూటామేజ్(ఎంఎస్జీ)ని ఉపయోగిస్తారట. ఇది సహజ పదార్థాల నుంచే తయారవతుంది. పెరుగు లేదా వెనిగర్ తయారీకి ఉపయోగించే పద్ధతిలో తయారు చేయడం లేదా చెరుకు లేదా టాపియోకా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారట. ఇందులో ఉప్పులోని సోడియం కంటెంట్ కంటే తక్కువగా, పైగా ఉప్పుకి ప్రత్యామ్నాయంగా ఉంటుందట. పైగా ఇది భోజనాన్ని మితంగా తినేలా చేస్తుంది. అదీగాక ఇంద్రియాలతో రుచిని అనుభవించే మనకు జిహ్వ చాపల్యం శాపంగా మారకుండా ఉమామి రుచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందట. ఫలితంగా రుచిని కోల్పోకుండా పోషకాహారాలను కచ్చితంగా తీసుకోగలుగుతారు.చివరగా ఉమామి రుచి కోసం గ్లూటామేట్ అధికంగా ఉండే కూరగాయలు ప్రతిసారి జోడించడం కుదరనప్పుడూ పైన చెప్పిన కృత్రిమ ఈ ఎంఎస్జీ రుచితో కూడిన మసాలా ఉప్పు ఉయోగపడుతుంది. పోషకాహరం పేరుతో పాక రుచిని కోల్పోకుండా తెలివిగా తినే విధానమే ఇది అని చెబుతున్నారు మాజీ ప్రోఫెసర్ జమునా.డాక్టర్ జమునా ప్రకాష్ ఫుడ్ కన్సల్టెంట్, మాజీ ప్రొఫెసర్, మైసూర్ విశ్వవిద్యాలయం(చదవండి: ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!) -
ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!
గుండె వ్యాధులు ఎక్కువగా పురుషులనే ప్రభావితం చేస్తాయని, అందులోనూ కరోనరి ఆర్టరీ డిసీజ్ వంటి గుండె సమస్యలు పురుషులకే అత్యంత ప్రమాదమని అనుకుంటారు అంతా. కానీ మహిళలకూ అంతే స్థాయిలో ప్రమాదం ఉంటుందట. వాళ్లు కూడా తరుచుగా ఆంజినా(ఛాతీనొప్పి) వంటి లక్షణాలను ఎదుర్కొంటారట. అయితే ఈ ఛాతీనొప్పిని మహిళలు తేలిగ్గా కొట్టిపారేయడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలపై కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీనొప్పిపై అవగాహన లేమి దీనంతటికి కారణమని అంటున్నారు. మరీ ఏంటి ఛాతీనొప్పి, దాని లక్షణాలు, ముందుస్తుగా ఎలా గుర్తించాలి తదితరాల గురించి వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.భారతదేశంలో చాలావరకు సంభవిస్తున్న మరణాల్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..2022లో భారతదేశంలో దాదాపు 4 మిలియన్లకు పైగా మరణాలు క్యాడ్ వల్లే సంభవించాయి. పైగా ఈ గణాంకాలు మహిళలకు ఈ వ్యాధిపై తక్షణ అవగాహన, సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం గురించి నొక్కి చెప్పాయి. అందువల్ల ఈ ఆంజినా పెక్టోరిస్ని(ఛాతీనొప్పి)ని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతంగా నిర్వహించడంపై మహిళలకి అవగాహన పెంచడం అనేది అత్యంత ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.ఆంజినా (ఛాతీనొప్పి) ఎలా ఉంటుందంటే..ఆంజినా అనేది క్యాడ్(CAD)కి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటారట. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. దీని వలన ధమనులు సంకోచించి, గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆంజినా లక్షణాలు ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలోకి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, చెమటలు పట్టడం వంటివి ఉండవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ కానప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న ఆ సమస్యల ఉత్పన్నమవ్వగానే సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోవడంతోనే ఈ ఆంజినా సవాలుగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ఈ సమస్య నిర్థారణలో చేస్తున్న జాప్యమే సమస్య తీవ్రతను పెంచి, అకాల మరణాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ నిర్లక్ష్యమే ఒక్కోసారి నిపుణులు సైతం అంతర్లీనంగా ఉన్నీ ఆంజినా సమస్యను పరిష్కరించకుండా ఇతరత్ర ఉపశమన పరిష్కారాలు అందించేలా చేసి, మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు. చికిత్స విధానం..OPTA(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) క్లినికల్ చెక్లిస్ట్, OPTA ప్రశ్నాపత్రం, OPTA విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా(ఛాతీనొప్పి) నిర్థారణకు కీలకమైనవి. ఇవి రోగ నిర్థారణకు, వైద్య నిర్వహణకు మద్దతిస్తాయి. పైగా వైద్యలకు సకాలంలో ఈ ఛాతీనొప్పిని నిర్థారించడంలో హెల్ప్ అవుతుంది. ఇది ఒకరకంగా ఆంజినా నిర్వహణపై తొలి అడుగుగా అభివర్ణించారు నిపుణులు.మహిళ్లలోనే ఈ వ్యాధిని గుర్తించలేకపోవడానికి రీజన్..మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏంటంటే..సహజంగా తాము తక్కువ ప్రమాదంలో ఉన్న అపోహనే ప్రధాన కారణమని చెబుతున్నారు అపోలా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సరితా రావు. అదీగాక గుండెజబ్బులు వంటి సమస్యలు తరుచుగా పురుషులే బారిన పడతారనేది నిజమే అయినప్పటికీ, పూర్తిగా మహిళలకు ఈ వ్యాధుల రావు అని అర్థం కాదని అంటున్నారు. అందువల్లే ఈ గుండె జబ్బుల ప్రమాదాలపై మహిళలకు అవగాహన కలిగించడం అత్యంత ప్రధానమని నొక్కి చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన హృదయ సంబంధ రోగుల్లో మహిళలే అధికమని చెప్పారు. ముఖ్యంగా ఆంజినా(ఛాతీనొప్పి)తో ముడిపడి ఉన్న గుండెజబ్బులు పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల మహిళలు ఈ వ్యాధిని తిప్పికొట్టేలా రోగ నిర్థారణ, సకాలంలో చికిత్స, నిర్వహణపై ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి మెరుగైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని అన్నారు.(చదవండి: Pain Relief Therapy: నొప్పిని పోగొట్టే ‘అయాన్’) -
అలరిస్తున్న ఫ్యాషన్ చేనేత కళాఖండాలు..!
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం హైదరాబాద్. అలాంటి నగర వేదికగా కొనసాగుతున్న చేనేత, హస్తకళల ఉత్సవం ‘ఛాప్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక కళలకు ఆధునిక హంగులు జోడిస్తూ జరుగుతున్న ఈ అతిపెద్ద కళాత్మక కార్యక్రమం ఈ తరం ఫ్యాషన్, ఇంటీరియర్ ఔత్సాహికులను విశేషంగా అలరిస్తోంది. ఫ్యాషన్–టెక్నాలజీ వంటి అంశాలతో కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ శాఖ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ‘ఛాప్’ సరికొత్త కళను తీసుకొచ్చింది. ఈ నెల 17 వరకూ కొనసాగనున్న ఈ చేనేత, హస్తకళల సందడి.. సిటీ లైఫ్ స్టైల్లో మునిగిపోయని నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన విభిన్న కార్యక్రమాలు సందర్శకులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని శిల్పారామం వేదికగా ఏర్పాటు చేసిన 100 స్టాల్స్లో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందులోని లెదర్బ్యాగ్స్, వుడ్ కారి్వంగ్, పెయింటింగ్స్ వంటి చేతి ఉత్పత్తులను నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ టూరిజం ప్రాధాన్యతను ప్రదర్శించేలా వినూత్న కార్యక్రమాలు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికేలా నిర్వహిస్తున్న మాస్టర్ క్లాసులు, ఫ్యాషన్ షోలు, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్, అరుదైన కళలు తోలుబొమ్మలాట వంటివి.. ‘ఛాప్’లో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రేపటితో ముగియనున్న ఈ ‘ఛాప్’ ప్రదర్శనను సందర్శించకుంటే ఒక తరం కళాత్మక వైభవాన్ని చూసే అవకాశం కోల్పోయినట్లే.నీడిల్ క్రాఫ్ట్.. వెరీ స్పెషల్.. హిమాచల్ ప్రదేశ్, కాంగ్ర అనే ప్రాంతంలో ప్రత్యేకంగా పిన్ నీడిల్ క్రాఫ్టŠస్ను మహిళలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. వీటిని నగరవాసులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి 20వేల వరకూ అందుబాటులో ఉండటం విశేషం. పర్యావరణహిత ఉత్పత్తులు, స్టోరేజ్ బాక్సులు, పండ్ల బుట్టలు, టిష్యూ బాక్స్, చపాతీ బాక్స్, టేబుల్ మ్యాట్ వంటి అందమైన ఉత్పత్తులు వీరి ప్రత్యేకతను చాటుతున్నాయి.ప్యూర్ లెదర్.. ఫరెవర్.. అస్సోంకు చెందిన నిఫ్ట్ డిజైనర్ రూపొందించిన ప్యూర్ లెదర్ ఉత్పత్తులకు ఈ స్టాల్స్లో మంచి ఆదరణ లభిస్తోంది. అస్సోంకు చెందిన డిజైనర్ తమ ఉత్తులకు మరింత మార్కెటింగ్ చేయనున్నట్లు తెలిపారు. వీటి ధర రూ.1000 నుంచి 10వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. టిఫిన్ బ్యాగ్స్, కాలేజ్, ఆఫీస్ బ్యాగ్స్, మహిళల హ్యాండీ బ్యాగ్స్ అదుర్స్ అంటున్నారు సందర్శకులు.మనసు దోచే.. తుస్సార్ సిల్క్.. ఈ వేదికలో ఒడిస్సాకు చెందిన తుస్సార్ సిల్క్ చీరలు, చున్నీలు, టవల్స్, దోతీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఉత్పత్తుల ధర 8వేల నుంచి 26వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. రాజస్థాన్ ఫేమ్.. ఫ్రేమ్స్.. రాజస్థాన్కి చెందిన బికనీర్ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ఈ తరం ఇంటీరియర్ వండర్గా నిలుస్తున్నాయి. చేతితో తయారు చేసిన ఫ్రేమ్స్, కళాత్మక ఉత్పత్తులు ట్రెండీ థింగ్స్ను మైమరిపిస్తున్నాయి. ఇందులోని 24 క్యారెట్ గోల్డ్, రాజస్థాన్ పెయింటింగ్తో తయారు చేసిన లెదర్ల్యాంప్ వావ్ అనిపిస్తోంది. దీని ధర రూ.35,000 చెబుతున్నారు! పంజాబ్ కళాకారులు తయారు చేసిన వుడ్ కారి్వంగ్ ఉత్పత్తలు కళ్లు చెదిరే కళతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి ధరలు రూ.100 నుంచి 50వేల వరకు అందుబాటులో ఉన్నాయి. హోమ్డెకార్ ఉత్పత్తులు, క్యాండిల్ స్టాండ్, టేబుల్స్, డిజైనింగ్ పిల్లర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నా. సొంత బ్రాండ్తో ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నా. నగరవాసుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మరిన్ని ప్రత్యేక డిజైన్లతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చి అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. – నిషిగంధ బారువా, నిఫ్ట్ లెదర్ ఫ్యాషన్ డిజైనర్, అస్సోం. గృహాలంకరణ ప్రత్యేకం.. వెస్ట్బెంగాల్ కళాకారులు స్పాంజ్ వుడ్వర్క్ ఉత్పత్తులను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని నగరవాసులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. గృహాలంకరణకు ఇవి అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి ముందు లాన్, పార్కులో కావాల్సిన ప్రత్యేక డిజైన్స్ తయారు చేసి ఇస్తాము. మా స్టాల్స్లో ఉత్పత్తులు రూ.2వేల నుంచి 8వేల వరకు అందుబాటులో ఉన్నాయి. – సమీర్ కుమార్ షా, కళాకారుడు, వెస్ట్బెంగాల్. ఒక్కో డిజైనింగ్కు నెలల సమయం.. పనిలో నైపుణ్యం కలిగివున్నప్పుడే వుడ్ కార్వింగ్ చేయగలం. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్లను అందిచాల్సి ఉంటుంది. ఒక్కో కార్వింగ్ ఫ్రేమ్, ఒక్కో డిజైన్ బట్టి కొన్ని నెలల సమయం పడుతుంది. అందంగా కార్వింగ్ చేసినప్పుడే అమ్మకాలు జోరందుకుంటాయి. ఆయా ఉత్పత్తులకు డిమాండ్ కూడా ఉంటుంది. – కమల్జిత్ మాతరో, పంజాబ్ కళాకారుడు -
ఇంటిని నడిపే ఆమెకు నడుము నొప్పి..!
ఈ రోజుల్లో నడుమునొప్పి సాధారణంగా కనిపించే సమస్య.అయితే మహిళల్లో రోజువారీ పనుల వల్ల నడుమునొప్పివచ్చే అవకాశాలు మరింత ఎక్కువ.ఉదాహరణకు వాళ్లు రోజంతా నిలబడి వంట చేయడం లేదా బట్టలు ఉతకడం లేదా రొట్టెల కర్ర (బేలన్)తో రోటీలు తయారు చేయడం నడుమును చాలాసేపు అదేపనిగా ముందుకు వంచి ఆ పనులు చేయాల్సి రావడం వంటి కారణాలతో వారిలో నడుమునొప్పి ముప్పు మరింత ఎక్కువ. దీనికితోడు మహిళల్లో ప్రతి నెలా రుతుస్రావం నొప్పి వారి నడుము నొప్పిని మరింతప్రభావితం చేస్తుంది. ఇలాంటి అనేక కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళల్లో కాస్త ఎక్కువగానే కనిపించే నడుము నొప్పులు, వాటికి కారణాలూ, వాటి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం...పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు కాస్త ప్రత్యేకంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయి. ఈ హార్మోన్లు సైతం వాళ్లలో నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుందనే అంశం కూడా ఇందుకు మరో కారణం. ఈ కారణం వల్లనే... పురుషుల్లో మహిళల్లో ఒకేలాంటి నొప్పి వస్తున్నప్పటికీ... మహిళల్లో ఆ నొప్పి తాలూకు తీవ్రత కాస్తంత ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా మహిళల్లో హార్మోన్లు, వారికే ప్రత్యేకమైన కొన్ని జన్యువులు, వారి మనస్తత్వం, నొప్పిని తెలిపే వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుమునొప్పి తీవ్రత పురుషుల్లో కంటే ఎక్కువే.వైద్యపరమైన కారణాలతో నడుము నొప్పుల్లో కొన్ని...టెయిల్బోన్ పెయిన్ : మనం కుదురుగా కూర్చున్నప్పుడు సరిగ్గా మన నడుము కింద... పిరుదుల మధ్యగా కాస్తంత పైభాగంలో నొప్పి వస్తుంటే దాన్ని ‘టెయిల్బోన్ పెయిన్’గా చెప్పవచ్చు. అంటే ఇది సరిగ్గా వెన్నుపూసల్లోని చివరి ఎముక దగ్గర వచ్చే నొప్పి. వైద్యపరిభాషలో దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు. పురుషులతో ΄ోలిస్తే ఇది మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో΄ాటు మహిళల్లో గర్భధారణ అంశం కాక్సిడైనియా ముప్పును మరింత పెంచుతుంది. అందుకే పురుషల కంటే మహిళల్లో ఇది ఎక్కువ.ఆస్టియోఆర్థరైటిస్ : ఇది కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి. రెండు ఎముకలు కలిసే జాయింట్లలోని ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. నడుముభాగంలోని ఎముకల అరుగుదల కారణంగా ఈ తరహా నడుమునొప్పి వస్తుంది. ఇదే తరహాలో మోకాలు, తుంటి భాగంలో కీళ్లు (జాయింట్లు) అరిగినప్పుడు వచ్చే నొప్పిలాగే నడుము ప్రాంతంలోని ఈ నొప్పి వస్తుంటుంది.శాక్రో ఇలియాక్ జాయింట్ సమస్యలు : శాక్రమ్, ఇలియాక్ అనే ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్బోన్)ను తుంటితో కలుపుతూ... ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కొద్దిగా విస్తరించినట్లుగా ఉంటాయి. ఈ భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం పాకుతున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. మహిళల్లో గర్భధారణ అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. దాంతో ఈ తరహా నొప్పి మహిళల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది.కంప్రెషర్ ఫ్రాక్చర్ : ఇది వెన్నెముకల్లోని వెన్నుపూసల్లో ఏదైనా ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి. అనేక వెన్నుపూసలు (అంటే వెన్నులోని చిన్న చిన్న ఎముకలు) కలుస్తూ చక్కగా అమరి΄ోతూ... ‘ఎస్’ ఆకృతిలో ఒకే ఎముకలా కనిపించే వెన్నెముక ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఆస్టియో΄ోరోసిస్గా లేదా ఇతరత్రా ఏదైనా కారణం వల్ల ఈ వెన్నపూసల్లోని ఏదైనా ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఇలా జరగడాన్ని కంప్రెషర్ ఫ్రాక్చర్ అంటారు. ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్స్కు స్త్రీ, పురుషులిరువురిలోనూ అవకాశమున్నప్పటికీ... పురుషుల్లో కంటే మహిళల్లో ఇవి రెండు రెట్లు ఎక్కువ.ఫైబ్రోమయాల్జియా : కండరాల్లో నొప్పుల కారణంగా వచ్చే ఈ తరహా నొప్పి వెన్ను కింది భాగంతో ΄ాటు పైభాగంలో కూడా కనిపించవచ్చు లేదా నడుము భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా మహిళ్లోనే ఎక్కువ. పురుషులతో ΄ోలిస్తే మహిళల్లో కనిపించే యాంగై్జటీ ఈ నొప్పులకు కారణమవుతుంటుంది.నివారణ / చికిత్స...నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ కారణంగా వస్తున్నదో తెలుసుకోవాలి. ఆ నిర్దిష్టమైన కారణాన్ని బట్టి, దానికి అవసరమైన నిర్దిష్టమైన చికిత్స అందించడం లేదా తొలిదశల్లో నివారణ మార్గాలను అనుసరించడం ద్వారా నడుమునొప్పి నుంచి దూరం కావచ్చు. అవి... ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు చేయడం తొలిదశల్లో (ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. టెన్స్ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. దాంతో తగిన ఉపశమనం కలుగుతుంది. (అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి). తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. నడుమునొప్పి లేదా వెన్ను నొప్పి లేదా మెడనొప్పి లాంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడటాన్ని పూర్తిస్థాయి చికిత్సగా పరిగణించకూడదు. పైగా నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపవచ్చు. అందునా మరీ ముఖ్యంగా కాలేయంతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే నడుమునొప్పి లాంటివి వస్తున్నప్పుడు రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మేలు. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్తో మసాజ్ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో మసాజ్లు చేయడం మంచిదే. మసాజ్లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్ ప్రెషర్ వంటివి చేస్తుంటారు. అలా నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా అక్కడి కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్ను సంప్రదించడం అవసరం. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి.పై మార్గాలతో అంతగా గుణం కనిపించనప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్ల సహాయంతో అవసరమైన శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించే అవకాశముంది.