Lifestyle
-
వెండితెర తార... నేల పైకి
మాధవన్ విలక్షణ పాత్రలకు పేరొందిన ఆర్.మాధవన్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా సాగించిన వైవిధ్యభరిత ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియనిది రైతుగా ఆయన సాధించిన అపురూపమైన విజయం....తమిళనాడులోని పళనిలో ఉన్న ఒక బీడు భూమి మాధవన్ విజయానికి కేంద్రబిందువుగా మారింది. ఆ బీడు భూమిని కొనుగోలు చేసిన మాధవన్ ... కేవలం మూడేళ్లలోనే ఫలవంతమైన కొబ్బరితోటగా మార్చారు. నిరంతర కృషి, ప్రయోగాల ద్వారా సాధించిన ఈ మార్పు, తీయని నీరు, విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన నాన్ –హైబ్రీడ్ కొబ్బరి తోటగా రూపుదిద్దుకుంది.నేలతల్లి నుంచి నేర్చుకున్నా...‘వ్యవసాయంలో ప్రతి అడుగు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసింది. ఇది ఎంతో సంతృప్తికరమైన అనుభవం. నా జీవితంలో అత్యంత ప్రతి ఫలదాయకమైన అనుభవాలలో ఒకటి. భూమి పునర్జీవం ΄పొంది, అది ఫలాలను ఇవ్వడాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. సరైన మల్చ్తో భూమిని సిద్ధం చేయడం నుంచి బావిలో సరైన చేపలను వదలడం వరకు నేను నేర్చుకున్న ప్రతి విషయం అమూల్యమైనది. ఎంతో విలువైనది’ అంటారు మాధవన్ ఎంతో సంతోషంగా...కొబ్బరిచెట్ల ప్రాజెక్ట్!తన కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఒక ప్రాజెక్ట్‘ గా పేర్కొంటారు మాధవన్ . ‘ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దీనిలో దాదాపు బీడుగా ఉన్న భూమిలో అత్యంత తీయని, సువాసనగల నాన్ –హైబ్రిడ్, స్వచ్ఛమైన ΄పొట్టి రకం కొబ్బరికాయలను పండించాము. త్వరలో నేను స్థానిక రైతుల కోసం ఒక వ్యాసం రాస్తున్నాను’ అంటున్నారు మాధవన్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాన్ హైబ్రిడ్ కొబ్బరి తోటల గురించి కల కంటున్నారు మాధవన్.కొత్త ఫలంకోవిడ్ లాక్డౌన్ సమయంలో, మాధవన్ తన అందమైన టెర్రస్ గార్డెన్ను వీడియోల ద్వారా చూపించారు. ఒక వీడియోలో చిన్న చెర్రీ పండ్లను చూపిస్తూ, ‘ముంబై టెర్రస్కు ఒక కొత్త ఫలం వచ్చింది’ అంటూ సంబరంగా చెప్పారు. నటిస్తే ఆదాయం, అవార్డులు రావచ్చు. రైతుగా అడుగులు వేస్తే... ఆ అడుగులు ముందుతరాలకు కొత్త దారులు చూపిస్తాయి. ఈ విషయంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు మాధవన్.సామాజిక గళంసామాజిక సందేశాల కోసం గళాన్ని వినిపించడంలో ముందుంటారు మాధవన్. పశుపోషణకు సంబంధించిన విషయాలను, దాని పర్యావరణ ప్రభావాన్ని తెలియజేసేలా పెటా ఇండియా విడుదల చేసిన ‘గ్లాస్ వాల్స్’ అనే వీడియోకు మాధవన్ వ్యాఖ్యానం అందించారు. ‘వధశాలలకు గాజు గోడలు ఉంటే, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారిపోయేవారు’ అన్న ఒక ప్రసిద్ధ ఆంగ్లోక్తిని ఆయన ఈ వీడియోలో మనకు వినిపిస్తారు. మాంసం, పాల పరిశ్రమలలోని రకరకాల దశలను ఈ వీడియో చిత్రీకరిస్తుంది. జంతువుల పట్ల వ్యవహరించే తీరును చూపిస్తూ, నైతికతకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెర వెనుకసినిమా తారలు తెర వెనుక తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరోవైపు తమవైన అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. బైక్, కార్ రేసింగ్లకు పేరొందిన అజిత్ లాంటి తమిళ టాప్ హీరోల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటుతున్న ప్రగతి లాంటి టాలీవుడ్ నటీమణుల దాకా...విభిన్న రంగాల్లోనూ తమను తాము నిరూపించుకుంటున్నారు. వృత్తిజీవితాన్ని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటున్నారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
నో షార్ట్కర్ట్స్ : సింపుల్ రూల్తో 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్
బరువు తగ్గాలంటే కచ్చితత్వంతో, నిబద్దతతో వ్యాయామం, ఆహార నియమాలు పాటించాలి. అయితే చిన్న అవమానంతో ఒక బ్యాడ్మింటన్ కోచ్ తన జీవన శైలినిమార్చుకుంది. ఆహారనియమాలను సరిచేసింది.కట్ చేస్తే.. 16 కిలోలు తగ్గింది. అయితే ఈ మార్పు అకస్మాత్తుగా జరగలేదు. ఎంతో పట్టుదలతో కష్టపడి సాధించింది. అని చాటి చెప్పింది. విమర్శలనే సవాల్తీసుకుని విజయ తీరాలకు బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.36 ఏళ్ల బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ, తల్లి అయిన తర్వాత సుమారు 20 కిలోల బరువు పెరిగారు. ఒకానొక దశలో ఆమె బరువు 79 కిలోలకు చేరుకుంది. అయితే ఒక రోజు తన క్లయింట్లలో ఒకరు, "మీరే మంచి శారీరక స్థితిలో లేకపోతే, మీ విద్యార్థులకు శిక్షణ ఎలా ఇవ్వగలరని ఆశిస్తున్నారు?" అని అనడంతో అవమానంగా భావించింది. ఎంత మాట అనిపించుకున్నానే అని చిన్నబుచ్చుకుంది.కానీ అక్కడితే ఆగిపోలేదు.అప్పుడే ఆమె బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. చక్కటి ఆహార నియమాలతో దాదాపు 16 కిలోలు బరువు తగ్గింది. XXL నుండి M సైజుకు మారిపోయింది. మొదట్లో ఆమె 'క్రాష్ డైట్స్' (అతిగా పస్తులు ఉండటం) ప్రయత్నించింది, కానీ ఫలితం తాత్కాలికంగానే ఉండేది. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతిలో బరువు తగ్గడం ప్రారంభించారు. కాలిలో రాడ్ ఉన్నప్పటికీ, పట్టుదలతో క్రమబద్ధమైన వ్యాయామాలు చేయడంతోపాటు, పోషకాహారంపై దృష్టి పెట్టింది. ఇదీ చదవండి: మోమోస్ తింటున్నారా? మెమరీ లాస్, లివర్ నాశనం, చివరికి!? డైట్ ప్లాన్ఆపిల్, ఓట్స్ (40 గ్రా), పోహా (40 గ్రా).అన్నం (50 గ్రా), గోధుమలు (40 గ్రా).ఎగ్ వైట్ (గుడ్డులోని తెల్లసొన), ఒక స్కూప్ వే ప్రోటీన్.ఇలా రోజూ కేలరీలను లెక్క వేసుకుంటూ నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకునేది. ఫలితంగా తన బరువును 79 కిలోల నుండి 63 కిలోలకు తగ్గించుకుంది."అప్పట్లో నేను XXL సైజ్ బట్టలు వేసుకునేదాన్ని, ఇప్పుడు M సైజ్కు మారాను. వార్డ్రోబ్ మొత్తం మార్చడం వల్ల జేబుకు చిల్లు పడినా, నా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది!" అని ఆమె గర్వంగా చెబుతుంది.ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!ఆమె సలహా..షార్ట్కట్స్ వద్దు, త్వరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్స్ చేయకండి, స్థిరంగా బరువు తగ్గాలంటే స్థిరత్వం, పౌష్టికాహారం, వ్యాయామం అవసరం, ఫలితం నెమ్మదిగా వచ్చినా, క్రమం తప్పని అలవాట్లను పాటించండి అంటారామె.నోట్ : బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు, సరైన పోషకాహారం వ్యాయామం కలయిక. అందరికీ ఒకే సూత్రం వర్తించకపోవచ్చు. క్రాష్డైట్స్ ఎప్పటికీ మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
అరటిపండు షేప్ అలా ఎందుకు ఉంటుంది?
అరటిపండు (banana) అలా వంగి ఎందుకు ఉంటుంది?ఈ డౌన్ మీకు వచ్చిందా? అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది. అదేంటో తెలుసుకుందామా?అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్ వంకరగా వస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్ స్పాట్స్ అంటారు. ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు వింత పండు ’రంబుటాన్’ ’రంబుటాన్’ పేరే వింతగా ఉందే? అవును. ’రంబుటాన్’ అంటే మలేషియా భాషలో ’వెంట్రుకలు’ అని అర్థం. ఎందుకంటే ఈ పండు బయటంతా పచ్చ, ఎరుపు రంగులో వెంట్రుకల్లాంటి మెత్తటి ముళ్లు ఉంటాయి. చూడ్డానికి చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన బళ్ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. అక్కడి పిల్లలు స్కూల్ అయిపోగానే రంబుటాన్ కొనుక్కుని తింటూ ఇంటికెళ్తారు. మన దగ్గర మామిడిపండు లాగా అన్నమాట. పై తొక్క తీస్తే లోపల తెల్లగా, జెల్లీలా, మెరుస్తూ ఉంటుంది. సరిగ్గా మన లిచీ పండు లాగానే. మధ్యలో ఒక చిన్న గింజ ఉంటుంది. దానిని తినకూడదు.ఈ పండు రుచి కొంచెం పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. లిచీ + ద్రాక్ష కలిపినట్టు. అక్కడి పిల్లలు ‘ఒకసారి మొదలుపెడితే ఆపలేం‘ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొందరు జ్యూస్ చేసుకుంటారు, ఐస్ క్రీంలో వేసుకుంటారు.హెల్త్కి చాలా మంచిది! విటమిన్ ఇ ఉంటుంది – జలుబు దగ్గరికి రాదు. ఐరన్ ఉంటుంది – రక్తం బాగా పడుతుంది. ఫైబర్ ఉంటుంది – కడుపు హ్యాపీ. మొదటిసారి చూసిన వాళ్లు ‘అయ్యో ఇది పండా? బొమికా?‘ అని భయపడతారు. కానీ టేస్ట్ చూశాక ‘ఇంకోటి ఇంకోటి’ అని అడుగుతారు. ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
సమ్మర్లో హైడ్రేషన్ కోసం..!
వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడందాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుడీహైడ్రేషన్ను తీవ్రతరం చేసే పానీయాలు ..చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్డ్రింక్లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.హైడ్రేషన్ స్థిరంగా ఉండదట..హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు. శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్గా ఉంటే..శరీర హైడ్రేటెడ్గా ఉందని అర్థమట.వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.డీహైడ్రేషన్ పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..నిజానికి డీ హైడ్రేషన్ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట.ఎల్డర్బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
అమ్మ ట్రైనింగ్కు టైమ్స్‘వంద’నం
రోజులు ఎంత మారినా వంట చేసే మగవారిపైజోకులు ఉండనే ఉంటున్నాయి. కాని వంట కూడా ఒక గొప్ప విజయపథం కాగలదు అని నిరూపించాడు వికాస్ ఖన్నా.వంట గదిలో తల్లి వెనుక తిరుగుతూ ఆమె ద్వారా వంట నేర్చుకున్న వికాస్ ఖన్నా మాస్టర్ షెఫ్గా ఎదిగి నేడు ‘టైమ్ 100– 2026’లో ఒకడిగా ఎంపికయ్యాడు. ఇది వికాస్ తల్లికి లభించిన గౌరవం కూడా. ‘టైమ్ 100’లో కేవలం ముగ్గురు భారతీయులు ఉంటే వారిలో సుందర్ పిచాయ్, రణ్బీర్ కపూర్తోపాటు వికాస్ ఖన్నా ఉన్నాడు. వికాస్ ఖన్నాకు చోటు భారతీయ వంటగది విజయం.ప్రతి ఏటా టైమ్ పత్రిక విడుదల చేసే అత్యంత ప్రభావపూరిత వ్యక్తుల పట్టిక్ట ‘టైమ్ 100’ 2026 సంవత్సరానికి బుధవారం విడుదలైంది. ఈసారి ఎంపికైన నూరుగురిలో భారతీయ స్త్రీలు ఒక్కరూ లేకపోయినా ముగ్గురు పురుషులకు చోటు దక్కింది. వారిలో గూగుల్ సి.ఇ.ఓ. సుందర్ పిచాయ్, ‘యానిమల్’ హీరో రణ్బీర్ కపూర్తో పాటు అమెరికాలో స్థిరపడ్డ ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నాకు చోటు దొరికింది. షెఫ్గా, రెస్టరెంట్ల యజమానిగా ఉన్న గుర్తింపుకే కాదు... అతను చేస్తున్న సామాజిక సేవకు కూడా ‘టైమ్’ ఈ గుర్తింపు ఇచ్చింది. అమృత్సర్ వంట గది నుంచి మొదలైన అతని ప్రయాణం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం కచ్చితంగా విశేషం. ఇందుకు అతడి తల్లి కారణం.అమృత్సర్లో...వికాస్ ఖన్నా పుట్టింది అమృత్సర్లో. చిన్నప్పుడు ‘క్లబ్ఫుట్ సమస్య’ వల్ల కాళ్లలో సత్తువ లేక సరిగా నడవలేకపోయేవాడు. స్కూల్లో పిల్లలు ‘పోలియో వాలా లడ్కా’ అని ఏడిపించేవారు. దాంతో స్కూలుకు వెళ్లడానికి నిరాకరించి ఇంట్లో అమ్మ బిందూ ఖన్నా వెంట వంటగదిలో ఎక్కువ ఉండేవాడు. అక్కడి బంగాళదుంపల వాసన, వేగే జీలకర్ర చిటపటలు, రొట్టె కాల్చే వేడి – ఇవే అతనికి ఊరటనిచ్చేవి. ఆ వంటగదికి పసుపు రంగు తలుపు ఉంటే రాను రాను వికాస్కి అది ‘హల్దీ’లా కనిపించేదట. ‘నేను నడవ లేకపోతే ఏంటి... నా చేతులు వంట చేయగలవు కదా’ అనిపించిందట!అమ్మ వంట స్టైల్అమ్మ వంట స్టైల్ను వికాస్ నిశితంగా గమనించేవాడు. ఆమె పంజాబీ వంట చేసేది. మిక్సీలు, అవెన్లు లేకపోయినా వంటలో ఓపిక, శుభ్రత తప్పేది కాదు. ఉదయం మార్కెట్లో తాజా కూరగాయలు బేరమాడటం, మోపెడ్ మీద గ్యాస్ సిలిండర్ తేవడం ఆమే చేసేది. ‘వంటవాడికి ఏ పనీ చిన్నది కాదు. గుర్తు పెట్టుకో’ అని కొడుక్కి చెప్పింది. ఆటా గూంద్నా... ఫుల్కే బనానా...‘పిండిని ప్రేమతో కలిపి మెత్తగా, పొంగుతూ వచ్చేలా కాల్చడం నేర్చుకుంటే నీకు వంట వచ్చినట్టే’ అని చెప్పిందామె. అలా కొడుకు చేత తొలిపాఠం మొదలు పెట్టించింది. ఆ తర్వాత బెండకాయ, ఆలూ గోబీ, దాల్ లాంటి పది రకాల వంటల్ని రొటేషన్ లో చేయించేది. ఇక ఆమె శీతాకాలంలో చేసే స్పెషల్– గాజర్ కా హల్వా. ఇదంటే వికాస్కు ప్రాణం. తల్లి నుంచి వంట నేర్చుకున్న వికాస్ 16 ఏళ్ల వయసులో సొంతగా ‘లారెన్స్ గార్డెన్’ అనే క్యాటరింగ్ నడిపేవాడు. బుకింగ్ తీసుకోవడం నుంచి డెలివరీ వరకూ అన్నీ తనే. ‘కస్టమర్ల నమ్మకమే నిజమైన ధనం’ అని తల్లి వ్యాపార పాఠం వికాస్కు నేర్పింది. ‘వంటతో పాటు ఆప్యాయతను వడ్డించడం మరువకు’ అని చెప్పిందామె. వికాస్ కేవలం చెఫ్ మాత్రమే కాదు. రచయిత, ఫిల్మ్ మేకర్, మానవతావాది. 40కి పైగా వంటల పుస్తకాలు రాశాడు. ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమా తీశాడు. ఎక్కడికి వెళ్లినా ‘నేను ముందు వంటవాడిని‘ అని గర్వంగా చెప్పుకుంటాడు. ‘వంట నాకు భాష నేర్పింది. అమెరికాలో నాకు ఇంగ్లీష్ సరిగా రానప్పుడు నా వంట మాట్లాడింది. నా బాధను, నా ప్రేమను, నా దేశాన్ని ప్లేట్లో పెట్టి ప్రపంచానికి అందించాను’ అంటాడు వికాస్ ఖన్నా.తల్లి ఆశీస్సు.... చేసే పని పట్ల ఇంత నిబద్ధత, ఆర్తి, శ్రద్ధ, హృదయం ఉన్నవాడు ‘టైమ్ 100’లో చేరక ఎలా ఉంటాడు?వంట నా ప్రార్థన‘వంట నాకు వృత్తి కాదు, అది నా ప్రార్థన’ అంటాడు వికాస్ తల్లి నుంచి నేర్చుకున్న వంట గురించి. చిన్న వయసులోనే అమృత్సర్లో షెఫ్గా పేరు పొందిన వికాస్ ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్లో∙రెస్టరెంట్లు తెరిచాడు. అమెరికా సంస్థలు ఇండియన్ రెస్టరెంట్లకు ఇవ్వని ‘మిచెలిన్ స్టార్’ హోదాను పొందాడు. ఆ తర్వాత సామాజిక సేవ మొదలుపెట్టాడు. కోవిడ్ టైంలో భారత్లో లక్షల మందికి ‘ఫీడ్ ఇండియా’ పేరుతో అన్నం పెట్టాడు. ‘ఒకరి ఆకలి తీర్చడం కంటే గొప్ప సంతృప్తి ఇంకోటి లేదు’ అంటాడు. -
చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..
ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామాకువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?డైట్ సోడా తాగడంబరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడంభోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట. ముందుగా ప్రోటీన్ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.టీ మాక్సింగ్రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.ఎక్కువగా నిలబడటంకువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట3-2-1 రూల్..3-2-1 రూల్ కువార్కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్టైమ్ కోసం. ఇలా ప్లాన్చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.మంచి అరుగుదల కోసం నడకభోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!) -
వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!
మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్లో టాపర్గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్డాగ్ మిలియనీర్గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్ అంటే..బోఫాల్లోని భీమ్ నగర్ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్ బోర్డు ఎగ్జామ్2026లో కామర్స్ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి. చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్లో విద్యార్థులంతా వివిధ కోచింగ్ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది. ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్లో 98.8% మార్కులతో టాపర్గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.(చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!) -
చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!
ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్లోకి జంక్ ఫుడ్ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్ ఫుడ్ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రిసంప్రదాయ ఆహారంతో మేలుచిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. (చదవండి: మామ్ వెయిట్లాస్ జర్నీ..! నో క్రాష్ డైట్, నో స్ట్రిక్ట్ రూల్స్..ఏకంగా 22 కేజీలు..) -
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్లాస్ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్ కూడా.ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదిక తన వెయిట్లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్ డైట్ పాటించలేదని అన్నారు.ప్రోటీన్ తప్పనిసరిగా..ఆహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు తన లైఫ్లో పెద్ద గేమ్ ఛేంజర్ అని అంటోంది. ప్రోటీన్ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.ఇంటి భోజనంఆ ఇన్ఫ్లుయెన్సర్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్ఫాంల నుంచి ఆర్డర్ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్ చేయడం ముఖ్యం.ఎక్కువగా నీరు తాగడం..డీహైడ్రేషన్ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.అలాగని స్వీట్లకు దూరం కాలేదట..ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్ ప్రకారం తినేదాన్ని అంటోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Noopur Kalra (@noopurkalra) (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
అక్షరాలా... మహిళా సాధికారతకే ఓటు
‘మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు?’ అనే ప్రశ్నకు 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా చెప్పే జవాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జవాబులకు ఉపయోగపడే పుస్తకం... ఉమెన్ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. తరుణ్ బెహూరియా రాసిన ఈ పుస్తకంలో రిజర్వేషన్ల ప్రాముఖ్యత, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంపై దాని ప్రభావాన్ని గురించి వివరంగా చర్చించారు. ‘సరిౖయెనప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అనే అంశంతో ‘ఉమెన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా’ పుస్తకం రాశారు. పంచాయతీరాజ్లో రిజర్వేషన్ల ప్రభావం, భారతదేశంలో మహిళా సాధికారత: రాజకీయ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు: ఒక సామాజిక అవసరం, జాతీయ బాధ్యత, భారతదేశంలో మహిళలకు కోటాల అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా సాధికారతకు ఒక మైలురాయి. స్థానిక స్వపరి పాలన, మహిళలు, రాజకీయ భాగస్వామ్యం: శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్... ఇలా ఆసక్తికరమైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్ర, ΄÷రుగుదేశాలలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని గురించి వివరించే పుస్తకం... ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్– పోస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భారతదేశంలో మహిళలకు ఉన్న రిజర్వేషన్లను విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాలుగు విభాలుగా విభజించిన ఈ పుస్తకం మహిళా రిజర్వేషన్ చట్టంలోని వివిధ కోణాలను వివరిస్తుంది. -
'పర్సు'నాలిటీ డెవలప్మెంట్
పిల్లలకు అక్షర జ్ఞానాన్నే కాదు. ఈ రోజుల్లో ఆర్థిక అక్షరాస్యతను అందించడమూ అవసరమే! చాలా మంది డబ్బు సంపాదించడంపైన దృష్టి పెడతారు. కొందరు మాత్రం ఆ డబ్బును సరిగ్గా వినియోగించి, ఆర్థిక సమస్యలు లేకుండా కూల్గా ఉంటారు. ‘డబ్బు ప్రాముఖ్యత, ఖర్చుల నిర్వహణ, పొదుపు.. అలవాట్లు పెంపొందితే పెద్దయ్యాక ఆర్థిక భారాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది’ అంటున్నారు నిపుణులు. వేసవి సెలవుల్లో పిల్లలకు తీరికగా, అర్థమయ్యేలా చెప్పే మనీమేనేజ్మెంట్ గురించి మరింత వివరంగా!పిల్లలకు పెద్దలు ఇచ్చే కానుకలలో జీవితకాలం గుర్తుండి΄ోయేది డబ్బును ఎలా నిర్వహించాలో తెలిసే జ్ఞానం కూడా. ఆ ఆలోచన అమలు భవిష్యత్తులో పిల్లలు ఆర్థిక విషయాల్లో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది. అవసరాలకు.. కోరికల మధ్య తేడా! పిల్లలకు స్టేషనరీ అవసరం ఉండి షాపింగ్కు తీసుకెళుతుంటారు పెద్దవాళ్లు. అక్కడ పిల్లలను ఆకట్టుకునే చాక్లెట్లు, బొమ్మలు ముందుంటాయి. ఇలాంటప్పుడు పిల్లల మనసు బొమ్మలు, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. ముందుగా అవే ఎంచుకుంటారు. అవసరమైనవి కొనడానికి వాయిదా వేయడం లేదా పెద్దలను మరికొంత డబ్బు ఇవ్వమని అడగడం సహజంగా జరుగుతుంటుంది. ‘ఏది అవసరం, ఏది కోరుకోవడం..’ అనే ఎంపిక ముందు ఇంటి వద్దే ఇవ్వడం మొదలుపెట్టాలి.తప్పిదాల నుంచి పాఠాలుఈ రోజుల్లో చాలావరకు తల్లీతండ్రీ ఇద్దరూ సంపాదనపరులై ఉంటున్నారు. కోరింది ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో ఖర్చు శాతమూ పెరిగింది. తాము చేస్తున్న ఆర్థిక తప్పిదాలు ముందు పెద్దలు అర్థం చేసుకోవాలి. విద్య, వైద్యం, కుటుంబంలో వచ్చే అత్యవసర ఖర్చుల గురించి పిల్లలతో చర్చించడం వల్ల వారిలో ‘ఖర్చు’ పట్ల అవగాహన పెరుగుతుంది.సొంత డబ్బు...స్కూల్ లేదా ఏదైనా ΄ోటీల్లో పాల్గొనప్పుడు సంపాదించుకున్న ప్రైజ్ మనీని, అమ్మమ్మ, తాతయ్య, బంధువులు.. ఇచ్చిన మొత్తాన్ని, కిడ్డీ బ్యాంక్లో డబ్బు దాచుకోవడానికి ప్రోత్సహించాలి. పొదుపు మొత్తాలకు వడ్డీ రూపేణా వచ్చే వీలున్న పోస్టాఫీసు, బ్యాంకులు పిల్లల కోసం ఇస్తున్న అవకాశాల గురించీ తెలియజేయాలి. వారు ఆదా చేసిన డబ్బు మొత్తాల నుంచి కొనుగోళ్లు కూడా చేయించాలి. దీనివల్ల ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాలపట్ల అవగాహన పెంచుకుంటారు. పంచుకోవడమూ అవసరమే! ఖర్చు, పొదుపు, డొనేషన్ .. ఇలా మూడు బాక్స్లను చేయించి, వాటిని నిర్వహించమని చెప్పాలి. ఏ బాక్స్లోని డబ్బు ఎలా ఖర్చు అవుతోందో గమనించమనాలి. డబ్బు కేవలం మనకోసం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేయాలి. ఆటగా... అభ్యాసం...పిల్లలకు రకరకాల నోట్లు, నాణేలు, కార్డులను చూపించాలి. వాటిని వరుసక్రమంలో అమర్చుతూ, వాటి పేర్లు, ఆకారాలు, పరిమాణాలు, రంగులు, విలువ, చిహ్నాల గురించి మాట్లాడాలి. షాపింగ్కు తీసుకెళ్లినప్పుడు బిల్లు కౌంటర్ వద్ద పిల్లలకే డబ్బు ఇచ్చి, చెల్లింపులు చేయించాలి. ఈ రోజుల్లో తప్పనిసరిగా మారిన డిజిటల్ పేమెంట్స్ నిర్వహణ గురించి తెలియజేయాలి.కార్డు ద్వారా బిల్ చెల్లించాల్సి వస్తే, కౌంటర్ వద్ద కార్డును ట్యాప్ చేయించడం, తిరిగి తీసుకోవడం గురించి చెప్పాలి. ఆన్లైన్లో అప్లికేషన్ వాలెట్ బ్యాలెన్స్ను పిల్లలకు చూపించి, కొనుగోలు పూర్తయ్యాక, బ్యాలెన్స్ ఎలా మారుతుందో చెప్పవచ్చు.కొనుగోలు రసీదులను చూపించి, వస్తువులు, వాటి విలువ, మొత్తం లెక్కించమని చెప్పవచ్చు. ఎఐ అప్లికేషన్ను ఉపయోగించి ఫ్యామిలీ, ట్రావెల్ బడ్జెట్ను రూపొందించమని సూచించవచ్చు. పిల్లలకు మనీ మేనేజ్మెంట్ నేర్పడం అనేది ఒక్కరోజులో పూర్తి కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. తల్లిదండ్రులు ఎగ్జాంపుల్గా ఉండి, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే, వారు భవిష్యత్తులో ఆర్థికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. నేరుగా తెలుసుకునేలా చేస్తాను...మా ఇద్దరి పిల్లలు ఐదు, ఏడు తరగతుల్లో ఉన్నారు. ఇద్దరూ పోటీల్లో పాల్గొన్నప్పుడు వచ్చిన క్యాష్ ప్రైజ్ మనీని ఎలా పొదుపు చేసుకోవాలో చెబుతుంటాం. విడిగా బ్యాంక్ అకౌంట్ తీశాం. కిడ్డీ బ్యాంక్ నిండిపోయినప్పుడు ఆ అకౌంట్లో వేస్తుంటారు. వారికి అవసరమైనవి, కావాలనుకున్నవి ఆ మొత్తం నుంచి కొనుగోలు చేయమని కూడా చెబుతుంటాం. తమ దగ్గర పొదుపు మొత్తం పెరుగుతున్నప్పడు వాటిని ఎందులో పెట్టుబడిగా పెడితే బాగుంటుంది అనే విషయాల గురించి అడుగుతుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్, ప్రీమియమ్ గురించి కూడా చెబుతుంటాం. బయట కొనుగోలు చేసే వస్తువులు ఇంట్లో సొంతంగా తయారు చేయవచ్చా అనేది ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుందనే విషయాలు వారికి అర్థమవుతుంటాయి. – శకుంతల కస్తూరి, గృహిణి, బీహెæచ్ఇఎల్, హైదరాబాద్ నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ప్రాణాలకే ప్రమాదమా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే! గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు (చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
చలువ చేసే మారేడు పానకం..!
మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు ఏ షెర్బత్లు, జ్యూస్లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు. వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. ఆరోగ్య ప్రయోజనాలు..ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. మొటిమలను నివారిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కేన్సర్ బారినపడకుండా రక్షిస్తుంది. బాడీని హైడ్రేటెడ్ ఉంచుతుందిబరువుని అదుపులో ఉంచుతుంది. అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Chef Kirti Bhoutika (@kirtibhoutika) (చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!) -
ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం డ్రాగన్ కోసం తన ఫిజిక్ని ఎలా మార్చుకున్నారో అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపర్చారు. ఆయన శరీర ఆకృతిని చూసి..వావ్! ఎంత స్మార్ట్గా ఫిట్గా ఉన్నారు అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అది కూడా తక్కవ వ్యవధిలోనే ఏకంగా 9.5 కిలోలు తగ్గారు. ఈ మొత్తం ప్రక్రియకు ఆయనకు జస్ట్ ఏడు వారాలే పట్టిందట. మరి అదెలా సాధ్యమైందో, బరువు తగ్గాలనుకునేవారికి ఆయన అనుసరించి టిప్స్ హెల్ప్ అవుతాయేమో చూద్దామా..!.జూనియర్ ఎన్టీఆర్ జిమ్ సెటప్ ముందు క్లాసిక్ డబుల్ బైసెప్స్ భంగిమలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. మంచి ఫిట్గా స్మార్ట్గా మారిన తన రూపాన్ని షేర్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలకు ఇది కొని తెచ్చుకున్న కండలు కాదు, స్వయం నిర్మితం అని క్యాప్షన్ జోడించారు జూనియర్ ఎన్టీఆర్. అదెలా సాధ్యమైందో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ సవివరంగా వెల్లడించారు. తాను కేవలం ఎన్టీఆర్ వెయిట్లాస్ జర్నీని బరువు తగ్గడమే లక్ష్యంగా ప్రారంభించలేదని, సన్నని చురుకైన శరీరాకృతిని సాధించడంపై ఫోకస్ పెడుతూ మొదలు పెట్టామన్నారు. దీని కోసం జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ దినచర్యను గణనీయంగా మార్చారట. భారీ కండరాల నిర్మాణ వ్యాయమాలకే పరిమితం కాకుండా, తన శిక్షణను ఫంక్షనల్ కదలికలు, కార్డియో కేంద్రీకృత వ్యాయామాల తోపాటుగా, మోస్తారు రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటివి కూడా చేశారని చెప్పారు. రోజు కార్డియో లేదా స్ట్రెంగ్త్ వ్యాయామాలను మాత్రం సుమారు 45 నుంచి 90 నిమిషాలు చేసేవారట. ఆఖరికి ఫుడ్ కూడా చాలా ప్రణాళికగా తీసుకునేవారట. సాధారణంగా కండరాల పెరుగుదలతో ముడిపడి ఉన్న ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి బదులుగా తక్కువ ప్రోటీన్ తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారని ట్రైనర్ కుమార్ మన్నవ వెల్లడించారు. ఈ వ్యూహమే ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని కోల్పోవడానికి, అలాగే తన మూవీ డ్రాగన్లోని పాత్రకు అనుగుణంగా సన్నటి రూపాన్ని సాధించడానికి హెల్ప్ అయ్యిందని అన్నారు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చాలామటుకు సెలబ్రిటీల మాదిరిగా వెయిట్లాస్ జర్నీని ప్రారంభించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!) -
98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!
కష్టపడటానికి, తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్రంగా నిలబడటానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు చాలామంది వృద్ధులు. సంకల్పం, ఆత్మశ్వాసం ఉంటే అందంగా లైఫ్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ బామ్మ అదే నిరూపించింది. ఆమె అప్పటి వరకు భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా సాగిన జీవితంలోకి అకస్మాత్తుగా చీకట్లు ఆవరించాయి. అయితేనేం బామ్మ వెంటనే తేరుకుని ఆ దుఃఖాన్ని కూడా అందంగా మధురంగా మార్చుకుంది. అదెలాగంటే..ఆ బామ్మే అహ్మదాబాద్కు చెందిన 98 ఏళ్ల ప్రభావతి భగవతి. విశ్రాంతి తీసుకునే వయసులో ఆమె వ్యాపారవేత్తగా ఫుడ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అది తెలుకోవాలంటే..ముందుగా ఆమె కథేంటో తెలుసుకోవాల్సిందే. 1927లో జన్మించిన ప్రభావతి తన భర్త ప్రఫుల్ భగవతితో సుదీర్ఘకాలం సంతోషంగా జీవించారు. ఆ దంపతులు దాదాపు 68 ఏళ్ల పాట్లు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించారు. కానీ 2017లో భర్త భగవతి మరణంతో అంతా మారిపోయింది. ఆమె ఇల్లు నిశబ్దంగా మారి, వంటగది వెలవెలబోయినట్లు అనిపించింది. ఆమె పిల్లలు వేరేచోటే స్థిరపడటంతో మనవళ్లు, మనవరాళ్లు పెద్దవాళ్లైపోవడంతో తాను వండిపెట్టడానికి ఎవరు లేకుండా పోయారు. ఆమె చక్కటి వంటకాలు వండి పెడుతూ తన ప్రేమను వ్యక్తపరిచే ఆమెకు అది మరింత లోటుగా అనిపించింది. అప్పుడే ఊహించని ఓ సంఘటన జరిగింది. ఒక సాధారణ టీ విందులో ఎవరో ప్రభావతి బామ్మ చేసిన ఖాండ్వీ రుచిని చూసి ముగ్ధలయ్యారు. దాంతో వాళ్లు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసం చేయమని పట్టుబట్టడమే కాకుండా డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. మొదట్లో ప్రభావతి అందుకు అంగీకరించలేదు. కానీ వాళ్ల బలవంతంపై అంగీకరించక తప్పలేదు. అలా ఆమె తొమ్మిది పదుల వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఒక ఆర్డర్తో మొదలైంది కాస్తా.. త్వరలోనే అనేక ఆర్డర్లుగా మారింది. ప్రజలు ఆమె వంటను ఇష్టపడటమే కాదు దానితో మమేకమయ్యారు. అలా 2019లో “నానిస్ నాష్టా” అనే ఫుడ్ స్టాల్ మొదలైంది. అందుకు పెద్ద ఏర్పాటు, మార్కెటింగ్ బృందం వంటివి గానీ ఏమిలేవు. అలాగే ఆ ఫుడ్ స్టాల్కి కనీసం ప్రమోషన్స్కూడా లేవు. కేవలం ప్రభావతి బామ్మ తన ఇంటి వంటగదిలో ప్రేమతో వంటకాలు చేసేవారు. ఆమె గుజారాతీ రుచుల తోపాటు ముంబై స్ట్రీట్ ఫుడ్ క్లాసిక్స్, వడాపావ్, సేవ్పూరీ, ధోక్లా, తేప్లా, భాక్రీ, పావ్ భాజీ తదితర రుచికరమైన వంటకాలెన్నో అందిస్తుంది. వీటన్నింటిలోనూ ప్రసిద్ధి ఆకర్షణ ఖాండ్వీ ఉంటుంది. ఈ వంటకం కారణంగానే ఆ బామ్మ ఫుడ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఈ బామ్మ సుమారు 200కు పైగా కుటుంబాలకు వంట చేస్తున్నారు. అంతేగాదు 'నానిస్ నాష్టా' వ్యవస్థాపకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది. అప్పటిదాక దూకుడుగా ఉన్నమనం తొమ్మిది పదులకు చేరుకునేలోపు నెమ్మదిగా, విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ బామ్మ అలాంటి మూసధోరణికి స్వస్తి చెప్పి..వ్యక్తిగతంగా ఎదుగుతున్న తీరు అందరికీ ఆదర్శం. (చదవండి: ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?) -
ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?
ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీతో అత్యంత విలాసవంతమైన ఫ్లోరింగ్ పద్ధతులు, ఇరానీ మార్బుల్స్ వంటి వాటితో ఏసితో పనిలేకుండానే కూల్గా ఉంచుకుంటున్నారు. అయితే ఇవన్నీ అత్యంత ఖర్చుతో కూడుకున్నవి, ధనవంతులకే పరిమితమైనది. కానీ నాటి రోజుల్లోనే తక్కువ ఖర్చుతోనే ఏసీలతో పనిలేకుండానే చక్కగా ఇంటిని కూల్గా ఉంచే ఫ్లోరింగ్ పద్ధతిని వినియోగించేవారిని తెలుసా. ఏకంగా 300 ఏళ్ల నాటి క్రితం ఈ పద్ధతిని వినియోగించారు మన పూర్వీకులు. పైగా చాలా సహజ పద్ధతితలో తక్కువ ఖర్చుతో చేయడం విశేషం. ప్రస్తుతం ఈ టెక్నిక్ అంతరించిపోయే దశలో ఉంది. మరి అద్భుతమైన కళాత్మక టెక్నిక్ గురించి తెలుసుకుందామా.ఇది పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజ పద్ధతిలో ఇంటిని కూల్గా ఉంచుకునే గొప్ప టెక్నిక్ ఇది. భారత్లో ముఖ్యంగా కొన్ని ప్రముఖ నగరాల్లో ఎండలు ఏ రేంజ్లో దంచికొడుతుంటాయో చెప్పాల్సిన పనిలేదు. అలా అని ఏసీలు, కూలర్లు వినియోగిస్తే..ఆ తర్వాత కరెంట్ బిల్లులు జేబు చిల్లుపెట్టే రేంజ్లో వచ్చి హడలెత్తిస్తాయి. పైగా ఎక్కువ గంటలు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాంటప్పుడు దాదాపు 300 ఏళ్ల క్రితం కూలర్లు, ఏసీల మాట ఎత్తని ఆ రోజుల్లోనే మన పూర్వీకులు సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకునే సాంప్రదాయ ఫ్లోరింగ్ పద్ధతిని కనుగొన్నారు. ఇదెలా ఉంటుందంటే..మార్బుల్స్, టైల్స్పై ఆధారపడని కాలంలో దీనిని ప్రవేశ పెట్టారు. దీని కోసం సిమెంట్గానీ, రసాయనాలు గానీ వినియోగించరు. ఇందులో ఉపయోగించే పదార్థాలు కేవలం నీరు, ఐరన్ ఆక్సైడ్, సున్నం మాత్రమే. నాటి మేస్త్రీలు వీటిని తమ చేతులతో కలిపి ఫ్లోరింగ్ చేసేవారు. ఆ మిశ్రమం గట్టిపడ్డాక..అద్దంలాంటి తళతళలాడే మెరుపు కోసం.. కొబ్బరి నూనెతో గంటల తరబడి పాలిష్ చేసేవారు. కొబ్బరినూనె రంగులేని మెరుపును సృష్టించడంలో సహాయపడటం తోపాటు చల్లదనాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రభావాన్ని సింథటిక్ పాలిష్లతో సాధించలేము. వేసవికాలంలో మధ్యాహ్నం సూర్యుడి భగభగలు ఎంత గరిష్టంగా ఉన్నా..ఈ ఫ్లోరిగ్ పాదాల కింద మంచు మాదిరి చల్లదనాన్ని అందించడం విశేషం. దీని అద్భుతమైన మన్నికే అత్యంత విలక్షణంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేగాదు ఈ ఫ్లోర్ ఉపరితలం ఎంత అందంగా మెరుస్తూ ఉంటుందటే..పాదాల అడుగులు దాన్ని అరిగిపోయేలా చేయకుండా మరింత నునుపుగా ఉంచడం విశేషం. ఈ ఫ్లోరింగ్ పద్ధతిని కేరళలో ఎక్కువగా వినియోగించేవారట.అంతేకాదండోయ్ ఈ ఫ్లోరింగ్ పది దశాబ్దాల వరకు ఎలాంటి గీతలు లేకుండా మన్నికగా ఉంటుందట. సాధారణంగా ఈ ఫ్లోరింగ్ ఎరుపు, గోధుమ ఛాయతో సహజమైన మెరుపుతో ఉంటుందట. అయితే ప్రస్తుతం ఈ విధమైన ఫ్లోరింగ్ చేసే కార్మికులు కొద్దిమందే ఉన్నారట. ఈ అద్భుతమైన నైపుణ్యం రాను రాను కనుమరుగవుతుండటం బాధకరం. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఫిట్నెస్పై ఇంత క్రేజా?!) -
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
ఫిట్నెస్పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..!
అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్ బాక్స్లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్ బ్యాగ్లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్ రియాక్షన్. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...మజిల్ క్రాంప్స్ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్ పడుతుంది. అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. ఈ మజిల్క్రాంప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్హీట్గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్హీట్కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్కు తీసుకురావడం అవసరం.ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలుగుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్క్రాంప్స్ వంటి సమస్యలూ నివారితమవుతాయి.పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.సూప్లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.వెజిటబుల్ సూప్స్ : అన్ని రకాల సూప్లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్)ల్లోంచి సూప్లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్. జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.రకరకాల పానీయాలు...అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్లో లేదా ఆ వేర్ల పౌడర్లో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్పన్నా అనే సీజనల్ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు. ఇవేకాకుండా... ఖస్ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్ కలపకుండా తాగడమే మేలు.తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్...పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్ చీజ్ సలాడ్స్... తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్డ్రింక్స్, సోడా, ఐస్క్రీమ్లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్ని తీసుకోవడమే మంచిది. ఇవి ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. కుకుంబర్... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వాల్నట్స్... ఆక్రోట్ల (వాల్నట్)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు ఇవ్వడం మేలు. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్పెప్పర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. పనీర్... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్డ్ వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.ఇంట్లో తయారుచేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.కొన్ని జాగ్రత్తలు ఇవి... పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్ల కలర్ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్కు బదులు మంచి గాజు బాటిల్ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్లు, వాటర్బాటిల్స్నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్ స్క్రీన్ లోషన్స్ / క్రీమ్స్’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్ రాస్తుండాలి. పిల్లలను కారులో ఉంచి షాపింగ్ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు ఇవ్వకూడనివి... దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్క్రాంప్స్ను తగ్గిస్తుంది. ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్డ్రింక్స్లో కెఫిన్ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్సలాడ్స్ వంటివి ఇవ్వవచ్చు. డాక్టర్ కంచన్ ఎస్ చన్నావర్కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!
భారతీయ కళలు గురించి ఈ తరానికి ఎన్ని తెలుసు అని అడిగితే కచ్చితంగా నీళ్లు నములుతారు. మహా అయితే ఒకటో, రెండో చెబుతారు అంతే. కానీ ఈ చిన్నారి అంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించి..చేస్తున్న మహత్తర కార్యం గురించి తెలిస్తే..శెభాష్ అని అభినందించకుండా ఉండరు. ఎందుకంటే జస్ట్ నాల్గో తరగతికే ఆ చిన్ని మనసు ఎంతో బాధ్యతగా ఆలోచించ విధానం..అందుకోసం పడుతున్న తపన ప్రతి ఒక్కర్ని కదలిస్తుంది. రేపు ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారి కళా వారసత్వం కోసం చేస్తున్న కృషి గురించి సవివరంగా చూద్దామా.ఆ అమ్మాయే మన భాగ్యనగరం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న శ్రేష్ట అక్షయ్. పిల్లలందరికి నచ్చినట్లుగానే అక్షయ్కు కూడా రంగురంగుల పెన్సిళ్లు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొత్త కార్టూన్ డిజైన్ల పెన్సిళ్ల కోసం తెగ వెతికేది. ఒక రోజు అమ్మని అడిగింది ఇతర దేశాల్లో తయారైన పెన్సిళ్లు, ఇతర దేశాల కార్టూన్లతో ఉండే పెన్సిళ్లను ఎందుకు వాడుతున్నాం అని అమాయకంగా ప్రశ్నించింది. ఆ సందేహమే తనను విలక్షణమైన చిన్నారిగా అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తుందని అక్షయ్గానీ, ఆమె తల్లిగానీ ఆరోజు ఊహించలేదు. ఆ ప్రశ్నతో మొదలైన ఆ చిన్నారి అక్షయ్ ఆలోచన..మన కళా రూపాలపై ఆసక్తిని పెంచుకునేందుకు దారితీసింది. మనదేశంలో ఉన్న ప్రముఖమైన కళా రూపాలతో పెన్సిళ్లు ఎందుకు ఉండకూడదు అనుకుంది. అంతేగాదు తానే ఎందుకు అలాంటి పెన్సిళ్లను తీసుకురాకూడదు అనుకుంది. దీనివల్ల తనలాంటి పిల్లలందరికి మన భారతదేశ కళలు, వాటి గొప్పదనం గురించి తెలుస్తుంది కదా అని అనుకుంది. అంతేగాదు మన అందమైన కళారూపాలైన..మధుబని కళ, గోండ్ కళ, పైట్కర్ కళ, పిథోరా కళ, వార్లీ కళ వంటి కళల పేర్లను పెన్సిళ్లపై రాస్తే, అవి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, మన గొప్ప వారసత్వం గురించి తెలుసుకోగలుగుతారని భావించింది అక్షయ్. ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రుల సహాయం తీసుకుని మరి బీహార్కు చెందిన మధుబని కళ, మహారాష్ట్రకు చెందిన వార్లీ కళ, రాజస్థాన్కు చెందిన పిచ్వాయి కళ, కర్ణాటకకు చెందిన కావి కళ, రాజస్థాన్కు చెందిన బ్లూ పాటరీ కళ, మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ కళ, గుజరాత్కు చెందిన పిథోరా కళ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కలంకారి కళ, తెలంగాణకు చెందిన చెరియల్ కళ, తదితర భారతీయ కళారూపాలను పెన్సిళ్లపైకి తీసుకువచ్చే పనిలో పడింది. ఆ క్రమంలో డిజైనింగ్, క్రాపింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తారు, వాటిని ఇంట్లో, ప్రింటింగ్ షాపుల్లో ఎలా చేస్తారు వంటి చాలా విషయాలు నేర్చుకుంది. అలా తన పేరెంట్స్ సాయంతో సొంతంగా కళారూపాలతో కూడిన పెన్సిల్ బ్రాండ్ “ఆరా పెన్సిల్స్” ఏర్పాటు చేసి, దానికో www.aurapencils.com. అనే వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసింది. అక్కడ ఆన్లైన్లో కళారూపల పెన్సిళ్లు ఆర్డర్ పెట్టుకుని కొనుగోలు చెయ్యొచ్చట. తన ఆలోచన గురించి తన స్నేహితులకు కూడా చెప్పాను వాళ్లంతా కూడా మెచ్చుకున్నారని సంతోషంగా చెబుతోంది. అంతేకాదండోయ్ మన భారతీయ కళారూపాల గురించి తెలుసుకునేలా చేయడమే కాకుండా భారతదేశంలో తయారై పెన్సిళ్లనే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిన్నారి అక్షయ్.(చదవండి: ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..) -
ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..
ఏదైనా అనారోగ్యం లేదా గాయల పాలైతే భయపడిపోకుండా ధైర్యం కూడగట్టుకుని చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్నేహితులు, సన్నిహితుల మద్దతు తీసుకోవాలి. కానీ కొన్ని గాయాలు మనల్ని ఎంతగా కుంగదీస్తాయంటే..ఇక అయిపోయింది లైఫ్ అన్నట్లుగా ఉంటాయి. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో కూడా తెగువతో బతికిచూపడమే గాక..విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుంటోంది ఈ ధీర వనిత.ఆ ధైర్యవంతురాలే పల్లవి కుమార్ అగర్వాల్గా పిలిచే మీరా. ఆమె జీవితం ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు చవిచూసింది. మీరా పాట్నాకి చెందిన మహిళ. ఆమె ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ సమయంలో పూర్తి స్థాయి మాంసాహారి. ఫిట్నెస్, వ్యాయామాలపై విపరీతమై ఆసక్తి కూడా. ఆమె పెద్ద కార్పొరేషన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా డిజైన్ అండ్ ప్రొడక్ట్ హెడ్గా అత్యంత ఒత్తిడితో కూడిన షెడ్యూల్ని నిర్వహిస్తూనే మారథాన్లలో పరిగెత్తేవారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారు. కానీ ఆ రోజు ఆమె మోకాలికి అయిన గాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఓ మలుపు తిప్పింది. ఆ మోకాలి గాయం ఆమెను మళ్లీ జీవితంలో నడవనివ్వకుండా చేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కొన్ని రకాల వ్యాయామాలు, మందులతో రెండు అడుగులు వేయొచ్చు అంతే తప్ప సరిగ్గా నడవడం గానీ పరిగెత్తడం వంటివి చేయలేవని తేల్చేశారు. దాంతో మీరా ఆ గాయం క్యూర్ అయ్యేలా పలు రకాల చికిత్సల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టింది, లెక్కలేనన్ని మందుల మింగింది. అప్పడు మీరా తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురయ్యింది. జీవితమంతా వ్యాయామాలు చేసి ఎంతో హెల్దీగా ఉండే మీరాకి నడవలేవని చెబుతున్న మాటలను జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే ఆమె తనలా తీవ్రమైన గాయాల బారినపడి తిరిగి అథ్లెట్లుగా దూసుకొచ్చిన మహిళల ఉదంతాలు చదవడం ప్రారంభించింది. అంతేగాదు ఆ మహిళల జీవితాలు, వారి లైఫ్స్టైల్ గురించి క్షణ్ణంగా చదివేది. 'ది గేమ్ ఛేంజర్స్' అనే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీరాని ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో మీరా ఇదివరికటిలా యాక్టివ్గా మారింది. అంతేగాదు పాలు, మాంస ఉత్పత్తులను పూర్తిగా మానేసి..పూర్తిగా సాంప్రదాయ భారతీయ ఆహారానికి మారింది. తన భోజనంలో రాగి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ప్రారంభించిది. చెప్పాలంటే పూర్తి శాకాహారిగా మారిపోయింది. అలాగే రకరకాల వంటకాలప ప్రయోగాలు ప్రారంభించి సొంతంగా రాగిపాలు, కొబ్బరి మజ్జిగను తయారు చేయడం ప్రారంభించింది. ఈ కొబ్బరి పానీయాన్ని తన కుటుంబసభ్యులు కూడా ఇష్టపడతారని అంటోంది. అంతేగాదు ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త పరీక్ష ఫలితాల్లో అద్భుతాన్నే చూడొచ్చని అంటోంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటోంది. వీటితోపాటు ఆహారంలో హలీమ్ లడ్డూలు, నట్స్, వివిధ సీడ్స్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంది. అయితే బేకరీ స్వీట్లు, కేక్లు, కుకీలకు దూరమైపోయింది. ఆమెకు కాఫీ తోపాటు వాటిని తినే అలవాటు ఉండటంతో..మళ్లీ బేకరీ ఉత్పత్తులను హెల్దీగా చేయడంపై దృష్టి సారించి పలు రకాల వంటకాలు చేసింది. అవన్నీ పాలు, వెన్నకు బదులు, నట్ బటర్లు, కోల్డ్ప్రెస్ నూనెలు, శాకాహార పాలతోనే చేసేది. పైగా ఆమె వంటకాల రుచికి ఫిదా అవ్వతూ స్నేహితులు, బంధువులు బేకరీని ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా 'ఇడున్' అనే బేకరీని ప్రారంభించింది. అయితే ఆమె ఏమి చెఫ్ స్పెషలిస్ట్ కాదు. అయినప్పటికీ కుకీలను ఎంతో రుచికరంగా, పోషకమైనవిగా తయారు చేయడం ఆమె స్పెషాల్టీ. అలాగే ఆయుర్వేదం చక్కెరను చెడ్డదిగా చెప్పదని, తీసుకోవాల్సిన విధంగా మితంగా తీసుకుంటే మంచిదేనని అంటోంది మీరా. ఆమె ఆయుర్వేద సూత్రాలు పాటిస్తూ..తిరిగి హెల్దీగా ఉండేలా కేర్ తీసుంటోంది కూడా. అంతేగాదు అక్కడితో మీరా ప్రస్థానం ఆగిపోలేదు. తిరిగి నడవలేవు అన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా లడఖ్ మారథాన్లో పాల్గొని నిర్దేశించిన సమయాని కంటే ముందుగానే పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. తన అవరోధాన్ని, పరిమితులను ధిక్కరించేలా ఎవరెస్టు బేస్ క్యాంప్లకు ట్రెక్కింగ్ చేయడం, ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న యూనం పర్వతాన్ని అధిరోహించడం, ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్షిప్ పీక్ను జయించడం వంటివి చేసింది. కష్టాలు, గాయాలు మనల్ని కోలుకోనీయకుండా చేయొచ్చేమో గానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు, తిరిగి విధికే ఛాలెంజ్ విసిరేలా నిలదొక్కుకోవాలనే సారాంశం మీరా స్టోరీ చెబుతోంది కదూ..!.(చదవండి: అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..) -
అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..
సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్ సృష్టించే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాయ్ చౌధురి ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను. "వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్లో వెల్లడించారు రాయ్.స్పెషాల్టీ..కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం 'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్ డైయింగ్ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం. View this post on Instagram A post shared by Diya Roychowdhury (@vastrakathaxdiya) (చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్) -
40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్
రాబోయే మిస్వరల్డ్ పోటీల కోసం సన్నద్ధమవుతున్న మిస్ ఇండియా నికితా పోర్వాల్కు ఘనంగా వీడ్కోలు పలికారు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు. ఏకంగా 40 వేల మంది విద్యార్థులు మానవ సముహాలుగా ఏర్పడి మిస్వరల్డ్గా ప్రదర్శించిన తీరు హైలెట్గా నిలిచింది. ఈ కార్యక్రమం అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఈ అందాల పోటీలకు వెల్లువెత్తుత్ను మద్ధతు చూసి నికితా ఆశ్చర్యపోయింది. ఆశీర్వాదాల సంద్రం..ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఏప్రిల్ 13న 'ది పేజెంట్ జర్నీ' ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. వేలాదిమంది విద్యార్థులు ఐక్యతను ప్రదర్శిస్తూ..మైదానంలో ఏకమైన అద్భుతమైన దృశ్యం చూస్తే కళ్లు ఆర్పడం మర్చిపోతాం. గగనతలం నుంచి చూస్తే పచ్చదనంతో కూడిన మైదానంలో 'మిస్ వరల్డ్' అని అక్షరాల ఏరియల్ వ్యూస్లా కనిపించే మానవ నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో హై-నెక్, స్లీవ్లెస్ సిల్హౌట్తో కూడిన మెరిసే గులాబీ రంగు గౌనులో మిస్ ఇండియాగా కనిపించారు నికితా పోర్వాల్. ఆమె భారీ జనసముహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడూ..ఆ గౌనుపై ఉన్న మెరిసే డిజైన్ కాంతిలో మిస్ ఇండియా కిరిటంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా కనిపించింది. అక్కడున్న దాదాపు 40 వేల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఒడిశా ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడారు. ఒడిశాలో నా కిరీటాన్ని ఇచ్చేస్తానేమో అనుకున్నా కానీ ఏమి ఇవ్వడం లేదు..కానీ నాతో ఈ 40 వేల మంది ఆశీస్సులను తీసుకువెళ్తున్నా. ఈ రోజు మనం ముంబై నుంచి బాబా జగన్నాథ్ నగరానికి వచ్చాం. ఇదేమి యాదృచ్ఛికం కాదు. మీరంతా ఈ దేశపు భూమి పుత్రికలు. మీ అందరికి ధన్యావాదాలు". అని తన ప్రసంగాన్ని ముగించారామె. సుమారు 130 దేశాలు పాల్గొంటున్న ఈ చారిత్రాత్మక మిస్ వరల్డ్ పోటీ కోసం నికితా వియత్నాంకు బయలుదేరుతుండటంతో ఆమెపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అదీగాక ఈ ఏడాది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవం కూడా. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మిస్ వరల్డ్ 2026 ఫైనల్ సెప్టెంబర్ 5, 2026న జరగనుంది. వియత్నాంలోని హనోయి, హూచి మిన్ వంటి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కు చెందిన నికితా పోర్వాల్ బలమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారు. 60కి పైగా నాటకాలలో నటించిన రంగస్థల కళాకారిణి టీవీ యాంకర్ కూడా ఆమె. అంతేగాదు నికితా అందం తోపాటు అపారమైన తెలివితేటలు ఉన్న వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారామె. View this post on Instagram A post shared by THE PAGEANT JOURNEY™ (@thepageantjourney) (చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!) -
జస్ట్ ఆరు నెలల్లో 32 కిలోలు..! యంగ్లుక్లో 48 ఏళ్ల వ్యక్తి..
బరువు పెరగడం అనేది ముమ్మాటికి అధికంగా తినడం వల్ల మాత్రమే కాదు. ఉరుకుల పరుగుల జీవన విధానానికి తోడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించే క్రమంలో చెడు ఆహారపు అలవాట్లకు బానిస అవ్వడంతో అధిక బరువుకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇక్కడొక వ్యక్తి ఊబకాయం బారినపడి రోజువారీ పనులు చేసుకోలేక పలు అవస్థలు పడ్డాడు. కనీసం ఫ్లైట్ జర్నీ సైతం కష్టంగా మారింది. అక్కడ చైర్లు తన భారీకాయాని సరిపోక ఇబ్బందులు, వార్డ్రోబ్లో బట్టలన్నీ డబుల్ఎక్స్ఎల్ సైజులే. కనీసం తనకు నచ్చిన డ్రెస్ తనసైజులో దొరకక పడే కష్టాలతో విసుగెత్తిపోయాడు. చివరికి బరువు తగ్గి స్మార్ట్గా మారాలని గట్టిగా నిశ్చయించుకుని మరి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తగ్గిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఆరు నెలల వ్యవధిలోనే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం విశేషం. అదెలాగో ఆ వ్యక్తి మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఆ వ్యక్తే 48 ఏళ్ల డేవిడ్. అతడు ఆరు నెలల క్రితం సుమారు 128 కిలోల బరువు ఉండేవాడు. 48 ఏళ్ల వయసులో చాలా చురుకుగా ఉండేవాడు, చక్కగా వ్యాపారాన్ని రన్ చేసేవాడు. తన పిల్లల బాస్కెట్బాల్, సాకర్ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. కానీ అతడు తన ఆరోగ్యం పట్ల చాలా చాలా ఆసంతృప్తిగా ఉన్నాడు. రోజువారీ పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయి. ప్రయాణాలకు సామాన్లు సర్దుకోవడం ఒక పెద్ద పనిగా అనిపించేది. విమాన సీట్లు చాలా అసౌకర్యంగా ఉండేవి అతడికి. ఆఖరికి సరిగ్గా సరిపోయే బట్లలు దొరకడం ఓ సవాలుగా ఉండేది. దీనికి కారణం పని ఒత్తిడి. ఆ స్ట్రెస్ కారణంగా జంక్ఫుడ్కి బానిసయ్యాడు. అది కాస్తా అతడి రూపురేఖల్ని మార్చేసేలా అధిక బరువుకి దారితీసింది. ఇకలాభం లేదు ఇలా ఉంటే..రాను రాను తన కదలికలే భారంగా మారపోతాయేమో అనేంత భయం వేసింది. దాంతో బరువు తగ్గాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఫిట్నెస్ కోచ్ కెవ్ని సంప్రదించాడు. అతడి మార్గదర్శంకలో సరైన జీవనశైలిని అవలంబించి కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గాడు. ఇంతకుముందు బట్టలు సర్దుకోవడం, జర్నీలకు వెళ్లడం ఎంత భారంగా ఫీలయ్యాడో..ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా తేలిగ్గా చేసేస్తున్నాడు. అంతేగాదు కొలరాడోకు విమాన ప్రయాణంలో సౌకర్యవంతంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు డేవిడ్. అంత సులభంగా, వేగవంతంగా బరువు ఎలా తగ్గాడో..తన వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందో అతడి ఫిట్నెస్ కోచ్ కెవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. పైగా అతడు ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా వివరించాడు.బరువు తగ్గేందుకు పాటించాల్సినవి..స్థిరంగా బరువు తగ్గాలంటే..ప్రోటీన్ల కోసం ఆహారంలో చికెన్ బ్రెస్ట్, సిర్లోయిన్ స్టీక్, సాల్మన్, గుడ్లు, టర్కీ బేకన్, రొయ్యలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్ తదితరాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ల కోసం తెల్లటి అన్నం, కెవ్ బ్రోకలీ, ఆస్పరాగస్, మిరపకాయలు, పాలకూర, పచ్చి బీన్స్ తదితరాలను సిఫార్సు చేస్తున్నారు. అంతేగాదు క్రియేటివ్ మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి సంప్లిమెంట్లను కూడా జోడించినట్లు తెలిపారు కోచ్ కెవ్.ఫుడ్ ప్లాన్..ప్రణాళికతో కూడిన భోజనం, అది కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.భోజనం 1: ప్రోటీన్ షేక్తో గ్రీక్ యోగర్ట్, లేదా టర్కీ బేకన్తో 3 గుడ్లు, లేదా అధిక ప్రోటీన్ యోగర్ట్తో కాటేజ్ చీజ్.భోజనం 2: అన్నం, బ్రోకలీతో చికెన్, చిలగడదుంప, కూరగాయలతో మటన్, లేదా అన్నం, ఆకుకూరలతో సాల్మన్ ఉన్నాయి.భోజనం 3: బంగాళదుంపలు, ఆస్పరాగస్తో చికెన్ లేదా కాలీఫ్లవర్ రైస్ విత్ మిరపకాయలు, కూరగాయలతో రొయ్యలుతినమని కోచ్ కెవ్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.మెరుగైన ఫలితాల కోసం..సత్వరమే మార్పులు పొందాలంటే సక్రమైన విధంగా దినచర్యను అనుసరించాల్సి ఉంటుంది.ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి.మద్యపానానికి దూరంగా ఉండటం, రాత్రి 7 గంటల తర్వాత తినడం ఆపడంప్రతిరోజూ కనీసం 8 వేల అడుగులు నడవాలివారానికి 3–4 సార్లు 45 నిమిషాల పాటు తీవ్రమైన శక్తి శిక్షణ వ్యాయామాలు చేయడం.ఉదయం 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, రెండుసార్లు బయట నడవడంప్రతిరోజూ కనీసం 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడంనీరు, ఎలక్ట్రోలైట్లతో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండిప్రతిరోజూ 5 గ్రాముల క్రియేటిన్, నిద్రపోయే ముందు 400mg మెగ్నీషియం తీసుకోండిఈ విధమైన దినచర్యతో ఆరు నెలల్లో 129 కిలోల నుంచి 96 కిలోలుకు చేరుకుని యువకుడి మాదిరిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా పరివర్తన వస్తుందనడానికి డేవిడ్ వెయిట్లాస్ స్టోరీనే ఉదాహరణ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. David lost 70lbs in 6 months at 48 years old.He came to us at 283 lbs.Active guy. Runs a business. Coaches his kids' basketball and soccer teams.But he wasn't where he wanted to be with his health and knew he needed to make a change.He knew what was wrong. He just… pic.twitter.com/zTiabcWAt7— Coach Kev - Belly Fat Pro (@AskCoachKev) April 10, 2026 (చదవండి: గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!) -
గరిట పట్టిద్దాం
వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. చదువులకు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం. కుకింగ్, మనీ మేనేజ్మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్, రీ సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీస్, నేచర్ లైఫ్, గ్లోబల్ ఎక్స్పోజర్, వెల్బీయింగ్ క్లాసెస్, కమ్యూనికేషన్, డిజటల్ అండ్ టెక్నాలజీ స్కిల్స్.. ఇవన్నీ పాఠాలుగా కాకుండా వివిధ రకాల అంశాలలో అవగాహన కలిగించడానికి మేలైన సమయం. ఈ వేసవిలో పిల్లలకు వినోదాన్ని కూడా ఇచ్చే అంశాలపై నిపుణుల సూచనలతో వరుస కథనాలు.వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. నచ్చిన ఆటలు, మెచ్చిన వినోదం.. వీటితోనే కాలక్షేపం చేయడం కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం కూడా. ఆ జాబితాలో ముందుగా వంటింట్లోకి తీసుకెళదాం. పిల్లలను కుదురుగా ఉంచేది, ఏకాగ్రతను పెంచేది, సహనాన్ని, టీమ్ వర్క్ని పరిచయం చేసే పాకశాస్త్రాన్ని పరిచయం చేద్దాం.. రోజూ అమ్మ చేసే వంటకు ఏదో వంక పెట్టే పిల్లలు ఉంటారు. ఒక వంట తయారు చేస్తే, మరోటి అడిగే వారూ ఉంటారు. ఇష్టమైనవన్నీ తయారుచేసి, సమయానికి బాక్స్ కట్టి ఇచ్చే అమ్మ పని తెలియాలంటే ఇదో చక్కని మార్గం కూడా. ‘అమ్మో! వంటింటిని పిల్లలకు అప్పజెప్పడమా!’ అని భయపడకుండా పిల్లల చేత గరిట పట్టిస్తే ఏమేం జరుగుతుందో తెలుసుకుందాం.. → రుచుల ఆస్వాదనవంట పాత్రలు, అందుకు ఉపయోగించే వివిధ రకాల సాధనాలు ముందుగా పరిచయం అవుతాయి. ఆ తర్వాత వంట దినుసులు, కూరగాయలు, ఆకుకూరల పట్ల అవగాహన పెరుగుతుంది. వేటితో ఏ తరహా వంటకాలు తయారు చేయచ్చు, రుచులను కలపడం వంటి ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ఒక సాధారణ పదార్థాన్ని కొత్తగా ఎలా రూ΄÷ందించవచ్చు, అనే ఆలోచన కూడా వారిలో అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా ఇటాలియన్ , జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ వంటకాలనూ పరిచయం చేయవచ్చు. దీనివల్ల పిల్లల్లో ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది.→ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతాము తయారు చేసిన వంటకాన్ని కుటుంబ సభ్యులు రుచి చూసి, ప్రశంసిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వయసులోనే ‘నేను చేయగలను‘ అనే భావన అలవాటు అవుతుంది. ఇంటì పనుల్లో తామూ భాగస్వాములు అవుతారు. వంట భారంగా కాకుండా సులభంగా చేసేలా ప్రోత్సహించవచ్చు.→ జట్టుగా విజయం కుకింగ్ క్లాసులలో చేరితే పిల్లలు గ్రూప్స్గా పనిచేస్తారు. ఇది వారికి టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ను నేర్పిస్తుంది. ఇతరులతో కలిసి పని చేయడం, బాధ్యతలు పంచుకోవడం వంటి లక్షణాలు పెరుగుతాయి.→ సమతుల్యత సాధనవంట సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వంటలో ఉపయోగించే పదార్థం తక్కువైతే ఎలా మార్చాలి, రుచిని ఎలా సర్దుబాటు చేయాలి... ఇవన్నీ పిల్లల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలియజేస్తుంది.→ మంచి అలవాట్లుముఖ్యంగా వంట చేయడం ద్వారా పిల్లలు ఆహార విలువ తెలుసుకుంటారు. ఏ పదార్థం ఆరోగ్యానికి మంచిది, ఏయే పోషకాలు వేటి ద్వారా లభిస్తాయి,.. వంటి విషయాలు అర్థమవుతాయి. వృథాను అరికట్టడం, మిగిలిన పదార్థాలను తిరిగి ఎలా ఉపయోగించడం, శుభ్రతను ఎందుకు పాటించాలి.. వంటి విషయాల్లో అవగాహన కలుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి.→ బాధ్యత పెరుగుతుందివంట చేయడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా పని చేయడం నేర్చుకుంటారు. తమ పనిని తామే పూర్తి చేయడం, శుభ్రత పాటించడం వంటి బాధ్యతలు అలవాటు అవుతాయి. అంతేకాదు, వంట పనిలో భాగంగా వస్తువులను శుభ్రపరచడం, సర్దడం వంటి పనులూ నేర్చుకుంటారు. అదే సమయంలో గ్యాస్, ఎలక్ట్రిక్, కటర్స్.. వంటి వాడకంలో రక్షిత చర్యల గురించి అవగాహన కల్పించవచ్చు. ఇంట్లో వీలు కావడం లేదు అనుకునేవారు కుకింగ్ క్యాంప్స్లో చేర్పించవచ్చు. వంటల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. వంట ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమనూ, ఆనందాన్ని, రుచుల ఆస్వాదననూ పరిచయం చేయవచ్చు. ఇది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది కూడా.వంట.. వ్యక్తిత్వ వికాస పాఠంపిల్లలు వంట నేర్చుకోవడం ద్వారా ఒక సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఒక డిష్ను ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుస్తుంది. ప్రతి వంటకం తయారీకి పట్టే సమయం వారిలో ఆలోచనాశక్తిని, సహనాన్ని పెంచుతుంది. జంక్ ఫుడ్ ఎందుకు తీసుకోవద్దో తెలుస్తుంది. వంట అంటే ఆడవాళ్లు మాత్రమే చేసేది కాదని కుటుంబంలో అందరూ చేయవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుస్తుంది. అయితే, వంట పని ఒక భారంగా కాకుండా వినోదాత్మకంగా మార్చగలిగితే పిల్లలు జాయ్ఫుల్గా రుచుల తయారీ పట్ల దృష్టి పెడతారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల చేత వంటను ఫన్గా చేయించవచ్చు. ఎక్కువ మంది పిల్లలతో కలిసి పాల్గొనేలా చేయాలంటే..అందుకు కిడ్స్ కుకింగ్ క్యాంప్స్ పిల్లలకు వినోదంతో పాటు విలువైన నైపుణ్యాలనూ నేర్పిస్తున్నాయి. – మీరా గిరిజ తాడిమేటి, చెఫ్సాక్షి ‘హెల్త్ ప్లస్’ ఈపేపర్లో...పిల్లలకు వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహార పదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే ప్రత్యేక కథనం... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సమ్మర్లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్గా..!