పోష్చర్ పరంగా... పక్కలకు అకస్మాత్తుగా ఒంగడం లేదా ఒక పక్క బరువును అపసవ్యంగా మోయడం వల్ల : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల వంటి బరువులు ఎత్తే సమయంలో, లేదా పిల్లలను అలాగే బిందెలను కూడా ఒకవైపున చంకలో మోసే సమయంలో నడుముఒంపు మీద బరువు ఆనించి చాలాసేపు అదేపనిగా నడవడం, బరువు మోస్తుండటం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చాలాసేపు అవసవ్య భంగిమలో, అందునా బరువు మోస్తూ ఉండటం వంటి అంశాలు కూడా నడుమునొప్పికి కారణమవుతాయి. అలాగే ఇల్లు తుడిచే సమయంలో కొందరు కింద కూర్చొని తడిగుడ్డతో ఫ్లోర్ తుడుస్తుంటారు. దీనివల్ల తరచూ కూర్చోవడం, లేవడం వంటి పనులతోనూ అలాగే కొన్నిసార్లు అదేపనిగా నడుము ఒంచి ఒకేభంగిమలో చాలాసేపు ఉండటం వంటివి చేస్తుంటారు. ఫలితంగా నడుము నొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో లాంగ్ హ్యాండిల్ మాప్లు వాడుతూ నిటారుగా నిలబడే వాటిని వాడుతూ ఫ్లోర్లు తుడవటం లాంటి జాగ్రత్తలతో నడుమునొప్పిని నివారించుకోవచ్చు. ఇక వారు అనేక పనుల్లో భాగంగా అకస్మాత్తుగా ముందుకు వంగాల్సిరావడం లేదా పక్కలకు తిరగాల్సిరావడం, ఏవైనా బరువులు ఎత్తేందుకు గబుక్కున ముందుకు ఒంగడం లాంటివి చేస్తుంటారు. ఈ అంశాలు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు. వారు ఏదైనా బరువును (అంటే... బిందె, కుండ లేదా బస్తాల వంటి బరువులు) ఎత్తే సమయంలో ముందుకు ఒంగి కాకుండా...మెల్లగా కూర్చొని నెమ్మదిగా ఎత్తుకోవడం మేలు. ఇక ఆఫీసుల్లో పనిచేసే చోట్ల మహిళల్లో ముందుకు వంగి కంప్యూటర్లోకి చూస్తుండటం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచడం మంచిది.చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి... కొన్ని వృత్తుల్లో ఉండేవారు ఉదాహరణకు ట్రాఫిక్ విభాగంలో పనిచేసే మహిళా పోలీసులు, బస్ కండక్టర్లు, షాపుల్లో పనిచేసే సేల్స్ గర్ల్స్ అదేపనిగా చాలాసేపు నిలబడే ఉంటారు. ఒక్కోసారి దాదాపు ఐదారు గంటల పాటు కూడా వారు నిలబడే ఉండాల్సి రావచ్చు. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతోపాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్ డిజార్డర్స్’ వంటివి వచ్చే అవకాశాలెక్కువ. అలాగే చాలాసేపు నిలబడి ఉండటం వల్ల వచ్చే స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్) వంటివీ రావచ్చు. ఒక్కోసారి నడుమునొప్పితోపాటు ఈ క్రాంప్స్ వంటివి వచ్చినప్పుడు వాళ్ల పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత సేపు బ్రేక్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. కొంతసేపు కూర్చొని వచ్చి మళ్లీ నిలబడి తమ వృత్తిని / పనులను కొనసాగించాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా చాలాసేపు నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్లో తరచూ కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. ఒక వంట వండుతూ ఉండే సమయాల్లో కూడా మహిళలు వంట ప్లాట్ఫారమ్ దగ్గర చాలాసేపు నిలబడే ఉండాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్ఫారమ్ అమర్చుకోవడం, అప్పుడప్పుడూ కూర్చోడానికి ఎత్తైన లాంగ్ స్టూల్ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్రెస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండేలా చూసుకుంటూ, కూర్చున్నప్పుడు మీ కాళ్లు ఆ అడ్డుపట్టీలపైన ఉండేలా చూసుకుంటే నడుముపై భారం తగ్గి నడుమునొప్పి నివారించడానికి ఆ అంశాలు తోడ్పడుతుంటాయి. నడుమునొప్పిని నివారించే ఆహారం... చాలామందికి తెలియని విషయం, ఆశ్చర్యం కలిగించే సంగతేమిటంటే... వెన్ను ఆరోగ్యానికి తగినంత వ్యాయామంతోపాటు పోషకాహారం కూడా అవసరమే. ఆ ఆహారం ఎన్నో గాయాలను త్వరగా మాన్పి... వెన్నునొప్పులను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎముక సాంద్రత తగ్గకుండా చేయడం ద్వారా నడుమునొప్పి రాకుండా చేస్తుంది. ఇందుకు మీ ఆహారంలో ఉండాల్సిన పోషకాలు ఏమిటంటే... కాల్షియమ్: కాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పాలు, పాల ఉత్పాదనలైన పెరుగు, వెన్నతోపాటు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, చేపలలో క్యాల్షియమ్ ఎక్కువ. విటమిన్ డి3 : మన ఒంట్లోకి వచ్చే క్యాల్షియమ్ ఎముకల్లోకి ఇంకేలా చేసి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో విటమిన్–డి బాగా సహాయపడుతుంది. స్వాభావికమైన ఎండ (నేచురల్ సన్లైట్)తోపాటు సాల్మన్ వంటి చేపలు, కాలేయం, గుడ్డు వంటి ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.విటమిన్–సి : చిగురు ఎముకలో ఉండే కొలాజెన్ వంటివి ఏర్పరచడంలోనూ, ఎముకలు, కండరాలు, చర్మం, టెండన్ల ఆరోగ్యాన్ని కా΄ాడటంలో విటమిన్–సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల నిమ్మజాతి పండ్లతోపాటు టొమాటో, కాప్పికమ్ వంటి కూరల్లో ఇది ఎక్కువ. అలాగే గాయాలను మాన్పడం, ఏవైనా గాయాలైనప్పుడు దెబ్బతినే భాగాలను సత్వరం రిపేర్ చేయడానికి ప్రోటీన్లు చాలా అవసరం. మాంసాహారం, పప్పులలో ప్రోటీన్లు ఎక్కువ. విటమిన్–బి12 : మన శరీరంలోని ఎముకలను నిర్మించే కణాల రూపకల్పనకు విటమిన్ బి12 చాలా అవసరం. అన్ని రకాల చేపలు, మాంసంతోపాటు తాజా పండ్లు, ఆకుకూరలు, పౌల్ట్రీ ఉత్పాదనల్లో బిటమిన్–బి 12 ΄ాళ్లు ఎక్కువ.డ్రైవింగ్ – నడుమునొప్పి...వాహనాలు నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే చాలామందిలో కొంతకాలం తర్వాత నడుము నొప్పి రావడం చాలా సాధారణంగా కనిపించే అంశం. చాలాకాలం పాటు వాహనం నడిపేవారిలో వెన్నెముక కారు సీటుకు అనుగుణంగా అలా నిర్దిష్టమై ఒంపులా ఒంగి ఉండటంతో వెన్నెముకలోని వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. అదీగాక వాహనం నడిపే సమయంలో కలిగే కుదుపుల వల్ల ఈ వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. దాంతో చాలాకాలంపాటు వాహనాలు నడిపేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశాలెక్కువ. కార్స్ లేదా ఇతరత్రా ఫోర్వీలర్స్ విషయంలో నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలను చూద్దాం. ఇటీవల కొన్ని కార్లలోని పైకప్పు (రూఫ్) చాలా కిందికి ఉంటోంది. అలాగే డ్రైవింగ్ సీట్లో కూర్చునేవారి సౌకర్యం కోసం సీట్ను వెనకవైపునకు బాగా కిందికి దిగి ఉంచేలా చేస్తారు. డ్రైవింగ్ చేసేవారు తమ కాళ్లను తగినంతగా చాపి ఉంచేలా చూసుకోవడం కోసం సీట్ను వెనక్కి వాలేలా చూస్తారు. దాంతో డ్రైవింగ్ సీటులో నిటారుగా కూర్చోవడమన్నది దాదాపుగా జరగదు. ఫలితంగా వెన్ను మీద ప్రత్యేకంగా నడుము మీద ఒత్తిడి చాలా ఎక్కువ. ఇలా సీట్ను వెనక్కు వంచినప్పుడు మళ్లీ కారు ముందరిభాగంలో స్పష్టంగా చూడటం కోసం మెడను ముందుకు వంచడంతో మెడ 20 డిగ్రీలు ముందుకు వస్తుంది. దాంతో నడుము అంతా ఒక భంగిమలోనూ, మెడ మరో భంగిమలో ఒంగుతాయి. ఈ అపసవ్యతల కారణంగా డ్రైవింగ్ చేసేవారిలో చాలా తరచుగా వెన్ను నొప్పి / నడుమునొప్పి వస్తుంటాయి. కార్ డ్రైవింగ్తో వచ్చే నడుము నొప్పి నివారణకు సూచనలు:మీ తొడలకు సీట్ సపోర్ట్ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే తొడల నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్పైనే ఉండేలా చూసుకోవాలి బ్రేక్, క్లచ్ వంటివి మీ కాళ్లు ఆనే చోటికి మరీ దూరంగా ఉండేలా కూర్చోవడం సరికాదు. అవి సరిగ్గా కాళ్ల చివరలో అందుబాటులో ఉండాలి మీ కాళ్ల పోడవుకు అనుగుణంగా సీట్ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి ∙మీ సీట్ను వీలైనంత మేరకు నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ వంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా సౌకర్యంగా ఉండాలి మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి.సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి ∙అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండాలి ∙ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్నది అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. మోటార్ సైకిల్ విషయంలో... ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బైక్లు నడిపే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. సాధారణంగా బైక్ల తయారీదారులు హ్యాండిల్బార్స్, ఫుట్రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. మీ బైక్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలుగానీ నొప్పులుగానీ రావు. ఒకవేళ మీ బైక్లోని వివిధ అంశాలు సరైన ప్రమాణాలు లేక΄ోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. బైక్ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులతో సౌకర్యంగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో ముఖ్యంగా నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ మనం కాళ్లు పెట్టుకునే ఫుట్రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు బైక్పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ ముందుకు వాలినట్టుగా ఉండేలా అమరి ఉంటాయి. దాంతో బాగా ముందుకు వాలిపోతునట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ బైక్లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్ప్యాక్స్ / ల్యాప్టప్ బ్యాగ్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. అందువల్ల ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్పై పడేలా చూసుకోవాలి. మీ బైక్లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: Shubhanshu Shukla: స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..! ) -
ఆర్మీడ్యూటీ అసలు బ్యూటీ
ఒక మోడల్ ఆర్మీ ఆఫీసర్ కావడమంట సౌందర్యం కంటే దేశం ముఖ్యం అనుకోవడమే. 2023లో ‘మిస్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన కషిష్ మెత్వాని 2024లో ‘కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్’లో 2వ ర్యాంకు సాధించింది. ఏడాది పాటు చెన్నైలో శిక్షణ పొందాక తాజాగా ఆమె లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఆఫీసర్గా దేశసేవకై అడుగు ముందుకేసింది. అందాల కిరీటం కన్నా ఆర్మీ యూనిఫామ్ గొప్ప సంతృప్తిని ఇస్తుందంటున్న పూణె అమ్మాయి కషిష్ పరిచయం.‘ముఝే సబ్కుచ్ కర్నా హై’... (నాకు అన్నీ సాధించాలని ఉంది)... ఇదీ కషిష్ మెత్వాని తరచూ చెప్పేమాట. ‘నాకు నచ్చిన పనులన్నీ చేస్తూ సంతోషాన్ని పొందడమే నాకు కావలసింది’ అని కూడా ఆమె చెబుతూ ఉంటుంది. పుణెకు చెందిన ఈ యువతి చిన్నప్పటి నుంచి సాధించినవి వింటే ఆశ్చర్యం వేస్తుంది. మోడల్గా, ‘మిసెస్ ఇంటర్నేషనల్ ఇండియా’ టైటిల్ విన్నర్గా గ్లామర్ రంగంలో రాణిస్తుందనుకుంటే ఏకంగా ఆర్మీ ఆఫీసర్గా ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మొదటి వారంలో లెఫ్టినెంట్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’లో పని చేయడానికి సిద్ధమైంది. ‘మా ఇంట్లో ఎవరూ ఆర్మీలో పని చేయలేదు. నేనే మొదటిదాన్ని. ఈ పని చాలా కష్టమని తెలుసు. కష్టమైనది సాధిస్తేనే కదా సంతోషం’ అంటోంది.న్యూరో సర్జన్ కాబోయి..కషిష్ మెత్వానీది పుణె. ఆమె తండ్రి సైంటిస్ట్గా పని చేస్తుంటే తల్లి టీచరుగా ఆర్మీ స్కూల్లో పాఠాలు చెప్పేది. ‘మా ఇంట్లో టీవీ ఉండేది. కాని ఏ రోజూ నేను దానిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోలేదు. స్కూలు పుస్తకాలు చదవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చేసేదాన్ని. నేను ప్రతి పోటీలో పాల్గొని గెలవాలని కోరుకునేదాన్ని. అలాగే గెలిచేదాన్ని కూడా’ అంది కషిష్. చదువులో విశేష ప్రతిభ చూపిన కషిష్ చిన్నప్పుడు న్యూరోసర్జన్ కావాలనుకుంది. కాని స్కూల్లో, ఇంటర్లో ఎన్.సి.సిలో చేరడంతో ఆమె ఆలోచనలు మారాయి. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్.సి.సి కాడెట్గా పాల్గొనడం ఆమె మీద ప్రభావం చూపింది. ఆర్మీలో చేరాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఈలోపు చదువు కొనసాగించి ఎం.ఎస్సీ. చేశాక బెంగళూరులో న్యూరోసైన్స్లో థీసిస్ సమర్పించింది. ఆ సమయంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా పని చేయడానికి ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది.బహుముఖ ప్రజ్ఞాశాలికషిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుతూనే పిస్టల్ షూటింగ్ నేర్చుకుంది. వాలీబాల్ ప్లేయర్గా ప్రతిభ చాటింది. తబలా నేర్చుకుంది. భరతనాట్యం సాధన చేసింది. అదేవిధంగా గ్లామర్ రంగంలో కూడా తన ఉనికి చాటుకోవడానికి మోడల్గా మారింది. అదే సమయంలో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఇవన్నీ 24 ఏళ్లలో సాధించింది. ఆ తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయ్యింది. ‘ఇన్ని చేయడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడమే. ఆర్మీ శిక్షణలో కూడా నేను ఎక్కడా తగ్గలేదు. శిక్షణా కాలంలో అనేక పోటీల్లో నేను ఫస్ట్ నిలిచాను’ అంటుంది కషిష్.సామాజిక సేవలో ఇన్ని పనులు చేసిన కషిష్ సామాజిక సేవలో కూడా తనదైన కృషి సాగిస్తోంది. ‘క్రిటికల్ కాజ్’ అనే ఎన్.జి.ఓ.ను స్థాపించి అవసరమైన వారికి ΄్లాస్మా, అవయవ దానం వంటి ప్రాణాధార సహాయం అందేలా చేస్తోంది. ‘మన కోసం మనం కష్టపడుతూనే సమాజం కోసం కూడా కష్టపడాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటోంది కషిష్.నిజంగానే ఆమె ఒక భిన్నమైన ప్రతిభాశాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే అవకాశం వచ్చినా తన జీవితం దేశసేవకే అంకితం అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎంట్రన్స్– 2024 రెండో ర్యాంక్ సాధించి, శిక్షణ పూర్తయ్యాక ఆఫీసర్గా ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్’ వింగ్ను ఎంచుకుంది కషిష్. -
స్పేస్లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్నెస్పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ. స్పేస్ బైక్..అందుకోసం స్పేస్ స్టేషన్లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట. ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. (చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..) -
నొప్పిని పోగొట్టే ‘అయాన్’
‘నొప్పి’ని తగ్గించేందుకు వైద్య శాస్త్రంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా నొప్పికి విరుగుడు కనిపెట్టడంలో ఇంకా పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, గాయాలు... ఇవన్నీ మనిషికి నొప్పి కలిగిస్తాయి. శరీరంలో నొప్పి, సందేశాలను అణచివేసే రసాయనాలు ప్రవేశపెడితే ఈ నొప్పికి విరుగుడుగా ఉంటుంది. శరీరంలో నొప్పికి విరుగుడుగా ‘విద్యుత్ చికిత్స’ ఉత్తమమని పరిశోధకులు గుర్తించారు. శరీరంలోకి బలహీనమైన విద్యుత్ను ప్రసారం చేస్తే అది మత్తు మందులా పనిచేసి రోగికి నొప్పి తెలియకుండా చేస్తుంది.నొప్పిని కల్గించే ప్రేరణలను మందగింపచేయడమే గాక మెదడుకు సమచారం వెళ్లకుండా ఈ విద్యుత్ నిరోధిస్తుంది. దీనినే ‘ఎలక్ట్రిక్ స్టిములేషన్’ పద్ధతి అంటారు. మన భారతీయ పరిశోధకుడు ఒకాయన ‘అయాన్ వైద్య చికిత్స’ రూపొందించారు. ఈ చికిత్స వలన అనేక మంది రోగులు నొప్పి నుండి విముక్తి పొందినట్లు ఆయన ప్రకటించారు. అమెరికాలోని వైద్య పరిశోధకులు ఈ ‘అయాన్ వైద్య చికిత్స’ బాగా పనిచేస్తోందని చెప్పారు. మూడవ డిగ్రీ స్థాయి వరకు శరీరం కాలిన రోగులకు విద్యుదావేశం కాబడిన గాలిని తగిలేటట్లు చేస్తే కొంతమేర స్వస్థత చేకూరిందని తెలియ జేశారు. అంటే నొప్పికి విద్యుత్ ఒక ‘బామ్’గా పనికి వస్తుందన్నమాట. విద్యుత్ పరికరాల సహాయంతో ఋణవిద్యుదావేశం గల గాలిని తయారు చేశారు. ఈ గాలిని బాగా పోగుచేసి నొప్పిగల ప్రదేశం మీదకు పంపారు. ఫలితంగా నొప్పి తగ్గినట్లు వారు గుర్తించారు.ఈ అయాన్లు గల గాలి వైద్యంతో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు వంటి వాటిని నయం చేయడానికి ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. శరీరానికి గాయం అయితే ఆ ప్రాంతంలో నొప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడి జీవకణాలకు విద్యుత్ నిరోధం తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ఆ ప్రాంతంలో ఏర్పడే ద్రవపదార్థాలకు విద్యుత్ వాహకత్వం ఉంటుంది. రష్యాలోని పరిశోధకులు ఈ నిజాలు తెలుసుకుని తక్కువ విద్యుత్ నిరోధం గల జీవకణం పైకి విద్యుత్ను ప్రవహింప చేశారు. ఫలితంగా అది తిరిగి విద్యుత్ నిరోధక శక్తిని పుంజుకుంది. ‘ఇదే నొప్పి నివారణకు విద్యుత్ ఉపయోగపడుతున్న తీరు’ అని వివరించారు.చదవండి: డయాబెటిస్ రోగుల కాళ్లకు దెబ్బ తగిలితే ఏం చేయాలి?ఈ చికిత్స వలన నొప్పి తగ్గిన వారిలో మళ్ళీ నొప్పి పునరావృతం కాలేదు. రోగి విద్యుత్ చికిత్స సమయంలో గాని ఆ తరువాత నాలుగు గంటల వరకు గానీ ఎటువంటి లోహపు వస్తువులనూ తాకకూడదు. నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోకూడదు. రబ్బరు తొడుగులు ధరించి రోగి చికిత్స చేయించుకోవాలి. లేకపోతే రోగికి సరఫరా చేసిన విద్యుత్ ఎర్త్ అయిపోతుంది.– డాక్టర్ సి.వి. సర్వేశ్వర శర్మ, పాపులర్ సైన్స్ రచయిత -
హ్యాట్సాఫ్ జ్వాలా గుత్తా..! అమ్మతనానికి ఆదర్శంగా..