దక్షిణ భారతదేశంలో ఎండాకాలం వేడిని భరించలేం అనుకుంటారు. కానీ, వేసవిలోనూ సౌత్లో కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా, వినసొంపైన పాటలా సాగిపోతుంది. చిక్మగళూరు నుంచి వల్పరై వరకు అటు నుంచి అరకు వరకు.. ఈ ప్రదేశాలు వేడిలో కూడా చల్లని ప్రయాణపు ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తే వేసవి వేడిని ఇట్టే మర్చిపోతాం. చిరుగాలి పంచే చల్లదనం, నేలంతా పరుచుకున్న పచ్చదనం, మధ్య మధ్యలో మేఘాల నడక .. ఇవన్నీ కలిసి ఈ వేసవిని చిల్గా మార్చేస్తాయి.చిక్మగళూరుకర్ణాటకలోని చిక్మగళూరులో ఉదయ వేళలో కాఫీ తోటల మధ్య రోజు మొదలవుతుంది. పొగ మంచు మధ్య నుంచి ప్రకాశించే వెలుగు, స్లోప్స్ మీద పడిన నీడలు ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్గా ఉండే దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి. స్థానిక ముల్లయనగిరి పర్వత రేఖలు చూసినప్పుడు భూమిపై ఒక జెంటిల్ ఎలివేషన్లా అనిపిస్తుంది.తమిళనాడులోని వల్పరైలో రోడ్డుపై నడవడం అనేది టీ ఎస్టేట్స్ మధ్య ఒక ఎండ్లెస్ గ్రీన్ కారిడార్లో నడవడంలా ఉంటుంది. చుట్టూ ఉన్న స్లోప్స్ మీద ప్లాంటేషన్ లైన్స్ ఒక రిథమ్లో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న జలపాతాలు, రోడ్డు పక్కన నడిచే సమయంలో వీచే గాలిం ఒక నిశ్చలమైన దశ్యాన్ని ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రతీ టర్న్లో ఒక వ్యాలీ కనిపిస్తుంది. ప్రతీ వ్యాలీలో ఒక సైలెంట్ స్పేస్ ఉంటుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు ప్రదేశాలకు ప్రయాణం.. చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు బెంగుళూరు వరకు ప్లైట్లో చేరడం, ఇంకొన్ని ప్రదేశాలను చేరుకునేందుకు కోయంబత్తూరు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు ప్రతి టర్న్లో ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది.రోడ్డు పక్కనే చెట్లు, మధ్య మధ్యలో కనిపించే వ్యాలీస్, గాలిలో మారి΄ోయే ఉష్ణోగ్రతలు ఇవన్నీ ప్రయాణాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?ఈ హిల్ స్టేషన్స్లో పెద్ద బిల్డింగ్స్ కన్నా చిన్న హోమ్ స్టేలు, కాటేజీలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ స్టే చేయడం అంటే గాలి మధ్య కాఫీ సువాసనలు పీల్చుతూ , ప్రకృతి పలికించే స్వరాలను వింటూ సమయం గడపడం లాంటిదే.ఇక్కడ ప్రతి మూమెంట్ మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం అయితే స్లోప్స్పై వెలుగు తగ్గుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.అరకు లోయ అరకు లోయలో ప్రయాణం అంటే కాఫీ తోటల మధ్య నడిచే కథల మధ్య వెళ్లడంలా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లినప్పుడు టన్నెల్స్ నుంచి బయటికి వచ్చిన ప్రతీసారి కొత్త దృశ్యం కనిపిస్తుంది. వ్యాలీ మధ్య గ్రామాలు, పక్కన హిల్స్, మధ్య నడిచే గాలి ఇవన్నీ కలిసి ఒక మధురమైన అనుభూతిని అందిస్తాయి. కాఫీ అరోమా గాలిలో కలిసినప్పుడు ప్రతి మూమెంట్ ఇంకా గుర్తుగా నిలిచిపోతుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో పొగ మంచు మధ్య నడవడం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.గాలిలో మాయిశ్చర్ టచ్, చెట్ల మధ్య నడిచే వెలుగు ఇవన్నీ కలిసి ఒక నిశ్చలమైన దృశ్యాన్ని క్రియేట్ చేస్తాయి.మధ్యాహ్నంలో టీ ఎస్టేట్స్ మధ్య తిరగడం, ఫారెస్ట్ ఎడ్జెస్లో కూర్చుని గాలిని ఎంజాయ్ చేయడం ఈ చిన్న మూమెంట్స్ ప్రయాణంలో గుర్తుగా నిలిచిపోతాయి.సాయంత్రం అయితే సన్సెట్ చూడటం, ఆకాశం రంగులు మారడం చూస్తూ సమయం గడపడం ఒక సైలెంట్ ఎక్స్పీరియెన్స్లా ఉంటుంది.ఏం తినాలి?ఈ ప్రదేశాలలో భోజనం కడుపుతోపాటు మనసును సంతోషపెట్టేలా ఉంటుంది. లోకల్ కర్రీస్, కొబ్బరితో చేసిన వంటలు, తాజా మసాలాలతో చేసిన వంటకాలుఇవన్నీ కలిసి భోజనాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.కాఫీ ప్లాంటేషన్ దగ్గర దొరికే ఫ్రెష్ కాఫీని సిప్ చేస్తే ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. చల్లని వాతావరణంలో హాట్ ఫుడ్ తినడం ఒక సౌఖ్యమైన ఫీలింగ్ను ఇస్తుంది.యాక్టివిటీస్మార్నింగ్ సమయంలో సూర్యోదయం చూడటం, పొగమంచులో నడవడం, అడవుల నుంచి వచ్చే శబ్దాలను వినడం, సైట్ సీయింగ్, స్థానికులతో మాట్లాడటం, లోకల్ మార్కెట్లో తిరగడం, హిల్ స్లోప్స్లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ ఈ ప్రదేశాలలో చేయాల్సిన యాక్టివిటీస్లో కొన్ని మాత్రమే. ఎం. జి.కిశోర్, ప్రయాణికుడు.. (చదవండి: ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!) -
కమల్ హాసన్ సౌందర్య చిట్కా..! ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి..
నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్ తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గాయనిగా, నటిగా నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. శృతి ఎప్పటికప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన టిప్స్ షేర్ చేస్తూ..ఆరోగ్యంపై స్ప్రుహను కలిగిస్తుంటారామె. అలానే ఈసారి తన జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో షేర్ చేస్తూ..ఆ విషయంలో తన తండ్రి ఇచ్చిన సౌందర్య చిట్కా గురించి మాట్లాడింది. ఆ చిట్కా చాలా బాగా పనిచేస్తుందని, దాన్ని గట్టిగా నమ్ముతానంటూ ఆ బ్యూటి టిప్ గురించి వివరించింది. ఇంతకీ ఏంటా సౌందర్య చిట్కా అంటే..కూలీ నటి శృతి తాను ఆయిల్ని ఎంతో ఇష్టపడతానని, దీన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుంటానని అన్నారామె. ఇదేమి రెసిపీ లాంటిది కాకపోయినా..ఎంతో ఇష్టమని అంటోంది. నువ్వులు, కొబ్బరి నూనెతో కలగలసిన నూనె అంటే మహా ఇష్టమని, ఇది చర్మానికి, జుట్టుకి బాగా పనిచేస్తుందని తన నాన్నే(కమల హాసన్) స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చింది. నిపుణులు ఏమంటున్నారంటే..జుట్టు ఆరోగ్యానికి నువ్వులు వల్ల కలిగే అనేక ప్రయోజనాల కారణంగా సాంప్రదాయంగానూ, ఆధునికంగా కేశ సంరక్షణకు ది బెస్ట్ అని అన్నారు. దీనిలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని తెలిపారు. తలకు తీవ్రంగా తేమను అందించి జుట్టు కుదుళ్లను బలపరిచి, పెరుగుదలను ప్రేరేపిస్తుందని అన్నారు. దీనిలో సహజంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని, వివిధ చర్మ సమస్యలను అరికట్టి..జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని డల్గా కానివ్వకుండా నిరోధిస్తాయని అన్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్లు తలకు రక్తప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యానికి, విశ్రాంతికి సహాయపడతాయని చెప్పారు. అంతేగాదు ఆయుర్వేదం ప్రకారం..అన్ని నూనెల్లోకెల్లా నువ్వులు నూనె అత్యంత శ్రేష్టమైనదని అన్నారు. ఈ నువ్వుల నూనెని సౌందర్యం, ఔషధ ఉత్పత్తులలో వినియోగిస్తారని చెబుతున్నారు. సాంప్రదాయకంగా, నువ్వుల నూనె నాడీ వ్యవస్థపై వెచ్చదనాన్ని, ప్రశాంతతను కలిగించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేరుగాంచింది. అంతేగాదు ఆయుర్వేదం నువ్వుల నూనెను నూనెలకే రాజుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాధికారకాలను నిర్మూలించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శక్తిని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..
ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్ సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.ప్రభావం ఎలా ఉంటుందంటే..ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుందిబలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయితక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందిశరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుందిఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.నివారణ..ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: రెండేళ్లుగా వ్యాన్లోనే బందీ..! పాపం చివరికి..) -
స్లాబ్లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఇల్లు కొలిమిలా అనిపించడం మనకు చిరపరిచితమే. ఫ్యాన్లు పూర్తి వేగంతో తిరుగుతున్నా గాలి సరిపోనట్టుగా ఉక్కపోతగా అనిపిస్తుంది. దానికి కారణం... ఇంటి పైకప్పు నుంచి వెలువడే వేడి , ఇంటి పైకప్పు రోజంతా వేడిని పీల్చుకుని, దానిని నెమ్మదిగా మన నివాస స్థలంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అదే మనకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. తత్ఫలితంగా పుట్టే భరించలేని ఉక్కపోత నుంచి ఎయిర్ కండిషనర్లు ఉపశమనం కలిగిస్తాయి, కానీ అవి జేబుకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా చిల్లులు పెడతాయి. ఏటా అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్న పరిస్థితుల్లో.. విద్యుత్ పై ఎక్కువ ఆధారపడకుండానే మన ఇల్లు చల్లగా మార్చగలిగితే ఎంత బాగుంటుందో కదా... ఊహకే ఆనందాన్ని ఇచ్చే ఈ భావన వాస్తవంలో సాధ్యమేనా? అంటే ఒక సులభమైన, కాలపరీక్షకు నిలిచిన శీతలీకరణ చిట్కా ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలు సాగించేవారు చెబుతున్నారు.వంటికి... ఇంటికీ కూడా... ఫిల్లర్ స్లాబ్ఈ సమస్యకు సమాధానం సాదాసీదా మట్టి కుండల రూపంలోనే ఉంది. వంటిని చల్లబరిచే చల్లని నీటి కోసం ఫ్రిజ్ కు బదులు మట్టి కుండను ఎలా నమ్ముతున్నామో అలాగే ఇంటి చల్లదనానికి కూడా అవే ఉపకరిస్తాయి అని అంటోంది ఫిల్లర్ స్లాబ్ అనే నిర్మాణ శైలి. ఫిల్లర్ స్లాబ్ అనే పేరున్న ఈ పురాతన నిర్మాణ పద్ధతి ఓ సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ పద్ధతిలో, కాంక్రీటు పోయడానికి ముందు మట్టి కుండలను పైకప్పు లోపల తలక్రిందులుగా ఉంచుతారు. నిర్మాణం గట్టిపడిన తర్వాత, ఈ కుండలు స్లాబ్ లోపల చిన్న గాలి గదులను సృష్టిస్తాయి. ఈ గదులు సహజమైన ఇన్సులేషన్గా పనిచేస్తాయి, పైకప్పు నుంచి ఇంటిలోకి వేడి బదిలీని నెమ్మదింపజేస్తాయి. తక్కువ కాంక్రీటు వాడకంతో, పైకప్పు మొదటి నుంచే తక్కువ వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది దాని స్వభావ రీత్యా, వేడి చొచ్చుకుపోవడాన్ని మట్టి, నిరోధిస్తుంది. ఫలితం? ఎలాంటి యాంత్రిక జోక్యం లేకుండానే, ఇళ్లు చెప్పుకోదగిన రీతిలో చల్లగా ఉంటాయి, కొన్నిసార్లు ఇతర సాధారణ నిర్మాణ శైలి ఇళ్లతో పోలిస్తే 50 శాతం ఎక్కువ కూడా చల్లగా ఉంటాయి. అంతేకాకుండా మట్టి కుండలు అందుబాటు ధర్లోనే లభిస్తాయి. ఇవి పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇందులో ఎలాంటి సంక్లిష్టమైన సాంకేతికత లేదు ఇది కేవలం సాంప్రదాయ జ్ఞానంలో పాతుకుపోయిన ఆలోచనాత్మకమైన రూపకల్పన మాత్రమే. దీనివల్ల కలిగే ప్రయోజనాలు సౌకర్యానికి మించి ఉంటాయి. ఇళ్లలో వేడి తగ్గడం అంటే ఎయిర్ కండిషనర్లపై ఆధారపడటం తగ్గడం, దీనివల్ల విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా, ఇది నివాస గృహాలకు మాత్రమే కాక భూగ్రహానికి కూడా గణనీయమైన రీతిలో మంచి మార్పును తీసుకురాగలదు. ఆసక్తికరంగా, వేసవిలో ఇళ్లను చల్లగా ఉంచే అవే గాలి బుడగలు శీతాకాలంలో వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి కూడా సహాయపడతాయి, తద్వారా నివాసాలు ఏడాది పొడవునా మరింత సౌకర్యవంతంగా మారతాయి. ఆధునిక నిర్మాణం తరచుగా వాతావరణానికి అనుగుణమైన రూపకల్పనను విస్మరిస్తుంది. మరోవైపు ఎయిర్ కండిషనర్ల వాడకం సర్వసాధారణం కాకముందే, దేశవ్యాప్తంగా సాంప్రదాయ వాస్తుశిల్పం అప్పటికే తెలివైన, సుస్థిరమైన మార్గాలలో పర్యావరణానికి అనుగుణంగా మారుతోంది.ఆధునిక సమస్యలకు పరిష్కారాలు ఎల్లప్పుడూ కొత్తవిగానే ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఫిల్లర్ స్లాబ్ వంటి పద్ధతుల పునరుజ్జీవనం మనకు గుర్తు చేస్తుంది. నగరాలు వేడెక్కుతూ, ఇంధన అవసరాలు పెరుగుతున్న కొద్దీ, మనం నిర్మించే విధానంలో చేసే చిన్న మార్పులు, మనం జీవించే విధానంలో పెద్ద మార్పులకు దారితీయగలవు. ఒక మట్టి కుండ వంటి అత్యంత సాధారణ చవకైన వస్తువు చల్లదనాన్ని సౌకర్యాన్ని అందిస్తూనే పర్యావరణ నష్టాన్ని కూడా నివారించే శక్తి కలిగి ఉంది అని మనం గుర్తిస్తే...మన నివాసాలు బాగుంటాయి..భవిష్యత్తు భధ్రంగా ఉంటుంది.(చదవండి: స్నేహితుడి కోసం ఏకంగా రూ. 37 లక్షల లగ్జరీ కారులో..!) -
అత్యంత విశిష్టత కలిగిన ప్రాంతం..కానీ అక్కడకు వెళ్లాలంటే..!
పిల్లలూ! మన దేశంలో కేవలం చారిత్రక, పర్యాటక ప్రదేశాలే కాదు. విశిష్టత కలిగిన అనేక ప్రాంతాలున్నాయి. అందులో ఒకటి ‘నాథూ లా’. ఇది హిమాలయాలలోని డోంగ్క్యా శ్రేణిలో, టిబెట్లోని చైనా యాడాంగ్ కౌంటీకి, భారత రాష్ట్రమైన సిక్కింకు మధ్య ఉన్న ఒక పర్వత మార్గం. 4,310 మీటర్లు అంటే సుమారు 14,140 అడుగులు ఎత్తులో ఈ మార్గం ఉంది. 1950లలో సిక్కిం రాజ్యంలో జరిగే వాణిజ్యం కోసం ఈ మార్గాన్ని వినియోగించేవారు. 1962 నాటి చైనా–భారత యుద్ధం తర్వాత చైనా, భారతదేశాలు దౌత్యపరంగా ఈ మార్గాన్ని మూసివేశాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. తర్వాతి కొన్ని దశాబ్దాల్లో రెండు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో 2006లో నాథూ లాను తిరిగి తెరిచారు. దీంతో కైలాస పర్వతం, మానస సరోవర యాత్రకు ఒక ప్రత్యామ్నాయ మార్గం లభించింది. అయితే భారీ మంచు కురవడం వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా సరిహద్దు వాణిజ్యం సంవత్సరానికి 7 నుండి 8 నెలల పాటు మాత్రమే సాధ్యమవుతుంది. నాథూ లా భారత్–చైనా దేశాల సైన్యాల మధ్య ఉన్న ఐదు సరిహద్దు సిబ్బంది సమావేశ కేంద్రాలలో ఒకటి.భారత్–చైనా మధ్య ఉత్తరాల బట్వాడా కూడా ఈ మార్గంలో సాగుతుంది. గురువారాలు, ఆదివారాలలో ఉదయం 8:30 గంటలకు కేవలం 3 నిమిషాల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది. నాథూ లాలోని షెరాతాంగ్ సరిహద్దు పోస్ట్ వద్ద ఆయా దేశాల తపాలా సిబ్బంది ఉత్తరాలను తీసుకుంటారు. ఈమెయిల్, ఇంటర్నెట్ రావడంతో ప్రస్తుతం ఉత్తరాలు రాసేవారి సంఖ్య తగ్గినా, మన దేశంలోని టిబెటన్ శరణార్థులు లేదా సరిహద్దుకు ఇరువైపులా బంధువులు ఉన్న స్థానికులు ఇంకా ఈ సేవల్ని వాడుతున్నారు. కొన్నిసార్లు ఏ ఉత్తరాలూ లేకపోయినా తపాలా సిబ్బంది ఖాళీ సంచులు అటూఇటూ మార్చుకుంటారు. ఈ ప్రదేశాన్ని చూడాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఒక రోజు ముందుగా అనుమతులు పొందిన తర్వాత, భారత పౌరులు మాత్రమే గురువారం నుంచి ఆదివారం వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించగలరు. -
'ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!
పొద్దున్నే స్కూల్కి లేదా ఉద్యోగాలకో, ఫంక్షన్లకో వెళ్ళేముందు ముఖానికి పౌడర్ రాసుకుంటారా? ఇలా రాసుకోవడం ఎలా మొదలైంది? అసలు ఫేస్ పౌడర్ కథేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పౌడర్ ప్రాచీన ఈజిప్ట్ నుండి వచ్చింది. పురావస్తు అవశేషాలు, రసాయన విశ్లేషణల ప్రకారం క్రీ.పూ.2000–1200 మధ్య కాలంలో అప్పటి ప్రజలు ముఖానికి పౌడర్ రాసుకున్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ప్రాచీన ఈజిప్షియన్ల సమాధుల్లో దొరికిన సౌందర్య సాధనాల్లో పౌడర్ కూడా ఉండటం విశేషం. ఆ రోజుల్లో పురుషులు, మహిళలు తమ చెంపల కోసం ఎర్ర గైరిక్ నుండి తయారు చేసిన పౌడర్ బ్లష్ను ఉపయోగించేవారు. ముఖానికి వేసుకునే పౌడర్కు ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆ రోజుల్లో భావించేవారు. ఆధునిక కాలంలో మేకప్ను స్థిరపరచడానికి, చర్మాన్ని మెరిచేలా చేయడానికి పౌడర్ను ఉపయోగిస్తారు. 1980లు మరియు 90లలో పౌడర్ చివరకు మేకప్ను సెట్ చేయడానికి ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది. ఈ రోజుల్లో చాలామంది పౌడర్ కచ్చితంగా వాడుతున్నారు. ఫేస్ పౌడర్లు రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది. ఒకటి లూజ్ పౌడర్. ఇది జిడ్డు చర్మంలోని అదనపు తేమను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మరొకటి ప్రెస్డ్ పౌడర్. ఇది మచ్చలను కప్పిపుచ్చడానికి పనికొస్తుంది. (చదవండి: అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?) -
అసలు పరీక్షలెవరు కనిపెట్టారో తెలుసా..!?
ఇది పరీక్షల కాలం. పిల్లలతోపాటు పెద్దలూ హడావిడి పడుతుంటారు. అసలీ పరీక్షలు ఎవరు కనిపెట్టారంటూ కొందరు పిల్లలు విసుక్కుంటుంటారు. లిఖిత పూర్వక పరీక్షలు కనిపెట్టిన దేశం ఏదో తెలుసా? చైనా. అవును! ప్రామాణికతో కూడిన లిఖిత పరీక్షలను మొదట చైనాలో అమలు చేశారు. వీటిని ‘కేజు’ అని పిలిచేవారు. సుయి రాజవంశం క్రీ.శ. 605లో ఉద్భవించింది. దాని వారసురాలైన టాంగ్ రాజవంశం, వు జెటియాన్ పాలనలో పరీక్షా విధానం మొదలైంది. సాంగ్ రాజవంశం కాలంలో కేవలం గొప్ప ఇళ్ల వాళ్లే కీలక అధికారుల స్థానాలు తీసుకోకుండా సామాన్యులు కూడా అధికారులు అయ్యేందుకు వీలుగా పరీక్షలు నిర్వహించేవారు. కన్ఫ్యూషియస్ క్లాసిక్స్ను సిలబస్గా చదువుకుని పరీక్షలకు కూచునేవారు. అలా పాసైన వారికి ఉద్యోగాలు దక్కేవి. 13వ శతాబ్దంలో మంగోల్ యువాన్ రాజవంశం ప్రారంభంలో ఈ పరీక్షలకు ఒక చిన్న అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత మంగోలులకు అనుకూలంగా, దక్షిణ చైనీయులకు ప్రతికూలంగా ఉండే ప్రాతీయ కోటాలతో వీటిని తిరిగి ప్రవేశపెట్టారు. కాలక్రమంలో ఆధునిక పరీక్షలు చైనాతో పాటు అన్నీ దేశాలలోకి వచ్చాయి. -
మంచి రక్తప్రసరణ కోసం..!
మంచి రక్త ప్రసరణకు, మానిసిక ప్రశాంతతకు యోగాలో చాలామంచి ఆసనాలు ఉన్నాయి. అవి క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగానూ బలోపేతం అవుతారని చెబుతున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!మరీచాసనం..చేయు విధానం.. మ్యాట్పై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచి దండాసనంలో ఉండాలి. ఎడమ కాలిని మడిచి, ఎడమపాదాన్ని కుడితొడపై ఉంచాలి. ∙ఎడమ మోకాలిని ఎడమచేతితో చుట్టి పట్టుకుని, రెండు చేతులను వెనుకకు తీసుకెళ్లి లాక్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా ఉంచాలి. శ్వాస వదులుతూ మెల్లగా కుడి వైపుకు తిరగాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. తర్వాత మామూలు స్థితికి వచ్చి, మరోవైపు చేయాలి.ఉపయోగాలు.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెన్నెముక, నడుము బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.జాగ్రత్తలు.. 1. వెన్ను నొప్పి లేదా డిస్క్ సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు. 2. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ ఒత్తిడి పరార్నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది. ద్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో దానికి పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. కనుక ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలన్నది నిపుణుల సూచన.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
అందం పందెంలో పసిపిల్లలు
చిన్నారులు సైతం అందంపై మక్కువ పెంచుకుంటున్నారు. స్కిన్ కేర్ రొటీన్లలో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆకర్షణీయమైన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావంతో చిన్నారులు కూడా తమ స్కూల్ బ్యాగ్లలో ఖరీదైన కాస్మెటిక్స్ని క్యారీ చేస్తున్నారు. వీరినే నిపుణులు ‘సెఫోరా కిడ్స్’గా పిలుస్తున్నారు.స్కిన్ కేర్ అవసరమా?కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లల బాల్యాన్ని పణంగా పెడుతున్నాయంటూ వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెన్ ఆల్ఫా అంటే 2010–2020 మధ్య జన్మించిన పిల్లలు ఖరీదైన మాయిశ్చరైజర్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించే సీరమ్లను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ట్రెండ్ని అవకాశంగా మలచుకుంటోంది కాస్మెటిక్స్ రంగం. అసలు ఈ బేబీ–ఫేస్ బ్యూటీ ధోరణి గత ఏడాది ఒక కంపెనీ పసిబిడ్డల కోసం ప్రత్యేకంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను తీసుకురావడంతో మొదలైంది. మూడేళ్ల పిల్లల నుంచి వాడవచ్చునంటూ పలు రకాల ఫేస్ మాస్క్లను తను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ బ్యూటీ ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులకు స్కిన్ కేర్ అవసరమా అంటూ ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా!కంపెనీలు ఇప్పుడు పసిపిల్లల కోసం కూడా మేకప్, స్కిన్ కేర్ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. పెద్ద రిటైల్ స్టోర్లు తమ దుకాణాల మధ్యలో పిల్లలను ఆకర్షించేలా అందమైన బొమ్మలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను పెడుతున్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్కి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నాయి. స్కిన్ ఫ్లుయెన్సర్లు అని పిలిచే చిన్నపిల్లలు ఈ ఉత్పత్తులను ఎలా వాడాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం దీనికి కారణమైంది. పిల్లలు ఒకసారి శోధించగానే అధునాతన ఆల్గారిథమ్లు వారికి మరిన్ని బ్యూటీ టిప్స్, ఇన్ ఫ్లుయెన్సర్ల వీడియోలను చూపిస్తున్నాయి. ఈ వీడియోలు పిల్లలను ఆ అలవాట్లను అనుకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. గణాంకాల ప్రకారం, పిల్లల స్కిన్ కేర్ మార్కెట్ 2028 నాటికి రూ. 380 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కాస్మెటి కోరెక్సియాసౌందర్య ఉత్పత్తులు పిల్లలకు అందం అంటే ఏమిటో తెలియకముందే, రూపానికి ఏదో మెరుగుదల అవసరమనే సందేశాన్ని తెలియకుండానే పంపిస్తాయి. డిజిటల్ ప్రపంచంలో పదేళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఇతర పిల్లలను చూసి ప్రభావితమవుతున్నారు. దీనివల్ల కాస్మెటికోరెక్సియా అనే కొత్త మానసిక సమస్య పుట్టుకొచ్చింది. అంటే సౌందర్య ఉత్పత్తులు, చర్మ సంరక్షణ పట్ల అతిగా, పిచ్చిగా ఆసక్తి చూపడం. ఇలాంటి పద్ధతులకు చిన్నప్పుడే అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఒత్తిడి, పోలికలు పెరుగుతాయి. ఈ ధోరణి వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ, వర్చువల్ ప్రపంచంలో బందీలుగా మారుతున్నారు. గుడ్డిగా నమ్మొద్దుపసిబిడ్డలకు ΄ పౌష్టికాహారం, నిద్ర, ఆటలే ఉత్తమ స్కిన్ కేర్ అని సూచిస్తున్నారు స్కిన్కేర్ నిపుణులు. స్కిన్ కేర్ ట్రెండ్లను గుడ్డిగా అనుసరించకూడదంటున్నారు. సౌందర్య సాధనాల పరంగా పసిబిడ్డలకు స్కిన్ కేర్ అవసరం లేదంటున్నారు. ఫేస్ మాస్క్లు, స్క్రబ్లు, షీట్ మాస్క్ల వంటి బ్యూటీ ఉత్పత్తులను పరిచయం చేయడం వారి వయస్సుకి తగినది కాదని చెబుతున్నారు. అనవసరమైన ఉత్పత్తులు వాడటం వల్ల చికాకు, అలర్జీలు, దద్దుర్లు లేదా దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చనంటున్నారు. రంగురంగుల ΄్యాకేజింగ్, సోషల్ మీడియా ఆల్గారిథమ్ల వెనుక, పిల్లలు కోలుకోలేని శారీరక చర్మసమస్యలు, కాస్మెటికోరెక్సియా వంటి తీవ్రమైన మానసిక ఆందోళనలు దాగి ఉన్నాయి. అందుకే అత్యంత హానికరమైన మార్కెటింగ్ వ్యూహంలో చిక్కుకోకుండా పిల్లలను కాపాడుకోవాలి. అందంపై ఉండే సామాజిక దృక్పథాన్ని మార్చాలి. కాస్మెటిక్స్కి దూరంగా ఉంచాలి.పిల్లలకు కాస్మొటిక్స్ వాడకూడదు...చాలామంది తల్లుల్లో ఒక ఆలోచన ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నారు. తర్వాత కలర్ తగ్గిందేమిటి అనుకుంటారు. దీంతో స్కిన్ కేర్ కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చుండ్రు వస్తుందని, స్మెల్ బాగుంటుందని హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మేకప్ కోసం ఇతర ప్రొడక్ట్స్ వాడే వారుంటారు. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సౌందర్య ఉత్పాదనలను ఉపయోగించకూడదు. రంగు తక్కువ ఉన్నారనో, ఇంకా బాగా కనిపిస్తారనో ఆలోచనతో వివిధ రకాల సబ్బులు, కాస్మొటిక్స్ ఉపయోగిస్తే వారి లేత చర్మంపైన దద్దుర్లు రావడం, ఇరిటేషన్ కలగడం.. వంటివి సంభవించవచ్చు. ఆరుబయట బాగా ఆడే పిల్లలకు మినరల్ బేస్డ్ సన్స్క్రీన్ మాత్రమే ఉపయోగించాలి.డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్– జంబుల రమాదేవి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి -
75 హార్డ్ ఛాలెంజ్: బోహో గర్ల్ కృతిక వెయిట్ లాస్ జర్నీ
కృతికా ఖురానా "దట్ బోహో గర్ల్" (@thatbohogirl) గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ , లైఫ్స్టైల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రెండున్నర నెలల్లో 5 కిలోల బరువును తగ్గించుకుంది. 75 హార్డ్ ఛాలెంజ్ ద్వారా బరువు తగ్గి, తన ఫిట్నెస్ ప్రయాణాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో ఆమె వెయిట్లాస్ జర్నీ వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన కృతికా తన విభిన్నమైన బోహో-చీక్ స్టైల్, ఫ్యాషన్ అండ్ పర్సనల్ వ్లాగ్స్తో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా తాను '75 హార్డ్' ఛాలెంజ్ను అనుసరించి కేవలం 75 రోజుల్లోనే దాదాపు 5 కిలోల బరువు ఎలా తగ్గిందో ఆమె వెల్లడించింది.కృతిక ఖురానా తాను దాదాపు 66 కిలోల నుండి 61 కిలోలకు తగ్గినట్లు చెప్పింది. ఈ సంఖ్య చిన్నదిగా అనిపించినప్పటికీ, ఆమె కేవలం బరువుపై కాకుండా, నిలకడ క్రమశిక్షణపైనే స్పష్టంగా ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపింది. శారీరక మార్పుతో పాటు, మానసికంగా కూడా తనలో చాలా మార్పు వచ్చిందని, టోటల్గా తను క్రమశిక్షణతో బలంగా మారానని వెల్లడించింది. తగినంత నీరు త్రాగడం, ప్రతిరోజూ చదవడం, రోజుకు 10వేల అడుగులు నడవడం వంటి కొన్ని అలవాట్లు శాశ్వతంగా ఉంటాయని కూడా ఆమె పంచుకుంది. View this post on Instagram A post shared by Kritika Khurana (@thatbohogirl)కృతిక పాటించిన నియమాలు45 నిమిషాల వ్యాయామందాదాపు 3.7 లీటర్లు) నీరుఅనవసరమైన ఆహార నియమాలు, చీట్ మీల్స్ లేకుండాఅస్సలు మద్యం సేవించకపోవడంఒక పుస్తకంలోని 10 పేజీలు చదవడంప్రతిరోజూ తన పురోగతిని ఫోటో తీసుకోవడం'75 హార్డ్' అంటే ఏమిటి : ఇది మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారించే ఒక క్రమశిక్షణ ఆధారిత ఛాలెంజ్. ఇందులో వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం, స్వీయ-అభివృద్ధి వంటి రోజువారీ తప్పనిసరి నియమాలు ఉంటాయి.ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?నోట్ : కఠినమైన ఆహార నియమాలు, జిమ్లో ఎక్కువ కసరత్తులు లాంటివి గందరగోళ సలహాలు చాలా వింటాం. కానీ వాస్తవానికి బరువు తగ్గడం అనేది నిలకడతో, నిబద్ధతతో చేయాల్సిన పని. తక్షణ పరిష్కారాలు ఆకర్షణీయంగా కనిపించి నప్పటికీ, సాధారణ వ్యాయామాలు క్రమశిక్షణ, చిన్న చిన్న పనులను ప్రతిరోజూ పునరావృతం చేసినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. ఇదీ చదవండి: బెంజ్ కారు, నడిరోడ్డులో తలస్నానం, తిట్టిపోస్తున్న నెటిజన్లు -
ఏ యుద్ధమైనా బలయ్యేది వాళ్లే..!
వారు ఎంచుకున్నది కాదు.. కోరుకున్నది అంతకన్నా కాదు... కానీ భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పట్లేదు. ఇరాన్లోని ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్గత అశాంతి కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పిల్లలు, మహిళలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది...యుద్ధం ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు 340 మంది పిల్లలు యుద్ధ దాడుల్లో మరణించగా, 1,767 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయీబే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. మినాబ్ నగరంలో కాకుండా, ఇతర ఐదు వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలపై జరిగిన దాడుల్లో మరో 12 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 7 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నపిల్లలే.మధ్యప్రాచ్య వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది గర్భిణీ స్త్రీలు యుద్ధ నీడలో ఉన్నారు. సరైన వైద్యం లేక రోడ్లపై, కార్లలో, కిక్కిరిసిన శిబిరాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.చమురు ధరల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్లు, పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాలో 6 నెలల వరకు ఆలస్యం కావచ్చని యూనిసెఫ్ అంచనా వేస్తోంది.బాంబు దాడులు, తరలింపు ఆదేశాల వల్ల మొత్తం 12 లక్షల మంది పిల్లలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.ఏ యుద్ధమైనా సరే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. అది ఒక దేశపు సామాజిక పునాదులను, ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అభద్రతా భావం మహిళల జీవితాల్ని ప్రభావితం చేస్తే, యుద్ధం నేర్పిన భయం, ఆకలి, కోల్పోయిన బాల్యం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అది కోట్లాది మంది అమాయకుల కన్నీటి గాథ. (చదవండి: అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..! అలా గాలిలోనే..) -
'సమోసా' ఎక్కడి వంటకమో తెలుసా..?!
"సమోసా" అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ చిరుతిండి బయటకు కరకరలాడుతూ..లోపల కారంగా స్పైసీగా ఉంటుంది. వీధి ధుకాణాలలో ప్రధాన స్నాక్స్ ఐటెం ఇది. వేడి వేడి టీ తోపాటు ఒక్క సమోసా తింటే అబ్బా ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ప్రజాదరణ కలిగిన ఈ వంటకం మన భారతదేశానికి చెందిన వంటకం కాదట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.ఈ సమోస మూలాలకు సంబంధించిన కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సమోసా స్టోరీ గురించి చరిత్ర, పురావస్తు శాస్త్రలలో పీహెచ్డీ చేసిన పరిశోధకుడు, రచయితగా చెప్పుకునే డాక్టర్ ఎంఎఫ్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆయన తన పోస్ట్లో సమోసా మెదట ఎలా ఉండేది, మన పాకనిపుణులను దాని తయారీని ఎలా మార్చారు వంటి వాటి గురించి సవివరంగా రాసుకొచ్చారు. 1500..1510ల మధ్య రాసిన పర్షియన్ తాళప్రత్రం గ్రంథలో దీని గురించి సవివరంగా రాసి ఉందని చెబుతున్నాడు. ఈ గ్రంథం ఆధారంగా అత్యధికంగా తినే వీధి ఆహారమైన సమోసా 500 ఏళ్ల నాటి వంటకంగా పేర్కొన్నాడు. బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో పర్షియన్ భాషలో ఈ సమోసా వంటకం గురించి రాసి ఉందని తెలిపాడు. ఈ చిరుతిండి అప్పట్లో చాలా భిన్నమైన రూపాన్ని కలిగి ఉండేదని చెప్పాడు. నాటి పూర్వీకులు ఈ వంటకాన్ని కాల్చిన వంకాయ గుజ్జు, ఎండు అల్లం, గొర్రె మాంసం, వంటివి నూనెల వేయించి..దాన్ని లోపలి స్టఫ్గా పెట్టి వండేవారని పేర్కొన్నాడు. కానీ మనం ప్రస్తుతం చూసే సమోసాలు అందుకు చాలా విభిన్నం. ఇప్పుడు వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కూర వంటివి స్టఫ్గా పెట్టి వండేస్తున్నాం. పైగా జతగా వేయించిన పచ్చిమిర్చి ఇస్తుంటాం. నిజానికి అప్పుడు ఇలా ఈ రెండూ ఉండేవి కావని అన్నారు. ఆ తాళ్లపత్రాల ఆధారంగా మొఘల్ చక్రవర్తి అక్బర్, టిప్పు సుల్తాన్ చేతుల మీదుగా ప్రయాణించి..మన దేశంలోకి వచ్చిందని చెప్పారు. వీధి చిరుతిండిగా దొరకక ముందు నాటి సమోసా ఇది.. అని అన్నారు. అంటే ఇది రాజరికపు వంటకంగా మొదలై వీధి దుకాణపు ఫేమస్ స్నాక్స్ ఐటెంగా మారిందని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్ని చూసి..అంటే ఈ సమోసా మన దేశంలోకి వలస వచ్చిందన్న మాట అని హాస్యస్పదంగా పోస్టులు పెట్టారు.మితంగానే మంచిది..ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం.. సమోసాలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉంటాయనేది వాస్తవం. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే..ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుThe samosa is one of the most eaten street foods on the planet. This is a 500-year-old recipe for it, written in Persian in a manuscript sitting in the British Museum.The manuscript is called the Ni'matnama, the Book of Delights, written between 1501-1510 AD, for the Sultan of… pic.twitter.com/uEjIe77zQl— Dr. M.F. Khan (@Dr_TheHistories) April 8, 2026 (చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..) -
చిన్నారి కిడ్నీలో పెద్ద రాయి.. శస్త్రచికిత్స లేకుండానే..
సాధారణంగా పెద్దవారిలో కనిపించే కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు పసిపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని బీదర్కు చెందిన ఏడాది వయసున్న బాలుడికి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి కోత లేకుండా కిడ్నీలోని 10 మిమీ రాయిని తొలగించి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు.బీదర్కు చెందిన ఒక ఏడాది బాలుడు విపరీతమైన ఏడుపు, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో బాలుడి ఎడమ కిడ్నీలో 10 మిమీ పరిమాణం ఉన్న రాయి ఉన్నట్లు తేలింది. తదుపరి చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్లోని ఏఐఎన్యూ ఆసుపత్రికి తీసుకువచ్చారు.అధునాతన చికిత్స - 'ఈఎస్డబ్ల్యూఎల్' (ESWL):బాలుడు చాలా చిన్నవాడు కావడం, సాధారణ సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక ఎక్స్ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ESWL) పద్ధతిని ఎంచుకుంది.కోత లేని వైద్యం: ఈ పద్ధతిలో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం 'లిథోట్రిప్టర్' యంత్రాన్ని ఉపయోగించి హై-ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా రాయిని ఇసుక రేణువులంత చిన్న ముక్కలుగా పొడి చేశారు.సురక్షితం: అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించడం వల్ల బాలుడికి రేడియేషన్ ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారు.వేగవంతంగా కోలుకోవడం: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే బాలుడు మామూలు స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించాడు. అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ.. "పిల్లల విషయంలో సర్జరీ వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత. ఈ ఆధునిక పద్ధతి వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా, అత్యంత సురక్షితంగా రాయిని తొలగించగలిగాము," అని తెలిపారు.ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి. మాట్లాడుతూ.. "ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నారుల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీర నిర్మాణానికి ఇబ్బంది కలిగించవచ్చు. అటువంటి సమయాల్లో ఈఎస్డబ్ల్యూఎల్ అత్యంత ప్రభావవంతమైన మార్గం," అని పేర్కొన్నారు. కాగా, నెల రోజుల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడి కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయిందని, అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించారు. డాక్టర్ మల్లికార్జున సి, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్దేశ్పాండ్య హేమేష్, ESWL టెక్నీషియన్ (చదవండి: ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?) -
ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్ న్యూరాన్ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్ ఐర్లాండ్ హాస్పిస్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.సింపుల్గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలుMND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. మాటలు తడబడటంకాళ్ళలో బలహీనతకండరాలు అదరడంబరువు తగ్గడంపట్టు బలహీనపడటంఅసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందినిద్రకు భంగం కలగడంఊపిరి ఆడకపోవడంగందరగోళంపదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంఉదయం పూట తలనొప్పిఅలసటవాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.(చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..) -
నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..
ఆరోగ్యకరమైన, కాతివంతమైన చర్మం కావాలంటే సరైన కేర్ అవనరం. అందుకు సులభమైన మార్గం మనం ఇంట్లోనే సహజంగా ఫేస్ ప్యాక్ను తయారు చేసుకోవడం. తద్వారా ఎలాంటి దుష్ప్రభావలు లేని మంచి కాంతివంతమైన, మెరిసే చర్మాన్ని ఈజీగా పొందొచ్చు. అదెలాగో నటి ప్రియాంక చోప్రా తల్లి, డాక్టర్ మధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ సౌందర్య చిట్కా ఏంటో చూసేద్దామా..!ప్రియాంక తల్లి డాక్టర్ మధు మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు ఫేస్వాష్ కానీ సోప్ కానీ వాడలేదు. అప్పుడప్పుడు నేను స్ర్కబ్స్ ఉపయోగిస్తాను. ఇలా చేస్తే డెడ్ సెల్స్ పోయి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నేను ఎప్పుడు హెల్దీ స్కిస్నే మెయింటెస్ చేస్తాను. ఏ చర్మ సమస్యలకైనా నా కూతురు నేన ఈ ఫేస్ ప్యాక్నే వాడతాం. ఈ ప్యాక్లో పసుపు, శెనగపిండి వంటి పదార్ధాల వలన చర్మానికి మంచి గ్లోయింగ్ రావడమే గాక తాజాగా కనిపిస్తుంది. " అంటూ ఆ ప్యాక్ చేసుకునే విధానం గురించి వివరించారామె. ఎలా చేసుకోవాలంటే..ఒక గిన్నెలోకిలోకి 2 టేబుల్స్పున్ల శెనగపిండి, డ్రై స్కిన్ ఉంటే ఇంట్లో చేసిన క్రీమ్, తాజా పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంత వరకు ఉంచితే చాలు. ఆ తర్వాత ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో ట్రై చేసి చూడండి మరి... View this post on Instagram A post shared by Dr Madhu Akhouri Chopra (@drmadhuakhourichopra) (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! : దీపికా కక్కర్
దీపికా కక్కర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది వైద్యులు ఆమె కాలేయం దగ్గర టెన్నిస్ బంతి పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉందని నిర్థారించినట్లు తెలిపారామె. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ గడ్డతోపాటు కాలేయంలో 22 శాతం తొలగించారు. హమ్మయ్యా బయటపడ్డాను అనుకునేలోపే ఆ వ్యాధి మరోసారి తిరగబట్టి గట్టి షాకిచ్చింది. దీంతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ..కనీసం మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నాననంటూ తన గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంది. అంతేగాదు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఇరకాటంలో పడేస్తాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.నటి దీపికా కాకర్కు కాలేయం దగ్గర 1.3 సెం.మీ సిస్ట్ మళ్లీ రావడంతో మరో శస్త్ర చికిత్స జరిగింది. కాలేయ కేన్సర్కు చికిత్స పొందుతున్న దీపికాకు ఈ కేన్సర్ మళ్లీ తిరగబెట్టడం ఒక భావోద్వేగపరమైన ఎదురుదెబ్బగా మారిందామెకు. ఈ మేరకు పోస్ట్లో ఊహించన ఈ మలుపు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా మాతృత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. తన కొడుకు రుహాన్తో సమయం గడపలేకపోతున్నాన్న బాధ తనను కలిచివేస్తోందని అంటోంది. ఆస్పత్రి సందర్శనలే దినచర్యగా మారిపోవడంతో అలిసిపోతున్నానని అంటోంది. ఇక తన భర్త షోయబ్ తన కారణంగా పనులతో బిజీ అయిపోయాడని చెప్పుకొచ్చింది. ఆస్పత్రిలో ఉంటే రుహాన్ చూడలేను పోనీ ఇంటికి వస్తే చికిత్సతో అలిసిపోయి పడుకుంటాను అంతే ఇది తన దినచర్యను పూర్తిగా మార్చేసిందన్నారు. నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ఊహించని విధంగా మరోసారి ఈ కేన్సర్ తిరగబెట్టడం ఒకింత బాధ, భయం ఆవరించాయని కన్నీటి పర్యంతమైంది. ఒకరకంగా ఈ పరిస్థితి తన ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసిందన్నారు. మన శరీరాలు చలా సంక్లిష్టమైనవి, బలమైనవి, ప్రతిరోజు వివిధ చికిత్సలు తట్టుకుంటున్నందుకు అవి నిజంగా గొప్పవి అని మెచ్చుకుంది. ఏ అనారోగ్యం వచ్చినా..మన శరీరంలో హార్మోన్లు ఎంతలా మార్పులు చెందినా..మన జీవితాలను సజావుగా గడుపుతామని అన్నారు. తనలా మళ్లీ మళ్లీ సిస్ట్ వచ్చినా కొందరితో మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎదుర్కొనేలా తనను తాను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు దీపికా. అలాగే అనారోగ్యం కారణంగా క్రమం తప్పకుండా వ్లాగ్లో పోస్ట్లు పెట్టలేకపోతున్నానని అన్నారు. తన చుట్టూ ఉన్నవారు నవ్వుతూనే ఉంటున్నారు కానీ, లోపల ఎంత ఆందోళన ఉందో గ్రహించగలను, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య ఎంత బాధపడుతున్నారో ఊహించగలను అంటూ తన పోస్ట్ని ముగించింది.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..
ఈ ఏజ్లో అంత కష్టతరమైన వ్యాయామాలు మావల్ల కాదు అనే వాళ్లకు ఈ బామ్మే ఆదర్శం. చేయాలనే గట్టి సంకల్పం ఉంటే వయసు అనేది పెద్ద సమ్య కాదని ఈ బామ్మని చూస్తే తెలుస్తుంది. పెద్ద వయసువారైన సులభంగా క్లిష్టమైన వ్యాయమాలు చేయాలంటే కేవలం ఓపిక, నిలకడే అత్యంత కీలకం అని ఈ సూపర్ బామ్మని చూస్తే అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో క్లిప్లో కనిపిస్తున్న మహిళ పేరు అమృత్ కౌర్. 75 ఏళ్ల వయసులో మరింత బలంగా ఉండేందుకు చిన్నపాటి కదలికల కోసం వ్యాయమాలు చేస్తూ కనిపిస్తుంటుందామె. ముఖ్యంగా ఆ వృద్ధాప్య వయసులో పుష్ అప్లు చేసేందుకు పడ్డ శ్రమ చూస్తే..నోరెళ్ల బెట్టడం ఖాయం. మొదట కొన్నింటి సాయంతో పుష్ అప్లు చేస్తుంటుంది. ఆ తర్వాత మోకాళ్లు, చిన్న పరికరాల సాయంతో పుష్ అప్లు చేస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేటి సాయం లేకుండా సునాయాసంగా పుష్ అప్లు చేస్తుంటుంద. నిలకడతో చేస్తూ ఉంటే..ఎంత కష్టమైన వ్యాయామాలైన ఈజీగా చేసేయొచ్చని ఈ బామ్మని చూస్తే అర్థమవుతుంది. ఈ బామ్మ జస్ట్ 12 వారాల్లో పుష్ అప్లో పట్టు సాధించింది. రోజు జిమ్కి వచ్చేవారు సైతం సిగ్గుపడేలా ఎంత అద్భుతంగా చేసిందో చూస్తే మాటలు రావు. నెటిజన్లు ఇకపై ఎలాంటి సాకులు చెప్పకండి ఈ బామ్మని చూసి స్ఫూర్తి పొందండి, అమ్మో బామ్మ నువ్వు చాలా గ్రేట్ అని రకరకాలు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Amrit Kaur | Strong at 75 ❤️ (@getfitwithdadi) (చదవండి: ఆ రైడ్కి ఐదు స్టార్లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..) -
ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!
ఉన్నత చదువులు చదివితే కచ్చితంగా లక్షల ప్యాకేజ్లతో పనిచేసే ఉద్యోగాలు చేస్తుండటమో లేదా వ్యవస్థాపకులుగా కోట్లు గడించే రేంజ్లోనో ఉంటారు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్లన్నింటిలో ఆల్ ఇండియా టాపర్ సాధించిన వ్యక్తులు అంటే కచ్చింతంగా చాలా పెద్ద పొజిషన్లోనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వ్యక్తి అత్యంత విరుద్ధంగా ఆ మార్గాన్ని ఎంచుకుని ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే..విస్తుపోతారు. ఇలా ఎలా ఇంత పెద్ద అనుహ్య మార్గాన్ని ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోతారు. పైగా అతడి కథ ఆలోచింపచేసేలా ఉండటమే గాక విజయానికి అసలైన అర్థం ఏంటో చాటి చెప్పారు.ఆయనే శ్రీష్ జాదవ్. 1968లో జన్మించిన జాదవ్, చిన్న వయస్సు నుంచే విద్యలో అసాధారణ ప్రతిభ కనబరిచేవారు. 1985లో, భారతదేశంలోని అత్యంత పోటీతత్వ పరీక్షలలో ఒకటైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(ఐఐటీ జేఈఈ))లో ఆయన ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించారు. అలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IITK) చదువుకున్నారు. సోషియాలజీ మినహా అన్నింటిలోనూ 'A' గ్రేడ్లు సాధించి, అద్భుతమైన విద్యా ప్రతిభను కనబరిచారు. అతని పదునైన మేధస్సు, నిలకడైన ప్రతిభ అతన్ని తన కాలంలోని అత్యుత్తమ విద్యార్థులలో ఒకరిగా నిలబెట్టింది. ఆ తర్వాత 1989లో కంప్యూటర్ సైన్స్లో గేట్ (GATE) పరీక్షలో 99.92 అద్భుతమైన పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలిచారు. ఇక అక్కడితో చదువుని ఆపలేదు, పీహెచ్డీ కూడా చేశారు. ఆ తర్వాత సంప్రదాయ ఉద్యోగాలతో సంపాదన బాట పట్టకుండా సమాజ సేవ కోసం సర్వస్వం త్యాగం చేశారు. నిరుపేద విద్యార్థులకు విద్యనందించడం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన సమాజ సేవకు మించింది లేదనే భావంతో అరుణాచల్ ప్రదేశ్లోని నరోత్తమ్నగర్లో ఉన్న రామకృష్ణ మిషన్ పాఠశాలలో రెసిడెంట్ గౌరవ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1996, 1997ల మధ్య రామకృష్ణ మిషన్ శిల్పమందిరంలో గౌరవ లెక్చరర్గా సేవలందించారు. అలాగే 1997-2006 వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ రంగంలో లెక్చరర్గా, కో ఆర్డినేటర్గా సేవలందించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత పెద్ద బాధ్యతలు స్వీకరించి, చివరికి రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి డీన్ ఆఫ్ రీసెర్చ్ మరియు కో-ఆర్డినేటర్గా పనిచేశారు. ఆయన సమాజానికి చేసిన విశేష సేవలకు గానూ 2009లో ఆయనకు ఐఐటీ కాన్పూర్ 'విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం ప్రదానం చేసింది. అంతేగాదు ఆయన సేవ మార్గాన్నే ఎంచుకున్నా.. విద్య పట్ల ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. కంప్యూటేషనల్ జ్యామితి, గ్రాఫ్ అల్గారిథమ్స్, డిస్క్రీట్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి వాటిలో పరిశోధనలు చేశారు. అంతేగాదు ఆయన బీటెక్ ప్రాజెక్టు ఓ ప్రముఖ కంప్యూటర్ సైన్స్ పరిశోధన సంస్థచే ప్రచురణ కోసం ఎంపిక అవ్వడం విశేషం. కాగా, శ్రీష్ జాదవ్ కథ నిజమైన విజయం సంపాదనలో లేదని, తెలివిగా ఎంచుకోవడంలోనే ఉందని చెబుతోంది. అంతేగాదు సక్సెస్ అంటే సంపద, గుర్తింపు కానే కాదని, ఒక లక్ష్యంతో స్పష్టతతో జీవించడం గురించని చెప్పకనే చెప్పారు శ్రీష్ జాదవ్.(చదవండి: 'బుజ్జి' ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..) -
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలా, ఎపుడు చేసుకోవాలి? ఈ లాభాలు తెలుసా?
ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది.సర్టిఫికెట్ వల్ల ఉపయోగాలు పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజి్రస్టేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. ఇదీ చదవండి: ఆడబిడ్డ పుట్టిందని, అంతులేని సంబరం : వీడియో వైరల్90 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన, మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి -
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..) -
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు -
మా నాన్న ప్రవర్తనతో విసిగిపోయాము!
మా నాన్న గారిది మొదట్నుంచి వింత ధోరణే! ఇంటికి ఎవరైనా తెలిసినవారు, బంధువులు వస్తే అతిగా ప్రవర్తిస్తారు. ఫ్యాన్లు ఫుల్ స్పీడ్తో పెట్టడం, గట్టిగా మాట్లాడటం, వారితో తనకు పెద్ద పదవుల్లో ఉన్నవారంతా తెలుసునని, రోజూ వారితో ఫోన్లో మాట్లాడుతానని గొప్పలు చెబుతారు. ఎవరైనా అప్పు కావాలంటే తన అవసరాలు కూడా చూడకుండా, వారికి డబ్బులివ్వడం, ఏదైనా ఫంక్షన్కు వెళితే, మా తాహతుకు మించి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడం కూడా మామూలే. మా నాన్న బలహీనత ఆసరాగా తీసుకుని, ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, చాలా గ్రాండ్గా చేయాలని, అప్పైనా చేసి ఖర్చు పెడ్తారు. తనకు పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తెల్సని, తాను తల్చుకుంటే ఏదైనా చేయగలనని, అందరికీ తెలిసేలా చెబుతుంటారు. ఆయన ప్రవర్తన వల్ల, మేము ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, ఒక్కోసారి నల్గురిలో తలెత్తుకోలేకపోతున్నాము. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం ఈ ఉత్తరం...– రమా కుమారి, బోధన్మీ బాధ అర్థం చేసుకున్నాను. మా ప్రాక్టీసులో ఇలాంటి మనస్తత్వమున్నవారిని తరచుగా చూస్తూనే ఉంటాము. ‘హైపోమేనిక్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేక మనస్తత్వం కలవారు ఇలా ప్రవర్తిస్తారు. ఇది ఒక చిత్రమైన వ్యక్తిత్వ లక్షణం. మన చుట్టూ మీ నాన్న లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు, ఇంటెన్సిటీలో తేడా అంతే! వీరు మొదట్నుంచీ అతిగా మాట్లాడ్డం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడూ ఓవర్ యాక్టివ్గా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. వీరి గొప్పలు వింటూ ఉంటే, నిజమేమోనన్నంతగా నమ్మిస్తూ ఉంటారు. అయితే వీరికి నోటి దురదే తప్ప, వాస్తవానికి ఇతరులను మోసం చేయాలనే తలంపు సాధారణంగా ఉండదు. ఇతరులకంటే తాము గొప్ప అనిపించుకోవాలనే తపన వీరికి ఎక్కువ. ఇలాంటి వారు అతిగా ఊహించుకుని, రకరకాల వ్యాపారాలు మారుస్తూ, అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టి, ఆర్థికంగా కూడా నష్టపోతుంటారు. ఎప్పుడూ జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఏదైనా కష్టాలొచ్చినా, వారి మొహంలో బాధ, దిగులు కనిపించడం చాలా అరుదు. ఇలాంటి మనస్తత్వం సాధారణంగా జీన్స్ ద్వారా కొందరికి వారసత్వంగా సంక్రమిస్తుంది. మెదడులోని కొన్ని రసాయనాలు అధికంగా పనిచేయడం వల్ల కూడా కొందరిలా ప్రవర్తిస్తారు. తమ ప్రవర్తన వల్ల ఇంట్లో ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారన్న స్పృహ వీరికి ఉండదు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇలాంటి వారు ఒక్కోసారి ‘బైపోలార్ డిసార్డర్’ అనే తీవ్రమైన మానసిక వ్యాధికి కూడా లోనయ్యే అవకాశముంది. మీ నాన్నగారి ప్రవర్తన మరీ శృతిమించి రాగాన పడేట్లయితే, ఒకసారి సైక్రియాట్రిస్టు సలహా తీసుకోండి. ‘మూడ్ స్టెబిలైజర్స్’ అనే కొన్ని మందుల ద్వారా వీరి ప్రవర్తనను చాలా వరకు మార్చే అవకాశముంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్షిప్స్లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్స్లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్లాండ్కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్పూర్లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. -
కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు కలిపి తీసుకోవచ్చా..?
సమ్మర్ మొదలైపోయింది. బయట వేడి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. అదీగాక ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ సైతం ఉత్తర కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని ముందుగానే హెచ్చరించింది కూడా. అప్పుడే మే నెల రాక మునుపే సూర్యడి భగభగలు మాములుగా లేవు. ఈ సమయంలో అధికంగా తీసుకోవాల్సింది నీరు. ముఖ్యంగా శరీరం హైడ్రేషన్గా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఎక్కువ మంది కొబ్బరి నీళ్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలాగే సబ్జా నీళ్లు కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు ఈ రెండిటిని కలిపి తీసుకుంటారు. అసలు ఇలా కలిపి తీసుకోవచ్చా..? ఆరోగ్యానికి మంచిదేనా..అంటే..వేసవిలో చాలామంది డీహైడ్రేషన్కి గురై మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటుంటారని అంటున్నారు నిపుణులు. అందుకు కొబ్బరి నీళ్లు, సబ్జా రెండూ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అసలు వేసవిలోనే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఎందుకు అధికంగా ఉంటుందంటే..రికార్డు స్థాయిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు శరీర సాధారణ పనితీరుపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీనిని 'హీట్ స్ట్రెస్' లేదా వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికంగా నీరు కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సంభవించవచ్చు. మూత్రం కూడా చిక్కగా మారుతుంది, దాని రంగును బట్టి శరీరం ఎంత డీహైడ్రేషన్కు గురైందో తెలుస్తుంది. అలాంటి టైంలో మన తీసుకునే ఆహారం శరీరానికి వేడిచేసేవి అయితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడంపై చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాదు శరీరంలో ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు సమతుల్యంగా ఉండేలా చేసుకోవడానికి, వివిధ వనరుల ద్వారా నీటిని తీసుకోవడం అత్యంత అవసరం.కొబ్బరి నీరు: ప్రకృతి అందించే సహజసిద్ధమైన ఔషధం.. కొబ్బరి నీరు శరీరానికి ఎలక్ట్రోలైట్లు, యు పొటాషియంను అందించే ఒక సహజ జల వనరుగా పేర్కొంటారు. అంతేకాకుండా, దీనికి నిర్విషీకరణ, బాక్టీరియా నిరోధక, పునరుజ్జీవనం, జీర్ణక్రియ, మూత్రవిసర్జన వంటి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మూత్రపిండాల నుంచి లవణాలను బయటకు పంపడానికి తగినంత నీరు అందనప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి, కాబట్టి ఇది వాటిని నివారించగలదు. తరుచుగా కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల మూత్రం పలుచబడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కొబ్బరి నీరు జీర్ణాశయ సంబంధిత సమస్యలు, రక్త విరేచనాలపై సానుకూల చికిత్సా ప్రభావాలను కలిగి ఉంటుంది. పిల్లలలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.సబ్జా గింజలు:సబ్జా గింజల్లోని నీటిని శోషించుకునే లక్షణం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ ప్రకారం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఖనిజాలను కలిగి ఉండే పోషక ప్రొఫైల్, మూత్ర సంబంధిత ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మూత్రపిండాల పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.కొబ్బరి నీరు సబ్జా గింజల కలయికకొబ్బరి నీరు, సబ్జా గింజల సరైన కలయిక మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయని ఆయర్వేదం చెబుతోంది. ఇంటర్నేషనల్ బ్రాజ్ జె యూరల్లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మీ మూత్రంలో ఉప్పు స్ఫటికాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది కానీ సబ్జా గింజలు మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయనేందుకు ఆధారాలు లేవు అని పేర్కొంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొబ్బరి నీళ్ళు లేదా తులసి గింజల వంటి సహజసిద్ధమైన హైడ్రేటింగ్ వనరులను సురక్షితంగా తీసుకోవడానికి వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు అనుగుణంగా సురక్షితమైన విధంగా ఎలా తీసుకోవాలో సూచిస్తారని చెబుతున్నారు. అంతేగాదు లోబీపీతో బాధపడేవారు సబ్జాగింజలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..) -
హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? ఎప్పుడు ఇవ్వాలంటే..
దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ మొదలైంది. పద్నాలుగేళ్ల బాలికలు మొదలుకొని దేశంలో దాదాపు కోటీ పదిహేను లక్షల మంది యువతులకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క సింగిల్డోస్ (మోతాదు)తో మహిళల్లో సర్వైకల్ కేన్సర్ను సమర్థంగా నివారించే (93% నుంచి 100% వరకు రక్షణ కల్పించే) ఈ వ్యాక్సిన్ను ఇవ్వడం మొదలుపెట్టారు. మన దేశంలో విస్తృతంగా మొదలైన ఈ మహిళా ఆరోగ్య సంరక్షణ చర్య ద్వారా అంతర్జాతీయంగా కేన్సర్ నివారణ చర్యలు తీసుకున్న 160 దేశాల్లో మన దేశం కూడా ఒకటి కానుంది. ఈ నేపథ్యంలో ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కోసం...హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళలను ప్రభావితం ఏలా చేస్తుందంటే... ఇది (హెచ్పీవీ) మహిళల్లో సర్వైకల్ కేన్సర్కు దారితీస్తుంది. సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే హెచ్పీవీ ఉండటం వల్లనే తప్పక అది సర్వైకల్ కేన్సర్కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే అది కేన్సర్ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్లో పాల్గొనేవారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా స్త్రీలలో అందునా గ్రామీణ మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. ఈ భాగం మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అలా అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన వల్ల కేన్సర్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫాక్టర్ హెచ్పీవీ వైరస్... హెచ్పీవీ వైరస్ సోకడం సర్వైకల్ కేన్సర్కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. మామూలుగానైతే చాలామందిలో హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్కేన్సర్కు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. హెచ్పీవీ వైరస్తో పాటు పొగతాగే అలవాటు ఉండటం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటి అంశాలు కూడా సర్వైకల్ కేన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని.నివారణ ఎలా? నివారణకు తొలుత తోడ్పడే పరీక్ష పాప్స్మియర్ అనే వైద్యపరీక్ష. సర్వైకల్ కేన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ అనే వైద్యపరీక్షది చాలా కీలక భూమిక. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, తమ లైంగిక జీవితం ప్రారంభమయ్యాక మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవడం అవసరం. అంటే చిన్న వయసు బాలికలు తప్ప మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. సర్వైకల్ కేన్సర్ రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దాన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–కేన్సరస్ దశ’ ఉండటం మరో అడ్వాంటేజ్. అంటే అసలు కేన్సర్ రావడానికి పదేళ్ల ముందే దీన్ని కనుగొనే అవకాశమున్నందున... అది కేన్సర్గా పరిణమించకముందే అంటే ‘ప్రీ–కేన్సర్’ దశలోనే నయం చేసుకోవచ్చు. పూర్తిగా నయమయ్యేందుకు అవకాశం కూడా ఎక్కువే. హెచ్పీవీ వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలంటే... గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే కేన్సర్లను నివారించే ఈ వ్యాక్సిన్ను ఎప్పుడు ఇవ్వవచ్చనే విషయంలో అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు మేరకు.. పదకొండేళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. తొమ్మిదేళ్లు నిండిన బాలికలు మొదలుకొని 26 ఏళ్ల వరకు మహిళలందరికీ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. అయితే మహిళలకు వాళ్ల వివాహానికి ముందే అంటే... వాళ్లు తమ లైంగిక జీవితాన్ని మొదలు పెట్టకమునుపే దీన్ని ఇప్పించడం అవసరం. వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో 99% మందికి ఈ కేన్సర్ వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి సర్వైకల్ కేన్సర్ ముప్పు తాలూకు ఆందోళన లేకుండా వారు జీవితాంతం నిశ్చింతగా ఉండే నిర్భయత ఈ వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు ఉంటుంది.హెచ్పీవీ వ్యాక్సిన్తో ఇతరత్రా ప్రయోజనాలివే... హెచ్పీవీ వ్యాప్తినిఅరికట్టడంయోని దగ్గర వచ్చే పులిపిరుల(జెనిటల్ వార్ట్స్) సమస్య నుంచి రక్షణ గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణయోని క్యాన్సర్ వంటి మరికొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి నివారణ దీర్ఘకాలిక రక్షణను అందిస్తుందిమహిళా సమూహాలకు సంయుక్త రక్షణ (హెర్డ్ ఇమ్యూనిటీ) కలగడంచికిత్స తర్వాత మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు బాగా తగ్గడంతద్వారా జనాభాలోని అందరికీ / ప్రజారోగ్య సంరక్షణకు తోడ్పడటండాక్టర్ సాయిలక్ష్మి డయానా, సీనియర్ కన్సల్టెంట్, గైనిక్ ఆంకాలజిస్ట్ – యాసీన్చదవండి: ‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే.. -
‘వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్’కు కారణం..! ఎందుకొస్తుందంటే..
మెనోపాజ్ తర్వాత మహిళల్లో సాధారణంగా కనిపించే పెల్విక్ ఫ్లోర్ కండరాల బలహీనత కారణంగా కనిపించే ప్రోలాప్స్ సమస్యను చాలా మంది సహజంగా తీసుకుంటూ మౌనంగా భరిస్తుంటారు. కానీ ఈ సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా ఉపశమనం పొందవచ్చని కిమ్స్ కడల్స్ సికింద్రబాద్కు చెందిన కన్సల్టెంట్ యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ తెలిపారు. తాజాగా పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మళ్లీ వచ్చిన వజైనల్ వాల్ట్ ప్రోలాప్స్ కేసును విజయవంతంగా చికిత్స చేశామని వివరించారు.65 ఏళ్ల మహిళకు గతంలో గర్భాశయ గడ్డల కారణంగా హిస్టరెక్టమీ చేయబడింది. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత యోనిలో బయటకు బల్జ్లా కనిపించడం ప్రారంభమై, రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 2023లో ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో, 2024లో మరోసారి మెష్తో అబ్డొమినల్ సర్జరీ చేశారు. అయినప్పటికీ నాలుగు నెలల్లోనే సమస్య మళ్లీ తలెత్తింది.ఈ నేపథ్యంలో ఆమె మమల్ని సంప్రదించగా కేసును సమగ్రంగా పరిశీలించి, మొదట వజైనల్ పెస్సరీ ద్వారా కన్సర్వేటివ్ చికిత్సను సూచించగా, రోగి ఏడాది పాటు ఆ విధానాన్ని అనుసరించారు.తరువాత శాశ్వత పరిష్కారం కోసం రోగి ముందుకు రావడంతో వజైనల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ చేశాం. ఇందులో యాంటీరియర్ వజైనల్ వాల్ రిపేర్, యూటెరోసాక్రల్ లిగమెంట్ సస్పెన్షన్ ద్వారా బలమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు హై పెరినియోరాఫీ కూడా చేశాం. ఈ శస్త్రచికిత్సతో రోగి త్వరగా కోలుకుని, సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా డా. బిందు ప్రియ మాట్లాడుతూ, ప్రతి రోగికి చికిత్సను వ్యక్తిగతంగా ప్రణాళిక చేయడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రోలాప్స్ తీవ్రత, గత శస్త్రచికిత్సలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తామని తెలిపారు. పెల్విక్ ప్రోలాప్స్, మూత్రం అదుపు లేకపోవడం వంటి సమస్యలు వయస్సు కారణంగా రావడం సహజమే అయినప్పటికీ, అవి తప్పనిసరిగా భరించాల్సినవికాదు. సిగ్గు, అపోహల కారణంగా ఆలస్యం చేయకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే జీవన నాణ్యత మెరుగుపడుతుందని సూచించారు. మహిళలు నిర్భయంగా తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించేలా అవగాహన పెంపొందించడం సమాజ బాధ్యత అని డా. బిందు ప్రియ, డా. సాయి స్నేహిత పేర్కొన్నారు.యూరో గైనకాలజిస్ట్ డా. బిందుప్రియ, సికింద్రాబాద్(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..
డైనోసార్లు 66 మిలియన్ సంత్సరాల క్రితమే అంతరించిపోయాయి కదా మరి దాని తోలుతో హ్యాండ్ బ్యాగ్ ఎలా సాధ్యం. బతికే ఉన్న జంతవుల తోలు నుంచి తయారు చేశారంటే అవునా అని అనొచ్చుగానీ, అస్సలు భూమ్మీద మనుగడ లేని ఆ జంతువుల తోలుతో చేసిన లేదర్ వ్యాండ్ బ్యాగ్ ఏంటి అని సందేహించకండి. ఎందుకంటే ఇది ముమ్మాటికి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగే. దాని ధర తెలిస్తే విస్తుపోతారు. అసలు దీన్నెలా రూపొందించారు, ఎందుకంత ఖరీదు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ప్రాజెక్టులో భాగంగా నెదర్లాండ్ శాస్త్రవేత్తలు, డిజైనర్లు టైరన్నోసారస్ రెక్స్ శిలాజాలల(డైనోసార్ శిలాజాలు) నుంచి సేకరించిన కొల్లాజెన్ను ఇతర జంతువుల కణాలతో కలిపి ల్యాబ్లో కృత్రిమంగా పెంచారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం మూడు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ది ఆర్గానాయిడ్ కంపెనీ, జెనోమిక్ ఇంజనీరింగ్ సంస్థ ఆర్గానాయిడ్, క్రియేటివ్ ఏజెన్సీ VML అనే మూడు కంపెనీలు 2023లో ఉన్ని మామత్ DNAను గొర్రెల కణాలతో కలిపి ఒక భారీ మీట్బాల్ను తయారు చేసేందుకు పనిచేశాయి. మళ్లీ తాజాగా ఈ బృందం డైనోసార్ అవశేషాల నుంచి పురాతన ప్రోటీన్ శకలాలను సేకరించి, వాటిని ఒక గుర్తుతెలియని జంతువు కణాలలోకి ప్రవేశపెట్టి కొల్లాజెన్ను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత దానిని తోలుగా మార్చారు. అయితే చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేయడంతో..డచ్ శిలాజ శాస్త్రవేత్త ఇలా వివరణ ఇస్తూ.. వారి అనుమానాలను పటాపంచలు చేశారు. డైనోసార్ ఎముకలలో కొల్లాజెన్ కేవలం శకలాల రూపంలో మాత్రమే మిగిలి ఉంటుందని, దానిని ఉపయోగించి టి-రెక్స్ చర్మాన్ని పునఃసృష్టించలేమని అన్నారు. అలాగే సరిపోలిన ప్రోటీన్లలో కూడా, నిజమైన జంతు తోలుకు దాని విశిష్ట లక్షణాలను ఇచ్చే ఫైబర్ నిర్మాణం లోపిస్తుందని చెప్పారు. సరికొత్త ప్రయోగం చేసేటప్పుడే ఇలాంటి సందేహాలు మాములేనని, అయినా ఇంతవరకు డైనోసార్ చర్మం అనేలా ఎవ్వరూ అంత స్థాయిలో ప్రయోగం చేయలేకపోయారని కూడా అన్నారు. అదీగాక సంప్రదాయ లెదర్ బ్యాగ్లతో పోలిస్తే, ల్యాబ్ తో చేసిన టి. రెక్స్ లెదర్ అత్యంత విలాసవంతమైన వస్తువుగా నిలుస్తుందన్నారు. ఈ డైనోసర్ లెదర్ బ్యాగ్ని మే 11న ఆమ్స్టర్డామ్లోని ఆర్ట్ జూ మ్యూజియంలో సందర్శనకు ఉంచనున్నారట. అంతేగాదు దీన్ని వేలం వేయనున్నట్లు సమాచారం. పైగా దీని ప్రారంభ ధరే రూ. 4 కోట్లు అని చెబుతున్నారు పరిశోధకులు.(చదవండి: Kerala Techie: సాహసమా..? నాటకమా..?: కావాలనే చేసిందా ఆ టెకీ..) -
ఆ టెకీది సాహసమా..? నాటకమా..?
కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది అనుకుంటే..సర్వత్రా ఈ ఘటనపై అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఆమె నిజంగానే తప్పిపోయిందా..? నాటకమా.. ? అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టెకీ శర్యణ తానెలా తప్పిపోయిందో చెప్పిన విధం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఈ ఘటనపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అసలు ఎందుకిలా అంటే..కేరళలోని కోజికోడ్ జిల్లా, నడపురానికి చెందిన 36 ఏళ్ల ఐటీ నిపుణురాలు శరణ్య, ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగులో ఉన్న ఎత్తైన శిఖరం తడియండమోల్ను అధిరోహించడానికి బయలుదేరింది. ఆమె తన బృందంతో తప్పిపోయి నాలుగురోజుల తర్వాత రెస్కూ అధికారులు ఆమె ఆచూకుని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా నాలుగు రోజుల పాటు మనుషులెవ్వరూ వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో ఒక్కత్తే ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె కేవలం నీళ్లు తాగుతూ ఉండటం మరింత ఆశ్చర్యానికి లోనుచేసింది. ఎందుకంటే రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి తీసుకొచ్చినప్పుడూ.. శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసిపోయినట్లు గానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో సర్వత్ర అనుమానాలకు దారితీసింది. అదీగాక క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదు, ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాదు ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందుకుగానూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని బిజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు టెకీ శరణ్య అదృశ్యం కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నపోక్లు పోలీస్ స్టేషన్లో కేను కూడా నమోదైంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు బీజేపీ నాయకులు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కానీ ఒక పిటిషన్గా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసులు రెస్క్యూలో ఆమెను చూసి మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానాలు కలగలేదని, కానీ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు రెస్క్యూ పోలీసులు. ట్రెక్కింగ్ వెళ్లినప్పుడూ శరణ్యలా కాకూడదంటే..ఇలా ట్రెక్కింగ్ వంటి సాహసయాత్రలకు వెళ్లేటప్పుడూ..ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్ను ఫాలో అవ్వాలి. ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే సమయంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు పట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.(చదవండి: మంచు కమలం..ముమ్మాటికీ ఇది అందరూ చూడలేరు!) -
క్షమించడంతోనే విముక్తి
చాలామంది క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును అంగీకరించడం లేదా వారిని మళ్ళీ దగ్గరకు తీయడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, క్షమించడం అనేది ఎదుటివారి కోసం చేసేది కాదు.. అది మీ కోసం మీరు చేసుకునే 'విముక్తి'. మీ వ్యక్తిత్వం నుండి పగ, ద్వేషం అనే భారాలను తొలగించి, మిమ్మల్ని మీరు ఎలా ఫ్రీ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో చూద్దాం.మీకు అన్యాయం చేసిన వ్యక్తిపై కోపం పెంచుకోవడం అంటే, ఆ వ్యక్తికి మీ మనసులో 'ఉచితంగా రెంట్' (Free Rent) ఇచ్చినట్లే. మీరు పగతో రగిలిపోతున్నంత సేపు, మీ జీవితం ఆ వ్యక్తి నియంత్రణలో ఉంటుంది. క్షమించడం అంటే ఆ నియంత్రణను తెంచుకుని, మీ 'ప్రశాంతత'ను మీరు తిరిగి పొందడం.పగ - ఒక మానసిక విషం (The Burden of Unforgiveness)మనం ఎవరినైనా క్షమించలేనప్పుడు మన శరీరంలో నిరంతరంCortisol (స్ట్రెస్ హార్మోన్) విడుదలవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను పాడు చేస్తుంది , అది మీ సృజనాత్మకతను చంపేస్తుంది. కోపాన్ని మోయడం అంటే, ఎదుటివారి మీద విసరాలని మండుతున్న నిప్పు కణికను మీ చేతిలో పట్టుకోవడం లాంటిది. కాలేది మీ చేయి మాత్రమే, అవతలి వారికి ఏమీ కాదు.క్షమించడం అంటే ఏమిటి? క్షమించడమంటే 'మర్చిపోవడం' కాదు.జరిగిన విషయాన్ని మీరు మర్చిపోలేరు, కానీ ఆ జ్ఞాపకం మిమ్మల్ని బాధించకుండా చూసుకోవచ్చు.వారు చేసింది తప్పు అని మీకు తెలుసు, కానీ ఆ తప్పు వల్ల మీ వర్తమానం పాడవ్వకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు.క్షమించినంత మాత్రాన మీరు ఆ వ్యక్తితో మళ్ళీ స్నేహం చేయక్కర్లేదు. మీరు వారిని దూరం పెట్టవచ్చు, కానీ మనసులో కోపం లేకుండా.మోటివేషన్ మాయ vs సైకాలజికల్ హీలింగ్"మహాత్ముడిలా ఉండు, అందరినీ ప్రేమించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది ఒక్కోసారి ఆచరణలో కష్టం. కానీ సైకాలజీ... "నీ ఆరోగ్యం కోసం, నీ ఎదుగుదల కోసం ఆ విషాన్ని బయటకు కక్కేయ్" అని చెప్తుంది. క్షమించడం అనేది ఒక నైతిక బాధ్యత కంటే, ఒక 'సెల్ఫ్-కేర్' టెక్నిక్.విముక్తి పొందే మార్గంGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, క్షమాగుణాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?Step 1: Break Victim Identity..."నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుడిని" అనే ఆలోచనను 'Break' చేయండి. ఆ ఆలోచన మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఆ సంఘటన నుండి బయటకు వచ్చి, మీరు ఒక 'సర్వైవర్' (Survivor) అని గుర్తించండి.Step 2: Build Emotional Detachmentఆ వ్యక్తికి, మీ ఎమోషన్స్ కి మధ్య ఉన్న లింక్ ని 'Build' చేయండి. "వాడు ఇలా అన్నాడు కాబట్టి నేను బాధపడుతున్నాను" అనే వాక్యాన్ని "నేను నా పాత జ్ఞాపకం వల్ల బాధపడుతున్నాను, ఆ వ్యక్తికి ఇప్పుడు నా మీద అధికారం లేదు" అని మార్చుకోండి. మీ మనసును మీరు రీ-వైర్ చేసుకోండి.Step 3: Liberationక్షమించిన తర్వాత మీలో కలిగే ఆ తేలికపాటి భావనను అనుభవించండి. ఇప్పుడు మీ ఎనర్జీ పగ తీర్చుకోవడానికి కాకుండా, మీ 'లెగసీ'ని నిర్మించుకోవడానికి వాడుకోండి. ఇదే 'Beyond' స్టేజ్. ఒక వ్యక్తిని క్షమించిన రోజు మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు.మీ మనసులో భారమెంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఇంకా ఎవరి మీదైనా కోపం పెంచుకున్నారా? ఆ కోపం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా నష్టం జరుగుతోందా లేక మీకేనా?2. ఆ వ్యక్తిని క్షమిస్తే మీ జీవితంలో ఎంత సమయం, ఎంత ఎనర్జీ ఆదా అవుతుంది?3. మీరు మీ పాత గాయాలను మీ వ్యక్తిత్వానికి అలంకారాలుగా మార్చుకుంటారా లేక భారాలుగా మోస్తారా?క్షమించడమే అసలైన వీరత్వం!బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడం అనేది బలవంతుల లక్షణం. మీరు ఒకరిని క్షమించినప్పుడు, మీరు వారిని విడుదల చేయడం లేదు.. ఒక ఖైదీని విడుదల చేస్తున్నారు, ఆ ఖైదీ మరెవరో కాదు..మీరే!"The weak can never forgive. Forgiveness is the attribute of the strong."- Mahatma Gandhi సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత) -
ఆచి తూచి అడుగు వేయండి
మనిషి తన జీవన విధానాలను మెరుగు చేసుకునే పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉంటాడు. భారతీయ వివాహ వ్యవస్థ తిరుగులేనిదే అయినా ఇటీవల లివ్ ఇన్ రిలేషన్– సహజీవన విధానంలో స్త్రీ, పురుషులు జీవించడం పరిపాటి అయ్యింది. అయితే ఇందులో స్త్రీలకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయవాది మోనిక అరోర ఫేస్బుక్ వేదికగా కొన్ని సూచనలు చేశారు.ఇటీవల నా దగ్గరకు వచ్చిన ఒక కేసు నన్ను తీవ్రంగా కలవరపరిచింది. అది సహజీవనం కేసు. ఒక మహిళ దాదాపు 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె ఆ బంధాన్ని ఎంతో నమ్మింది. ఈ పదేళ్ల కాలంలో అతని కోసం సమయాన్ని, యవ్వనాన్ని, భావోద్వేగాలను, శరీరాన్ని అర్పించింది. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఏమీ చెప్పకుండా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో చె΄్పాడు. దాంతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలనుకుంది. క్రిమినల్ కేసు పెట్టాలనుకుంది. అతడు చేసిన ఘోరమైన ద్రోహానికి చట్టం అతడిని శిక్షించాలని కోరుకుంది. కాని భావోద్వేగాలు వేరు... చట్టం పని తీరు వేరు. అందుకే లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న, వెళ్లాలనుకున్న స్త్రీలకు, యువతులకు కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను.మీరు ఇది అర్థం చేసుకోండి‘సహజీవనం’ స్త్రీలకు సాధికారత ఇచ్చే సంబంధం అని అనుకుంటారు. ఈ భావన కేవలం అంచనా మాత్రమే అంటాను నేను. ఇది చూడటానికి, పైకి చెప్పుకోవడానికి ఎంపికకూ, స్వేచ్ఛకూ, ఆధునికతకూ తార్కాణం కావచ్చు. కాని ఒకసారి ఏదైనా తేడా జరిగితే నిజమైన కోర్టు గదులలో పరిస్థితి చాలా భిన్నంగా ఎదురవుతుంటుంది. లివ్ ఇన్ రిలేషన్ ఒక్కసారి విచ్ఛిన్నమైనదంటే ఆ సంబంధంలో ఉన్న మహిళకే అధిక నష్టం ఎదురవుతుంది. ఒంటరితనం, బాధ ఆమెను చుట్టుముడతాయి. చట్టపరంగా ఆమెకు దొరికే మద్దతు ఆశించినంతగా ఏమీ ఉండదు. అందుకే లివ్ ఇన్లో ఉన్న... లేదా వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చట్టపరమైన అంశాలుసమ్మతికి ప్రాధాన్యంఇద్దరు వయోజనులు ఒక సంబంధంలో ఉండాలని నిశ్చయించుకుని, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధంలోకి ప్రవేశిస్తే, అప్పుడు విడిపోవడం నేరంగా పరిగణించబడదు.అది లైంగిక నేరంగా మారదులిన్ ఇన్ రిలేషన్ నుంచి పురుషుడు తప్పుకుంటే, ఆ సంబంధాన్ని విడిచిపెట్టినంత మాత్రాన, అప్పటివరకూ పరస్పర అంగీకారంతో సాగిన శారీరక సంబంధం అత్యాచారంగా మారిపోదు.మోసం, వంచనలకు శిక్షఅయితే లివ్ ఇన్ కోసం మొదటినుంచి మోసం, కుయుక్తి లేదా కేవలం సమ్మతి కోసమే పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసినట్లయితే ఈ అంశం చుట్టూ చట్టపరమైన సహాయం భిన్నంగా ఉండవచ్చు. అయితే ఈ విషయం కూడా స్పష్టంగా నిరూపించబడాలి.రక్షణ గురించిసహజీవన సంబంధం తనంతట తాను వివాహానికి ఉండే చట్టపరమైన రక్షణను కల్పించదు. వివాహం స్త్రీకి సామాజిక మద్దతు, చట్టపరమైన హోదాను ఇస్తుంది. నిలదీయదగ్గ, అమలు చేయదగ్గ హక్కులను స్త్రీకి ఇస్తుంది. భర్త విడిపోవాలంటే భార్య ఉమ్మడి ఇంటి నుంచి రక్షణ, భరణం, చట్టపరమైన పరిహారాలు, సామాజికం గా అవసరమైన మద్దతు, పెద్ద మనుషులను కూచోబెట్టి డిమాండ్స్ చేయడం.. ఇవన్నీ సాధ్యమవుతాయి.మరి లివ్ ఇన్లో?లివ్ ఇన్లో కొన్ని సందర్భాల్లో స్త్రీకి చట్టం నుంచి పరిమిత రక్షణ లభించవచ్చు. కానీ అది వివాహం ద్వారా స్త్రీకు వచ్చే రక్షణతో సమానం కాదు. వివాహ స్వభావం కలిగిన కొన్ని జీవన సంబంధాలను చట్టం రక్షించవచ్చు, కానీ ఆ రక్షణ పరిమితమైనది. పెళ్లి నుంచి విడిపోవాలంటే ఎదురయ్యే సహజమైన పరిణామాలు లివ్ ఇన్ వంటి వ్యవస్థలో మనిషి మనిషికి మారిపోతుంటాయి. అందుకే నేను ఏమంటానంటే⇒ అమ్మాయిలకు ‘నీ శరీరం, నీ ఇష్టం’ అని మనం చెప్పినప్పుడు, ‘విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకో’ అని కూడా వారికి చె΄్పాలి ∙చట్టం నినాదాలను కాపాడదు. చట్టం హక్కులను కాపాడుతుంది. హక్కులు కేవలం భావోద్వేగాల వల్ల రావు ⇒ ఇది నీతిసూత్రాల బోధ అనుకోవడం లేదు. నా కేసులలో నేను పదేపదే చూస్తున్న చట్టపరమైన వాస్తవం గురించి చెబుతున్నాను ⇒ ఒక అమ్మాయి సహజీవనం స్వేచ్ఛ అని నమ్మి అందులోకి ప్రవేశించవచ్చు. కానీ ఆ సంబంధం ముగిసినప్పుడు తనకు వివాహంలోలాగా వచ్చే హక్కు, భరణానికి హామీ, స్పష్టమైన సామాజిక భద్రత, నివాస హక్కులు, భావోద్వేగ ద్రోహానికి సులభమైన చట్టపరమైన పరిష్కారం లేదని ఆమె తెలుసుకోవాలి.అందుకే, అనేక సందర్భాల్లో ‘సహజీవనాలు’ స్త్రీయే అధిక ప్రమాదాన్ని భరించాల్సిన ఒక వ్యవస్థగా పరిణమిస్తాయి. ఇటువంటి బంధంలోకి అడుగుపెట్టే ముందు, ప్రతి యువతి తనను తాను ఈ ప్రశ్నలు తప్పక వేసుకోవాలి.⇒ నా చట్టపరమైన హక్కులు ఏమిటి?⇒ ఒకవేళ అతను నన్ను వదిలి వెళ్లిపోతే నాకు లభించే రక్షణ ఏమిటి?⇒ ఆ బంధానికి సంబంధించిన వాగ్దానాలు నెరవేరకపోతే,నాకు లభించే పరిష్కారం ఏమిటి?⇒ ఇంతటి గాఢమైన మానసిక,శారీరక అంకితభావానికి ప్రతి ఫలంగా నేను కచ్చితంగా ఏమి పొందుతున్నాను? -
ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!
ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. అమెరికాలోని ఓవెన్స్ క్రాస్ రోడ్స్కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్ డిన్నర్ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్ వద్ద ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
పంటి సంరక్షణే.. ఆరోగ్యానికి రక్ష..!
పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం. కూల్ వాటర్ తాగుతూ పంటి కిందికి ‘ఐస్’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్కు అంటూ కూల్డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్ దొరకకపోతే పళ్లతోనే బాటిల్ మూతలను ఓపెన్ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్లో బ్రషింగ్కు బదులు బ్రష్ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ బ్యాచ్కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్’టి డ్రింక్స్ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం. టైటానిక్కు ఐస్బర్గ్ లాంటిదే... పంటికి ‘ఐస్’ వాటర్...మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్డ్రింక్ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్ ఫుడ్స్ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోకపోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్ఫుడ్స్తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్గా కూల్డ్రింక్స్ చాలా మాల్స్లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్లో ఐస్ క్యూబ్స్ వేసి మరీ ఇస్తుంటారు. కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్లో దొరికే ‘ఐస్’ఫ్రూట్స్ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్బాక్సింగ్, ఫుట్బాల్ ప్లేయర్స్ తమ పళ్ల రక్షణ కోసం ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్ ముక్కలు... పంటి ఎనామిల్ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్లో పగుళ్లు (క్రాక్స్) వచ్చే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్ ముక్కలతో కూడిన డ్రింక్స్ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్ఫ్రూట్లూ, ఐస్క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్ను నమలకూడదు. అసలు పంటికి ఐస్ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్బాక్సింగ్ వంటి ఆటగాళ్లు ఐస్కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్గార్డ్నే వాడటం మేలు.పళ్లను ఓపెనర్గా వాడటం సరికాదు... పిక్నిక్లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్డ్రింక్స్ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్ను తీసుకెళ్లడం మరచిపోయి, సీసా మూతలు తీయడానికి పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు చిన్న ముక్క ఊడిపోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్నే వాడాలి. షాంపూ షాచేలు చింపాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనీ, స్పోర్ట్స్ డ్రింక్స్ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్ జ్యూసుల్లో, స్పోర్ట్స్ డ్రింక్స్లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్జ్యూస్ల వంటి పుల్లటి పండ్లరసాల్లోనియాసిడ్ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది. పరిష్కారం: చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు.పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... ఏ సీజన్లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్ జ్యూస్లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.పరిష్కారం: పండ్లను ఫ్రూట్జ్యూస్లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.కరకరలాడే చిప్స్తో కిరికిరి... చిప్స్ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్ వంటిని నములుతూ ఉండటం మంచిది. ఇక చిప్స్ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.కాఫ్ సిరప్తోనూ దంతక్షయం...చాలామంది కాఫ్ సిరప్ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో పోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.తప్పుడు బ్రష్షింగ్ సరికాదు... చాలామంది బ్రష్ చేసుకోడానికి నోట్లో బ్రష్ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్ చేయకూడదు. బ్రష్షింగ్ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్ చేసేలా టూత్బ్రష్ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్గా) కదిలిస్తూ బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్ జరుగుతుండేలా బ్రష్ కదలికలు (స్ట్రోక్స్) ఉండాలి. బ్రషింగ్ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడిపోయినప్పుడు బ్రష్ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.ఆ జబ్బుతో పంటికి ముప్పు... కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.ఎంత తక్కువ అయినా ముప్పే... గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్వైన్ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్ డ్రింక్స్తో ΄ోలిస్తే రెడ్వైన్ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్వైన్లో క్రోమోజెన్ ట్యానిన్స్ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్వైన్ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.పరిష్కారం: గోళ్లు కట్ చేసుకోవాలనుకుంటే నెయిల్ కట్టర్నే వాడాలి. టెన్షన్ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి. పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్ హ్యాబిట్... చాలామంది ఏదైనా తినగానే టూత్పిక్స్తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్ చేసుకోవాలి.చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్ ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.‘టీత్’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలుకొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది. ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.పాన్లూ, జర్దా / ఖైనీలు వద్దు... చాలామంది అదేపనిగా పాన్ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం. పరిష్కారం: పాన్ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్పరాగ్లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... సిగరెట్ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్ల (హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్ గమ్స్ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.పెన్సిల్ను కొరకవద్దు... కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్ను గానీ లేదా పెన్ క్యాప్ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్ మధ్యన ఉండే లెడ్ చాలా ప్రమాదకారి. ఈ లెడ్పాయిజన్ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్ పాయిజన్ మేనికి కూడా ప్రమాదకరమే. పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్గమ్ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. చదవండి: మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకుపోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. పరిష్కారం: పంటిని చుట్టుకుపోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.పాల బాటిల్ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్బాటిల్ కేరిస్’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్ చేయించడమూ లేదా బ్రషింగ్కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.- డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ నిర్వహణ యాసీన్ -
మగవారిపై కేన్సర్ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..
దేశవ్యాప్తంగా కేన్సర్ బాధితుల సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. అలాంటి ముప్పును ఎదుర్కుంటున్న వాటిలో అభివృధ్ధి పధంతో ఉన్న నగరాలే ముందుండడం ఆందోళన కరం. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే కేన్సర్ కేంద్రంగా మారనుందని ఓ ప్రతిష్టాత్మక ఆసుపత్రి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే...ప్రమాద ఘంటికలు...ఆ గణాంకాలు...హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో కేన్సర్ కేసులు గణనీయంగా పెరగనున్నాయి. హైదరాబాద్లోని పురుషులలో కనిపించే అన్ని రకాల కేన్సర్లలో ఒక్క ప్రోస్టేట్ రూన్సర్ వాటాయే దాదాపు 6.9 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదవుతున్న కేన్సర్ కేసుల్ని పరిశీలించి చూస్తే, ఈ 2026లో కేవలం పురుషులలోనే 21,252 కొత్త కేన్సర్ కేసులు నమోదవుతాయని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా నమోదు కాబోయే కేన్సర్ కేసుల సంఖ్య 46,762గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో 0 నుంచి 74 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు జీవితకాలంలో కేన్సర్ వచ్చే ముప్పు ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటుందని అంచనా. ఇది ముందుగా కేన్సర్ను గుర్తించే మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను మరింతగా నొక్కి చెబుతోంది.నిర్ధారణ లేకపోతే నివారణ ఎలా?ఇంత తీవ్రంగా వ్యాధి విస్త్రుతి ఉన్నప్పటికీ, కేన్సర్ స్క్రీనింగ్ రేట్ మాత్రం 4 శాతం కంటే దిగువనే ఉండడం ఆందోళనకరం. పెరుగుతున్న కేన్సర్ కేసుల సంఖ్యకు, ముందస్తుగా గుర్తించడంలో ఉన్న పరిమితులకు మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా, చాలా కేసులు వ్యాధి ముదిరిన దశలో నిర్ధారణ అవుతున్నాయి. ఆ దశలలో వచ్చిన రోగులకు చికిత్స ఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. చాలా మంది రోగులు కేన్సర్ 4వ దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. దీని ప్రభావం చికిత్స ఫలితాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది, దేశవ్యాప్తంగా ప్రోస్టేట్ కేన్సర్ ముదిరిన కేసులలో దాదాపు 65 శాతం మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.పొగతాగడం, ప్రాసెస్ తినడం...ఈ కేన్సర్ కేసులు సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం; ఊబకాయం, మధుమేహం, ధూమపానం పెరగటం; కూరగాయల వినియోగం బాగా తగ్గడం వంటివి ఈ న్సర్ విజృంభణకు ముఖ్య కారణాలు. అదే సమయంలో, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మూత్ర ప్రవాహం బలహీనమైన రీతిలో ఉండటం లేదా పెల్విక్ అసౌకర్యం వంటి ప్రోస్టేట్ కేన్సర్ ప్రారంభ లక్షణాలను అవగాహన లోపంతో అలక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటిని వయసుతో పాటు వచ్చే సమస్యలుగా పొరపాటు పడుతుంటారు. ఈ అపోహ వైద్య సహాయం అందుకోవడంలో ఆలస్యానికి దారితీస్తుంది,ప్రారంభంలో గుర్తిస్తే మేలు...‘ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో తీవ్రంగా ఉండదు, అది ప్రాణాంతకంగా మారకముందే దానిని గుర్తించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది,‘ అని జూబ్లీ హిల్స్లోని అపోలో హెల్త్ సిటీ లో మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ గడ్యాల్ పాటిల్ అంటున్నారు. అయితే చాలా మంది మగవారు వ్యాధి లక్షణాలను తరచుగా విస్మరిస్తున్నారనీ, రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవడం లేదని అన్నారాయన. సమస్య తీవ్రమైన తర్వాత హాస్పిటల్ కు వచ్చేసరికి, వ్యాధి ముదిరిపోతోవడం చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోందన్నారు. అందువల్లే ఫలితాలు అంత అనుకూలంగా ఉండడం లేదన్నారు. ‘‘ 50 ఏళ్ల వయసు దాటిన పురుషులు లేదా ప్రమాద కారకాలు కలిగిన వారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం అనే చిన్న ఆలోచన చేస్తే చాలు..అది ఈ పరిస్థితిని గణనీయంగా మార్చగలదు...‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఆవిష్కరణలు కాదు..అవగాహనే ముందుశస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ ఖచ్చితమైన చికిత్సా విధానాలు సహా చికిత్సలలో పురోగతి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, వ్యాధిని చివరి దశలో గుర్తించడాన్ని తగ్గించడంలోనే అసలైన అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశంలో మొత్తం కేన్సర్ మరణాలు దాదాపు 7,05,000కు చేరుకుంటాయని అంచనా వేయగా, రాబోయే దశాబ్దాలలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న అంచనాలతో హైదరాబాద్ నగర ప్రస్తుత పరిస్థితి ఒక సవాలుగా నిలుస్తోంది. ఈ పరిస్థితిని వ్యాధి విస్త్రుతిని నివారించడం అనేది కొత్త వైద్య ఆవిష్కరణలపై కన్నా, ప్రోస్టేట్ స్క్రీనింగ్ను సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చడం, ముందుగానే వైద్య సంప్రదింపులను ప్రోత్సహించడం, తేలికపాటి లక్షణాలను ప్రారంభ సూచనలుగా పరిగణించి చికిత్స అందించడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.(చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
జస్ట్ రెండు నెలల్లో 12 కేజీల బరువు..! నో స్ట్రిక్ట్ డైట్, నో చీట్మీల్స్
బరువు తగ్గడం అనేది కొందరికి సంక్లిష్టమైనది, అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ కొందరికి మాత్రం సాధారణ డైట్తోనే అద్భుతంగా మ్యాజిక్ చేస్తారు. కేవలం నిలకడ, క్రమశిక్షణతో తన ఆహార్యాన్నే మార్చుకుని..స్మార్ట్గా బరువు తగ్గడం ఎలాగో చూపిస్తారు. ఇక్కడ ఇషాన్ కర్దే అలానే బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అదికూడా కేవలం రెండు నెలల్లో ఏకంగా 12 కేజీలు తగ్గాడు. స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వ్యాయామాలు లేవు. ఇషాన్ కర్దే బరువు తగ్గడం అనేది ప్రాథమికంగా నిలకడ, సమతుల్య పోషణ, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. క్రమబద్ధమైన రోజువారీ ఆహారంతో శక్తి స్థాయిలను కాపాడుకుంటూనే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చని వెల్లడించాడు. వివిధ రకాల షార్ట్కట్ డైట్ల వైపుకి పరిగెట్టడం కంటే..సింపుల్గా, ఆరోగ్యప్రదంగా తేలికపాటి వాటితోనే స్మార్ట్గా బరువు తగ్గొచ్చని అంటున్నాడు. తాను నాలుగు పూటలా భోజనాన్ని ఆస్వాదిస్తూనే రెండు నెలల్లో 12 కేజీల దాక బరువు తగ్గానని చెబుతున్నాడు. ఇషాన్ కర్దే తనకు ఉపకరించిన డైట్ప్లాన్ గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నాడు. తాను డైట్ని 90% క్రమం తప్పకుండా పాటించానని, తీరిక లేని రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ ర్యాప్లు/రైస్ బౌల్స్ తీసుకున్నానని చెప్పారు. అయితే చీట్ మీల్స్, చక్కెర, చిప్స్, బిస్కెట్లు వంటివి అస్సలు తీసుకోలేదని వెల్లడించాడు.అల్పాహారంఈషాన్ తన రోజును ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు, 1 స్కూప్ వే ప్రోటీన్తో కూడిన అల్పాహారంతో ప్రారంభించేవాడు. తన భోజనంలో పోషక విలువలను విశ్లేషించి మరి తీసుకునేవాడు. దాని ప్రకారం మొత్తం 35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వులు ఉండేలా కేర్ తీసుకున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచి మధ్యాహ్నాం పూట నీరసించపోకుండా నివారించేవని అన్నారు.మధ్యాహ్న భోజనంఈషాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమానికే కట్టుబడి ఉంటూ, కొవ్వు శాతాన్ని కొద్దిగా పెంచాడు. అతని భోజనంలో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, 2 రోటీలు, తేలికపాటి గ్రేవీ, సలాడ్లు ఉన్నాయి. ఈ భోజనం నుంచి 50 గ్రాముల ప్రోటీన్, 45 నుంచి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 12 గ్రాముల కొవ్వు అందుతుంది.సాయంత్రం స్నాక్స్..అతను సాయంత్రం ఒక పండు, గుప్పెడు నట్స్, 5 గుడ్డు తెల్లసొన తీసుకునేవాడట. ఇలా తింటే 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభిస్తాయి.రాత్రి భోజనంరోజులో చివరి భోజనంగా, ఈషాన్ తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నాడు. అతను 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ తీసుకున్నాడు, దీనిలో 45 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. అంతేగాదు బరువు తగ్గేందుకు ఎల్లప్పుడూ కష్టతరమైన ఆహారనియమాలు, తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని ఈషాన్ వెయిట్లాస్ జర్నీ రుజువు చేస్తోంది. పైగా ఒక సాధారణ దినచర్యను క్రమంతప్పకుండా పాటించడం అనేది అత్యంత కీలకమని నొక్కి చెబుతోంది కూడా. View this post on Instagram A post shared by Eshaan Karde (@eshaankarde)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?!
మొబైల్, లేదా బుల్లితెర వ్యసనం (స్క్రీన్ అడిక్షన్) మీ మెదడును కుంచించుకుపోయేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా, పబ్జీ గేమ్ వ్యసనానికి గురై, తిరిగి బయటకు వచ్చిన ఒక యువకుడి స్ఫూర్తిగాధ మీకోసంస్క్రీన్ అడిక్షన్ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఆయుర్వేద సూచనలు"నేను 24 గంటలు నిరంతరాయంగా పబ్జీ గేమ్ ఆడేవాడిని. కాలేజీ చదువున మధ్యలో వదిలేశాను. ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని," అని 25 ఏళ్ల చెన్నారెడ్డి చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన పగలు సౌరశక్తి టెక్నీషియన్గా పని చేస్తూ, యోగా బోధిస్తున్నాడు. మరి ఆయనలో మార్పు ఎలా వచ్చింది?స్టాన్ఫర్డ్ లైఫ్స్టైల్ మెడిసిన్ చేసిన పరిశోధన ప్రకారం, రోజుకు రెండు గంటలకుపైగా కాలక్షేపం కోసం మొబైల్ చూసే 18–25 ఏళ్ల వయస్సు గల వ్యక్తుల్లో మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ మందం తగ్గిపోతుంది. మెదడులోని ఈ భాగం నిర్ణయాలు తీసుకోవడం, జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారం వంటి ముఖ్యమైన పనులకు బాధ్యత వహిస్తుందని మనం గుర్తించాలి.రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువ స్క్రీన్ ముందు గడిపే పెద్దవారికి చిత్తభ్రమ, పక్షవాతం, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్ఫోన్ వ్యసనం మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది—ఇది కదలికల నుంచి భావోద్వేగాల వరకు అన్నింటిని నియంత్రిస్తుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అణచి, సహజ నిద్ర చక్రాన్ని దెబ్బతీస్తుంది.ఇది మనసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది - ఆందోళన, నిరాశ, నలుగురితో కలవకపోవటం వంటివి పెరుగుతాయి. డా. మణికంటన్ చెప్పినట్లుగా, “ఇప్పుడైనా ఒక అడుగు వెనక్కి వేసి, మన స్క్రీన్ అలవాట్లను నిజాయితీగా పరిశీలించాల్సిన సమయం వచ్చింది.”స్క్రీన్ అలవాటును తగ్గించడానికి ఆయుర్వేద సూచనలుస్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉందని గుర్తించినవారికి డా. మణికంటన్ కొన్ని ప్రాయోగిక సూచనలు అందిస్తున్నారు:మీ ఇంట్లో కొన్ని ప్రాంతాలను బుల్లితెరకు, ఫోన్లకు నిషేధిత ప్రాంతాలుగా ఏర్పరచండి: ఇంట్లో భోజనపు టేబుల్, పడకగది వంటి ప్రదేశాలలో ఇవి లేకుండా చేయటం అనేది మన మనస్సును వర్తమానంలోకి తెస్తుంది.ఫోన్ లేదా టీవీ ఎంతసేపు చూడాలనే టైమ్ టేబుల్ ముందే వేసుకోండి: అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించండి. ఇది అలవాటుపై నియంత్రణ పెంచుతుంది.ఎంతసేపు వాటిని వినియోగిస్తున్నారనేది గమనించుకోండి: దానికోసం మొబైల్లోనే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఎంతసేపు ఉపయోగిస్తున్నారో గమనించండి. ఇది మార్పుకు ప్రేరణ ఇస్తుంది.సరైన శ్వాసకు గల శక్తి: కేవలం గాలి పీల్చుకోవటం కాదు, ప్రాణశక్తిని పెంపొందించుకోవటంచెన్నా రెడ్డి కథ, స్క్రీన్ వ్యసనంలో చిక్కుకున్న యువతకు ఆశ చూపుతుంది. 24 గంటల పాటు గేమింగ్, కోపం, చదువు మధ్యలో ఆగిపోవడం—ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2023 జనవరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించే యువనాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చేరాడు.అక్కడ ఆయన సుదర్శన్ క్రియ అనే శక్తివంతమైన శ్వాసక్రియ సాధన నేర్చుకున్నాడు. ఈ సాధనాన్ని ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, మానవతా నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ పరిచయం చేశారు. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించి, మనస్సులోని పాత అలవాట్లను విడిపిస్తుంది.కొద్ది రోజుల్లోనే చెన్నా రెడ్డి కోపం తగ్గిపోయింది, స్క్రీన్పై ఉన్న ఆకర్షణ క్రమంగా తగ్గింది, మనస్సులో ప్రశాంతత ఏర్పడింది. తరువాత ఆయన తన చదువును 70% మార్కులతో పూర్తి చేసి, యోగా ఉపాధ్యాయుడిగా మారి, సౌరశక్తి రంగంలో కెరీర్ నిర్మించుకున్నాడు.అధికంగా స్క్రీన్ వినియోగిస్తే, దాని ఫలితంగా చాలా సార్లు ఒత్తిడి లేదా ఆందోళన కలుగుతాయి. సుదర్శన క్రియ మన నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది డోపమైన్ ఆధారిత అలవాట్లను కూడా నియంత్రిస్తుంది. స్క్రీన్ వ్యసనం కూడా ఇతర వ్యసనాల్లాగే ఉంటుంది; ఈ సాధన వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.ఆయుర్వేద సహాయంనస్య చికిత్స: ముక్కులో ఔషధ తైలాన్ని వేసే విధానం. ఉదయం కొన్ని చుక్కలు ‘అణు తైలం’ ఉపయోగించడం మెదడుకు పోషణనిచ్చి, డిజిటల్ అలసటను తగ్గిస్తుంది.మేధ్య రసాయన: బ్రాహ్మి, అశ్వగంధ, శంఖపుష్పి వంటి మూలికలతో చేసిన ఈ ఔషధం ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.జీవనశైలిలో మార్పులుప్రతి ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయండి.స్క్రీన్కు బదులుగా పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పెయింటింగ్, నడక, ఇరుగుపొరుగువారితో మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి.ఇవి మెదడుకు సహజ ఆనందాన్ని ఇస్తాయి. క్రమంగా స్క్రీన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.డా. నిషా మణికంటన్, BAMS, MD (AM)ఆయుర్వేద వైద్యురాలు రచయిత సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంతర్జాతీయ డైరెక్టర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్(చదవండి: -
ఆమె జీవితం..ఆమె ఇష్టం
మీరట్లో ఒక రిటైర్డ్ జడ్జి విడాకులు పొందిన తన కుమార్తెను మేళతాళాలతో ఇంటికి తీసుకువచ్చి అదే తన తీర్పు అన్నాడు. ‘ఐ లవ్ మై డాటర్’ టీ షర్ట్లు ధరించి బంధువులంతా ఆమెను స్వాగతించారు. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తన కంటే 20 ఏళ్లు ఎక్కువ వయసున్న భర్తతో వేగలేకపోతున్న భార్యను విడాకులకు ముందే తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండే తీర్పును వెలువరించింది. వివాహం ఎంతో బాధ్యతతో నిర్వహించాల్సిన బంధం. పురుషుల వ్యవహారశైలిలో మార్పును ఈ రెండు తీర్పులు సూచిస్తున్నాయి.‘వివాహ బంధంలో మా అమ్మాయి ఇబ్బంది పడుతోంది. అది సరయ్యే మార్గం లేదు. ఆమెను బయటకు తేవడమే ఉత్తమం అని భావించాను. అదే నా తీర్పు’ అన్నారు మీరట్కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ. శనివారం (ఏప్రిల్ 4న) ఆయన కుమార్తె ప్రణిత వశిష్టకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి ఇంటికి ఆయన తన కూతురుని బ్యాండ్ బాజాలతో, పూలహారాలతో, స్వీట్స్తో ఊరేగింపుగా తీసుకొని వచ్చాడు. బంధువులు అందుకు తోడు నిలిచారు. వీరంతా నల్లటి టీషర్టులు ధరించారు. ఆ టీషర్ట్ల పై ‘ఐ లవ్ మై డాటర్’ అనే నినాదం ఉంది. సమాజానికి విడాకులంటే చిన్న చూపు పోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి తెలియచేశాడు.2018లో వివాహంజ్ఞానేంద్ర కుమార్ శర్మ తన కుమార్తె ప్రణిత వివాహాన్ని 2018లో షాజహాన్పూర్కు చెందిన ఒక ఆర్మీ మేజర్తో జరిపించారు. అయితే పెళ్లయిన నాటి నుంచి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడు. ఒక బిడ్డ జన్మించినా అతని వైఖరిలోమార్పు లేదు. తండ్రిగా ఇదంతా చూసి ఆమెకు ధైర్యమివ్వడానికి తోడు నిలిచాడు జ్ఞానేంద్ర కుమార్ శర్మ. ‘కుమార్తె బాధలో ఉంటే దాని నుంచి బయట పడేసే బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. ఆమె గౌరవాన్ని కాపాడటం ముఖ్యం. ఏ కుమార్తే, తన తల్లిదండ్రులకు బరువు కాదు’ అన్నాడాయన. ప్రణిత పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక సంస్థలో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పని చేస్తోంది. ‘మేము భరణం ఆశించలేదు. మాకు వద్దు కూడా’ అన్నారు ఆ తండ్రీ కూతుళ్లు. ‘ఇన్నాళ్లు అత్తగారింటిలో నేను మానసికంగా బలహీనపడుతూ వచ్చాను. దీనికి ముగింపు పలకాలనుకున్నాను. నేను చెప్పేది ఒకటే.... కష్టాలను సహిస్తూ కూచోవద్దు. పరిష్కారం వెతకండి’ అంది ప్రణిత. కళ్లకు కనపడుతున్న ఇలాంటి తీర్పులను చూసి వివాహ వ్యవస్థ లోటుపాట్లను తల్లిదండ్రులు, భార్యాభర్తలు మరింతా మెరుగ్గా సరి చేసుకోవాలి. ఎవరి బాధ్యతలు, హక్కులు వారు తెలుసుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. నచ్చిన వ్యక్తితో ఉండొచ్చుమధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియెర్ బెంచ్ ఏప్రిల్ 2న ఇచ్చిన మరో తీర్పు కూడా స్త్రీ నిర్ణయానికి వత్తాసు పలికింది. 40 ఏళ్ల వయసు కలిగిన భర్త తన భార్య కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా అతని 19 ఏళ్ల భార్య కోర్టు ముందు ప్రత్యక్షమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తన సమ్మతం ప్రకారమే మరో వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయానని ఆమె కోర్టుకు తెలిపింది. కోర్టులో భర్త, అత్తామామలు, తల్లిదండ్రుల ఎదుట తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది. దాని ప్రకారం 19 ఏళ్ల వయసున్న తనకు రెట్టింపు వయసున్న భర్తతో జీవించాలని లేదని, ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా భర్త వినక బాధిస్తున్నాడనీ, ఇంటి నుంచి పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు బలవంతంగా మళ్లీ అతని వద్దకే పంపుతున్నారనీ, ఈ నేపథ్యంలో తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోవాలన్నది ఆమె అభ్యర్థన. ఈ వేడుకోలు విన్న కోర్టు ఇప్పటి వివాహంలో ఇంకా విడాకులు జరక్కపోయినా ఆమెను తనకు నచ్చిన వ్యక్తితో ఉండవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. అంతే కాదు ఆమెకు నచ్చిన కుర్రాడిని పిలిచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంది. విడాకులయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని, అంతవరకుగాని ఆ తర్వాత గాని ఆమెను ఏ విధంగానూ బాధించనని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కోర్టు ఆరునెలల పాటు ‘శౌర్య దీదీ’ పరిశీలనలో ఉండాలని ఆమెను ఆదేశించింది. కోర్టు నియమించిన మహిళా అడ్వకేట్ ఆమెతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ ఆరు నెలల పాటు ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ ఏదైనా సహాయం కావాలంటే చట్టపరంగా తక్షణం అందిస్తారు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘శౌర్య దీదీ’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ. -
తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!
మన దేశంలో తయారైన మొట్టమొదటి కారు ఎలా ఉంది.. అసలు మనిషి మొదటగా ఉపయోగించిన రవాణాసాధనం ఎలా ఉండేది.. ఎడ్ల బండి నుంచి ఏరోప్లేన్ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణాసాధనాలన్నింటినీ ఒకే చోట చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేయాలని.. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వేసవిలో ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ కు వెళ్లడం ఓ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.ఢిల్లీ నుంచి సోహ్నా–గుర్గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా దాదాపు 63 కిలోమీటరు ప్రయాణిస్తే .... హర్యానా రాష్ట్రం, బిలాస్పూర్ చౌక్, టారు రోడ్లో ఉంది ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల ఇదే!దాదాపు 90 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియమ్, షాప్లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి. రూపకర్త ఎవరు అంటే.. ఢిల్లీ నివాసి తరుణ్ థక్కర్కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. ఆసక్తి, ఉత్సాహం, శోధన నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్కిర్ విషయంలోనూ జరిగింది. గ్రామోఫోన్ల నుంచి టేబుల్ ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా 2013లో ఈ చారిత్రాత్మక వాహన శాల ఏర్పాటైంది. సినిమా సన్నివేశాలకు వీలుగా!భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో పాత కార్లనూ వీక్షించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్కూడా ఏర్పాటు చేశారు.బస్సుల పాత్ర ఎంతో..మానవ ప్రగతికి బస్సు చక్రం ఎలా ఉపయోగపడిందో తెలియజెప్పవచ్చు. పెద్ద పెద్ద వాహనపరికరాలు గల బస్ డిపోతో పాటు, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... అందుకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీని సందర్శించవచ్చు. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. మేఘాలలో తేలిపోమ్మన్నది..సైకిల్, స్కూటర్, మోటార్సైకిల్, మోపెడ్స్... ఒకనాడు సింగిల్గానూ, కపుల్గానూ ప్రయాణించిన ద్విచక్రవాహనాలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్ద వాహనాలను పోలిన బొమ్మలూ ఇక్కడ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ ఈ మ్యూజియమ్లో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీటిని చూస్తుంటే పెద్దవాళ్లు తమ చిన్ననాటి రోజుల జ్ఞాపకాల్లో వెళ్లకుండా ఉండలేరు.ఆకాశయానంఎప్పటి నుంచి విమానమార్గంలో మన దేశస్తులు ప్రయాణించారు.. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందింది... దశలవారీగా తెలియజెప్పే విశేషాలన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. మన దేశ విమాయానపరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ ఒక చక్కని వేదిక. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న విమానాన్నీ ఇక్కడ చూడవచ్చు.రైలు.. టికెట్లు..రైలు రవాణా మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది, నాటి నుంచి నేటి వరకు రైలు మార్గంలో, రైలు తయారీలో వచ్చిన మార్పులు. మొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎంత సమయం పట్టింది? వివరాలతోపాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ΄ఫ్లాట్ఫామ్ నమూనా, సెలూన్ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి రైలుబండి ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, రైల్వే సిగ్నల్స్, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.నీటిపైన తేలియాడే...మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర తెలుసుకునే మహత్తర అవకాశంగా ఈ మ్యూజియమ్ను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమం ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియమ్ మన కళ్లకు కడుతుంది.ఎక్కడ ఉందంటే...బిలాస్పూర్ – తౌరు రోడ్, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ 132 ఆఫ్ ఎన్.హెచ్ 8, బిలాస్పూర్, చౌక్, తౌరు, హర్యానాసందర్శన సమయంఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు (సోమవారం సెలవు) టికెట్ ధర: పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.250, ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది. (చదవండి: 'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!) -
వయస్సుతో పాటు పెరగాల్సిన పరిపక్వత
చాలామంది వయసు పెరుగుతుంటే భయపడతారు, సౌందర్యం తగ్గుతుందని బాధపడతారు. కానీ సైకాలజీ ప్రకారం, వయసు పెరగడం అంటే కేవలం చర్మం ముడతలు పడటం కాదు, అది మీ'పరిపక్వత' (Maturity)శిఖరాగ్రానికి చేరడం.వయసుతో పాటు మీ వ్యక్తిత్వం ఎలా ఒక 'వటవృక్షం'లా మారాలో ఈ ఆర్టికల్లో చూద్దాం.వయసు పెరగడం అనేది ఒక 'బయోలాజికల్ ప్రాసెస్' అయితే, పరిపక్వత చెందడం అనేది ఒక 'సైకలాజికల్ ఛాయిస్'. కొంతమంది 60 ఏళ్లొచ్చినా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు, మరికొంతమంది 30 ఏళ్లకే ఎంతో నిలకడగా ఉంటారు. "Aging Gracefully" అంటే వయసును దాచడం కాదు, ప్రతి ఏటా మీ అనుభవంతో మీ వ్యక్తిత్వానికి కొత్త గౌరవాన్ని అద్దుకోవడం.ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం (Integrity vs Despair)ప్రముఖ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం, వయసు పైబడినప్పుడు మనిషి మనసులో రెండు భావాలు ఉంటాయి:Despair (నిరాశ): "నా జీవితం వృథా అయిపోయింది, నేను ఏమీ సాధించలేదు" అని బాధపడటం.Integrity (పరిపూర్ణత): "నేను నా జీవితాన్ని అర్థవంతంగా గడిపాను, నా తప్పుల నుండి నేర్చుకున్నాను" అని తృప్తి చెందడం.మీరు'Integrity'స్టేజ్ లో ఉండాలంటే, మీ గతాన్ని మీరు ప్రేమించాలి, మీ వర్తమానాన్ని గౌరవించాలి.పరిపక్వత లక్షణాలు (Signs of Maturity)వయసుతో పాటు మీ పర్సనాలిటీలో ఈ మార్పులు రావాలి:Emotional Regulation:చిన్న చిన్న విషయాలకు ఆవేశపడటం తగ్గి, నిశ్శబ్దంగా గమనించే తత్వం పెరుగుతుంది.Detachment (నిర్లిప్తత):ప్రతి విషయంలోనూ తలదూర్చకుండా, ఏది ముఖ్యం ఏది కాదు అనే విచక్షణ జ్ఞానం వస్తుంది.Forgiveness:పాత పగలను, కోపాలను మోయడం ఆపేస్తారు. క్షమించడం అనేది ఎదుటివారి కోసం కాదు, మీ ప్రశాంతత కోసం అని అర్థం చేసుకుంటారు.మోటివేషన్ మాయ vs గ్రేస్ఫుల్ ఏజింగ్"ఎప్పుడూ యంగ్ గా కనిపించు, ముసలితనాన్ని దరిచేరనివ్వకు" అనిమోటివేషన్ మార్కెటింగ్ మాయలో పడేస్తుంది. ఇది మిమ్మల్ని మీ సహజత్వం నుండి దూరం చేస్తుంది. కానీ సైకాలజీ "నీ వయసును గౌరవించు. నీ ముడతలు నువ్వు గెలిచిన యుద్ధాలకు గుర్తులు. నీ జుట్టు రంగు నీ అనుభవానికి సాక్ష్యం" అని చెప్తుంది.వయసుతో పాటు వన్నె తగ్గకుండా..Genius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, గ్రేస్ఫుల్ గా ఎదిగే మార్గం ఇది:Step 1: యవ్వనం పట్ల వ్యామోహాన్ని వదిలేయండి"నేను ముసలివాడిని అయిపోతున్నాను" అనే భయాన్ని 'Break' చేయండి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. మీ మనసు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే (Lifelong Learning), మీరు ఎప్పటికీ యంగ్ గానే ఉంటారు. మీ ఆలోచనల్లోని ముసలితనాన్ని వదిలేయండి.Step 2: Build Knowledge Sharingమీరు ఇన్నాళ్లు సంపాదించిన అనుభవాన్ని 'Build' చేయండి. దాన్ని తర్వాతి తరానికి ఎలా అందించాలో ప్లాన్ చేయండి. మీ పిల్లలకు లేదా మీ శిష్యులకు మీరు ఒక 'రోల్ మోడల్'గా నిలవాలి. మీ పరిపక్వతే మీ చుట్టూ ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వాలి.Step 3: Spiritual Maturityశరీరం బలహీనపడుతున్నా, ఆత్మ బలంగా ఉండాలి. మరణాన్ని చూసి భయపడకుండా, ఒక అద్భుతమైన లెగసీని వదిలి వెళ్తున్నాననే తృప్తితో ఉండటమే 'Beyond' స్టేజ్. మీరు లేకపోయినా మీ సంస్కారం పదికాలాల పాటు ఉండాలి.మీరు ఎలా ఎదుగుతున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. గడిచిన పదేళ్లలో మీ ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు ఏంటి? మీరు ఇంకా పాత కోపాలను మోస్తున్నారా?2. మీ కంటే చిన్నవారు మీ దగ్గరకు సలహా కోసం వస్తున్నారా?3. మీరు వయసును చూసి భయపడుతున్నారా లేక గర్వపడుతున్నారా?పాతబడే కొద్దీ విలువ పెరగాలి!పాతబడే కొద్దీ విలువ తగ్గేది వస్తువులకి మాత్రమే, మనుషులకి కాదు. ఒక పాత పుస్తకం లేదా ఒక పాత వైన్ లాగా మీ విలువ కాలంతో పాటు పెరగాలి. మీ పరిపక్వతే మీ సౌందర్యం. మీ నవ్వులో ఉండే ఆ నిశ్శబ్ద సత్యమే మీ పర్సనాలిటీకి అసలైన లెగసీ."Grow old along with me! The best is yet to be."• Robert Browningసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
ప్రోస్టేట్ కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశాకిరణం
ఒక వ్యక్తికి ప్రోస్టేట్ కేన్సర్ వ్యాపించిందని చెప్పినప్పుడు, అతని మొదటి ప్రశ్న సాధారణంగా సమయం గురించి ఉంటుంది. “నేను ఇంకా ఎంతకాలం జీవిస్తాను?” అనేది. ఇన్నేళ్లుగా, అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ చికిత్స ప్రధానంగా జీవన కాలాన్ని ఎంతవరకు పెంచగలదో అనే కోణంలో చర్చించలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ సంభాషణ విస్తరించింది, ఆశాజనకంగా మారింది. ఇప్పుడులక్ష్యం కేవలం జీవితం పొడిగించడం మాత్రమే కాదు, ఆ సమయంలో శక్తి, స్వతంత్రత, రోజువారీ జీవనవిధానాన్ని కాపాడడం కూడా.భారతదేశంలో ప్రోస్టేట్ కేన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 37,948 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో గణనీయమైన శాతం కేసులు అధునాతన దశలోనే గుర్తించబడుతున్నాయి, అంటే కేన్సర్ ఇప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి ఉంటుంది. కాలక్రమేణా, చాలామందిలో “కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్” అభివృద్ధి చెందుతుంది, అంటే సాధారణ హార్మోన్ చికిత్సకు స్పందించకుండా వ్యాధి ముందుకు సాగుతుంది.ప్రోస్టేట్ కేన్సర్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కేన్సర్ కణాలు ప్రధానంగా టెస్టోస్టెరోన్ అనే పురుష హార్మోన్పై ఆధారపడి పెరుగుతాయి. అందుకే, ఆండ్రోజెన్ డిప్రైవేషన్ థెరపీ (ADT) — అంటే శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిని తగ్గించే చికిత్స — ఇప్పటివరకు ప్రధాన చికిత్సగా ఉపయోగించబడింది. ఇది కేన్సర్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, లక్షణాలను నియంత్రిస్తుంది.అయితే, కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ స్థాయులు తగ్గినా కూడా కేన్సర్ కణాలు “ఆండ్రోజెన్ రిసెప్టర్పాథ్వే”ను సక్రియం చేసి పెరుగుతూనే ఉంటాయి. ఆండ్రోజెన్ రిసెప్టర్ అనేది కణంలో ఉండే ఒక ప్రోటీన్, ఇది హార్మోన్ సంకేతాలను స్వీకరించి కణానికి పెరగమని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాధి కొనసాగితే దాన్ని కాస్ట్రేషన్ రెసిస్టెంట్ ప్రోస్టేట్ కేన్సర్ అంటారు.గత దశాబ్దంలో చికిత్సలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం హార్మోన్ స్థాయులనుతగ్గించడం కాకుండా, ఇప్పుడు “ఆండ్రోజెన్ రిసెప్టర్ పాథ్వే ఇన్హిబిటర్స్” అనే కొత్త ఔషధాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేన్సర్ కణాల్లో జరిగే పెరుగుదల సంకేతాలను నేరుగా అడ్డుకుంటాయి. ఇవిADT తో కలిపి ఉపయోగించినప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెటాస్టాటిక్ హార్మోన్ సెన్సిటివ్ ప్రోస్టేట్ కేన్సర్ పై నిర్వహించిన క్లినికల్ అధ్యయనాలు చూపుతున్నాయి.ఈ రెండు చికిత్సల కలయిక వ్యాధి పురోగతిని గణనీయంగా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా, కాస్ట్రేషన్ రెసిస్టెంట్ దశకు చేరే సమయాన్ని కూడా వాయిదా వేస్తుంది. ముఖ్యంగా ఎముకలకు వ్యాపించినప్పుడు వచ్చే నొప్పి కూడా ఆలస్యంగా వస్తుంది.ఇవి చాలా ముఖ్యమైన ఫలితాలు. ఎందుకంటే వ్యాధి పురోగతిని ఆలస్యం చేయడం అంటే లక్షణాలను నియంత్రిస్తూ, రోజువారీ జీవనాన్ని సజావుగా కొనసాగించే సమయం ఎక్కువగా లభించడం. చాలామందికి ఇది చలనశీలతను కాపాడుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, సాధారణ కార్యకలాపాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.ఈ కొత్త చికిత్సల మరొక ముఖ్యమైన అంశం వాటి సహన శక్తి (tolerability). అధునాతన కేన్సర్చికిత్సలో తరచుగా కనిపించే అలసట వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న రోగులకు, ముఖ్యంగా డయాబెటిస్ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, ఈ సమతుల్యత చాలా ముఖ్యం. కెమోథెరపీ అవసరం లేకుండా మంచి ఫలితాలను ఇస్తున్న ఈ కలయిక చికిత్సలు, తీవ్రమైన చికిత్సలకు అనుకూలం కానీ రోగులకు ఒక మంచి ప్రత్యామ్నాయం.భారతదేశం గ్లోబల్ క్లినికల్ రీసెర్చ్లో పాల్గొనడం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ పరిశోధనల్లో భారతీయ రోగుల భాగస్వామ్యం, చికిత్సల ప్రభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతోంది. ప్రాక్టీస్లో ఆధారిత చికిత్సలను అమలు చేయడానికి దోహదం చేస్తోంది.అధునాతన ప్రోస్టేట్ కేన్సర్ ఒక తీవ్రమైన నిర్ధారణ అయినప్పటికీ, ఇప్పుడు దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చికిత్స లక్ష్యం—రోజువారీ జీవనంపై కనిష్ట ప్రభావంతో వ్యాధిని నియంత్రించడం. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబాల కోసం, వైద్యుడితో సమాచార ఆధారిత, ముందస్తు చర్చ చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న చికిత్సలను అర్థం చేసుకోవడంద్వారా, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సను రూపొందించుకోవచ్చు. చికిత్స క్లినికల్ ఆధారాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలకు అనుసంధానమైనప్పుడు, జీవితం కేవలం పొడిగించడమే కాకుండా, దాన్ని మెరుగైన విధంగా గడపడం కూడా సాధ్యమవుతుంది.డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్రెనోవా సౌమ్య కేన్సర్ సెంటర్, కర్కాణా, హైదరాబాద్(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..) -
ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్గానా..
20, 30 లేదా 40 ఏళ్ల వయసులో ఉండి వ్యాయామం చేయాలంటే రకరకాల సాకులు చెబుతూ స్కిప్ చేస్తుంటారు. కొన్ని రోజులు మొక్కుబడిగా చేసి..మళ్లీ యథావిధిగా మానేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ 90 ఏళ్ల వృద్ధుడిని చూస్తే కచ్చితంగా కనువిప్పి కలుగుతుంది, దృక్పథం కూడా మార్చుకోవచ్చని చెబుతున్నారు ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్. తేలికపాటి వ్యాయామాలు చేసే వయసులో యువకులకు పోటీ ఇచ్చేలా ఆయన చేసే స్ట్రెంగ్త్ వ్యాయామాలు చూస్తే కచ్చితంగా విస్తుపోతారు. ఇంతకీ ఎవరా తాతగారు..?, అతని ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.ఆ తాతగారి వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ అయిన జెన్నిఫర్ మార్టిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో చాలామంది మంచం నుంచి లేవడానికి ఇబ్బంది పడే తొమ్మిది పదుల వయసులో స్వతంత్రంగా బతకాలనే ఆశయం, కఠోర శ్రమ ఫలితమే అతడి స్ట్రాంగ్ ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోందామె. ఆమె వయసు పైబడటం సమస్య కాదని అంటోంది, బలం కోల్పోవడమే సమస్య. దీర్ఘాయువుకి కండరాలే కీలకం. ఆ విషయంలోనే ఈ తాతాగారు చాలా కేర్ఫుల్గా ఉంటారు. సవంత్సరాల తరబడి చేసిని నిరంతర వర్కౌట్లు..ఆయన్ని ఇంతలా బలంగా ఫిట్గా ఉండేలా చేశాయి. నిజానికి ఆయనకు 90 ఏళ్లు అంటే ఎవ్వరు నమ్మలేరు.పైగా ఆయన ఫిట్నెస్ దినచర్యలో ఏ యువకుడికైన గట్టి పోటీ ఇచ్చేలా చేయగలరు కూడా. ఆయన ఒంటరిగానే జిమ్కి వెళ్తారని, వారంలో మూడు రోజులు జిమ్కి కేటాయిస్తారని చెబుతోంది. ఆయన ఫుల్లింగ్ వ్యాయామాల దగ్గర నుంచి ట్రెడ్మిల్పై పరుగెత్తడం, క్లైంబింగ్ వర్కౌట్లను ఆస్వాదించడం వరకు అన్నింటిని చేస్తారు. మెషీన్లు, డంబెల్స్ను ఉపయోగించి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటివి కూడా చేస్తారాయన. ఈ వ్యాయామ దినచర్య కేవలం దీర్ఘాయువు కోసం కాదని, తుంటి మార్పిడి శస్త్ర చికిత్స నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడిందని చెప్పుకొచ్చింది. శస్త్రచికిత్సకు ముందే ఆ వ్యక్తి శారీరకంగా చురుకుగా ఉంటూ, వ్యాయామం చేస్తుండటం వల్ల, ఇతర రోగుల కంటే వేగంగా కోలుకోగలిగారని చెప్పుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆయన వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను చూసి..ఆ వయసుల పట్టుదలను అభినందించడమే గాక..ఇది నిజంగా అద్భుతం అని కొనియాడారు. View this post on Instagram A post shared by JEN | Personal Trainer | Functional Movement & Longevity (@jennifermartinnn) (చదవండి: నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!) -
వైరాగ్యం ఆధ్యాత్మికతకు ఆసరా
ఆధ్యాత్మిక పథంలో పయనించే ప్రతి సాధకుడికి ‘వైరాగ్యం’ అనేది ఒక బలమైన పునాది. సాధారణంగా లోకంలో వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం అని పొరబడుతుంటారు. కానీ, నిజమైన వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, వస్తువుల పట్ల ఉన్న ‘మమకారాన్ని’ లేదా ‘ఆసక్తిని’ వదలడం. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు, కానీ పెద్దయ్యాక వాటిని వదిలేస్తాడు. అది బొమ్మల మీద కోపంతో కాదు, వాటికంటే విలువైనది ఏదో తెలిసిందనే అవగాహనతో. ఆధ్యాత్మిక వైరాగ్యం కూడా అటువంటిదే.వైరాగ్యం అంటే ‘రాగ రహిత స్థితి’. మనసు దేనినైనా చూసి ఆకర్షింపబడితే దానిని ‘రాగం’ అంటారు. ఆ ఆకర్షణ వల్ల కలిగే బంధం నుండి మనసును విముక్తం చేయడమే వైరాగ్యం. ఇది విరక్తి కాదు, ఒక రకమైన పరిణతి. ఇంద్రియ విషయాల నుండి మనసును మళ్ళించడానికి చేసే ప్రాథమిక ప్రయత్నం (యతమాన సంజ్ఞ ), కొన్ని విషయాల మీద నియంత్రణ సాధించి, కొన్నింటిపై ఇంకా పట్టు కోల్పోని స్థితి (వ్యతిరేక సంజ్ఞ), బాహ్యంగా కోరికలు లేకపోయినా, మనసులో మాత్రం సూక్ష్మంగా ఆ కోరికలు మిగిలి ఉండటం(ఏకేంద్రియ సంజ్ఞ). ఇక నాలుగోది ‘వశీకార సంజ్ఞ’ అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఏ బాహ్య వస్తువూ మనసును చలింపజేయదు.సంస్కృతంలో ‘రాగ’ అంటే రంగు లేదా ఆకర్షణ అని అర్థం. ‘వైరాగ్య’ అంటే ఆ ఆకర్షణ లేని స్థితి. నీటిలో ఉన్నా కూడా తామర ఆకుకు నీరు అంటనట్లుగా, సంసారంలో ఉంటూనే దేనికీ అతిగా బందీ కాకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా వైరాగ్యాన్ని రెండు స్థాయులలో చూడవచ్చు. ప్రాపంచిక విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని చూసి లేదా భయం వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యం (ఉదాహరణ – శ్మశాన వైరాగ్యం). ఇది ఎక్కువ కాలం నిలవదు. పర వైరాగ్యం అత్యున్నతమైనది. ఆత్మజ్ఞానం వల్ల, సత్యాన్ని గ్రహించడం వల్ల కలిగే స్థిరమైన స్థితి. ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతం కాదని గ్రహించినప్పుడు ఇది కలుగుతుంది.వైరాగ్యం సిద్ధించాలంటే రెండు ముఖ్యమైన పద్ధతులు అవసరమని భగవద్గీత చెబుతోంది. ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఏది నిత్యం (శాశ్వతం), ఏది అనిత్యం (తాత్కాలికం) అని వేరు చేసి చూసే తెలివితేటలు. మనసుని పదే పదే ప్రాపంచిక కోరికల నుండి మళ్ళించి, అంతరాత్మ వైపు తిప్పుకోవడం. దేని మీద ఆశ లేనప్పుడు, అది దక్కలేదనే మానసిక ప్రశాంతత, కోల్పోతామనే భయం లేకపోవడం వైరాగ్యం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.వైరాగ్యం అనేది ఒక మందు వంటిది. అది సంసార వ్యాధిని నయం చేసి, మనిషిని తన నిజ స్వరూపమైన ఆనందం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని త్యజించడం వైరాగ్యం కాదు, జీవితాన్ని సరైన దృక్పథంతో దర్శించడమే నిజమైన వైరాగ్యం. జీవితం పట్ల సరైన అవగాహన. ఒక పక్షి పండును తింటున్నప్పుడు ఆ రుచికి బానిస కావచ్చు. కానీ మరొక పక్షి అదే చెట్టు మీద ఉండి, పండును తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఈ ‘సాక్షి భూత’ స్థితిలో ఉండటమే వైరాగ్యానికి సంకేతం. భగవద్గీత ప్రకారం వైరాగ్యం అంటే పనులను వదలడం కాదు, ఫలాపేక్షను వదలడం. వైరాగ్యం వల్ల మనిషికి నిర్భయత్వం కలుగుతుంది. ‘వైరాగ్యమేవ అభయం’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భోగంలో రోగ భయం ఉంటుంది, కులంలో పతనం ఉంటుందనే భయం ఉంటుంది, ధనంలో రాజుల భయం ఉంటుంది.. కానీ వైరాగ్యంలో మాత్రం ఎటువంటి భయం ఉండదు. ఇది మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వైరాగ్యం అంటే కేవలం బాహ్య ప్రపంచాన్ని లేదా బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. ఇది మనసుకి సంబంధించిన ఒక స్థితి. వస్తువుల మీద, వ్యక్తుల మీద లేదా ఫలితాల మీద ఉండే అతివ్యాప్తిని వదిలివేయడమే నిజమైన వైరాగ్యం.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్లో..!