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ దంపతులు ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా తల్లిపాలకు దూరమైన శిశువులు అకాల అనారోగాల బారిన పడకుండా తన వంతుగా తల్లిపాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ తల్లిపాల డ్రైవ్లో అందరూ పాలుపంచుకునేలా ప్రేరేపించేలా ఆమె తల్లిపాలను దానం చేశారు. జ్వాలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. "అంతేగాదు తల్లిపాలు బిడ్డల ప్రాణాలను కాపాడుతుంది, పైగా అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. మన దానం చేసే పాలు ఓ బిడ్డ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. అలాంటి పాలను దానం చేసేందుకు ప్రతి అమ్మ ముందుకు రావాలి. పైగా ఈ పాలు అవసరం ఉన్న కుటుంబం పాలిట దేవతా లేక హీరోగా ఉంటారు. అందువల్ల దయచేసి పాల బ్యాంకుకి మద్దతివ్వండి. "అంటూ పోస్లులో రాసుకొచ్చారామె. ఇకజ్వాల ఇప్పటివరకు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆమె విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. అంతేగాదు. దీనిపై అందరు అవగాహన పెంచుకోవాలంటూ పోస్టులు పెట్టారు. కాగా జ్వాల గుత్త.. నటుడు విష్ణు విశాల్ను 22 ఏప్రిల్ 2021న వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి అయ్యింది. జ్వాల తన ఆడపిల్లకు పాలు ఇచ్చిన తర్వాత తన పాలన్నింటినీ దానం చేస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా, ఒక అథ్లెట్ ఈ విధంగా తన పాలను దానం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ అందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. చదవండి: కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ -
'కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ
ఒకప్పుడు రచయిత తాను రాసిన నవలలను ప్రచురణ సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసి పాఠకుల చెంతకు చేర్చేవాడు. లేదంటే అప్పట్లో వచ్చిన వారపత్రికలు, సీరియళ్లు తదితర మాధ్యమాల ద్వారా తన నవల ఇతివృత్తాన్ని పాఠకులతో పంచుకునేవారు. ప్రస్తుతం వారపత్రికలు ఆదరణ కోల్పోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా రచయితలు నేరుగా పాఠకులతో సంభాషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా పుస్తక ప్రియుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇలా హైదరాబాద్లో రచయితలను, పాఠకులను ఒక చోటకు చేర్చేందుకు పలు క్లబ్స్ సైతం ఏర్పాటయ్యాయి. అంతేకాదు వాటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. నవలలను పాఠకుడికి చేర్చడం, పాఠకుడి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, తద్వారా పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకోవడం ప్రస్తుతం ట్రెండ్గా నడుస్తోంది. దశాబ్దం క్రితం రచయితలు పాఠకులతో ముచ్చటించడానికి తమ నవలను పరిచయం చేయడానికి అక్షర పుస్తక విక్రయశాలతో పాటు, సప్తపరి్ణ, లా మకాన్, రవీంద్ర భారతి, ఆంధ్ర సారస్వత పరిషత్, విశాలాంధ్ర బుక్హౌస్, స్టార్ హోటళ్లు, ప్రసాద్ ల్యాబ్స్, ప్రెస్క్లబ్స్ తదితర వేదికలను ఎంచుకునేవారు. ప్రస్తుతం వీటితోపాటు ఈ క్లబ్స్ కూడా రచయితలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆఫ్లైన్ క్లబ్ పేరుతో..పాఠకులతో నేరుగా ముచ్చటించేందుకు పలువురు రచయితలు ఎదురు చూస్తున్న తరుణంలో కొన్ని క్లబ్స్ వేదికలుగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ఆఫ్లైన్ క్లబ్ పేరిట కొంత మంది యువతీ, యువకులు ఓ క్లబ్ను ఏర్పాటుచేసి, రచయితలను ఆహా్వనిస్తూ.. పాఠకులతో ముచ్చటించే సదావకాశాన్ని కలిగిస్తున్నాయి. ఇందుకోసం వీరు స్టార్ హోటళ్లను, పెద్ద పెద్ద హాళ్లను ఎంచుకోకుండా ఆసక్తిగలవారు ఉండేచోటనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం కెఫేలు బుక్ చేసుకుంటూ నెల రోజుల ముందు నుంచే ఆ రచయితతో మాట్లాడుతూ ఫలానా తేదీన రచయితతో ఇంటరాక్షన్ ఉంటుందని తెలియజేయడం, ఆ తర్వాత పరస్పర భావాలు పంచుకోవడానికి వేదికగా నిలుస్తున్నారు.యువ రచయితల సంఖ్య పెరుగుతోంది.. ఔత్సాహిక యువ రచయితలను ప్రోత్సహిస్తూ.. పాఠకులను, రచయితలను ఒకే వేదికపై చేర్చి ఓ గొప్ప సాహిత్య సంఘాన్ని నిర్మించాలన్నదే లక్ష్యం. ఇప్పటి వరకూ ఎందరో రచయితలతో ఈ ఇంటరాక్షన్ సెషన్స్ నిర్వహించాం. నగరంలో యువ రచయితల సంఖ్య పెరుగుతోంది. పాఠకులతో ముచ్చటించాలనుకునే రచయితలు ఇన్స్టా ద్వారా ఆఫ్లైన్ క్లబ్లోగానీ, ఆథర్ బ్యాంటర్ క్లబ్లోగానీ సంప్రదించవచ్చు. – బిశ్వరూప్ బారిక, ఆఫ్లైన్ క్లబ్ వ్యవస్థాకురాలుపాఠకులు ఉత్సాహంగా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు ఇటీవల యువ రచయిత చైతన్య ముంగందతో ఆయన రాసిన ‘ప్రేమ కావ్యం’ నవలపై క్లబ్లో ముచ్చటించాం. జూబ్లీహిల్స్లోని ఓ కెఫే దీనికి వేదికైంది. ఈ ప్రేమ కావ్యం ఓ మధ్య తరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆశయాలు, బాధ్యతలు, సంబంధాలను సమతుల్యం చేస్తూ.. ఓ విద్యార్థి ప్రొఫెషనల్గా మారడాన్ని చిత్రీకరించింది. పాఠకులు ఎంతో ఉత్సాహంగా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. – మహ్మద్ నుష్రత్ ఖాద్రిపాఠకులతో ప్రత్యేక సెషన్స్..తాము రాసిన నవల సారాంశాన్ని, అందులోని పాత్రలను కూలంకషంగా చర్చించేందుకు పాఠకులు ముందుకొస్తున్నారు. పలువురు రచయితల తమ పుస్తక ప్రయాణాన్ని, ఆ పుస్తకాల్లోని కథల సారాంశాన్ని చర్చిస్తున్నారు. ఆఫ్లైన్ క్లబ్స్ ఇన్స్టాలో చురుకుగా ఉంటూ కొత్త రచయితలను ప్రోత్సహించడమే కాకుండా పాత రచయితలను కూడా ఈ వేదికలకు దగ్గరచేస్తున్నారు. ప్రతి సెషన్ కూడా పుస్తక సంతకంతో ముగుస్తుస్తోంది. ఇది రచయితలకు, పాఠకులకు ఒక మధురానుభూతిని కల్పిస్తుంది. కెఫేల్లో కాఫీ విత్ ఆథర్ పేరుతో ఇటీవల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు జోరందుకున్నాయి. గొప్ప అనుభూతినిచ్చింది.. ‘ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రెయిన్ బో’ అనే పుస్తకాన్ని రచించా. ఇది భావోద్వేగ ప్రేమకు ప్రతీక. నిజజీవిత సమస్యలు, సామాజిక అంచనాలు తాకుతుంది. పోరాటాలు, భావోద్వేగాలను అన్వేషిస్తూ ఆశను కలిగిస్తుంది. కష్టాల ద్వారా ప్రేమ బలాన్ని చూపుతుంది. ఆఫ్లైన్ క్లబ్ ద్వారా పాఠకులతో నేరుగా ముఖాముఖిలో పాల్గొన్నా. వారి అభిప్రాయాలను విని, సందేహాలను నివృత్తి చేశా. రాయడం కన్నా.. సారాంశాన్ని పాఠకులతో పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. – కావ్య కృష్ణన్, రచయిత్రిఆవిష్కరణ కేంద్రాలుగా..రచయితలు, పాఠకులను ఒక చోట చేర్చడం, ఆఫ్లైన్ క్లబ్ రచయితల సమావేశాలు ఏర్పాటు చేయడం, రచయితలను, పాఠకులను ఒక చోట చేర్చడం నగరంలో కొంతకాలంగా జరుగుతున్న ట్రెండ్. వారానికోమారు గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో రచయితలతో సమావేశాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. పాఠకుల నుంచి వస్తున్న ఆదరణను రచయితలు కూడా ఆస్వాదిస్తున్నారు. (చదవండి: 22 నుంచి నవకర్ నవరాత్రి ఉత్సవ్) -
22 నుంచి నవకర్ నవరాత్రి ఉత్సవ్
నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ ప్రాంగణం దాండియా వేడుకలకు వేదిక కానుంది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 1 వరకూ నవకర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్–2025 సీజన్–8 పేరుతో దీనిని నిర్వహించనున్నారు. మానేపల్లి జ్యువెలర్స్, అన్విత సమర్పణలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఎంట్రీ పాస్ పోస్టర్ను బాలీవుడ్ గర్భా కొరియోగ్రాఫర్ జిగర్ సోనీ, ఆర్గనైజర్లు కవిత, సలోని జైన్తో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా ప్రతి రోజూ గర్భా, దాండియా, సంగీతం, మహా ఆర్తి, లైవ్ ఢోలు, ఫుడ్ కోర్టులు, సెలబ్రిటీల కార్యక్రమాలు, ప్రత్యేక బహుమతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కొరియోగ్రాఫర్ సోని ఆధ్వర్యంలో యువతకు గర్భా, దాండియా నృత్యంపై వర్క్షాపు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్, దాండియా నృత్యాలు అలరించాయి. (చదవండి: గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..) -
తుఫానులోనూ చెదరని ప్రశాంతత
మన జీవితంలో సవాళ్లు మనల్ని ముంచెత్తే తుఫానులా వస్తాయి. ఆ అలల తాకిడికి మన మనసు అలజడి చెందుతుంది. కానీ, ఆ తుఫాను మధ్యలో నిశ్చలంగా నిలబడిన కొండలా మనల్ని నిలబెట్టేదే ఓర్పు. బయటి ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, మన అంతరంగంలో తుఫానులోనూ చెదరని ప్రశాంతతను నింపుకునే శక్తి ఇది. ఓర్పు కేవలం నిరీక్షించడం కాదు, అది ఆత్మబలానికి అసలైన నిర్వచనం.ఓర్పు అనేది మనసును నియంత్రించే ఒక శక్తి. సనాతన ధర్మంలో ఇది ఒక అత్యున్నత విలువగా పరిగణించబడింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కష్టాలను, సుఖాలను సమంగా చూడమని అర్జునుడికి ఉపదేశిస్తాడు. అదే నిజమైన జ్ఞానానికి, స్థిరత్వానికి పునాది అని వివరిస్తాడు. క్షమా వీరస్య భూషణం శక్తిమతాం క్షమా శ్రేయః ఓర్పు అనేది వీరులకు ఆభరణం. శక్తిమంతులకు ఓర్పు ఒక గొప్ప ధర్మం. ఈ సూక్తి ఓర్పును బలహీనతగా కాకుండా, అత్యంత ఉన్నతమైన ధైర్యంగా, శక్తిగా గుర్తిస్తుంది. నిజమైన బలం శారీరక శక్తిలో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతంగా, స్థిరంగా ఉండగల మానసిక శక్తిలో ఉందని ఇది నొక్కి చెబుతుంది.శానైర్గచ్ఛన్ శనైర్గచ్ఛన్ పంథాః సంపూర్ణో భవతినెమ్మదిగా, ఓర్పుతో అడుగులు వేసేవాడు దారిని పూర్తిగా చేరుకుంటాడు. అంటే, ఓర్పుతో, నిలకడగా కృషి చేసేవారు ఖచ్చితంగా తమ గమ్యాన్ని చేరుకుంటారు. ఇది ఆధునిక జీవితంలో కూడా అంతే సత్యం. పరీక్షల్లో విజయం సాధించడానికి రోజూ కొంతసేపు చదవాలి, ఒక్కరోజులో కాదు. ఒక వ్యాపారం విజయవంతం కావడానికి ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, ఓర్పు అవసరం. ఓర్పు అనేది మన లక్ష్యంపై మనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.క్షమా బలం అశక్తానాం, శక్తానాం భూషణం క్షమా ఓర్పు అనేది బలహీనులకు బలం, శక్తిమంతులకు ఆభరణం. ఓర్పును అలవరచుకోవడం ద్వారా బలహీనులు కూడా శక్తివంతులుగా మారగలరు. అది ఒక శక్తిమంతుని కీర్తిని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ సూక్తి ఓర్పు సార్వత్రిక శక్తిని, అది అందరికీ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది.ఓర్పు అనేది కేవలం నిరీక్షించడం కాదు, అది జీవితాన్ని అర్థవంతంగా, ప్రశాంతంగా జీవించే ఒక గొప్ప కళ. ఓర్పును అలవరచుకోవడం ద్వారా మనం అనవసరమైన ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు, ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కష్టాల పర్వతాలను చిన్న మెట్లుగా మార్చగల శక్తి ఓర్పుకు మాత్రమే ఉంది. ఓర్పు అనే బలం మనకు జీవితంలో ఎలాంటి తుఫానులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ గొప్ప గుణాన్ని మన జీవితంలో నిత్యం సాధన చేయడం ద్వారా విజయం, ప్రశాంతత, ఆనందం తప్పక లభిస్తాయి.భారతంలో సత్యవంతుడి భార్య సావిత్రి, తన భర్త జీవితం ముగిసే రోజున యమధర్మరాజు వెంట వెళ్లి, తన పట్టుదల, వాదన, అపారమైన ఓర్పుతో తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. ఈ కథ ఓర్పు దృఢ సంకల్పానికి ఉండే అద్భుత శక్తికి నిదర్శనం. అలాగే, హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయినా, చివరి క్షణం వరకు సత్యానికే కట్టుబడి ఉన్నాడు. ఆయన సత్యనిష్ఠకు, ఓర్పుకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టే క్రమంలో వేలసార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యం తర్వాత, ఆయన ‘ఈసారి పని చేయని ఇంకో మార్గాన్ని కనుగొన్నాను‘ అని ఓర్పుతో, పట్టుదలతో కృషి చేశారు. ఆయన ఓర్పు కారణంగానే ప్రపంచం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. అలాగే, మహాత్మాగాంధీ తన జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను, కఠిన పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొని, అహింసను, సత్యాగ్రహాన్ని తన ఆయుధాలుగా మలచుకున్నారు. ఆయన ఓర్పు, శాంతం, అకుంఠిత విశ్వాసంతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఇది ఓర్పుకు, దాని శక్తికి ఉన్నతమైన ఉదాహరణ.– కె. భాస్కర్ గుప్తా(వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
ఆరోగ్య సంరక్షణలో భారత్ బెస్ట్..!
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్లో ఏం రాసిందంటే..భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది. అలాగే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్లో అపాయింట్మెంట్తో పనిలేకుండానే క్లినిక్కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది. ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!) -
'టీ బ్రేక్' ఎలా వచ్చిందో తెలుసా..!
సంస్కృతి పరంగా ఎన్నో రకాల గొప్పతనాన్ని కలిగి ఉన్న మన నగరం, చక్కని చిక్కని చాయ్ సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. నగర రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. కాసిన్ని కబుర్లు కలబోసుకునే స్నేహితుల కోసం కావొచ్చు.. కాస్ట్లీ లావాదేవీలు నిర్వహించే కార్పొరేట్స్కి కావొచ్చు.. టీ బ్రేక్స్ ఉండాల్సిందే.. ఇంత బలంగా సిటీ లైఫ్లోకి చొచ్చుకుపోయిన చాయ్ పునాదులు కూడా అంతే బలమైనవి అంటోంది చరిత్ర. మొఘలుల కాలంలో, ఇది పాలకవర్గానికి చెందిన ఒక ఫ్యాషన్ పానీయంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని శతాబ్దాల తరబడి పాలించిన నిజాంలు టీ తాగడాన్ని తాము ఆస్వాదించడంతో పాటు ప్రజలనూ ప్రోత్సహించారు. అదే చేత్తో వారు దక్షిణాదికి తీసుకువచ్చిన పర్షియన్ ప్రభావాలు టీ చుట్టూ ఒక అధునాతన మర్యాద వ్యవస్థను రూపొందించడంలో సహాయపడ్డాయి. పర్షియన్ టీ హౌస్ల స్ఫూర్తితో నగరంలో తొలిదశ ఇరానీ కేఫ్లను జొరాస్ట్రియన్ వలసదారులు ప్రారంభించారని చెబుతారు. ఇవి తొలినాళ్లలో కేవలం పురుషుల రాజకీయ చర్చలకే పరిమితమై ఉండేవట.ఏదేమైనా నేడు అది ఒక అందమైన శక్తివంతమైన చాయ్ కల్చర్గా నగరంలో స్థిరపడింది. ప్రస్తుతం నగరంలో చాయ్ ఒక పానీయం మాత్రమే కాదు.. ఉల్లాసమైన సంభాషణలతో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సామాజిక అనుభవం కూడా. టీ సంస్కృతి నగరంలో వరి్థల్లడానికి బాటలు వేసిన వాటిలో ఇరానీ కేఫ్స్దే ప్రధాన పాత్ర కాగా మిగిలినవి కూడా తమవంతు పాత్ర పోషించాయి.రుచికరమైన వంటకాలతో పాటు చాలా చరిత్ర కలిగిన అత్యంత ప్రజాదరణ పొందాయి ఇరానీ కేఫ్లు ‘ఇరానీ చాయ్’ సహా వివిధ రకాల టీలను ఇవి అందిస్తాయి.స్నేహపూర్వక చాయ్ వాలాలు నిర్వహించే స్ట్రీట్ చాయ్ స్టాల్స్ కూడా సిటీలో టీ కల్చర్కు తమవంతు బలాన్ని అందించాయి. తక్కువ, సరసమైన ధరలకు పొగలు వచ్చే ఛాయ్లను ఇవి అందిస్తాయి.ఇటీవల వినూత్న మిశ్రమాలు ఫ్యూజన్ పానీయాలను అందించే ఆధునిక కేఫ్ సంస్కృతిని సైతం నగరం స్వీకరిస్తోంది. చాయ్ పాయింట్, చాయ్ షాయ్ మసాలా, చాయ్ లాట్టే, ఐస్డ్ చాయ్ వంటివి విభిన్న రుచులతో ప్రయోగాలు చేసే యువతను ఆహా్వనిస్తున్నాయి. సిటీలో చాయ్ వ్యాపారం ఒక భారీ పరిశ్రమగా మారింది. అనేక మంది వ్యవస్థాపకులు తమ సొంత టీ బ్రాండ్లు కేఫ్లను ప్రారంభించారు. చాయ్ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించి, తాజా మిశ్రమ టీలను వినియోగదారుల ఇంటికే అందించే వారు కూడా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తరాన్ని చేరుకోవడానికి ఆన్లైన్లో చాయ్ని ఆర్డర్ చేసే యాప్లు ప్లాట్ఫారమ్లు కూడా ఉద్భవించాయి. చాయ్ రుచి కోసం ఎక్కువ మంది వినియోగిస్తుండగా, ఆరోగ్యం కోసం కూడా కొందరు ఎంచుకుంటున్నారు. దీని తయారీలో అల్లం ఏలకులు మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలు సైతం మేళవిస్తూ ఆరోగ్యార్థులను ఆకట్టుకుంటున్నారు.నగరంలో చాయ్ మాత్రమే కాదు దానికి తోడుగా తీసుకునే సైడ్ డిష్లూ అంతే ఫేమస్. తేలికపాటి తీపి, ఉప్పదనాల కలయికగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు ఇరానీ చాయ్తో శతాబ్దాలుగా జట్టు కట్టాయి. అలాగే టీతో జత కట్టడంలో ఖారా బిస్కెట్స్ కూడా వీటితో పోటీపడుతున్నాయి. మరోవైపు మసాలా దినుసులతో నిండిన త్రిభుజాకారపు పట్టి సమోసా కూడా క్లాసిక్ కాంబినేషన్స్లో ఒకటిగా కొనసాగుతోంది. ఉల్లి సమోసాలతో పాటు ఇప్పుడు పోహా సమోసా దాకా భిన్న రకాలు వచ్చేశాయి. మలైబన్, బన్మస్కా వంటి బన్స్ క్లాసిక్ ఆధునిక కేఫ్లు అందించే ఇరానీ చాయ్కి ప్రసిద్ధ అనుబంధంగా పేరొందాయి.కేఫ్ నీలోఫర్: నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఐకానిక్ టీ హౌస్లలో ఒకటి, ఇది ఒక సాధారణ స్టాల్ నుంచి బహుళ అవుట్లెట్ బ్రాండ్గా విస్తరించింది. మార్చి 2025లో, ఇది రాయదుర్గంలో 40,000 చదరపు అడుగుల దేశంలోనే అతిపెద్ద కేఫ్ను ఏర్పాటు చేసింది.చార్మినార్ సమీపంలో ఉన్న నిమ్రా కేఫ్ బేకరీ, తాజా బిస్కెట్లు స్ట్రాంగ్ చాయ్లతో స్థానికులతో పాటు పర్యాటకులనూ స్వాగతిస్తుంది.జూబ్లీహిల్స్లోని చాయ్ పానీ కేఫ్ భిన్న రకాల చాయ్ వెరైటీలకు పేరొందింది. ఇది చాయ్తో పాటు వైవిధ్యభరిత రెట్రో వాతావరణాన్ని అందించే ప్లేస్. దీని అల్లం టీ బాగా ఫేమస్..బ్లూ సీ: సికింద్రాబాద్లో పేరొందిన ఇరానీ చాయ్ సెంటర్ ఇది. టీతో పాటు ఎగ్ పఫ్లు, దిల్ఖుష్(తీపి బన్)లకు ప్రసిద్ధి.రోస్ట్ సిసికె: బంజారాహిల్స్లోని ఈ కేఫ్ వివిధ రకాల బేకరీ ఉత్పత్తులను అందిస్తుంది. ఇక్కడి మసాలా చాయ్కి ఫ్యాన్స్ ఉన్నారు.కాఫీ సంగమ్: 90ల నాటి క్లాసిక్ తెలుగు స్నాక్స్ను తిరిగి గుర్తు చేసే కేఫ్, కడక్ చాయ్తో పాటు పామ్ షుగర్ బన్ శాండ్విచ్లు వంటి ప్రత్యేకమైన కాంబినేషన్కు పేరొందింది.అబిడ్స్లో 1935లో ఏర్పాటైన గ్రాండ్ హోటల్ సిసలైన హైదరాబాదీ చాయ్ను అందిస్తుంది. సోమాజిగూడలోని రెడ్ రోజ్ రెస్టారెంట్ విద్యార్థులు యువతను ఆకట్టుకుంటుంది. ఇన్స్ట్రాగామ్లో సైతం ఈ కేఫ్ యాక్టివ్గా ఉండటం విశేషం.అఫ్జల్గంజ్లోని గ్రాండ్ ఓవెన్ బేకరీ/ కేఫ్ గ్రాండ్ ఓవెన్ అనేది ఇరానీ కేఫ్ ఆధునిక కేఫ్ సంస్కృతుల మేళవింపుగా టేస్టీ చాయ్లకు పేరొందింది. -
మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..!