ఐఐటీ జేఈఈలో ఫెయిల్ అయ్యి యూట్యూబ్లో ఉద్యోగం సంపాదించే రేంజ్కు చేరుకున్న జర్నీని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు. అతడి కథ ప్రతిఒక్కరిని కదలించింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్న పోస్ట్లో అభిజయ్ అరోరా అనే వ్యక్తి తన కథను షేర్ చేసుకున్నారు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా నగరాలు మారుతూ..తనను, తన చెల్లిని ఎలా పెంచిందో గుర్తుచేసుకున్నారు. సింగిల్ మదర్గా ఆమె పడ్డ కష్టం మర్చిపోలేనంటున్నాడు. కేజీ తరగతుల నుంచి ఐఐటీ ప్రవేశ పరీక్ష వరకు ప్రతి దశలోనూ తన తల్లి తనకు ఎలా సహాయం చేసిందో గుర్తు చేసుకున్నాడు. జేఈఈ టైంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి టీ పెట్టి ఇచ్చేదని అన్నారు. అంతలా ఆమె కష్టపడ్డా..ఫెయిల్ అవ్వడంతో తన ఆశయాలన్నీ నీరుగారిపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ ఓటమి అమ్మ త్యాగాలకి చేసిన ద్రోహంగా అనిపించేది, అందుకే మరో మార్గంలో ఎలాగైన సక్సెస్ అందుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యానని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఐఐటీ బెంగళూరులో హ్యాకథాన్లో గెలిచి మలేషియాలో ఉద్యోగం సంపాదించినట్లు చెప్పుకొచ్చాడు. బాగా సంపాదిస్తున్నప్పటికీ అదంత సంతృప్తినివ్వకపోవడంతో గూగుల్లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోరా పంచుకున్నాడు. తన అవకాశాలను మెరుపరుచుకోవడానికి ఐవీ లీగ్ ఎంబీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఐఐటి నేపథ్యం లేకుండా హార్వర్డ్ అసాధ్యమని కన్సల్టెంట్లు నవ్వారని నాటి పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆ సందేహాలన్నింటిని పక్కనపెట్టి తన కలను సాకారం చేసుకోవడానికి రూ. కోటి రూపాలయ రుణం తీసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం పెద్ద పోరాటమే చేశానంటున్నాడు. ఉద్యోగం సంపాదించడానికి, దేశం విడిచి వెళ్లిపోవడానికి తన వద్ద 90 రోజుల సమయమే ఉన్న క్లిష్టతరమైన ఉద్యోగ మార్కెట్ని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాను వారానికి వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..జాబ్ సంపాదించలేకపోయానని చెప్పుకొచ్చాడు. అప్పుడే తన జీవితానికి రెండో ఆధారంగా తన భార్య రంగప్రవేశం చేసిందని చెప్పుకొచ్చాడు. తనను నిరుద్యోగిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, కొండంత తిరస్కరణల నడుమ అండగా నిలబడి తన కుటుంబాన్ని ఒంటరిగా పోషించిందని రాసుకొచ్చాడు పోస్ట్లో. ఆమెకు తనపై ఉన్న నమ్మకమే తనను ఆవిష్కరణలు చేసేలా పురికొల్పిందని పేర్కొన్నాడు. అంతేగాదు అరోరా తన రెజ్యూమ్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ఏఐ ఆధారిత సాధానాన్ని రూపొందించి ఉద్యోగ దరఖాస్తులకు సంబంధించిన కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించారు. చివరికి అరోరా చేసిన పని గూగుల్ దృష్టిని ఆకర్షించింది. అలా ఆయన గూగుల్లో యూట్యూబ్లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ పొందారు. ఆ ఫ్లాట్ఫాంలో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్లతో ఒక కమ్యూనిటీనే ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు. ఆయన ఏఐ రంగంలోని సిలికాన్ వ్యాలీ నాయకులతో ఒక పాడ్కాస్ట్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన తల్లిన కూడా గూగుల్ కార్యాలయానికి తీసుకువెళ్లానని పంచుకున్నారు. తన డెస్క్ గోడలపై యూట్యూబ్ లోగోని కన్నీళ్లతో అమ్మ తన వంక గర్వంగా చూసిన క్షణం మర్చిపోలేనంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న తిరస్కారాలు, నిద్రలేని రాత్రల కష్టం ఫలించదన్న ఆనందం కలిగిందన్నారు. తన విజయవంతమైన జర్నీని వివరిస్తూ..ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటుంటారు. కానీ తనకు ఇద్దరు మహిళలు ఉండటం అదృష్టం అని రాసుకొచ్చాడు. తనకు ఆరంబాన్ని ఇవ్వడం కోసం సర్వ త్యాగం చేసిన తల్లి, అలాగే తన ప్రస్థానాన్ని పూర్తి చేయడానికి సర్వ పణంగా పెట్టిన భార్య, ఈ ఇద్దరు లేకపోతే తాను లేనని అన్నారు. "ఈ కథ హృదయానికి హత్తుకునేలా ఉంది. నిజానికి విజయం కష్టానికి ప్రతిఫలమే అయినా..దాని వెనుకు మన ప్రియమైన వ్యక్తుల నిశబ్ద బలం, త్యాగం, ప్రోత్సహం కచ్చితంగా ఉంటాయన్నది మీ కథ నొక్కి చెబుతోంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు". నెటిజన్లు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: నొప్పులు పడుతూ కోర్టుకి హాజరు..! కారణం తెలిస్తే షాకవ్వుతారు) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం). దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్). వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." Aristotle సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఆంతరంగిక ప్రశాంతత) -
హీరో వెంకటేష్ మెచ్చిన 'బటర్ దోసె'..! ఎలా చేస్తారంటే..
దోసెలంటే ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి దోసెలలో అత్యంత ఫేమస్ దోసె ఇది. కాసింత నూనె, మసాలా జోడిస్తే అబ్బో.. నోట్లో నీళ్లూరిపోవాల్సిందే. అలాంటి టేస్టీ.. టేస్టీ.. దోసెను దశాబ్దాలుగా అందిస్తోంది బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్. ఈ దోసె కోసం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు క్యూలు కడుతుంటారు. పైగా అదెలా తయారు చేస్తారనేది బయటకు పొక్కనివ్వకుండా కేర్ తీసుకుంటుందట ఆ రెస్టారెంట్. అంతలా పకడ్బందిగా తయారు చేసే ఆ దోసె మన టాలీవుడ్ హీరో మనసుని సైతం దోచుకుంది. మరి ఆ వంటకం విశిష్టత తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బెంగళూరులోని అత్యంత ప్రసిద్ధ భోజనశాలలలో విద్యార్థి భవన్ ఒకటి. గాంధీ బజార్లోని రద్దీ వీధుల్లో ఉన్న దీనిని ఒక వారసత్వ ప్రదేశంగా చూస్తారు స్థానికులు. ఆహారం ద్వారా సంప్రదాయాన్ని పరిరక్షించడంలో పేరుగాంచిన ఈ రెస్టారెంట్ తరతరాలుగా వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందించడంలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రత్యేకమైన బటర్ దోసె మెనూలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకంగా నిలవడం విశేషం. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)దోసె వెనుకున్న వారసత్వం..ఆ రెస్టారెంట్ని అరుణ్ కుమార్ అడిగా ఒక పకడ్బందీ ప్రణాళికగా తయారు చేస్తారట. ఈ వంటకం రుచి కోసం అక్కడ పాకనిపుణుల బృందం అవిశ్రాంతంగా పనిచేస్తుందట. ప్రత్యేకమైన కరకరలాడే ఈ ఆకృతి, బంగాళ దుంపల కూర, వెన్న సమపాళ్లలో ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి దోసెలు రోజుకి సుమారు 1500 నుంచి 1800 దాక తయారు చేస్తారట. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా అక్కడ బాగా ఫేమస్ ఈ దోసె. ఈ రెస్టారెంట్ని 1943లో దక్షిణ కన్నడలో సాలిగ్రామానికి చెందని వెంకటరమణ ఉరల్ దీనిని స్థాపించారు. Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 20261970వ దశకంలో, ఈ సంస్థ యాజమాన్యం అరుణ్ కుమార్ అడిగ తండ్రి అయిన రామకృష్ణ అడిగ నుంచి వారసత్వంగా బదిలీ అయ్యింది. ఆ కుటుంబికులు ఆ ప్రామాణికతను కాపాడుకునేలా వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఇక ఇటీవల టాలీవుడ్ నటుడు హీరో వెంకటేశ్ కారణంగా మరోసారి ఈ దోసె, సదరు రెస్టారెంట్ గురించి నెట్టంట సంచలనంగా మారింది. రెస్టారెంట్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..నటుడు విక్టరీ వెంకటేశ్ సందడిగా ఉన్న ఈ రెస్టారెంట్ని సందర్శించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వెంకటేశ్ అక్కడ బటర్ దోసెను చట్నీ తోపాటు ఆస్వాదిస్తూ కనిపించారు. దీంతోపాటు వడ, ఇడ్లీ సాంబార్ చట్నీలను కడా రుచి చూశారు. చివరగా కాఫీతో తన బ్రేక్ఫాస్ట్ని ముగించారు. ఇంకెదుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.(చదవండి: కంటెంట్ క్రియేటర్ అవ్వాలని రూ. 50 లక్షల వేతనం వదులుకుంది..! కట్చేస్తే..) -
సాహిత్య దీపాన్ని అందించే ప్రయత్నం చేశా!
‘పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల గుండెల్లో వారి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే! భవిష్యత్తుకు భరోసాగా నిలిచే ఈ తరం పిల్లల పెంపకంలో ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు.’ అంటారు సినీ గీతరచయిత సుద్దాల అశోక్తేజ. పిల్లల పెంపంకంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు...‘జోలాలి జోలాలి జోలాలి.. జోల పాడుతా బజ్జో నా తల్లి / నిదుర తల్లిని బతిమలాడని .. నీలి కళ్లలో నిదురపొమ్మని/ రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో..’ ఇది నేను రాసిన సినిమా పాట. నిజానికి రాత్రివేళల్లో పిల్లలను జోకొడుతూ నిద్రపుచ్చితే, పిల్లలు చెప్పే విషయాలు వింటే.. వారు ఎంతో భరోసాగా ఫీలవుతారు. ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు చేయాల్సిన పని రోజులో కొంతసేపు పిల్లలతో గడపడం. నాకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. వారు పుట్టే సమయానికి మేం కడు పేదరికంలో ఉన్నాం. నాకు ఉద్యోగం లేదు. నా భార్య నిర్మల మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో అతికష్టమ్మీద ప్రైవేట్స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మా జీవనం కొంత మెరుగైంది. మా నాన్న హయాంలో కూడా ఆయనకు వచ్చేది కొద్దిపాటి ఆదాయమే. అయినా అంతా అందులోనే బతికాం. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా పిల్లల పెంపకంలో మా అమ్మనాన్నలు ఏం చేశారో, నేనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. మా అమ్మనాన్నలు మా దోసిట్లో పెట్టిన సాహిత్య దీపాన్ని మా పిల్లల చేతుల్లో పెట్టి, వెలిగించే ప్రయత్నం చేశాను. వాళ్లూ నా అంచనా మేరకు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. చలం ‘బిడ్డల శిక్షణ’..స్కూల్ నడుపుతున్న సమయంలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కణ్ణుంచి మా జీవనం మరికాస్త మెరుగైంది. ఇంటి పనులు, పిల్లల పనులు మా ఆవిడతో పాటు నేనూ కలిసి చేసేవాడిని. మా ఆవిడకు నేను చేసే పనులను చూసి, పిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదివింది. అది మా ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత చిరాకు సృష్టించినా ఒక్కనాడు కూడా వారి మీద చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచింది. మా ఇంట్లో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం అలవాటుండేది కాబట్టి, మా తమ్ముడు, చెల్లెలికి కథలు చెబుతుంటే మా పిల్లలు కూడా వినేవాళ్లు. ఇప్పుడు మా మనవలు, మనవరాళ్లకు మహాభారతం, భాగవతం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అప్పట్లో సెల్ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్ల సామాజిక పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. ఇప్పుడు నా పిల్లల పిల్లలు వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పిల్లలకు ‘చందమామ రావే.. ’ పాటలు, ‘చందమామ కథలు’ లేవు. యాంత్రికంగా పరుగులు వద్దుఈ రోజుల్లో భార్యభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితులు వచ్చాయి. అందుకు ఇంట్లో అవసరానికి మించిన ఆడంబర వస్తువులూ వచ్చి చేరాయి. వాటి కోసం సంపాదన తప్పనిసరి అయ్యింది. కెరీర్ పరుగు పందెంలో జీవితాలు యాంత్రికం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు, గూగుల్కు పిల్లలను అప్పజెబుతున్నారు. డిజటల్లో ఏం చూసి నేర్చుకుంటున్నారో, అదే నేటి పిల్లలు.పిల్లలతో ఆటలు మేలుపిల్లల చిన్నప్పుడు వారితో ఆటలాడేవాడిని. ఉదయం వాకింగ్కు తీసుకెళ్లేవాడిని.. వారితో మాట్లాడే ఆ కాసేపు ‘నా తండ్రి నా వెనకాల ఉన్నాడు’ అనే ఫీలింగ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా రోజూ కొంత సమయం గడిపితే పిల్లలు తప్పక మంచి స్థానంలో ఉంటారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు. వంద పుస్తకాలు చదివినంత జ్ఞానం..సెలవుల్లో మా అమ్మ దగ్గరకు పిల్లలను తీసుకొని వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద తినుబండారాలేమీ లేకపోయినా వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి, పిల్లలందరికీ తనే గోరుముద్దలు పెట్టేది. ఆ సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి వంటి కథలన్నీ చెప్పేది. ఇప్పుడు చిన్నకుటుంబాలు పెరిగాయి. అలాగే, పెంపకంలో చింతనలు కూడా పెరిగాయి. ఇప్పటి పిల్లలు ‘బియ్యం చెట్లు ఎలా ఉంటాయి?’, ‘ప్యాకెట్ల నుంచే కదా పాలు వచ్చేవి’ అని అడుగుతుంటారు. వాస్తవానికి దూరంగా పిల్లలు పెరుగుతున్నారు. పండుగల జీవన విధానం...మన పండగలన్నీ మానవసంబంధాలను కాపాడే క్రమంలో ఏర్పాటు చేసినవే. పెసర గారెలు, బూరెలు, భక్ష్యాలు, నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు... ఇలా పండగలను బట్టి చేసే వంటలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందుకు తగిన జంక్ ఫుడ్ సులభంగా లభిస్తుంది. ఫలితంగా పిల్లలకు సరిగ్గా విరేచనాలు కావు, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. పిల్లల ఆరోగ్యం, లోకజ్ఞానం, పరిసరాల జ్ఞానం తప్పనిసరి. వీటిని ఈ రోజుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.నిర్మలారెడ్డి -
మలి దశ... మరో కోణం
జీవితం మలి దశలో భావోద్వేగ పరంగా మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మగవారిలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ మహిళలు ఇటీవల కాలంలో దీని వల్ల ఎక్కువ మోసపోతున్నారని చెబుతున్నారు. జీవితం మలిదశలో ఏర్పడిన శూన్యతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో అవగాహన కలిగి ఉంటే అధిగమించడం సులువు అవుతుంది.చదువు, సంపాదన, వివాహం, కుటుంబ బాధ్యతలు.. ఒక్కోదశ ను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఐదు పదులు దాటిన తర్వాత బాధ్యతల బరువు తగ్గి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడో వదిలేసిన భావాలు మనసును ముట్టడిస్తాయి. ఖాళీ సమయాన్ని టీవీ కో, సోషల్ మీడియాకో కేటాయిస్తుంటారు చాలా మంది. కొందరు లోపలి ఖాళీని పూరించడానికి మానసికంగా కొత్త సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారిలో అన్లైన్ డేటింగ్ పెరుగుతోందని అమెరికన్ ఫ్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏజింగ్ ఆన్లైన్ డేటింగ్ను ఎంచుకునేవారికి సూచనలూ ఇచ్చింది.తమకు తామే మోసం..వయసు పైబడిన వారిలో అప్పటికే శారీరక మార్పులు చుట్టుముడతాయి. దీంతో హఠాత్తుగా లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయోమో అర్థం అవుతుంది. వదిలేసిన అన్నింటినీ తిరిగి జీవితంలోకి తెచ్చుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పూర్తి చేయలేక ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితం గా తమను తాము హింసించుకోవడమూ పెరుగుతుంది.అర్థం చేసుకోవడం ముఖ్యం..ఈ వయసులో‘అందరూ ఏవేవో సాధిస్తున్నారనో, తాము వెనకబడిపోయామనో, గుర్తింపు కోసమో, ఖాళీని భర్తీ చేయడం కోసమో.. పరిగెత్తడం కాదు. తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.→ మెనోపాజ్ సమస్యల వల్ల వచ్చే భావోద్వేగాల సమతుల్యతనూ సాధించాలి. → నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, ప్రశాంత జీవితాన్ని గడపడం, లోపలి స్వరాన్ని వినడం, సేవ, సృజన, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించాలి. → సెకండ్ లైఫ్కి ఇది ప్రారంభ దశగా గుర్తించాలి.రిలేషన్స్ కూలిపోవచ్చు.. యవ్వనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరం, భద్రత, కలిసి బతకడం.. వంటివే వారిని కలిపి ఉంచే బంధాలు. మధ్య వయసుకొచ్చేసరికి అర్థం చేసుకోవడం, భావోద్వేగ కలయిక, నిజాయితీగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే చీలిక ఏర్పడుతుంది. ఆ తర్వాత బంధాల పట్ల విముఖత ఏర్పడుతుంది. అనవసరపు ప్రయాస అనిపిస్తుంది.దంపతుల మధ్య దూరం..పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బాధ్యత తగ్గుతుంది. అలాగే, వారితో సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. దంపతులుగా ఇన్నాళ్లూ పిల్లల కోసమే కలిసి ఉన్నామా.. అనే ఆలోచన మొదలవుతుంది. చెప్పుకోలేని సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఓపిక, సహనం తగ్గుతాయి. అప్పటివరకు నొక్కి పెట్టిన నిర్లక్ష్యం, అవమానం, త్యాగం.. అన్నీ పైకి ఉబికి వస్తాయి. ఇక ‘ఇప్పుడు భరించలేను’ అనే దశ వస్తుంది. ‘అందరూ నన్ను చీట్ చేశారు. వీళ్లకోసమా నేను త్యాగం చేశాను’ అనే ఆలోచన కలుగుతుంది.ప్రయోజనకరంగా! పాజిటివ్ ఆలోచనలవైపు మొగ్గు చూపాలి. శారీరక–మానసిక వ్యాయామాలు నిరాశను తగ్గిస్తాయి. మానసికంగా చురుకుగా ఉండటానికి పజిల్స్ పూరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వదిలేసిన అభిరుచులను తిరిగి మెరుగుపెట్టడం, స్వచ్ఛంద సేవ.. వంటి అర్థవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మేలు చేస్తుంది. ఈ దశలో శరీరంలో వచ్చే ప్రకృతి సిద్ధ మార్పుల (మెనోపాజ్, వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, చర్మంలో కాంతి తగ్గడం..) వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పోషకాహార, చర్మ వైద్య నిపుణుల సూచనలతో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసు కుంటూనే ఆరోగ్యకరమైన బంధాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.అవగాహనతోనే వికాసంసంబంధాలలో ఏర్పడిన మార్పుల వల్ల మన ఆలోచనా విధానంలోనూ చాలావరకు మార్పు వస్తుంది. శారీరకంగా కన్నా మానసికపరమైన మోసం ఎక్కువ హానికరంగా అనిపిస్తుంది. అది తమ భాగస్వామి, పిల్లలు, బయటి వ్యక్తులు.. ఎవరైనా కావచ్చు. భావోద్వేగ బంధం స్పర్శకంటే లోతైనా సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి, దానిని కోల్పోవడం అంటే ఆ బంధాన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది. అప్పుడు మోసం జరిగింది అనుకుంటారు. ఇలాంటప్పుడు నిపుణులను సంప్రదించి, సూచనలు తీసుకోవడం మేలు కలిగిస్తోంది.– డాక్టర్ డోనాసింగ్, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఊబకాయం నుంచి స్మార్ట్గా..! ఏకంగా 204 కిలోల నుంచి 92 కిలోలకు..
కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది. నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది. అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది. ఎలా విజయవంతమైందంటే..ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్లో చేరింది. అక్కడ బరువైన బార్బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.జీవనశైలిలో మార్పులుతీవ్రమైన డైటింగ్కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యంఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది. ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ. గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ana Alonso (@ana.fitness.vsg) (చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..) -
వ్యాయామాలు తప్పనిసరా..? చేయాల్సిందేనా..
వ్యాయామం అంటే కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, టైప్–2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యాయామం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. అందువల్ల బద్ధకించకుండా బాధ్యతగా చేసే పనిగా గుర్తించాలి.ముందుగా ప్లాన్ చేసుకోకపోతే వ్యాయామం అనేది ఎప్పటికీ చేయలేము. పిల్లలు నిద్రలేవక ముందే, లేదంటే వారి మధ్యాహ్నం నిద్ర సమయంలో ఒక 20 నుంచి 30 నిమిషాలు ప్లాన్చేసుకోవాలి. ఉదయాన్నే ‘ఏం బట్టలు వేసుకోవాలి? బాటిల్ ఎక్కడ ఉంది?’ అనే గందరగోళం లేకుండా, ముందు రోజే మీ వర్కవుట్ దుస్తులను, వాటర్ బాటిల్ను సిద్ధం చేసుకోండి. ఇది మీ మెదడుపై నిర్ణయాల భారాన్ని తగ్గిస్తుంది.చిన్నపాటి వర్కవుట్లు చాలు..జిమ్లో గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. పుష్–అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటివి ఎక్కడైనా చేయవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం ఉండేలా చూసుకోండి.పిల్లలతో కలిసి..పిల్లల పనులు చేయాలనే సాకుతో చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి పిల్లల పనులు కానీ, పిల్లలు కానీ మీ ఫిట్నెస్కు అడ్డంకి కానే కాదు, వారితో కలిసే వ్యాయామం చేయండి. వారితో కలిసి డ్యాన్స్ చేయడం లేదా పార్కులో ఆడుకోవడం ద్వారా వారికి కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడతాయి. చురుకైన తల్లిదండ్రులను చూసి పెరిగే పిల్లలు భవిష్యత్తులో కూడా యాక్టివ్గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయిక్రమం తప్పకుండా..ఒక్కోసారి చాలా బిజీగా ఉండవచ్చు. అటువంటప్పుడు కనీసం 10 నిమిషాల స్ట్రెచింగ్ లేదా యోగా చేయండి. అన్నీ చేయాలి లేదా ఏదీ చేయకూడదు అనే ధోరణి కంటే, కొద్దిగానైనా క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.వారానికి రెండుసార్లు..మహిళలకు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది, కండరాల పటుత్వాన్ని కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే గాయాలను నివారించడానికి ఇది అవసరం. వారానికి కనీసం రెండుసార్లు దీనిని ప్రయత్నించండి.(చదవండి: -
తెల్లటివి కంటే గోధుమ రంగు గుడ్లు మంచివా..?
కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారం ఇదే. అయితే, కోడిగుడ్ల వినియోగంపై సమాజంలో ఎన్నో రకాల అ΄ోహలు ఉన్నాయి. అనవసరమైన భయాలను పెట్టుకోకుండా గుడ్లను ఆహారంలో చేర్చుకుందాం.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుదాం. అందుకోసం అపోహలను తొలగించుకుందాం.నమ్మకాలు కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి, పచ్చసొనలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని వదిలేయాలి.తెల్లటి గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచివి.గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి, గుండె జబ్బులు వస్తాయి.నిజాలుపచ్చసొనలోనే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు నిండి ఉంటాయి. తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండూ సమానమైన ΄ోషక విలువలను కలిగి ఉంటాయి.గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.ఆరోగ్యంగా ఉన్నవారు రెండు కన్నా ఎక్కువ గుడ్లను తిన్నా ఏమీ కాదు. అది వారి ఇష్టం. అంతే! .(చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. తన నటనతో, స్టైల్తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా..అభిమానులను అలరించేలా యంగ్ హీరోల మాదిరిగా స్టెప్పులు వేస్తూ నటిస్తుండటం విశేషం. సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడం తోపాటు అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచి తండ్రిగా మన్నననలను అందుకున్నారు. రజనీకాంత్, భార్య లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తెలు కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా కళాకారిణులుగా స్థిరపడ్డారు. ఆయన ఆడిపిల్లలు అనే తారతమ్యం చూపకుండా నచ్చిన రంగంలోకి వచ్చే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా తండ్రిగా అన్ని విధాలుగా సపోర్టు చేస్తూ..నాన్న అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చారాయన. అలాంటి సూపర్స్టార్ నుంచి నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ పాఠాలేంటో తెలుసుకుందామా..!పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం..తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రించడానికి బదులుగా సొంత మార్గాన్ని ఎంచుకునేలా కుమార్తెలను ప్రోత్సహించారు రజనీ. ఇక్కడ పిల్లలను ఫలానా చేయమని డైరెక్షన్ ఇవ్వడం లేదా బలవంతం చేయడం వంటివి చేయకూడదు. వారి భావనలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. అందులో ఉండే సాధకబాధలు అర్థమయ్యేలా వివరించాలే తప్ప..నిర్బంధించకూడదు. ఇక్కడ మంచి తండ్రిగా రజనీ తన కుమార్తెల విషయంలో అదే చేశారు. ముఖ్యంగా పిల్లలను అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు రజనీ. పిల్లలతో సన్నిహితంగా ఉండటం..అతిముఖ్యమైన పేరెంటింగ్ పాఠం పిల్లలతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటం. ఇక్కడ నటుడు రజనీకాంత్ తన కుమార్తెలు, కుటుంబంతో చక్కటిన సత్సంబంధాలను నెరుపుతారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్లు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులపై మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్ట్రిక్ట్గా ఉండటం కంటే..పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగే పెంపకమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.పిల్లల డ్రీమ్స్కి మద్దతివ్వండి..రజనీ కూతుళ్లు ఇద్దరు సినీ రంగాన్నే ఎంచుకున్నారు. చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి కెరీర్ని నిర్మించుకున్నారు. రజనీకాంత్ తన పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చారు. పిల్లల కోసం అన్నీ చేయడం పెంపకం కాదు, కష్ట సమయాల్లో పిల్లలకు అండగా నిలవడం, వారి పక్కన ఉండటమే అసలైన పెంపకం. అంతేగదు పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చినప్పుడే పిల్లలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆధనిక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పెంపక పాఠం.కుటుంబానికే తొలి ప్రాధాన్యత..అలాగే పేరెంట్స్ తమ తమ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సూపర్స్టార్ రజనీ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరెంటింగ్ పాఠం ఇది. ఆయన నటుడిగా బిజీగా ఉన్నా..కుటుంబంతో గడిపే సమయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు కూడా. కుటుంబమే లేకుంటే మనం లేం, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీకే ఇవ్వండి అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవ్వగలం అని చెబుతున్నారు రజనీ. -
అటు యుద్ధం..ఇటు పుష్కరాలు : పెళ్లికి త్వరపడాల్సిందే !
ద్వారకాతిరుమల : గోదావరి పుష్కరాలకు ఇంకా పద్నాలుగు నెలలు సమయం మాత్రమే ఉంది. దాంతో గోదావరి పరీవాహక ప్రాంతాల వారు పెళ్లిళ్లు జరుపుకునేందుకు తొందరపడుతున్నారు. ఎందుకంటే పుష్కరాల తరువాత ఏడాది కాలం పాటు ఈ ప్రాంత వాసులు వివాహాది శుభకార్యాలు జరుపుకోరు. అందుకే ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా పెళ్లిళ్లు జరుపుకోవాలని ఆతృత పడుతున్నారు. అయితే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరిగిన వంట నూనెలు, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెళ్లివారి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేద్దామా అంటే.. గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయి. దాంతో పెళ్లిళ్లు చేసుకునేవారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. ఇదీ చదవండి: ఆమె రైల్లో రక్తం కక్కుకుంది : రూ. 4 కోట్లు వచ్చాయ్!శుభకార్యాలు జరపరెందుకంటే.. గోదావరి జిల్లాల వాసులు చనిపోయిన తమ పితృ దేవతలకు పుష్కరాల సమయంలో పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశదానాలు చేస్తారు. అందువల్ల పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు శుభకార్యాలు జరపకూడదని పండితులు, పురోహితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వారితో పాటు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన చాలా మంది ఈ సమయంలో శుభకార్యాలను జరుపుకోరు. ఈ ప్రాంతాల వారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఇది శాస్త్ర విరుద్ధమని భావించేవారు పుష్కరాల తరువాత ఏడాదిపాటు శుభ కార్యాలకు దూరంగానే ఉంటారు. భారంగా మారిన ధరలు ప్రస్తుతం పెరిగిన ధరలు పెళ్లిళ్లు జరుపుకునే వారికి పెను భారంగా మారాయి. డెకరేషన్కు వినియోగించే పచ్చిపూలతో పాటు అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు ఇలా..: సిలిండర్ పెరిగిన ధరతో కలిపి రూ.954కాగా, బ్లాక్లో రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ పెరిగిన ధరతో కలిపి రూ.1,930 కాగా, బ్లాక్లో దొరకడం లేదు. ఒకవేళ దొరికితే రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. భారీగా వివాహాలు ప్రస్తుత ముహూర్తాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న సన్నిధి పెళ్లిళ్లకు వేదిక అవుతోంది. బలమైన ముహూర్తాల్లో ఇక్కడ వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈనెల 11, 12, 29 తేదీల్లో పెళ్లిళ్లు అతి భారీగా జరనున్న నేపథ్యంలో ఇప్పటికే కొండపైన, కొండ కింద కల్యాణ మండపాలు, గదులు దాదాపుగా అన్నీ ముందే బుక్ అయిపోయాయి. కేటరింగ్, వాయిద్యకారులు, డెకరేషన్ వ్యాపారులు, పురోహితులు బిజీబిజీగా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు! -
ఫ్లూట్లు అమ్ముకునే వ్యక్తి కథ..!
సంగీతానికి సంబంధించిన పరికరాలు అమ్మే వ్యక్తి..ఇతర పండ్లు, కూరగాయలు అమ్మే విక్రేతగా అరుస్తూ అమ్మడు. మాధుర్యంగా వాయిస్తూ ప్రజల అటెన్షన్ తనపై పడేలా నిశబ్దంగా అమ్ముకుంటాడు. ప్రజలు కూడా ఆ సంగీతానికి పరవశమై కాసేపు జాలీగా, బాధగా చూసి వెళ్లిపోవడమో లేక కుదిరితే కొనడమో చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చెయ్యొద్దు అని చెబుతున్నాడు ప్రభ్జోత్ సంగ్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేయాలంటే..ఢిల్లీకి చెందిన సూరజ్ అనే ఫ్లూట్లు అమ్మే వ్యక్తి కథను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రభ్జోత్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సూరజ్ అనే ఫ్లూట్ల విక్రేత బెలూన్ల తోపాటు ఆ ఫ్లూట్లను అమ్మే విధానం ముగ్ధమనోహరంగా ఉంటుంది. అతడు ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ప్రజలందరీ అటెన్షన్ తనపై పడేలా వాయించే విధానం ప్రతి ఒక్కరి మనసుని కదిలిస్తుంది. అంత అద్భుతంగా వేణువుని ఆలపిస్తాడు సూరజ్. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ..అతను వేణువుని వాయిస్తున్నప్పుడు అందంగా కదిలే ఆ బుడగల దృశ్యం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని రాసుకొచ్చాడు. అతను ఒకేసారి ప్రదర్శకుడిగా, అమ్మకందారుడిగా రెండు పాత్రలను భలే సమతుల్యం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే ఆ రెండు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం అతడి కుటుంబ అవసరాలకు ఎంత మాత్రం సరిపడదనేది అందరికీ తెలిసిందే. అయితే మనమంతా అలాంటి వ్యక్తుల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతూ..జాలిని వ్యక్తం చేసి వదిలేస్తుంటాం. ఎలాంటి సాయం చేయూత అందించే యోచన చేయమని, తాను కూడా మొదటిసారి అలానే చేశానని చెప్పుకొచ్చాడు ప్రభ్జోత్. అయితే ఈసారి అలా చేయాలనుకోలేదని వివరించాడు. ఈసారి అతడితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపాడు. తన తండ్రి వేణువుని వాయించేవాడని, ఇప్పుడు తన కొడుకు కూడా తనలా వాయించేలా నేర్చుకుంటున్నాడని సూరజ్ చెప్పుకొచ్చినట్లు వెల్లడించాడు. ఇక అమ్మేందుకు ఇలా ప్రదర్శన ఇవ్వడం కాకుండా తన టాలెంట్న ప్రదర్శించేందుకు వాయిస్తాడని పోస్టులో రాసుకొచ్చాడు ప్రభ్జోత్. అంతేగాదు ఇతరులను కూడా అలానే చేయమని ప్రోత్సహిస్తున్నాడు కూడా. వీధి సంగీతకారులను చూసి కేవలం విని వదిలేయొద్దు..వారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకోండి, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లకో లేదా హౌస్ పార్టీలోనే చక్కగా తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వండి, తోచినంత మొత్తం చెల్లించండి. మనం వాళ్లని అమ్మకందారులుగా కాకుండా కళకారులుగా పిలిచి గౌరవిద్దాం అని పిలుపునిస్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభ్జోత్. నిజానికి మనం మొత్తం వ్యవస్థను మార్చలేకపోవచ్చు..ఇలాంటి చిన్న ప్రయత్నాలతో వాళ్ల జీవితంలో వెలుగు రావొచ్చేమో..లేక మార్పు సంతరించుకోవచ్చేమో..! అంటూ పోస్ట్ ముగించాడు. నెటిజన్లు సైతం అతడికి మద్దతిస్తూ..ఆలోచన బాగుంది సార్ అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Prabhjot Singh (@intent.content.form) (చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
కళలు, సంస్కృతికి నిలయమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) మూడో వార్షికోత్సవం ఏప్రిల్ 3, 2026న ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆరుగజాల మెటాలిక సిల్క్ చీర, దానికి మ్యాచింగ్గా ఆభరణాలను ధరించి రాజసం ఉట్టపడే ఆహార్యంతో కట్టిపడేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖ తారలంతా విచ్చేశారు. ముఖ్యంగా షాహిద్ కపూర్, మీరా కపూర్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్ర, కియార అద్వానీ తదితర తారాగణం హాజరయ్యారు. ఈ వేడుకలో నీతా అంబానీ రాజసం ఉట్టిపడే పట్టుచీరలో ధగధగ మెరిసిపోయారామె. సాంప్రదాయ భారతీయ హస్తకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచింది ఆమె ధరించిన చీర. బంగారు, ముదురు ఎరుపు రంగుల ప్రకాశవంతమైన కలయికతో కూడిన చరీపై క్లిష్టమైన జరీ పని అద్భుతంగా ప్రతిబింబిస్తూ..ద్రవరూపంలో ఉన్న మెరుపని సృష్టిస్తోంది. సాంప్రదాయ పైస్లీ నమూనాలతో కూడిన వెడల్పాటి అంచు, చీరకు చక్కటి రూపాన్ని ఇవ్వగా పల్లుపై సూక్ష్మమైన నమూనాలు మరింత హైలెట్గా నిలిచాయి. దానికి మ్యాచింగ్గా మెరూన్ గోల్డ్ రంగులో పొట్టిచేతులతో కూడిన బ్లౌజ్ చీర లుక్ని అమాంతం పెంచేసింది. ఆ పట్టుచీరకు తగ్గట్టుగా ప్రకాశవంతమైన పచ్చులు, కెంపులతో పొదిగిన నెక్లెస్, చేతులకు బంగారు గాజులు, చెవులకు స్టేమెంట్ రింగులతో.. పండుగ వాతావరణాన్ని తలపించే రాయల్ లుక్లో ఆకర్షణీయంగా కనిపించారు నీతా. సాంప్రదాయ మహిళలా మధ్యపాపిడి చక్కటి కొప్పు, తేలికైన మేకప్తో హుందాగా మెరిశారామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె మొత్తం రూపంలో సాంస్కృతికత ప్రతిధ్వనించింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!) -
ఆంతరంగిక ప్రశాంతత
ఆధ్యాత్మికత (Spirituality) అంటే కేవలం పూజలు, పునస్కారాలు అనుకుంటారు. కానీ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోణంలో స్పిరిచువాలిటీ అంటే—మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అవ్వడం. బయట ప్రపంచంలో మీరు ఎంత సక్సెస్ సాధించినా, లోపల ప్రశాంతత లేకపోతే ఆ వ్యక్తిత్వం వెలిగిపోదు. ఆంతరంగిక ప్రశాంతత మీ పర్సనాలిటీని ఎలా ఒక 'స్థితప్రజ్ఞుడి'లా మారుస్తుందో ఈ ఆర్టికల్లో చూద్దాం.పర్సనాలిటీ అనేది ప్రపంచం చూసే 'బయటి కవచం' అయితే, స్పిరిచువాలిటీ అనేది ఆ కవచం లోపల వెలిగే 'దీపం'. ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఒక రకమైన నిలకడ (Stability), కరుణ (Compassion), స్పష్టత (Clarity) ఉంటాయి. ఇది మిమ్మల్ని కేవలం ఒక 'సక్సెస్ఫుల్ మ్యాన్' నుండి ఒక 'వైజ్ మ్యాన్' (Wise Man) గా మారుస్తుంది.అంతర్గత నియంత్రణ (Locus of Control)స్పిరిచువల్ పర్సనాలిటీ ఉన్నవారికి తమ సంతోషం కోసం బయటి వ్యక్తుల మీద లేదా పరిస్థితుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ‘‘నా ప్రశాంతత నా చేతుల్లోనే ఉంది. ఎవరో నన్ను విమర్శించినా, నా ప్లాన్ ఫెయిల్ అయినా నా 'కోర్' (Core) కదలదు’’ అనుకుంటారు. దీన్నే Internal Locus అంటారు. దీనివల్ల మీరు ఒత్తిడిలో కూడా అద్భుతంగా పనిచేయగలరు. మీ పర్సనాలిటీకి ఇది ఒక 'బుల్లెట్ ప్రూఫ్' కవచంలా పనిచేస్తుంది.Ego vs SoulEgo-Driven Personality: "నేను గెలవాలి, నేను అందరికంటే గొప్పగా కనిపించాలి" అనుకుంటారు. ఇది ఎప్పుడూ భయం మరియు అసూయతో నిండి ఉంటుంది.Soul-Driven Personality: "నేను నా ధర్మాన్ని (Purpose) నెరవేర్చాలి, అందరికీ మేలు చేయాలి" అనుకుంటారు. ఇందులో ప్రశాంతత మరియు నిస్వార్థం ఉంటాయి.ఎప్పుడైతే మీ పర్సనాలిటీ ఈగో నుండి సోల్ వైపు ప్రయాణిస్తుందో, మీ కరిష్మా వెయ్యి రెట్లు పెరుగుతుంది. మనుషులు మిమ్మల్ని చూసి గౌరవించడం కాదు, మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు.మోటివేషన్ మాయ vs ఆంతరంగిక ప్రశాంతతమోటివేషన్ "బయట గెలువు, ప్రపంచాన్ని జయించు" అని మిమ్మల్ని నిరంతరం ఉరుకులు పెట్టిస్తుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది (Burnout).స్పిరిచువాలిటీ (Mindfulness)... "లోపల ప్రశాంతంగా ఉండు, అప్పుడు ప్రపంచం నీ వెనుక వస్తుంది" అని చెప్తుంది. ఇది మీకు 'శాశ్వతమైన శక్తిని' (Enduring Power) ఇస్తుంది.ఆంతరంగిక ప్రశాంతతను ఎలా సాధించాలి?Step 1: Break External Validation"నలుగురు ఏమనుకుంటారు?" అనే ఆలోచనను 'Break' చేయండి. మీ విలువలకు విరుద్ధంగా ఏ పని చేయకండి. మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకోగలిగితే, అదే అతిపెద్ద ప్రశాంతత. పాత మొహమాటాలను వదిలేయండి.Step 2: Build Solitudeప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు మీతో మీరు గడపడం 'Build' చేయండి. అది మెడిటేషన్ కావచ్చు, లేదా ఒక డైరీ రాయడం కావచ్చు. మీ లోపల జరుగుతున్న సంభాషణను గమనించండి. మీ అంతరాత్మ చెప్పే మాటలను వినడం మొదలుపెడితే, మీ నిర్ణయాల్లో తప్పులు జరగవు.Step 3: Universal Compassionమీ ప్రశాంతత కేవలం మీకే పరిమితం కాకుండా, మీ చుట్టూ ఉన్నవారికి కూడా అందాలి. ఒక చిన్న చిరునవ్వుతో, ఒక ఓదార్పు మాటతో మీరు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలి. మీరు ఒక 'ప్రేరణ'గా (Inspiration) మారడమే 'Beyond' స్టేజ్.మీ లోపల ఏముంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు భయం వేస్తోందా లేక ప్రశాంతంగా అనిపిస్తోందా?2. మీ సంతోషం వేరే ఎవరి చేతుల్లోనైనా ఉందా?3. మీరు చేసే పని వల్ల మీ ఆత్మ తృప్తి పొందుతోందా?ప్రశాంతతే అసలైన సంపద!ప్రపంచాన్ని గెలిచి మిమ్మల్ని మీరు ఓడిపోతే అది విజయం కాదు. మిమ్మల్ని మీరు గెలిచి ప్రపంచానికి సేవ చేస్తేనే అది పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఆంతరంగిక ప్రశాంతత ఉన్న వ్యక్తి యుద్ధ భూమిలో కూడా ప్రశాంతంగా ఉండగలడు. అదే 'జీనియస్' లక్షణం."Peace comes from within. Do not seek it without."Gowthama Buddha సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: లక్ష్యంతో మారే పర్సనాలిటీ!) -
రుతుక్రమం వైకల్యం కాదు
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రకటించిన బహిష్టు సెలవుల ఉత్తర్వు చట్టపరమైన చర్చకు దారితీసింది. దీనిని సవాలు చేస్తూ 15 మంది మహిళా వృత్తి నిపుణులు హైకోర్టు మెట్లెక్కారు. రుతుక్రమ సెలవును ‘కపట వివక్షగా’ అభివర్ణించారు. ఇది బంగారు పంజరం లాంటిదని.. పైకి మహిళల మేలు కోసమే అన్నట్లుగా కనిపించినా.. ఇలాంటివి వారి కెరీర్ని దెబ్బతీస్తాయని వారు వాదించారు. మూసధోరణులకు ముగింపు పలకాలన్నారు.ఉత్తర్వు ఏం చెబుతుంది?కర్ణాటక ప్రభుత్వం బహిష్టు సెలవు విధానాన్ని నవంబర్ 2025లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రవేశపెట్టారు. ఇది మహిళా ఉద్యోగులకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవును తప్పనిసరి చేస్తుంది. అంటే ఏడాదికి 12 రోజులు. ఈ ఉత్తర్వు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగాలకూ వర్తిస్తుంది. అంటే ఐటీ సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేసే 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అవసరం గల ప్రతి మహిళా సెలవు తీసుకోవచ్చు. దీనికి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే ఉపయోగించని సెలవులను తదుపరి నెలకు బదిలీ చేయడం సాధ్యపడదు.మూసధోరణుల్ని ప్రోత్సహించడమేప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ‘బహిష్టు సెలవు’పై ప్రశ్నిస్తూ ఉన్నత హోదాల్లో ఉన్న 15 మంది మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఇది మృదువైన వివక్షకు నిదర్శనమన్నారు. సమానత్వాన్ని పెం పొందించడానికి బదులుగా, ఈ విధానం దానికి విరుద్ధమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల నియామక ప్రక్రియలలో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని, యజమానులు మహిళలను పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలవారిగా చూసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ చర్య ఆనాటి మూస పద్ధతులను బలపరిచే ప్రమాదం ఉందని, వారి ఎదుగుదలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సెలవు మహిళలను బలహీనులుగా చిత్రీకరిస్తుందని, తద్వారా సమానత్వ చట్టాల అసలు ఉద్దేశ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని వారు వాదించారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో మహిళలు ప్రత్యేక రాయితీలు, నిర్బంధ సెలవులు కోరుకోవడం లేదు, కేవలం సమాన అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు కోరుతున్నారు. రుతు క్రమాన్ని ఒక వైకల్యంగా మార్చడం తమ వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం’’ అని ఈ మహిళల వాదన.పని ప్రదేశాల్లో ఈ రకమైన వివక్షను గుర్తించడం కష్టం, ఎందుకంటే ఇది ప్రేమ, మర్యాద రూపంలో వస్తుంది. ఈ బంగారు పంజరం నుంచి బయటపడాలంటే, మహిళలను కేవలం రక్షించాల్సిన వ్యక్తులుగా కాకుండా, సమాన సామర్థ్యం గల భాగస్వాములుగా గుర్తించడం నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. -
సోలో లైఫ్.. సోషల్ మీడియా
ఉదయం లేస్తూనే సోషల్మీడియా వాకిట్లో పక్షుల్లా వాలిపోతుంటారు. రీల్స్, రివైవల్, కబుర్లు, మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు.. వయసు తేడా లేకుండా ఆన్లైన్ వేదికగానే ఎన్నో విశేషాలను పంచుకుంటూ, పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా డంప్ అయ్యే ఎన్నో మానసిక సమస్యలనూ నెత్తిన మోస్తున్నారు. ‘ప్రపంచం అంతా ‘పర్ఫెక్ట్’గా ఉందన్న భ్రమతో తమను తాను హింసించుకునేవారి శాతం ఇటీవల పెరుగుతోంది..’ అంటున్నారు నిపుణులు.వైజాగ్ వాసి పదిహేడేళ్ల అనన్య భోజనం తినడం తగ్గించడం మొదలుపెట్టింది. ఈ సమస్య ఎంతగా అంటే ఒకరోజు ఆమెను బలవంతంగా హాస్పిటల్లో చేర్చి, సెలైన్ పెట్టించాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్రభావంతో ఆమె తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. తినమని తల్లి ఒత్తిడి చేస్తే ‘లైక్స్ రావడం లేదంటే అర్థం, నేను బాగా లేనట్టేగా..’ అని గట్టిగట్టిగా అరుస్తోంది.. అని అనన్య తల్లి ఆవేదన చెందుతోంది.. ∙∙ ఉద్యోగంలో బిజీగా ఉండే మాధవి రిలాక్స్ కావడానికి సోషల్మీడియా ఒక మార్గంగా మారింది. మొదట్లో ఫ్రెండ్స్తో కనెక్ట్ అవడానికి ఆ తర్వాత ఫొటోలు షేర్ చేసేది. ఆ పోస్టులకు లైక్స్, కామెంట్స్ పెరుగుతుండటంతో తరచు చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకట్రెండుసార్లు ఆమె పెట్టిన ఫొటోకు తక్కువ లైక్స్ రావడంతో నిరాశ మొదలైంది. ‘అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో’ అనుకోవడం మొదలుపెట్టింది. ఇతరుల ఫొటోలు చూసి, తనను తాను పోల్చుకుంటుంది. ‘వారితో పోల్చితే, అంత అందంగా లేను. అందుకే లైక్స్ రావడం లేదు’ అనే భావన పెరిగింది. పనిమీద దృష్టి తగ్గింది. దీంతో ఆందోళన పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యాయి. కనిపించని ఒత్తిడులుఇప్పటికాలంలో సోషల్ మీడియా మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ అదే సమయంలో ఇది మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. బయటికి కనిపించేది ఫొటోలు, వీడియోలు, లైక్స్, కామెంట్స్ మాత్రమే. కానీ అంతరంగంలో జరిగే మానసిక ఒత్తిడి వేరుగా ఉంటోంది. అందం, ఆనందం, ఆర్థిక విషయాలు, తన చుట్టూ ఏమీ బాగోలేదనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలుఇతరులతో పోల్చుకోవడం. ఇతరులు అందంగా, ఆనందంగా ఉన్న ఫొటోలు, రీల్స్.. చూసి వారి జీవితం వడ్డించిన విస్తరి అనే భావనకు లోనవుతున్నారు. అదే సమయంలో తమ జీవితం ఎంత నిస్సారంగా ఉందో అంచనా వేసుకుంటున్నారు. దీంతో మిగతావారికంటే తమ జీవితం చాలా తక్కువ అనే భావనకు లోనవుతున్నారు. → ఫొటోలు, వీడియోలకు వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్, ఏఐ.. వంటి వాటి వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. నిజానిజాలు అర్ధం చేసుకోలేకపోతున్నారు.→ తమపై తమకు ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. కుటుంబంపైనా ఈ ప్రభావం పడుతోంది.→ లైక్స్, కామెంట్స్ ద్వారా ఆనందం పొందడం అలవాటై, తక్కువ రెస్పాన్స్ వస్తే ‘బాధ’కు లోనవుతున్నారు. → ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ వల్ల డిప్రెషన్, భయాందోళనకు లోనవుతున్నారు. → ఇతరుల ఆనందం చూసి ‘నేను ఏదో మిస్ అవుతున్నాను’ అనుకుంటున్నారు. → అతి ఎక్కువగా స్క్రీన్ టైమ్లో గడపడం వల్ల మానసిక అలసటకు లోనవుతున్నారు. → సోషల్ మీడియా అంటే రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధంగా వాడితే సమాచారం, ప్రపంచంతో కనెక్టివిటీ ఇస్తుంది. కానీ నియంత్రణ లేకుండా వాడితే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.నియంత్రణ తప్పనిసరి→ రోజుకు ఒక పరిమితి పెట్టుకోవాలి.→ సోషల్ మీడియాలో కనిపించేది పూర్తి నిజం కాదని గుర్తుంచుకోవాలి.→ వారానికి ఒక రోజు సోషల్ మీడియా నుంచి పూర్తి బ్రేక్ తీసుకోవడం మంచిది.→ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించే కంటెంట్ను ఫాలో అవడం మంచిది. → మన విలువలను లైక్స్తో కాకుండా మనసుతో కొలవాలి. కుటుంబం, స్నేహితులతో రోజువారీ అంశాలపై చర్చ, మాట్లాడం.. వంటివి చేస్తుంటే సోషల్ మీడియా ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ ప్రపంచం. అక్కడ మనం చూస్తున్నది పూర్తినిజం కాదు. కానీ, మన మెదడు దాన్ని నిజం అనేలా స్వీకరిస్తుంది. అదే సమస్యకు మూలం అవుతుంది. పాజిటివ్గా వచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే ‘ఫీల్గుడ్’ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఫోన్ను పదే పదే చెక్ చేయడం, సోషల్ మీడియా లేకపోతే అసహనం, నిద్రలేమి, పనిమీద దృష్టి తగ్గడం.. వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. రోజులో కొంత సమయమే సోషల్ మీడియా ఉపయోగించడం, అభి రుచులు, వ్యాయామం, కుటుంబంతో సరైన టైమ్ గడపడం వంటివాటి వైపు మనసును మళ్లించగలిగితే సరైన జీవన ఆనందాన్ని పొందగలరు. సమస్యను నియంత్రించుకోలేకపోతే నిపుణులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మేలు చేస్తుంది.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
మరో చరిత్రకోసం...
‘మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు అన్నీ మనం సృష్టించుకున్నవే. వాటికి ఎలాంటి అస్తిత్వం లేదు’ అనే క్రిస్టినా కోచ్ శాస్త్రీయ విషయ సంపన్నురాలే కాదు, సామాజిక స్పృహ మూర్తీభవించిన మహిళ. చంద్రుడిని చుట్టి రావడానికి, ‘ఆర్టెమిస్–2’ మిషన్లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన నలుగురు వ్యోమగాములలో ఆమె ఒకరు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా గతంలో రికార్డ్ సృష్టించిన కోచ్ తాజాగా... చంద్రుడి కక్ష్యలో ప్రయాణించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు.మిచిగాన్ (అమెరికా)లోని గ్రాండ్ రాపిడ్స్లో జన్మించి, నార్త్ కరోలినాలోని జాక్సన్విల్లేలో పెరిగిన క్రిస్టినా కోచ్ నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీలు చేశారు. ఆమెకు నాసా మిషన్లు కొత్తేమీ కాదు. 2013లో తొలిసారిగా నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు.రికార్డ్ సృష్టించి...2019లో అంతరిక్షంలో 328 రోజుల పాటు సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డ్ సృష్టించారు కోచ్. అక్టోబర్ 2019లో జెస్సికా మీర్తో కలిసి ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్లో కూడా కోచ్ పాల్గొన్నారు. అల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అప్గ్రేడ్ కోసం రోబోటిక్స్ చేయడం, ఫార్మాస్యూటికల్ పరిశోధన కోసం ప్రోటీన్ క్రిస్టల్స్ పెంచడం, సూక్ష్మ గురుత్వాకర్షణలో 3డీ బయోలాజిక్ ప్రింటర్లను పరీక్షించడం... మొదలైనవి ఆమె చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు.అంటార్కిటికాలో...‘ఆర్టెమిస్–2’ మిషన్కు ఎంపిక కావడానికి ముందు ‘నాసా’ ఆస్ట్రోనాట్ ఆఫీస్లో అసైన్డ్ క్రూ బ్రాంచ్కు చీఫ్గా... నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో సెంటర్ డైరెక్టర్కు టెక్నికల్ ఇంటిగ్రేషన్ అసిస్టెంట్గా పనిచేశారు కోచ్. ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న కోచ్ అంటార్కిటికాలోని స్కాట్ సౌత్ పోల్ స్టేషన్, పామర్ స్టేషన్లలో అగ్నిమాపక, శోధన, రక్షణ బృందాలలో పనిచేశారు.అంతరిక్ష యోగా!‘మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుంది’ అని చెబుతారు పెద్దలు. క్రిస్టినా కోచ్కు యోగా చేయడం అంటే ఇష్టం. మరి అంతరిక్షంలో అది సాధ్యపడుతుందా?‘యస్’ అంటున్నారు కోచ్. తన గత అంతరిక్ష యాత్రలో యోగా ప్రముఖ పాత్ర పోషించిందని చెబుతుంటారు కోచ్. ‘నేను ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు యోగా చేశాను. అక్కడ యోగా చేయడం చాలా కష్టం అనుకుంటారు. కాని అది నిజం కాదు. కొన్ని ఆసనాలు చేయడం కష్టంగా అనిపించినప్పటికీ అక్కడ యోగా చేయడం చాలా సరదాగా ఉంటుంది. యోగా అనేది అద్భుతమైనది.మైక్రో గ్రావిటీ (బరువు లేని స్థితి) లో కూడా అన్వేషించడానికి అనేక రకాల ఆసనాలు ఉంటాయి. అంతరిక్షంలో సాధన చేసినా, భూమిపై చేసినా యోగా ఎప్పటికీ యోగానే. అది అంతరిక్షం అయినా సరే, అన్వేషణ మన నుంచి దూరం కాదు. అన్వేషణ అనేది ఎందుకు మానవ సహజమో మనకు అక్కడ అర్థమవుతుంది. అన్వేషణ అనేది మన డీఎన్ఏలోనే ఉంది. మనం ఇష్టపడే వాటిని కొత్త వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మనం సహజంగా చేసే పని’ అంటారు క్రిస్టినా కోచ్. శాస్త్ర ప్రపంచానికి ఆవల కోచ్కు సర్ఫింగ్, ఐస్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్, సామాజిక సేవ అంటే ఇష్టం.రికార్డ్లు బద్దలు కావాల్సిందే!→ మీరు ఇప్పటికే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రకు సంబంధించిన రికార్డ్ను బద్దలు కొట్టారు. మరో రికార్డ్ను కూడా సృష్టించడానికి రెడీ కావడం ఉలా ఉంది?క్రిస్టినా కోచ్: నేను రికార్డ్లు, వ్యక్తిగత విజయాల గురించి ఆలోచించను. మరొకరికి స్ఫూర్తినివ్వడం గురించి, అత్యాధునిక సాంకేతికతకు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేయడం గురించి ఆలోచిస్తాను. ఇక రికార్డ్ల విషయానికొస్తే... మీరు ఎక్కడికి వెళ్లారు? అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపారు... అనేది ముఖ్యం కాదు. ఆ సమయంలో మీరు ఏం చేశారు అనేది ముఖ్యం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నా లక్ష్యం ఎప్పుడూ అదే. రికార్డ్లు వీలైనంత త్వరగా బద్దలు కావాలనేది నా కోరిక. రికార్డ్లు బద్దలు కావడం అంటే దాని అర్థం మనం నిరంతరం విస్తరిస్తున్నామని!→ శాస్త్రీయ అన్వేషణకు సంబంధించి నాసా వైఖరి?కోచ్: ఒక శాస్త్రీయ అన్వేషణకు మనం స్పందించి, మానవాళి మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమని నాసా చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. ఇది సంతోషకరమైన విషయం. వ్యోమగాముల బృందం మానవాళి మొత్తానికి ప్రతినిధిగా ఉంది. అన్వేషణకు సంబంధిన ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ వ్యోమగాముల బృందంలో భాగమయ్యేలా చేసుకోవడమే విజయానికి అత్యత్తమ మార్గం.→ అంతరిక్ష అనుభూతి గురించి...కోచ్: అంతరిక్షం నుంచి వెనక్కి తిరిగి భూమిని చూడడం అనేది అద్భుత అవకాశం. అనంతమైన విశ్వంలో భూమి ఎలా కనిపిస్తుందో చూడడం అనేది జీవితంలో ఎన్నో అనుభవాల కంటే అతి ముఖ్యమైనది. వాతావరణానికి సంబంధించి పలుచని నీలి గీతను చూడడం ద్వారా మన మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువగా ఉన్నాయని, మనమందరం సంతోషంగా జీవించడానికి ఒకే విధానంపై ఆధారపడుతున్నామని, మానవులుగా మనం గీసుకునే గీతలు, సరిహద్దు రేఖలు, విభజనలు అన్నీ మనం సృష్టించుకున్నవే అని, నిజానికి వాటికి ఎలాంటి అస్థిత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. -
వివాహిత మహిళలు గూగుల్లో ఏం సర్చ్ చేస్తున్నారో తెలుసా..!
పెళ్లికి ముందు వరకు అమ్మాయిల లైఫ్ చదువులు, కాలేజ్ లైఫ్ తదనంతర ఉద్యోగం వంటివాటితో హాయిగా తుళ్లుతూ సాగిపోతుంది జీవితం. పెద్దగా ట్రబుల్స్ ఏమి ఉండవు. తల్లిదండ్రుల వద్ద గారాభంగా, ముద్దుగా ఏ చీకు చింత లేకుండా గడిపేస్తారు. పెళ్లి అనే రెండే అక్షరాల బంధంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో అప్పుడే బాధ్యతలు, బరువు ఒకేసారి మీద పడినట్లుగా ఉంటుంది జీవితం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే వాటిపై అటెన్షన్ ఎక్కువై ఒకటే ఆత్రం, ఆందోళన వెంటాడుతూ ఉంటాయి. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిలంతా గూగుల్ని అవే ఎక్కువ అడుగుతున్నారట. వాళ్లంతా చిటికెలో దొరికే పరిష్కారాల కోసం గూగుల్ని అడుగుతున్న విచిత్రమైన ప్రశ్నలేంటంటే..1. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ భర్తలను సంతోషంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పర్యవసానంగా, వారు తమ భర్త ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎలా?, ఏం చేయకూడదు, ఎలా తీసుకోకూడదు వంటి వాటిని సర్చ్ చేస్తున్నారట. ముఖ్యంగా తమ భర్త సంతోషం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారట.2. వివాహిత మహిళలల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక ప్రశ్న, తమ భర్త మనసును గెలుచుకోవడం ఎలా అనేది. భర్త సంతోషంగా ఉంటేనే కదా మనల్ని సంతోషంగా ఉంచుతాడనే నమ్మకంతో దానికోసం చిట్కాల కోసం వెతుకుతారట. .3. తమ భర్తలను విధేయులుగా ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి కూడా ఎక్కవగా సర్చ్ చేస్తున్నారట. కొంతమంది మహిళలు తమ భర్తలు తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకే దీనిపై గూగుల్ని ఎక్కువగా సలహాలు కోరుతున్నారట.4 కొత్తగా పెళ్లైన వారిలో పిల్లలను కనడానికి సరైన సమయం గురించిన ప్రశ్నలు కూడా వస్తుండటం విశేషం. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, చాలా మంది మహిళలు జాగ్రత్తగా, ప్రణాళికతో మాతృత్వాన్ని స్వీకరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ని ఆశ్రయిస్తున్నారట.5. కొత్త కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలామంది కొత్త వధువులు కొత్త ఇంట్లో తమ సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలిని కుటుంబసభ్యులతో సముచితంగా ఎలా మెలగాలి వంటి సలహాలు కూడా అడుగుతున్నారట.6. వివాహంతో వచ్చే బాధ్యతలు అధిక భారాన్ని మోపవచ్చు. మహిళలు తరచుగా ఈ కొత్త విధులను నిర్వహించడానికి వ్యూహాల కోసం వెతుకుతున్నారట. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద హాయిగా సాగిన జీవితాల్లోకి ఒక్కసారిగా వచ్చిపడిన బాధ్యత భారం ఎలా నిర్వహించాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుందట మహిళల్లో. 7. కొందరైతే ఫ్యామిలీ లైప్, వృత్తి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఆందోళన చెందుతున్నారట. వృత్తిపరమైన ఆశయాలకు కుటుంబ జీవితం ఆటంకంగా మారకూడదనే ఆందోళన నేపథ్యంలో దీనిపై ఎక్కువగా గూగుల్లో సర్చ్ చేస్తున్నారట. చెప్పాలంటే మహిళలు సమర్థవంతమైన సమయ నిర్వహణతో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చెయ్యొచ్చు అని సలహాలు అడుగుతుండటం విశేషం. (చదవండి: జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!) -
సక్సెస్కి చిరునామా అతడు..!
‘హాయిగా గడిచిపోతుంది కదా...రిస్క్ ఎందుకు!’ అనుకునే వాళ్లకు రిస్క్తోపాటు సక్సెస్ కూడా దూరంగానే ఉంటుంది! ‘సక్సెస్ దక్కాలంటే రిస్క్ చేయాల్సిందే’ అనుకునేవాళ్లే విజేతలవుతారు. రోహిత్ రేజి కొన్ని స్టార్టప్లలో ఉద్యోగాలు చేశాడు. ‘నేనే ఒక స్టార్టప్ ఎందుకు మొదలు పెట్టకూడదు’ అనే ఆలోచనతో నియోక్రెడ్ టెక్నాలజీస్ మొదలు పెట్టి అద్భుత విజయం సాధించాడు... బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేలా చూసే సాంకేతికతను, సమస్యల పరిష్కారాలను ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’ రూపొందించింది. ఇది బి2బి2సి స్టార్టప్. నియోక్రెడ్ అనేది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేసే సంస్థ. మన దేశంలోని అగ్రశేణి బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, రేజర్పే, పేటీఎం వంటి ఫిన్టెక్లు ‘నియోక్రెడ్’ కస్టమర్లు.అసలైన సామర్థ్యం అదే!‘ఏఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుండి బీకామ్ పూర్తి చేసిన తరువాత ‘ఎక్స్పెడైట్’ అనే స్టార్టప్లో నాలుగు సంవత్సరాలు పనిచేశాడు రోహిత్. ‘లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టి)’లో కొంతకాలం పనిచేసిన తరువాత టెడ్ఎక్స్ టాక్ షోలను నిర్వహించడానికి ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ తరువాత బెంగళూరులో ‘ఎంఎస్ఎస్’ పేమెంట్స్ అనే స్టార్టప్లో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సొంత స్టార్టప్ గురించి ఆలోచించాడు.‘ఓపెన్ బ్యాంకింగ్ రంగంలో పరిష్కారాలను రూపొందించడంలోనే అసలైన సామర్థ్యం ఉందని గ్రహించాను’ అంటున్న రోహిత్ ఆ సమస్యల పరిష్కార వేదికగా ‘నియోక్రెడ్ టెక్నాలజీస్’కు శ్రీకారం చుట్టాడు. ఓపెన్ బ్యాంకింగ్ అనేది సురక్షితమైన ఏపీఐలను ఉపయోగించే ఒక వ్యవస్థ. దీనిద్వారా అధీకృత థర్డ్–పార్టీ ప్రొవైడర్లు(ఫిన్టెక్ల వంటివి) కస్టమర్ల బ్యాంక్ డేటాను వారి అంగీకారంతో యాక్సెస్ చేస్తాయి.నమ్మకం ప్లస్ గుర్తింపుయెస్ బ్యాంక్తో కలిసి 2018–19లలో ప్రీపెయిడ్ కార్డులను ప్రారంభించింది నియోక్రెడ్. కోవిడ్ కల్లోల కాలం తరువాత ‘రూపే ఆన్ ది గో’ అనే పైలట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్స్ ఆఫ్ ఇండియా)తో కలిసి సహ–భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఇది మాకు నమ్మకాన్ని, గుర్తింపు రెండిటినీ ఇచ్చింది’ అంటాడు రోహిత్. కొన్ని సంవత్సరాల క్రితం రోహిత్ స్టార్టప్కు విరెంక్సియా, ఏంజెల్ ఇన్వెస్టర్ రాజేష్ జైన్ నుంచి ఎనిమిది కోట్ల సీడ్ ఫండింగ్ వచ్చింది. ప్రొడక్ట్స్లైన్స్ నియోక్రెడ్కు మూడు ఉత్పత్తి శ్రేణులు(ప్రొడక్ట్ లైన్స్) ఉన్నాయి. ఐడెంటీ మెనేజ్మెంట్ (ప్రొఫైల్ ఎక్స్), ప్రైవసీ(బ్లూటిక్), పేమెంట్స్ (కలెక్ట్ బాట్)‘నియోక్రెడ్’ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు రోహిత్ రెజి,‘ఇతర దేశాలలో ఐడెంటిటీ ప్రొఫైలింగ్, ప్రైవసీ, పేమెంట్స్ ఫ్లాట్ఫామ్లను నిర్మించాలనుకుంటున్నాం. మౌలిక సదుపాయాలకు సంబంధించి స్థానిక అవసరాలు తీర్చాలనుకుంటున్నాం’ అంటున్నాడు రోహిత్. దీనికి సంబంధించి సింగపూర్, దుబాయ్లోని పార్టీలతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నాడు. ‘నియోక్రెడ్’లో ప్రస్తుతం 140 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సగం మంది టెక్ నిపుణులు. ‘తమ లక్ష్యం గురించి నిరంతరాయంగా కష్టపడడం, నిబద్ధత నియోక్రెడ్ విజయానికి కారణం’ అంటున్నారు ‘అల్వారెజ్ అండ్ మార్సల్’ గ్లోబల్ ట్రాన్సాక్షన్ అడ్వైజరీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ భావిక్ హతి. సక్సెస్ అనేది కంఫర్ట్ జోన్ నుంచి రాదు. సవాళ్లను అధిగమించే శక్తి నుంచి వస్తుంది.'– రోహిత్ రెజి(చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్స్టైల్స్తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!