డయాబెటిస్ పేషెంట్లలో కాలికి దెబ్బతగిలి, అది సెప్టిక్ కావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందని వింటుండటం మామూలే. ఇలా కాలు సెప్టిక్ కావడాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి కాళ్లకూ, వేళ్లకూ చివర్లలో ఉన్న నరాలు మొద్దుబారుతుండటం సాధారణం. దాంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు. కొందరిలోనైతే చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా కాలికి గ్యాంగ్రీన్ వచ్చే వరకు విషయం తెలియదు. తీరా పరిస్థితి విషమించాక వారు తమ ఫిజీషియన్ దగ్గరకు రావడం, వాళ్లు వ్యాస్క్యులార్ సర్జన్ దగ్గరికి పంపితే కాలు తొలగించాల్సిన పరిస్థితి అని చెప్పడం చాలామందికి ఎదురయ్యే పరిస్థితే! ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలో తెలిపే కథనమిది.డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో కాలికి ఏదైనా దెబ్బతగిలి అది గ్యాంగ్రీన్గా మారిన దాదాపు 80% మందిలో కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇలా కాలు తొలగించడాన్ని వైద్యపరిభాషలో ‘నాన్ట్రామాటిక్ లోయర్ లింబ్ యాంపుటేషన్’గా చెబుతారు. పల్లె వాసుల్లో కాలు తొలగింపు ముప్పు... నిజానికి పట్టణవాసులతో పోలిస్తే డయాబెటిస్ కారణంగా కాలు తొలగింపు ముప్పు పల్లెప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... పల్లెల్లోని రక్కిస పొదలతో నిండి ఉండే డొంకదారుల్లో నడుస్తున్నప్పుడు కాలికి ముళ్లు గుచ్చుకోవడం లేదా ముళ్ల కంచెకు కాలు తగిలి చీరుకుపోవడంతో గాయాలు కావడం పట్టణ ప్రజలతో పోలిస్తే చెప్పుల్లేకుండా ఖాళీ పాదాలతో నడిచేవారు పల్లెల్లోనే ఎక్కువగా ఉండటం. దాంతో పాదం కింద చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకోవడం లేదా కాలివేళ్లకు తాకుడు రాయి తలగడం ఎక్కువ పశువులను మేతకు విడుస్తున్నప్పుడు అవి పొరబాటున కాలు తొక్కడంతో గాయం కావడం వ్యవసాయ పనుల్లో కొడవలి వంటి పదునైన పనిముట్లు తగిలి గాయం కావడం ∙డొంకదారులను పశువులు నడవడానికి వీలుగా కంప కొడుతున్నప్పుడు... అది గీరుకుపోవడం... పత్తి పంట కోశాక... ఎండిన మొదళ్లపైన పొరబాటున కాలు పడ్డప్పుడు... అవి పాదాల్లో గుచ్చుకుపోవడం.ఇప్పుడు పట్టణ / నగరా ప్రాంతాల్లోనూ... ఇలాంటి ప్రమాదాలకు పల్లెల్లో అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. డిజైనర్ వేర్ పాదరక్షలు ధరించేవారిలో, ఎప్పుడూ కదలకుండా పనిచేస్తూ ఉండే ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆరుబయట నిర్వహించే ప్రత్యేక పూజలూ / ప్రార్థనల్లో భాగంగా చెప్పులు లేకుండా నడవటం వంటి సందర్భాల్లో పాదాలకు గాయాలు కావడంతో ఇప్పుడు పట్టణ, నగరవాసుల్లో కూడా ఈ తరహా గాయాలు అవుతున్నాయి. అవి పల్లెవాసులకైనా లేదా పట్టణ ప్రాంతాలవారికైనా వాళ్ల కాళ్లకు అయ్యే గాయాలు ‘ఫుట్ అల్సర్’ అని పిలిచే పుండ్లుగా మారి కాలు దాదాపుగా గ్యాంగ్రీన్గా మారినప్పుడు కొందరిలో కాలిని తొలగించాల్సి వచ్చే ‘యాంపుటేషన్’ తప్పకపోవచ్చు. కాలు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే..? సాధారణంగా కాలికి గానీ ఇతరత్రా ఏ అవయవానికైనా గాయమైతే వెంటనే నొప్పి వస్తుంది. గాయమైనప్పుడు ఆ భాగం పూర్తిగా కోలుకోవడానికి వీలుగా మనలోని రక్షణ వ్యవస్థ ఆ భాగంలో ‘నొప్పి’ని కలిగిస్తుంది. దాంతో మనం కాలిని కదిలించకుండా దానికి తగినంత విశ్రాంతినిస్తాం. అయితే డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని తెలిపే ‘నరాలు’ మొద్దుబారి ఉండటంతో నొప్పి పెద్దగా తెలియదు. దాంతో అదే కాలిని ఉపయోగిస్తున్నప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బ తగులుతూ గాయం మాటిమాటికీ రేగుతుంది. అప్పుడా ఇన్ఫెక్షన్ దెబ్బతగిలిన చోటి నుంచి పైపైకి ΄ాకవచ్చు. ఇలా జరగడాన్ని వాడుక భాషలో మనం సెప్టిక్ కావడం అంటుంటాం.గాయం ఒక ముప్పు అయితే గ్యాంగ్రీన్ మరో ముప్పు... మన దేహంలోని ప్రతి అవయవానికీ, అందులోని ప్రతి కణానికీ నిత్యం రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే దేహంలోని ప్రతి భాగానికీ స్పర్శ తెలిపే నరాలూ ఆవరించుకుని ఉంటాయి. వాటి వల్ల మనకు స్పర్శజ్ఞానంతో ΄ాటు దెబ్బతగిలినప్పుడు నొప్పి, బాధ తెలుస్తుంటాయి. కాలక్రమంలో డయాబెటిస్ వ్యాధి నరాల చివరలను మొద్దుబారేలా చేయడం వల్ల దేహంలోని కొన్ని భాగాలు... మరీ ముఖ్యంగా కాలివేలి చివర్లలో స్పర్శజ్ఞానం అంతగా తెలియదు. పైగా దేహంలోని చివరి భాగాలకు రక్తం సరఫరా చేసే అతి సన్నటి రక్తనాళాల్లో (క్యాపిల్లరీస్) అడ్డంకులు ఏర్పడటం వల్ల అక్కడికి అందాల్సిన షకాలు, ఆక్సిజన్ అందక΄ోవడంతో ఆ భాగం కుళ్లి΄ోవడం మొదలవుతుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’గా చెబుతారు. స్పర్శజ్ఞానం, నొప్పి తెలియక΄ోవడంతో గ్యాంగ్రీన్ మొదలైనప్పటికీ ఆ విషయమే డయాబెటిస్ బాధితులకు వెంటనే తెలియదు. అలా ఇన్ఫెక్షన్ పైపైకి పాకుతూ పోతుంటే మొత్తం ప్రాణానికే ప్రాణాపాయం జరిగే అవకాశముంటుంది కాబట్టి గ్యాంగ్రీన్ ఎంతవరకు పాకిందో అక్కడి వరకు ఆ కుళ్లిన భాగాన్ని తొలగించాలంటూ (యాంపూట్ చేయాలంటూ) డాక్టర్లు చె΄్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ప్రమాదం కేవలం కాళ్లకేనా..? ఇలా యాంపూటేషన్ చేయాల్సిన పరిస్థితి కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా చేతులకూ వచ్చే ప్రమాదముంది అయితే కాళ్లతో ΄ోలిస్తే చేతులూ, చేతి వేళ్లతో మనం ప్రతినిత్యం పనిచేస్తుంటాం కాబట్టి... చేతులకు అలాంటి కండిషన్ వస్తే కాళ్లతో ΄ోలిస్తే త్వరగా తెలిసి΄ోతుంది. అందుకే చేతులతో ΄ోలిస్తే కాళ్లు, కాలివేళ్లకే గ్యాంగ్రీన్ ముప్పు మరింత ఎక్కువ.మరో జాగ్రత్త ‘యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్’ పరీక్ష...ఏడాదికోసారి లేదా డాక్టర్లు చెప్పిన విధంగా పాదాల విషయంలో వైద్యులను కలిసి పాదాలకు పల్స్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చేతుల మణికట్టు దగ్గర చూసినట్టే... డాక్టర్లు కాలి దగ్గర కూడా పల్స్ చెక్ చేసి చూస్తారు. అక్కడ నాడీస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని మరో పరీక్ష ఉంటుంది. ఇందులో బీపీ పరిశీలించేటప్పుడు చేతికి చుట్టినట్టే కాలి దగ్గర కూడా బీపీ పరిశీలించేప్పుడు చుట్టే పట్టాచుట్టి ఈ పరీక్ష చేసి, కాలిలో బీపీ కొలత చూస్తారు. కొలత విలువ ‘ఒకటి (1)’ ఉంటే అంతగా ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. కానీ ఈ కొలత 0.5 కంటే తగ్గుతూ ΄ోతూ ఉంటే (అంటే ఆ విలువలో సగానికంటే తక్కువగా ఉంటే... చేతితో ΄ోలిస్తే అందులో సగం కంటే తక్కువగా ఉంటే) కాలిలో రక్త ప్రసరణ తగ్గుతూ ఉందని అర్థం. ఇలాంటప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’లాంటి వ్యాయామాల చికిత్స తప్పక అవసరమని గుర్తించాలి. చివరగా... డయాబెటిక్ ఫుట్ సమస్యలో సాదానికి పుండ్లు పడ్డప్పుడు అది కేవలం వాస్క్యులార్ సర్జన్ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన కార్యాచరణతో పలువురు నిపుణులు ఓ బృందంగా ఏర్పడి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. ఇందులో వాస్క్యులార్ సర్జన్లు, ΄ప్లాస్టిక్ సర్జన్లు, డయాబెటాలజిస్టులు, ఫుట్ యాంకిల్ సర్జన్లు, పాడియాట్రిక్ నిపుణులు, ఇంటర్నల్ మెడిసిన్ చికిత్సకులు, ఫిజియోథెరపిస్టులు ఇలా టీమ్వర్క్తో డయాబెటిక్ లింబ్ సాల్వేజ్ టీమ్గా ఏర్పడి పాదాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆహారంలో చక్కెర మోతాదులను తగ్గించే విధంగా న్యూట్రిషనిస్టులు, రక్తంలో చక్కెరను అదుపు చేయడానికీ, రక్తంలో కొవ్వులు తగ్గించే మందులిచ్చే జనరల్ ఫిజీషియన్లు... ఇలా డాక్టర్ల బృందమంతా సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది.ఎవరికి వారు కాళ్లను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం పాదాల కింద అద్దంపెట్టుకుని, పాదాల అడుగుభాగం ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. అలాగే కాలి పైభాగాన్ని కూడా శ్రద్ధగా పరిశీంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య భాగాలనూ జాగ్రత్తగా చూస్తూ... అక్కడ చిన్న పోక్కుల్లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్కు తెల΄ాలి. లేదంటే అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉండవచ్చు.కాలిగోళ్లను ప్రతివారమూ కట్ చేసుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. డయాబెటిస్ బాధితుల్లో ఇది చాలా ప్రమాదకరం.వేడి వస్తువులనుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగా మారేంతవరకు తుడుచుకోవాలి.పాదాలను ప్రతినిత్యం పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే అవి పొడిబారే వరకు తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లు కాలికి సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా అలాంటివి తొడగడం సరికాదు.కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అవే భవిష్యత్తులో పుండ్లుగా మారే అవకాశం లేకపోలేదు.ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.మానని పుండ్లకు చికిత్స ఇలా... కాలిపైన పుండుగానీ లేదా చాలాకాలం వరకు మానని గాయం గానీ ఉంటే వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. ఇలా ఎంత త్వరగా డాక్టర్కు చూపిస్తే కాలిని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువని గుర్తుంచుకోవాలి. యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కాలి నాడీ స్పందనల కొలత 0.5 కు లేదా అంతకంటే తగ్గుతున్నప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’ కింది రోజుకు అరగంటకు తగ్గకుండా, అది కూడా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా బ్రిస్క్వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల యాంజియోగ్రామ్కు మించిన ఫలితం ఉంటుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది ఇలా యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కొలత 0.5 కంటే తగ్గుతున్నవారిలో ప్రోటీన్తో కూడిన ఆహారాలూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల కాలికి జరగాల్సిన నష్టం నివారితమవుతుంది కాలిలో రక్తప్రసరణ వేగాలు తగ్గుతున్నాయని గుర్తించిన తొలి దశల్లో రక్తాన్ని పలచబార్చేవీ, కాలిలో రక్తప్రసరణవేగాన్ని మెరుగుపరిచేవి కొన్ని రకాల మందులతో మున్ముందు రాబోయే కాలి తొలగింపు ముప్పును నివారించవచ్చు అత్యాధునిక టీసీపీఓటూ (క్యూటేనియస్ ఆక్సిజన్ మెజర్మెంట్) పరీక్షతో అతి సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా కాలి కొనగోరు చివరల వరకూ ఆక్సిజన్ అందుతున్న తీరును పరిశీలించి ఒకవేళ అందక΄ోతే ఇవ్వాల్సిన చికిత్సను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రక్తం అందడం లేదు / పుండు పడి మానడం లేదని తెలిస్తే మొదట ‘యాంజియోగ్రామ్’ ప్రక్రియ ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచవచ్చు. అప్పటికీ రక్తప్రసరణ మెరుగుపడటక΄ోతే ‘బైపాస్’ వంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అదీ కుదరకపోతే ‘వీనస్ ఆర్టీరియలైజేషన్’ ప్రక్రియ అనే మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. అంటే ఇందులో సిరలూ, ధమనులను కలిపి... కొనగోరు చివరి వరకూ రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తారు ∙గాయానికి చికిత్సను ఎంత త్వరగా అందిస్తే అది అంత త్వరగా మానుతుంది. పుండు మానకుండా మరింత ఆలస్యమయ్యేకొద్దీ అది గ్యాంగ్రీన్గా మారే అవకాశాలెక్కువ. ఇలా డాక్టరుకు గాయాన్ని చూపించడం ఆలస్యమైనవాళ్లలో డాక్టర్లు ‘స్టెమ్ సెల్ థెరపీ’ వంటి అత్యాధునిక ప్రక్రియలతో కాలిని కాపాడే అవకాశం ఉంది.డాక్టర్ కార్తీక్ మిక్కినేని, సీనియర్ వాస్క్యులార్ సర్జన్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?) -
ఈ సండే సరదాగా వంకాయ–తమలపాకు బజ్జీ ట్రై చేయండిలా..!
స్పైసీ బాంబూ షూట్స్ సలాడ్కావలసినవి: వెదురు చిగుర్లు (బాంబూ షూట్స్)– ఒక కప్పుతురిమిన క్యారట్లు–ఒక కప్పుకీరదోస– అర కప్పు (సన్నగా తరగాలి)కొత్తిమీర తురుము– పావు కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుమిరపకాయలు– 2వేరుశనగలు– పావు కప్పు (దోరగా వేయించినవి) రైస్ వెనిగర్– 3 టేబుల్ స్పూన్లుసోయా సాస్– 2 టేబుల్ స్పూన్లునువ్వుల నూనె– టేబుల్ స్పూన్తేనె– టేబుల్ స్పూన్అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్, నిమ్మరసం– ఒక టీ స్పూన్ చొప్పునతయారీ: ముందుగా పండ్లను శుభ్రంగాకడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. ముందుగా వెదురు చిగుర్లను కడిగి సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ తాజా వెదురు చిగుర్లను ఉపయోగిస్తే, వాటిని ఉడికించి చల్లార్చాలి. ఒక పెద్ద గిన్నెలో ఈ వెదురు చిగుర్లు, కట్ చేసిన క్యారట్ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈలోపు ఒక చిన్న గిన్నెలో రైస్ వెనిగర్, సోయా సాస్, నువ్వుల నూనె, తేనె, అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమంపై పోసి బాగా కలపాలి. 15 నిమిషాల తర్వాత వేరుశనగలు కూడా వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.వంకాయ–తమలపాకు బజ్జీకావలసినవి: వంకాయలు– 8 (మీడియం సైజులో ఉన్న వాటిని మధ్యలో నిలువుగా కత్తిరించుకోవాలి), తమలపాకులు– కొన్ని (పేస్ట్లా చేసి పెట్టుకోవాలి)శనగపిండి– ఒక కప్పు, బియ్యపు పిండి–2 టీ స్పూన్లు, వాము కొద్దిగానువ్వులు, కొబ్బరి పొడి– 2 టీ స్పూన్లు చొప్పున, జీలకర్ర– అర టేబుల్ స్పూన్పసుపు– పావు టీ స్పూన్, కారం– ఒక టీ స్పూన్, ఉప్పు– కావాల్సినంతవెల్లుల్లి రెబ్బలు–8, నిమ్మరసం– ఒక టీ స్పూన్, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాన్లో నూనె వేసి వంకాయలను లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చల్లారాక కొద్దికొద్దిగా తమలపాకు గుజ్జు నింపుకుని ఉంచుకోవాలి. అనంతరం నువ్వులు, కొబ్బరి పొడి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం కలిపి కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మరో వైపు ఒక కప్పు శనగపిండిలో బియ్యపు పిండి, వాము, కారం, ఉప్పు, సరిపడా నీళ్లు కలిపి బజ్జీల పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని వేగిన పల్లీలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.జపనీస్ పొటాటో సలాడ్కావలసినవి: బంగాళదుంపలు (సుమారు ఒక కేజీ, తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి)క్యారెట్–1 (కాస్త స్టీమ్ చేసి, చిన్నగా తరగాలి)కీరదోసకాయ–1ఉప్పు– ఒక టీ స్పూన్ఉల్లిపాయ–1 (బాగా తురుముకోవాలి)ఉడికించిన గుడ్డు– 1మాయొనీస్ సాస్– ముప్పావు కప్పురైస్ వైన్ వెనిగర్–1 టేబుల్ స్పూన్ఇతర కూరగాయ ముక్కలు– అభిరుచిని బట్టితయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి బంగాళదుంప ముక్కలను మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. మరోవైపు కీరదోసకాయను ముక్కలుగా కత్తిరించి ఉప్పు చల్లి పెట్టుకోవాలి. బంగాళదుంప ముక్కలు చల్లారాక, వాటిని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో కీర దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన గుడ్డును వేసి బాగా కలపాలి. అభిరుచిని బట్టి ఇతర కూరగాయల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. ఇక బంగాళదుంప మిశ్రమంలో మాయొనీస్ సాస్, రైస్ వైన్ వెనిగర్ వేసి నెమ్మదిగా మరోసారి కలుపుకోవాలి. అనంతరం దాన్ని ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి, తర్వాత బౌల్స్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
వెయ్యేళ్ల నాటి నాట్య ప్రదర్శన ఇంకా కళారూపకంగా..!
భారత ఉపఖండంలో వేల సంవత్సరాలు సాహిత్య భాషగా వున్న సంస్కృతం సుమారు వెయ్యేళ్ళకు పైగా ఒక ప్రదర్శన కళారూపంగా కూడా బతికి ఉండటం విశేషం. అదే కేరళలోని కూడియాట్టం. కూడియాట్టం అంటే కలిసి ఆడే నాట్యం అని అర్థం. ఇది కేరళలోని నాట్య ప్రక్రియలలో ప్రాచీనమైనది. కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఈ నాట్య ప్రదర్శనకు ప్రత్యేకమైన మందిరం ‘కూతాంబళం’ ఉంటుంది. సుమారు 5వ శతాబ్దిలో ప్రారంభమైన సంస్కృత నాటకాలలో పురాణేతిహాసాలు నేపథ్యంగా ఉన్న నాటకాలను పూర్వం చాక్యార్ బ్రాహ్మణులు మాత్రమే కూతాంబళాలలో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఇతర కులాల వారు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నాట్యాన్ని యునెస్కో మౌఖిక వారసత్వ కళారూపంగా గుర్తించడంతో కొన్ని దశాబ్దాలుగా ఖండాంతరాలలో ప్రదర్శితమవుతోంది. త్రిసూర్ కళామండలం, తిరువనంతపురం మార్గి, మూడికుళం నేపథ్య వంటి సంస్థలు ఈ వ్యాప్తికి కృషి చేస్తున్నాయి.ఐదు నుండి పది అంకాల సంస్కృత నాటకాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ రోజులే పట్టవచ్చు. ఒక్కొక్క శ్లోకాన్ని దాదాపు అరగంట వరకు ప్రదర్శించడం ఈ ప్రక్రియ ప్రత్యేకత. నాటకం మొదలు పెట్టడానికి ముందు ఒకరోజు మొత్తం ప్రదర్శన అంతా ఒకే నటుడు నాటక నేపథ్యం చెప్పడం, ప్రతిరోజూ ముందు సంక్షేపం, నిర్వహణం అనే ప్రదర్శనా పద్ధతులు ఉండటం వల్ల నాటకం మొత్తం పూర్తవడానికి ఎక్కువ రోజులు పడుతుంది.ప్రదర్శన ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పది, పదకొండు గంటలకు ముగుస్తుంది. ప్రదర్శనలో ముఖ్యమైన వాయిద్యం మిళావు. గంగాళంలాంటి రాగి పాత్రకు ఉన్న సన్నటి మూతిపై బిగుతుగా కట్టిన తోలు మీద వాయిద్యకారులు దరువులు వేస్తారు. ఈ దరువుల శబ్దం ప్రేక్షకులను తాదాత్మ్యతలోకి తీసుకువెళ్తాయి. మిళావుకి తోడుగా ఎడక్క అనే మృదంగం కూడా నాటక ప్రదర్శన సాంతం వాయిస్తూ వుంటారు. ఆడవాళ్ళు మాత్రమే తాళం వాయిస్తారు. కర్ణాటక సంగీత తాళగతులకు భిన్నంగా ఈ తాళాలు వుంటాయి. ‘ఎడక్క’ వాయిద్యకారుడే అవసరమైన సందర్భాలలో శంఖం కూడా ఊదుతాడు. ప్రదర్శనకు ముందు వేదిక ముందుభాగం మధ్యలో ఉంచిన పెద్ద దీపపు సెమ్మెలోని వత్తులు వెలిగిస్తారు. వెంటనే మిళావు ఆహ్వాన దరువుతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.కూడియాట్టంలో పాత్రలకు అనుగుణమైన ప్రత్యేక అలంకరణ వుంటుంది. సూత్రధార, దైవిక, రాజ పాత్రలకు ఒక విధంగానూ; సూత, విదూషక మొదలైన ద్వితీయశ్రేణి పాత్రలకు ఒక విధంగానూ అలంకరణ వుంటుంది. మగ పాత్రలకు దవడ మొత్తం చుట్టి వుండే ‘చుట్టి’ అనే సన్నటి తెల్లటి పట్టా వేయడం కూడియాట్టం నుండే కథాకళికి కూడా సంక్రమించింది. చుట్టి వేయడానికి ప్రదర్శనకు ముందు మూడుగంటల నుండి నటుడు సిద్ధం కావలసి వుంటుంది. స్త్రీ పాత్రలు ఎర్రటి అంచులు వుండే తెల్లటి చీరలు ధరిస్తారు.ఈ నాట్యంలో వుండే ముద్రలు ప్రత్యేకమైనవి. భరతుని నాట్యశాస్త్రానికి అనుగుణంగా ఉంటూనే ప్రత్యేక రీతిలో పాద, హస్త ముద్రలు వుంటాయి. సన్నివేశానికి అనుగుణంగా మానవ అనుభూతులకు ప్రదర్శించేటపుడు నటుల ముఖ కవళికలు, కనుబొమల విన్యాసాలు వివరణాత్మకంగా ఉండి ప్రేక్షకుని తమలో లీనం చేసుకుంటాయి. సంస్కృత శ్లోకాలను నటులు స్పష్టంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పాడతారు. అవసరమైన సందర్భాలలో శ్లోకాన్ని పద విభాగం చేసి కూడా వినిపిస్తారు. ఒకసారి శ్లోకాన్ని పాడి అర్థ వివరణల ముద్రలతో నటించి మళ్ళీ శ్లోకాన్ని పాడతారు. నేపథ్యం చెప్పే సందర్భంలో వచ్చే శ్లోకాలను తాళం వాయించే నంగియార్లు పాడతారు.కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ, అభిషేకం, స్వప్న వాసవదత్తం, శక్తిభద్రుని ఆశ్చర్య చూడామణి, హర్షుని నాగానంద, కులశేఖర వర్మ తపతీ సంవరణం, బోధాయనుని భగవదజ్జుకం మొదలైన నాటకాలను కూడియాట్టంలో ప్రదర్శిస్తూ వుంటారు. కాలానుగుణంగా కూడియాట్టం కూడా మార్పు చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక రోజు ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు కూడా చేస్తోంది. శూద్రకుని మృచ్ఛకటికాన్ని కూడియాట్టం ప్రదర్శనకు అనుగుణంగా మార్చి వేణు.జి. ఇటీవల ప్రదర్శిస్తున్నారు. కొచ్చికి నలభై కి.మీ.ల దూరాన ఉన్న మూడికుళం గ్రామంలోని నేపథ్య థియేటర్ మధు చాక్యార్, డా.ఇందు తన బృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఆదివారం ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. నేపథ్య బృందం, కపిల వేణు బృందం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్, డా. సుధా గోపాలక్రిష్ణన్, ప్రొఫెసర్ పౌలోస్ వంటివారు కూడియాట్టం మీద ఇంగ్లిష్లో పరిశోధనాత్మక గ్రంథాలు రాశారు. ఆగస్టు మొదటి వారంలో కూడియాట్టం అంతర్జాతీయ ఉత్సవాన్ని కళామండలం సంస్థ, వారం రోజుల పాటు త్రిసూర్లో ఘనంగా నిర్వహించారు. మలయాళీల పెద్ద పండగ ‘ఓణం’కు ముందు పదిరోజుల కూడియాట్టం ఉత్సవాలను మూడికుళం నేపథ్య సెంటర్ గత పదహారేళ్లుగా నిర్వహిస్తునారు.ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఎమిరిటస్ ప్రొఫెసర్ డేవిడ్ షూల్మన్ ఆధ్వర్యంలోని దక్షిణాసియా విభాగపు ‘నీమ్’ ప్రాజెక్ట్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 7వ శతాబ్దపు పల్లవ మహేంద్రవిక్రమవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ మూడికుళంలో పూర్తిగా ఆరురోజులపాటు ప్రదర్శించారు. కంచిలోని కల్లు దుకాణాల దగ్గర జరిగిన కథ ఇందులోని ఇతివృత్తం. బౌద్ధ, శైవ మత శాఖలలోని లోపాలను హాస్యభరితంగా విమర్శించిన ప్రహసనంగా ప్రఖ్యాతి పొందిన ఈ ప్రహసనం సంస్కృత ప్రహసనాల్లో మొదటిదని అంచనా. కాపాలిక, దేవసోమ, శాక్యభిక్షు, పాశుపత, ఉన్మత్తుని పాత్రలతో వున్న ఈ ఏకాంక ప్రహసనాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా ఎక్కడా ప్రదర్శించలేదు. అందువల్ల ఈ కూడియాట్టం ప్రదర్శనను చూడటానికి దేశ విదేశాల సంస్కృత పండితులు, పరిశోధకులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడియాట్టం చూడడానికి వీరంతా మూడికుళం వస్తూనే ఉంటారు.డా. కె.రామచంద్రారెడ్డి(చదవండి: స్లీప్..స్క్రీన్..స్టడీ..!) -
జుట్టును స్టైలిష్గా మార్చడం కోసం..!
వయసుతో సంబంధం లేకుండా ఆడవారంతా తమ జుట్టును అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవాలనే కోరుకుంటారు. ట్రెండ్కు తగ్గట్టుగా, అందరినీ ఆకట్టుకునేలా తమ కురులను మార్చుకోవాలని ఆశ పడతారు. అలాంటి వారి కోసం జుట్టును స్టైలిష్గా మార్చే పరికరమే ఈ డైసన్ ఎయిర్రాప్ ఐడీ 6 ఇన్ 1 మల్టీ స్టైలర్.జుట్టు స్టైలింగ్ అంటే చాలామంది అధిక వేడి, జుట్టు చివర్లు చిట్లిపోవడం, గంటల తరబడి శ్రమ అని అనుకుంటారు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని చెబుతూ డైసన్ కంపెనీ ఈ పరికరాన్ని సృష్టించింది. ఈ డివైజ్ ఎక్కువ వేడి లేకుండా కేవలం ఎయిర్ ఫ్లో సాయంతో జుట్టును స్టైల్ చేస్తుంది. అధునాతన సాంకేతికతో ఇది మీ జుట్టుకు ట్రెండీ లుక్ను అందిస్తుంది. డైసన్ ఎయిర్రాప్ పరికరం బ్లూటూత్ కనెక్టివిటీతో పని చేస్తుంది. ముందుగా ఫోన్లో మై డైసన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీ వెంట్రుకల తీరు, అలాగే మీరు ఎలాంటి స్టైల్ కోరుకుంటున్నారో ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలాంటి స్టైల్ సరిపోతుందో కూడా సూచనలిస్తుంది. దీంతో జుట్టును ఎలా స్టైల్ చేసుకోవాలో అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న స్టైల్ ప్రకారం ఈ పరికరం మీ జుట్టుకు అందమైన రూపాన్ని ఇస్తుంది. డైసన్ ఎయిర్రాప్ ఆరు రకాల ఎటాచ్మెంట్స్తో లభిస్తుంది. ఈ పరికరంలో మూడు రకాల హీట్ సెట్టింగ్లు, 3 రకాల స్పీడ్ సెట్టింగ్లు ఉన్నాయి. వీటి సాయంతో మీరు తడి జుట్టును ఆరబెట్టుకోవచ్చు. జుట్టుకు బౌన్సీ కర్ల్స్, అందమైన అలల రూపాన్ని సులభంగా అందించవచ్చు. ఈ పరికరంలోని లార్జ్ రౌండ్ వాల్యూమైజింగ్ బ్రష్ జుట్టుకు మంచి ఆకృతిని ఇస్తుంది. అలాగే దీనిలోని సాఫ్ట్ స్మూతింగ్ బ్రష్ చిక్కులను తొలగిస్తుంది. ఈ పరికరంలో అత్యాధునిక హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది సెకెన్కు 40 సార్లు వేడిని చెక్ చేస్తుంది. దీంతో మీ జుట్టుకు వేడి కారణంగా ఎటువంటి డ్యామేజీ జరగదు. మొత్తంగా ఈ మల్టీ హెయిర్ స్టైలర్ సాయంతో బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా, జుట్టుకు ఎలాంటి డ్యామేజీ కాకుండా ఇంట్లోనే రింగులు తిరిగే ముంగురులను సొంతం చేసుకోవచ్చు. దీని ధర రూ. 45,900. (చదవండి: -
ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరిన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?– సుజాత, విజయవాడమీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?– వనజ, నర్సాపురంమీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం. ఇందులో సర్విక్స్ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి. డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!) -
స్లీప్..స్క్రీన్..స్టడీ..!
ఈతరం విద్యార్థులు ప్రతిరోజూ పరీక్షలు, అసైన్మెంట్లు, పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, బెస్ట్ రిజల్ట్స్కు ఉపయోగపడే అంశాలు నిద్ర, స్క్రీన్ టైమ్. స్టడీ హేబిట్స్. ఏమాత్రం వ్యాయామం చేయకుండా అర్ధరాత్రి వరకూ స్క్రీన్ చూసుకుంటూ గడిపేస్తే ఫోకస్ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అకడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్లీప్, స్క్రీన్, స్టడీ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అందుకే ఈ రోజు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. 1. నిద్రతోనే మేధస్సు పునరుజ్జీవంనిద్ర మన జీవితంలో విడదీయలేని భాగం. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మానసిక శక్తి, రోజువారీ పనులు నిర్వహించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యార్థుల విజయంలో హార్డ్ వర్క్తో పాటు వారి నిద్ర కూడా ముఖ్యమైన అంశం.మనం పగలు నేర్చుకున్న అంశాలు రాత్రి నిద్రలో మెదడులో నిక్షిప్తమవుతాయి. నిద్ర తగ్గితే మెమరీ కెపాసిటీ కూడా 40 శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాల్లో వెల్లడైంది.నిద్ర అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి అవసరమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను ప్రభావితం చేస్తుంది. నిద్ర లేని పిల్లలు ఎక్కువగా కోపం, తీరని భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇది వారి ఫోకస్ను, నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు.2. నిద్ర, మార్కులు తగ్గించే స్క్రీన్ టైమ్ ఈ డిజిటల్ యుగంలో ప్రతి చోటాస్క్రీన్లు ఉన్నాయి. పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా వీడియో గేమ్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచీ వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్లు ఉత్పత్తి చేసే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ను కదిలించి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు వెళ్లడానికి గంట ముందు వరకూ స్క్రీన్ చూస్తుంటే అది నిద్రపట్టడాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. రీల్స్, వీడియోలు చూడటం వల్ల సంతోషాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక పెరుగుతుంది. స్క్రీన్కు అడిక్ట్ అవుతారు. దీంతో చదువుకునే సమయం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు మూడు గంటలుంటే వారి అకడమిక్ స్కోర్లు తగ్గినట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 3. ఫోకస్, రిటెన్షన్ మెరుగుపరచడంనిద్రను, స్క్రీన్ టైమ్ను సరిగా సెట్ చేస్తేనే విద్యార్థులు సరిగా చదవగలుగుతారని, మార్కులు పెరుగుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. 25 నిమిషాల చదువు తర్వాత ఐదునిమిషాల విరామం తీసుకోవడం, మానసిక అలసట నుండి రీచార్జ్ కావడం అకడమిక్ సక్సెస్లో చాలా కీలకమైన విషయం.ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం మొక్కుబడిగా చదవడం కంటే ఇష్టంగా చదవడం, చదివిన దాన్ని ఇతరులతో చర్చించడం వల్ల సమాచారం నిలుపుకోగల శక్తి 50 శాతం పెరుగుతుంది. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఫోకస్తో చదివి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. కనీసం7–8 గంటలు నిద్రపోవాలి.నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్టాప్, టీవీ వాడకండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్ను తగ్గిస్తుంది.మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఒకేసారి ఒక్క పనిపై ఫోకస్ చేయండి. చదువుతో పాటు మొబైల్ చూడడం ఏకాగ్రతను తగ్గిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ చేయండి. సబ్జెక్ట్ను మళ్లీ మళ్లీ చదవకుండా, ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.రోజూ వ్యాయామం చేయండి. 20–30 నిమిషాల వాకింగ్, యోగా లేదా క్రీడలు ఆడడం ఏకాగ్రతను పెంచుతుంది.చదువుల మధ్యలో ఐదునిమిషాలు మైండ్ఫుల్ బ్రేక్లు తీసుకోండి. డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఒకేసారి ఎక్కువగా చదవకండి. కొన్ని రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే మెదడులో నిలుస్తుంది.జంక్ ఫుడ్ తగ్గించి, పళ్లు, గింజలు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినండి. ఇవి మెదడుకు శక్తినిస్తాయి.రోజులో కనీసం రెండు గంటలు మొబైల్ లేకుండా గడపండి. ఆ టైమ్లో పుస్తకం చదవండి లేదా కుటుంబంతో మాట్లాడండి. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
థీమ్డ్ మిర్రర్స్..! అదంలా తళతళలాడేలా అలంకరిద్దాం ఇలా..
ఒకప్పుడు మన రూపాన్ని చూసుకోవడానికి మాత్రమే ఇంట్లో అద్దాలు ఉండేవి. ఇప్పుడు ఇంటి అలంకరణలో అద్దం అంతర్భాగంగా మారింది. ఇంటీరియర్ థీమ్కి అనుగుణంగా థీమ్డ్ మిర్రర్స్ను డిజైన్ చేస్తున్నారు నిపుణులు. వీటి రూపకల్పనలోనే డిజైనర్లు తమదైన ప్రతిభ చూపుతున్నారు. ఇంటికి వినూత్న కళను తీసుకువస్తున్నారు. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే డెకరేషన్ వస్తువులుగా మారిన అద్దాలను సరైన థీమ్తో ఎంపిక చేసుకుంటే, అది కేవలం అద్దం మాత్రమే కాకుండా ఒక కళాఖండంగానూ మారుతుంది. పెద్ద గదులకు థీమ్ మిర్రర్స్వింటేజ్ థీమ్ మిర్రర్ డిజైన్స్లో పాతకాలపు డిజైన్లు కనిపిస్తాయి. కార్వింగ్తో ఉండే వుడ్ లేదా బ్రాస్ ఫ్రేమ్స్ 19వ శతాబ్దపు ఛాయలు కనిపిస్తాయి. బొహిమియన్ స్టైల్లో చూపులను తిప్పుకోనివ్వని రంగులు, కార్వింగ్ డిజైన్లు కనువిందు చేస్తాయి. చిన్నగదులకు సింపుల్ మిర్రర్స్అద్దాలు అలంకరణలో కీలకం అని, నచ్చింది కదా అని మన ఇంటి గదుల నిర్మాణం గురించి ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. చిన్న గదులకు క్లియర్ లైసెన్స్, సింపుల్ డిజైన్, న్యూట్రల్ కలర్స్, మెటల్ ఫ్రేమ్స్ చక్కగా నప్పుతాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి.ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే మిర్రర్స్పువ్వులు, లతలు, ఆకులతో మిర్రర్ ఔట్ డిజైన్స్, వుడ్ టెక్స్చర్, ప్రకృతిని ప్రతిబింబించే రూపాలు వీటిలో కనిపిస్తాయి. ఇవి పెద్ద హాల్, డైనింగ్ ఏరియాలో సెట్ అవుతాయి. కార్టూన్ క్యారెక్టర్స్, యానిమల్ షేప్స్వి కిడ్ రూమ్ డెకరేషన్కు బాగా సరిపోతాయి. ఉన్నదాని కన్నా గది విశాలంగా చూపాలంటే థీమ్డ్ మిర్రర్ వర్క్ బాగా ఉపయోగపడుతుంది. ఇంటి వాల్ కలర్, ఫర్నిచర్తో సరిపోయేలా మిర్రర్ డిజైన్ ఎంచుకోవాలి. ఇలాంటివి ఆన్లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. మోడల్, వింటేజ్ స్టైల్ థీమ్ను బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్కెట్లో మిర్రర్స్ లభిస్తున్నాయి. ఎన్నార్(చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..) -
నటి లావణ్య త్రిపాఠి లుక్ని యంగ్గా చూపించే ఫ్యాషన్ సీక్రెట్స్ ఇవే..!
స్టయిల్కి ఒక ఫ్రెండ్, సింపుల్ బ్యూటీకి ఒక సీక్రెట్ ఉంటే అది లావణ్య త్రిపాఠీనే! ఎక్కడ చూసినా ఆమె చిన్న చిరునవ్వు, సాఫ్ట్ గ్లో కలసి తన మొత్తం లుక్ను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్తాయి. చిన్న స్టడ్స్, మినిమల్ జ్యూలరీ నా ఫేవరెట్. అవే నా పర్సనాలిటీని బెస్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. కొన్నిసార్లు ఒక్క స్టేట్మెంట్ పీస్ చాలు, లుక్ మొత్తం ఎలివేట్ అవుతుంది. డ్రెస్లలో పేస్టల్ షేడ్స్, సాఫ్ట్ కలర్స్నే నేను ఎక్కువగా ఎంచుకుంటాను. ఇవి నన్ను ఎప్పుడూ ఫ్రెష్గా, యంగ్గా చూపిస్తాయని అంటుంది లావణ్య త్రిపాఠి. ఇక్కడ లావణ్య ధరించిన డ్రెస్ బ్రాండ్ ఇస్సా స్టూడియో. ధర: రూ. 19,500, జ్యూలరీ బ్రాండ్: రియా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చెవిపోగుల బాస్!అమ్మాయిల అలంకరణకు ప్రాణం పోయడానికి పెద్ద పెద్ద ఆభరణాలు అవసరం లేదు, సరైన చెవిపోగులు ఉంటే చాలు. మొత్తం స్టయిల్నే మరో లెవెల్కి తీసుకెళ్తాయి. అలాంటి వాటిలో ముందుండేవి ఈ లాంగ్ డ్రాప్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. గోల్డెన్ టచ్తో మెరిసే స్టోన్స్, లేయర్ డిజైన్ , చూసే వారందరినీ ఆకట్టుకునే మెరుపు – ఇవన్నీ కలిపి ఒకేసారి రాయల్గా, మోడ్రన్ గా కనిపించేలా చేస్తాయి. పొడవుగా ఉండటం వలన ముఖాన్ని సన్నగా చూపిస్తాయి, ముఖానికి ఎలిగెన్స్ ఇస్తాయి. జుట్టు వెనక్కి కట్టుకున్నా, లైట్ వేవ్స్లో వదిలినా, ఈ ఇయర్రింగ్స్ మెరుపే మొదట కనిపిస్తుంది. డీప్ వీ నెక్ లేదా బోట్ నెక్ టాప్ వేసుకుంటే చెవిపోగులు ఇంకా క్లాసీగా మెరిసిపోతాయి. మేకప్ విషయానికి వస్తే షిమ్మరీ ఐలిడ్, లైట్ మస్కారా, న్యూడ్ లిప్ షేడ్ సరిపోతాయి. స్టేట్మెంట్ పీస్ కాబట్టి నెక్లెస్ అవసరం లేదు, సింపుల్ రింగ్ లేదా బ్రేస్లెట్ చాలు. వెడ్డింగ్, రిసెప్షన్ , ఫెస్టివల్ లేదా పార్టీ ఏ సందర్భంలో వేసుకున్నా ఈ చెవిపోగులు లుక్కి ఒక స్పెషల్ స్టన్నింగ్ టచ్ ఇస్తాయి. సింపుల్ డ్రెస్పైనా కూడా ఇవి వేసుకుంటే ఆటోమేటిక్గా గ్లామరస్గా, రాయల్గా మారిపోతారు. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
నూడుల్స్ తినడమే ఒక గేమ్!
చాలా దేశాల్లో ఆడుతూ పాడుతూ ఆహారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సంప్రదాయమే! తినేవారిలో గొప్ప అహ్లాదాన్నీ, అనుభూతినీ నింపే ఈ కళలకు ప్రజాదరణా ఎక్కువే! ఆయా దేశాల జీవనశైలికి తగినట్లుగా ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన ఆహారపు విధానాలు ప్రపంచదేశాల పర్యాటకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటిదే జపాన్లోని ‘నాగాషి సోమెన్’ అనే అహ్లాదకర విధానం. ఈ విధానం అక్కడ వేసవి కాలంలో (జూన్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ) ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో జపాన్ వెళ్లిన పర్యాటకులు కూడా ఈ ‘నాగాషి సోమెన్’ నూడుల్స్ని రుచి చూస్తుంటారు. జపనీస్ భాషలో ‘నాగాషి’ అంటే ‘ప్రవహించేది’, ‘సోమెన్’ అంటే సన్నని నూడుల్స్ అని అర్థం. ఈ పద్ధతిలో, గోధుమతో చేసే సాఫ్ట్ నూడుల్స్ వెదురు గొట్టాల గుండా ప్రవహించే చల్లని నీటిలో వెళ్తుంటాయి. వాటిని ఇరువైపులా కూర్చున్న జనాలు చాప్స్టిక్లతో పట్టుకుని తినడం ఒక సరదా ఆటలా ఉంటుంది. ఇది ఒక సవాలుతో కూడిన సరదా ఆట. పట్టుకున్న నూడుల్స్ని ‘త్సుయు’ అనే సోయా డిప్పింగ్ సాస్లో ముంచుకుని తింటారు. ఈ సాస్ నూడుల్స్కు మంచి రుచిని ఇస్తుంది. వేసవిలో వేడి ధాటి నుంచి ఈ చల్లని నూడుల్స్ ఉపశమనం ఇస్తాయట. నాగాషి సోమెన్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే ఒక సామాజిక కార్యక్రమం. చాలా నాగాషి సోమెన్ రెస్టరెంట్లు ప్రకృతి ఒడిలో, నదులు లేదా అడవుల పక్కన ఉంటాయి. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి అందాలను చూసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. ఒక ఆసక్తికరమైన అంశమేమిటంటే, మీరు ఒకసారి పట్టుకోవడంలో విఫలమైతే, ఆ నూడుల్స్ కిందకు వెళ్లిపోతాయి. అందుకే ఈ వెదురు బొంగుల పక్కన కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. నూడుల్స్ మొత్తం అయిపోయాయని సూచించడానికి చివరగా షెఫ్స్ ఒక గులాబీ రంగు నూడుల్ను వదులుతారు. ఇది ముగింపుకు సంకేతం. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
నాన్నా... నువ్వెక్కడ?