అవసరం, ఆకలి బాధ ఆ యువకుడని ఆవిష్కరణ బాట పట్టేలా చేసింది. అతడిలోని టాలెంట్ని వెలికితెచ్చేలా చేసి..జీవితానికి మార్గం చూపింది. అంతేగాదు ఎప్పుడో వదిలేసిన చదువు వైపుకి వెళ్లేలా చేసి..ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలే అభ్యున్నతిని సాధించేందుకు దారితీసింది. తన జీవితంలోకి వచ్చిన ఆ వెలుగుని పదిమందికి పంచి తనలాంటి వాళ్ల అభ్యున్నతికి పాటుపడుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.అతడే కమ్క్వాంబా. దక్షిణాఫ్రికా మలావిలోని మసితాలా అనే గ్రామీణ గ్రామంలో పెరిగాడు క్వాంబా. అతని కుటుంబాని మొక్కజొన్న పంటే ఆధారం. 2001లో కరువు, భారీ వర్షాలు దీనికి తోడు ప్రభుత్వం ధాన్యం నిల్వలు అమ్మేయడంతో ఏర్పడిన తీవ్రమైన ఆహార సంక్షోభం కారణంగా కరువు సంభవించింది. దాంతో అతడి కుటుంబం స్కూల్ ఫీజులు భరించలేక అతడిని పాఠశాలకు పంపించడం మానుకుంది. అయితే ఒకరోజు తన గ్రామ గ్రంథాలయంలో 'యూజింగ్ ఎనర్జీ' అనే పుస్తకాన్ని అరువుతెచ్చుకుని మరి తన చదవుని కొనసాగించే ప్రయత్నం చేశాడు. అందులోని గాలిమర అతడిని తెగ ఆకర్షిస్తుంది. అయితే ఆ పుస్తకం పూర్తిగా ఆంగ్లంలో ఉంది. అతనికి ఇంగ్లీష్ అంత బాగా రాదు. అయితే అందులోని బొమ్మలు అతడికి మార్గాన్ని చూపాయి. దాంతో అతడు పనికిరాని లోహపు ముక్కలు, ట్రాక్టర్ భాగాలు, సైకిల్ ముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, చెట్లకొమ్మలతో 16 అడుగుల గాలిమరను రూపొందించాడు. అయితే పనిచేస్తుందా లేదా అనే సందేహంతో భయపడతాడు. కానీ అనుహ్యంగా ఆ యంత్రం పనిచేస్తుంది. పైగా అది అతడి ఆకలి జీవితాన్ని మార్చేసింది. ఆ గాలిమర అతన కుటుంబంలో నాలుగు లైట్లు, రెండు రేడియోలకు విద్యుత్ అందించింది. త్వరలోనే పొరుగువారు ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు వచ్చేవారు. అలా ఆ ఒక్క ఆవిష్కరణ కామ్క్వాంబాను స్థానికంగా, జాతీయంగా వేలాదిమందికి సుపరిచితమైన వ్యక్తిగా మార్చింది. అతడి కథ వార్తపత్రికల నుంచి ఆన్లైన్లో వ్యాపించి..చివరికి టెడ్ దృష్టిని ఆకర్షించింది. ఆ విధంగా అతనికి TEDGlobalకు ఫెలోషిప్ ఆహ్వానం అందింది. అక్కడ క్వాంబ్ తన ఆవిష్కరణ గురించి, నీటి పారుదల కోసం గాలిమరను నిర్మించాలనే తన ఆకాంక్ష తిరిగి చదువుకోవాలనే చిరుఆశ గురించి మాట్లాడాడు.అలా అతడు నిర్మించిన యంత్రం అతడి చదువుకి వారధిగా మారి..దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ లీడర్షిప్ అకాడమీలో చేరి చదువుకునే అవకాశం దక్కేలా చేసింది. ఆ తర్వాత 2014లో డార్ట్మౌత్ కాలేజీ నుంచి పర్యావరణ అధ్యయనాల డిగ్రీ పట్టాను పొందాడు. క్వాంబా ఆవిష్కరణలు అక్కడితో ఆగలేదు..తన గ్రామంలో విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి, నీటిని తోడటానికి ఇతర గాలిమరలను కూడా నిర్మించాడు. 2008లో, అతను 'మూవింగ్ విండ్మిల్స్ ప్రాజెక్ట్'ను సహ-స్థాపించాడు. ఈ ప్రాజెక్ట్ మసిటాలా ప్రాంత నివాసితులతో కలిసి స్వచ్ఛమైన నీటి బావులు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల కోసం సౌర ఫలకాలు, రోజువారీ వ్యవసాయ సమస్యలకు సరళమైన పరిష్కారాలపై పనిచేస్తుంది. ఆ ఒక్క ఆవిష్కరణ మౌలిక సదుపాయల దిశగా నడిపించింది క్వాంబాని. తన ఇంటికే కాదు మొత్తం సమాజానికే ఉపయోగపడేలా సామాజిక సేవలో భాగమవుతున్నాడు. ఓ పేద బాలుడు..అతడి ఆకలి, అవసరాలు ఆవిష్కరణ దిశగా అడుగులు వేసి..ఎన్నో గొప్ప పనులు చేసేలా శ్రీకారం చుట్టింది. చిన్న చిన్న అవరోధాలు, సమస్యలకు బాధపడిపోయే యువత..క్వాంబా కథ గొప్ప ప్రేరణ. ఏం రాదు, నావల్ల కాదు అనుకుంటూ కాలక్షేపం చేయకూడదు..అందుబాటులో ఉన్నవే గొప్పవిగా..అవే మనకు గమ్యాన్ని చూపే ఆయుధాలుగా మార్చుకోవాలని క్వాంబా కథ చెబుతోంది కదూ..!.(చదవండి: రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ ..! ప్లీజ్ కూతుళ్లను ఇలా పెంచుదాం..) -
’రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ ..! ప్లీజ్ కూతుళ్లను..
‘ఆ అమ్మాయి ఎంత నల్లగా ఉందో..’‘అమ్మో, ఆమె బరువుకు ఆ స్టేజ్ విరిగిపోతుందేమో..!’‘ఆ ముక్కు ఎంత వంకరో ...’‘ఎత్తు పళ్లు..’ ‘చీమ కళ్లు..’ఇలా సూదుల్లా మనసును గాయపరిచే మాటలకు ఆత్మన్యూనతతో కుంగిపోతూ... ‘శరీరాన్ని సరిచేసుకోవాలి’ అనే మనస్తత్వాన్ని పెంచుకుంటున్నారు అమ్మాయిలు. ఈ క్రమంలో కెరియర్ వైపు కాకుండా రూపం కోసం తమ సమయాన్ని, డబ్బును ఖర్చు చేస్తున్నారు. ‘శారీరక సౌందర్యం మనల్ని పరిపూర్ణ వ్యక్తులను చేయదు. మన శరీరం ఓ వస్తువు కాదు, సరిచేసుకోవడానికి’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు.‘బాడీ షేమింగ్’ అనేది రూపానికి సంబంధించినది మాత్రమే కాదు. తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన ఒక లోతైన సమస్య. కొందరు ఎదుటివారి శారీరక లోపాలను ఎగతాళి చేస్తే, మరికొందరు తమ శరీర లోపాలకు తమను తామే తిట్టుకుంటుంటారు. కాలేజీకి వెళ్లాల్సిన స్నేహ రెడీ అవడానికి ఈ మధ్య అద్దం ముందు నిలబడటం లేదు. ఫొటోలకు దూరంగా ఉంటోంది. గ్రూప్లో ఉన్నా, తనకి తాను కనిపించనట్టు వెనకే ఉంటోంది. ఒక రోజు క్లాస్లో సబ్జెక్ట్పై ప్రెజెంటేషన్ ఉంది. ఆమె దానికి ప్రిపేర్ అయ్యి వచ్చింది. కానీ స్టేజ్ మీదకు వెళ్లే ముందు, వెనుక నుండి ఎవరో ‘స్టేజ్ బ్రేక్ అవుతుందేమో?’ అనే జోక్కి కొంతమంది నవ్వారు. మరికొంతమంది నవ్వు ఆపుకున్నారు. అంతే, స్టేజీ ఎక్కకుండానే వచ్చి తన సీటులో కూర్చొంది. ఆ రోజు తర్వాత ఆమె మాట్లాడటం తగ్గించింది. స్నేహితులతో కలవడం లేదు. ఇంట్లో కూడా ఓ మూలన ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటుంది. తల్లిదండ్రులు ఎంత అడిగినా.. ‘ఏమీ లేదని’ దాటేస్తోంది.∙∙ 2025లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ రీసెర్చ్ ప్రకారం, బాడీ షేమింగ్ అనుభవం జెండర్ పరంగా చూస్తే భిన్నంగా ఉంది. మైసూరులో 10–19 ఏళ్ల మధ్య 155 మంది యువతులపై చేసిన అధ్యయనంలో, అమ్మాయిలలో 23.2 శాతం మంది బాడీ షేమింగ్ సమస్య అనుభవిస్తున్నారని చెప్పారు. అబ్బాయిలలో ఈ సమస్య 7.1 శాతం మాత్రంగానే ఉంది.మనసుపై ఒక నిశ్శబ్ద దాడిబాడీషేమింగ్ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మైండ్లో బ్లాక్ స్పాట్స్ ఏర్పడి, మానసిక వికాసానికి అడ్డంకి అవుతాయి.ఆందోళన పెరిగి, మనో నిగ్రహంపైన ప్రభావం చూపుతుంది.డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. తాను ‘దేనికీ సరికాదు’ అనే భావన పెరుగుతుంది.శరీరాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచనతో ‘జిమ్కి వెళ్ళాలి, కాస్మటాలజీ చికిత్స చేయించుకోవాలి, మందులు వాడాలి, పోషకాహారం తినాలి...’ ఇలా వీటిమీద ఫోకస్ పెరుగుతుంది. దీంతో బ్యూటీ సెంటర్స్కు నెలకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చుపెడుతున్నవారున్నారు. స్లిమ్మింగ్ సెంటర్స్వైపు మొగ్గుచూపుతున్నారు. మధ్య, దిగువ తరగతికి ఇది పెను భారం అవుతోంది. కలర్ ట్రీట్మెంట్స్ ఇటీవల బాగా పెరుగుతున్నాయి. బ్యూటీ మెయింటెనెన్స్ విషయంలో అమ్మాయిలు ఇంట్లో వాళ్లమీద ఒత్తిడి పెంచుతున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కుటుంబ స్థితిగతులపైనా ప్రభావం చూపుతుంది. కెరియర్ పరంగా ఎదగాలనుకునేవారు బాడీషేమింగ్ వల్ల శరీరంపై దృష్టిపెట్టి, తమపైన తాము ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ఏం చేయాలంటే...డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో శరీరాకృతిని విమర్శించడం సైబర్ బుల్లియింగ్కు సంబంధించినదే. ఆన్లైన్–ఆఫ్లైన్ లో శరీరాకృతిని విమర్శించే వారిని ఎదుర్కోవడానికి, వారు కలిగించే బాధను, వేదనను అధిగమించడానికి, ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికి మార్గాలు ఉన్నాయి. ప్రతిభను అణచివేయడానికి అసూయ వల్ల ఇలా ‘బాడీషేమింగ్’కు పాల్పడుతున్నారని గ్రహించాలి. ఆహారాన్ని తగ్గించడం వల్ల పోషకాలు మైండ్కు చేరకపోవచ్చు. అందుకని సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. కరుణ, సహనం .. వంటివి అలవర్చుకోవడానికి సాధన చేయాలి. శారీరక సౌందర్యం కంటే, ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరులు ఎగతాళి చేసే రూపం కంటే తమలో తమకు నచ్చిన విషయాల పట్ల దృష్టి పెట్టాలి. ఒక రోజు స్నేహ అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుండగా తల్లి చూసి అడిగింది. బాడీషేమింగ్ విషయం చెబుతూ ‘నా త΄ప్పా?!’ అని అడిగింది. ‘అలా అన్నవారి ఆలోచనలే తప్పు’ అని కూతురిని దగ్గరకు తీసుకుంది. విమర్శలను కాదని, తన శరీరాన్ని తాను అంగీకరించడం నేర్చుకుంది.తప్పక ఛేదించాల్సిందే!మన కూతుళ్లు తమ శరీరానికి సంబంధించి అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉండాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ గాయాలు ఒక రోజులో అనుకోకుండా అయినవి కావు. మనం ఈ బాధాకరమైన సాంస్కృతిక వారసత్వాన్ని తప్పక ఛేదించాల్సిందే. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే ’రైజింగ్ కాన్షియస్ డాటర్స్’ వర్క్షాప్ నిర్వహిస్తున్నాను. ఇందులో అమ్మాయిలు తమ బాల్యం నుండి ఎదుర్కోవాల్సిన అవసరం లేనివి, స్వేచ్ఛగా పెరగడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంటాను. మనందరం కలిసి మానసిక ఒత్తిడి లేని ఒక కొత్త తరాన్ని పెంచుదాం. – డాక్టర్ షెఫాలీ సబేరీ, క్లినికల్ సైకాలజిస్ట్ పాజిటివ్గా మార్చుకోవాలికొందరి ఇండ్లలో తల్లిదండ్రులు, కజిన్స్, బంధువులు.. కూడా శారీరక లోపాలతో పిలిచేవారుంటారు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. ఆత్మవిశ్వాసం లేనివారే ఎదుటివారి మనస్తత్వాన్ని దెబ్బతీస్తారనే విషయాన్ని ‘బాడీషేమింగ్’ అనుభవించేవాళ్లు అర్థం చేసుకోవాలి. మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలను గుర్తించి తమను తాము మార్చుకోవడం చాలా ముఖ్యం. మన శరీరం గురించి మనమే మంచి మాటలు చెప్పుకుంటే అది ఒక థెరపీలా పనిచేస్తుంది. పోలికల నుంచి దూరంగా ఉండాలి. వ్యక్తిత్వం, టాలెంట్ ముందు మిగతా వన్నీ చిన్నవే అని గ్రహించాలి.– డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..! నివేదికలో షాకింగ్ విషయాలు) -
లక్ష్యంతో మారే పర్సనాలిటీ!
చాలామందికి 'గోల్' (Goal) కి 'పర్పస్' (Purpose) కి తేడా తెలియదు. గోల్ అనేది మీరు 'ఏమి' సాధించాలనుకుంటున్నారు అనేది చెబితే, పర్పస్ అనేది మీరు అది 'ఎందుకు' సాధించాలనుకుంటున్నారు అని చెబుతుంది. ఒక బలమైన ఉద్దేశ్యం (Purpose) ఉంటే, మీ పర్సనాలిటీ ఒక సామాన్యుడిలా ఉండదు.. అది ఒక 'మిషన్' లా మారుతుంది. సైకాలజీలో దీనిని'Sense of Purpose'అంటారు.విక్టర్ ఫ్రాంక్ల్ (Viktor Frankl) అనే సైకాలజిస్ట్, నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపుల్లో మరణానికి దగ్గరగా ఉండి కూడా బ్రతికి బయటపడ్డారు. ఆయన కనిపెట్టిన సత్యం ఏంటంటే..."ఎవరి జీవితానికైతే ఒక అర్థంఉంటుందో, వారు ఎలాంటి కష్టాన్నైనా భరించగలరు."మీ పర్సనాలిటీని ఒక అయస్కాంతంలా మార్చే శక్తి ఈ 'పర్పస్'కు ఉంది.పర్పస్ ఉంటే మీలో వచ్చే మార్పులు (Psychological Shifts): ఒక ఉద్దేశ్యం ఉన్న వ్యక్తి పర్సనాలిటీలో ఈ మూడు స్పష్టంగా కనిపిస్తాయి.Laser Focus: మీకు పర్పస్ ఉన్నప్పుడు, అనవసరమైన పనులు, గాసిప్స్, డిస్ట్రాక్షన్స్ మీకు చిన్నవిగా కనిపిస్తాయి. మీ సమయం దేనికి ఖర్చు చేయాలో మీకు స్పష్టత ఉంటుంది.Resilience: సమస్యలు వచ్చినప్పుడుపర్పస్ లేనివాడు కుంగిపోతాడు. కానీ పర్పస్ ఉన్నవాడు "ఇది నా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే" అని మరింత బలంగా లేస్తాడు.Gravitas: మీ మాటల్లో, నడకలో ఒక రకమైన 'బరువు' వస్తుంది. మీరు ఏదో సాధించడానికి పుట్టారు అనే నమ్మకం ఎదుటివారికి మీ ప్రెజెన్స్ ద్వారానే అర్థమవుతుంది.గోల్ vs పర్పస్: తేడా ఏంటి?గోల్ అనేది ఒక మైలురాయి అయితే, పర్పస్ అనేది ఒక దిక్సూచి (Compass). "నేను ఒక కోటి రూపాయలు సంపాదించాలి" లేదా "నేను ఈ పదవిని అందుకోవాలి"అనే గోల్ ఇది సాధించగానే ఆగిపోతుంది. కానీ "నేను నా జ్ఞానంతో ఒక లక్ష మంది జీవితాలను మార్చాలి" అనే పర్పస్ నిరంతరం సాగుతుంది.మోటివేషన్ మాయ vs పర్పస్ డ్రివెన్ పవర్మోటివేషన్ బయట నుండి వచ్చే 'కిక్'. వీడియో చూస్తే వస్తుంది, కాసేపయ్యాక పోతుంది. పర్పస్ లోపల నుండి వచ్చే 'జ్వాల'. ఎవరూ మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా, పరిస్థితులు బాగోకపోయినా ఇది మిమ్మల్ని నిద్రపోనివ్వదు.మీ పర్పస్ ని ఎలా కనుక్కోవాలి?పర్పస్ ఫుల్ పర్సనాలిటీగా మారడానికి మూడంచెలు... Step 1: Break Selfish Thoughtsకేవలం "నాకు ఏం వస్తుంది?" అనే చిన్న ఆలోచనను 'Break' చేయండి. పర్పస్ ఎప్పుడూ మీకంటే పెద్దదై ఉండాలి. మీరు సమాజానికి లేదా మీ వృత్తికి ఏ Valueఇస్తున్నారో ఆలోచించండి.Step 2: Build Ikigaiమీకు ఇష్టమైనది, మీరు చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది—ఈ మూడూ కలిసే చోటే మీ పర్పస్ ఉంటుంది. దాన్ని ప్రతిరోజూ మీ పనుల్లో 'Build' చేయండి. మీ పర్సనాలిటీ మీ పర్పస్ కి ప్రతిరూపం కావాలి.Step 3: Legacy Building మీ పర్పస్ ని ఒక సిస్టమ్ గా మార్చండి. మీరు లేకపోయినా ఆ ఉద్దేశ్యం కొనసాగాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా మీ పర్పస్ ద్వారా మనుషులు ప్రభావితం అవ్వడమే 'Beyond' స్టేజ్.మీ 'ఎందుకు' (Why) ఏంటి?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. రేపు పొద్దున్నే మీరు బెడ్ మీద నుండి ఎందుకు లేవాలి? దానికి డబ్బులు కాకుండా వేరే బలమైన కారణం ఉందా?2. మీ జీవితంలో మీరు సాధించే విజయం వల్ల మీ కుటుంబం కాకుండా మరో పదిమందికి ఏమైనా లాభం ఉందా?3. మీరు చేస్తున్న పనిలో మీకు 'సార్థకత' (Fulfillment) కనిపిస్తోందా?పర్పస్ ఉంటే మీరు అజేయులు!పర్పస్ లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. అలలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. కానీ ఒక పర్పస్ ఉంటే, మీరు సముద్రాన్నే శాసిస్తారు. మీ వ్యక్తిత్వం ఒక వెలుగు కిరణంలా మారుతుంది."The two most important days in your life are the day you are born and the day you find out why."Mark Twain సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com (చదవండి: మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?) -
అతనే.. భామ
ఆమె నృత్యం చేస్తున్నంతసేపూ అపురూప అందాల రాశి అనుకుంటూ కనురెప్పలు కొట్టడమే మానేసి కళ్ళప్పగించి చూస్తాం! ప్రదర్శన పూర్తయ్యాక కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఆమె కాదు, అతను... పేరు సంజయ్ వడపల్లి అని వ్యాఖ్యాత ప్రకటించగానే హాలు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది! అవును అతను సంజయ్ వడపల్లి! ఆంధ్రనాట్యంలో అద్భుత నర్తకిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, అభినవ సత్యభామ డాక్టర్ కళాçకృష్ణ ఆయన గురువులు. ప్రస్తుతం హెచ్.ఎస్.బి.సి హాంగ్ కాంగ్ బ్రాంచ్లో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.తన 8వ ఏట డాక్టర్ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య, తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్ కళాçకృష్ణ దగ్గర ప్రబంధ సాంప్రదాయ నవ జనార్ధన పారిజాతం నేర్చుకున్నారు. తొలిసారి సత్యభామ వేషం ధరించి నాట్యం చేసినప్పుడు లభించిన ప్రశంసలతో నాట్య రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్ తెలిపారు. తాను సత్యభామగా నర్తించినప్పుడు వేదికపై చూసిన వారు, ఆ తరువాత మేకప్ తొలగించుకుని పలకరిస్తే ఆశ్చర్య పోయేవారని, తానే సత్యభామ అంటే నమ్మే వారు కాదంటూ తొలినాటి ప్రదర్శనల అనుభూతులను గుర్తు చేసుకున్నారు. సంజయ్ వడపల్లి సత్యభామగా నవ జనార్దన పారిజాతంతో1985 నుంచి దేశంలోని వివిధ నృత్యోత్సవాల్లో, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. యునెస్కో, హాంగ్ కాంగ్ ఇన్–క్రెడిబుల్ ఫెస్టివల్, అమెరికాలో జరిగిన నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్య రత్న పురస్కారంఆంధ్రనాట్యం, పేరిణి నాట్య సృష్టికర్త డాక్టర్ నటరాజ రామకృష్ణ పేరిట తమ డ్యాన్సింగ్ బెల్స్ సంస్థ నుంచి జాతీయస్థాయిలో నృత్య రత్న అవార్డును ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల్లో విశేష కృషి చేస్తూ విశ్వవ్యాప్తం చేసే గురువులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కింద 20 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ప్రతి యేటా గురువులను సత్కరిస్తామని, యువ నర్తకులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. ఆంధ్రనాట్య సోలో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంజయ్ ప్రతిష్టాత్మక సత్రాజితి అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అవార్డు, ఆంధ్రనాట్య కళాశౌర్య అవార్డు, సింగిడి తెలంగాణ పురస్కారం, నృత్యకౌముది, ముంబయి వారి జాతీయ సమైక్యతా నృత్య పురస్కారం లాంటి పలు అవార్డులు అందుకున్నారు. బాలనటుడైన సంజయ్ వడపల్లి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతి లయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్ధన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతోపాటు నాట్యాచార్య డాక్టర్ నటరాజ రామకృష్ణ, డాక్టర్ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావి తరాలకు అందించే ప్రయత్నమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ‘అభినవ అంతర్జాతీయ సత్యభామ’ సంజయ్ వడపల్లి తెలిపారు. ఈనెల 4న నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే తన ప్రదర్శనకు ఉచిత ప్రవేశం అని, కళాప్రియులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?
చాలామంది తమ జీవిత కాలమంతా కేవలం అవసరాల కోసమే బ్రతుకుతారు. కొద్దిమంది మాత్రమే తమ 'గరిష్ట సామర్థ్యాన్ని' (Full Potential) అందుకుంటారు. సైకాలజీలో Abraham Maslow చెప్పిన 'Hierarchy of Needs'లో అత్యున్నత శిఖరం ఈ'Self-Actualization' (ఆత్మ సాక్షాత్కారం లేదా స్వయం పరిపూర్ణత).సెల్ఫ్-యాక్చువలైజేషన్ అంటే పర్ఫెక్ట్ గా మారిపోవడం కాదు, మీలోని 'యథార్థమైన వెర్షన్' (Authentic Version) ని ఆవిష్కరించడం. మీరు ఒక డాక్టరో, ఇంజనీరో లేదా సైకాలజిస్టో కావచ్చు.. కానీ ఆ వృత్తిలో మీరు మీ ప్రత్యేకతను (Uniqueness) ఎలా చూపిస్తున్నారు అనేదే ముఖ్యం.మాస్లో పిరమిడ్లో మీరు ఎక్కడ ఉన్నారు?మాస్లో ప్రకారం, మనిషికి ఐదు రకాల అవసరాలు ఉంటాయి.1. శారీరక అవసరాలు: తిండి, నిద్ర.2. భద్రత: ఇల్లు, ఉద్యోగం.3. ప్రేమ/సంబంధాలు: కుటుంబం, స్నేహితులు.4. గౌరవం (Esteem): గుర్తింపు, ఆత్మగౌరవం.5. Self-Actualization: మీ అంతిమ లక్ష్యం, సృజనాత్మకత.చాలామంది మొదటి నాలుగు మెట్ల దగ్గరే ఆగిపోతారు. మీరు ఐదో మెట్టు ఎక్కాలంటే, మీ భయాలను దాటి మీ Purpose వైపు ప్రయాణించాలి.సెల్ఫ్-యాక్చువలైజ్డ్ వ్యక్తి లక్షణాలుమీరు గరిష్ట సామర్థ్యాన్ని అందుకుంటున్నారని చెప్పడానికి కొన్ని సంకేతాలు:Reality Perception: మీరు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు, భ్రమల్లో ఉండరు.Acceptance: మిమ్మల్ని మీరు, ఇతరులను ఏ విధమైన జడ్జిమెంట్ లేకుండా అంగీకరిస్తారు.Spontaneity: మీ ఆలోచనల్లో, పనుల్లో ఒక సహజత్వం ఉంటుంది.Peak Experiences: పని చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోయే Flow Stateని అనుభవిస్తారు.మోటివేషన్ మాయ vs యథార్థ వికాసం"వేరే ఎవరో సాధించిన దాన్ని చూసి నువ్వు కూడా అదే సాధించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది మిమ్మల్ని 'కాపీ' గా మారుస్తుంది. కానీ సైకాలజీ, "నీ లోపల ఉన్న ప్రత్యేకమైన విత్తనం ఏంటో చూడు, అది వృక్షం అయ్యేలా చెయ్యి" అని చెప్తుంది. సెల్ఫ్-యాక్చువలైజేషన్ అంటే ఇతరులతో పోటీ పడటం కాదు, మీ నిన్నటి వెర్షన్ని అధిగమించడం.మీ పొటెన్షియల్ని అన్లాక్ చేయండిGenius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, ఈ శిఖరాన్ని చేరే మార్గం:Step 1: Break Social Conditioning"లోకం ఏమనుకుంటుందో" అని మీ కలలను చంపుకునే ఆ పాత మనస్తత్వాన్ని 'Break' చేయండి. ఇతరుల అంచనాల కోసం కాకుండా, మీ ఆత్మ తృప్తి కోసం జీవించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆ 'లిమిటింగ్ బిలీఫ్స్' ని తొలగించండి.Step 2: Build Purpose Driven Lifeమీకు నచ్చిన పనిని, ప్రపంచానికి అవసరమైన పనిని గుర్తించి దాన్ని 'Build' చేయండి. మీ ప్రతిభను పదును పెట్టుకోండి. ప్రతిరోజూ 1% మెరుగవ్వాలనే 'Kaizen' సూత్రాన్ని పాటించండి. మీ సామర్థ్యం పెరిగే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.Step 3: Beyond Transcendenceమీరు ఒక స్థాయికి చేరాక, మీ పొటెన్షియల్ ని ఇతరుల మేలు కోసం వాడండి. మీరు కేవలం మీ కోసం కాకుండా, సమాజం కోసం ఒక 'వారసత్వాన్ని' వదిలి వెళ్ళినప్పుడే మీరు సంపూర్ణంగా సెల్ఫ్-యాక్చువలైజ్డ్ అయినట్లు. ఇదే 'Beyond' స్టేజ్.మీరు మీ పూర్తి స్థాయిలో ఉన్నారా?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీలో ఉన్న ఆ ఒక్క ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి? దాన్ని మీరు 100% వాడుతున్నారా?2. మీకు ఏ పనులు చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోతున్నారు? (Flow State)3. మీరు చనిపోయిన తర్వాత, జనం మిమ్మల్ని ఏమని గుర్తుంచుకోవాలి అని కోరుకుంటున్నారు?మీరే ఒక మాస్టర్ పీస్!బ్రో, ప్రతి విత్తనంలో ఒక అడవి దాగి ఉంటుంది. అలాగే మీలో ఒక అసాధారణమైన శక్తి ఉంది. దాన్ని బయటకు తీయడమే మీ జీవిత లక్ష్యం కావాలి. సెల్ఫ్-యాక్చువలైజేషన్ అనేది ఒక పాయింట్ కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీరు ఎంత ఎదిగితే, ప్రపంచం అంత వెలుగుతుంది."What a man can be, he must be."- Abraham Maslow సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా..) -
పాజిటివ్గా ఆలోచిద్దాం
మానసిక ఎదుగుదల లేని పిల్లలున్న తల్లి మనస్తత్వం.. ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నిపుణుల సూచనలు.. సమస్యను ఎదుర్కొనే తల్లులకే కాదు, ఎదుటివారి కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకునేవారికీ అవగాహన అవసరం.. ‘వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే’ సందర్భంగా రేపటిని నిర్మించే తల్లుల కోసం..కీర్తి పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. పిల్లలు కలగడం లేదని ఆందోళన చెందుతున్న ఆమెకు మరో ఏడాది లో బిడ్డ పుట్టాడు. ఆ ఇంట్లో ఎంతో ఆనందం. అయితే బాబుకు రెండేళ్ల వయసు వచ్చినా మాటలు రావడం లేదు. పిలిచినా స్పందన లేదు. ఇంట్లోవాళ్లు ‘కొందరు పిల్లలకు ఆలస్యంగా మాటలు వస్తాయి, అదేమంత పెద్ద విషయం కాదు...’ అనేవారు. కానీ, కీర్తి మనసులో ఏదో ఆందోళన. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. రకరకాల పరీక్షల తర్వాత డాక్టర్ ‘మీ పిల్లవాడికి ఆటిజమ్ సమస్య ఉంది’ అని చెప్పగానే ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపించింది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిసింది. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆరోజు నుంచి కీర్తి ‘నా పిల్లవాడికే ఎందుకు ఇలా జరిగింది...?’ అంటూ ఏడుస్తూనే ఉంది. పారిపోతే పరిష్కారం ఉందా?!మానసికంగా, భావోద్వేగంగా ఆటిజం పిల్లలున్న తల్లులు ప్రతి రోజూ సవాళ్లను ఎదుర్కొంటుంటారు. ∙ఆటిజం పిల్లల్లో శారీరకంగా ఎదుగుదల ఉంటుంది. కానీ, మానసికంగా ఇతరులపైనే ఆధారపడతారు కాబట్టి వారి భవిష్యత్తు గురించి తల్లి ఆందోళన చెందుతుంటుంది. ∙‘ఎప్పుడు ఏ పాపం చేశానో అని..’ తనను తాను నిందించుకుంటుంది. సమస్యకు దూరంగా ‘పారిపోదాం/ వదిలించుకుందాం’ అనుకునే సందర్భాలూ ఉంటాయి. ∙ఉద్వేగపూరిత ఆలోచనలు, పనుల ఒత్తిడి వల్ల తల్లి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటుంది. లేదంటే, తనను తాను అస్సలు పట్టించుకోదు. నలుగురిలో కలవడానికి ఇష్టపడదు. ఇలాంటి సందర్భంలో అనేకమంది నిపుణులను కలిసింది కీర్తి. వారి ఫీడ్బ్యాక్తో పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది.తనలో శక్తిని నింపుకుంటూ...మొదట్లో నెగిటివ్గా ఉన్నా... థెరపిస్ట్ సూచనలతో ఐ కాంటాక్ట్, సింపుల్ పదాలు, రోజువారీ పనులు చేయించడం.. మొదలు పెట్టింది. ప్రతీ చిన్న సాధన ఆమెకు ఒక ప్రోగ్రెస్ అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లవాడిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. అవి చూశాక.. తనను తాను ఇంకా బలంగా మార్చుకుంది. తన బిడ్డను స్వతంత్రంగా తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆటిజం సమస్య ఉన్న తల్లికి ఆ బిడ్డ ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకుంటే మనసు తేలికపడుతుంది. అప్పటినుంచి రోజు తర్వాత రోజు మెరుగ్గా మార్చుకోవడం ఎలాగో మార్గాన్ని అన్వేషిస్తుంది. భవిష్యత్తును ఆ తల్లి అందంగా నిర్మిస్తుంది. ప్లానింగ్తోనే ప్రోగ్రెస్! ∙పరిస్థితిని అర్థం చేసుకొని, అంగీకరించడం.. ఇది బలహీనత కాదు బలం అని గుర్తించడంతోపాటు సరైన శిక్షణ, సపోర్ట్ సిస్టమ్ ఉంటే భయం, ఆందోళన తగ్గుతాయి. ∙తల్లి బలంగా ఉంటేనే పిల్లలకు తగినంత సపోర్ట్ ఇవ్వగలదు. బిడ్డల మానసిక స్థితి బాగుండాలంటే నిపుణుల సహాయం తీసుకోవాలి. ∙ఆటిజం పిల్లలు ఎంత చిన్న పని చేసినా పెద్ద విజయంగా భావించి, ప్రోత్సహించాలి. తమకు తాముగా ధ్యానం, వాకింగ్, చదవడం.. వంటివి రోజువారీ ప్లానింగ్లో భాగం చేసుకోవాలి. ఈ అలవాట్లు మానసికంగా రీఛార్జ్ చేస్తాయి. ∙లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, ఫ్యామిలీ సపోర్ట్, ఆర్థిక ప్రణాళికలు .. భవిష్యత్తు గురించిన ఆందోళన తగ్గిస్తాయి.అంగీకరించాల్సిందే..!పిల్లల్లో ఆటిజం సమస్య ఉందని తెలిశాక తల్లులపై మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. అయితే భావోద్వేగంతో కాకుండా వాస్తవపరిస్థితిని అంగీకరించి, సమస్యను అర్థం చేసుకోవాలి అని చెబుతుంటాం. పూర్తిగా నయం కావడానికి ఇది జబ్బు కాదు. కొన్ని మార్చలేనివి కూడా ఉంటాయి. ప్రతి చిన్న ప్రయత్నాన్ని సహనంగా చేస్తూ ఉంటే, పిల్లల్లో మెల్ల మెల్లగా మార్పు వస్తుంది. మిగతావారితో పోల్చుకోకుండా, తమ బిడ్డను ప్రత్యేకంగా, ధైర్యాన్ని, మమకారాన్ని అందిస్తూ పెంచాల్సి ఉంటుంది. దీనికి కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిస్తే తల్లుల మీద ఒత్తిడి తగ్గుతుంది.– పటోళ్ల హారిక, బిహేవియర్ అనలిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
అచ్చం అమ్మలా...
సాంకేతికతకు, సామాజిక స్పృహ తోడైతే అది మానవత్వానికి మరో అడుగు అవుతుంది. ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు, సవాళ్ల గురించి తెలుసుకున్న ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ‘అయ్యో!’ అనుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. తమ ఆలోచనలు, సాంకేతిక జ్ఞానానికి పదును పెట్టి ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ను అన్ని రకాలుగా గైడ్ చేసే 24/7 థెరపిటిక్ ఏఐ–చాట్బాట్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.సాంగ్లీ (మహారాష్ట్ర)లోని రాజారాంబాపు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో తెల్లవారుజామున అక్కడొకరు, ఇక్కడొకరు నిద్ర లేస్తున్నారు. అయితే ఒక కంప్యూటర్ ల్యాబ్ లోపల ముగ్గురు యువ ఇంజినీర్లు మాత్రం నిద్ర అనేదే లేకుండా దీక్షగా పనిలో నిమగ్నమయ్యారు. కోడ్ను మెరుగు పరుస్తూ, రెస్పాన్స్ను పరీక్షిస్తూ ఏఐ సిస్టమ్కు శిక్షణ ఇస్తున్నారు. ‘న్యూరోస్టార్స్’గా పిలవబడే వైష్ణవి రాజ్కుమార్ పాటిల్, అభిషేక్ శివప్రసాద్, గణేష్ రామచంద్రలకు అదొక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్గా మారింది.ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు రోజూ ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడడానికి రూపొందించిన వారి ఏఐ–ఆధారిత చాట్బాట్ నేషనల్ ఏఐ హ్యాక్థాన్లో గ్రాస్ప్ 2026 గెలుచుకుంది. అయిదువేల మంది విద్యార్థులతో పోటీపడి ఈ ముగ్గురు ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్’ విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లక్ష రూపాయల నగదు, మెంటర్షిప్ అవకాశాలు, ఇంటర్న్షిప్స్, ఒక యూరోపియన్ యూనివర్శిటీతో కలిసి పనిచేసే అవకాశం వారికి లభించింది.ఆ రోజు నుంచే...ఈ ముగ్గురు మిత్రుల క్లాస్మేట్ ఒకరు ఒకరోజు తన సోదరికి ఉన్న ఆటిజం సమస్య గురించి వివరిస్తూ, తమ కుటుంబం పడే బాధలను చెప్పుకుంటూ వచ్చాడు. ‘అయ్యో!’ అనుకోవడానికే పరిమితం కాలేదు వారు. ఎంతోమంది యువతీయువకులతో ‘యునైటెడ్ ఫర్ ఆటిజమ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊరూవాడ, పాఠశాలలు తిరుగుతూ ఆటిజం గురించి అవగాహన పరిచేవారు. కాలక్రమంలో ఇది ‘డ్రీమ్ ఉడాన్ ఫౌండేషన్’ అనే రిజిస్టర్డ్ ఎన్జీవోగా రూపాంతరం చెందింది.‘డ్రీమ్ ఉడాన్ ఫౌండేషన్’తో ప్రయాణం ప్రారంభించిన తరువాత లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగలిగారు. మన దేశంలో ఆటిజం అనేది నిర్మాణాత్మక సవాళ్లతో కూడుకొని ఉంది. ఆటిజం గురించి బొత్తిగా అవగాహన లేని తల్లిదండ్రులు, పరిమిత సంఖ్యలో థెరపిస్ట్లు, అరుదైన సెషన్లు, అధిక ఖర్చులు... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కోవిడ్ కల్లోల కాలం తరువాత ఆటిజం కేసుల సంఖ్య 30 శాతం పెరిగిందనే వార్త ముగ్గురు మిత్రులను ఆందోళనకు గురి చేసింది.ఆ పరిశోధన ఫలితమే....శాస్త్రీయమైన మార్గదర్శకత్వం ఉంటే ‘ఇలా చేయాలి...అలా చేయకూడదు’ అనే అవగాహన తల్లిదండ్రులకు ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులకు శాస్త్రీయ మార్గదర్శకత్వం దొరకడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ స్టూడెంట్స్గా ‘ఆటిజం కేర్’కు సంబంధించి అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చు అయ్యే సాంకేతికత వైపు దృష్టి పెట్టిన ముగ్గురు మిత్రులు ఎన్నో పరిశోదనలు చేశారు. వారి పరిశోధన ఫలితమే.. 24/7 థెరపటిక్ ఏఐ–పవర్డ్ చాట్బాట్.‘ఇలా ఉండాలి... అంటూ చాట్బాట్కు సంబంధించి ఐడియా అయితే ఉందిగానీ, ఎలాంటి టూల్స్ను ఉపయోగించాలనేది మాకు తెలియదు’ అని తొలిరోజులను గుర్తు చేసుకున్నాడు అభిషేక్.సాంకేతికతకు సంబంధించి తమ డిపార్ట్మెంట్ హెడ్ సహాయం తీసుకున్నారు. దీనికి ముందు...‘చాట్జీపీటి కూడా ఆటిజంకు సంబంధించి మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది కదా, మరి మీ ప్రత్యేకత ఏమిటి?’ అని డిపార్ట్మెంట్ హెడ్ ప్రశ్నించారు. దీంతో మరింత లోతుగా పరి«శోధించాలనుకున్నారు. గూగుల్ సహకారంతో జరిగిన ‘హాక్థాన్’ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నెలరోజుల పాటు మెంటార్షిప్, గూగుల్ క్లౌడ్ టూల్స్కు యాక్సెస్ దొరకడంతో తమ సాంకేతిక విధానాన్ని అన్ని రకాలుగా మెరుగుపర్చుకునే అవకాశం వచ్చింది.స్కోర్ ఆధారంగా....డిపార్ట్మెంట్ హెడ్ ప్రశ్న ముగ్గురిని విస్తృతమైన పరిశోధన క్షేత్రంలోకి తీసుకువెళ్లింది. తమ అన్వేషణలో భాగంగా రీట్రైవల్–అగ్మెంటెడ్ జనరేషన్ (ఆర్ఏజీ), ఆగ్నెటిక్ ఏఐలాంటి సాంకేతికతను అధ్యయనం చేయడం ప్రారంభించారు. కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపిన కొద్దీ ప్రతి బిడ్డ అవసరాలు భిన్నంగా ఉంటాయని, ఆ అవసరాలకు తగినట్లుగా పరిష్కారాలు ఉండాలని ఆలోచించారు. అప్లికేషన్లో ఏక్యూ పరీక్షను ప్రవేశపెట్టారు. ఇది ప్రామాణికమైన క్లినికల్ స్క్రీనింగ్ సాధనం. దీనిని మరింత పర్సనలైజ్డ్గా తీర్చిదిద్దారు.‘తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడు చాట్బాట్ స్కోర్ను రూపొందిస్తుంది. స్కోర్ 20 కంటే తక్కువ ఉంటే తక్కువ అని, 20 నుండి 30 మధ్య ఉంటే మధ్యస్థం అని, 30 కంటే ఎక్కువ ఉంటే సమస్య అధికం అని అర్థం. వీటి ఆధారంగా మేము సమాధానాలను సర్దుబాటు చేస్తాం’ అని విపులీకరించాడు అభిషేక్.రెండో దశలో భాగంగా థెరపిస్ట్లతో మాట్లాడి వారు నిర్వహించే సెషన్లలోని విషయాల గురించి తెలుసుకున్నారు. ఆటిజం పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు రోజువారీగా ఎదుర్కొనే ఇబ్బందులు... అస్మాత్తుగా తీవ్రమైన కోపం, నిద్ర సమస్యలు... మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని బిహేవియరల్ ట్రాకర్ను రూపొందించారు. డైలీ ట్రాకర్పిల్లల్లో కొన్ని కీలక ప్రవర్తనలను (కీ బిహేవియర్స్) గుర్తించాం. నిద్ర తీరు, సంభాషణ, మానసిక స్థితి... మొదలైన వాటి ఆధారంగా తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను నిరంతరం పర్యవేక్షించేలా డైలీ ట్రాకర్ను రూపొందించాం. తల్లిదండ్రులు రోజూ నమోదు చేసే వివరాలను వీక్లి ఇన్సైట్స్గా కన్వర్ట్ చేస్తుంది సిస్టమ్. కీలకమైన ప్రవర్తనల ఆధారంగా ఆటిజం ఉన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని డ్యాష్బోర్డ్ తయారవుతుంది. పిల్లలకు ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాకపోతే చాట్బాట్ను అడగవచ్చు. అది క్షణాల్లోనే సమాధానం ఇస్తుంది.– అభిషేక్ -
ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..
ఇల్లు ఆమెదే! ఆ ఇంటికి ఆమే యజమానురాలు! ఉదయం లేచింది మొదలు భర్త, పిల్లలు, అత్త, మామ..ఇంటిల్లిపాది అవసరాలు చూడటంలో క్షణం తీరికలేనట్టు ఉరుకులు, పరుగులు.. కానీ, ఆమె ఎప్పుడూ ఒంటరితనం మూటను భుజాన వేసుకునే ఉంటుంది. ఎవ్వరితోనూ చెప్పుకోలేని సమస్యల నిశ్శబ్దాన్ని మోస్తుంది.శరీరంలో వచ్చే మార్పులు, కుటుంబ బాధ్యతల చిక్కులు, ఆర్థిక అవసరాలు, సామాజిక ఒత్తిళ్లు... వీటిల్లో తనను తాను ఎక్కడో పోగొట్టుకున్నట్టు తెలియని శూన్యం ఆవరించినట్టు ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తుందా..?! ఈ రోజుల్లో వివిధ దశలలో మహిళలు ఒంటరితనం అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకునే శాతం పెరుగుతోందని నివేదికలు చూపుతున్నాయి. కారణాలు ఉంటే.. పరిష్కారమూ ఉంటుంది..యాభై ఏళ్ల కిరణ్మయి చెన్నైలో తన కుమార్తె ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్త రిటైర్ అయిన తర్వాత ఆమె కుమార్తె కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఓరోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సకాలంలో ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో గండం నుంచి బయటపడింది. ఎందుకిలా చేశావని అడిగితే – ‘నా ఇంట్లో నేనే కనిపించకుండా పోయినట్టుగా అనిపించింది. నా మాటకు ఎక్కడా విలువలేదు’ అని చెబుతూ ఎంతో బాధపడింది. మెనోపాజ్ సమయంలో ఆమె భావోద్వేగ సంబంధ మార్పులు, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంది. తన పరిస్థితిని ఎవరికైనా చెప్పుకోబోతే ‘అతిగా ఆలోచిస్తున్నావు, అంతే’ అని తేలికగా కొట్టిపారేసేవారు ఇంట్లో. అందుకే, ఆ నిర్ణయం తీసుకుందామె. రవీనా శరణ్ అనే న్యాయవాదికి నాల్గవ నెల ప్రెగ్నెన్సీలో గర్భస్రావం జరిగింది. ఆ బాధకన్నా ‘మేం ముందే చెప్పాం, జాగ్రత్తగా ఉండమని..’ అనే మాటలు తరచూ వినాల్సి రావడమే పెద్ద బాధ. దానిని అధిగమించలేక... ఎవరితో కలవలేక ఒంటరితనంతో బాధపడుతూ ‘ఈ గిల్ట్తో నేను చనిపోయేదాన్నే’ అంటోంది.ఈ మహిళల వయస్సు, పరిస్థితులు వేరయినా, వారి బాధ ఒకటే. భారతదేశంలో మహిళల మానసిక ఆరోగ్య సమస్యలకు సామాజిక ఒత్తిళ్లు, హార్మోన్ల మార్పులు, లింగవివక్ష, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు అవుతున్నాయి. కొన్ని హెల్త్ సర్వేల ప్రకారం ఇటీవల మహిళల్లో డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషుల కంటే మహిళల్లోనే కుంగుబాటు ఎక్కువగా ఉందట.నిశ్శబ్దానికి బ్రేక్...ఆత్మహత్యల్లో 15–34 సంవత్సరాల లోపు మహిళలు 63 శాతం ఉండగా, తల్లుల మరణాల్లో ఈ శాతం 39గా ఉంది. ప్రతి 5గురిలో ఒక తల్లి మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంది.70–80 శాతం మందికి తగిన చికిత్స అందట్లేదు. మహిళలు మౌనంగా బాధపడుతూ ‘బలంగా’ ఉండాలని చెప్పే గతకాలపు సూక్తుల వల్ల కూడా బయటకు చెప్పుకోలేని మధనంలో కాలం వెళ్లదీస్తున్నారనేది నిపుణుల మాట. మహిళల్లో సాధికారత పెరిగితే, ఒంటరితనం సమస్యలు తగ్గుముఖం పడతాయి.గుర్తించకపోవడమే అసలు సమస్య...మన దేశంలో మనస్తత్వ నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మానసిక వ్యాధుల ఆర్థిక భారం దేశంలో 2030 నాటికి లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మహిళల మానసిక సమస్యలను ఒక సమస్యగా గుర్తించకపోవడం కూడా దీనికి ప్రధానకారణం.ఎందుకు ఒంటరితనం అంటే...జీవితం అంతా కుటుంబానికే అంకితం చేయడం. వ్యక్తిగత ఆసక్తులు, స్నేహితులను, కెరియర్ను వదిలేయడం. భర్త బిజీగా ఉండి, ఎమోషనల్గా కనెక్ట్ అవకపోవడం. చుట్టూ అందరూ ఉన్నా మనసులో ఎవరూ లేనట్టుగా అనిపించడం. ఇది చాలా చిన్న విషయం, ఎవరో దీనికన్నా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారని భావించడం. ఇవి ఇలాగే కొనసాగితే, జీవితంలో ఉత్సాహం స్థానంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఎలా అధిగమించాలంటే..ముందు తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సమస్యను ఒక బలహీనతగా చూడకూడదు. నచ్చిన పనులవైపు దృష్టి పెట్టమని చెప్పే ఒక సంకేతంలా భావించాలి. స్వీయ ఆసక్తులు, అభిరుచులవైపు మనసు మళ్లించుకోవాలి. కొత్తగ్రూప్స్తో కనెక్ట్ అవ్వాలి. అంటే, ఉదయం వేళల్లో యోగా, వాకింగ్ గ్రూప్లలో చేరడం, అభిరుచికి తగిన క్లాసుల్లో చేరితే కొత్త నైపుణ్యాలవైపు దృష్టి మరల్చవచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. దీనివల్ల మైండ్లో చేరిన గ్యాప్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతుంది.ఉద్యోగినులైతే సాయంకాలం ఇంటికి చేరుకున్నాక వెంటనే తమ ఒంటరి ప్రపంచంలోకి వెళ్లకుండా, గంటసేపైనా ఇంట్లో వాళ్లతో కబుర్లు చెప్పగలగాలి. లేదా, తమవారితో ఫోన్లోనైనా మనసు విప్పి మాట్లాడగలగాలి. ఎంత పెద్దసమస్య అయినా తన భావాలను ఎవరితోనైనా పంచుకోవాలి. మనసుకు నచ్చిన విషయాలను రాయడం, చదవడం వంటివి కూడా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. మహిళలు ఎప్పుడూ ఇతరుల కోసం జీవిస్తారు. కానీ, తమకోసం తాము జీవించడం నేర్చుకున్నప్పుడు జీవనశైలి కూడా మెరుగవుతుంది. కొత్త గ్రూప్స్తో కనెక్ట్ అవ్వాలిమనిషి ఇంట్లో ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టు ఫీలయితే ఒంటరితనాన్ని మోస్తున్నట్టే. మనిషి ఎంత దూరంలో ఉన్నా మనసు తమ వారికి దగ్గరగా ఉంటే ఒంటరి కానట్టే. ఇంట్లో తమ ప్రాధాన్యత తగ్గిందనో, ఎవరూ పట్టించుకోవడం లేదనో, ఏదైనా అపరాధన భావనో, సన్నిహితులు దూరమయ్యారనో, ఆర్థిక పరిస్థితులు బాగా లేవనో, బతుకు భారంగా మారిందనో.. అందరిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించే రోజులు పెరిగితే, ఇక జీవితాన్ని చాలించాలనుకునే ఆలోచనలూ పెరుగుతుంటాయి. సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్లలో రెండు నెలల ముందు నుంచే ఆత్మహత్య చేసుకుంటామన్న విషయాన్ని బయటకు ఏదో ఒక రూపకంగా చెబుతుంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంట్లోనూ, సన్నిహితులు అలెర్ట్ అయ్యి, కౌన్సెలర్ సాయం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. – డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తొమ్మిది పదుల వయసులో స్కూల్కి..! ఏకంగా 98% మార్కులు ..
తొమ్మిది పదుల వయసులో చదవాలనుకోవడమే ఓ గొప్ప. అలాంటిది ఏకంగా పాఠశాలకు వెళ్లి చదవుకోవడమే గాక, పరీక్షల్లో రికార్డు స్థాయి మార్కులతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. నడు వండిపోయి, కనికనిపించని కళ్లతో చదవాలనే ఆమె ఆసక్తి అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని ఈ బామ్మ తన విజయంతో నిరూపించింది. ఆ బామ్మే కేరళకు చెందిన కార్త్యాయని అమ్మ. కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెప్పాడ్ గ్రామంలో 1922లో జన్మించారు. తన తరంలోని చాలామంది అమ్మాయిలులాగే చదువు అనేది ఆమెకు అంత ప్రాధాన్యం లేనిదిగా ఉంది. ఆమెకు ఆ సమయంలో కనీసం ప్రాథమిక విద్యను చదువుకునే అవకాశం కూడా లేదు. పేదరికం, కుటుంబ బాధ్యతలు, ఆమెను చిన్న వయసులోనే బడికి దూరం చేశాయి. తరగతి గదులకు బదులుగా ఆమె బాల్యం పనితో నిండిపోయింది. చివరికి ఆమెకు పెళ్లై, ఆరుగురు పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి ఇంటి పనిమనిషిగా వీధి ఊడ్చే పనిచేస్తూ శారీరక శ్రమోత కూడిన పనులతో కుటుంబాన్ని పోషించుకునేది. ఆమెకు చదవడం, రాయడం ఇతరులకు తెలిసిన నైపుణ్యాలుగా మిగిలిపోయాయి. దశాబ్దాలుగా ఆమె జీవితం అలానే గడిచిపోయింది. అయితే ఆమె కథ అక్కడితో ఆగిపోలేదు. తొంభై ఏళ్ల వయసులో అనూహ్యమైన మలుపు తీసుకుంది. మళ్లీ చదువుపైకి ధ్యాస..ఆమెను చదువుపైకి ఆసక్తి కలిగించే క్షణం ఆమె కూతురు కారణంగానే వచ్చింది. ఆమె కూతురు 60 ఏళ్ల వయసులో అక్షరాస్యత తరగతిలో చేరి పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినప్పుడు ఈ బామ్మలో గొప్ప చైతన్యం వచ్చింది. నా కూతురే చేయగలిగినప్పుడు తను ఎందుకు చేయకూడదు అనుకుంది. అంతే అనుకున్నదే తడువుగా 96 ఏళ్ల వయసులో కార్తాయని అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేరళ అక్షరలక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో చేరారు. పాఠశాల విద్యను కోల్పోయిన పెద్దలకు చదవడం, రాయడం ప్రాథమిక గణితం నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక్కడ కార్త్యాయని అమ్మ చదువుకి అండగా మనవళ్లు, మునిమనవళ్లు నిలిచారు. వారు అక్షరాలు, పదాలు, అంకెలు నేర్చుకోవడంలో సహాయపడ్డారు. కొన్నిసార్లు ఇంట్లోనే మరికొన్ని సార్లు సాయంత్రం పూట మసక వెలుతురులో పాఠాలు జరిగేవి. నెమ్మదిగా ఆమెకు అక్షరమాల అర్థమవ్వడం మొదలైంది. ఆ తర్వాత బామ్మ 2018లో కేరళ వ్యాప్తంగా 40,000 మందికి పైగా అభ్యర్థులతో కలిసి అక్షరాస్యత పరీక్ష రాశారు. వారిలో ఆమెనే అత్యంత వయసు పైబడిన అభ్యర్థి. ఆ పరీక్ష మొత్తం రీడింగ్, రైటింగ్, గణితం ఇలా మూడిటిపై జరిగింది. ఎందో ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలు వెలువడ్డాయి. ఆ తొంభై ఏళ్ల వృద్ధురాలు ఆ పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించి మొత్తంలో కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరిగా నిలిచింది. ఆమె రీడింగ్, గణితం రెండింటిలోనూ పూర్తి స్కోరు సాధించగా, రీడింగ్ దాదాపు వంద శాతం మార్కులు సాధించింది. ఆ బామ్మ విజయం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాపతంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. మీడియా ఆ బామ్మను గొప్ప అక్షరాస్యత ఉద్యమానికి గౌరవనీయమైన "ఆదర్శప్రాయమైన అమ్మమ్మ"గా కీర్తించాయి. అంతేగాదు అధికారులు ఆమె విజయాలను ప్రశంసా పత్రాలతో సత్కరించడానికి ముందుకు రావడం విశేషం. 96 ఏళ్ల ఈ బామ్మ కథ వేలాదిమందికి, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె విజయానికి ఎంత గుర్తింపు లభించిందంటే..2019లో విద్యను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అయిన కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్కు గుడ్విల్ అంబాసిడర్గా ఎంపకయ్యేలా చేసింది. ఇక ఈ బామ్మ 2023 అక్టోబర్లో 101 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు చదువుకోవాలన్న కోరిక ఉన్న దశాబ్దాలు సాధ్యం కాలేదు. దొరకిన అవకాశాన్ని ఈ వయసులోనా అనే సంశయానికి తావివ్వకుండా వినియోగించుకోవడం విశేషం. అలాగే అందర్నీ ఆశ్చర్యపరిచేలా రాణించి..మరణాంతరం కూడా ఆమె విజయం గుర్తుండిపోయేలా ప్రేరణగా నిలిచింది కార్త్యాయని. (చదవండి: పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్ పేరెంటింగ్ టిప్స్) -
పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్ పేరెంటింగ్ టిప్స్
పిల్లల పెంపకంపై చాలామంది నిపుణులు, ప్రముఖులు అమూల్యమైన సలహాలు అందించడం తెలిసిందే. కానీ తాజాగా దీనిపై న్యూరో సైంటిస్ట్ ఆసక్తికరమైన సలహాలు సూచనలందించారు. పిల్లను అలా పెంచితేనే ప్రయోజకులవుతారని నమ్మకంగా చెప్పారు. సిస్టమేటిక్వేలో పెంచడం కాదు..ఛాలెంజ్లను ఎదుర్కొనే ధీరుల్లా పెంచడం ఎలాగో సవివరంగా వివరించారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.అమెరికాకు చెందిన న్యూరోసైంటిస్ట్, వ్యవస్థాపకురాలు వివియెన్ మింగ్ నేటి విద్యావ్యవస్థ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రూపుదిద్దుకునే భవిష్యత్తుకు అనుగుణంగా పెంచడం లేదని అన్నారు. చాలా పాఠశాలలు ఇప్పటికీ బట్టిపట్టడం, పరీక్ష స్కోర్లపైనే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. అయితే వీటన్నింటిని ఐఏ ఇప్పటికే వేగవంతంగా సమర్థవంతంగా చేయగలదని అన్నారు. తమ పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా మారాలనకునే తల్లిదండ్రులు ఈ మూడు చిట్కాలను ఫాలో అవ్వాలని అన్నారు. అలాగే వారిని రోబోట్ ప్రూఫ్గా ఎలా పెంచాలో కూడా తెలిపారు. ఆమె దీనిని వేలాదిమంది పరిశోధన చేసి మరి చెబుతున్నారు. లోతైన పరిశోధనలకు మూలం తప్పిదాలే అని అన్నారు. వైఫల్యాలను అంగీకరించే విద్యార్థులు స్ట్రాంగ్గా తయావుతారని, పైగా బలమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోగలరని అన్నారు.హార్వర్డ్ ఎఫెక్ట్..అంటే ఊహకందని ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టిచడం అని చెప్పారు. పిల్లల్లో దాగున్న విభిన్న ఆసక్తులను అన్వేషించాలి, ప్రశ్నలు అడగాలి, ముగింపు లేని సమస్యలపై పనిచేసేలా చేయాలి. అది వాళ్లను జ్ఞానాన్ని సముపార్జించేలా చేసి సామర్థ్యాలను పెంపొందించేలా చేస్తుందని అన్నారు.ఏఐ కంటే జీనియస్గా..ఇక పిల్లలు ఏఐని సాధనంగా ఉపయోగించాలి కానీ, ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా కాదని అన్నారు. ఫీడ్బ్యాక్ కోసం ఉపయోగించొచ్చు కానీ, ముందుగా మాత్రం వారి స్వంత ఆలోచనలను పెంపొదించుకోవాలని అన్నారు. తాను 30 ఏళ్లుగా మెషిన్ లెర్నింగ్తో ఆడుకుంటున్నాను అయితే లార్జ్ లెర్నింగ్ మోడల్స్ (LLMలు) నిరంతర సహచరుడిగా ఉండే ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న ఈతరానికి కష్టమైనది దానికే వదిలేయాలన్న బలహీనతగా ఎక్కువగా ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. అందుకే పిల్లలను ఐఏకి మించిన నైఫుణ్యలను అందిపుచ్చుకునేలా పెంచాలి. అంటే వారిలో..సృజనాత్మకత: పిల్లలకు సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, వారు కొత్త ఆలోచనలు, పరిష్కారాలను కనుగొనేలా చేయడంభావోద్వేగ నైపుణ్యాలు: ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సహాయం చేయడం, సానుభూతి చూపించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.సామాజిక నైపుణ్యాలు: పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలో, సంబంధాలు ఎలా నిర్మించాలో నేర్చుకోవడం.సమస్యలు పరిష్కరించే సామర్థ్యం: సాంకేతికతను ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకోవడం.ఈ విధంగా, పిల్లలు రోబోట్స్ చేయలేని పనులను చేసేలా పెంచితే..భవిష్యత్తులో మరింత విలువైన వ్యక్తులుగా, గొప్ప ప్రయోజకులుగా మారతారని చెబుతున్నారు న్యూరో సైంటిస్ట్ మింగ్.(చదవండి: గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..) -
గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..
ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కెనడియన్ పాప్ గాయని సెలిన్ డియోన్ తన గాత్ర నైపుణ్యం, ఉద్వేగభరితమైన మ్యూజిక్ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. 'టైటానిక్' చిత్రంలోని 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటతో పాటు 90ల నాటి అనేక అంతర్జాతీయ హిట్లకు ప్రసిద్ధి చెందింది. అంత ప్రసిద్ధి గాంచిన గాయని 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' అనే అరుదైన వ్యాధి బారినపడింది. దాంతో సంగీతానికి గత కొంతకాలంగా పూర్తిగా విరామం ఇచ్చేశారామె. మళ్లీ ఇన్నేళ్లకు తన 58వ పుట్టిన రోజు నేపథ్యంలో మ్యూజిక్ లైవ్ షోలలో పాల్గొననుట్లు అభిమానులతో పంచుకుంది. సెలిన్ని కెరీర్కి దూరమయ్యేలా చేసిన అరుదైన 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' వ్యాధి అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..గాయని సెలిన్ డియోన్కు డిసెంబర్ 2022లో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆమె గతకొలంగా లైవ్షోలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లైవ్షో వేదికపైకి తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో లా డిఫెన్స్ ఎరీనాలో 10 రాత్రుల పాటు ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇలా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా తన కెరీర్ని కొనసాగిచడాన్ని తన జీవితంలోని అత్యుత్తమమైన బహుమతిగా అభివర్ణించింది. మార్చి 2020లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన చివరి లైవ్ షో అనంతరం డియోన్ మళ్లీ తొలిసారిగా వేదికపైకి పునరాగమనం చేయనుండటం విశేషం. ఇక డియోన్ ఈ అరుదైన వ్యాది తన గొంతు కదలికలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తన అభిమానులు, శ్రేయాభిలాషుల మద్దతతులో పూర్తి స్థాయిలో కోలుకున్నానని, అందుకు అందరికి కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న అరుదైన వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్'అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ?స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ (SPS) అనేది ఒక అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ రుగ్మత. ఇది మొండెం, పొత్తికడుపులో కండరాల బిగుతుకు కారణమవుతుంది. కాలక్రమేణ ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. దీని కారణంగా సంబంధిత రోగులు కాళ్లు, ఇంతర కండరాల్లో బిగువు, ఒక విధమైన నొప్పులను అనుభవిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు సాధారణ కదలికలు కష్టతరమవుతాయట. ముఖ్యంగా నడవడం కష్టంగా మారిపోతుందట.లక్షణాలు దీనిలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:కండరాల బిగుతుఈ వ్యాధిలో కనిపించే తొలి సంకేతం ఇదే. ముఖ్యంగా మొండెం భాగంలో - అంటే పొట్ట, ఛాతీ, వీపులో మొదలవుతుంది. ఇది నిరంతర బిగుతుగా లేదా నొప్పితో కూడిన బాధగా అనిపిస్తుందట. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ బిగుతు రావచ్చు, పోవచ్చు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ, చేతులు, కాళ్ళను కూడా ప్రభావితం చేయవచ్చు.కండరాల నొప్పులు (స్పాజమ్స్)ఇవి ఆకస్మికంగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒక భాగాన్ని లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ నొప్పులు కొన్ని సెకన్లు, నిమిషాలు లేదా కొన్నిసార్లు గంటల పాటు కూడా ఉండవచ్చు.లక్షణాలను ప్రేరేపించే అంశాలుబిగ్గరగా లేదా ఊహించని శబ్దాలుశారీరక స్పర్శఉష్ణోగ్రతలో మార్పులు (ముఖ్యంగా చలి)ఒత్తిడితో కూడిన పరిస్థితులుమొత్తం మీద, ఈ పరిస్థితి కాలక్రమేణా కదలికలను కష్టతరం చేస్తుంది, మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది కూడా.కారణాలు :ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (Autoimmune disorder), అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత నాడీ కణాలపై దాడి చేస్తుంది.చాలా మంది రోగులలో గ్లుటామిక్ యాసిడ్ డెకార్బాక్సిలేస్ (GAD) యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.నిర్ధారణఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు (GAD యాంటీబాడీ టెస్ట్), EMG (Electromyography) ఉపయోగిస్తారు. చికిత్స, నిర్వహణ:దీనికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, లక్షణాలను నిర్వహించవచ్చు. ముందుగా కండరాలను సడలించడానికి డయాజెపామ్ (Valium) లేదా బాక్లోఫెన్ (Baclofen) వంటి మందులు ఉపయోగిస్తారు.ఇమ్యునోథెరపీ: IVIG (Intravenous Immunoglobulin) చికిత్స తరచుగా మొదటి ప్రాముఖ్యతగా చేస్తుంటారు వైద్యులు. వాటితోపాటు ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు కదలికను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిజానికి ఈ వ్యాధి స్త్రీలలో, ముఖ్యంగా 40-50 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు చల్లుతారో తెలుసా..!) -
మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా..
ఒక మొక్కకి ఎంత నీరు పోసినా, దాని చుట్టూ కలుపు మొక్కలు ఉంటే అది ఎండిపోతుంది. అలాగే టాక్సిక్ మనుషుల మధ్య ఉంటే మీ ప్రగతి ఆగిపోతుంది. టాక్సిక్ మనుషులు అంటే కేవలం మనల్ని తిట్టే వారు కాదు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే వారు, మీ కలలను ఎగతాళి చేసేవారు, మీలోని నెగటివిటీని బయటకు తీసే ప్రతి ఒక్కరూ టాక్సిక్ వ్యక్తులే. వీరిని గుర్తించడం ఒక ఎత్తు అయితే, వారి నుండి దూరంగా జరగడం మరొక ఎత్తు.టాక్సిక్ వ్యక్తులను గుర్తించడం ఎలా?సైకాలజీ ప్రకారం టాక్సిక్ వ్యక్తుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి.Gaslighting: మీరు చెప్పేది అబద్ధం అని, మీ ఆలోచనలే తప్పు అని మిమ్మల్ని మీరు అనుమానించుకునేలా చేస్తారు.Emotional Drain: వారితో కాసేపు మాట్లాడితే చాలు, మీ ఎనర్జీ అంతా అయిపోయినట్లు అనిపిస్తుంది.Constant Criticism: మీరు ఏం చేసినా అందులో తప్పు వెతుకుతారు. మెచ్చుకోవడం వారికి అస్సలు తెలియదు.The Victim Card: ఎప్పుడూ తామే బాధితులం అని ఏడుస్తూ, మీపై 'గిల్ట్' ని రుద్దుతారు.మీ వ్యక్తిత్వంపై దీని ప్రభావం...మీరు ఎంత పవర్ఫుల్ పర్సనాలిటీ బిల్డ్ చేసుకున్నా, టాక్సిక్ రిలేషన్స్ వల్ల మీ Decision Making పవర్ తగ్గిపోతుంది. మీలో Self-Doubt పెరుగుతుంది. మీరు మీ ఒరిజినాలిటీని కోల్పోయి, వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తారు.మోటివేషన్ మాయ vs రియల్ బౌండరీస్మోటివేషన్ "అందరినీ ప్రేమించు, అందరినీ మార్చడానికి ప్రయత్నించు" అని చెప్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.సైకాలజీ "నువ్వు అందరినీ మార్చలేవు. నీ ప్రశాంతత కోసం కొన్ని సంబంధాల నుండి తప్పుకోవడంలో తప్పులేదు" అని చెప్తుంది. దూరం జరగడం అంటే ద్వేషించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం.టాక్సిక్ ఫ్రీ లైఫ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సమస్య నుండి బయటపడే మార్గం.Step 1: Break Attachment"వారు నా పాత స్నేహితులు" లేదా "వారు నా బంధువులు" అనే ఎమోషనల్ అటాచ్మెంట్ని 'Break' చేయండి. మీ ఎదుగుదలకు అడ్డుపడే ఏ బంధమైనా అది భారమే. వారు బాధపడతారేమో అనే 'గిల్ట్' నుండి బయటపడండి. మీ జీవితానికి మీరే యజమాని.Step 2: Build Healthy Boundariesప్రతి ఒక్కరికీ మీ జీవితంలోకి పూర్తి యాక్సెస్ ఇవ్వకండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో ఒక 'లైన్' ని 'Build' చేయండి. "నో" చెప్పడం నేర్చుకోండి. మీ సమయాన్ని, మీ ఎనర్జీని గౌరవించే వారిని మాత్రమే దగ్గరకు రానివ్వండి.Step 3: Healing & Growthటాక్సిక్ వ్యక్తుల నుండి దూరమయ్యాక, ఆ ఖాళీని 'సెల్ఫ్-లవ్' తో నింపండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఎప్పుడైతే ఉన్నత స్థాయికి చేరుకుంటారో, ఆటోమేటిక్గా మీ చుట్టూ పాజిటివ్ వ్యక్తులే మిగులుతారు. ఇదే 'Beyond' స్టేజ్.మీ చుట్టూ ఉన్నది ఎవరు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీ కాంటాక్ట్ లిస్ట్ లోని టాప్ 5 వ్యక్తులు మీ గురించి ఏం మాట్లాడుతారు?2. మీరు ఎవరికైనా భయపడి మీ అభిప్రాయాలను దాచుకుంటున్నారా?3. మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరు?మీ ప్రశాంతతే మీ లెగసీ!బ్రో, ప్రపంచంలో ఏ విజయం కూడా మీ మనశ్శాంతి కంటే పెద్దది కాదు. టాక్సిక్ వ్యక్తుల నుండి దూరంగా జరగడం అనేది మీ బలహీనత కాదు, అది మీ 'బలం'. మీ పర్సనాలిటీ ఒక స్వచ్ఛమైన గాలి లాంటిది, దాన్ని కలుషితం చేసే వారిని అనుమతించకండి."You cannot heal in the same environment that made you sick."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది?) -
రాధిక మర్చంట్ లైలాక్ వాచ్..! ప్రపంచంలోనే..
మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో రాధికా మర్చంట్ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్ రిచర్డ్ మిల్లే వాచ్తో తన లుక్ను హైలెట్ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. సముద్ర స్ఫటికపు పారదర్శకత, గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకతలు..వాచ్ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ సుమారు 65 గంటల వరకు ఫుల్ చార్జ్ ఉంటుందట. ఈ వాచ్ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) (చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!) -
పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు వేయాలంటే..?
సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.సహజమైన తీపి..చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్కు హెల్ప్ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్కి ప్రభావవంతంగా ఉంటుందట.రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుందికొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.జీర్ణక్రియకు సహాయపడుతుంది..తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్గా తీసుకున్నప్పుడు.శ్రద్ధగా తినేలా చేస్తుంది.. పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే పండు సహజ రుచిని డామినేట్ చేసి, సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చాయ్వాలాగా 103 ఏళ్ల బామ్మ..!) -
'ఫ్లవర్ అనుకుంటివా.. ఫుడ్'..!
సరదాగా చెప్పాలంటే...‘‘తినదగు నిపుణులు చెప్పిన తినినంతనే వేగిరపడక పోషక విలువలు తెలుసుకోదగన్...ఇలా నిజము దెలుసుకుని ‘పువ్వులనూ తినెడివాడే మనుజుడు మహిలో...’’ అంటే కాస్త వినోదంగానో, వెటకారంగానో ఉండవచ్చు. ఇక అచ్చతెలుగులో పువ్వుల్నీ తినవచ్చంటే కూడా కొద్దిగా ఇబ్బందిబ్బందిగానే అనిపించవచ్చుగానీ...నిజానికి పువ్వుల్లోనూ ఎన్నో పోషకవిలువలూ, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలంటాయంటున్నారు ఆహార నిపుణులు. ‘‘మొక్కమొక్కకో పువ్వు... మనుషులందరికీ హెల్తు’’ అంటూ పువ్వులోని పోషక విలువలనూ ప్రయోజనాలనూ చెబుతున్న ఆ న్యూట్రిషనిస్టుల మాటలేమిటో తెలుసుకుందాం... కాలీఫ్లవర్లాంటి పువ్వులను కూరలకోసమే ఉపయోగిస్తామంటే సరే. అయితేమామూలుగానైతే కొన్ని పువ్వులూ తినడానికి పనికివస్తాయంటే వెంటనే నమ్మలేని పరిస్థితి. అయినప్పటికీ అది వాస్తవం. అలాంటి కొన్ని పువ్వులూ వాటి పోషక విలువలేమిటో చూద్దాం...అరటిపువ్వుఅరటికాయను ‘కూర అరటి’గా పిలుస్తూ... కూర చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ అరటి పువ్వు (మొవ్వ)ను కూడా కూరగా వండటం ఓ సంప్రదాయంలా పాటించే కుటుంబాలు చాలా ఎక్కువే ఉన్నాయి. అరటి పువ్వు పోషక విలువలు ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటాయి. అరటిపువ్వులోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా అరటిపువ్వు ఫ్రీరాడికల్స్ను హరిస్తుంది. దాంతో క్యాన్సర్ నివారణా సాధ్యమవుతుంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వయసుపైబడే ప్రక్రియనూ ఆలస్యం చేసి ఏజింగ్ ప్రక్రియను మందకొడిగా జరిగేలా చేస్తాయి. అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇది మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక స్త్రీలలో రుతు సమస్యల నివారణకు అరటిపువ్వుల కూర బాగా మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు దూరమవుతాయి. పీరియడ్స్ టైమ్లో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారి΄ోవడం, కడుపునొప్పి వంటి అనేక లక్షణాలతో వ్యక్తమయ్యే పీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గుతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగై్జటీ తగ్గడంతో మూడ్స్ బాగుపడతాయి. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు.గుమ్మడి పూలుఇటీవల కొందరు గుమ్మడిపూలను కొన్ని రకాల కూరగాయలతో కలిపి స్టఫ్ చేయడం, ఫ్రై చేయడంతోపాటు కూరగా వండటం పరిపాటి అయ్యింది. గుమ్మడి పూల పోషక విలువలుఇందులో విటమిన్లు ఏ, సీ లతోపాటు క్యాల్షియమ్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతున్నాయి. ఇక పీచుపదార్థాలూ (డయటరీ ఫైబర్) కూడా చాలా ఎక్కువ. అందుకే వీటిని ఆహారంగా తీసుకునేవారిలో ఆకలి త్వరగా తీరడం వల్ల స్థూలకాయం నివారితమవుతుంది. ఫలితంగా డయాబెటిస్, హైబీపీలు నివారితం కావడంతోపాటు డయటరీ ఫైబర్ వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుండటమూ, మలబద్ధకం వంటివి దూరం కావడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలూ చేకూరతాయి.ఆవపూలుకాస్తంత ఆవాల రుచితోనే ఉంటూ కొన్ని రకాల క్రిస్పీ వంటకాల్లోనూ, మరికొన్ని ఫ్రైలతోపాటు రుచి పెంపొందించడం కోసం, అలాగే కొన్ని రకాల వడల్లాంటి (ఫ్రిట్టర్) రూపంలో చేసే వంటకాల్లో ఆవపూలను ఒక రకమైన మంచి రుచి (ఫ్లేవర్) కోసం ఉపయోగించడమనేది పశ్చిమ బెంగాల్తోపాటు అక్కడి చాలా ప్రాంతాల్లో వాడుకగా ఉంది. కూర (సబ్జీ)గా వండటం కూడా మామూలే. ఆవ పూల పోషక విలువలుఆవపూలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి అనేక రకాల క్యాన్సర్లనుంచి కాపాడుతుంటాయి. అయితే వీటిల్లో యాంటీ సెప్టిక్ గుణాల వల్ల గాయాలను త్వరగా మాన్పివేస్తాయి. ఇందులోని విటమిన్ సి కూడా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది.మునగ పూలుమామూలుగానైతే మునక్కాడలని పిలిచే ఆ ములక్కాయలను కూర వండుకు తినేయడం చాలా సాధారణం. ఇటీవల కొందరు మునగాకును కూరగా వాడుతున్న సంగతీ తెలుసు. అయితే మునగాకుకు దీటుగా దాని పూలూ ఆహారంగా వాడుకునేవారూ ఉన్నారు. ఎందుకంటే సూపర్ ఫుడ్ అనే మాట నిజంగా మునగకే నప్పుతుంది. ఇందుకు కారణమూ ఉంది. మునగ పూల పోషక విలువలుమునగ పూలను ఆహారంగా తీసుకుంటే ఇందులో విటమిన్లు ఏ, సీ, ఈ...లతో పాటు పొటాషియమ్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నారింజతో ΄ోలిస్తే ఇందులో విటమిన్ సీ 7 రెట్లు ఎక్కువ. ఇక క్యాల్షియమ్ మోతాదులు చాలా చాలా ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో అనేక క్యాన్సర్ల నుంచి నివారణ. ఇందులోని పీచు మోతాదుల వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియను క్రమబద్దీకరించి, బరువును తగ్గిస్తుంది.మందారపువ్వుచాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగడం గానీ లేదా ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉండే మందారపువ్వులను పానియాల రూపంలో చేసుకుని తాగడం చాలా చోట్ల సంప్రదాయంగా కొనసాగే ప్రక్రియే. మందారలో పోషక విలువలుమందారపువ్వులో చాలా శక్తిమంతమైన విటమిన్–సి ఉంటుంది. దీంతో మంచి వ్యాధినిరోధకత సమకూరడమే కాకుండా చాలా రకాల గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కొద్దిగా మాత్రమే పులుపుగానూ, కాస్తంత ఘాటుగానూ ఉండే దీని రుచి (ఫ్లేవర్) కారణంగా దీన్ని తేనీటి రూపంలో తాగడం చాలా చోట్ల జరిగేదే. దీనిలోని పోషకగుణాల కారణంగా జీర్ణశక్తి మెరుగుపడుతుది. ఈ పూలతో చేసే పదార్థాలు రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్తోపాటు ఉండే విటమిన్ సి వల్ల కాలేయ క్యాన్సర్తో పాటు అనేక క్యాన్సర్లు నివారితమవుతాయి. మందరపూలతో కాచిన టీతో రక్తపోటు, యాంగై్జటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ మందార చాయ్ను పరిమితంగా తాగితేనే మేలన్నది న్యూట్రిషన్ నిపుణుల మాట.బంతి / చేమంతి పూలుఇంగ్లిష్లో మేరీగోల్డ్ గా పిలిచే ఈ బంతి / చేమంతిలోని అనేక రకాల పూల రేకులను అనేక వంటకాల్లో వాడతారు. వీటిని ఎండబెట్టి పానీయాలుగా, కుంకుమపువ్వు (శాఫ్రాన్) తరహాలో గార్నిషింగ్ కోసం వాడుతుంటారు. ఇందులోనూ కాస్తంత పులుపు, వగరు, కారం కలగలసిన రుచి (సిట్రసీ, స్పైసీ, బిట్టర్–ట్యాంజీ ఫ్లేవర్) ఉండటం వల్ల దీన్ని అనేక వంటకాల్లో ఒక దినుసుగా ఉపయోగించడం కూడా పరిపాటి. ఇలా వంటల కోసం ఉపయోగించే మేరీగోల్డ్ మొక్కలపై ఎలాంటి రసాయన ఎరువులూ వేయకుండా పెంచుతుంటారు. దీని పూల రేకలను పైన అలంకరణగా (సీజనింగ్గా) వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో పసుపు పచ్చ రంగునిచ్చేందుకు కలరెంట్గా కూడా వాడతారు. కుంకుమపువ్వుకు ప్రత్యామ్నాయంగా వాడటమూ కొన్ని చోట్ల వాడుకలో ఉంది. దీని పూల రేకలను ఎండబెట్టి టీ రూపంలో వాడతారు. (ఇక మెడిసిన్ విలువలు ఉండటంతో క్యాలండ్యులా నుంచి తీసిన నూనెను చర్మంపైన గాయాలు మానేయందుకు పైపూత మందుగానూ ఉపయోగిస్తారు. బంతి / చేమంతులలోని పోషక విలువలుబంతి / చేమంతి (మేరీగోల్డ్) పూలలోని జీవరసాయనాలు తెల్లదోమ (వైట్ ఫ్లై) వంటి పరాన్నజీవులను దూరంగా ఉంచే గుణం ఉండటం వల్ల పూలతోటలలో కొన్ని రకాల పరాన్నజీవులనూ, తెగుళ్లను దూరంగా ఉంచేందుకూ ఈ మొక్కలను పెంచుతుంటారు. అంతేకాదు... ఈ ప్రజాతికి చెందిన క్యాలెండ్యులా వంటి పూలలో యాంటీ ఆక్సిడెంట్స్తోపాటు ల్యూటిన్, బీటా ల్యూటిన్, ఫ్లేవోగ్జాంథిన్ వంటి కెరటనాయిడ్స్తోపాటు ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఓలియోనిక్ యాసిడ్, క్యాలెండిక్ యాసి వంటి ఫ్యాటీ యాసిడ్స్తోపాటు విటమిన్–సి ఉండటం వల్ల తన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణంతో గాయాలను త్వరగా మాని΄ోయేలా చేయడం, నొప్పులను తగ్గించడం వంటి ప్రయోజనాలనిస్తాయి. అందుకే దీన్ని ఓ ఔషధమొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ ఉపయోగిస్తుంటారు.గులాబీ మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే మన దగ్గర కూడా పాన్లో వేసే గుల్ఖంద్ అనే స్వీటెనర్ను గులాబీ పూల రేకలతోనే తయారు చేస్తారని ప్రతీతి. ఇక రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం అనేది చాలా చోట్ల ఉన్న ఒక సంప్రదాయం. ఆరోగ్యానికి మంచిదంటూ కొందరు ఈ పూల రేకులను అలాగే తినేస్తుంటారు కూడా. గులాబీపూలలోని పోషక విలువలు : ఈ పూల రేకుల్లో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. వాటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో కాచే టీతో గుండెజబ్బు ముప్పు, క్యాన్సర్, డయాబెటిస్లనూ రిస్క్ తగ్గుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. కేవలం. రోజా అన్నది పూలలో రాజా వంటిది అనే ప్రతీతి దీని తాలూకు గాయాలు మాన్పే శక్తికీ వర్తిస్తుంది. ఇందుకే హీలింగ్ గుణంలో కూడా ఇది కింగ్ అంటూ దీనికి ఓ ప్రశస్తి ఉంది. దీన్ని టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్గా పరిమితంగా ఉపయోగించడమే మంచిదనేది న్యూట్రిషనిస్టుల సలహా.తామరపువ్వులు (కమలం పువ్వులు)దీని గింజలను ‘మఖానా’ గింజలనీ, దీని పూలను ‘ఫూల్ మఖానా’ అంటూ పిలుస్తూ, ఈ పూలనూ ఆహారంగా తీసుకోవడం చాలా చోట్ల వాడుకలో ఉంది. తామరపూలతో చాలా మంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే ఆసియా ఖండంలోని చాలా ప్రాంతాల్లో అనేక మంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. ఇటు మఖానా గింజలనూ, అటు ఫూల్ మఖానాను కూరలలో (కర్రీ), కొన్ని రకాల స్వీట్లలో, కొన్ని సందర్భాల్లో మసాలా దినుసుల మాదిరిగా కూడా వాడతారు. తామరపూల పోషక విలువలుతామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్లో అనేక పోషకాలతోపాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అయిన విటమిన్ సి వల్ల చాలా శక్తిమంతమైన వ్యాధి నిరోధక వ్యవస్థ రూపొందుతుంది. ఫలితంగా అనేక రకాల క్యాన్సర్లను ఈ పూలు నివారిస్తాయి. ఈ పూలలోని విటమిన్ బి కాంప్లెక్స్ అలాగే విటమిన్–సి కలగలసి దేహంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా నిలుస్తాయి. వీటలోని క్యాల్షియమ్ వల్ల ఎముకలు బలంగా మారతాయి. రక్తపోటు (హైబీపీ)ని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెగ్నీషియమ్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజలవణాల వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుంది.మొగలి పువ్వు (ఫ్రాగ్రెన్స్ స్క్రూపైన్ / కేవ్డా) మనదేశంలోని అనేక ్ర΄ాంతాల్లోని ప్రజలతో ΄ాటు దక్షిణ ఆసియాలోని అనేక మంది మొగలి పువ్వును వంటలో ఉపయోగిస్తుంటారు. దీన్ని రుచిని ఇచ్చే పదార్థంగా (ఫ్లేవరింగ్ ఏజెంట్గా) వాడుతుంటారు. దక్షిణ భారతదేశంలో మొగలిపూలతో కూర వండుకోవడమూ చాలా చోట్ల వాడకులో ఉన్న సంప్రదాయమే. ఇక రసగుల్లా, రస్మలాయ్ వంటి పాయసాల్లోనూ, కొన్ని రకాల పానీయాల్లో కొంత తియ్యటి రుచి / వాసన ఇచ్చేందుకు ఫ్లేవరింగ్ ఏజెంట్గా చాలా చోట్ల వాడుతుంటారు. దీన్ని ఔషధ మొక్కగానూ, దీని పువ్వును ఔషధాల్లోనూ వాడటమూ చాలా సాధారణంగా జరుగుతుండేదే. మొగలిపువ్వులోని పోషక విలువలుఈ పూలలో విటమిన్–సి వంటివీ అలాగే, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటి విటమిన్–బి కాంప్లెక్స్లోని విటమిన్లతోపాటు అనేక పోషకాలు ఉంటాయి. ఇక గాయాలను మాన్పించే, నొప్పులను తగ్గించే యాంటీసెప్టిక్, యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలూ ఈ పూలలో ఉంటాయి. ఇక ఇదొక ఔషధ మొక్క కూడా కావడం వల్ల దీనిలోంచి తీసే నూనెలను పైపూత మందుగా ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పులలో వాడుతుంటారు. దాదాపుగా అందరికీ తెలిసిన తినే పూలుపొద్దుతిరుగుడు పువ్వు (సన్ఫ్లవర్)దీని గింజల నుంచి తీసిన నూనెలో వంటల్లో విరివిగా వాడతారన్న విషయం తెలిసిదే. అయితే దీని ఆకులూ, వేళ్లతో పాటు పూల రేకులను సైతం కొన్ని రకాల సలాడ్స్లోనూ, వేయించిన పూలరేకులను కొన్ని ఫ్రై వంటకాల్లో, శ్నాక్స్లో క్రంచీగానూ వాడుతుంటారు. పూర్తిగా వికసించకముందే మొగ్గగా ఉన్నప్పుడే కోసిన పూలను పేలాల్లా (కార్న్లా) వేపి / వేగించి తినడంతో పాటు కొన్ని సలాడ్స్లో కలిపి వడ్డిస్తారు. పొద్దుతిరుగుడు పువ్వు పోషక విలువలు : ఈ పూలను పవర్΄్యాక్డ్ పవర్హౌజ్గా పరగణించడం పరిపాటి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, కొవ్వులూ, పీచు (ఎడిబుల్ ఫైబర్), విటమిన్–ఈ వంటి విటమిన్లు, కాపర్, సెలేనియమ్, మ్యాంగనీస్, మెగ్నీషియమ్ వంటి ఖనిజాలు (మినరల్స్) పుష్కలంగా ఉంటాయి. విటమిన్–ఈ అనేది చాలా శక్తిమంతమైన ఆంటీ ఆక్సిడెంట్ కావడంతో చాలా రకాల వ్యాధుల నుంచి క్యాన్సర్లనుంచి కా΄ాడుతుంది. ్ర΄ోటీన్ల కారణంగా కండరాలు శక్తిమంతం కావడంతో ΄ాటు కండరాల రిపేర్లకు ఇది సహాయపడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడానికి సెలేనియమ్ ఉపయోగపడుతుంది.కాలీఫ్లవర్ గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా అందరూ వండుకోడానికి ఉపయోగించేదే. గోబీ పకోడీలంటూ శ్నాక్స్ రూపంలోనూ తింటుంటారు. కాలీఫ్లవర్ పోషక విలువలు : ఈ పువ్వు క్యాన్సర్ను నివారిస్తుంది. కాలీఫ్లవర్లోని సల్ఫోరఫేన్ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్) క్యాన్సర్లతో పోరాడతాయి. సల్ఫోరఫేన్ అనే ΄ోషకం ఆటిజమ్ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలీఫ్లవర్లోని ఇండోల్–3–కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుందని తేలింది. ఇది ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు సమర్థంగా ఉపయోగపడుతుంది. దేహంలోని కణాలు క్యాన్సరస్గా మారి΄ోతున్న సందర్భాల్లో ఆ కణాల్లోనే అంతర్గతంగా క్యాన్సర్ తాలూకు విషాలను (సైటోటాక్సిన్స్)ను ఉత్పన్నమయ్యేలా పుట్టించి ఆ క్యాన్సర్లను ఈ పువ్వు నివారిస్తుంది. కుంకుమపువ్వుకుంకుమపువ్వును చరిత్రపూర్వ యుగాల నుంచీ అనాదిగా మనమంతా ఓ సుగంధద్రవ్యంగా వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తుంటారు.కుంకుమపువ్వు పోషక విలువలు : కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్ గుణాలున్నాయి. క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కుంకుమ పువ్వు వాడటం వల్ల కడుపులోని బిడ్డ మంచి రంగుతో పుడుతుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఇది చాలావరకు అ΄ోహ మాత్రమే. అయితే కుంకుమపువ్వును ఒక హెర్బ్గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే మాత్రం దానితో చాలా రకాల న్యూట్రిటివ్ ప్రయోజనాలు ఒనగూరతాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారి΄ోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాల్లో తేలింది. ఇందులో బీ–కాంప్లెక్స్ విటమిన్కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజం. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడమే సురక్షితం.అపోహే కానీ... ప్రయోజనమూ ఉంది ఇలా... కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనేది శాస్త్రీయంగా నిర్ధారణ కాని అ΄ోహ మాత్రమే అయినప్పటికీ పాలలో చాలా పరిమితమైన మోతాదులో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు సంపూర్ణాహారమైన పాలను గర్భవతులు తాగడం వాళ్లకు చాలా మేలుచేసే అంశం. అయితే గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల పాటు తమ వేవిళ్లు, వికారం కారణంగా గర్భవతులు పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అయితే కుంకుమపువ్వు కలిపిన పాలు మరింత రుచికరంగా, సుగంధభరితంగా ఉంటాయి. అందునా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటలకు మరింత రుచిని ఆపాదిస్తారు. కుంకుమపువ్వు గురించి ఓ హెచ్చరిక కుంకుమపువ్వునువాడే గర్భవతులగుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. ఈ కారణంగా మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే దాంతో గర్భస్రావమూ అయ్యే ముప్పు కూడా ఉంటుందని తెలుసుకుని చిటికెడంటే చిటికెడే వాడటమే శ్రేయస్కరం.బ్రాకలీ / బ్రోకలీఒకప్పుడు అందరికీ అంతగా తెలియని బ్రాకలీ అనే ఈ పువ్వు ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద మాల్స్లోనూ లభ్యమవుతోంది. బ్రాకలీ అనేది నిజానికి ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. బ్రాకలీ పోషక విలువలు : ఇందులో విటమిన్ ఏ మోతాదులు చాలా ఎక్కువ. ఒంటి నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్–ఏ’ బాగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులోని పోషకాలు శరీరంలో దేహంలోని అనేక రకాల విషాలనూ వాటి ప్రభావాలను తొలగించే ‘డీ–టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. డాక్టర్ హరిత శ్యామ్, సీనియర్ డైటీషియన్నిర్వహణ యాసీన్ (చదవండి: హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..) -
నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యం
గంటల కొద్దీ జిమ్లో కసరత్తు, ఆహార నియమాలు పాటించిన వారికే బరువు తగ్గడం అంత సులువు కావడం లేదు. తాము నటించే పాత్రలకోసం విపరీతంగా బరువు తగ్గిన వారిని చాలామందిని చూశాం. కానీ విచిత్రమైన పద్దతుల్లో కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. వివరాలు ఉన్నాయి.కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల, వారు పాటిస్తున్న కఠినమైన డైట్ ప్లాన్ ఇపుడు నెట్టింట చర్చనీ యాంశంగా మారాయి. ప్రముఖ కొరియన్ నటీమణులు కిమ్ జి-వోన్, హా జి-వోన్, పార్క్ మిన్-యంగ్ ఇటీవల బాగా బరువు తగ్గి ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నారు. వీరు గతం కంటే చాలా సన్నగా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు వారి అంకితభావాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు వారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అభిమానులలో ఆందోళన పుట్టిస్తున్న డైట్ వివరాలు ఇలా ఉన్నాయి కిమ్ జి-వోన్ (Kim Ji-won): మిలన్లో జరిగిన బల్గారి (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్లో ఈమె కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి కంటే చాలా సన్నగా మారడంతో అభిమానులు సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) హా జి-వోన్ (Ha Ji-won): తన కొత్త డ్రామా 'క్లైమాక్స్' (Climax) కోసం ఈమె కావాలనే బరువు తగ్గారు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఇమేజ్ ఉన్న ఈమె, తన పాత్ర కోసం కండరాల శాతాన్ని తగ్గించుకుని మరీ బలహీనంగా కనిపించేలా శరీరాన్ని మార్చుకున్నారు. "నన్ను నేను మార్చుకోవడం నటన కంటే కష్టమైంది" అని ఆమె పేర్కొన్నారు.పార్క్ మిన్-యంగ్ (Park Min-young): ఈమె డైట్ పద్ధతి అందరినీ షాక్కు గురిచేసింది. గతంలో 'మ్యారీ మై హస్బెండ్' అనే ప్రాజెక్ట్ కోసం 37 కిలోలకు తగ్గిన ఆమె, తాజా డ్రామా 'సైరన్' (Siren) కోసం అదే పద్ధతిని కొనసాగించారు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!కేవలం నీళ్లు , ఆల్కహాల్ డైట్?పార్క్ మిన్-యంగ్ తన పాత్ర కోసం వివరిస్తూ, "నేను బరువు పెరిగితే ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే కేవలం నీళ్లు , ఆల్కహాల్ను మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. షూటింగ్ సమయంలో రోజుకు 3 లీటర్ల నీరు తాగేదాన్ని" అని వెల్లడించారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.నటీనటులు తమ పాత్రల కోసం ఇలాంటి ప్రాణాంతకమైన డైట్లు చేయడం, చాలా కఠినమైన వ్యాయామాలు చేయడం కేవలం నీటిపైనే ఆధారపడటం వంటివి సమాజంలో ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పుతున్నాయనే చర్చకు దారితీసింది. నటన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలి?
చాలామందికి నెట్వర్కింగ్ అంటేనే ఒక రకమైన విరక్తి. ఎందుకంటే అందులో కృత్రిమమైన నవ్వులు (Fake Smiles), అవసరం కోసం చేసే పొగడ్తలు ఉంటాయని భయపడతారు. కానీ, నిజమైన నెట్వర్కింగ్ అంటే మీ ముసుగును తీసివేసి, మీ సహజత్వంతో (Authenticity) ఎదుటివారిని ఆకట్టుకోవడం.మనుషులు 'ఫేక్'ని కనిపెట్టడంలో చాలా దిట్ట. మీరు పళ్ళు ఇరవదీసి నవ్వినా, లోపల ఏదో ఆశిస్తున్నారని వారికి అర్థమైపోతుంది. నెట్వర్కింగ్ అనేది ఒక 'బిజినెస్ డీల్' కాదు, అది ఒక 'హ్యూమన్ కనెక్షన్'. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో చూద్దాం.'The Power of Being Real…సైకాలజీలో 'Pratfall Effect' అనే కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం, మనుషులు పర్ఫెక్ట్గా ఉండేవారి కంటే, చిన్న చిన్న లోపాలు ఉండి సహజంగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు.అందువల్ల మీరు అంతా తెలిసినట్టు నటించనవసరం లేదు. "నాకు ఈ విషయం తెలియదు, మీరు వివరిస్తారా?" అని అడగడం కూడా ఒక అద్భుతమైన కనెక్టింగ్ టూల్. ఇది ఎదుటివారికి 'వాల్యూ' ఇస్తుంది.Curiosity Over Presentationనెట్వర్కింగ్ ఈవెంట్లలో చాలామంది "నేను నా గురించి ఏం చెప్పాలి?" అని టెన్షన్ పడతారు. కానీ అసలైన టెక్నిక్ ఏంటంటే, మీ గురించి చెప్పడం తగ్గించి, ఎదుటివారి గురించి అడగడం పెంచండి.ఒక వ్యక్తిని కలిసినప్పుడు "మీరు ఏం చేస్తారు?" అనే రొటీన్ ప్రశ్న కంటే, "ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారు?" లేదా "మీ ప్రయాణం ఎలా మొదలైంది?" అని అడగండి.మీరు వారిపై చూపే 'నిజమైన ఆసక్తి' (Genuine Interest) వెయ్యి నవ్వుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది.మోటివేషన్ మాయ vs సహజ సిద్ధాంతం"అందరితో కలవాలి, అందరికీ కార్డులు ఇవ్వాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి" అని మోటివేషన్ స్పీకర్లు చెప్తారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది."వందమందిని కలవనక్కర్లేదు. ముగ్గురిని కలిసినా, వారితో లోతైన కనెక్షన్ ఏర్పరచుకో" అని సైకాలజీ చెప్తుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.సహజమైన కనెక్షన్ బిల్డింగ్Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ముసుగులు లేని నెట్వర్కింగ్ ఇలా ఉంటుంది.Step 1: ఇంప్రెస్ చేయాలనే తపన తగ్గించుకోండిఎదుటివారిని మెప్పించాలి లేదా వారిని బురిడీ కొట్టించాలి అనే ఆలోచనను 'Break' చేయండి. మీరు ఎవరికైనా ఏదైనా 'అమ్మడానికి' వెళ్లడం లేదు, ఒక 'సంబంధాన్ని' నిర్మించడానికి వెళ్తున్నారు. ఆ ఒత్తిడి పోతే మీ ముఖంలో సహజమైన ప్రశాంతత వస్తుంది.Step 2: Build Common Groundమీకు, అవతలి వ్యక్తికి మధ్య ఉన్న పోలికలను వెతకండి. అది ఒక హాబీ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, లేదా ఒకే రకమైన సమస్య కావచ్చు. మనుషులు తమలాంటి వారితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. దీనికి నకిలీ నవ్వులు అవసరం లేదు, కేవలం Observation ఉంటే చాలు.Step 3: Beyond (నిస్వార్థ సహాయం - Selfless Value)కనెక్షన్ ఏర్పడిన తర్వాత, "నేను వారికి ఎలా సహాయపడగలను?" అని ఆలోచించండి. వారికి ఒక మంచి కాంటాక్ట్ ఇవ్వడం లేదా ఒక ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయడం చేయండి. మీరు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసినప్పుడు, ఆ కనెక్షన్ జీవితకాలం నిలుస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.మీ కనెక్షన్స్ ఎంత నిజం?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారిలో, ఎంతమందితో మీరు కేవలం అవసరం లేకుండా పలకరిస్తారు?2. మీరు కొత్తవారిని కలిసినప్పుడు మీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారా లేక వారి గురించి వింటున్నారా?3. మీరు మాట్లాడేటప్పుడు మీ నవ్వు మనస్ఫూర్తిగా వస్తోందా లేక అది ఒక 'డ్యూటీ' లా అనిపిస్తోందా?సహజత్వమే మీ అసలైన బ్రాండ్!బ్రో, ప్రపంచం నకిలీలతో నిండిపోయింది. అక్కడ మీరు మీలా 'ఒరిజినల్' గా ఉండటమే అతిపెద్ద ఆకర్షణ. ఫేక్ స్మైల్స్ అవసరం లేదు, మీ కళ్ళలో నిజాయితీ ఉంటే చాలు. మనుషులు మీ తెలివితేటల కంటే మీ వైబ్ తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు."Be yourself; everyone else is already taken." - Oscar Wild సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
పర్వతాల మధ్య ప్రకృతి గీతం..
పచ్చగా పరుచుకున్న పచ్చిక, మంచుతో కప్పబడిన భారీ పర్వతాలు, వాటి మధ్యలో బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న గ్రామాలు ... అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాలు. ఎండాకాలం రాగానే చల్లదనంతో రారమ్మని ఆహ్వానిస్తాయి. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అనే ఈ విశాలమైన పర్వత ప్రాంతం ఫ్రాన్స్లోని ప్రకృతి రమణీయతను అత్యంత అందంగా చూపుతుంది. ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో ప్రతి దృశ్యం ఒక పెయింటింగ్లా ఉంటుంది. సూర్యోదయం వేల బాల భానుని కిరణాలు మంచుపర్వతాల మీదుగా, పచ్చని గడ్డిపై పడి ఒక వింతైన బంగారు కాంతిని మనకు చూపుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మదిని తాకి వెళ్తుంటే, స్వర్గంలో ఉన్నామా ... అనే అనుభూతి కలుగుతోంది.సరస్సుల అందాలుఇక్కడి సరస్సులు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ సంధ్యాకాలం కొత్త రంగుల్లో మెరిసి΄ోతాయి. ఈ సమయంలో కెమెరా కన్నా మనసుతో క్లిక్మనిపించే దృశ్యాలు ఎన్నో కనువిందుచేస్తాయి. మేఘాలు పర్వతాల మధ్య నెమ్మదిగా తిరుగుతూ, ఒక నిధానమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.సందర్శనీయ స్థలాలుఇక్కడి చామోనిక్స్లో పర్వత జీవితం సహజంగా కనిపిస్తుంది. మోంట్ బ్లాంక్ పర్వత శిఖరాలు ఎండాకాలంలో కూడా మంచుతో మెరుస్తుంటాయి. ఆన్నెస్సీలో సరస్సు పక్కన నడక ఒక ప్రశాంత అనుభవాన్ని ఇస్తుంది. లేక్ ఆన్నెస్సీ నీరు క్రిస్టల్ క్లియర్గా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. గ్రెనోబెల్లో నగర జీవితం, పర్వత జీవితం రెండింటి మేళవింపు కనిపిస్తుంది.నిశ్శబ్ధ సంగీతం..ఫ్రెంచ్ ఆల్ఫ్స్లో జీవితం నెమ్మదిగా సాగుతుంది. చిన్న కేఫ్లలో కాఫీ తాగుతూ, గ్రామాల్లో నడుస్తూ సమయం గడపవచ్చు. ఇక్కడ ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు.పర్వతాల మీదుగా ప్రయాణంహైదరాబాద్ నుంచి ముందుగా ప్యారిస్ లేదా జెనీవా వరకు విమానంలో చేరుకోవాలి. జెనీవా నుంచి ట్రైన్ లేదా రోడ్డు మార్గంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ కు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో పర్వతాల అందమైన దృశ్యాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతాయి.వుడెన్ హౌజ్లో బసచిన్న చాలెట్స్, వుడెన్ హౌసెస్ లేదా సరస్సు పక్కన ఉన్న స్టేల్లో ఉండటం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతి పొందవచ్చు. కిటికీ నుంచి పర్వతాలు, మేఘాలు కనిపించే దృశ్యం ఎంతో ఆహ్లాదకరం.ఏం చూడాలి?మంచు పర్వతాలుపచ్చని పచ్చిక మైదానాలస్వచ్ఛమైన నీటితో తొణికసలాడే సరస్సులు.ఆహ్లాదభరితమైన గ్రామ జీవితం ఇవి అన్నీ కలిసి సహజ సౌందర్యాన్ని కళ్లకు కడతాయి. మరికొన్ని ఆసక్తికరమైనవి: మాంట్ బ్లాంక్ అనే పర్వత శిఖరం ఇక్కడ అత్యంత ఎత్తైనది.ఇక్కడి చాలా సరస్సులు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి.వేసవిలోనూ మంచు శిఖరాలు కనిపిస్తాయి. ఆల్పైన్ గ్రామాలు ఎన్నో శతాబ్దాలుగా తమ స్వరూపాన్ని అలాగే కాపాడుకున్నాయి.వాకింగ్, సైక్లింగ్కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధిఛీజ్తో తయారైన వేడి వేడి వంటకాలుఫ్రెంచ్ కంట్రీసైడ్లో బ్రెడ్, చీజ్తో తయారైన వేడి వేడి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఫాండ్యూ అనేది ఇక్కడి గ్రామీణుల సంప్రదాయ వంటకం. వైట్వైన్, వెల్లుల్లి, ఇతర పదార్థాలను కలిపి తయారుచేసిన ఛీజ్లో గట్టిగా కాల్చిన రొట్టెముక్కలను ముంచుకొని, తింటారు. బంగాళదుంప, ఉల్లిపాయలు, వైట్వైన్.. మొదలైన వాటితో తయారుచేసిన టార్టిఫ్లెట్ అనేది అక్కడి బలవర్ధకమైన ఒక వంటకం. ఇక్కడి వంటకాలలో సాస్లు ముఖ్యమైనవి. బ్లూబెర్రీ టార్టె అనేది ఇక్కడి పర్వత ప్రాతాలలోనివారికి ఇష్టమైన డిజెర్ట్. సంప్రదాయ మూలికలతో చేసే స్థానిక పానీయాలను తప్పక సేవించాల్సిందే. ఎండకాలమే సరైనది...ఎండాకాలంలో ఫ్రెంచ్ ఆల్ఫ్స్ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి, ప్రకృతి ఫ్రెష్ ఫీలింగ్ను అందిస్తుంది. ప్రతి దృశ్యం కొత్తగా అనిపిస్తుంది.ఫ్రెంచ్ ఆల్ఫ్స్ అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన జీవన విధానం. ఇక్కడ ప్రతి క్షణం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. ఎండాకాలంలో కూడా ఒక చల్లని జ్ఞాపకంగా ఈ ప్రదేశం మనసులో నిలిచిపోతుంది.– ఎం.జి.కిశోర్,ప్రయాణికుడు.కామ్(చదవండి: నేచర్ లవర్స్కు డ్రీమ్ డెస్టినేషన్) -
హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న క్రేజీ హీరో. ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ఆయన తన కుమార్తె లారాకు సంబంధించిన వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఆయన దీనిపై ఓ పుస్తకం కూడా రాయాలనకుంటున్నా అంటూ చాలా భావోద్వేగంగా ఆ వ్యాధి గురించి వివరించారిలా.హీరో వరుణ్ ధావన్ తన కుమార్తె లారాకు డెవలప్మెంటల్ డిస్ప్లాసియా ఆఫ్ ది హిప్(DDH) అనే చలన సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంతో లారా కోలుకోవడానికి సహాయపడిందని ధావన్ తెలిపారు. ఆమెకు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, DHH (డెవలప్మెంటల్ హిప్ డిస్ప్లాసియా) ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అంటే, తుంటి ఎముక సాకెట్ నుంచి జారిపోవడం. ఒక కాలు మరొక కాలు కంటే పొడవుగా పెరుగుతుంది, దీనివల్ల నడవడం చాలా కష్టమవుతుందని అన్నారు. అంటే వాళ్లు సరిగ్గా పరిగెత్తలేరు, నడవలేరు అని చెప్పుకొచ్చారు. దీన్ని పాశ్చాత్య దేశాలలో పుట్టినప్పుడే దీనిని సరిగ్గా నిర్ధారిస్తారు, కానీ భారతదేశంలో అలా కాదని అన్నారు. అయితే తన కూతురికి శస్త్ర చికిత్స చేయావలసిన అవసరం రాలేదన్నారు. ఒకే ప్రక్రియతో ఎముకను తిరిగి యథాస్థానంలోకి పెట్టగలిగారు. ఆమెకు స్పైకా కాస్ట్ వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ చిన్నారి రెండున్నర నెలల పాటు ప్లాస్టర్ కట్టులో ఉండాలి. ఇది చాలా కష్టం. బిడ్డకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత ఆమె ప్లాస్టర్ కట్టుతోనే మేల్కొంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్లాస్టర్ తీసేశారని అన్నారు. తాను దీనిపై పుస్తకం కూడా రాయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హిప్ డెవలప్మెంటల్ డిస్ప్లాసియా(DDH)అంటే..DDH అనేది శిశువులు,చిన్నపిల్లలలో తుంటిలోని 'బాల్ అండ్ సాకెట్' కీలు సరిగ్గా అమరని ఒక పరిస్థితి. సాధారణ పిల్లలలో, తుంటి కీలు తొడ ఎముకను కటి ఎముకకు కలుపుతుంది. తొడ ఎముక పైభాగం బంతిలా గుండ్రంగా ఉండి, గిన్నె ఆకారంలో ఉండే తుంటి సాకెట్ లోపల అమరి ఉంటుంది.అయితే, DDH ఉన్న పిల్లలలో, తుంటి సాకెట్ చాలా లోతు తక్కువగా ఉంటుంది మరియు తొడ ఎముక తల గట్టిగా పట్టుకోబడదు. అందువల్ల, తుంటి కీలు వదులుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో తొడ ఎముక సాకెట్ నుంచి బయటకు కూడా రావచ్చు, దీనివల్ల కీలు తప్పిపోతుంది (డిస్లోకేషన్). శారీరక పరీక్ష సమయంలో ఎముకను సాకెట్లో కదిలించవచ్చు, కానీ అది స్థానభ్రంశం చెందదు.కారణాలుఈ పరిస్థితి ఒకటి లేదా రెండు తుంటి కీళ్లలో సంభవించవచ్చు.అయితే, ఇది సాధారణంగా ఎడమ తుంటి కీలులో ఎక్కువగా కనిపిస్తుంది. DDH వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని కారకాలు ఉన్నాయి.అమ్మాయిలుమొదటి సంతానంకుటుంబాలలో చిన్నతనంలో తుంటి సమస్యలు ఉన్నవారు (తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు)గర్భధారణ 28 వారాల తర్వాత బ్రీచ్ పొజిషన్లో (పాదాలు లేదా పిరుదులు క్రిందికి) జన్మించిన శిశువులులక్షణాలుతుంటి కీలు తప్పిన కొంతమంది శిశువులలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అయితే, శిశువుకు ఈ క్రింది లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.కాళ్ళు వేర్వేరు పొడవులలో ఉండటంతొడపై అసమాన చర్మపు మడతలుఒక వైపు కదలిక లేదా వశ్యత తక్కువగా ఉండటంకుంటుతూ నడవడం, కాలి వేళ్ళపై నడవడం, లేదా తూలుతూ నడవడంనిర్ధారణNHS ప్రకారం, శిశువు పుట్టిన 72 గంటలలోపు లేదా 6 నుంచి 8 వారాల వయస్సులో గుర్తిస్తారు. సాధారణంగా నవజాత శిశువుల శారీరక పరీక్షలో భాగంగా వారి తుంటిని తనిఖీ చేస్తారు. ఈ పరీక్షలో, ఏవైనా సమస్యలు ఉన్నాయేమో చూడటానికి శిశువు తుంటి కీళ్ళను సున్నితంగా కదిలించడం కూడా ఉంటుంది.ఒకవేళ డాక్టర్, బిడ్డ తుంటి అస్థిరంగా ఉందని భావిస్తే, 4 నుంచి 6 వారాల వయస్సు మధ్యలో వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.కుటుంబ చరిత్రలో లేదా చిన్నతనంలో తుంటికి సంబంధించిన సమస్యలు ఉండి ఉంటేగర్భధారణ 28 వారాల తర్వాత బిడ్డ బ్రీచ్ పొజిషన్లో (కాళ్ళు లేదా పిరుదులు కిందికి ఉండేలా) జన్మించి ఉంటేకవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులు పుట్టి, వారిలో ఒక శిశువు బ్రీచ్ పొజిషన్లో ఉంటే, ప్రతి శిశువుకు 4 నుంచి6 వారాల వయస్సు వచ్చేసరికి వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.ఎదురయ్యే సమస్యలు..నడవడంలో ఇబ్బందులు, ఉదాహరణకు కుంటి నడకనొప్పితుంటి, వెన్నుపూసల ఆస్టియో ఆర్థరైటిస్సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే, పిల్లలకు శస్త్రచికిత్స అవసరం తక్కువగా ఉంటుందని, వారు సాధారణంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..! ఆ సర్జరీ సైతం..) -
కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుని ఐఏఎస్ అయ్యాడు..!
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా.. మన లక్ష్యం దృఢంగా ఉండాలి. ఎంతలా పరిస్థితులు కుంగదీస్తున్నా..మన ధ్యేయం గురితప్పకూడదు. కష్టమే కష్టపెట్టలేక విసిగిపోయేలా..గెలుపు తీరాలని అందుకుని స్ఫూర్తిగా నిలవాలి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ అన్షుమాన్ రాజ్.బిహార్కి చెందిన అన్షుమాన్ రాజ్ బాల్యం మొత్తం బక్సర్జిల్లా నవానగర్ బ్లాక్లో సాగింది. తండ్రి రైస్మిల్లు వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. దాంతో కనీసం ఇంట్లో విద్యుత్ సౌకర్యం లేక ఇక్కట్లు పడుతుండేది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన అతడి తల్లి ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారింది. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ఎంతో పట్టుదలతో చదువుకునేవాడు. నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను ప్రారంభించి అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. మెట్రిక్యులేషన్ తర్వాత, అతను జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో తన చదువును కొనసాగించి, 12వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. అప్పుడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సన్నద్ధం కావాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. అన్షుమాన్ తన అచంచలమైన పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాడు గానీ మెయిన్స్లో సక్సెస్ కాలేకపోయాడు. ఆ ఎదురుదెబ్బకు నిరుత్సాహపడకుండా మరోసారి పయత్నించేందుకు ఢిల్లీకి మకాం మార్చాడు. రెండో ప్రయత్నంలో కూడా రాత పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాడు కానీ పర్సనాలిటీ టెస్ట్లో పాస్ కాలేకపోయాడు. దాంతో ముచ్చటగా మూడోసారి పరీక్ష రాశారు. ఆ ప్రయత్నంలో మొత్తం మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ ఐఏఎస్కు కాకుండా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ పోస్ట్ పొందాడు. కానీ అన్షుమాన్ తన డ్రీమ్ని వదులుకోవడానికి ఇష్టపడక.. మరోసారి అకుంఠిత దీక్షతో సివిల్స్కు సన్నద్ధమై 2019 నాల్గో ప్రయంత్నంలో తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. 107 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి అయ్యాడు. అతడి కథ..అకస్మాత్తుగా వచ్చిపడే కష్టాలకు లక్ష్యాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదని తెలుపుతోంది. ఎన్ని కష్టాలు వెంటాడినా..వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తే..కచ్చితంగా ఏదో ఒకరోజు విజయం పాదాక్రాంతం అవుతుందని ఐఏఎస్ అన్షుమాన్ కథ చెప్పకనే చెబుతోంది కదూ..!. (చదవండి: నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!) -
పెయింటింగ్లా కనిపించే గ్రామం
పోర్టోఫినో అనేది ఇటలీలోని ఒక కోస్టల్ గ్రామం. లిగూరియా తీరంపై ఉన్న ఈ గ్రామం ఒక రంగుల చిత్రంలా కనిపిస్తుంది. సముద్రం పక్కనే నిలిచిన పేస్టెల్ కలర్స్ ఇళ్లు ప్రతీ ఉదయం ఒక సరికొత్త వర్ణంతో మెరిసిపోతాయి. హార్బర్లో నిలిచిన బోట్లు, వీచే గాలులు ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన రిథమ్లా అనిపిస్తాయి. మనసుకు ప్రశాంతమైన భావాలను కలిగించే ఒక చక్కని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా అనిపిస్తుంది. విలేజ్ స్ట్రీట్స్లో నడుస్తూ ఉంటే చిన్న కేఫ్ల నుండి వస్తున్న కాఫీ సువాసన, బాల్కనీ గార్డెన్లో విరబూసిన పూలు, ప్రతీ మలుపులో కనిపించే సముద్రం వ్యూ ... ఇవన్నీ కలిసి ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. ఇక్కడ జీవితం నిజంగా నిదానంగా సాగుతుంది. సముద్రం తీరాన కూర్చుని కాఫీ తాగుతూ, అలల శబ్దాన్ని వినడం ఒక మధురమై అనుభూతిని ఇస్తుంది. నేటి ఈ ఫాస్ట్ లైఫ్ నుండి బ్రేక్ కావాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.ఇక్కడ ప్రతీ రోజు ఒక స్లో రిథమ్లో నడుస్తుంది రష్ లేకుండా, టెన్షన్ లేకుండా. లోకల్ షాప్స్లో హ్యాండ్మేడ్ సోవెనీర్స్, కోస్టల్ ఫ్లేవర్స్తో తయారైన ఫ్రెష్ సీ ఫుడ్ డిషెస్, గెలాటో రుచి చూస్తూ గడిపే క్షణాలు ట్రావెల్ను మరింత మెమొరబుల్గా మారుస్తాయి. ఫోటోగ్రఫీ లవర్స్కి ఇది ఒక డ్రీమ్ లొకేషన్.. ఇలా ప్రతీ కార్నర్ ఒక పోస్ట్కార్డ్లా ఉంటుంది.సాయంత్రం సమయంలో పోర్టోఫినో మరింత అందంగా మారుతుంది. సూర్యాస్తమ సమయంలో వెలుగు సముద్రంపై పడితే ఆ ప్రతిబింబం గ్రామం మొత్తాన్ని గోల్డెన్ షేడ్లో మార్చేస్తుంది. ఆ క్షణాల్లో ప్రతీ దృశ్యం ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది క్యాప్చర్ చేయాలనిపించే మూమెంట్స్ ఎండ్లెస్గా ఉంటాయి. హైదరాబాద్ నుండి మిలాన్ లేదా గెనోవా వరకు ఫ్లైట్లో చేరుకుని, అక్కడి నుండి రోడ్ లేదా ట్రెయిన్ ద్వారా పోర్టోఫినోకి చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో మెడిటరేనియన్ తీరం దృశ్యాలు, టన్నెల్స్, కోస్టల్ కర్వ్స్ జర్నీని మరింత అందంగా మార్చేస్తాయి. -
ఆ వ్యాయామ మెషీన్తో 113 కిలోల నుంచి 90కిలోలు..!
కొందరికి బరువు తగ్గడం అంత సులభం కాదు. తగ్గినట్టు తగ్గి అమాంతం యథావిధిగా బరువు పెరిగిపోతుంటారు. సర్జరీలు వంటివి కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. శరీరాన్ని కష్టపెట్టడానికి, చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనురించడంలో విఫలమయ్యే వారి పరిస్థితి వెయిట్లాస్ విషయంలో దాదాపు ఇలానే ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ 68 ఏళ్ల అమెరికన్ వ్యక్తి. అతడి కథ వింటే..ఆరోగ్యం విషయంలో ఎలా ఉండకూడదో కనువిప్పు కలుగుతుంది.అమెరికాకు చెందిన అల్ ఎస్పోసిటో 46 ఏళ్ల వయసులో సుమారు 226 కిలోల బరువు ఉండేవాడు. తన రూపాన్ని చూసి ఆయనే ఇబ్బంది పడేవాడు. తగ్గాలని స్వల్పకాలిక ప్రయోజనాలిచ్చే డైట్లు ప్రయత్నిస్తుండేవాడు. అవేమి వర్కౌట్ అవ్వకపోయేసరికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీని ఎంచుకున్నారు. ఆ శస్త్రచికిత్సకు ముందే పలువురు కోల్పోయిన బరువులో 20% మళ్లీ పెరుగుతావని చెప్పారు కూడా. అలాగే అల్ ఎస్పోసిటో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత సుమారు 91 కిలోలు తగ్గాడు. అయితే మళ్లీ ఇదివరకు చెడు ఆహారపు అలవాట్లతో మళ్లీ బరువు పెరిగిపోయాడు. కనీసం వ్యాయమం చేసేందుకు ప్రయత్నించకపోవడంతో సుమారు 154 కిలోలకు వచ్చేశాడు. అధిక బరువు కారణంగా కుడి మోకాలిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. వైద్యులు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స సిఫార్సు చేశారు.అయితే ఆపరేషన్కు అతడి శరీరం సహకరించలేదు. దాంతో అల్ బరువు తగ్గక తప్పలేదు. ఆ నేపథ్యంలో మెడిటేరియన్ డైట్ని అనుసరించి రోజుల తరబడి వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులను జీవితంలో చేర్చుకున్నాడు. అలా అల్ సుమారు 129 కిలోలకు చేరుకున్నాడు. ఆ తర్వాత కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. చివరగా, ఫిబ్రవరి 2025లో ఫిజికల్ థెరపీ పూర్తి చేసుకున్న తర్వాత, అతను తన బరువు తగ్గే ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు.అయితే బరువు తగ్గడంలో రోయింగ్ మెషీన్ బాగా హెల్ప్ అవుతుందని సన్నిహితులు సూచించడంతో ఆ మెషీన్ని కొని తెచ్చుకుని వర్కౌట్లు చేయడం ప్రారంభించాడు. రోయింగ్ మెషీన్పై వర్కౌట్లు చేసేటప్పటకీ అతడి బరువు 113 కిలోలు. ఇవాళ అనూహ్యంగా 90 కిలోల బరువు తగ్గడం విశేషం. మొదట్లో 20 నిమిషాల కంటే తక్కువ నిడివిగల చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా క్రమంగా ఎక్కువ సేపు చేసే వర్కౌట్లకు పెంచుకుంటూ, చివరికి రోజుకు 90 నిమిషాల వరకు రోయింగ్ చేశాడు. అంతేగాదు స్థిరమైన భోజన సమయాలను పాటిస్తూ..రాత్రి ఎనిమిది తర్వాత ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. అలాగే చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ ఫుడ్ విషయంలో మంచి కేర్ తీసుకుంటూ బరువుని అదుపులో ఉంచాడు అల్. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. (చదవండి: సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..) -
బిడ్డకు సరిపడా పాలు పడేలా ఇలా చేయండి..!
కొత్తగా తల్లి అయిన మహిళల్లో తమకు పాలు పడకపోవడం అన్నది వారిలోని అ΄ోహ మాత్రమే. దాదాపుగా 90% నుంచి 95% మహిళల్లో తమ చిన్నారులకు కావాల్సినన్ని పాలు సమకూరుతాయి. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ తాలూకు ఆకలి తీరుతెన్నులు తెలియకపోవడం లేదా బిడ్డను తమ నిపుల్ వరకు తీసుకెళ్లి బిడ్డను రొమ్ము పట్టించడం వంటి అంశాలపై కొత్త తల్లులకు అవగాహన లేకపోవడం లేదా పాలు పట్టడంలో బేబీ పొజిషన్స్ సరిగా కుదరక΄ోవడంతో బిడ్డ పాలు తాగక ఏడుస్తుండటంతో తమ పాలు బిడ్డకు సరిపోవడం లేదేమోనంటూ చాలామంది కొత్తగా తల్లులైన మహిళలు అపోహ పడుతుంటారు. ఈలోపు బాటిల్ ఫీడింగ్తో పాలు పడుతుంటే తల్లి మాత్రమే కాకుండా ఎవరైనా తేలిగ్గా పట్టగలగడంతో పాటు తల్లిపాలతో పోలిస్తే కాస్త రుచిగానూ, బాటిల్తో తాగడానికి సులువుగానూ ఉండటంతో బిడ్డ పోత పాలకు తేలిగ్గా అలవాటు పడతారు. దాంతో చాలామంది తల్లులు తమ బేబీకి సరిపడినన్ని పాలు పడటం లేదేమోననే అపోహలో ఉండిపోతారు. నిజానికి ఈ అపోహలన్నీ తొలగించుకుని తల్లిపాలు పట్టడమే మేలు.ఎన్నో వ్యాక్సిన్ల పెట్టుఈ తల్లిపాలుతల్లులు ముందునుంచే తమ బిడ్డకు వీలైనంత మేర తల్లిపాలకు అలవాటు చేయడమే మంచిది. ప్రసవం అయిన తర్వాత పూర్తిస్థాయిలో పాలు ఊరడానికి ఒకటి రెండు రోజులు పట్టవచ్చు. అయితే కొత్తగా తల్లి అయిన వాళ్లలో కొంతమేరకు నీళ్లలా పలుచగా ఉండే పాలను ముర్రుపాలు అంటారు. నిజానికి ఈ ముర్రుపాలు ఎన్నెన్నో వ్యాక్సిన్ల కంటే ప్రభావవంతమైనవి. అయితే ఇవి రెండుమూడు చుక్కల పరిమాణంలోనే వస్తున్నాయంటూ కొందరు తల్లులు వీటిని బిడ్డకు అంతగా పట్టించరు. కానీ వీటిని తప్పక బిడ్డకు తాగించాలి. ఈ పాలలో బిడ్డకు సుదీర్ఘకాలం ΄పాటు మేలు చేసే చాలా అంశాలు ఉంటాయి.కొంతమేర మానసికమైన అంశాల ప్రభావం కూడా... పాలు ఊరడంలో కొంతమేర మానసిక అంశాలూ దోహదపడతాయని చెప్పవచ్చు. తల్లిలో సమృద్ధిగా పాలు పడటానికి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాల మేరకు విడుదల అవుతుంది. కొత్త తల్లి ఏ మాత్రం మానసిక ఒత్తిడి లేకుండా రిలాక్స్డ్గా ఉండి, ప్రశాంతంగా కూర్చుని... నా బిడ్డకు సరిపడినన్ని పాలు నా దగ్గర ఉన్నాయనే భావనతో పాలు పడితే... తల్లి దగ్గర బిడ్డకు అవసరమైనన్ని పాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక శాతం నుంచి 5% తల్లుల్లోనే పాలు ఊరడానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ల్యాక్టేషన్ నిపుణులు లేదా తమ డాక్టర్ను సంప్రదించడం అవసరం. పై నుంచి పాలు పట్టడం తప్పనిసరి అయితే ఉగ్గుగిన్నెతోనే... బిడ్డకు సరిపడా పాలు ఇవ్వలేని సందర్భంలో కొంతమంది పాత తల్లుల సలహా మేరకు బిడ్డకు బాటిల్ ఫీడింగ్ ఇస్తుంటారు. పైపోత పాలు కొంత రుచికరంగా ఉండటంతో పాటు బాటిల్ ఫీడింగ్ తేలిగ్గా ఉండటంతో బిడ్డ ఆ పాలకు అవవాటు పడి తల్లిపాలను అంతగా ఇష్టపడకపోవచ్చు. అలా రెండుమూడు రోజుల పాటు బిడ్డకు పోతపాలో లేదా ఫార్మూలా పాలో తాగించాలంటే కేవలం ఉగ్గుగిన్నెతోనే పట్టించడం మంచిది. దాంతో భవిష్యత్తులో తల్లి నుంచి పాలు తాగే విషయంలో అయోమయపడకుండా మళ్లీ బిడ్డ సౌకర్యంగా పాలు తాగగలడు. బిడ్డ ఎంతగా పాలు తాగుతుంటే తల్లిలో అంతగా పాలు ఊరుతూ ఉంటాయి.బిడ్డకు సరిపడా పాలు ఊరాలంటే... ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో బిడ్డకు సరిపోయినంతగా పాలు పడకపోతే వారిలో స్వభావికంగానే (నేచురల్గానే) పాలు సమృద్ధిగా పడేందుకు ఈ కింద పేర్కొన్న మార్గాలను అనుసరించవచ్చు. ఆ తల్లి తన ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతో పాటు పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఆహారంలో నువ్వులు, వెల్లుల్లి, బెల్లం, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లతో పాటు మంచినీళ్లూ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లికి స్వాభావికంగానే బాగా పాలు పడే అవకాశం ఉంటుంది.అవి అపోహలు మాత్రమే సిజేరియన్ ప్రక్రియ ద్వారా కాన్పు అయిన చాలామంది తల్లులు తమకు సర్జరీ అయినచోట కుట్లలో చీము వస్తుందేమో అన్న ఆందోళనతో పప్పులు తీసుకోరు. నిజానికి పప్పుల్లో ఉండేది ప్రోటీన్లు అయినందున పప్పుతో చీము పట్టదు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపోహతో తగినన్ని ద్రవపదార్థాలూ, ద్రవాహారాలు తీసుకోరు. బిడ్డకు జలుబు చేస్తుందనే తప్పుడు అభిప్రాయంతో పండ్లను తీసుకోరు. నిజానికి పండ్లలో తల్లీబిడ్డలలో తగినన్ని విటమిన్లు, ఖనిజలవణాలను భర్తీ చేయడంతో పాటు వాళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఈ తరహా అ΄ోహల జోలికి పోకుండా బాలింతకు మంచి పోషకాహారంతో పాటు, పండ్లరసాలతో చేసే ద్రవాహారాలు, నీళ్లు, పండ్లు ఇస్తూ ఉండటం అవసరం. ఇక మరికొంత మంది తల్లులు తమ బిడ్డకు పాలు సరిపోవడం లేదనే అ΄ోహతో పోతపాలు పడుతుంటారు. బిడ్డ పాలు తాగిన తర్వాత రెండు నుంచి మూడు గంటల సేపు హాయిగా నిద్రపోవడంతో పాటు... రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు పక్కతడుపుతూ, వయసుకు తగినట్లు బరువు పెరుగుతుంటే మాత్రం ఆ బిడ్డకు తల్లి పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించాక కూడా ఇంకా పాలు సరిపోకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు, పాలలో కలిపే పొడులు వాడాల్సి రావచ్చు. డాక్టర్ పృథ్వీ పేరం, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ – గైనకాలజిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..) -
నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఎంతో కొంత ఒత్తిడి (స్ట్రెస్)ఉంటుంది. అయితే కొందరిలో ఇది చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి అన్నది మెదడు, మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాదు... దేహం తాలూకు భౌతిక సమస్యల రూపంలోనూ వ్యక్తమవుతుంటాయి. ఒత్తిడికి కారణాలు, దీని దుష్ప్రభావాలు, వీటిని అధిగమించడం ఎలా అనే పలు అంశాలను వివరించేందుకే ఈ కథనం.ఒత్తిడి పెరగడానికి పలు అంశాలు కారణమవుతాయి. ఉదాహరణకు పేదరికం, ప్రేమించేవారికి దూరం కావడం సామాజికంగా ఒంటరికావడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం, కుటుంబంలో ఎవరినైనా కోల్పోవడం... ఇలా ఎన్నో కారణాలు ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయి.ఒత్తిడి (స్ట్రెస్)లో రకాలు : ఈ స్ట్రెస్ను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...మేలు చేసే ఒత్తిడి : దీన్ని ఇంగ్లిష్లో ‘గుడ్ స్ట్రెస్’ అని చెప్పవచ్చు. అయితే ఒత్తిడిలోనూ మంచి ఒత్తిడి ఉంటుందా అనే సందేహం రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆ పని త్వరగా లేదా అనుకున్న విధంగా విజయవంతంగా ముగుస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక పనిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు అది ఆ టైమ్లోపు ముగుస్తుందా లేదా అన్న ఒత్తిడిలో పని చేయడం వల్ల నిర్ణీత గడువులో పని బాగా పూర్తయ్యే అవకాశముంటుంది. ఇలాంటి మేలు చేసే ఒత్తిడిని ‘మంచి ఒత్తిడి’ లేదా ఇంగ్లిష్లో ‘యూస్ట్రెస్’ అంటారు. భరించగలిగేంత ఒత్తిడి : దీనితో సమస్య అవుతుంది గానీ... కొంత ప్రయత్నంతో దీన్ని భరించవచ్చు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో దీన్ని అధిగమించవచ్చు. అందుకే దీన్ని భరించగలిగే ఒత్తిడి (టాలరబుల్ స్ట్రెస్)గా పేర్కొంటారు. హానికరంగా పరిణమించే ఒత్తిడి : ఇది తీవ్రమైన ఒత్తిడి చాలాకాలం పాటు కొనసాగుతుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యంపైనా, దేహంపైనా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని హానికరమైన ఒత్తిడి లేదా ‘టాక్సిక్ స్ట్రెస్’గా చెబుతారు. ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు అది కొద్ది సేపటికోసమే అయితే దేహం దాన్ని ఎలాగోలా తట్టుకుని తన జీవక్రియల వ్యవస్థలను (బయలాజికల్ సిస్టమ్స్ను) మళ్లీ మామూలు స్థితికి తెచ్చుకోగలుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పామును చూశామనుకోండి. ఒళ్లు ఝల్లుమంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. స్నేక్ రెస్క్వువర్స్ వచ్చి దాన్ని పట్టుకుని వెళ్లిన తర్వాత ఝల్లుమన్న ఒళ్లు, ఒత్తిడి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. కానీ ఏదైనా ఒత్తిడి అదే పనిగా చాలా సుదీర్ఘకాలం΄ాటు అదే స్థితిలో కొనసాగుతూ ఉంటే ఆ ఒత్తిడి తాలూకు దుష్ప్రభావాలు అనేక రకాలుగా బయటపడతాయి. ఉదాహరణకు కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నత (యాంగై్జటీ), గుండెజబ్బులు (కార్డియోవాస్కులార్ డిసీజెస్), డయాబెటిస్, హైబీపీ లాంటి దేహ జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్ డిజార్డర్స్) వంటి రూపంలో బయటపడవచ్చు.మెదడుపై ఒత్తిడి ప్రభావం మెదడుపై పలురకాలుగా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు... హిప్పోక్యాంపస్పై : ఇది మెదడులో మూడ్స్ను, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే భాగాలు. స్ట్రెస్ తాలూకు ప్రతికూల ప్రభావాలు హి΄్పోక్యాంపస్పై పడితే అది మూడ్స్నూ, మన జ్ఞాపకశక్తిని ప్రభావితం చేయవచ్చు. అమిగ్దలా : ఇది మెదడులో ఉద్విగ్నతను (యాంగై్జటీని) కలగజేసే ప్రాంతం. కాబట్టి అదేపనిగా యాంగై్జటీ కొనసాగే ప్రమాదం ఉంటుంది. ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ : మెదడులోని ఈ భాగం మనం నిర్ణయాలు తీసుకునే ప్రాంతం. అంతేకాదు... ఇది భావోద్వేగాలను నియంత్రించే భాగం కూడా కావడంతో ఆ మేరకు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మెదడులో ఆలోచనలూ, అన్ని రకాల కార్యకలాపాలకు కేంద్రాలైన మెదడు కణాల (న్యూరాన్ల) ఆకృతి మారడం, వాటి పనితీరుపై దుష్ప్రభావలు పడటంతోపాటు రకరకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.ఒత్తిడి... న్యూరో కెమికల్స్ భూమిక(రోల్ ఆఫ్ న్యూరోకెమికల్స్)ఒత్తిడి సమయంలో కొన్ని రకాల న్యూరోకెమికల్స్ విడుదల అవుతాయి. వీటినే స్ట్రెస్ కెమికల్స్ అంటారు. ఉదాహరణకు కార్టిసాల్ లాంటి గ్లూకోకార్టికాయిడ్స్, గ్లుటామేట్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు వంటివి. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే ఇవి మెదడులో అనేక మార్పులు తెస్తాయి. అంతేకాదు దీర్ఘకాలంపాటు ఒత్తిడి కొనసాగితే అది దేహం తాలూకు జీవక్రియల మీదా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.ఒత్తిడి నివారణ పద్ధతులు /చికిత్సకొన్ని జీవనశైలిని మెరుగుచేసుకునే ప్రక్రియల ద్వారా ఒత్తిడిని చాలావరకు అధిగమించవచ్చు. ఉదాహరణకు... మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర కుటుంబం, స్నేహితులను సన్నిహిత సంబంధాలు (మంచి సోషల్ స΄ోర్ట్ సిస్టమ్) ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేద ఇష్టమైన హాబీలను పెంపొందించుకోవడం ∙రోజూ తేలికపాటి వ్యాయామం, ధ్యానం వంటి ప్రక్రియలతో చాలావరకు ఒత్తిడిని అధిగమించవచ్చు. అయితే దీర్ఘకాలిక ఒత్తిడిని అధిగమించడానికి సైకియాట్రిస్ట్లను సంప్రదించి కొన్ని మందులు, ఒత్తిడికి కారణమైన అంశాలను బట్టి కౌన్సెలింగ్ అవసరమవుతాయి. డాక్టర్ ప్రవీణ్ ఎస్ గోపన్, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ నిర్వహణ: యాసీన్ (చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..) -
సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..
బాలీవుడ్లోని అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్లు. 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరు, ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఏప్రిల్ 14, 2022న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రాహా అనే కుమార్తె ఉంది. అయితే అలియా ఇటీవల చెన్నైలో JITO చెన్నై ప్లస్ (జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ 'ఇన్ కన్వర్సేషన్ విత్ ది మిస్టిక్' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, సద్గురు ఆధ్యాత్మిక సంభాషణలలో పాల్గొన్నారు. అక్కడ ఆమె సద్గురుని పిల్లల పెంపకంపై సలహా కోరుతూ ఆయనను ఇలా అడిగారు. "తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?" అని సూటిగా ప్రశ్నించారు. ఆయన నవ్వుతూ, "ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు" అని అన్నారు. ఆ మాటకు అలియా వెంటనే నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు అలియా భట్ను తన బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని హెచ్చరించారు. అలాగే ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు కూడా. ఆయన సలహాకు అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా పగలబడి నవ్వారు. కాసేపటి తర్వాత అలియా పిల్లల పెంపకం విషయంలో ఆందోళనను పక్కన పెట్టగలమని అస్సలు అనుకోలేనన్నారు. సద్గురు మీరు కూడా దీన్ని అంగీకరిస్తారనే అనుకుంటున్నా అని నవ్వుతూ అన్నారామె. రాహా పుట్టినప్పుడు, అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ఆమె ఫోటోలు తీయవద్దని పాపరాజీలను కోరారు. నిజానికి, వారు చాలా కాలం పాటు ఆమె ముఖాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా, ఆలియా కెరీర్ పరంగా 'ఆల్ఫా', 'లవ్ అండ్ వార్' చిత్రాలలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.Truly excited to see Sadhguru ji and alia Bhat’s full conversation pic.twitter.com/mCJF3pm0r9— SgInclusive (@SgInclusivess) March 27, 2026 (చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..) -
మాటలతో మెప్పించడం ఎలా?
చాలామందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్ ఎక్కి గంటలు గంటలు ఉపన్యాసం ఇవ్వడం అనుకుంటారు. కానీ నిజానికి, పదిమంది ఉన్న మీటింగ్ లో మీరు మీ ఐడియాను చెప్పినా, నలుగురు స్నేహితుల మధ్య ఒక విషయాన్ని వివరించినా అది పబ్లిక్ స్పీకింగే.ప్రపంచాన్ని మార్చిన ప్రతి గొప్ప నాయకుడికి ఉన్న ఏకైక ఆయుధం—మాట. ఒక మంచి ప్రసంగం మనుషుల్లో ఆలోచనను రేకెత్తిస్తుంది, ఒక గొప్ప ప్రసంగం మనుషులను కార్యోన్ముఖులను చేస్తుంది. మీ మాట కేవలం సమాచారం కాకూడదు, అది ఒక అనుభూతి (Emotion) అవ్వాలి.స్టేజ్ ఫియర్: భయాన్ని బలంలా మార్చుకోండిప్రపంచంలో మరణం కంటే ఎక్కువగా భయపడేది 'స్టేజ్ ఎక్కడం'. కానీ సైకాలజీ ప్రకారం, ఆ భయం (Nervousness), ఉత్సాహం (Excitement) రెండూ శరీరంలో ఒకే రకమైన రసాయన చర్యలను కలిగిస్తాయి.Reframing: మీరు వణుకుతున్నప్పుడు "నేను భయపడుతున్నాను" అని కాకుండా, "నేను ఈ విషయాన్ని చెప్పడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను" అని మీ మెదడుకు చెప్పుకోండి. ఆ ఆందోళనను 'ఎనర్జీ'గా మార్చడమే ఒక స్పీకర్ కి ఉండాల్సిన మొదటి లక్షణం.Aristotle’s Rhetoric…అరిస్టాటిల్ ప్రకారం, ఒక మాట ప్రభావాన్ని చూపాలి అంటే అందులో మూడు ఉండాలి.1. Ethos (విశ్వసనీయత): మీరు ఎవరు? మీ మాటను జనం ఎందుకు వినాలి? మీ వ్యక్తిత్వమే మీ మాటలకు పునాది.2. Logos (తర్కం): మీరు చెప్పే విషయంలో లాజిక్ ఉండాలి. డేటా, ఫ్యాక్ట్స్ ఉండాలి.3. Pathos (భావోద్వేగం): ఇది అన్నింటికంటే ముఖ్యం. మనుషులు లాజిక్ తో కనెక్ట్ అవ్వరు, ఎమోషన్ తో కనెక్ట్ అవుతారు. ఒక కథను (Storytelling) చెప్పడం ద్వారా వారి మనసులను తాకండి.మోటివేషన్ మాయ vs రియల్ స్పీకింగ్"బిగ్గరగా అరవండి, చేతులు తిప్పండి, స్టేజ్ మీద పరిగెత్తండి" అని మోటివేషన్ చెప్తుంది. ఇది ఒక్కోసారి నాటకీయంగా ఉంటుంది. "మీరు మీలాగే మాట్లాడండి. మీ గొంతులో సహజత్వం (Naturalness) ఉన్నప్పుడే అది ఎదుటివారికి చేరుతుంది" అని సైకాలజీ చెప్తుంది. మోటివేషన్ కంటే 'కన్విక్షన్' (నమ్మకం) ముఖ్యం.మీ ప్రసంగాన్ని ఒక ప్రభంజనం చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ స్పీకింగ్ స్టైల్ ని ఎలా బిల్డ్ చేయాలి?Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండి"నేను సరిగ్గా చెప్పగలనా?" అనే మొహమాటాన్ని 'Break' చేయండి. అలాగే, రోబో లాగా ఒకే శృతిలో (Monotone) మాట్లాడటం ఆపండి. గొంతులో ఎత్తుపల్లాలు (Vocal Variety), మధ్యలో ఇచ్చే నిశ్శబ్దం (Power of Pause) మీ మాటలకు ప్రాణం పోస్తాయి.Step 2: Build Storytellingవిషయాన్ని కేవలం పాయింట్ల రూపంలో కాకుండా, ఒక కథలా చెప్పడం అలవాటు చేసుకోండి. మనుషులు నెంబర్లను మర్చిపోతారు కానీ కథలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మీ వ్యక్తిగత అనుభవాలను జోడించండి. అది మీ మాటలకు 'అథెంటిసిటీ'ని ఇస్తుంది.Step 3: Transformationమీ ప్రసంగం ముగిసిన తర్వాత వినేవారిలో ఒక మార్పు రావాలి. వారు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి లేదా ఒక కొత్త ఆలోచనతో వెళ్లాలి. కేవలం చప్పట్లు కొట్టించుకోవడం కాదు, ఒక 'ప్రభావం' (Impact) చూపడమే 'Beyond' స్టేజ్.మీ మాట ఎంత పవర్ఫుల్?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్ళలోకి చూస్తున్నారా? 2. మీరు చెప్పే విషయంలో మీకు నిజంగా నమ్మకం ఉందా?3. మీ మాటలు విన్న తర్వాత కనీసం ఒక్కరైనా "బాగా చెప్పారు" అని కాకుండా "నేను మారతాను" అని అన్నారా?మీ మాట మీ సంతకం!బ్రో, మీ గొంతు ప్రపంచానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి. దాన్ని దాచుకోకండి. అద్భుతమైన పదాలతో కాదు, స్వచ్ఛమైన భావాలతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ఒక చరిత్ర సృష్టించబడాలి, ఒక మనసు మారాలి. అదే మీ పర్సనాలిటీకి అసలైన సక్సెస్."Speech is power: speech is to persuade, to convert, to compel." -రాల్ఫ్ వాల్డో ఎమర్సన్సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com (చదవండి: Conflict Resolution: గొడవలను పరిష్కరించే నేర్పు) -
మౌనం మీ వ్యక్తిత్వాన్ని ఎలా పెంచుతుంది?
ఒక పవర్ఫుల్ పర్సనాలిటీకి ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం 'మాట' మాత్రమే కాదు.. ‘మౌనం’ కూడా అవసరం. చాలామంది మౌనాన్ని బలహీనత అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం మౌనం అనేది ఒక 'స్ట్రాటజిక్ పవర్'. మీరు ఎప్పుడు మాట్లాడాలో తెలియడం కంటే, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలియడం మీ మెచ్యూరిటీకి నిదర్శనం.నిజమైన అధికారం ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఎక్కువగా అరవడు. నిశ్శబ్దం అనేది ఒక రకమైన 'గ్రేవిటాస్' (Gravitas) ని ఇస్తుంది. మీరు తక్కువగా మాట్లాడినప్పుడు, మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరుగుతుంది. మౌనం మీ ప్రొఫెషనల్, సోషల్ ఇమేజ్ని ఎలా మారుస్తుందో చూద్దాం.నిశ్శబ్దంలోని రకాలు మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు. అది ఒక కమ్యూనికేషన్ టూల్.The Listening Silence: ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా వినడం. ఇది వారిని గౌరవిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు వారి గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతుంది.The Thinking Silence: ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పకుండా, ఒక రెండు సెకన్లు ఆగి చెప్పడం. ఇది మీరు 'ఆలోచించి' మాట్లాడుతున్నారనే నమ్మకాన్ని కలిగిస్తుంది.The Power Pause: ప్రసంగం మధ్యలో ఇచ్చే చిన్న విరామం. ఇది వినేవారిలో కుతూహలాన్ని పెంచుతుంది.తక్కువ మాట్లాడటం వల్ల వచ్చే లాభాలు Control of Emotions: మీరు మౌనంగా ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్ లో ఉంటాయి. ఆవేశంలో తప్పుడు మాటలు అనే ప్రమాదం తప్పుతుంది.Increased Observation: నోరు తెరిస్తే మనం కేవలం మనకు తెలిసింది మాత్రమే చెప్తాం, కానీ చెవి తెరిస్తే కొత్త విషయాలు నేర్చుకుంటాం.Mystery & Respect: ఎక్కువగా మాట్లాడేవారిని ప్రజలు తేలికగా తీసుకుంటారు. తక్కువగా, అర్థవంతంగా మాట్లాడేవారి పట్ల ఒక రకమైన గౌరవం, మిస్టరీ ఏర్పడతాయి.నిశ్శబ్ద శక్తి...మోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "నీ వాయిస్ వినిపించు, అందరినీ డామినేట్ చేయి" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి మిమ్మల్ని 'నాయిసీ' (Noisy) పర్సనాలిటీగా మారుస్తుంది. కానీ సైకాలజీ ఇందుకు భిన్నమైన మార్గం చూపిస్తుంది. "నీ మాటలు విలువైనవి, వాటిని అవసరమైనప్పుడే వాడు" అని చెప్తుంది. నిశ్శబ్దం అనేది అజ్ఞానానికి చిహ్నం కాదు, అది ఆత్మవిశ్వాసానికి చిహ్నం.మౌనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ పర్సనాలిటీలో నిశ్శబ్దాన్ని ఎలా భాగం చేసుకోవాలి?Step 1: అనవసరమైన వివరణలు తగ్గించండిమిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఇచ్చే అనవసరమైన వివరణలను 'Break' చేయండి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా లేదా ప్రశ్నించినా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక నిమిషం మౌనంగా ఉండండి. ఆ నిశ్శబ్దమే అవతలి వ్యక్తిని ఆలోచింపజేస్తుంది.Step 2: Build Deep Listeningమనుషులతో మాట్లాడేటప్పుడు "నేను ఎప్పుడు మాట్లాడాలి?" అని కాకుండా "వారు ఏం చెప్తున్నారు?" అని వినడం నేర్చుకోండి. మీరు ఎంత ఎక్కువ వింటే, మీ నిర్ణయాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. మౌనం మిమ్మల్ని మంచి అబ్జర్వర్ గా మారుస్తుంది.Step 3: Presenceమీరు ఏమీ మాట్లాడకుండా ఒక గదిలో కూర్చున్నా, మీ 'ప్రెజెన్స్' అందరికీ తెలియాలి. మీ కళ్ళలో ఉండే ప్రశాంతత, మీ బాడీ లాంగ్వేజ్ లో ఉండే స్థిరత్వం మీ మౌనాన్ని పవర్ఫుల్ గా మారుస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.మీ మాటల విలువ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలలో ఎన్ని అనవసరమైనవి?2. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మీరు వారిని మధ్యలో ఆపారా?3. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తోందా?నిశ్శబ్దం మీ సంతకం!బ్రో, ఖాళీగా ఉన్న పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిండుగా ఉన్న వ్యక్తిత్వం నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ వ్యక్తిత్వానికి అంతటి గాంభీర్యం (Depth) వస్తుంది. మౌనాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి, అది మిమ్మల్ని ప్రపంచం వైపు నుంచి మీ వైపుకు మళ్ళిస్తుంది."Silence is a source of great strength." - Lao Tszu సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Professional Mask: ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?) -
కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఎంత కీలకమైనది అని చెప్పేందుకు ఈ కేసు ఓ ఉదాహరణ. తీవ్రమైన అవయవ రక్తప్రసరణ అనేది అచ్చం గుండెపోటుని పోలి ఉంటుంది. దీని కారణంగా ఒక్కోసారి ఆయా అవయవం లేదా ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడుతుందట. ఇక్కడ కూడా ఓ మహిళ ఈ పరిస్థితితోనే దాదాపు అవయవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో త్రుటిలో ఆ ప్రమాదం తప్పింది.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలో హింగోలికి చెందిన 57 ఏళ్ల ప్రయాగ్బాయి శంకరరావు షిండేకు ఎండమకాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి వచ్చింది. అది కాస్తా చూస్తుండగానే ప్రాణాతక అత్యవసర పరిస్థితిగా మారింది. గంటల వ్యవధిలో ఆమె పాదం నీలిరంగులోకి మారి, వాచి చల్లగా అయిపోయింది. పూర్తిగా రక్తసరఫరా నిలిచిపోయింది. ఆమె కాలు శాశ్వతంగా కోల్పోయే సంకేతాలు మొదలయ్యాయి. అయితే సకాలంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో అక్కడ వైద్యులు ఆమె తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపం(అక్యూట్ లింబ్ ఇస్కీమియా)తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. ఇదొక తీవ్రమైన రక్తనాళాల అత్యవసర పరిస్థితి. దీనిలో గనుక చికిత్స ఆలస్యం అయితే ఆ కాలుని తీసివేయడం లేదా ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అధునాతన ఇమేజింగ్లో ఆమె కాలులోని ప్రధాన ధమనులలో పూర్తి అడ్డంకి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అయితే అప్పటికే పాదంలో ప్రీ-గాంగ్రేనస్ మార్పులు కనిపించడం మొదలయ్యాయని వైద్యులు తెలిపారు. దాంతో తాము షిండేకు ఎడమ తొడ ధమని ఎంబోలెక్టమీ (left femoral embolectomy) కోసం హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. ఇది ప్లంబింగ్ లాంటిది. ధమని ఎక్కడ మూసుకుపోయినా, దానిని తెరిచి రక్తం గడ్డను తొలగిస్తారు వైద్యులు. ఫలితంగా రక్తప్రసరణ పునరుద్ధరింపబడి కాలును పూర్తిగా కోల్పోకుండా కాపడతారు. అయితే షిండే కాస్త ఆలస్యంగా రావడం వల్ల కొన్ని కాలివేళ్లు అప్పటికే గ్యాంగ్రీన్గా (gangreanes) మారిపోయాయి, అందువల్ల వాటిని తొలగించాల్సి ఉందని అన్నారు. అదీగాక సదరు రోగి షిండేకి అదుపులో లేని మధుమేహం, వయస్సు సంబంధిత అథెరోస్క్లెరోసిస్ ఉండటం ఈ కేసును ప్రత్యేకంగా సవాలుగా మార్చాయి. ఈ సహ-వ్యాధులు తీవ్రమైన అవయవ ఇస్కీమియా (acute limb ischemia) ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కోలుకోవడాన్ని క్లిష్టతరం చేస్తాయని అన్నారు వైద్యులు.ఇదేలా గుండెపోటు లాంటిది అంటే..తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపాన్ని గుండెపోటుతో పోలుస్తున్నారు వైద్యులు. గుండెపోటులో గుండె కండరాలకు రక్త సరఫరా ఎలా నిలిచిపోతుందో, అలాగే తీవ్రమైన అవయవ రక్తప్రసరణ లోపంలో కూడా రక్తప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇది తీవ్రమైన నొప్పికి, కణజాల నష్టానికి దారితీస్తుంది. సాధారణంగా దీనిని తీవ్రమైన అవయవ దాడిగా కూడా పిలుస్తుంటారు. ప్రతి అవయవానికి పోషణ కోసం రక్త ప్రసరణ అవసరం. ధమని మూసుకుపోతే, నీరు లేని మొక్కలాగే అవయవం చనిపోతుంది. తీవ్రమైన అవయవ ఇస్కీమియా అంటే అవయవానికి రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం. తక్షణ చికిత్స లేకుండా, ఆ అవయవం జీవించలేనిదిగా మారుతుంది. ఫలితంగా అవయవంలో తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, చల్లదనం వంటి ప్రారంభ లక్షణాలను లైట్ తీసుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుందని చెబుతున్నారు వైద్యులు. కొందరు నరాల ఒత్తిడిగా భ్రమపడి న్యూరాలజిస్టులని సంప్రదించి విలువైన సమయాన్ని వృధా చేసుకుని ప్రాణాంతకంగా మార్చుకుంటారని తెలిపారు. ప్రమాదం ఎవరికి ఎక్కువ అంటే..వృద్ధ రోగులు, అదుపులో లేని మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, ధూమపానం చేసేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. చికిత్స:సాధారణ చికిత్స ఎంబోలెక్టమీ, కానీ పెర్క్యుటేనియస్ మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అధునాతన పద్ధతులు . ఈ ప్రక్రియలో స్థానిక అనస్థీషియా ఇచ్చి, కాథెటర్ ఉపయోగించి రక్తం గడ్డను బయటకు తీస్తారు. శస్త్రచికిత్స విజయవంతమై, నష్టం తక్కువగా ఉంటే, రోగులు కేవలం రెండు లేదా మూడు రోజుల్లో నడవడం ప్రారంభించొచ్చు. సంక్లిష్టమైన కేసులలో, కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.అంతేగాదు అవయవంలో తీవ్రమైన నొప్పి, చల్లదనం వంటివి కనిపిస్తే, తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళమని సూచిస్తున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు సమయం వృథా చేయకుండా సకాలంలో రోగ నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స పొందితే అవయవాన్ని కాపాడుకోగలమని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..) -
నాడు కాలేజ్ డ్రాపౌట్..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు..!
కొందరికి ఈ చదువులు తనకేం ఉపయోగపడవని, ఇంకేదో రంగంలో ఎదగగలం అని ముందుగానే గుర్తిస్తారు, బలంగా నమ్ముతారు కూడా. అంతేగాదు చాలా ధైర్యంగా చదువుకి మధ్యలోనే స్వస్తి పలికి అందరూ ఆశ్చర్యపోయేలా ఆ రంగంలో దూసుకుపోవడమే కాదు మంచి గుర్తింపు, పేరు తెచ్చుకుంటారు కూడా. అలాంటి కోవకు చెందినవాడే ఈ పిజిక్స్ వాలా. ఆయన ఒకప్పడూ కాలేజీ డ్రాపౌట్..ఇవాళ ఎవ్వరూ ఊహించనంత స్థాయి చేరుకోవడమే కాదు..ఏకంగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా చోటు దక్కించుకున్నాడు. అతడే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన అలఖ్ పాండే. ఆయన ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరంలోనే చదువు మానేశారు. ఆ తర్వాత చాలాకాలం ప్రైవేట్ ట్యూటరింగ్గా తక్కువ జీతానికి పనిచేసేవారు. అలా సాగుతున్న టైంలో 2016లో పిజిక్స్ వాలాగా ఉచితంగా సులభంగా పాఠాలు బోధిస్తూ వేలాది మంది విద్యారులను సంపాదించుకోవడంతో అతడి జీవితం కీలక మలుపు తిరిగింది. ఆ తర్వాత అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ అనే వ్యక్తితో కలిసి 2020లో 'ఫిజిక్స్వాలా' అనే ఎడ్టెక్ సంస్థను స్థాపించారు. కొద్దికాలంలోనే ఆ కంపెనీ ఓ ప్రభంజనంలా దూసుకుపోయింది. నిజానికి అధిక ఫీజలు చెల్లించకుండా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. దాంతో అలాంటి విద్యార్థులను ఉద్దేశించి సులభంగా అర్థం చేసుకునే బోధనా శైలిని రూపొందించారు. ఎడ్టెక్ అనే స్థార్టప్ సాయంతో దూసుకుపోయారు. మొదట్లో ఆ కంపెనీ ఉద్యోగ కోతలు, నష్టాలు, పెట్టుబడుదారుల సందేహాలతో సతమతమవుతున్న తరుణంలో పాండే తన కంపెనీని వృద్ధికి అందుబాటు ధరలో విద్యును అందించడమే కేంద్రబిందువుగా చేసుకున్నారు. అలా 2024లో ఫిజిక్స్వాలా సిరీస్ బి రౌండ్లో దాదాపు రూ. 1750 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత మార్చి 2026 నాటికి అలఖ్ పాండే నికర ఆస్తి విలువ సుమారు రూ. 9 వేల కోట్లుకు చేరుకుందని అంచనా. దాంతో ఆయన ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 3332వ స్థానంలో ప్రవేశించారు. ఒకప్పుడు పాఠం పాఠంగా చెబుతూ అభిమానులను సపాదించుకున్న ఆ ఉపాధ్యాయుడు కొద్దిమంది వ్యవస్థాపకులు మాత్రం చోటు దక్కించుకునే సంపాదన స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ స్థాయికి ఎలా చేరుకున్నారంటే..పాండే తన స్టార్టప్ విధానానికి విరుద్ధంగా విస్తరణపైనే దృష్టిసారించి లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తక్కువ ఖర్చుతో బోధించడంతో విశేష ఆదరణ సంపాదించకున్నారు. పాండే కథ డిజిటల్ విప్లవం విద్యా అవకాశాల స్వరూపాన్ని ఎలా మార్చేసిందే చెబుతోంది. ఒక చిన్న పట్టణంలోని విద్యార్థి విద్య నేర్చుకోవడాని అతని కోసం మెట్రో నగరానికి వెళ్లాల్సిన పనిలేదు. పైగా అధికమొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఒక్క ఫోన్ స్క్రీన్ చాలు. అందువల్ల అతడు బిలియనీర్ల జాబితాలో సులభంగా చోటు దక్కించుకోగలిగాడు. అందుబాటు ధరలో మార్కెట్ను సొంతం చేసుకునే వ్యాపార సూత్రం కూడా. (చదవండి: డెవర్లే... రైతులుగా...) -
లక్ష జీతం, కారు, ఫ్లాట్.. వరుడికి కొత్త రూల్స్!
మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. రెండు మనసులు కలిసి ఒకటిగా మారేది పెళ్లి. ఇది కొత్త జీవితానికి అంకురార్పణ. అగి్నసాక్షిగా ఏడు అడుగులతో మొదలయ్యే ఈ కొత్త పయనం జీవితాంతం తోడుంటాననే మధుర వాగ్దానంతో ముందుకు సాగుతుంది. ఈ అపురూపమైన పెళ్లి బంధాన్ని ప్రస్తుతం యువతీ యువకులు ఒక వ్యాపారంగా మార్చేశారు. గతంలో పెళ్లిని పెద్దలు కుదిర్చేవారు. ఇప్పుడు యువతీయువకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. చివరకు ఒంటరితనమనే శిక్షను చేతులారా తమకు తామే వేసుకుంటున్నారు. వయసు ముదురుతున్న కొద్దీ కనిపించిన వారంతా ఏంబా ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే సూటిపోటి మాటలను తట్టుకోలేకపోతున్నారు. దీంతో మళ్లీ పెద్దలకు చెప్పి ఏ సంబంధమైనా సరే నేను రెడీ అంటున్నారు. ఈ వయసు వారికి పెళ్లి కావడం కష్టంగా పరిణమించింది. చిత్తూరు: నేటితరం అబ్బాయిలు పెళ్లితో ఆర్థికంగా ఎదగాలని భావిస్తున్నారు. తాను ఎలాగున్నా అమ్మాయి మాత్రం అందంగా ఉండాలి. కచ్చితంగా తాను చేసే ఉద్యోగమే అయి ఉండాలి. భారీగా కట్నకానుకలు ఇవ్వాలని భావిస్తున్నారు. జీవితాంతం కలిలి ఉండే భార్యని డబ్బులు తెచ్చే అందమైన యంత్రంగా.. అదో ఫ్యాకేజీగా మార్చేశారు. దీంతో అలాంటి అమ్మాయిల కోసం వేటాడుతూ ఉన్న జీవితాన్ని కోల్పోతున్నారు. 30 ఏళ్లు దాటాక కనువిప్పు కలిగి ఏదో ఒక సంబంధమైనా సరే అని సాగిలపడుతున్నారు. ఎలాంటి సంబంధమైనా ఓకే అన్నా కష్టమే వయసు ముదిరాకగాని అనేక మంచి సంబంధాలను వదులుకున్నామనే బాధ తెలిసి వస్తోంది. అప్పటికీ పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఎవరూ ముందుకురాని పరిస్థితి కలుగుతోంది. ఇదే సమయంలో బంధువులు, స్నేహితుల నుంచి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న మాటలు వినిపిస్తాయి. ఆపై తల్లిదండ్రుల మాట వింటూ ఏ సంబంధమైనా చూడడండనే మాటలు వస్తున్నాయి. మొత్తానికి అప్పటికి పెళ్లి కష్టంగా మారిపోతుంది. మొత్తం మీద పెళ్లి అనేది జీవితం కాదని, అదో జీతాల లెక్కని అనుకునే వారికి చివరికి తనకంటూ ఎవరూ లేకుండా పోతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు దాటి పెళ్లికాని యువతీ యువకుల సంఖ్య 16 వేల వరకు ఉన్నట్టు అంచనా. ఇప్పటికైనా యువత మేలుకుని తన పంథాను మార్చుకుని సరైన వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి.లేని ఆశలు నింపుతున్న మ్యారేజీ బ్రోకర్లు ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యారేజీ బ్రోకర్లు, మ్యారేజి బ్యూరోలే పెళ్లి సంబంధాలను చూస్తున్నాయి. వారిని ఆశ్రయించిన వారికి పలు ఆశలు పెట్టి కళ్ల ముందు స్వర్గాన్ని చూపుతున్నారు. తాను సెట్ చేసిన వారంతా కోట్లకు పడగలెత్తారని, కట్నకానులు భారీగా ఇప్పిస్తామంటూ ఢాంబికాలు పలికి యువతీ యువకుల్లో లేనిపోనీ ఆశలు కలి్పస్తున్నారు. తద్వారా వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకుంటున్నారు. వారి మాటలను నమ్మిన యువతీ యువకులు పెళ్లి తర్వాత తాను పెద్ద పొజిషన్లోకి చేరుకుంటానంటూ కలల ప్రపంచంలో ఊగిసలాడుతూ చివరికి మూడు పదలు దాటాక గాని వాస్తవంలోకి రాలేకపోతున్నారు. ఇదంతా ఒట్టి మాటలనే నిజం చెవికెక్కించుకుంటున్నారు. అప్పటికే పుణ్యకాలం దాటిపోయి పెళ్లి కావడం కష్టంగా మారుతోందిఅమ్మాయిలేం తక్కువ కాదు గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పిన సంబంధాన్ని చేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువమంది భాగస్వామి ఎంపికను వారే చూసుకుంటున్నారు. అబ్బాయి అందంగా ఉండాలి. నెలకు లక్షకు పైగా జీతం రావాలి. అపార్ట్మెంట్ ఉండాలి. కారు ఉండాలి. అత్తమామలు, ఆడపడుచులు గోల ఉండకూడదు. పెళ్లయిన వెంటనే వేరు కాపురం పెట్టాలి అని పలు కండీషన్లు పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే వీరికి భర్త కంటే వారు సెటిల్ అయ్యే ఓ ప్యాకేజీలా మార్చుకున్నారు. ఇలా మంచి మ్యాచ్ వస్తుందేమోనని చూసి చూసి ఆఖరుకు మూడు పదులు దాటాక ఒంటరితనమే మేలని భావిస్తున్నారు. -
క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో ?
ఐపీఎల్ 2026 (IPL-2026) సీజన్ ప్రారంభమైంది. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్తో మొదలుకానుంది. మార్చి 28 నుండి మే 31 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. మొత్తం మొత్తం 84 మ్యాచ్లతో 10 జట్ల తలపడతాయి. ఈ సీజన్ ఫైనల్ బెంగళూరులో జరగనుంది.అయితే ఐపీఎల్ జట్లలో ప్రదానమైంది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). ఆర్సీబీ జట్టు కో-ఓనర్ నీతా అంబానీకి సంబంధించి ఒక ఆసక్తికర సంగతి నెట్టింట వైరల్గా మారింది.నీతా అంబానీ ముద్ర స్పెషల్ ముఖ్యమైన కార్యక్రమాలకు,మరీ ముఖ్యంగా ఐపీఎల్ స్పెషల్ ఈవెంట్లకు ముందు నీతా అంబానీ సూక్ష్మ హస్త ముద్రలు వేయడం విశేషంగా నిలుస్తోంది. ఇది అంగ న్యాసను ప్రతిబింబిస్తుందని విశ్వాసం. మనస్సును కేంద్రీకరించి, అంతర్గత శక్తిని సమతుల్యం చేయడానికి ఉద్దేశించిన ప్రాచీన వేద పద్ధతి అని పండితుల మాట. 60 సెకన్ల పాటు ఇలా చేస్తే మనసుకు ప్రశాంతత, శక్తిని లభిస్తుందట. క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్ ఏంటో? View this post on Instagram A post shared by Vastro Vibe (@vastrovibe)ఎలా చేయాలి?ప్రశాంతంగా కూర్చోండి (వీలైతే తూర్పు వైపు ముఖం పెట్టి) మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత పూర్తి ఏకాగ్రతతతో “ఓం నమః శివాయ” లేదా మీ ఇష్ట దేవతా మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత శరీర భాగాను సున్నితంగా స్పృశించాలి.శిరస్సు – స్పష్టతకళ్ళు – ఏకాగ్రతహృదయం – భావోద్వేగాల సమతుల్యతనాభి – అంతర్గత శక్తిని ఉత్తేజంపాదాలు – భూమిపై నిలదొక్కుకున్న అనుభూతిచివరగా ఒక క్షణం మౌనం పాటించి, శ్వాసమీద ధ్యాసపెట్టి ఆలోచనలను ఆలోచనలను గమనించాలి ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. -
బరువు తగ్గి పీసీఓఎస్ని తిప్పికొట్టింది..! అలాగే ఆ సమస్యలు..
బరువు తగ్గడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చొ తెలిస్తే విస్తుపోతారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే ఎంత మెరుగైన మార్పులు సొంతం చేసుకోవచ్చో అనేందుకు ఈ మహిళే ఉదాహరణ. తాను వెయిట్లాస్తో ఎన్ని లాభాలు పొందిందో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే కాదు..బాడీ మార్పుల తాలుకా ఫోటోలను కూడా షేర్ చేసుకుందామె.ఆ మహిళే దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త నికితా ఫుల్వానీ. చాలామంది బరువు తగ్గడాన్ని రూపానికి సంబందించిదిగా భావిస్తారు.కానీ ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గితే హార్మోన్ల సమతుల్యత నుంచి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానిపై ప్రభావం ఉంటుందని చెబుతుంది. తాను బరువు తగ్గడం వల్ల ముందుగా తన నెలసరి సమస్యలను పరిష్కారమయ్యాయని, ఆ తర్వాత తన చర్మం నిగారింపు సంతరించుకోవడం మొదలైందని చెబుతోంది. అలాగే ముఖంపై రోమాలు కూడా తగ్గాయని చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా నీరు తాగడం, మంచి ఆహారపు అలవాట్లతో అధిక బరువుని సునాయాసంగా తగ్గించుకున్నట్లు వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గాయో కూడా వివరించింది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం నిగారింపు సంతరించకుందని, అలాగే శరీరం యాక్టివ్గా మారిందని అంటోంది. అలాగే చర్మంపై ఇదివరకు ఉన్న మచ్చలు కూడా తగ్గాయని, మేకప్ లేకుండా సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నానని అంటోంది. అధిక చక్కెర తీసుకోవడంతో నోటి చుట్టూ, మెడ చుట్టూ నలుపు ఎక్కువగా ఉండేదని పేర్కొంది. అయితే ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన పదార్థాలకు, చక్కెరకు దూరంగా ఉందో ఆ సమస్య చాలమటుకు తగ్గిందని అంటోంది. అలాగే పాదాల సైజు నుంచి మణికట్టు సైజు అన్నింటిలో శరీర మార్పుని చవిచూశానంటోంది. కానీ బరువు తగ్గితే శరీరం ఎంతగా రూపాంతరం చెందుతుందో, మనలో ఎంతటి అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయో స్పష్టంగా తెలిసిందని అంటోంది. ప్రస్తుతం తనను చూస్తే..జస్ట్ 25 లేదా 27 ఏళ్లు అని మాత్రమే అనుకుంటారని అంటోంది. కచ్చితంగా బరువు తగ్గితే అక్షరాల యవ్వనంగా మారిపోతామని, మన చర్మకాంతి పెరుగుతుందని చెబుతోంది ఫుల్వానీ. మన జీవనశైలి బాగుంటే అందం, ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయని చెబుతోంది. View this post on Instagram A post shared by Nikita Phulwani (@niggiphulwani) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి ట్రాన్స్జెండర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్..!) -
రయ్ రయ్..నాలుగు చక్రాల సైకిలోయ్!
తమిళనాడు వెల్లూరులోని వాణివిద్యాలయంలో పదవతరగతి చదువుతున్న శబరివాసన్ నాలుగు చక్రాల సైకిల్ తయారుచేసి ‘ఆహా!’ అనిపించుకున్నాడు. వృథాగా పడి ఉన్న వస్తువులతో ఈ నాలుగు చక్రాల సైకిల్ను తయారుచేయడం విశేషం. ‘ఎవరి సలహాలు, సూచనలు తీసుకోకుండానే మా అబ్బాయి ఈ సైకిల్ను తయారుచేశాడు’ అని సంబరపడిపోతున్నాడు శబరివాసన్ తండ్రి కతిర్వేల్. ఆయన క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శబరివాసన్కు సైకిల్ నుంచి కారు వరకు రకరకాల వాహనాల గురించి ఆసక్తి. వాటిలో ఏ భాగాలు ఉంటాయి? అది ఎలా పనిచేస్తుంది?... మొదలైన వివరాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే నాలుగు చక్రాల సైకిల్ తయారుచేయడానికి కారణం అయింది.అందుబాటులో ఉన్న వస్తువులతోనే రకరకాల వాహనాలు తయారుచేసిన వ్యక్తుల వీడియోలు తరచుగా చూసేవాడు. ఆ సమయంలోనే తనకు కూడా కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, స్పేర్ ట్యూబ్లను సేకరించి నాలుగు చక్రాల సైకిల్ను తయారు చేశాడు. ఈ వాహనాన్ని తయారుచేయడానికి నెలరోజుల సమయం పట్టింది.‘నేను తయారుచేసిన నాలుగు చక్రాల సైకిల్ను చాలామంది మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని కొత్త వాహనాలు తయారుచేస్తాను’ అని ధీమాగా అంటున్నాడు శబరివాసన్. (చదవండి: Kavitha Vasupalli: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీని తలపించే స్టోరీ..! ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్..) -
పొయ్యి వెలిగించకుండానే వండే వంటకాలు..!
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్, ఇంధన సమస్యలు తలెత్తుతాయేమోనని యావత్తు దేశం ఆందోళన చెందింది. సరిగ్గా ఈ సమయంలో విశాఖ తీరానికి ఎల్పీజీ, చమురు నౌకలు ఒక్కొక్కటిగా చేరుకోనుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఇలా యుద్ధం మరేదో విపత్తు కారణంగా మొదట ఇబ్బందులు ఎదురయ్యేది గ్యాస్, చమురు వద్దే. ఇంతవరకు చాలాసార్లు చమురు కష్టాలు చూశాం. కానీ తొలిసారిగా గ్యాస్ కొరత ఎలా ఉంటుందో గత కొన్ని రోజులుగా దాని ఎఫ్క్ట్ని ప్రత్యక్షంగా చూశాం. ఒక్కసారిగా గ్యాస్పై ఆధారపడకుండా వండే ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు చూశారు అంతా. మరోవైపు ఇండక్షన్ స్టవ్లు, కట్టెల పొయ్యిలు ఇలా పలు రకాల ప్రత్యామ్నాయాలు, కొంగొత్త ఆవిష్కరణల దిశగా నిపుణులు అడుగులు వేశారు. అయితే వీటన్నింటికంటే భిన్నంగా అందరికంటే ముందే పొయ్యితో పనిలేకుండా చేసే వంటకాల గురించి ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ చెఫ్ శివకుమార్. పైగా మంట, నూనెతో సంబంధం లేకుండా హాయిగా ఆస్వాదించే రకరకాల వంటకాలను సైతం కనిపెట్టారాయన. మరి అవేంటో..?, ఎలా చేస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.ప్రముఖ చెఫ్ పడయాల్ శివకుమార్ వండకుండా, నూనె లేకుండా వండే ఆహారంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన పచ్చిపదార్థాల్లో సహజ రుచులు, పోషకవిలువల ప్రాముఖ్యతను గ్రహించి ఆయన ఈ దిశగా అడుగులు వేశారు. నూనె తరుచుగా పదార్థాల సహజ రుచిని, దాని పోషక విలువలని తగ్గించేస్తుందట. ఇక ఉడికించడం వల్ల పెద్ద ఎత్తున పోషకాలు ఆవిరైపోతాయి. అందువల్ల ఆ రెండింటితో పనిలేకుండా వండే వంటకాల్లో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి పోషకాలను పొందొచ్చని గట్టిగా నమ్మారు శివ. ఆ నేపథ్యంలోనే మంట, నూనెతో పనిలేకుండా వండే వంటకాలపై అన్వేషించి ఏకంగా..2500 విభిన్న రకాల వంటకాలను తయారు చేసే పద్ధతులను అభివృద్ధి చేశారు. అంతేగాదు కోయంబత్తూర్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన దక్షిణ భారత రా వెగన్ వంటకాలను అందించే 'పడయల్ నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్'ను కూడా ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ "ఆహారమే ఔషధం" అనే శివకుమార్ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రెస్టారెంట్ కారం తక్కువ, రుచిలో ఏమాత్రం తీసిపోని మంచి బోజనాన్ని అందిస్తుంది. 'రా ఫుడిజం'ను ప్రోత్సహిస్తూ, ప్రాసెస్ చేసే ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండేలా చేసి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఈ వంటకాలను అందించడం విశేషం. సహజమైన వంట సంప్రదాయాల వైపుకు అందరూ అడుగులు వేసేలా చేయడమే తన లక్ష్యమని అంటున్నారు. శివ వంటకాలన్ని జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేలా, ఆరోగ్య సమస్యలను పరిష్కరించేవిగా నిరూపితమయ్యాయట కూడా. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..ప్లస్ టూ వరకు రెగ్యులర్గా చదివిన శివకుమార్.. ఆ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఆధ్యాత్మికంపై మక్కువతో వేదాగ్ని మహర్షి వద్ద యోగా అభ్యసించారు. అలా ఆ సంస్థలో పదేళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అక్కడే యోగాసనాలు, ఆరోగ్యకరమైన ఆహారవిధానాలు నేర్చుకున్నారు. అదే ఆయన్ని ఈ ‘పడయల్’ రెస్టారెంట్ వరకు నడిపించింది. యోగా శిక్షణలో ఉన్న వారికి అందించే చిరుధాన్యాలు, మూలికా ఆహారం తీసుకున్న వారి శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం గమనించిన ఆయన ఈ సహజసిద్ధమైన ప్రకృతి ఆహారంపై ప్రయోగాలు చేశారు. అలాగే ఈ వంటకాలు తిన్న చాలామంది తమ ఆరోగ్య సమస్యలు నయమైనట్లు చెబుతుండడంతో ప్రకృతి ఆహారంపై మరింతగా అన్వేషణ చేసినట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Padayal No Oil No Boil (@padayal_nooil_noboil) (చదవండి: అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..) -
గొడవలను పరిష్కరించే నేర్పు
మీరు సామాజికంగా లేదా వృత్తిపరంగా ఎదుగుతున్నప్పుడు, భిన్నాభిప్రాయాలు రావడం సహజం. ఆ భిన్నాభిప్రాయాలు 'గొడవలు'గా (Conflicts) మారి సంబంధాలను దెబ్బతీయకుండా, వాటిని ఒక పరిష్కారం వైపు నడిపించడమే 'Conflict Resolution'. నిజమైన మేధావి గొడవలను గెలవాలని చూడడు, గొడవలను 'ముగించాలని' చూస్తాడు. గొడవలు అనేవి మనుషుల మధ్య ఉండే 'గ్యాప్' వల్ల వస్తాయి. చాలామంది గొడవ అనగానే అది ఒక యుద్ధం అనుకుని, గెలవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రొఫెషనల్ వరల్డ్ లో గొడవను గెలవడం అంటే అవతలి వ్యక్తిని ఓడించడం కాదు, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని కనుగొనడం.గొడవలు ఎందుకు వస్తాయి? సైకాలజీ ప్రకారం, గొడవలకు ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి.Communication Gap: ఒకరు చెప్పింది మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం.Ego Clash: "నేను చెప్పిందే కరెక్ట్" అనే అహంకారం అడ్డు రావడం.Conflicting Interests: ఒకరి అవసరాలు మరొకరి అవసరాలకు విరుద్ధంగా ఉండటం.వీటిని గుర్తించినప్పుడే మీరు పరిష్కారం వైపు అడుగు వేయగలరు.థామస్-కిల్మాన్ మోడల్ (TKI Model)గొడవలను ఎదుర్కోవడానికి మనుషులు ఐదు రకాల పద్ధతులను వాడుతుంటారు.Competing (పోటీ): నేనే గెలవాలి, అవతలి వారు ఓడిపోవాలి. (Win-Lose)Avoiding (తప్పించుకోవడం): గొడవ వద్దు అని అసలు విషయం మాట్లాడకుండా ఉండటం. (Lose-Lose)Accommodating (సర్దుకుపోవడం): అవతలి వారు చెప్పిందే సరే అనడం. (Lose-Win)Compromising (రాజీ): ఇద్దరం కొంచెం తగ్గి మధ్యలో ఒక చోట కలవడం.Collaborating (సహకారం): ఇద్దరికీ లాభం కలిగే కొత్త మార్గాన్ని వెతకడం. (Win-Win)ఒక 'జీనియస్ పర్సనాలిటీ' ఎప్పుడూ Collaborating లేదా Compromising పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తుంది.మోటివేషన్ మాయ vs రియల్ రిజల్యూషన్మోటివేషన్ "నీ పవర్ ఏంటో చూపించు, నిన్ను తక్కువ చేసిన వాడికి బుద్ధి చెప్పు" అని రెచ్చగొడుతుంది. ఇది గొడవను ఇంకా పెంచుతుంది.సైకాలజీ "ముందు అవతలి వ్యక్తిని ప్రశాంతంగా విను (Active Listening). వారికి ఏం కావాలో అర్థం చేసుకుంటే, గొడవ సగం పరిష్కారం అవుతుంది" అని చెప్తుంది (De-escalation).గొడవలను పరిష్కరించే ఫార్ములాGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, గొడవలను ఎలా డీల్ చేయాలి?Step 1: Break Emotional Attachment గొడవ జరుగుతున్నప్పుడు మీలోని ఆవేశాన్ని, అహాన్ని 'Break' చేయండి. "నేను గెలవాలి" అనే ఆలోచన కంటే "సమస్య పరిష్కారం అవ్వాలి" అనే ఆలోచనపై దృష్టి పెట్టండి. ఒక అడుగు వెనక్కి వేయడం అంటే ఓడిపోవడం కాదు, అది ఒక 'స్ట్రాటజీ'.Step 2: Build Empathy Bridgeఅవతలి వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారి కోణం నుండి ఆలోచించండి. "నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నా ఇబ్బంది ఇది..." అని సంభాషణను సానుకూలంగా 'Build' చేయండి. మీరు వారిని అర్థం చేసుకున్నారని వారికి తెలిస్తే, వారు కూడా తగ్గుతారు.Step 3: శాశ్వత పరిష్కారంకేవలం ఆ క్షణానికి గొడవ ఆపడం కాదు, మళ్ళీ అలాంటి సమస్య రాకుండా ఒక 'సిస్టమ్'ని క్రియేట్ చేయండి. గొడవ పడిన వ్యక్తితో కూడా మళ్ళీ మంచి సంబంధాన్ని నెలకొల్పడమే 'Beyond' స్టేజ్. ఒక శత్రువుని మిత్రుడిగా మార్చుకోవడమే నిజమైన విజయం.మీ రిజల్యూషన్ స్టైల్ ఏంటి?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.గతంలో మీరు పడిన ఒక పెద్ద గొడవను గుర్తు తెచ్చుకోండి. అక్కడ మీరు పోటీ పడ్డారా లేక సహకరించారా?గొడవ జరుగుతున్నప్పుడు మీరు అవతలి వ్యక్తి మాటలను పూర్తిగా వింటున్నారా?మీరు గొడవ పడిన తర్వాత ఆ వ్యక్తితో మీ సంబంధం ఎలా ఉంది?శాంతియే అసలైన శక్తి!బ్రో, గొడవ పడటానికి బలం ఉంటే సరిపోతుంది, కానీ గొడవను ఆపడానికి 'వ్యక్తిత్వం' ఉండాలి. సమాజంలో లేదా ఆఫీసులో అందరూ మిమ్మల్ని ఒక Peace Maker లాగా చూడాలి. ఎక్కడ గొడవ జరిగినా మీరు వస్తే అది పరిష్కారం అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించడమే మీ పర్సనాలిటీకి అసలైన గౌరవం.గుర్తుంచుకోండి "The quality of your life is determined by the quality of your relationships, and the quality of your relationships is determined by how you handle conflicts."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: రూ. 41 లక్షల జీతం వద్దనుకుని కవయిత్రిగా..!) -
అనుగ్రహబలమివ్వు సీతారామా!
‘శ్రీరాముని అనుగ్రహబలమే బలము’ అన్నాడు త్యాగయ్య. రాముని అనుగ్రహం అతి సులువు. మాటకు కట్టుబడుట... మంచికి కట్టుబడుట... ఇవి చేస్తే చాలు. అయిననూ ఆయన మనయందు పరాకుగా ఉంటే ఒక మాట చెప్పేందుకు సీతమ్మ తల్లి ఉండనే ఉందిగా. సీతాసమేతుడైన ఆ దివ్యమూర్తి జన్మదినమూ, వివాహమూ లోక విశేషము. పొందగలిగినన్ని వరములు ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్షిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.స్థితప్రజ్ఞతరేపే పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, ఆ పట్టాభిషేకం ఆగిపోయి, అడవికి వెళ్లాలని తెలిసినప్పుడు కుంగిపోలేదు. తండ్రిని నిందించలేదు, పినతల్లి కైకేయిని ద్వేషించలేదు. ఆ క్షణంలో ఆయన చూపిన నిలకడ స్థితప్రజ్ఞకి పరాకాష్ట. అత్యంత ఒత్తిడిలో కూడా విచక్షణ కోల్పోకుండా ఉండటం ఒక గొప్ప వ్యక్తిత్వ లక్షణం.కృతజ్ఞత ఎవరైనా వంద తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా, వారు చేసిన ఒక్క చిన్న మేలును కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే గొప్ప గుణం రాముడిది. కృతజ్ఞత చూపడంలో రాముడు ఒక మార్గదర్శి.ధర్మబద్ధతరాముడిని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటే ధర్మానికి ప్రతిరూపంగా పేర్కొంటారు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు. రాముడి బాణం దెబ్బ తొలుతగా రుచి చూసిన మారీచుడే. అంటే శత్రువు చేత కూడా ప్రశంసలు పొందేంతటి ధర్మగుణం కలవాడన్నమాట. ఎన్ని కష్టాలు ఎదురైనా తను నమ్మిన సత్యం, ధర్మం నుంచి తప్పుకోకపోవడం ఆయన గొప్పతనం. -
ఐరన్ అప్తో.. ప్రపంచ రికార్డు
ఐరన్ డెఫిషియెన్సీ(ఐడిఏ)పై అవగాహన పెంచే క్రమంలో అంతర్జాతీయ పోషకాహార సంస్థ దానోన్ ఇండియా నిర్వహించిన కార్యక్రమం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ విషయాన్ని భాగ్యనగరంలోని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య నిపుణులు రక్తహీనతను ఎదుర్కొనే విషయంలో పాలుపంచుకుంటామని ప్రమాణం చేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. 2025 నవంబర్లో ప్రారంభించిన ‘ఐరన్ అప్’ కార్యక్రమం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించారు. ఈ కాంపెయిన్లో భాగంగా వైద్యులు అవగాహన పెంపు, సమయానుకూల నిర్ధారణ, పోషకాహార ప్రాముఖ్యతపై కృషి చేయాలని సంకల్పించారు. పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు సహా అనేక మంది వైద్య నిపుణులు కార్యక్రమంలో భాగమయ్యారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువుల్లో రక్తహీనతను తగ్గించేందుకు డానోన్ ‘స్వస్థ మాత స్వస్థ బాలక్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని బీహార్లో అమలు చేస్తోంది. ఈ సందర్భంగా డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ.. ‘ఈ గుర్తింపు వైద్య సమాజం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి మార్పు సాధ్యమో చూపిస్తుంది అని తెలిపారు. -
పెళ్లి చేసుకోకుంటే ఇదంతా చేసేవాడిని కాదు..!: రిషి సునాక్
'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే మూడు గంటల ఎపిసోడ్లో, జెరోధా సహ వ్యవస్థాపకుడు బిలియనీర్ నిఖిల్ కామత్ యూకే మాజీ ప్రధాని రిషి సునాక్, భార్య అక్షతా మూర్తితో సరదా సంభాషణ నిర్వహించారు. ఆ సంభాషణలో నాయకత్వ వైఫల్యం, గుర్తింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ఆర్థికవ్యవస్థ వంటి అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రముఖ పోడ్కాస్ట్కు అతిథులుగా వచ్చిన తొలి జంట రిషి సునాక్, అక్షతామూర్తిలే. ఆ పాడ్కాస్లో ఈ దంపతులు షేర్ చేసుకున్న అమూల్యమైన విషయాలేంటో చూద్దామా..!.ఆ పాడ్కాస్ట్లో రిషి ప్రధాని అనతరం లైఫ్, నేర్చుకున్న పాఠాలు, రాజకీయాల్లో కొనసాగనున్నారా?, యువ భారతీయులకు మార్గనిర్దేశం వంటి పలు అంశాలపై మాట్లాడగా, మూర్తి వారసత్వ విజయంలో ఉండే సవాళ్లు, తన గుర్తింపు, కుటుంబ అంచనాలు, తమ అభిప్రేయ బేధాల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.ఇక్కడ రిషి పదవి నుంచి వైదొలగిన అనతరం దీన్ని రాజకీయ ఓటమిగా కాకుండా, అరుదైన మానసిక పునఃప్రారంభంగా అభివర్ణించారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం.. తర్వాత ఏం చేయాలో అస్సలు తనకు తెలియలేదన్నారు. అయితే ఈ విరామ సమయంలోనే తనకు ఏం చేయాలి, ఏం కావలనేది క్షణ్ణంగా తెలుసుకోగలిగాను అన్నారు. ఇక్కడ మనల్ని మనం బాధతుగా భావించుకోకూడదు, ఆ రాజకీయ ఓటమిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలన్నారు. అంతేగాదు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాను ప్రస్తావిస్తూ..ఈ టైంలో కర్తవ్యంపై దృష్టి పెట్టడం సరైనది అని చెప్పారు రిషి. అలాగే భారతీయ వినియోగ విప్లవాన్ని తరాల మార్పుగా అభివర్ణించారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఎన్నడూ చేయనంత స్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ కొన్న వస్తువులు పిల్లల్లు కొనడం లేదు. ఈతరానికి కొత్తబ్రాండ్లు, స్వదేశీ ఉత్పత్తులు, ప్రామాణికత కావాలని అన్నారు. అంతేగాదు భారతీయ తల్లిదండ్రులు విద్యను మెరుగైన జీవితానికి కీలకంగా చూస్తారన్నారు. తాను కూడా తన తల్లిదండ్రలును ఆ విషయంలో బాగా నిరాశపరిచనట్లు తెలిపారు. తన పేరెంట్స్ డాక్టర్ కావాలనుకుంటే..బదులుగా తాను రాజకీయాలు ఎంచుకున్నానని అన్నారు. అలాగే విద్య భవిష్యత్తు గురించి మాట్లాడుతూ కామత్ కాలేజ్కి వెళ్లకపోవడంపై అభద్రతాభావం వ్యక్తం చేయగా..సునాక్ ఇక్కడ నేర్చుకునే సామర్థ్యం ముఖ్యం అని చెప్పారు. ఇప్పడు చాలామటుకు పరిశోధన కోసం క్లాడ్, ఐఏ సాధనాలు వినియోగిస్తున్నా..తాను మాతరం స్వయంగా ఆలోచించడానికే ప్రాధాన్యత ఇస్తా, అలాగే తన ప్రసంగాలు, వాదనాలు తానే స్వయంగా రాసుకుంటానని చెప్పారు రిషి. అంతేగాదు యువత రాకీయాల్లోకి రావడంపై కూడా రిషి మాట్లాడారు. చాలా స్థైర్యం, సహనం, సేవా దృక్పథం ఉంటే తప్పక రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ఆ మూడు లక్షణాలు ఉంటేనే 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయగల శక్తి వస్తుందన్నారు. ఇక అక్షతామూర్తి ఈ సంభాషణలో తన ఐడెంటిటీ గురించి మాట్లాడారు..తాను బ్రిటిష్ యాసతో మాట్లాడే బెంగళూరు అమ్మాయినని చెప్పారు. తన భర్త ప్రధాని, తండ్రి వ్యవస్థాపకుడు..కానీ ఇవేమి తన గుర్తింపు కాదని, తన ప్రభావమే తన ఐడెంటీటిగా మార్చుకుంటానని అన్నారామె. చివరగా ఆ పాడ్కాస్ట్లో ఇద్దరిలో తమకు నచ్చే అంశాల గురించి కూడా షేర్ చేసుకున్నారు. రిషి పనిచేసేముందే క్షణ్ణంగా ఆలోచిస్తే..తాను మొదలు పెట్టాక..ఏం చేస్తే బెటర్ అని ఆలోచించుకుంటానని అన్నారు అక్షతా. ఇక పెద్ద పెద్ద నిర్ణయాల విషయంలో రిషి విశ్లేషణను విశ్వసిస్తానని, ఆయన తన సూక్ష్మదృష్టిని నమ్ముతాడని అక్షతా చెప్పుకొచ్చారు. ఇక సునాక్ వైవాహిక బంధం వల్ల ఇదంతా చేయగలిగాను..ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తన భార్యకే క్రెడిట్ ఇస్తూ..ఆమె మద్దతు లేకుండా ఏమి చేయలేనని అన్నారు రిషి. View this post on Instagram A post shared by Nikhil Kamath (@nikhilkamathcio) (చదవండి: హైరాక్స్ ఫిట్నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!) -
హైరాక్స్ ఫిట్నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!
సాధారణంగా మారథాన్, ఫుల్ మారథాన్.. వంటి పలు రకాల ఫిట్నెస్ ఫార్మాట్లో వృద్ధులు సైతం పాల్గొని రికార్డులు తిరగరాశారు. వాటన్నింటకంటే ఇటీవల సరికొత్తగా హైరాక్స్ అనే ఫిట్నెస్ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఫిట్నెస్ ఔత్సాహికులు ఈ ట్రెండ్ని ఆదరిస్తున్నారు కూడా. అయితే ఇది సాధారణ మారథాన్ వలే జస్ట్ పరుగు కాదు..మల్టీటాస్కింగ్ వర్కౌట్లుగా చెప్పొచ్చు. కాస్త క్లిష్టతరమైనది కూడా. అలాంటి కఠినమైన హైరాక్స్ ఫంక్షనల్ రేసింగ్ పోటీలో ఓ 72 ఏళ్ల మహిళ అవలీలగా రికార్డు నెలకొల్పింది. పైగా ఆమె తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఈ ఘనత సృష్టించడం విశేషం. ఎవరామె..? అంత ఏజ్లో ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..స్కాట్లాండ్కి చెందిన 72 ఏళ్ల కరోల్ మున్నో అనే మహిళ ఈ ఘనతను సృష్టించింది. ఏకంగా మూడుసార్లు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ హైరాక్స్ ఫిట్నెస్ రేసులో రికార్డు నెలకొల్పిందామె. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఫిట్నెస్ రేసులలో ఒకటైన హైరాక్స్లో రికార్డులు బద్దలు కొట్టి అంచనాలకు మించి సత్తా చాటిందామె. ఈ హైరాక్స్ రేసులో పాల్గొన్న అత్యంత పైబడిన వారిలో ఒకరిగా..తన సహచర క్రీడాకారిణిలో పోటీపడి ఈ రికార్డుని సృష్టించింది. ఈ రేసు వ్యాయామం, ఓర్పుతో కూడిన పరుగు. చాలా ఓర్పుతో చేయాల్సి పోటీ ఇది. ఆమెకు మూడు హిప్ రీప్లేస్మెంట్లు జరిగాయి. అంటే అధిక శారీరక ప్రభావం చూపే కార్యకలాపాలను పరిమితం చేసే పరిస్థితి ఆమెది..అయినప్పటికీ డోంట్ కేర్ అంటూ అవలీలగా ఈ క్లిష్టమైన రేసులో సత్తా చాటి స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ. హైరాక్స్ అంటే..ఇదొక గ్లోబల్ ఇండోర్ ఫిట్నెస్ రేస్. ఇందులో ఎనిమిది.. ఒక కిలోమీటరు పరుగు తోపాటు స్లైడ్పుష్లు, రోయింగ్, బర్పీలు, వెయిటెడ్ లంజెస్ వంటి ఎనిమిది ఫంక్షనల్ వర్కౌట్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంలే ఒకేసారి బలం, ఓర్పు, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి రూపొందించిన రేసింగ్ ఫార్మాట్ ఇది. సాంప్రదాయ మారథాన్లు లేదా జిమ్ పోటీల వలె కాకుండా, అత్యంత కఠినంగా, విభిన్నంగా ఉంటుంది. అలాంటి కఠినతరమైన ఈ రేసును వయసు పైబడి, అందులోనూ శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న వారికి పూర్తి చేయడం అత్యంత కష్టం. కానీ ఈ స్కాటిష్ బామ్మ అచంచలమైన పట్టుదల ఉంటే ఈ శారీరక ఇబ్బందులు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి..సాధారణంగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి ఆపరేషన్లు చేయించుకుంటే..వారిని అధిక ప్రభావం చూపే వ్యాయమాల విషయంలో కేర్ఫుల్గా ఉండమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఈ 72 ఏళ్ల బామ్మ ఆ అభిప్రాయాన్నే అందరూ ఆశ్చర్యపోయేలా తిరగరాసింది. అయితే ఈ బామ్మ క్రమం తప్పకుండా వర్కౌట్ల శిక్షణ తీసుకోవడం తోపాలు పలు రకాల వ్యాయామాలు మార్చుతుండటం వల్ల హైరాక్స్లో సులభంగా రాణించగలిగేలా ఓర్పుతో కూడిన బలం సంపాదించుకుంది. అలాగే వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించింది కూడా. కాగా ఈ సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ హైరాక్స్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో ఎక్కువగా జరుగుతాయి.(చదవండి: పర్యాటక అద్భుతం..'రివర్కేఫ్'గా వంతెన!) -
హీరోయిన్ చేస్తానని నా భార్యను తీసుకెళ్లాడు సార్..!
నాకు నలభై సంవత్సరాలు. నా భార్య స్వాతికి ముప్పై సంవత్సరాలు (పేర్లు మార్చబడినవి). మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమె చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే వంటలు చాలా బాగా చేస్తుంది. అయితే నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం ఆమెకు ఎక్కువ. కోవిడ్ సమయంలో సరదాగా యూట్యూబ్లో వంటల వీడియోలు చేయడం ్రపారంభించింది. మొదట్లో మంచి వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. కానీ తరువాత వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరగలేదు. అదే సమయంలో రీల్స్ ట్రెండ్ మొదలైంది. దాంతో ఆమె వంటలు తగ్గించి చిన్నచిన్న డ్యాన్సులు, స్కిట్స్ చేయడం ్రపారంభించింది. ఇతరుల మాదిరిగా తనకు వ్యూస్ రావడం లేదని రొమాంటిక్ పాటలకు, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఈ లోపు సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, తరువాత ఆమెను హీరోయిన్ని చేస్తానని నమ్మబలకడంతో ఆమె నేను ఎంత చెప్పినా వినకుండా హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అతను రెండు మూడు చిన్న సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం త్వరలోనే హీరోయిన్ అవుతానని నమ్ముతోంది. ఆ వ్యక్తి ఆమెను ప్రలోభపెట్టి అన్ని రకాలుగా తన వైపు తిప్పుకుంటున్నాడని అర్థమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సర్దిచెప్పకపోగా మా కూతురు హీరోయిన్ అవుతుందని, నేను అనవసరంగా అనుమానాలు పెంచుకుంటున్నానని నా మీదనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – నరసింహారావు, విజయవాడమీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో అర్థమవుతోంది. ఒకవైపు బాధ, మరోవైపు అవమానం, కోపం, నిరాశ ఇవన్నీ కలగలిసిన పరిస్థితి మీది. ఇక మీ భార్య విషయానికి వస్తే, ఆమెకు ముందు నుంచే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆకాంక్ష ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొందరిలో ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు రావడం మాత్రమే వారికి చాలా ముఖ్యం. యూట్యూబ్లో వంటల వీడియోల ద్వారా కొంతకాలం ఆమెకు ఆ గుర్తింపు వచ్చింది. కానీ వ్యూస్, సబ్స్క్రైబర్లు తగ్గడంతో ఆమె రీల్స్, ఇతర వీడియోల వైపు వెళ్లి ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కొత్తగా ప్రయత్నిస్తున్న మహిళలను ప్రలోభపరుస్తుంటారు.ఇలాంటి సమయంలో మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకువెళ్లడం చాలా ముఖ్యం. మొదటగా.. ఆమె చేస్తున్న ప్రతి దాన్ని పూర్తిగా తప్పు అని చెప్పి, ఆపమని ఒత్తిడి చేస్తే ఆమె ఇంకా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. బదులుగా ‘‘నీ ప్రయత్నాలకు నేను కూడా తోడుగా ఉంటాను’’ అనే విధంగా మాట్లాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవసరమైతే కొంతకాలం ఆమెతో కలిసి ఆడిషన్లకు వెళ్లడం ద్వారా ఆమె ఒంటరిగా ఉండే పరిస్థితి తగ్గుతుంది. రెండవది.. సినిమా రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న... లేదంటే స్థిరపడిన వ్యక్తులతో ఆమె మాట్లాడేలా చూడండి. ఆ రంగంలో ఉన్న కష్టాలు, వాస్తవ పరిస్థితుల గురించి వాళ్లు చెబితే కొన్నిసార్లు అది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మూడవది.. మీ పిల్లల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్లు ఈ పరిస్థితి వల్ల ఒత్తిడికి గురికాకుండా చూడాలి. అవసరమైతే కొంతకాలం వారిని హాస్టల్లో చేర్పించండి. నాలుగవది.. మీ అత్తమామలతో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ‘‘ఆమె నటనావకాశాల కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె భద్రతే నాకు ముఖ్యం’’అని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఇంతేకాదు.. చట్టపరమైన విషయాల గురించి కూడా మీరు అవగాహన కలిగి ఉండటం మంచిది. ఆ వ్యక్తి నిజంగా మోసం చేస్తున్నాడని అనిపిస్తే సంబంధిత ఆధారాలను సేకరించండి. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని బలవంతంగా మార్చడం సాధ్యం కాదు, ఆమె సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారని గమనించాలి. కాబట్టి మనం చేయగలిగేది ఓపికగా ప్రయత్నించడం, అదే సమయంలో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా ఉండడం మాత్రమే! పరిస్థితి క్లిష్టంగా అనిపిస్తే ఒక మంచి క్లినికల్ సైకాలజిస్టు లేదా సైక్రియాట్రిస్టు దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు మనశ్శాంతి కోల్పోకుండా మీ శ్రేయోభిలాషులతో కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. ఒక్కోసారి జీవితంలో మనం అన్నీ అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఓపిగ్గా ముందుకెళ్లండి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఆన్లైన్ ప్రపంచంలో మీ ప్రవర్తన
ఈ రోజుల్లో ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా కలవకముందే, అతని ఆన్లైన్ ప్రొఫైల్ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాం. మీరు లింక్డ్ఇన్ లో ఏం పోస్ట్ చేస్తున్నారు, వాట్సాప్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈమెయిల్స్ ఎలా రాస్తున్నారు అనేదే మీ 'Digital Personality'.ఈ డిజిటల్ ప్రపంచం ఒక గోడ లేని గది లాంటిది. ఇక్కడ మీరు చేసే ప్రతి చిన్న పని ఒక రికార్డ్గా మిగిలిపోతుంది. ఆన్లైన్లో మీరు ప్రదర్శించే ప్రవర్తన మీ ప్రొఫెషనల్ కెరీర్ ని నిర్మించగలదు లేదా దెబ్బతీయగలదు. ఒక పరిణతి చెందిన వ్యక్తిగా డిజిటల్ స్పేస్లో మీరు పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి.The Internet Never Forgets...చాలామంది సోషల్ మీడియాలో ఆవేశంగా కామెంట్స్ చేస్తుంటారు లేదా అనవసరమైన పోస్టులు పెడుతుంటారు. కానీ గుర్తుంచుకోండి మీరు డిలీట్ చేసినా, ఇంటర్నెట్ లో ఏదో ఒక మూల మీ డేటా ఉంటుంది (Digital Footprint). భవిష్యత్తులో మీరు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు మీ పాత డిజిటల్ ప్రవర్తన మీకు అడ్డంకి కాకూడదు.ప్రస్తుతం 70% కంటే ఎక్కువ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసే ముందు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ని చెక్ చేస్తున్నాయి. మీ పోస్టులు మీ 'బాధ్యత'ను ప్రతిబింబించాలి.Messaging & Emailing Etiquetteఆన్లైన్ లో మనం కేవలం పదాల ద్వారానే కమ్యూనికేట్ చేస్తాం. అక్కడ మన బాడీ లాంగ్వేజ్ కనిపించదు, కాబట్టి పదాల ఎంపిక చాలా ముఖ్యం.ఆఫీస్ గ్రూపుల్లో రాత్రి వేళల్లో వాట్సప్ మెసేజ్ చేయకపోవడం, అనవసరమైన ఫార్వర్డ్స్ పంపకపోవడం కనీస మర్యాద. ప్రతి చిన్న విషయానికి ఫోన్ కాల్ చేయకుండా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా పర్మిషన్ అడగడం ఒక ప్రొఫెషనల్ పద్ధతి.ఈమెయిల్స్ లో సబ్జెక్ట్ లైన్ స్పష్టంగా ఉండాలి. ఎదుటివారి సమయాన్ని గౌరవిస్తూ విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి. 'Capital Letters' లో రాయడం అంటే ఆన్లైన్ భాషలో అరవడంతో సమానం, కాబట్టి దాన్ని నివారించండి.మోటివేషన్ మాయ vs డిజిటల్ రియాలిటీమోటివేషన్ "నీ మనసులో ఉన్నది ధైర్యంగా సోషల్ మీడియాలో చెప్పు, భయపడకు" అని చెప్తుంది."నీ అభిప్రాయం చెప్పేటప్పుడు అది ఎవరిని నొప్పించకుండా, నీ బ్రాండ్ వాల్యూని తగ్గించకుండా ఉందో లేదో చూసుకో" అని సైకాలజీ చెప్తుంది. ఆన్లైన్ లో 'రియాక్ట్' అవ్వడం కంటే 'రెస్పాండ్' అవ్వడం ముఖ్యం. ఇదే సోషల్ ఇంటెలిజెన్స్. డిజిటల్ ప్రెజెన్స్ ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ డిజిటల్ పర్సనాలిటీ ఇలా ఉండాలి.Step 1: Break Digital Noise అపరిచితులతో ఆన్లైన్ వాదనలు (Online arguments), నెగటివ్ కామెంట్స్ చేయడం వంటి అలవాట్లను 'Break' చేయండి. మీ శక్తిని, సమయాన్ని వృథా చేసే డిజిటల్ పనులకు దూరంగా ఉండండి. మీ ప్రొఫైల్ లో ఉన్న నెగటివిటీని క్లీన్ చేయండి.Step 2: Build Value Additionమీరు ఒక విషయాన్ని పోస్ట్ చేస్తున్నారంటే, అది చదివేవారికి ఏదో ఒక రకమైన 'విలువ'ను ఇవ్వాలి. అది ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు. మీరు ఏ రంగంలో నిపుణులో ఆ రంగానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ మీ 'అథారిటీ'ని 'Build' చేయండి.Step 3: Digital Leadershipఆన్లైన్ లో కూడా ఒక నాయకుడిలా ప్రవర్తించండి. ఇతరుల విజయాలను మెచ్చుకోండి, ఎవరైనా తప్పు చేస్తే పబ్లిక్ గా కాకుండా ప్రైవేట్ గా చెప్పండి. మీ డిజిటల్ ప్రెజెన్స్ చూసి నలుగురు స్ఫూర్తి పొందాలి. ఇదే 'Beyond' స్టేజ్.డిజిటల్ ఇమేజ్ ఎలా ఉంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? అది మీకు నచ్చుతుందా?మీ సోషల్ మీడియా ఫీడ్ చూస్తే మీ గురించి ఒక కొత్త వ్యక్తికి ఏమనిపిస్తుంది?ఆన్లైన్ లో మీరు ఇచ్చే కామెంట్స్ మీ సంస్కారాన్ని ప్రతిబింబిస్తున్నాయా?మీ స్క్రీనే మీ అద్దం!బ్రో, ఆన్లైన్ లో మీరు చేసే ప్రతి క్లిక్ మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తోంది. డిజిటల్ మర్యాద అనేది ఒక స్కిల్ మాత్రమే కాదు, అది మీపై మీకు ఉన్న గౌరవం. అక్కడ మీరు ఎంత హుందాగా ఉంటే, నిజ జీవితంలో మీకు అంతటి గుర్తింపు లభిస్తుంది."Be the same person online as you are offline—respectful and authentic."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Professional Mask: ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?) -
పర్యాటక అద్భుతం..'రివర్కేఫ్'గా వంతెన!
మనసు పెట్టాలే గానీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అందుకు నిదర్శనం చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఆ వంతెన. మన సాయుధ బలగాలు ఆ వంతెనకు ప్రాణంపోసి కొత్తరూపం ఇచ్చారు. చెప్పాలంటే..అద్భుతమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చేశారు. అదంతా ఎక్కడ అంటే..సాధారణంగా మంచి కేఫ్కి వెళ్లి ఓ కప్పు కాఫీ లేదా టీ సిప్ చేసి ఎంజాయ్ చేస్తాం. అలా కాకుండా ప్రకృతి మధ్య కొలువుదీరి..కింద జలజల పారే నది నడుమ కాఫీ/టీ తాగుతుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. అలాంటి అనుభూతి కోసం అరుణాచల్ ప్రదేశ్లోని రివర్ కేఫ్కి రావాల్సిందే. న్గ్యామ్జాంగ్ చూ నదిపై కొలువుదీరిన కేఫ్ ఇది. ఎన్నాళ్లుగానో వాడుకలో లేని వంతెనని భారత సైన్యం కేవలం 31 రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వంతెనను కేఫ్గా మార్చి అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. వచ్చే పర్యాటకులు గల గల పారే నదిని తమ పాదాల కింద నుంచి చూస్తూ..చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ..భోజనం చెయ్యొచ్చు. ఆ కేఫ్ని గాజు భవంతిలా తీర్చిదిద్దడం విశేషం. సందర్శకులు వంతెనపైనే లేదా నదీ తీరంలోని కేఫ్ విభాగంలో కూర్చోవడానికి ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కటి విభిన్నమైన అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఆపరేషన్ సద్భావనలో భాగంగా, భారత సైన్యం కేవలం 31 రోజుల్లో ఈ కేఫ్ను నిర్మించింది. ఉపయోగంలో లేని సైనిక నిర్మాణాన్ని ప్రయాణికులు, బాటసారులు స్వాగతించే ప్రదేశంగా మార్చారు. ఈ కేఫ్ స్థానిక మోన్పా మహిళలచే నిర్వహించబడుతోంది. పర్యాటక ప్రదేశంగా మారుతున్న ఈ మారుమూల ప్రాంతానికి కొత్త జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది ఈ రివర్కేఫ్. సందర్శకులకు ఈ కేఫ్ పర్వతాలు, నదులు, మేఘావృత లోయల మధ్య మరుపురాని అనుభూతుల్ని అందిస్తుంది. Under #OpSadbhavna, the Indian Army has established Border Brew Café at Jemithang, a first-of-its-kind initiative in Northeast India.Constructed on a decommissioned Bailey Bridge over Ngyamjang Chu, the cafe will support local communities and strengthen tourism in #Arunachal. pic.twitter.com/GJKCNLdJSb— MyGov Arunachal Pradesh (@MyGovArunachal) March 19, 2026 (చదవండి: రెంట్ ఏ ట్రీ..!) -
రెంట్ ఏ ట్రీ..!