2016లో ‘లయన్’ అనే సినిమా వచ్చింది. కథానాయకుడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్. లయన్ కథకు వస్తే సరూ అనే అయిదేళ్ల పిల్లాడు ఇంటి నుంచి పారిపోయి రైలెక్కుతాడు. అది వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్కతా చేరుకుంటుంది. అప్పటినుంచి ఆ పిల్లాడి ఒంటరి పోరాటం మొదలవుతుంది. అక్కడ ఆ బాలుడి జీవితం రకరకాల మలుపులతో ఆఖరుకు ఒక ఆస్ట్రేలియన్ జంటకు దత్తతతో ఆస్ట్రేలియా చేరుకుంటుంది. పాతికేళ్ల తర్వాత సొంతకుటుంబాన్ని కలవాలనే తాపత్రయంతో గుప్పెడు బాల్య జ్ఞాపకాలను తోడు చేసుకుని, గూగుల్ ఎర్త్ సాయంతో తన ఇంటిని కనుక్కుంటాడు, కుటుంబాన్ని కలుసుకుంటాడు. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా అది.సంధ్యారాణి కథా అలాంటిదే! అయితే ఆమె ఇంకా సొంత కుటుంబాన్ని కలుసుకోలేదు. అన్నం, పప్పు తిన్న లీలామాత్రపు జ్ఞాపకాలతో తల్లిదండ్రుల అన్వేషణలో ఉంది. తన కథ సుఖాంతం కావడం కోసం ఎదురు చూస్తోంది. సంధ్యారాణి చెప్పిన వివరాల ప్రకారం ఆ కథ ఎక్కడ మొదలైందంటే..1987...హైదరాబాద్, ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వాసి కె.రామయ్య నిజాం కాలేజ్లో తోటమాలి. అతనికి అబిడ్స్లోని పరాస్ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్ బి. రాజ్కుమార్తో స్నేహం కుదిరింది. మాటల్లో తనదీ, రాజ్కుమార్దీ ఇద్దరిదీ ఒకే కులమని తేలింది. దాంతో తన మరదలు అనసూయకు రాజ్కుమార్తో పెళ్లి చేయాలనుకుని రాజ్కుమార్ ని అడిగాడు. అయితే తనకు అంతకుముందే పెళ్లై, మూడేళ్ల కూతురూ ఉందని, కాకపోతే భార్య చనిపోయిందని చెప్పాడు రాజ్కుమార్. అయినా సరే తమ ఆర్థికపరిస్థితి దృష్ట్యా మరదలికి రాజ్కుమార్తో వివాహం జరిపించాడు రామయ్య. ముచ్చటగా మూడు నెలలు గడిచాయి. రాజ్కుమార్ పత్తాలేకుండా పోయాడు బిడ్డను అనసూయ దగ్గరే వదిలి. పరాస్ బార్ అండ్ రెస్టరెంట్కి వెళ్లి వాకబు చేశాడు రామయ్య. నెల రోజులుగా పనిలోకి రావట్లేదని చెప్పారు హోటల్ సిబ్బంది. రాజ్కుమార్ కోసం వెదికి వేసారిన రామయ్య.. సంధ్యను విజయనగర్ కాలనీలోని సేవా సమాజం.. బాలికా నిలయమనే అనాథాశ్రమంలో వదిలేశాడు.1988...సంతానం లేని స్వీడన్ జంట మిస్టర్ అండ్ మిసెస్ లిండ్గ్రెన్ సంధ్యారాణిని దత్తత తీసుకున్నారు. అలా స్వీడన్ వెళ్లిన సంధ్యారాణి.. ఊహ తెలిసేప్పటికి అది తన మాతృదేశం కాదని.. వాళ్లు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారనే సత్యాన్ని గ్రహించింది! పై చదువు కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో తన అసలు పేరెంట్స్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. తనది హైదరాబాద్ అని, సేవా సమాజం బాలికా నిలయం నుంచి తనను తెచ్చుకున్నామనే స్వీడన్ పేరెంట్స్ చెప్పిన విషయం తప్ప ఇంకే సమాచారమూ లేదు. కాబట్టి యూకేలో ఉంటూ హైదరాబాద్లో తన మూలాల కోసం చేసిన వాకబు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. దాంతో 2009లో తొలిసారిగా హైదరాబాద్కు వచ్చింది సంధ్య. తనను దత్తత ఇచ్చిన అనాథాశ్రమానికి వెళ్లింది. పెద్దగా వివరాలేవీ దొరకలేదు. చదువైపోయి లండన్లో ఉద్యోగం చేస్తూ, వీలు దొరికినప్పుడల్లా హైదరాబాద్ వస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా ఒంటరి వెదుకులాట దారీతెన్నూ చూపలేదు.2025...జన్మనిచ్చిన తల్లిదండ్రులను కలవాలనుకునే దత్తత పిల్లలెందరికో సహాయపడుతున్న సంస్థ.. పుణేలోని అడాప్టీ రైట్స్ కౌన్సిల్ గురించి సంధ్యకు తెలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ అంజలి తారా బబన్రావ్ పవార్ని కాంటాక్ట్ చేసింది. ఆమె.. సంధ్యకు సాయం చేయడానికి సిద్ధపడింది. మొత్తానికి అంజలి సహకారంతో రామయ్యను కలుసుకోగలిగింది సంధ్య. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సంధ్య సవతి తల్లి అనసూయ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు రాజ్కుమార్ సొంతూరు వరంగల్ అని, అతని తోబుట్టువులు అక్కడే ఉన్నారనీ తెలిపాడు. ఆ మాత్రం ఆధారంతోనే ఆత్రంగా సంధ్య వరంగల్ ప్రయాణమైంది. అమ్మానాన్నలు కనిపిస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా అంటుంది నీళ్లు నిండిన కళ్లతో. ‘వరంగల్లో నాన్నే కాదు అమ్మా కనిపిస్తుందని ఆశ. అమ్మ చనిపోయిందని రామయ్యగారితో నాన్న చెప్పినా నాకు మాత్రం అమ్మ బతికే ఉందనిపిస్తోంది. నాలా విదేశాలకు దత్తత వెళ్లి.. సొంత తల్లిదండ్రులను కలవాలనుకుంటున్న వాళ్లెందరో! పెద్దలందరికీ నాదొకటే విన్నపం.. దయచేసి పిల్లలను విదేశీయులకు దత్తత ఇవ్వకండి. ఎంత కష్టమైనా సొంత దేశంలోనే పెరగనివ్వండి. దత్తత వెళ్లిన పిల్లలకు అక్కడ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. అమ్మానాన్నలనే కాదు సొంత ఊరు, భాష, సంస్కృతి.. ఒక్కమాటలో చెప్పాలంటే మా గుర్తింపును, ఉనికినే కోల్పోతున్నాం. దానంత నరకం ఇంకోటి లేదు. నా సంబంధీకులెవరైనా ఉండి.. నన్ను పోల్చుకోగలిగితే దయచేసి నన్ను కాంటాక్ట్ అవండి. మా అమ్మానాన్నల జాడ చెప్పండి!’ సంప్రదించాల్సిన నంబర్.. 9822206485.’’ అంటూ తన కథ చెప్పింది సంధ్య. ఆమె త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటుందని ఆశిద్దాం.– సరస్వతి రమ– ఫొటోలు: గడిగె బాలస్వామి -
జూపిటర్ ది సూపర్ కంప్యూటర్..!
ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. పేరు జూపిటర్. పశ్చిమ జర్మనీలోని జూలిచ్ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్లో తొలి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్. అంటే ఇది సెకనుకు ఒక క్విన్టిలియన్ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్ చేయగలదు. ఈ సూపర్ కంప్యూటర్ భారీ సైజ్లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి. టెక్ టాక్ జూపిటర్– ది సూపర్ కంప్యూటర్ ఇక్కడ కనిపిస్తున్నదేమిటో తెలుసా? యూరప్లోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్. పేరు జూపిటర్. పశ్చిమ జర్మనీలోని జూలిచ్ నగరంలో గత వారం దీనిని ప్రారంభించారు. ఇది యూరప్లో తొలి ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్. అంటే ఇది సెకనుకు ఒక క్విన్టిలియన్ (అంటే 1 పక్కన 18 సున్నాలు) కాలిక్యులేషన్స్ చేయగలదు. ఈ సూపర్ కంప్యూటర్ భారీ సైజ్లో ఉంటుంది. పర్యావరణ పరిశోధనల్లో, ఏ.ఐ.లో కొత్త పరిశోధనలకు ఈ కంప్యూటర్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మీరు నెట్లో దీని గురించి మరింతగా చదివి తెలుసుకోండి.(చదవండి: పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!) -
భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!
మెదడుకు చేరాల్సిన ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులు, రక్తప్రసరణల అడ్డంకులు రకరకాల సమస్యలకు కారణం అవుతుంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ సమస్యను యోగాసనాల ద్వారా బ్యాలెన్స్ చేసుకునే ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో ప్రసరిత హస్త ఉత్థానాసన ఒకటి. దీన్నే వైడ్ స్టాన్స్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు.ప్రసరిత హస్త ఉత్థానాసన...సంస్కృతంలో ‘హస్త’ అంటే చేతులు, ‘ఉత్’ అంటే తీవ్రమైన, ‘తాన్’ అంటే సాగదీయడం, ‘ప్రసరిత’ అంటే విస్తరించడం. చేతులు, పాదాలను స్ట్రెచ్ చేయడం ఈ ఆసనంలో చూస్తాం. ఈ ఆసనం ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేసింది. మీరు దీన్ని ఎలా చేయవచ్చో ఇక్కడ ఉంది.ఇలా చేయాలి... సమస్థితిలో నిలబడి, దీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి చేతులను తలపైకి లేపి, వెన్నును ముందుకు తలను వెనక్కి వంచాలి. ఈ సమయంలో చేతులు కూడా వెనక్కి వంచాలి అదే భంగిమ నుంచి మెల్లగా తల భూమికి ఆనేలా ముందుకు వంగాలి. చేతులను నేలకు ఆనించడం, వీలైతే దాలను పట్టుకోవడం.. చేయవచ్చు ఈ భంగిమలు ఐదు దీర్ఘ శ్వాసలు తీసుకొని, వదలాలి. తిరిగి యధా స్థితికి చేరుకోవాలి దీంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మెరుగు అవుతాయి. సూర్య నమస్కారాల్లో రెండవ భంగిమతో మొదలుపెట్టే ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవల్స్, రక్త ప్రసరణలో మెరుగైన ఫలితాలు పొందవచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
అందమైన జీవితానికి అర్థం ఈ దంపతులు..!
పక్షుల కువకువలే తప్ప హారన్ మోతలు లేవు, ఎటు చూసినా పచ్చని చెట్లు, పంటపొలాలే తప్ప. ఎత్తైన భవనాలు లేవు. అలారం మోతతోనో మొబైల్ఫోన్ కాల్తోనో కాకుండా నులివెచ్చని సూర్యకిరణాలు తట్టిలేపుతున్నాయి. బ్రేక్ మీద నుంచి కాలు తీయలేని ట్రాఫిక్ జామ్లు లేవు, కాలినడకతో ఎంతదూరం వెళ్లినా అడుగులకు బ్రేక్ వేయాల్సిన పనిలేదు. ఎండ, వాన, చలికాలాలను అచ్చంగా ఆస్వాదించవచ్చు. నీల్, మోమోలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన స్వప్నిల్ రావు, మృణ్మయీ దేశ్పాండేల జీవితం ఇది. వాళ్లు ఐదేళ్ల కిందట మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండల్లోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ కొంత బంజరు నేలను కొని సాగు చేశారు. గొప్ప ఇంజినీరింగ్ స్కిల్తో ఇంటిని నిర్మించుకున్నారు. నగరంలో పుట్టి పెరిగిన వాళ్లకు గ్రామం ఎలా ఉంటుందో తెలియదు. సినిమాల్లో చూడడం తప్ప గ్రామాన్ని, గ్రామీణ జీవితాన్ని ఎక్స్పీరియెన్స్ చేయలేరు. ముంబయి దంపతులు నగరాన్ని వదిలి కొండకోనల్లోని ఓ కుగ్రామానికి వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. అది కూడా పర్యావరణ హితంగా. స్థానికంగా దొరికే ల్యాటరైట్ ఇటుకలతో ఇద్దరూ ఇటుక ఇటుక పేర్చి ఇంటిని నిర్మించుకున్నారు. బంజరు భూమిని చదును చేసి సాగులోకి తెచ్చి స్వయంగా మొక్కలు నాటి పంటలు పండిస్తున్నారు. జీరో వేస్ట్ లైఫ్స్టైల్ను అనుసరిస్తున్నారు. ఇది నీల్, మోమో దంపతుల అచీవ్మెంట్.ఎకోఫ్రెండ్లీ జీవితం స్వప్నిల్, మృణ్మయిలు సిటీ బిజీ జీవితంలో అలసిపోయారు. జీవితం ఇంకోలా ఉంటే బావుణ్ణనుకున్నారు. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు వాళ్లు ములుసార్ గ్రామంలో జీవిస్తున్న ఎకోఫెండ్లీ జీవితం. 2020 నుంచి అక్కడే జీవిస్తూ పొలాన్ని సాగు చేసి రకరకాల కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ఆ ఉత్పత్తులతో నగరానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. నీల్ అండ్ మోమో పేరుతో పర్యావరణహితమైన సబ్బులు, షాంపూలు ఇతర ఉత్పత్తుల పరిశ్రమ నిర్వహిస్తున్నారు. మదర్ ఎర్త్ని కాపాడుకోవడం నగర జీవితంలో సాధ్యం కావడం లేదు. ప్రకృతితో కలిసి జీవిస్తూ నగరాల్లో ఉండే వారికి పర్యారణహితమైన ఉత్పత్తులను చేరుస్తున్నారీ దంపతులు. (చదవండి: దటీజ్ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..!) -
'దటీజ్ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..!
పశ్చిమ బెంగాల్లోని మాల్డా వీధుల్లో సాదాసీదాగా ఉండే ఒక వృద్ధ మహిళ ఒక ముతక సంచీ భుజాన వేసుకుని షేరింగ్ ఆటోలో ప్రయాణిస్తుండటం కనిపిస్తుంది. ఆమె వయసు 70 ఏళ్లు, అయితేనేం.. ఉత్సాహంలో.. చురుకుదనంలో పాతికేళ్ల యువతీ యువకులతో పోటీ పడుతోందామె. స్కూల్ టీచర్గా పుష్కరం క్రితం రిటైరైందామె. ప్రభుత్వం వారిచ్చే పెన్షన్ తీసుకుంటూ హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా... ఈ వయసులో మీరు ఇంత శ్రమ తీసుకోవడం అవసరమా? అనడిగితే... ‘‘చదువుకోవాలని కొండంత కోరిక ఉన్నా, బోలెడంత డబ్బు పెట్టి చదువు కొనలేక నిరుత్సాహంతో నీరసపడిపోయే నిరుపేద పిల్లలకు నాకు తెలిసిన నాలుగు అక్షరం ముక్కలు నేర్పి, వారి కాళ్ల మీద వాళ్లను నిలబడేలా చేయాలన్న నా కలే నాకు ఉత్సాహాన్నిస్తోంది’’ అంటుందామె. ఆమె సప్నా ఘోష్ రాయదాస్, గత పదేళ్లుగా ఆమె జీతం లేకుండా గణితం, సైన్సుబోధిస్తోంది.ఆమె 2015లో ఉద్యోగ విరమణ చేసినప్పటినుంచి ఇంట్లో కూర్చోవడానికి బదులుగా, ఆమె ప్రతిరోజూ 7 కిలోమీటర్లు ప్రయాణించి మరీ మారుమూలన ఎక్కడో నిరుపేదల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆ పాఠశాలకు వెళ్లి, గణితం, సైన్స్ బోధించాలనుకుంది. ఎందుకంటే ఆమెకు అందులోనే శాంతి, విశ్రాంతి కూడా.సప్నాకు సొంత పిల్లలు లేరు, కానీ ఆమె బోధించిన పిల్లలు వీధిలో ఆమెను చిరునవ్వుతో పలకరించి ఆమె పాదాలను తాకినప్పుడు, ఆమె హృదయం గర్వం, ఆనందంతో నిండిపోతుంది. ‘చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలని కలలు కనేదాన్ని, కానీ మా ఇంటి పరిస్థితులు నన్ను టీచర్ కావడానికి దారితీశాయి. నా విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు కావడం చూసినప్పుడు, నేను చేసినది నా కల కంటే గొప్పదని నాకు అనిపిస్తుంది.‘ అంటున్న సప్న రాయ్ అందరికీ స్ఫూర్తిదాయకం. (చదవండి: లిటిల్ పొయెట్..! ) -
కసివద్దు..'పంచ్'కోండి..! కోపాన్ని కక్కేయండిలా..
‘‘శిలలపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు మనసులో కోపాన్ని బయటికే తోసినారూ...!’’ అంటూ పాడుకుంటూ ప్రస్తుతం థాయిలాండ్ వాసులు తమలోని ఫ్రస్టేషన్ను బయటకు వెళ్లగక్కుతున్నారు. ‘‘అహో ఆఫీసు బాసూ... ఆ యముడంటి క్రూరిస్టు శాడిస్టు ఫేసూ... ఈ ఆఫీసు యజమానిగా మా పిడిగుద్దుల పాలబడ్డావయా...’’ అని ఆలాపన పాడిన తర్వాత... ‘‘ప్రతిమపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు కసితీర అక్కసును వెళ్లగక్కినారూ’’ అంటూ ఖూనీచేయాల్సినంత కసిని... కూనిరాగాలతో సరిపెట్టుకుని తమ కోపాల్నీ, ఫ్రస్టేషన్లనూ బయటకు తీసిపడేస్తున్నారు. దాంతో తమ ‘కోప్తాపాలూ డీప్ డిప్రెషన్ల’ నుంచి చప్పున బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందంటూ హ్యాపీగా చెబుతున్నారు. ఇలా కోపం వెళ్లగక్కేది విధిగా మన బాసు పైనే కానక్కర్లేదు... అది యథేచ్ఛగా మన ఎక్స్ గాళ్ఫ్రెండూ కావచ్చూ లేదా మన బాయ్ఫ్రెండూ కావచ్చు. ఇలా వాళ్లెవరైనప్పటికీ... వాళ్ల మీద ఉన్న కసినీ, అక్కసును కూడా హాయిగా... ‘‘వారెవా ఏమి ఎక్సు... నన్ను వదిలేసి దౌడు తీసూ’’ అంటూ మాజీ ప్రేమిక (కుడి) మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుకోవచ్చు. అలా మన మనసులోని కోపాగ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మరెక్కడో కాదు... మన పొరుగున ఉన్న థాయిలాండ్లోనే. అక్కడి వీధుల్లో ప్రతిమలు తయారు చేసే ఓ స్కల్ప్చర్ షాప్ ఉంది. మనం చేయాల్సిందల్లా మన ఆగ్రహానికి గురికాబోయే సదరు అభాగ్యుల ఫొటో తీసుకెళ్లి... జస్ట్ వాళ్లకు హ్యాండోవర్ చేసేయడమే. వాళ్లు శ్రద్ధగా జీవం ఉట్టిపడేలా మనక్కావాల్సిన ప్రతిమను తయారు చేసి పెడతారు. అంతే... ఆ తర్వాత మనం దాంట్లోని జీవకళంతా వెళ్లి΄ోయేలా, మన మనసులోని కోపమంతా పారిపోయేలా, మన మదిలోని అక్కసంతా తీరి΄ోయేలా బాదేయవచ్చు. ఇక మనలో కసి మరీ ఎక్కువగా ఉందనుకోండి... పుస్తకాల్లో సాదా ప్రతీ, మేలుప్రతిలాగానే... ఆ బంకమట్టిలోపలే కాస్తంత మెటల్ఫ్రేము గట్టిగా అమర్చి మరో పది దెబ్బలకు నిలిచేలా, ఇంకో నాలుగు దెబ్బలు కాసేలా మేలైన స్టాండర్డు మట్టిప్రతిమలు తయారు చేసిస్తారు. మనసాగలేక మనం అక్కడికక్కడే మనస్పూర్తిగా కొట్టేశాక కూడా మన కసి తీరలేదనుకోండి. పర్లేదు... మరో నాల్రోజులకోసం అద్దెకిస్తారు లేదా కాస్త డబ్బులెక్కువ పే చేస్తే మనక్కావల్సిన ప్రతిమను మనకే పర్మనెంటుగా అమ్మేస్తారు కూడా. ఈ ప్రతిమలూ దెబ్బల వ్యవహారమంతా చూస్తూ... ‘‘అద్దిరా కసితీరా కొట్టే దెబ్బలోని పవరు. అరెరె... భలే టెక్నిక్కు కదా... బహుమంచి క్రియేటివిటీ కదా’’ అంటూ కొందరంటూ ఉంటే.. ‘‘ఆ... ఆ టెక్నిక్కుదేవుందీ... ఈ టైపు క్రియేటివిటీ మనకెప్పట్నుంచో తెలుసు. దెబ్బకు దెయ్యం దిగొస్తుందనే సామెత మన దగ్గర లేదా’’ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ‘‘మన హాస్య దర్శకుడు జంధ్యాల ఇలాంటి టెక్నిక్కులనెప్పుడో కనిపెట్టేశారంటూ ‘అహ నా పెళ్లంట’ సినిమాల్లో బ్రహ్మానందం... వాళ్ల బాసూ, పరమ పిసినారి పీసు కోట శ్రీనివాసరావును షాట్ ఫ్రీజు చేసి మరీ ‘‘పోతావురా ఒరేయ్... మట్టిగొట్టుకుపోతావు రా... నాశనమైపోతావురా’’ అంటూ తిట్టే షాట్లూ... ‘‘బాబాయ్ అబ్బాయ్ సినిమాలో సుత్తివేలు తనకు కోపం వచ్చినప్పుడల్లా చిందులు తొక్కుతూ... రోజుకు ‘మూడు పూటల కోటా’ చొప్పున తాను కసితీరా బాదేయడానికి ఓ బానపొట్ట పహిల్వాన్ను పనిలో పెట్టుకున్న సీన్లూ ఉదాహరిస్తున్నారు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ‘‘మనం ఎవరిపట్ల కోపం కలిగి ఉన్నామో వారికి ఏమాత్రం హాని కలగని విధంగా... కసితీరా మన కినుకను వెళ్లగక్కి హాయిగా కునుకు తీయగలుగుతున్నప్పుడు ఏమార్గమైతేనేమీ... ఈ మార్గమైతేనేమీ’’ అంటూ కొందరిప్పుడు సన్నాయినొక్కులు నొక్కి మరికొందరు... ప్రతిమ మీద దెబ్బలాగా ఢంకా బజాయించి ఇంకొందరూ కసి తీర్చుకునే మార్గానికి సపోర్టు చేస్తున్నారు.– యాసీన్ (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
లిటిల్ పొయెట్..!
కేరళ రాష్ట్రం కోళికోడ్కు చెందిన అజ్ఞా యామి దేశంలో అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు సృష్టించింది. ఐదేళ్లకే కవిత్వం రాసి పుస్తకం వేసింది. రైమ్స్ చెప్పే వయసులో సొంతంగా కవిత్వం రాయడం చాలా గ్రేట్.అజ్ఞా యామి 2017లో జన్మించింది. యూకేజీ చదువుతున్న సమయంలోనే మలయాళ పదాలతో వాక్యాలు రాస్తూ తన భావాలను వ్యక్తం చేసేది. ఆమె ప్రతిభ, భాష పట్ల మక్కువ చూసిన తల్లిదండ్రులు, శ్రీశాంత్, శ్రుతి ప్రోత్సహించారు. కవిత్వం గురించి, కవితల గురించి వివరించారు. కొన్ని కవితలు విన్న అజ్ఞా యామి తనూ కవిత్వం రాయడం మొదలెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని రకరకాల అంశాలపై కవితలు అల్లింది. బాల్యంలోని అమాయకత్వం మొదలుకొని, ప్రకృతిలోని రంగుల వరకు అనేక రకాల సబ్జెక్ట్స్ పై పోయెమ్స్ రాసింది. 30 కవితల్ని కలిపి ‘వర్ణపట్టం’(రంగుల గాలిపటం) పేరుతో పుస్తకం వెలువరించింది. వాటికి బొమ్మలు కూడా తనే గీయడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అతి పిన్న వయస్కురాలైన కవయిత్రిగా రికార్డు అందించారు. (చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు) -
నోరూరించే చాక్లెట్తో టేస్టీ..టేస్టీ రెసిపీలు..!
వయసు తేడాలు లేకుండా అందరికీ నచ్చేది. ఎవరికైనా కానుకగా ఇవ్వాలన్నా సరైన ఎంపికగా ఉండేది. భావోద్వేగాల అదుపుకు సహాయకారిగా మారేది. నలుగురిలో ఉన్నప్పుడు ఆనందపు సంబరాన్ని క్షణాల్లో మూటగట్టి తెచ్చే నేస్తం... చాక్లెట్. పండ్ల ముక్కలతో, డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్ను సులువుగా తయారు చేసుకుందాం. ఆరోగ్యకరమైన ఆనందాన్ని ఇంటర్నేషనల్ చాక్లెట్ డే సందర్భంగా మన వంటింటి నుంచే పంచుకుందాం.ఫ్రూట్ – నట్స్ చాక్లెట్కావల్సినవి: డార్క్ చాక్లెట్ – 350 గ్రా.లు; జీడిపప్పు – 50 గ్రా.లు / అర కప్పు; బాదం పప్పు – 50 గ్రా.లు / అర కప్పు; కిస్మిస్ – 50 గ్రా.లు / అరకప్పు; టూటీ ఫ్రూటీ – అరకప్పు (నారింజ – ఆకుపచ్చవి); నచ్చిన అచ్చు – 1; బటర్ – అచ్చులపైన రాయడానికి టీస్పూన్;తయారీ: ∙ముందుగా నచ్చిన అచ్చు తీసుకొని, దానిని బటర్తో రాసి, కాసేపు పక్కన ఉంచాలి.డబుల్ బాయిలర్ పద్ధతిలో చాక్లెట్ను కరిగించి, పక్కన పెట్టాలి. నట్స్, డ్రై ఫ్రూట్స్ని సన్నని ముక్కలుగా కట్ చేయాలి. వీటిని కరిగిన చాక్లెట్లో వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని స్పూన్తో తీసుకొని, సిద్ధంగా ఉంచిన అచ్చును నింపి, పైన డ్రై ఫ్రూట్స్తో అలంకరించి, గంటసేపు డీప్ ఫ్రీజర్లో ఉంచాలి. ∙మిశ్రమం పూర్తిగా గట్టిపడిందని నిర్ధారించుకున్నాక, దానిని ఆస్వాదించవచ్చు. గిఫ్ట్గానూ ఇవ్వచ్చు.చాక్లెట్ కవర్డ్ ఫ్రూట్కావల్సినవి:సెమీ స్వీట్ కోకో చాక్లెట్ చిప్స్ – కప్పుబటర్ – 2 టేబుల్ స్పూన్లుఫ్రూట్స్ (స్ట్రాబెర్రీ/ఆరెంజ్/ ద్రాక్ష / అరటిపండు,.. ) స్లైసులుగా కట్ చేసుకోవాలి – తగినన్నిబేకింగ్ షీట్ – 1తయారీ: చాక్లెట్ను డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించాలి. (స్టెయిన్ లెస్ లేదా గాజు గిన్నెలో చాక్లెట్ వేసి, మరుగుతున్న నీటిలో ఆ గిన్నెను ఉంచి, కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కరిగాక ఆ గిన్నెను బయటకు తీసి, ఒక్కో స్ట్రాబెర్రీ లేదా నచ్చిన పండు ముక్కను ఆ మిశ్రమంలో ముంచి, ప్లేట్పై పరిచిన బేకింగ్ షీట్పై ఉంచాలి. దానిని డీప్ ఫ్రీజర్లో ఉంచి, అరగంట తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి.చాక్లెట్ బాల్స్కావల్సినవి:డ్రై ఆప్రికాట్స్ – 125 గ్రా. (తరగాలి);ఎండుద్రాక్ష – అర కప్పు (తరగాలి);ఆరెంజ్ తొక్క తరుగు – 2 టీ స్పూన్లు;డార్క్ చాకోలెట్ తరుగు – 75 గ్రా.;డార్క్ చాకోలెట్ (అదనంగా) – 200 గ్రాం.లు;బటర్ – 75 గ్రా.;తయారీ: ఒక గిన్నెలో ఆప్రికాట్, ఎండ్రుద్రాక్ష, ఆరెంజ్ తొక్క తరుగు, డార్క్ చాకోలెట్ తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీ స్పూన్ అంత తీసుకొని బాల్స్లా చేయాలి. వీటిని డీప్ ఫ్రీజర్లో రాత్రంతా ఉంచాలి. అదనంగా తీసుకున్న 200 గ్రా.ల చాకోలెట్ను ముక్కలుగా చేయాలి. ఒక గిన్నెలో బటర్, చాకోలెట్ ముక్కలు వేయాలి. పాన్లో నీళ్లు ΄ోసి, మరిగించి, ఆ నీటిలో ఈ గిన్నె ఉంచి చాకోలెట్ కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక దించాలి. ఫ్రిజ్ నుంచి తీసిన ఫ్రూట్ బాల్స్ని చాకోలెట్ మిశ్రమంలో ముంచి, తీయాలి. ఆరాక ఫాయిల్ పేపర్లో ఒక్కో చాకోలెట్ బాల్ని ఉంచి, చుట్టాలి. వీటిని ఫ్రిజ్లో ఉంచి అరగంట తర్వాత సర్వ్ చేయాలి. (చదవండి: -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
'18-10-8-4-1 రూల్'..! జస్ట్ 21 రోజుల్లో ఏడు కిలోల బరువు..
స్పూర్తిదాయకమైన వెయిట్లాస్ స్టోరీలు ఎన్నో చూశాం. వాటన్నింటిలో క్రమశిక్షణ, నిబద్ధతకు పీఠం వేస్తే బరువు తగ్గడం సాధ్యమని తేలింది. ఇది కాస్త కఠినమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. అంతలా కష్టతరమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన పని లేకుండానే ఈ చిన్న ట్రిక్స్తో సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది ఈ డైటిషియన్. జస్ట్ ఈ చిన్న రూల్తో సులభంగా వెయిట్లాస్ అవ్వోచ్చు అంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి ఆ రూల్ ఏంటో చూద్దామా..!డైటీషియన్ రిచా గంగాని సోషల్ మీడియా పోస్ట్లో తాను 21 రోజుల్లోనే ఏడు కేజీల బరువు తగ్గినట్లు తెలిపారు. అంతేగాదు తన నడుము సైజు కూడా చాలా వరకు తగ్గిందని రాసుకొచ్చారామె. తాను 18-10-8-4-1 రూల్ని అనుసరించి జస్ట్ 21 రోజుల్లోనే దాదాపు 63 కిలోలు నుంచి 56 కిలోలకు తగ్గినట్లు తెలిపారు. గంటలతరబడి ఆకలితోనూ, కార్డియో వంటి వ్యాయమాల హెల్ప్ లేకుండా స్లిమ్గా మారానని అన్నారామె. తన వెయిట్లాస్ జర్నీలో ఉపవాసం, యాక్టివ్గా ఉండటం, తగినంత హైడ్రేషన్, సమతుల్య ఆహారం, తదితర ప్రధానాంశాలు ఉన్నాయని అన్నారు.18-10-8-4-1 రూల్ అంటే..ఇక్కడ 18 అంటే..18 గంటల అడపాదడపా ఉపవాసం. తాను ఉదయం 11 నుంచి సాయంత్రం 5/6 గంటల మధ్య తింటానని తెలిపింది. ఇది బరువు తగ్గేలా చేయడమే కాకుండా మైండ్ని కూడా క్లియర్గా ఉంచుతుంది.ఇక 10 అంటే..పదివేల అడుగులు..ప్రతి ఒక్కరూ ఇన్ని అడుగులు వేసేలా దశలా వారిగా ప్రారంభించాలని సూచించారామె. ఎందుకంటే ఇది 500 నుంచి 700 కేలరీల దాక సులభంగా బర్న చేయగలదని చెప్పారు.8- ఎనిమింది గంటల నిద్ర. తగినంత విశ్రాంతి కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుందట.4- నాలుగు లీటర్ల నీరు. హైడ్రేషన్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీల అందిస్తుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి చర్మం రంగుని మెరుగుపరుస్తుంది.చివరగా 1-- ఒక గ్రాము ప్రోటీన్ తీసుకోవడాన్ని హైలెట్ చేశారు రిచా. ఇది కండరాలను సురక్షితంగా ఉండేలా బలోపేతం చేస్తుంది. View this post on Instagram A post shared by Richa Gangani - Weightloss👉Thyroid👉PCOS Expert (@dieticianricha2095) అడపదడపా ఉపవాసం ఎలా ఉండాలంటే..రిచా వివిధ రకాల అడపదడపా ఉపవాసాలను పేర్కొన్నారు. 16:8 ఎనిమిదిగంటలు తిని, 16 గంటలు ఉపవాసం ఫ్లెక్సిబిలిటీ కావాలనుకునేవారికి ఇది బెస్ట్5:2 ఇది సాధారణంగా వారంలో ఐదు రోజులు తినడం, రెండు రోజులు ఉపవాసం ఉండటం14:10 ప్రారంభికులకు గొప్పది, పది గంటలు తిరడం, పదిగంటలు ఉపవాసం ఉండటం18:6 ఇది వ్యక్తిగతం కేవలం ఆరు గంటే తినడం, ఏకంగా 18 గంటలు ఉపవాసం ఉండటం. వ్యక్తిగత సామర్థ్యం అనుసరించి పాటించాల్సిన విధానం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.(చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
కొత్త భాషలు ఈజీగా నేర్చుకోండిలా..!
కొత్త భాషలు నేర్చుకునేవారిలో జ్ఞాన విస్తృతి ఒక కోణం అయితే, ఉల్లాసం, ఉత్సాహం అనేది మరో కోణం. మరి మీరు కొత్త భాష నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా! గతంతో పోల్చితే కొత్త భాష నేర్చుకోవడం ఆట్టే కష్టం కాదు. ఇప్పుడు ఎన్నో లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి. అయితే అన్ని యాప్స్ ఉచితం కాదు. ఈ నేపథ్యలో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్కు ప్రాధాన్యత పెరిగింది. ఈ యాప్ కేవలం అనువాదానికి మాత్రమే పరిమితం కావడం లేదు. కొత్త భాషలు నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడనుంది. ‘గూగుల్ ట్రాన్స్లేట్’ యాప్ను ఏఐ–పవర్డ్ లైవ్ ట్రాన్స్లేషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్స్తో అప్డేట్ చేసింది గూగుల్.జెమిని ఏఐ ద్వారా కొత్త గూగుల్ ట్రాన్స్లేట్ ప్రాక్టీస్ మోడ్తో కొత్త భాషలు నేర్చుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్ని ఉపయోగించుకోవచ్చు. కొత్త భాషను వినే, మాట్లాడే అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. రకరకాల సంభాషణలతో భాషా నైపుణ్యాలకు పదును పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు స్పానిష్ మాట్లాడే ప్రాంతానికి వెళ్లబోతున్నారనుకుందాం. అక్కడికి వెళ్లిన తరువాత స్థానికులను ఎలా పలకరించాలి? సహాయం ఎలా అడగాలి....మొదలైన వాటిని నేర్చుకోవచ్చు. మీరు భాషను ఎంత మేరకు నేర్చుకున్నారు అనేదానికి సంబంధించి పద పరీక్షలు కూడా ఉంటాయి.ఇలా... లేటెస్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ లాంచ్ చేయాలి ప్రాక్టీస్ బటన్ నొక్కాలి ‘గెట్ స్టార్టెడ్’ ఎంపిక చేసుకోవాలి డిస్ప్లే లాంగ్వేజ్ (మీరు మాట్లాడే భాష), ప్రాక్టీస్ లాంగ్వేజ్(మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాష) సెలెక్ట్ చేసుకోవాలి నెక్ట్స్–బటన్ నొక్కాలి కొత్త భాషకు సంబంధించి మీ అవగాహనను ఏఐ అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుందికొత్త భాష నేర్చుకోవడానికి సంబంధించి ‘బేసిక్’ ‘ఇంటర్మీడియెట్’ ‘అడ్వాన్స్డ్’ ఆప్షన్లు ఉంటాయి ‘గోల్స్’ లిస్ట్ కనిపిస్తుంది. నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. నచ్చకపోతే టాప్ రైటర్ కార్నర్లోని స్కిప్ బటన్ నొక్కవచ్చు ఫైనల్గా ‘స్టార్ట్ ప్రాక్టీసింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి లిజన్, స్పీక్ ఆప్షన్లు ఉంటాయి. వినడం అనేది పదాల పరిచయానికి, మాట్లాడడం అనేది ఉచ్చారణను మెరుపరచడానికి ఉపయోగపడతాయి. కొత్త భాషలు నేర్చుకునే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉండొచ్చు. మీ లక్ష్యం సిద్దించిందా? కొత్త లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారా? ఇందుకోసం స్క్రీన్ టాప్లో ఉన్న ‘గోల్ బాక్స్’ను నొక్కాలి. సొంతంగా ప్రాక్టిస్ సినారియో క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త ఫ్రెండ్ను కలుసుకోబోతున్నారనుకుందాం. దృశ్య సంబంధిత సంభాషణల ఆధారంగా లెర్నింగ్ సెషన్ను క్రియేట్ చేయవచ్చు. (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
యూత్లో ఎగ్'రికల్చర్'..! కాబోయే తల్లుల పాలిట వరం...
‘ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి... ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలి... ‘సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్.. జీవితంలో స్థిరపడాలి ఆ తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలి..’ ఇలా అనుకునేవారి శాతం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. వయసు మూడు పదులు దాటుతున్నా పెళ్లి, పిల్లలు అనే దశలను వాయిదా వేస్తూ ఉన్నారు. ఫలితంగా భవిష్యత్తులో పిల్లలు కలగరేమో అనే ఆందోళన కూడా ఉంటోంది. అందుకే, ముంబైలోని నవతరం అమ్మాయిల జీవనశైలి, వారి ఆలోచనా విధానంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది యువతులు తమ అండాలను నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. ఇది మారుతున్న సామాజిక ఎంపికలకు అద్దంలాంటిది. భవిష్యత్తులో మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళలకు ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.ఇటీవల జరిగిన సర్వేలో పాతికేళ్ల వయసున్న (జెన్జెడ్) దాదాపు 18 శాతం మంది యువతులు మారుతున్న జీవనశైలి వైపుగా కదులుతున్నారని, రెండింతల ఆదాయంవైపు మొగ్గుచూపుతూ పిల్లలు వద్దు అనే ఆలోచనలో ఉంటున్నారని తెలియజేసింది. మెరుగైన కెరీర్, వ్యక్తిగత ఉద్దేశాల కోసం వారు పిల్లలను కనకూడదని లేదా మాతృత్వాన్ని వాయిదా వేయాలని ఎంచుకుంటున్నారు. ఎక్కువ మంది యువతులు విద్య, వృత్తిపరమైన అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే వారిని ఎప్పుడూ హెచ్చరించే బయోలాజికల్ క్లాక్ ఒత్తిడి లేకుండా భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి అండాలను నిల్వ చేసుకోవడం ఒక మార్గంగా కనిపిస్తోంది. అయితే, సంతానోత్పత్తి ఇండికేటర్స్ గురించి అవగాహన లేకపోవడాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా అMఏ (యాంటీ–ముల్లెరియన్ హార్మోన్), ఇది స్త్రీ అండాశయ నిల్వలను అంచనా వేయడానికి సహాయపడుతుంది. సర్వే చేసిన 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, 35 సంవత్సరాల వయస్సు తర్వాత సంతానోత్పత్తి తగ్గుతుందని గ్రహించినప్పటికీ, వారిలో చాలామందికి వారి అండాలను నిల్వ చేసుకునే సమయం, కుటుంబ జీవనాన్ని మొదలపెట్టడానికి సరైన వయస్సు గురించి ఏ మాత్రం అవగాహన ఉండటం లేదని చెబుతున్నారు. వైద్యులు కూడా అలా కోరుకునేవారికి భవిష్యత్తులో సంతానోత్పత్తి ప్రయోజనాలను అందుకోవచ్చుని సలహా ఇస్తున్నారు. వంధ్యత్వం సమస్య పురుషులు, మహిళలు ఇద్దరినీ బాధపెడుతుంది కాబట్టి, అండాలు నిల్వ చేసుకోవడానికి, సంబంధిత చికిత్సలకు సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీలు కూడా ఆసక్తిచూపుతున్నాయి. దీనికి కారణం తమ ఉద్యోగుల ప్రతిభను ఆకర్షించడానికి, వారిని నిలుపుకోవడానికి మద్దతునివ్వడం ఒక కారణంగా ఉంటోంది.ఈ మార్పు చాలా మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య విద్య అవసరాన్ని వివరిస్తుంది. బహిరంగంగా చర్చలు జరపడం ద్వారా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని తెలియపరచడం ద్వారా, మహిళలు తమ సంతానోత్పత్తి, కెరీర్, భవిష్యత్తు కుటుంబ నియంత్రణ గురించి మరిన్ని విషయాల్లో అవగాహనతో పాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకోవడాన్ని బట్టి చూస్తుంటే సంతానోత్పత్తి, వ్యక్తిగత ఎంపిక గురించి చర్చ ఇంకా పెరగాల్సి ఉందని స్పష్టం అవుతుంది.మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోతుంది. 35 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి, జెనెటిక్ రిస్కులు పెరుగుతాయి. కెరీర్, ఎడ్యుకేషన్, వ్యక్తిగత పరిస్థితుల వల్ల తల్లి కావడం ఆలస్యమవుతుంటే, ఎగ్ ఫ్రీజింగ్ ఒక మంచి ఎంపిక. అయితే, 30 – 35 ఏళ్ల లోపు అండాల నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ వయసు అనుకూలం. హార్మోన్ ఇంజెక్షన్లతో అండాశయాల్లో ఒకేసారి ఎక్కువ అండాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. అండాలను శస్త్రచికిత్స లేకుండా సులభమైన ప్రక్రియ (egg retrieval ) ద్వారా బయటకు తీస్తారు. వాటిని ప్రత్యేకమైన సాంకేతికతతో ఫ్రీజ్ చేస్తారు. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు ఐవిఎఫ్ పద్దతి ద్వారా అండాలను ఉపయోగిస్తారు. లేటు వయసులో కూడా తల్లి కావాలనుకుంటే ఈ పద్ధతి సురక్షితమైనది. క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చి వైద్య చికిత్స జరిగినప్పుడు ఫెర్టిలిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు. అందుకని ముందే నిల్వ చేసుకున్న అండాశయాల ద్వారా బిడ్డలను పొందవచ్చు. అయితే వీటి విషయంలో వంద శాతం గ్యారంటీ అని చెప్పలేం. ఎందుకంటే నిల్వ చేసిన అండాలు విజయవంతంగా ఫలదీకరించలేకపోవచ్చు. ఖరీదైన ప్రక్రియ (లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది) కూడా. హార్మోన్ ట్రీట్మెంట్ వల్ల ఉబ్బరం, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎన్ని సంవత్సరాలు నిల్వ చేసినా, అండం నిల్వ సమయంలో ఉన్న వయసు ఆధారంగానే ఫలితం వస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, పూణే, న్యూఢిల్లీ నగరాలలోని హాస్పిటళ్లు ఎగ్ ఫ్రీజింగ్ అవకాశాన్నీ అందిస్తున్నాయి. – డా.శిరీష, గైనకాలజిస్ట్ (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..!
పోటీలు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది యువతే.. అండర్ 14, అండర్ 17.. ఇలా పలు విభాగాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే మరి వయసు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? వారికేమీ ఆటలు ఉండవా? వారిలో ఎలాంటి ప్రతిభా ఉండదా? అంటే ఉంటుందనే చెబుతున్నారు ముంబయికి చెందిన ‘ఖ్యాల్’ నిర్వాహకులు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోము.. సరిగ్గా దీని కోసమే ఏర్పాటైన వేదికే ఖ్యాల్. అప్పటి వరకూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగల బాధ్యతలతో తలమునకలై.. వయసు మళ్లిన తర్వాత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకే ఖ్యాల్ ఏర్పాటు చేశారు. ఖ్యాల్ అంటే తమలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి, మెరుగుపరచడానికి కల్పించే అవకాశం.. అంటున్నారు నిర్వాహకులు.. వయసు మళ్లిన వారు అంటే చాలా మందికి ఓ చులకన భావం.. వారు ఏమీ చేయలేరు.. సాధించలేరు.. మరి అలాంటి భావాన్ని చెరిపేశారు కొందరు ప్రముఖులు.. సాధించాలనే తపన ఉంటే వయసుతో పనేంటి అను నిరూపించారు. ‘హార్లాండ్ సాండర్స్ 62 సంవత్సరాల వయసులో కేఎఫ్సీని ప్రారంభించారు. ఫల్గుణి నాయర్ 49 సంవత్సరాల వయసులో నైకాను స్థాపించారు. హెన్రీ ఫోర్డ్ 45 సంవత్సరాల వయసులో మొదటి ఫోర్డ్ మోటార్ కారును ప్రజలకు పరిచయం చేశారు..’ ఇవన్నీ కథలు కావు విజయాలకు ప్రేరకాలు అంటారు ఖ్యాల్ నిర్వాహకులు హేమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి. యువత కోసమేనా కాంటెస్ట్స్?ఏ పోటీ చూసినా అండర్ 25, అండర్ 30 ఇలా యువత, మధ్యవయసు వారికోసమే ఉంటున్నాయి. కానీ సిసలైన జీవితం 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, అభిరుచిని ఆస్వాదించే స్వేచ్ఛ అన్నీ ఉండేది అప్పుడే. వర్గీకరించబడేది వయసు మాత్రమే.. టాలెంట్ కాదు.. అందుకే ఖ్యాల్ 50 అబోవ్ 50ని ప్రారంభించింది. ఇందులో సింగర్ ఆఫ్ ది ఇయర్, చెఫ్ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్, పొయెట్ ఆఫ్ ది ఇయర్, క్రాస్ వర్డ్ చాంపియన్ ఆఫ్ ది ఇయర్... ఇలా ఏ రకమైన టాలెంట్ ఉన్నా సరే పాల్గొనేలా రూపొందించాం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ పోటీ ప్రపంచానికి గుర్తు చేయనుంది.50 విభాగాల్లో 50మంది విజేతలు..వయసు 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్లోనో, ఆధ్యాతి్మక యాత్రల షెడ్యూల్ ఖరారులోనో బిజీగా ఉండే వారి ఆలోచనల్ని సమూలంగా మార్చడమే తమ ధ్యేయం అంటున్నారు ఈ కాంటెస్ట్స్ నిర్వాహకులు. ఫిఫ్టీ ప్లస్ వయసు వారి కోసం 50 అబోవ్ 50 పేరుతో ఏకంగా 50 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా గత నెలాఖరున నగరంలోనూ ఆడిషన్స్ నిర్వహించిన సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే..ఇకిగై.. భావనకు అనుగుణంగా..జపనీయుల దీర్ఘకాల, సంతోషకర జీవనానికి దోహదం చేస్తున్న ‘ఇకిగై’ కాన్సెప్ట్కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ‘ఉద్యోగ విరమణ తర్వాత జీవితం పూర్తిగా కొత్తగా నిర్మించడం’ దీని లక్ష్యం. గత 2020లో స్థాపించిన మా ఖ్యాల్, సీనియర్ సిటిజన్లకు సబ్స్కిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తుంది. వారి శారీరక, మానసిక, భావోద్వేగ సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. మా యాప్కు మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ‘సీనియర్లు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడే ధోరణిని గమనించాం, ప్రోత్సహిస్తున్నాం, అంతిమంగా విభిన్న ఆసక్తులు కలిగిన సమూహాలను సృష్టించాలన్నదే మా తాపత్రయం.. అదే నేటి ఆడిషన్స్కు దారితీసింది. ఈవెంట్ జరిగే తీరిది.. 50 అబోవ్ 50 కోసం ఈ స్టార్టప్ ఆన్న్లైన్ వీడియో ఆడిషన్న్లను కూడా నిర్వహిస్తోంది. మే 1 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో హైదరాబాద్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, లక్నో, జైపూర్, కొచ్చి, ఇండోర్ వంటి 20 నగరాలు పాల్గొంటాయి. ఇందులో భాగంగా పోటీదారులను ఒకచోట చేర్చడానికి కారి్నవాల్ నిర్వహిస్తారు. సరదా నిండిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం వ్యక్తిగత ఆడిషన్స్ సైతం ఉంటాయి. వడపోత తర్వాత, ప్రతి విభాగం నుంచి టాప్–10 ఫైనలిస్టులను సంబంధిత కేటగిరీ నిపుణులు షార్ట్లిస్ట్ చేస్తారు. చివరకు ప్రతి కేటగిరీ కింద బెస్ట్ని ఎంపిక చేయడానికి పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు నకుల్ షెనాయ్, రచయిత్రి గీతా రామానుజం, విజువల్ ఆర్టిస్ట్ సెల్వప్రకాష్ లక్ష్మణన్, కవి–ఎడిటర్ వినితా అగర్వాల్, కర్ణాటక న్యూమిస్మాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర మరుధర్ తదితరులు ఉన్నారు. ఖ్యాల్ విజేతలకు మొత్తం కలిపి రూ.1 కోటి నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే నవంబర్లో ముంబైలోని నెస్కో మైదానంలో జరుగుతుంది.నగరంలో ముగిసిన తొలి దశ ఆడిషన్స్.. నగరంలోని హిమాయత్నగర్లో ఇటీవలే ఈ పోటీ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. పదుల సంఖ్యలో హాజరైన అభ్యర్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా పరీక్షించారు. వీరిలో ఎంపికైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ) -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్పైన స్కెచ్లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..
అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్ డైరియల్ డీహైడ్రేషన్’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. పరిష్కారం ఏమిటి? హైడ్రేషన్ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కలిగిన తక్కువ గ్లూకోజ్. క్యాలరీ, డయాబెటిక్ సేఫ్ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. డీహైడ్రేషన్ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. – డా.మోసిన్ అస్లం, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్ (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. సోలో టూరే సో బెటరూ...
ఒంటరి ప్రయాణం అనేది ఒక ఆసక్తికరమైన అనుభవం, ఎందుకంటే ఇది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, స్వీయ–ఆవిష్కరణ ఫ్లెక్సిబులిటీలను అందిస్తుంది. అయితే అలా సింగిల్గా ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఉల్లాసమైన అనుభవాలు మాత్రమే కాదు భద్రత, సౌలభ్యం కూడా ప్రధానమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే 5 దేశాలు సోలో ట్రావెల్కి అత్యంత ఎంచుకోదగినవిగా మారాయి. ఒంటరిగా ప్రయాణీకులకు కొత్త సంస్కృతులను నేర్చుకోవడానికి, విభిన్న వ్యక్తులతో సంభాషించడానికి రాజీ పడకుండా మనసుకు నచ్చిన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పించే ఆ దేశాలలో...జపాన్భద్రత, పరిశుభ్రత అత్యంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కారణంగా వ్యక్తిగత ప్రయాణికులకు నెం1 గమ్యస్థానం జపాన్. టోక్యో, క్యోటో ఒసాకా వంటి నగరాలు ప్రశాంతమైన దేవాలయాలు, రద్దీగా ఉండే మార్కెట్లు ఆధునిక ఆకర్షణలతో సంప్రదాయ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఒంటరి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రాంతాలు సందర్శించేలా ప్రజా రవాణా బాగా పనిచేస్తుంది చౌకగా బస చేయడానికి క్యాప్సూల్ హోటళ్ళు హాస్టళ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.న్యూజిలాండ్ఇది స్నేహపూర్వకంగా ఉండే ప్రజలు తక్కువ నేరాలు కలిగిన చిన్న దేశం, అందువల్ల ఒంటరి ప్రయాణానికి సరైనది. టోంగారిరో ఆల్పైన్ క్రాసింగ్ను హైకింగ్ చేయడం సౌత్ ఐలాండ్లోని ఫ్జోర్డ్లను సందర్శించడం వంటి అన్ని స్థాయిల ఫిట్నెస్కు అనుగుణంగా ఉండే కార్యకలాపాలతో న్యూజిలాండ్ సోలో ట్రావెల్కు అనుకూలతలు కలిగి ఉంది.పోర్చుగల్సుందరమైన ప్రదేశం, పురాతన పట్టణాలు పర్యాటకులను ఇష్టపడుతూ ఆకర్షించే ఆదరించే సంస్కృతి కలిగిన దేశం పోర్చుగల్. లిస్బన్ పోర్టో వంటి చిన్న నగరాలు కాంపాక్ట్, నడవడానికి అనుకూలమైనవి సాంస్కృతిక అనుభవాలతో నిండి ఉన్నాయి పాత స్మారక చిహ్నాలు సందడిగా ఉండే స్ట్రీట్ లైఫ్ రెండూ ఆకట్టుకుంటాయి. పోర్చుగల్లోని కేఫ్ సంస్కృతి పెద్ద సంఖ్యలో హాస్టళ్లు స్థానికులు ఇతర ప్రయాణికులతో సులభంగా పరిచయాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయి.కెనడాఇది వాంకోవర్, టొరంటో మాంట్రియల్ వంటి బహుళ సాంస్కృతిక, బాగా అనుసంధానించబడిన నగరాలను కలిగి ఉన్న దేశం. భద్రత విషయంలో ఉన్నత స్థానంలో ఉంది. ఒంటరి ప్రయాణికులు పట్టణాల్లోనే పలు ఆకర్షణలను సందర్శించవచ్చు. జాతీయ ఉద్యానవనాలలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు లేదా కాలానుగుణ స్కీయింగ్, హైకింగ్ వన్యప్రాణుల వీక్షణను చేపట్టవచ్చు.థాయిలాండ్చౌక ధరలకు ప్రయాణించాలనుకునే ఒంటరి ప్రయాణికులకు థాయిలాండ్ అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. బ్యాంకాక్, చియాంగ్ మాయి, ద్వీపాలు స్ట్రీట్ ఫుడ్ టూర్స్, దేవాలయాలు, బీచ్లు నైట్ లైఫ్తో సహా అన్ని రకాల అనుభవాలకూ నిలయం. థాయిలాండ్ పర్యాటక మౌలిక సదుపాయాలు హాస్టళ్లు, గైడెడ్ టూర్లు, రవాణా సేవలు మొదలైన వాటితో బాగా అభివృద్ధి చెందాయి.(చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?
ఈ సందేహం దాదాపు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం...ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం... పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృ యఙ్ఞాన్ని నిర్వహిస్తాడు... పుత్రులు లేనివారి సంగతి ఏమిటి మరి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు...లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు...అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. ఎలా పెట్టాలంటే..?సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరం) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. మహాలయం పెట్టలేని పక్షంలో కనీసం గతించిన పెద్దలను తలచుకుని వారి పేరు మీదుగా శక్తిమేరకు శుచిగా వంట చేసి భోజనాలు పెట్టాలి. ఇలాంటి క్రతువులపై విశ్వాసం లేనివారు కూడా పేదలకు అన్నదానం చేయడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, శునకాలకు, కాకులకు ఆహారం పెట్టడం మంచిది. మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రవచనం. (సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు) (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
విశుద్ధి చక్ర నిలయా..!
475వ నామం వద్ద అమ్మవారిని ‘విశుద్ధి చక్ర నిలయా‘ అనగా విశుద్ధి చక్రంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన సూక్ష్మ శరీరంలో కంఠం వద్ద ఉంటుంది. కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటునప్పుడు మనిషికి సంఘ జీవనం అలవడి, సాక్షీభూత స్థితిలో దైవికమైన చాతుర్యంతో మాట్లాడగల వాక్ శక్తి లభిస్తుంది.103వ నామం వద్ద అమ్మవారిని ‘ఆజ్ఞా చక్రాంత రాళస్థా‘అనగా ఆజ్ఞాచక్రం మధ్యలో ఉండునది అంటూ వర్ణిస్తారు. ఈ ఆజ్ఞాచక్రం మనం నుదురు మీద బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఉంటుంది, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడు మనిషి లోపల క్షమాగుణం నెలకొని పరిపూర్ణ నిర్విచార స్థితి అనగా ఆలోచనలు లేని స్థితిని పొందుతాడు. సాధారణం గా మనిషికి ఆలోచనలు లేకుండా ఉండడం నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఈ స్థితిని చేరుకున్న మనిషి మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆలోచనలు లేని స్థితిని పొందగలుగుతాడు. 105వ నామం వద్ద ‘సహస్రారాంబుజారూఢా‘ అనగా సహస్ర దళ పద్మంలో నివసించునది అని వర్ణిస్తారు. ఈ చక్రం మన తల మీద మాడు ప్రాంతం లేదా బ్రహ్మ రంధ్రం వద్ద ఉంటుందని, కుండలినీ శక్తి ఈ చక్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చినప్పుడు మనిషికి యోగం లభిస్తుందని వివరిస్తారు. మానవ చేతన తన చుట్టూ ఉండే భగవంతుని పరమ చైతన్య శక్తితో అనుసంధానాన్ని పొందుతుందని, మానవ మెదడును లోపల నుండి గమనిస్తే, 1000 నరాలు కలిసి, 1000 దళాలు గల పద్మంలా కన్పిస్తుందని, అందుకే ‘సహస్రారం’ అని పిలుస్తారని చెబుతారు. 106వ నామం వద్ద ‘సుధాసారాభి వర్షిణి’ అనగా అమృతధారలు కురిపించునది అని వర్ణిస్తారు. కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని దాటిన తరువాత చైతన్య తరంగాల అనుభూతి మొదలవుతుంది. అమృత ధారల వంటి ఈ చైతన్య తరంగాలను అనుభూతి చెందడం కుండలినీ జాగృతి వల్లే సాధ్యమవుతుంది. ఆ సమయంలో సాధకులు బ్రహ్మానందానుభూతిలో లీనమవుతారు.– డా. పి. రాకేష్పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాల ఆధారంగా (చదవండి: మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం) -
మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం
పూర్వం తన తల్లి దాస్య విముక్తికోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతూండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండేచోటున పడిందట. దాని ఫలితంగా అప్పట్లో ఆ మడుగులో స్నానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానూ, యవ్వనవంతులుగానూ మారిపోవడంతోపాటు అమరత్వం కూడా పొందేవారట. దాని మహిమను ప్రత్యక్షంగా చూసిన నారదుడు బ్రహ్మదేవుడికి నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, ‘‘హనూ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి‘ అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూ వుంది.ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలు΄ోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తి వద్దకు ΄పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి విన్నవించారు. విష్ణుమూర్తి అంతా విని, ‘‘నాకూ, శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!‘ అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూ వున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకు΄ోయింది.అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది– పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతాన్ని తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి ‘పుష్పగిరి’ అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై వెలుగొందుతోంది. ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ’మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.హరిహరాదుల క్షేత్రంశివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.జనమేజయుడు చేసిన సర్పయాగ పాపరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండ మీదే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవస్వామికి పూజలు జరుగుతాయి. పాతాళగణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.(చదవండి: లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..) -
నైట్ ఈటింగ్ సిండ్రోమ్..!
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైమ్కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్ఫాస్ట్ టైమ్కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.గుర్తించడం ఎలా... రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం ఉదయం లేచాక ఆకలి లేకపోవడం రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.ఇలాంటిదే మరో సమస్య...బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు... ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది. ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.నిర్ధారణ పరీక్షలు: బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.ఆరోగ్యంపై ఎన్ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్ఈఎస్కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్ఈఎస్లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.చికిత్స... సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు. (చదవండి: ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..) -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్కు కానీ, టూర్కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్ని, ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
సరదా కారాదు విషాదం.. మనకిదొక హెచ్చరిక!
సాక్షి, హైదరాబాద్: ‘‘బెంగళూరులో ఓ బాలుడు కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. సన్రూఫ్లోంచి తల బయటికి పెట్టి వెళ్తుండగా.. డ్రైవర్ రోడ్డుపై ఉన్న ఓవర్ హెడ్ బారికేడ్ను గమనించకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతే అకస్మాత్తుగా బారికేడ్ బాలుడికి తగిలి తల పగిలిపోయింది.’’ అయితే ఈ ఘటన పొరుగు రాష్ట్రంలో జరిగినప్పటికీ.. మనకిదొక హెచ్చరిక! ఈ రోజుల్లో ప్రతి మోడ్రన్ కారుకు సన్రూఫ్ (Sunroof) తప్పనిసరి అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ సన్రూఫ్ అనుభూతిని పొందాలని భావిస్తున్నారు. అయితే ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలామంది యువతీ యువకులు సన్రూఫ్లోంచి బయటికి చూస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. పిల్లలను తిప్పడం, తిరగడం పేరెంట్స్కు ఓ సరదా, స్టేటస్ సింబల్. అయితే ఈ సరదా విషాదం కాకూడదని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.సరదా కారాదు విషాదం..ఇరుకు, బిజీ రోడ్లలో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి రోడ్లలో సన్రూఫ్ నుంచి వేలాడుతూ ప్రయాణించకూడదు. విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, పతంగుల దారాలు, మాంజా, ఇతరత్రా సన్నని తీగలు రోడ్లపై వేలాడుతుంటాయి. ఇది సాధారణంగా డ్రైవర్లకు కనిపించవు. దీంతో సన్రూఫ్లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులను ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్రూఫ్లో ఉన్నవారికి పట్టు ఉండదు. దీంతో సన్రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే ఏకంగా కార్లో నుంచి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.సహజ కాంతి కోసమే..సన్రూఫ్ అనేది కేవలం వెంటిలేషన్ కోసమే ఉద్దేశించబడింది. కారు క్యాబిన్ స్పేస్ విశాలంగా అనిపించడంతో అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్రూఫ్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా వేసవి కాలంలో ఎండలో కార్ పార్కింగ్ చేసినప్పుడు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్రూఫ్ను తెరిస్తే కారులోని వేడి గాలి బయటికి వెళ్లి, కార్ క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఇరుకైన రహదారులు, బిజీ రోడ్లలో సన్రూఫ్లను వినియోగించకూడదు. వీటిని హైవేలు, వెడల్పాటి రోడ్లపై మాత్రమే వినియోగించాలి.జైలు, జరిమానా..ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనల తరహాలోనే బిజీ రోడ్లపై సన్రూఫ్ వినియోగాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. సన్రూఫ్లతో వ్యక్తిగతంగా ప్రాణాంతకమే కాకుండా రోడ్లపై ఇతర వాహనదారులకు అంతరాయం కలిగిస్తుంది. సన్రూఫ్, కారు కిటికీల నుంచి తలను బయటికి వేలాడుతూ ప్రయాణం చేస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్–281 కింద కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులలో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలాగే ఇతర వాహనాల నుంచి వెళువడే పొగ, దుమ్ము ధూళి నేరుగా ముక్కులోకి వెళ్లి రోగాలకు కారణమవుతాయి.చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్ లేకుండానే.. ఐఐటీలో అడ్మిషన్!ఆలోచింపజేసిన రాచకొండ పోస్టుసన్రూఫ్ ప్రయాణం చాలా ప్రమాదం అంటూ రాచకొండ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆలో చింపజేస్తోంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఆనందం కోసం ఇలా ప్రమాదకరంగా స్టంట్లు చేయొద్దంటూ బెంగళూరులో జరిగిన సన్రూఫ్ ప్రమాద ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లతో ఈ వీడియో హల్చల్ చేస్తుంది. -
కురులు... వివరాల విరులు..
అరచేతులు, అరికాళ్లు, పెదవులు, మ్యూకస్ పొరలు తప్ప శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లోనూ వెంట్రుకలు పెరుగుతాయి. ఎముకల్లోని మూలగ తర్వాత అత్యంత వేగంగా పెరిగే కణజాలం జుట్టు మాత్రమే. మనిషి తలపై సగటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. తలవెంట్రుకల్లో 90 శాతం పెరుగుతూ ఉంటే, 10 శాతం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తలపై లక్ష వరకు ఉండే వెంట్రుకల్లో రోజూ వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. పురుషుల్లో సగం మందికి యాభయ్యేళ్ల లోపు వయసులోనే బట్టతల వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల, ఐరన్ లోపంవల్ల తాత్కాలికంగా తలపై వెంట్రుకలు పలచబడతాయి. అలాగే, కొన్ని రకాల ఔషధాల ప్రభావం వల్ల కూడా తలవెంట్రుకలు గణనీయంగా రాలిపోతాయి.వెంట్రుకల ఆయుర్దాయం మూడు నుంచి ఏడేళ్లు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్లు, చేపలు, లివర్, కిడ్నీలు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడతాయి.జుట్టులోని పిగ్మెంట్స్ కారణంగానే జుట్టుకు రంగు ఏర్పడుతుంది. వయసు మళ్లే దశలో పిగ్మెంట్స్ తగ్గడం కారణంగా జుట్టు నెరుస్తుంది. వెంట్రుకలు గరిష్టంగా 90 సెం.మీ. వరకు పెరుగుతాయి. ఏడాది వ్యవధిలో వెంట్రుకల పెరుగుదల 12 సెం.మీ. వరకు ఉంటుంది. (చదవండి: ఆ ఒక్క క్షణం..! క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు) -
శిల్పారామం వేదికగా ఛాప్..!
చేనేత, హస్తకళలు.. వీటి కొనసాగింపులో ఆధునిక ఫ్యాషన్, టెక్నాలజీ వంటి అంశాలతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమ నిర్వహణకు కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ శాఖ భాగస్వామ్యంతో ‘ఛాప్’ నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పారామం వేదికగా ఈ నెల 12 నుంచి 17 వరకూ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతినిధులు నిఫ్ట్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా భిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శిల్పారామం వేదికగా నిర్వహించే స్టాల్స్లో హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలోని టూరిజం డెస్టినేషన్ ప్రాధాన్యతను ప్రదర్శించి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని క్లస్టర్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్వ ఖురానా పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు.. దేశవ్యాప్తంగా 19 నిఫ్ట్ క్యాంపస్లు ఉన్నాయని, హైదరాబాద్ క్యాంపస్ భాగస్వామ్యంతో ఈ ప్రదర్శనలో 60 క్రాఫ్టŠస్, 40 అలుమ్ని బృందాలు పాల్గొంటాయి. ఆరు రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా చేనేత, హస్త కళాకారుల ప్రదర్శనలతో పాటు ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు, 6 ప్రధాన క్రాఫ్ట్ ప్రదర్శనలు చేపట్టామని, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్స్ కూడా ప్రదర్శిస్తాం. తెలంగాణలోని తోలుబొమ్మలాట లాంటి అరుదైన కళల ప్రాధాన్యత తెలియజేసి, పలు అరుదైన కళలకు పేటెంట్స్, జీయో ట్యాగ్ ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కలి్పంచనున్నాం. – డా.మాలిని, నిఫ్ట్ డైరెక్టర్ (చదవండి: సౌకర్యం + సంతోషం = కవాయి)