కేరళకు చెందిన ఒక స్టార్టప్ అందరి మనసుల్నీ గెలుచుకుంటోంది. రెంట్ ఏ ట్రీ అనే పేరుతో ఉన్న ఈ సంస్థ.. ఆసక్తిగలవారు ఎవరైనా ఒక మామిడి చెట్టును అద్దెకు తీసుకుని, సాగుతో సంబంధం లేకుండానే ఆ చెట్టుకు కాసే దిగుబడిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కొచ్చికి చెందిన ఉమేష్ దామోదరన్ ఈ వినూత్న బిజినెస్ని ప్రారంభించారు. బెంగళూరులో ఒక ఎడ్టెక్ స్టార్టప్ను నడిపే దామోదరన్ ఒకసారి కొచ్చి–బెంగళూరు మధ్య ప్రయాణిస్తున్నపుడు అల్ఫోన్సో మామిడి పండ్లను చూశారు. కొన్నింటిని తన స్నేహితుల కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా వారికి ఆ పండ్ల రుచి బాగా నచ్చి, మరోసారి కావాలని కోరారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి ఒక పూర్తి చెట్టు పండ్లన్నీ తమకే కావాలని అడిగారు. అపుడే దామోదరన్లో ఈ ‘రెంట్ ఏ ట్రీ’ ఆలోచనకు పునాది పడింది. ఈ కంపెనీ వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చెట్టును, మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి లీజుకు తీసుకోవచ్చు. చెట్టు సంరక్షణ, సాగు బాధ్యతలన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ సంస్థ ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరి, తమిళనాడులోని దిండిగల్, కేరళలోని పాలక్కాడ్ ప్రాంతాల్లో సుమారు 250 ఎకరాల అల్ఫోన్సో మామిడి తోటలను నిర్వహిస్తోంది. ఈ స్టార్టప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘బ్రిలియంట్ ఐడియా’ అని కొంతమంది కొనియాడగా, మరికొంతమంది దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాపు సరిగా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి అనుకోని వర్షాలు పంటను దెబ్బతీస్తాయని.. నష్టం రావొచ్చు అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Karostartup (@karo_startup_) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
పెద్దలకు అర్థం కాకుండా పోతున్న టీనేజర్ల ప్రపంచం
జెన్ ఆల్ఫాకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్ప్లే, యాడ్స్తో పెద్దల కంటెంట్ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచం చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్దలకు తమ పిల్లలపై ఉన్న అవగాహనను తుడిచిపెడుతోంది. వినోదానికీ, వాణిజ్యానికీ తేడా తెలియని జెన్ ఆల్ఫా తరం ఓ విష వలయంలో చిక్కుకుంటోంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్తో కలిసి, అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) అకాడమీ ‘వాట్ ది సిగ్మా?’ అనే ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన తేలి్చంది. ఈ పరిశోధన హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో జరిగింది. వ్లాగ్స్, షార్ట్స్, గేమ్ప్లేలోని స్పాన్సర్డ్ కంటెంట్లో జెన్ ఆల్ఫా తరం చిక్కుకుంటోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి రెండు వేర్వేరు ప్రపంచాలు కావు.. రెండూ ఒక్కటే అనే భావనకు విపరీతంగా గురవుతున్నారు. మరి వీరిపై వాణిజ్యపరమైన ప్రభావం ఏమిటి? 7నుంచి 15 ఏళ్ల వయసు (జనరేషన్ ఆల్ఫాకు చెందిన) పిల్లలు మీడియా, కంటెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? హైపర్–డిజిటల్ వాతావరణంలో వాణిజ్య సందేశాలను ఎలా గుర్తిస్తారు? ఎలా వర్గీకరిస్తారు? ఎలా అర్థం చేసుకుంటారు? వంటి విషయాలను అధ్యయనంలో పరిశీలించారు. పిల్లల అంతర్జాలం.. పెద్దల్లో గందరగోళం.. జెన్ ఆల్ఫా తరం ఇంటర్నెట్తో పాటు వృద్ధి చెందకుండా.. ఇంటర్నెట్లో ఇరుక్కుపోతున్నారు. వారి సాంస్కృతిక సంకేతాలు, సౌందర్య భావనలు, భాషా ప్రపంచం నెమ్మదిగా వేరవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సమకాలీనమైన ఈ తరానికి సంబంధించిన ప్రస్తావనలు అపరిచితంగా ఉంటాయి. హాస్యం అస్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, వారికి ఆట స్థలంలో ఆటలాగా తక్షణమే, అందరితో పంచుకోవాల్సిన అంశాలుగా మారుతున్నాయి. పిల్లల డిజిటల్ ప్రపంచం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కోల్పోతున్న పరిస్థితుల్లో.. వీక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండే ఫీడ్తో బిజినెస్ అల్గారిథం రంగంలోకి దిగింది. ఈ పరిణామం ఎంత వేగంగా జరుగుతోందంటే, పెద్దలను వారి పిల్లల ప్రపంచంలో నిరక్షరాస్యులుగా మార్చేస్తోంది. తాము పూర్తిగా చూడలేని వారి ప్రపంచంలో హానికరమైన కంటెంట్ అంటే ఏమిటో తెలియక, స్క్రీన్ సమయం, డిజిటల్ వినియోగంపై నియమాలను నిర్దేశిస్తూ, అమలుపై స్పష్టత లేని స్థితిలో తల్లిదండ్రులు నిరంతరం నియమాలను సవరించుకుంటున్నారు.వినోదం రూపంలో ప్రమాదం.. చిన్న పిల్లలు (7–12 మధ్య వయసు్కలు) అత్యంత స్పష్టమైన ప్రకటనలను మాత్రమే గుర్తిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్లు, గేమింగ్ అనుసంధానాలు, వ్లాగ్ స్పాన్సర్íÙప్లు వీరికి కేవలం వినోదంగానే అనిపిస్తాయి. పెద్ద పిల్లలు (13–15 మధ్య వయస్కులు) ప్రకటనల అక్షరాస్యతను ఎక్కువగా పెంపొందించుకున్నా.. భావోద్వేగాలతో కూడిన, కథనంతో మిళితమైన బ్రాండ్ సందేశాలకు సులభంగా ప్రభావితమవుతుంటారు. నిరంతరాయంగా ప్రసారమయ్యే మీడియా ప్రవాహంలో మునిగిపోవడంతో వీరిలో విచక్షణా శక్తి తగ్గిపోతోంది.డిజిటల్ సొసైటీ దిశగా.. జెన్ ఆల్ఫాకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనేవి వేర్వేరు ప్రపంచాలు కావు. ఫోన్ అనేది చేతిలోకి తీసుకునే పరికరం కాదు. వారు నివసించే ప్రదేశంగా మారిపోతోంది. క్రమంగా అందులోని కంటెంట్ ప్రభావితం చేసే అంశంగా స్థిరపడుతోంది. ఈ తరం తమకు కావాల్సింది ఎంచుకుని చూడటం మానేసి, స్క్రీన్ మీద వచ్చేదాన్ని అలా చూస్తూ ఉండిపోడానికి అలవాటు పడుతున్నారు. దీంతో ప్రకటనలు, వినోదం, వాణిజ్యం అన్నీ కలిసిపోయి షార్ట్స్, మీమ్స్, వ్లాగ్స్, గేమ్ప్లే, యాడ్స్తో పెద్దల కంటెంట్ ‘పిల్లల కోసం’ రూపొందించిన అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.క్రమబదీ్ధకరణకు ఓ వ్యవస్థ అవసరం.. ఈ నేపథ్యంలో జెన్ ఆల్ఫాకు మార్కెటింగ్ విషయంలో బాధ్యతాయుతమైన విధానాన్ని నిర్ధారించడానికి, ప్లాట్ఫామ్లు, కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనదారులు, తల్లిదండ్రులు, పాఠశాలల సమన్వయంతో ఓ నిరీ్ణత వ్యవస్థ అవసరమని అధ్యయనకర్త అభిప్రాయం. పాఠశాలల్లో మీడియా, ప్రకటనల అక్షరాస్యత వాణిజ్య విద్య ద్వారా వాణిజ్య ఉద్దేశంపై అవగాహన పెంపొందించడం అవసరమని స్పష్టం చేసింది.అధ్యయనకర్తలు ఏమంటారంటే.. ‘ఏఎస్సీఐ అకాడమీ’ వాట్ ది సిగ్మా?’ అధ్యయనం, జనరేషన్ ఆల్ఫా కంటెంట్ జీవితంపై జరిపిన ఒక పరిశోధన. ఇది వారిని విమర్శించడానికి కాదు, వారిని అర్థం చేసుకోవడానికి. వారి సాంస్కృతిక దృక్పథాలు, మునుపటి తరాల వారి దృక్పథాల నుంచి భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వీరే అతి పిన్న వయసు్కలైన మీడియా వినియోగదారులు కాబట్టి, వారు ప్రకటనలను ఎలా తీసుకుంటారు? అనే దానిపై అవగాహన పొందడం.. బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడంలో మొదటి అడుగు.’ అని ఏఎస్సీఐ సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ అంటున్నారు. ‘గత తరానికి డిజిటల్ మీడియా పరిచయం కాగా, ఈ తరానికి అదే ప్రపంచం. వీరికి కంటెంట్తో సంబంధం ఉంది, దీనిని తల్లిదండ్రులు, విశ్లేషకులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నివేదిక వారు ఏమి చూస్తున్నారో మాత్రమే కాకుండా, అల్గారిథమ్, కంటెంట్, ప్రకటనల ద్వారా వారు ఎలా ప్రభావితమవుతున్నారో అన్వేíÙంచింది. ప్రకటనల వాతావరణంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? అనే ప్రయత్నాలకు ఆలంబనగా.. ఇది జెన్ ఆల్ఫా, వాస్తవ పరిస్థితులపై అవగాహన కలి్పంచడానికి ప్రయత్నించింది’ అని ఫ్యూచర్ బ్రాండ్స్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ సంతోష్ దేశాయ్ చెబుతున్నారు. -
ఆఫీసులో మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలి?
చాలామందికి ఒక సందేహం ఉంటుంది—"నేను ఇంట్లో ఉన్నట్టే ఆఫీసులో ఉండాలా? లేక అక్కడ వేరే మనిషిలా నటించాలా?" అని. సైకాలజీ దీనిని 'The Professional Mask' (వృత్తిపరమైన ముసుగు) అంటుంది. ఇది అబద్ధం ఆడటం కాదు, ఇది ఒక రకమైన 'ఎమోషనల్ మేనేజ్మెంట్'. ఆఫీసు అనేది ఒక ప్రొఫెషనల్ వేదిక. అక్కడ మీరు మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను ప్రతిచోటా ప్రదర్శించకూడదు. ఒక 'ప్రొఫెషనల్ మాస్క్' ధరించడం అంటే మీ సహజత్వాన్ని చంపుకోవడం కాదు, మీ బాధ్యతకు తగ్గట్టుగా మీ ప్రవర్తనను మలచుకోవడం. ఇది మీ Career Growth కి ఒక రక్షణ కవచం లాంటిది.పర్సనల్ vs ప్రొఫెషనల్ (The Boundaries)చాలామంది ఆఫీసులో అందరినీ 'ఫ్రెండ్స్' అనుకుని తమ వ్యక్తిగత విషయాలన్నీ షేర్ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి…ఆఫీసులో మీ రోల్: మీరు అక్కడ ఒక పనిని పూర్తి చేయడానికి ఉన్నారు.మీ ఐడెంటిటీ: అక్కడ మీరు ఒక మేనేజర్, ఒక ఇంజనీర్ లేదా ఒక లీడర్.మీ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేరు చేసే ఆ 'లైన్' ఎంత స్పష్టంగా ఉంటే, మీ పర్సనాలిటీకి అంత గౌరవం ఉంటుంది. అతిగా కలిసిపోవడం (Over-familiarity) ఒక్కోసారి మీ అథారిటీని తగ్గిస్తుంది.Emotional Laborమీకు ఇంట్లో గొడవ జరిగి ఉండవచ్చు, లేదా మీకు ఒంట్లో బాలేకపోవచ్చు. కానీ మీరు ఒక క్లయింట్ మీటింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా కనిపించాలి. దీన్నే 'Emotional Labor' అంటారు. మీ మూడ్ ఎలా ఉన్నా, మీ పనిపై అది ప్రభావం చూపకుండా చూసుకోవడమే అసలైన 'ప్రొఫెషనల్ పర్సనాలిటీ'.మోటివేషన్ మాయ vs ప్రొఫెషనల్ రియాలిటీమోటివేషన్ "Be yourself, అందరితో మనసు విప్పి మాట్లాడు" అని చెప్తుంది. ఇది కొన్నిసార్లు రిస్క్. సైకాలజీ "పరిస్థితిని బట్టి నీ ప్రవర్తనను మార్చుకో (High Self-Monitoring). ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో తెలియడమే అసలైన తెలివితేటలు" అని చెప్తుంది.ప్రొఫెషనల్ మాస్క్ ఎలా ధరించాలి?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ ఆఫీస్ పర్సనాలిటీ ఇలా ఉండాలి.Step 1: Break Over-sharingఆఫీసులో మీ పర్సనల్ కష్టాలను, ఇతరుల గాసిప్స్ని చర్చించే అలవాటుని 'Break' చేయండి. మీరు ఎంత తక్కువ వ్యక్తిగత విషయాలు చెబితే, మీ ప్రొఫెషనల్ ఇమేజ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పని మాత్రమే మాట్లాడాలి.Step 2: Build Consistencyమీ మూడ్ ఎలా ఉన్నా, ఆఫీసులో మీ ప్రవర్తన నిలకడగా (Consistent) ఉండాలి. ఒకరోజు చాలా యాక్టివ్గా, మరోరోజు చాలా డల్గా ఉండటం వల్ల మీపై నమ్మకం తగ్గుతుంది. ఒక ప్రొఫెషనల్ 'Standard' ని 'Build' చేయండి.Step 3: Authority & Approachability మీరు ఒక వైపు ప్రొఫెషనల్గా ఉంటూనే, మరోవైపు అందరికీ అందుబాటులో ఉండేలా (Approachable) ఉండాలి. గౌరవం అనేది భయం వల్ల రాకూడదు, మీ క్రమశిక్షణ వల్ల రావాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ ఆఫీస్ పర్సనాలిటీ ఎలా ఉంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ ఆఫీస్ ఫ్రెండ్స్ కి మీ పర్సనల్ లైఫ్ గురించి ఎంత తెలుసు? అది అవసరమా?ఆఫీసులో సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారా?మీరు మీ ప్రొఫెషనల్ రోల్ కి న్యాయం చేస్తున్నారా?మీ ముసుగే మీ బలం!బ్రో, ప్రొఫెషనల్ మాస్క్ అనేది మిమ్మల్ని మీరు దాచుకోవడం కాదు, మిమ్మల్ని మీరు 'ప్రెజెంట్' చేసుకోవడం. ఒక నటుడు స్టేజ్ మీద ఎలాగైతే తన పాత్రను పోషిస్తాడో, ఆఫీసులో మీరు మీ ప్రొఫెషనల్ పాత్రను అద్భుతంగా పోషించాలి. అప్పుడే మీ కెరీర్ లెగసీ నిర్మించబడుతుంది."Professionalism is not about what you do, but how you do it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్..!
కేకు కావచ్చు.. పూతరేకు కావచ్చు.. కాదేదీ కళకు అనర్హం అంటున్నారు ఆధునిక చెఫ్స్. తినిపించడానికి ముందు కనిపించే విధానంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. నోరూరించే రుచులను చూడగానే ఆకట్టుకునే కళా నైపుణ్యాన్ని అద్దుతున్నారు. అదే విధంగా తాను సృష్టించిన పేస్ట్రీలకు అచ్చమైన పండ్ల రూపాలను అందిస్తూ అంతర్జాతీయంగా వైరల్ అయ్యాడు పారిస్కు చెందిన ఓ ప్రముఖ చెఫ్. ఇప్పుడు ఆయన సృష్టించిన పండ్ల తరహా డిజర్ట్స్ భాగ్య నగరానికి కూడా వచ్చేయడం విశేషం. సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. దుబాయ్లోని కునాఫా చాక్లెట్ నుంచి టోక్యోలోని మెత్తటి పాన్కేక్స్ వరకు ఖండాలను దాటి తరలివస్తున్న ఆహార ధోరణులను మనం నగరంలోనూ చూడగలుగుతున్నాం. ఇదే క్రమంలో సిటీకి వచ్చేసింది పారిస్ డిజర్ట్. పండ్ల ఆకారాన్ని పోలిన ఇవి చూసేందుకు కూడా పండ్లలా కనిపిస్తాయి. పేస్ట్రీ కళలోని నైపుణ్యాన్ని మనసుకు హత్తుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఫ్యాషన్ క్యాపిటల్ నుంచి.. పారిస్ అనగానే ఫ్యాషన్ ప్రియుల కలల చిరునామా అని తెలిసిందే. మన డిజైనర్లకు అక్కడ ప్రదర్శనలో పాల్గొనడం అంటే జీవితకాలపు కల సాకారం కావడమే. అలాంటి వస్త్రశైలి గురించి మాత్రమే చర్చలు చేసే సిటీ.. తొలిసారి అక్కడి డిజర్ట్స్ గురించి కూడా మాట్లాడుతోంది. దీనికి కారణం అక్కడి ప్రసిద్ధ పేస్ట్రీ మేకింగ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ సృష్టించిన పండ్ల ఆకారపు స్వీట్లు.ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.డిజర్ట్ ట్రెండ్.. నిమ్మకాయలు, ఆపిల్, స్ట్రాబెర్రీ, పీచెస్.. ఇలా అనేక రకాల పండ్ల రూపాలకు ప్రతి సృష్టి చేస్తున్నారు. అచ్చం ఆయా ఫలాలను పోలిన రూపంలో సృష్టించిన డిజర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ప్రత్యేకంగా మారడానికి కారణం నిజమైన పండ్లలా అనిపించే వాటి రూపం మాత్రమే కాదు, రుచి కూడా. ఈ డిజర్ట్స్లో మూస్, కంపోట్, స్పాంజ్, చాక్లెట్ పొరలు రుచికరమైన ఆకృతులను సమతుల్యం చేశాయి. తద్వారా ఆధునిక పేస్ట్రీ వైవిధ్యానికి అంతర్జాతీయ చిహ్నంగా ఇవి మారాయి.నగరానికి వచ్చేశాయ్.. అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకున్న ఈ పండ్ల ఆకారపు డిజర్ట్స్ ఇప్పుడు నగరంలోనూ సందడి చేస్తున్నాయి. బహుళ పొరలను ప్రదర్శించే ఈ స్వీట్ శిల్పాలను తెలంగాణ రాష్ట్రం బంజారాహిల్స్లోని నోమ్ కేఫ్ వంటి పేరున్న కేఫ్స్ అందిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా పర్షియన్ చెఫ్లను సైతం తీసుకొస్తున్నారు. ఈ ఫ్రూట్ డిజర్ట్స్ మెనూలో రాస్బెర్రీ, ఆర్కిటిక్ బ్లిస్ బెర్రీ, హాజెల్నట్, గ్రీన్ ఆపిల్, కొబ్బరి, బొప్పాయి, క్రౌన్ పియర్ వంటి రుచులు నగరంలో కొలువుదీరాయి. View this post on Instagram A post shared by Arts Terra (@arts_terra)(చదవండి: అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాయ్..! కానీ 17 కిలోమీటర్లు..) -
ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..
కొన్ని వెయిట్లాస్ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్ప్రదేశ్కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.అరుణాచల్ప్రదేశ్కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్ సోకి యెకర్ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్ అనేశారు. పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్ప్రదేశ్ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్. ఫిట్నెస్ జర్నీ మొదలైందిలా..తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్లాస్ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్గా మారానని సంతోషంగా చెబుతోందామె. సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్డ్గా కనిపిస్తున్నావ్.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్ అనుహ్యమైన టర్న్ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్ సోకి యెకర్. View this post on Instagram A post shared by Leyu Abom Soki Yekar (@abomsokiyekar) (చదవండి: దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్) -
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
భారత్లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కు పోస్టర్ బాయ్గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) జంక్ ఫుడ్ డేట్స్కు అతీతంగాచాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు. అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్. సోమన్ ఫిట్నెస్..తరచుగా ఫిట్నెస్ ఐకాన్గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్మోడల్గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు. సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) (చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!) -
పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!
మొదట్లో ఒకప్పుడు కొందరు మహిళలకు దేవుళ్లు పూనడం లేదా శివమూగడం అంటూ జరుగుతుంటేది. ఒక ఆసక్తికరమైన అబ్జర్వేషన్ ఏమిటంటే... ఇది చాలావరకు ఆర్థికంగా దిగువ మధ్యతరగతి వారిలోనూ, పేద వర్గాల్లోనే కనిపిస్తుండటం చాలా సాధారణం. నిజానికి ఇదొక రకమైన మానసిక రుగ్మత. ఇలాంటి మానసిక రుగ్మతల్లో పేషెంట్... ‘నేను’ లేదా ‘తాను’ అనే భావన నుంచి విడిపోయి... మరేదో స్థితిని సంగ్రహిస్తాడు.అంటే మరో స్థితిని ΄పొందుతాడు కాబట్టి ఇంగ్లిష్లో దాన్ని పొజెసివ్ స్టేట్ అంటారు. అప్పట్లో అంటే... శాస్త్రీయ అవగాహన అంతగా లేని రోజుల్లో ఇలా జరగడాన్ని... అంటే తాను అన్న భావన నుంచి దూరం జరిగే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. నిజానికి హిస్టెరస్ అంటే గర్భసంచి (యుటెరస్) అని అర్థం. యుటెరస్ శరీరంలోని ఇతర భాగాలకు తిరుగాడుతూ... పాకడం వల్ల వచ్చే వ్యాధిగా పరిగణించి అప్పట్లో దీన్ని ‘హిస్టీరియా’ అంటూ వ్యవహరించేవారు. మహిళల్లో ఈ తరహా జబ్బులు ఎక్కువ కాబట్టి హిస్టీరియా అనేవారు. అయితే వైద్య విజ్ఞానశాస్త్రం బాగా అభివృద్ధి చెంది కారణం తెలిసిన తర్వాత ఆ హిస్టీరియా అనే మాటను వాడకంలోంచి తొలగించారు. అయితే మానసిక విజ్ఞానశాస్త్రం బాగా పెరగడంతో పాటు తన స్థితి నుంచి తాను విడిపోయే పరిస్థితికి (డిసోసియేషన్కు) శాస్త్రీయమైన కారణాలు తెలిశాక... ఈ తరహా మానసిక రుగ్మతలను డిసోసియేషన్ / కన్వర్షన్ డిజార్డర్స్గా చెబుతున్నారు. వీటిల్లో అనేక రకాలుంటాయి. అవేమిటో చూద్దాం...ఓ ఊళ్లోని ఓ పేదింటి అందమైన అమ్మాయిని అక్కడి ఓ రాజకీయ నాయకుడూ... ఊరికి పెద్ద అయిన ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. అతడేమో ఆర్థికంగా, సామాజికంగా చాలా పవర్ఫుల్. కానీ ఈ అమ్మాయి ఓ అమాయకపు దిగువ ఆర్థికస్థాయికి చెందిన పేద పిల్ల. ఆ పవర్ఫుల్ వ్యక్తిని ఎదిరించగలిగే బలంగాని, మానసిక స్థైర్యంగాని ఆ అమ్మాయికి లేవు. అయితే ఆ పవర్ఫుల్ వ్యక్తి వేధింపులను ఆమోదించి, అతడికి లొంగిపోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మెదడు ఓ మాయ చేస్తుంది. తనను తాను రక్షించుకునేందుకు ఆ అమ్మాయికి తెలియకుండానే ఓ ఎత్తుగడ వేస్తుంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయికి గ్రామదేవత పూనుతుంది. దాంతో ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. మెదడు చేసే ఈ పనులు ‘సబ్–కాన్షియస్’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియదు. అయితే ఆ అమ్మాయి... తన చుట్టూ ఉన్న ప్రకృతి సంబంధమైన అంశాలను (నేచర్ను) అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ‘పొజెస్’ చేసుకుంటుంది. అలా తననుంచి తాను ‘విడిపోయి’ అంటే ‘డిసోసియేట్’ అయి... గ్రామదేవత తాలూకు స్థితిని ‘పొజెస్’ చేసుకుని... అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల నుంచి వచ్చే వేధింపుల నుంచి తనను తాను కాపాడుకోడానికి తనకు తెలియకుండానే ఈ పనులు చేస్తుంది. ఇప్పుడు గ్రామదేవత పూనాక ఆ అమ్మాయి స్థితి చాలా బలంగా మారిపోతుంది. ఊరిపెద్ద ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా... సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడా అమ్మాయిని తాత్కాలికంగా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ స్థితిలో ఆ అమ్మాయి అక్కడివారి పూజలందుకుంటూ ఉంది. ఆమెకు కావాల్సిన పనులను ఊరి ప్రజలద్వారా చేయించుకుంటూ ఉంది. ఆమె నుంచి వచ్చే మాటను గ్రామదేవత మాటలుగా ఎంచి, ఊరిజనమంతా వాటిని పాటిస్తుంటారు.నిజానికి ఆమె కోరని మరికొన్ని కోరికలనూ గ్రామస్తులు తీరుస్తుంటారు. దాంతో ఆమె మెదడుకు ఇదొక అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్ చేసుకుంటుంది. అంటే గ్రామదేవత తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది. పూనకం (పొసెషన్)లోకి వెళ్తుంది. ఇలా కేవలం గ్రామదేవతలే కాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన వేరే మనిషి గానీ, దెయ్యాలూ, భూతాలు కూడా పూనడం అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. సామాన్య జనం దీన్ని పూనడం అంటారుగానీ మానసిక వైద్య శాస్త్రంలో దీన్ని డిసోసియేషన్ డిజార్డర్ అని చెప్పవచ్చు.డిసోసియేషన్ అంటే...? డిసోసియేషన్ (dissociation) అంటే ఏమిటో తెలుసుకునే ముందు అసలు ‘నేను’ అంటే ఏమిటో, ఆ ‘నేను’ అనే భావన ఎలా కలుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలూ, భావోద్వేగాలూ... ఇవన్నీ తనవిగా గుర్తించడాన్ని ఇంగ్లిష్లో ‘ఐ’ అండ్ ‘మైన్’ అనీ, అదే తెలుగులో చె΄్పాలంటే ‘నేను’ / ‘నా ఆలోచనలు’’ అని చెప్పవచ్చు. అందరిలో ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్ కొంతమందిలో ఒక్కోసారి కొంత వ్యవధి పాటు తొలగిపోతుంది. ఆ సమయంలో ఆ నేను... నేను కానేమో అనే భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్’ అంటారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... బాగా తీవ్రంగా, తాను తట్టుకోలేనంతగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గానీ లేదా తన ప్రాణాలకే ముప్పు ఏర్పడినప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడిపోతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్ను తనవి కావన్నంతగా విడివడే కండిషన్ను ‘డిసోసియేషన్ ఆఫ్ అఫెక్ట్స్’ అనవచ్చు. తన భావోద్వేగాల తీవ్రత కారణంగా అతడి మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా ఓ వ్యక్తి తననుంచి తాను విడిపోవడం జరుగుతుంది.డీసోసియేషన్ కలిగే పరిస్థితులివి... తట్టుకోలేనంత ఒత్తిడి తీవ్రమైన అలసట చాలా తీవ్రమైన డిప్రెషన్ పసితనంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో ఉండటం... వంటి పైన పేర్కొన్న పరిస్థితుల్లో ఓ వ్యక్తికి తనదైన దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. ఇంగ్లిష్లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్ ‘సెల్ఫ్ ఫీలింగ్’ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తేలిగ్గా డిసోసియేషన్కు లోనవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్) కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు ‘అపరిచితుడు’ సినిమాలోని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఓ వ్యక్తి తననుంచి విడివడి వేరే వ్యక్తిని లేదా వేరే వ్యక్తుల ప్రవర్తనలనూ, పర్సనాలిటీలను ΄పొజెస్ చేసుకోవడమే అని చెప్పవచ్చు.‘నేను’ లేదా ‘నా’ అనే భావన లేకపోవడం ఎలా జరుగుతుందంటే... ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి చూపు, వినికిడి, స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ ఉపయోగపడుతుంటాయి. తాను ఉన్న తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అది లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు. దీనికి సంబంధించి మరింత అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మన దేహంలోని ఒక భాగానికి మత్తు (లోకల్ అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అలా ఇచ్చాక అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తున్నప్పటికీ... అక్కడేం జరుగుతోందో మనక తెలియదు. ఒకవేళ అలా శస్త్రచికిత్స చేస్తున్న విషయం గనక మనం మన కళ్లతో చూడకపోతే అది మన శరీరానికి సంబంధించిందన్న భావన కూడా మనకు కలగక΄ోవచ్చు. ఉదాహరణకు మన పంటికి ఏదైనా చికిత్స చేయించుకుంటున్నప్పుడు అక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చాక పన్నుకు డ్రిల్లింగ్ జరుగుతున్నప్పటికీ మనకు అక్కడ ఏమవుతోందో అన్నది తెలియనే తెలియదు.మరికొన్ని ఉదాహరణలివి... కొందరు పీర్ల గుండం దగ్గరా లేదా తమ మొక్కుబడులలో భాగంగా నిప్పులు తొక్కుతూ చేసే మరికొన్ని ప్రత్యేక ప్రార్థనల్లో నిప్పుల మీద బాధే తెలియకుండా నడుస్తుంటారు. తీవ్రమైన భక్తి ఆవేశాలకూ, భక్తిభావనలకు లోనైనప్పుడు ఆ తన్మయత్వం తారస్థాయిలో ఉన్నప్పుడు బాధ అనే భావనే రాదు. ఈ తరహా డిసోసియేషన్ను ‘సెన్సరీ డిసోసియేషన్’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శజ్ఞానానికి సంబంధించిన డిసోసియేషన్గా చెప్పవచ్చు. ఏదైనా తట్టుకోలేనంత తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు అది మన మెదడుపై ఒక షాక్లాంటి ప్రభావం చూపవచ్చు. అంతటి ప్రభావం కారణంగా మెదడు మొద్దుబారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే కొందరికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి తీవ్రమైన గాయాలు అయినప్పటికీ ఆ షాక్ కారణంగా చాలాసేపటి వరకు వానికి నొప్పి కలగకపోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్ కారణంగా జరిగే పరిణామమే. ఏదైనా ఒక సబ్జెక్ట్లో అత్యంత ఆసక్తితో అందులో మునిగిపోయినప్పుడు ఓ విద్యార్థిలోగానీ లేదా ఏదైనా అత్యంత ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నప్పుడూ ఎవరైనా వ్యక్తిగానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియనంతగా అందులో పూర్తిగా లీనమైపోయినపోవచ్చు. అది కూడా డిసోసియేషన్కు ఓ తార్కాణమే. మనసు నిండా తీవ్రమైన భక్తిభావనను నిండిపోయినప్పుడు తనలోకి దైవం వచ్చినట్లుగా కొందరు అనుభూతి చెందవచ్చు. ఇలాంటి భావనలకు లోనుకోవడం కూడా ఒక రకంగా ‘డిసోసియేషన్’యే అని చెప్పవచ్చు. ఈ స్థితినే ‘పొసెషన్’ అంటారు. కాకపోతే ఇది పూర్తిగా సంస్కృతి ఆమోదించిన అంశం కావడంతో... అంతటి భక్తి భావన అన్నది ఆ వ్యక్తికి గానీ, లేదా ఇతరులకు గానీ ఇబ్బంది కలగజేయనంతవరకు దాన్ని వ్యాధిగా పెద్దగా పరిగణించరు. డిసోసియేషన్ ఆమ్నీషియా : ఏదైనా షాకింగ్ సంఘటనతో లేదా బలమైన కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగినా లేదా అలాంటి గాయాల్ని కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం జరుగుతుంది. ఇలా తమకు తీవ్రంగా ఇబ్బంది కలిగించే వాటిని మరచిపోవడాన్ని ‘డిసోసియేషన్ ఆమ్నీషియా’ అంటారు. ఈ కండిషన్లో కలిగే మరచిపోవడం అన్నది సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. డిసోసియేటివ్ ఫ్యూగ్ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పని ప్రదేశం నుంచి అకస్మాత్తుగా ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అతడు ఈ ప్రయాణంలో తన సెల్ఫ్కేర్ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి) అంశాల విషయంలో మామూలుగా ఉన్నా... తాను తిరిగి వెనకకు వచ్చాక తాను ఎక్కడెక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ పాక్షికంగానో లేదా మొత్తంగానో మరచిపోవచ్చు. ఇలాంటి డిసోసియేషన్లో కనిపించే లక్షణాలకు ఎలాంటి నరాల వ్యాధులూ కారణంగా కనిపించవు. ట్రాన్స్ అండ్ పొసెషన్ స్టేట్ మధ్య తేడా... ట్రాన్స్ : తాను అనే తన సొంత భావనను అంటే తానెవరు అనే ఫీలింగ్ను... ఇంగ్లిష్లో చెప్పాలంటే తన ఐడెంటిటీని కోల్పోయే లేదా పూర్తిగా మరచిపోయే స్థితిని ‘ట్రాన్స్’ అంటారు. తన చుట్టూ జరుగుతున్న వాటిని ఏమాత్రం గుర్తించలేకపోవడమో లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించగలిగడం లాంటి స్థితిని ‘ట్రాన్స్’గా చెప్పవచ్చు. ఆ స్థితిలో తన భాష, కదలికలు, శారీరకంగా తాను కనబరిచే సాధారణ పోష్చర్స్... ఇవన్నీ చాలావరకు తగ్గిపోతాయి. ఈ స్థితిలో పొడిపొడిగా కేవలం రెండు మూడు మాటలు మాట్లాడుతుంటారు. పొసెషన్ కండిషన్: ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరినట్లుగా ప్రవర్తించే కండిషన్ను ‘పొసెషన్’ అంటారనీ, దానికి అపరిచితుడు సినిమా లాంటి ఉదాహరణలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం ఏ గ్రామదేవత మాత్రమే కాకుండా... ఒక వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా ఉండటం... అలాగే మరికొందరిలో దెయ్యం / భూతం / ఏదో శక్తి ఆవహించినట్లుగా భావించడం కూడా పొసెషన్ స్టేట్గానే చెప్పవచ్చు. ఈ పరిస్థితి కారణంగా తనకు గానీ... అతడి వల్ల ఇతరకులకు గానీ ఇబ్బందిగా లేనంతవరకు దాన్ని వ్యాధిగా పరిగణించరు. ఒకవేళ అలాంటి పొజెషన్ స్టేట్ వల్ల అది ప్రమాదకరంగా పరిణమించినప్పుడే దాన్ని వ్యాధిగా గుర్తిస్తారు. ఒక ప్రాంతంలో సెషన్ సంస్కృతిలో ఇమిడిపోయి ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రం ఆ ప్రవర్తనను వ్యాధిగా గుర్తించడం అంతగా జరగదు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం దాన్ని వ్యాధిగా భావించి తగిన చికిత్స అందించాలి. డిసోసియేషన్తో కలిగే సమస్యలు డిసోసియేటివ్ కన్వల్షన్స్ : శరీరంలో ఫిట్స్ వచ్చిప్పుడు దేహంలో ఎలాంటి కదలికలు సంభవిస్తాయో డిసోసియేటివ్ కన్వల్షన్లో అలాంటి కదలికలు కనిపిస్తాయి. ఈ కండిషన్లో ఉన్నవారు కిందపడిపోయినప్పటికీ సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండకపోవచ్చు లేదా చాలా అరుదుగా మాత్రమే ఇలా జరగవచ్చు. డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్స్ : తనలో ఎలాంటి శారీరక సమస్యా లేకపోయినప్పటికీ... నరాలకు సంబంధించిన ఎలాంటి లోపాలూ లేకపోయినప్పటికీ... వీళ్లలో మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం, అడుగులు సరిగా పడకపోవడం, నడవలేకపోవడం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ‘డిసోసియేటివ్ మోటార్ డిజార్డర్’ (dissociative motor disorder) కావచ్చు. డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్: ఏ కారణమూ లేకుండా... ఒక వ్యక్తి శరీరంలోని ఒక భాగంగానీ లేదా మొత్తం శరీరంలోగానీ ఎలాంటి స్పర్శా లేకపోడంతో పాటు వారిని తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్పోజ్ చేసినా వారికి ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగకపోవడాన్ని డిసోసియేటివ్ అనస్థీషియా / సెన్సరీ లాస్గా పేర్కొనవచ్చు. అయితే ఇలా కొందరిలో వారు తమ చూపు, వాసన చూసే శక్తి, వినికిడి శక్తిని కూడా కోల్పోవడం జరగవచ్చు. చదవండి: పసిపాపతో ఆటో నడుపుతున్న మహిళ..!యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్ వాష్’ ప్రక్రియను కూడా ఒక రకమైన డిసోసియేషన్గా చెప్పవచ్చు. కొందరికి... వారు తమ శరీరం నుంచి విడిపోయి, తమ శరీరాన్ని బయటి నుంచి చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్డెత్’ అనుభవాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్ వల్ల కలిగే అనుభూతులే అని చెప్పవచ్చు. కన్వర్షన్ డిజార్డర్స్ :తీవ్రమైన మానసిక సంఘర్షన కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. ఇలా మానసిక అంశాలను శారీరక లక్షణాలుగా మార్చుకుని బయటపెట్టడాన్ని ‘కన్వర్షన్ డిజార్డర్’ (conversion disorder) అంటారు.చికిత్సఏ కారణాల వల్ల డిసోసియేషన్ లేదా కన్వర్షన్స్ జరుగుతోందో గుర్తించి ఆ కారణాలను దూరం చేసి ఈ లక్షణాలు తమంతట తామే తగ్గిపోతాయి. అలాగే ఈ తరహా పేషెంట్స్లో వారు కోల్పోయిన లేదా ఛిద్రమైన వాళ్ల ‘సెల్ఫ్’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు సమర్థమైన చికిత్స అందించవచ్చు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్ను బలపరచడం / పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కరించవచ్చు. ఇందులో భాగంగా తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలిగేలా వాళ్లలో కొన్ని నైపుణ్యాలనూ (స్కిల్స్), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను పెంచడం కూడా ఈ జబ్బులకు చికిత్సలో ఓ ప్రధానమైన భాగం. అవసరాన్ని బట్టి కొన్ని మందులు ఇవ్వాల్సి రావచ్చు. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వంటివీ అందించాల్సి రావచ్చు.- డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై హెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ -
విమర్శలను మెట్లుగా ఎలా మార్చుకోవాలి?
మనం ఎదుగుతున్న కొద్దీ, మన చుట్టూ ఉండేవారు మనల్ని గమనించడం మొదలుపెడతారు. మీరు ఒక లీడర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నప్పుడు మీకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు—విమర్శ. చాలామంది విమర్శ రాగానే కుంగిపోతారు లేదా ఎదురుదాడి చేస్తారు. కానీ ఒక 'జీనియస్' వ్యక్తిత్వానికి విమర్శ అనేది ఒక 'చెత్త' కాదు, అది ఒక 'ఎరువు' (Fertilizer). ప్రపంచంలో ఏమీ చేయని వాడిని ఎవరూ విమర్శించరు. మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారంటే, మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని అర్థం. విమర్శ అనేది మీ పని తీరుపై లేదా మీ ప్రవర్తనపై ఇతరులు ఇచ్చే ఒక 'ఫీడ్బ్యాక్'. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే మీ Professional Maturity ని నిర్ణయిస్తుంది.ఏది తీసుకోవాలి? ఏది వదలాలి?విమర్శలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు.నిర్మాణాత్మక విమర్శ (Constructive Criticism): ఇది మీ పనిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. ఇందులో లాజిక్ ఉంటుంది, మీ తప్పు ఎక్కడ ఉందో స్పష్టంగా చెప్తుంది. ఇది మీకు ఒక 'గురువు' లాంటిది.విధ్వంసకర విమర్శ (Destructive Criticism): ఇది కేవలం మిమ్మల్ని మానసికగా దెబ్బతీయడానికి, మీ పరువు తీయడానికి చేసేది. ఇందులో అసూయ, ద్వేషం ఉంటాయి. దీన్ని మీరు ఒక 'నాయిస్' (Noise) లాగా వదిలేయాలి.ది సైకాలజీ ఆఫ్ రియాక్షన్...ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మన మెదడులోని Amygdala వెంటనే "ప్రమాదం!" అని సిగ్నల్ ఇస్తుంది. అందుకే మనకు వెంటనే కోపం లేదా బాధ కలుగుతుంది.Stoic Approach: విమర్శ రాగానే స్పందించకండి. "ఈ మాటలో నిజం ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజం ఉంటే సరిదిద్దుకోండి, అబద్ధం అయితే నవ్వి ఊరుకోండి. ఎదుటివారి మాటలకు మీ ప్రశాంతతను తాకట్టు పెట్టకండి.మోటివేషన్ మాయ vs రియల్ గ్రోత్మోటివేషన్ "నిన్ను విమర్శించే వాళ్ళ నోళ్ళు మూయించు, నువ్వు ఎవరో నిరూపించుకో" అని ఆవేశాన్ని నూరిపోస్తుంది. ఇది మీలో అహంకారాన్ని (Ego) పెంచుతుంది.సైకాలజీ "విమర్శను ఒక డేటా పాయింట్లా చూడు. నీ పర్సనాలిటీలో నీకు తెలియని 'Blind Spots' ని విమర్శకులు చూపిస్తారు" అని చెప్తుంది. విమర్శకుడు మీ ఉచిత సలహాదారు అని భావించండి.విమర్శను మెట్టుగా మార్చే ఫార్ములాGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, విమర్శను డీల్ చేసే విధానం.Step 1: Break Emotional Defense విమర్శ వినగానే "నన్నే అంటావా?" అనే ఆ అహాన్ని 'Break' చేయండి. వెంటనే సమాధానం ఇవ్వాలనే ఆత్రుతను ఆపండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండటం వల్ల మీరు ఆ విమర్శను లాజికల్గా విశ్లేషించగలరు.Step 2: Build Filtering Process వచ్చిన విమర్శ నుండి 'విషయాన్ని' (Content) తీసుకోండి, 'విషాన్ని' (Tone) వదిలేయండి. మీ పనిని మెరుగుపరిచే పాయింట్ ఏమైనా ఉందా? అని వెతకండి. ఉంటే, దాన్ని మీ పనిలో ఇంప్లిమెంట్ చేసి మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. Step 3: Graceful Acceptanceమిమ్మల్ని విమర్శించిన వ్యక్తికి "థాంక్యూ, నీ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను" అని చెప్పండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ కరిష్మాను వంద రెట్లు పెంచుతుంది. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించే స్థాయికి వెళ్లడమే 'Beyond' స్టేజ్.విమర్శను ఎలా చూస్తున్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు?ఆ విమర్శలో కనీసం 1% అయినా నిజం ఉందా?ఆ విమర్శ మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చిందా లేక కోపిష్టిగా మార్చిందా?విమర్శకులు మీ ఎదుగుదలకి కావాలి!బ్రో, ఒక శిల్పం అందంగా మారాలంటే దానికి ఉలి దెబ్బలు తగలాలి. విమర్శలు ఆ ఉలి దెబ్బల వంటివి. మీరు ఎంత గొప్పగా విమర్శలను స్వీకరిస్తారో, అంత అందమైన వ్యక్తిత్వంగా మీరు రూపొందుతారు. విమర్శకులని శత్రువులుగా చూడకండి, వారిని మీ క్వాలిటీ చెకర్స్ లాగా చూడండి."To avoid criticism, do nothing, say nothing, and be nothing.-Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: నాయకుడిలా ఆలోచించడం ఎలా..?) -
వ్యర్థాలకూ వైద్యం
డెంటిస్ట్గా క్షణం తీరికలేనంత బిజీగా ఉండే డాక్టర్ శాంతి తుమ్మల, బెంగళూరు నగరంలోని చెత్త కుప్పలను చూసి బాధపడేవారు. అధికారులకు ఫిర్యాదు చేసి ఊరుకోవడం కాకుండా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. బస్సు, ట్రైన్, బస్స్టేషన్, చౌరస్తా... ఇదీ అదీ అని తేడా లేకుండా తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘ఎందుకు డాక్టరమ్మా ఇది నీకు’ అన్నారు చాలామంది. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి తన వృత్తిని వదులుకొని పూర్తిస్థాయి ప్రచార కార్యకర్తగా మారారు. లక్షలాది మందిలో మార్పు తీసుకువచ్చారు...బెంగళూరు హెచ్ఎస్ఆర్ లే అవుట్లో నివసిస్తున్న శాంతి తన ఇంటిసమీపంలో ట్రక్కుల నిండా చెత్తను చూసేవారు. ఆ చెత్తగుట్టలు ఆమెను తీవ్రంగా కలవర పరిచేవి. సమస్య పరిష్కారానికి తానే నడుం బిగించాలని నిర్ణయం తీసుకున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, ΄÷డి చెత్త, ప్రమాదకరమైన వ్యర్థాలను ఎలా వేరు చేయాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.అయితే... చాలామంది డాక్టర్ శాంతి మాటలకు అసహనంగా ముఖం పెట్టేవాళ్లు. కొందరికి ఆమె చెప్పింది వినడం టైమ్ వేస్ట్గా అనిపించేది. ‘పబ్లిసిటీ కోసమే ఈ ప్రచారం చేస్తుంది’ అని కొందరు చెవులు కొరుక్కున్నారు. ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె కష్టం వృథా పోలేదు. హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరమ్ ద్వారా లక్షమందికి పైగా వ్యర్థాల విభజనలో సహాయపడ్డారు. ఆమె తన ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి ‘కంపోస్ట్ లెర్నింగ్ సెంటర్’ కూడా ్రపారంభించారు.మై వేస్ట్ మై మేనేజ్మెంట్కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆచరణాత్మక ప్రచారం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు డాక్టర్ శాంతి. తన ఇంట్లోకి ΄్లాస్టిక్ను అనుమతించరు. గుడ్డ సంచులను ఉపయోగిస్తారు. పాత చీరెలు ధరిస్తారు. నిల్వ చేయడానికి స్టీల్ డబ్బాలనే వాడతారు.‘మై వేస్ట్ మై మేనేజ్మెంట్’ అనేది శాంతి నినాదం.ప్రజలు వ్యర్థాలను వేరు చేయడం ప్రారంభించినప్పటికీ, సేకరణ సమయంలో కాంట్రాక్టర్లు వాటన్నింటినీ మళ్లీ కలిపేస్తున్నారని ఆమె గమనించి, అలా జరగకుండా ఉండడానికి అధికారుల సహకారం తీసుకున్నారు.వృత్తిని త్యాగం చేసి...వృత్తిని, సామాజిక కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం డా. శాంతికి కష్టంగా మారింది. క్లినిక్లో రాత్రంతా పనిచేయడం వల్ల ఆమె అలసిపోయేవారు. ఇలా అయితే కుదరదనుకొని వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఉద్యోగం వదులుకోవాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.తన పట్టుదలతో పరిసర ప్రాంతాలను మాత్రమే కాకుండా, ఎంతోమంది బెంగళూరు వాసుల ఆలోచనా విధానాన్ని మార్చారు.ఉమ్మడి బాధ్యతతన ప్రచారానికి బస్సులను కూడా వేదికగా ఉపయోగించుకుంటారు డా.శాంతి. ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో బస్సులో నిలబడి ‘దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దు’ అని ప్రయాణికులకు విన్నపం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ‘నగరాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి ఉమ్మడి బాధ్యత’ అని ఒకటికి రెండు సార్లు చెబుతుంటారు. వ్యర్థాల విభజన అనేది సక్రమంగా జరగడం ప్రారంభమైన తరువాత ఆమె కంపోస్టింగ్పై దృష్టి సారించారు. -
ఆనందాల దేశం... ఫిన్లాండ్కు ఫ్రీగా వెళ్లే ఛాన్స్!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా 2026లో కూడా ఫిన్లాండ్ నిలిచింది. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా అగ్రస్థానంలో కొనసాగింది. ఈ జాబితాలో ఐస్ల్యాండ్ 2వ స్థానం, డెన్మార్క్ 3వ స్థానం, కోస్టారికా 4వ స్థానం, స్వీడన్ 5వ స్థానంలో నిలిచాయి. ఈ నేపథ్యంలో ‘చిల్ లైక్ ఏ ఫిన్ ఛాలెంజ్’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.వరుసగా తొమ్మిది సంవత్సరాలుగా ఫిన్ల్యాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలవడానికి కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే...→ ఈ దేశంలో అనుబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.→ బలమైన సామాజిక భద్రత ఉంటుంది’. తరతరాలుగా ప్రకృతితో గాఢమైన అనుబంధం ఉంది. → విలాసాల కంటే పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తారు.→ సంపద విషయంలో ‘ఇంకా కావాలి’ అనే అత్యాశ కాకుండా ‘ఇది చాలు’ అనుకునే సంతృప్తి ఈ దేశ ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది.→ అవినీతి కేసులు తక్కువ కావడంతో సామాజిక ఆందోళనకు తావు ఉండదు. → ప్రభుత్వ అధికారులపై అధిక విశ్వాసం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ. → ఆడంబరమైన జీవితం కంటే చిన్న, చిన్న రోజువారీ ఆనందాలలోనే సంతోషాన్ని వెదుక్కుంటారు.చిల్ లైక్ ఏ ఫిన్ ఛాలెంజ్మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు, శాంటా క్లాజ్ గ్రామం, ఉత్తర ధృవపు కాంతిని వీక్షించగలిగే సుందర సరస్సులు యాత్రికులకు అనేకరకాల అనుభవాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్ అధికారిక పర్యాటక వేదిక అయిన ‘విజిట్ ఫిన్లాండ్’ ప్రత్యేకమైన ఏడు రోజుల ‘చిల్ లైక్ ఏ ఫిన్ ఛాలెంజ్’ ద్వారా అక్కడి జీననశైలిని ప్రత్యక్షంగా చూడడానికి ప్రజలను ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన కొందరు అంతర్జాతీయ పర్యాటకులను ఫిన్నిష్ లేక్ల్యాండ్లో ఒక వారం గడపడానికి ఆహ్వానిస్తారు. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. మెరిసే సరస్సులు, పచ్చదనాల దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి.వేసవి స్వర్గంతమ ప్రచారంలో భాగంగా ఫిన్ల్యాండ్లో వేసవి కాలాన్ని పరిచయం చేసే ఒక వీడియోను విడుదల చేసింది అక్కడి పర్యాటకశాఖ. ‘ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. మాకు నాలుగు రుతువులు ఉన్నాయి. మేము వాటన్నిటిని ప్రేమిస్తాం. మాకు అత్యంత ఇష్టమైనది వేసవి. వేసవి సెలవులను సంతోషంగా గడుపుతాము. వేసవి ప్రారంభమైన వెంటనే, సామాను సర్దుకొని సరస్సు ఒడ్డున ఉన్న క్యాబిన్ల దగ్గరకు వెళతాం. అక్కడే మా సంతోష ప్రపంచాన్ని వెదుక్కుంటాం. ఆలస్యంగా పడుకుంటాం. ఆలస్యంగా నిద్రలేస్తాం. బయటకు వెళ్లి హైకింగ్, బైకింగ్ చేస్తాం. స్నేహితులను కలుసుకుంటాం’ అంటూ వీడియో వినిపిస్తుంది.సందడి మొదలైంది...ఏడు రోజుల జూన్ ఛాలెంజ్ కోసం ప్రపంచ నలుమూలల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ పార్టనర్తో కలిసి ఇన్స్టాగ్రామ్ లేదా టిక్టాక్లో ఒక వీడియోను రూ΄÷ందించాలి. అందులో వారు తమను తాము పరిచయం చేసుకోవాలి.‘లేక్ల్యాండ్లో ఫిన్నిష్ వేసవి సెలవులు ఎలా ఉంటాయని మీరు ఊహిస్తున్నారు?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అధికారిక వెబ్సైట్లో ఉన్న దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి, దాని లింక్ను తమ సోషల్ మీడియా పోస్ట్కు జత చేయాలి. దరఖాస్తు చేసుకునే వారి వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. భార్య, స్నేహితుడు, కుటుంబ సభ్యులు... తమకు నచ్చిన ఎవరితోనైనా కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేది... 29 మార్చి.ఆ అవకాశం మీకే రావచ్చు!మీ కోరికల జాబితాలో ‘ఫిన్లాండ్కు వెళ్లాలి’ అనేది కూడా ఉన్నట్లయితే మీరు ‘చిల్ లైక్ ఏ ఫిన్’ ఛాలెంజ్లో పాల్గొనడం మంచిది. ఏమో... ఆ ఛాన్స్ మీకే రావచ్చు! ఇది విస్మరించలేని అద్భుత అవకాశం. పర్యాటక ప్రదేశాలను హడావిడిగా చుట్టి రావడం కాకుండా ప్రకృతితో గాఢమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి, ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా స్థిరంగా నిలవడానికి కారణాలు ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ చాలెంజ్ను రూపకల్పన చేశారు. ఈ చాలెంజ్కు ఎంపిక అయిన వారిని ఖర్చులన్నీ వారే భరించి ఉచితంగా తీసుకు వెళతారు. ‘అంతమందిలో మనకేం వస్తుందిలే’ అనుకోవడం నిరాశ. ‘మాకు కూడా రావచ్చునేమో!’ అనుకోవడం ఆశ. సంతోష సౌధానికి పునాది ఆశే కదా! మీలో క్రియేటివిటీ ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకోవడానికి ఇదే సరైన సమయం. దరఖాస్తు పూర్తి చేయడానికి ‘చిల్లైక్ఏఫిన్.కామ్’లోకి వెళ్లాలి. ‘మేము ఎలాంటి వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నామంటే’ అనే కాప్షన్తో ఈ సైట్లో కొన్ని వివరాలు ఇచ్చారు. ఉదాహరణకు కొన్ని...→ ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడనివారు.→ ఇక్కడి అనుభవాలను చిత్రీకరించి ఇతరులకు షేర్ చేసేవారు.→ డ్రైవింగ్ తెలిసిన వారు. కనీసం ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఉన్నవారు. -
ఇండియాలోనే స్విట్జర్లాండ్
లడఖ్ ప్రాంతం సమ్మర్లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు, మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.గ్రామాల మధ్య జీవనంచిన్న గ్రామాల్లో ప్రజల జీవనం ప్రకృతి రిథమ్తో కలిసి నడుస్తుంది. వీధుల్లో నడిచే ప్రజలు, మోనాస్టరీస్ పక్కన కనిపించే ప్రశాంత వాతావరణం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్ గాలులు, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వాయు మార్గంలో లేదా ట్రైన్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి లేహ్కి డైరెక్ట్ ఫ్లైట్ వెళ్లవచ్చు. లేహ్ విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభమైన తర్వాత హిమాలయాల మధ్య రోడ్ జర్నీ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక అందమైన లోయ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వ్యాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్, ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్లా మార్చేస్తాయి. ఉదయ సమయంలో వ్యాలీ మీద పడే సాఫ్ట్ వెలుగు చుట్టూ ఉన్న హిల్స్ని మరింత అందంగా చూపిస్తుంది. మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా సాగుతుంటే, ఈ ప్రదేశం మొత్తం ఒక ప్రశాంతమైన మరో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది.అపాతాని సంస్కృతిజీరో వాలీలో జీవించే అపాతాని ట్రైబ్ ప్రజల జీవనం ప్రకృతితో కలిసి నడుస్తుంది. విలేజెస్ మధ్య కనిపించే బాంబూ హౌజెస్, పాడీ ఫీల్డ్స్ మధ్య ఉన్న ఫుట్పాత్స్ ఈ ప్రదేశంలో లైఫ్ రిథమ్ ఎలా ఉంటుందో చూపిస్తాయి. స్థానిక మార్కెట్లలో ప్రజలు సమయం గడపడం, వ్యాలీ మధ్యలో కనిపించే గ్రామాలు ఈ ప్రయాణాన్ని ఒక కల్చరల్ అనుభవంగా మార్చేస్తాయి. సమ్మర్ సీజన్లో వ్యాలీలో పచ్చని రంగులు మరింత విస్తృతంగా కనిపిస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా అస్సాంలోని గౌహతి వరకు వాయు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జీరో వ్యాలీకి వెళ్లవచ్చు. గౌహతి నుంచి ఇటానగర్ మీదుగా కొండల మధ్య నడిచే రోడ్స్ ద్వారా వ్యాలీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ మధ్య నడిచే ఈ రోడ్డు ప్రయాణంలో అడవులు, లోయలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని ఒక మెమోరబుల్ జర్నీగా మార్చేస్తాయి. (చదవండి: లాంజ్లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి) -
ఆరోగ్య సారథులు 'చిరుధాన్యాలు'
ప్రస్తుతం బియ్యం, గోధుమలే అధికంగా వాడుతున్నాం గానీ ఒకప్పుడు చిరుధాన్యాలదే రాజ్యం. ఏవో రెండు, మూడు కాదు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, సామలు, ఊదల వంటి ఆరేడు రకాల చిరుధాన్యాలు తినేవారు. అయితే నలబైల్లో వచ్చిన క్షామం, పెరుగుతున్న జనాభా అవసరాలు తిండి గింజల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. శాస్త్రీయ పరిశోధనలు.. హరిత విప్లవం పుణ్యమాని గోధుమ, వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. దాంతో మన ఆహారపు అలవాట్లు సమూలంగా మారిపోయాయి. ముఖ్యంగా చిరుధాన్యాల వాడకం బాగా తగ్గిపోయింది. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? పోషకాలు అందుతున్నాయా, లేదా? అనే విచక్షణే లేకుండా పోయింది. మరోవైపు శారీరక శ్రమ కూడా తగ్గిపోయింది. ఫలితంగా జీవనశైలితో ముడిపడిన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్లు వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. వీటితో సంభవించే మరణాలూ ఎక్కువవుతూ వస్తున్నాయి. ఇవన్నీ మన ఆహార అలవాట్లను ఒక్కసారి సమీక్షించుకోవాలనీ, చిరుధాన్యాలకు పట్టం కట్టాలనీ నిర్దేశిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారమూ సంపూర్ణంగా ఉండాలి. వాటిల్లో సింహభాగం ధాన్యాలదే. అలాంటి చిరుధాన్యాల వల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటో సవివరంగా చూద్దామా..!.చిరుధాన్యాల్లో పోషకాలు పెద్దమొత్తంలో ఉండటమే కాదు. వీటిల్లోని కొన్ని సంయోజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి వరి, గోధుమ వంటి పెద్ద ధాన్యాలు.. రాగులు, కొర్రలు, సామల వంటి చిన్న ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వు, కేలరీలన్నీ కొద్ది గొప్ప తేడాలతో దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే ఇవి మెరుగైనవి కావటమే విశేషం. వరి, రాగులు, సామల్లో 7% మాంసకృత్తులుంటే.. గోధుమ, జొన్న, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెల్లో 10-12% వరకు ఉంటాయి. పిండి పదార్థమైతే- వరిలో 77%, గోధుమల్లో 64% వరకు.. చిరుధాన్యాల్లో 60-70% వరకు ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50-55 శాతమే ఉంటుంది. వీటి నుంచి 330-345 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. బియ్యం, గోధుమల్లో 2% కొవ్వు ఉంటుంది. చిరుధాన్యాల్లో ఇది ఎక్కువ. అత్యధికంగా సజ్జలతో 5% వరకు కొవ్వు లభిస్తుంది. జొన్న, కొర్రలు, వరిగెల్లో 3 నుంచి 3.5% ఉంటుంది. ఈ కొవ్వు హాని చేసేది కాదు. మంచి శక్తిని ప్రసాదిస్తుంది. వీటిల్లో విటమిన్ ఈ కూడా ఎక్కువే. ఖనిజ లవణాల విషయంలో చిరుధాన్యాలదే పైచేయి. రాగుల్లో పాలతో సమానంగా 344 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. బియ్యం, గోధుమల్లో ఐరన్ అంతగా ఉండదు. చిరుధాన్యాల్లో ఇది మంచి పాళ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సజ్జల్లో 8 మి.గ్రా., సామల్లో 9.3 మి.గ్రా ఐరన్ ఉంటుంది. రాగులు, జొన్నల్లో సుమారు 4 మి.గ్రా. ఉంటుంది. రక్తహీనత తగ్గటానికిది ఎంతో అవసరం. జీవక్రియల్లో పాలు పంచుకునే మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటివీ వీటిల్లో ఎక్కువే. ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కావటానికి మెగ్నీషియం.. ఎదుగుదలకు జింక్ తోడ్పడుతుంది. అయితే బియ్యం, గోధుమల్లో కన్నా చిరుధాన్యాల్లో థయమిన్ తక్కువగా ఉంటుంది. నైసిస్, పెరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్ వంటివి మాత్రం బాగానే ఉంటాయి. కొన్నింటిలో విటమిన్ ఏ, బీటా కెరటిన్లు కూడా ఉంటాయి.డాక్టర్ బీ గోపిచంద్, హెచ్ఓడీ, డీన్ మిజోరం యూనివర్సిటీ(చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్చేస్తే..) -
లాంజ్లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి
ఎయిర్పోర్టులో లాంగ్ వెయిటింగ్ టైమ్ ఉంటే లాంజ్ యాక్సెస్ చాలా ఉపయోగపడుతుంది. కంఫర్టబుల్ సీటింగ్, ఫ్రీ ఫుడ్, వైఫై లాంటి ఫెసిలిటీస్తో ట్రావెల్ ఎక్స్పీరియెన్స్ మరింత బెటర్ అవుతుంది. కానీ అందరికీ లాంజ్ యాక్సెస్ ఉచితంగా లభించదు. కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా యాక్సెస్ పొందవచ్చు.క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్చాలా ప్రీమియం కార్డుల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. కొన్ని కార్డుల్లో సంవత్సరానికి లిమిటెడ్ ఫ్రీ ఎంట్రీస్ ఇస్తారు. ట్రావెల్కు ముందు మీ కార్డ్ బెనిఫిట్స్ చెక్ చేసుకుంటే ఈజీగా ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.ఎయిర్లైన్ లాయల్టీ ప్రోగ్రామ్స్ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ కోసం ఎయిర్లైన్స్ స్పెషల్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఇస్తాయి. పాయింట్స్ కలెక్ట్ చేసి ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రెగ్యులర్గా అదే ఎయిర్లైన్తో ట్రావెల్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.ఎర్లీ ఫ్లైట్ అప్గ్రేడ్స్కొన్నిసార్లు బిజినెస్ క్లాస్కి లాస్ట్ మినిట్ అప్గ్రేడ్ ఆఫర్స్ వస్తాయి. కొంచెం ఎక్స్ట్రా పే చేసి అప్గ్రేడ్ తీసుకుంటే లాంజ్ యాక్సెస్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది.ట్రావెల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్కొన్ని ట్రావెల్ మెంబర్షిప్ సర్వీసెస్లో లాంజ్ యాక్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి. యాన్యువల్ మెంబర్షిప్ తీసుకుంటే మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్లో లాంజ్ యూజ్ చేయవచ్చు.స్పెషల్ ఆఫర్స్ అండ్ డీల్స్ఫెస్టివ్ సీజన్ లేదా ట్రావెల్ డీల్స్ సమయంలో కొన్ని కార్డ్స్ లేదా బుకింగ్ ఫ్లాట్ఫామ్స్ స్పెషల్ లాంజ్ యాక్సెస్ ఆఫర్స్ ఇస్తాయి. అలెర్ట్స్ ఫాలో అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందడం కష్టం అనిపించినా, కరెక్ట్ ట్రిక్స్ ఉపయోగిస్తే సాధ్యమే. కొంచెం ప్లానింగ్తో మన ట్రావెల్ అనుభవాన్ని కంఫర్టబుల్, ప్రీమియంగా మార్చుకోవచ్చు. -
భారీ విద్యారుణం నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రేంజ్కు..!
ప్రారంభంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడం సహజం. అయితే వాటిని అధిగమిస్తు ఎలా ముదుకుపోతామనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ టెకీ ఎంతో తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ.. అందంగా తీర్చిదిద్దుకున్న తన కెరీర్ సక్సెస్ని షేర్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఎవ్వరైన చూపించాల్సిన తెగువ, పట్టుదలను హైలెట్ చేస్తున్న ఈ స్టోరీ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. ఆ టెకీనే బారతీ సంతతికి చెందిన ప్రియాంక వర్గాడియా. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్లో సీనియర్ డైరెక్టర్ డెవలపర్ జీటీఎం మార్కెటింగ్గా పనిచేస్తున్నారామె. ఇన్స్టాగ్రామ్లో తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు. పోస్ట్లో తన కెరీర్ ప్రారంభంలో చాలా పోరాటాలు, రిస్క్లు ఉన్నాయన్నారు. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో భారీ విద్యా రుణం తీసుకున్నానని వెల్లడించింది. అక్కడ అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు సుమారు రూ. 40 లక్షల దాక రుణం తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత భారత్ నుంచి అమెరికాకు తన తొలి ఫ్లైట్ జర్నీ కోసం కూడా తన తండ్రి భూమిని తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. ఆ రోజు తన విదేశీ ప్రయాణం ఎంత భారమైందో మర్చిపోలేనని, అక్కడ ఒంటరిగా చదవు సాగించడం అంత సులభం కాదని అంటోంది. అక్కడ విద్యా వ్యవస్థకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుందని అంటోంది. ఎందుకంటే అక్కడ బోధనాపద్ధతులు, కొత్త వాతావరణానికి సర్దుకుపోవడం అంత సులభమైనవి కావని, పైగా తన చదువు, వంట, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం వంటి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు తన విద్యార్ధి రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడిని కూడా భరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన అప్పులు తీర్చుకోవడానికి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగం సంపాందించక తప్పని పరిస్థితి. ఇవన్నీ తనని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేసేవని అంటోంది. ఈ సవాళ్లన్నింటిని ఎదుర్కొనడానికి తొందరలో మంచి భవిష్యత్తు కచ్చితంగా ఉందనే ఆశ..కొండంత ధైర్యాన్ని ఇచ్చేదని పేర్కొంది. ముందున్న జీవితం గురించి అంతరంగంలో నిశబ్దమైన ఉత్సాహం, అలాగే తాను తీసుకున్న సాహసం చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుందన్న నమ్మకం తదితరాలతో ముందుకు సాగానని చెప్పుకొచ్చింది. తన వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ ఆమె మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేసినట్లు వెల్లడించారు. అలాగే తన ఉద్యోగం కారణంగా అనేక ప్రదేశాలకు పర్యటించే అవకాశం కూడా లభించిందని ఆమె పేర్కొన్నారు. తన గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం తన తల్లిదండ్రులను అమెరికాకి తీసుకురావడం.. తాను సాధించిన అతిపెద్ద ఘనత అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. తన తల్లిదండ్రులకు అదే తొలి విమాన ప్రయాణ అనుభవమని ఆనందంగా చెప్పుకొచ్చింది. ఉద్యోగ కెరీర్ లైఫ్లో ఎన్నో విమాన ప్రయాణాలు చేసినా.. తన హృదయంలో మాత్రం.. ఆనాడు భయంతో చేసిన తొలి విమాన ప్రయాణానికే ఎప్పటికీ ప్రత్యేక స్థానం అని చెబుతోంది.(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!) -
నాయకుడిలా ఆలోచించడం ఎలా..?
చాలామంది నాయకత్వం అంటే ఒక పదవి (Position) లేదా పదిమంది మీద అధికారం చలాయించడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, లీడర్షిప్ అనేది ఒక 'మైండ్సెట్'.మీరు ఒక టీమ్ కి హెడ్ అయినా కాకపోయినా, మీ ఆలోచనా విధానం ఒక నాయకుడిలా ఉంటే.. ప్రపంచం మిమ్మల్ని అనుసరించడం మొదలుపెడుతుంది.నాయకత్వం అంటే దారి చూపించడం కాదు, ఆ దారిలో అందరినీ నడిపించడం. ఒక నాయకుడి వ్యక్తిత్వం సాధారణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటుంది. వారు సమస్యను చూసే విధానం, మనుషులను అర్థం చేసుకునే తీరు వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. నాయకుడిలా ఆలోచించడానికి కావలసిన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఉంది.బాధ్యత (Extreme Ownership)సాధారణ వ్యక్తి తప్పు జరిగితే ఇతరులను వేలెత్తి చూపుతాడు (Blame game). కానీ ఒక నాయకుడు 'Extreme Ownership' తీసుకుంటాడు."పని జరగలేదా? అది నా బాధ్యత. నా టీమ్కి నేను సరిగ్గా వివరించలేకపోయాను"అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకుంటారో, అప్పుడే మీకు ఆ సమస్యను పరిష్కరించే 'అధికారం' (Power) లభిస్తుంది. బాధ్యత తీసుకోని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడు.విజన్ vs ఎగ్జిక్యూషన్ (Vision vs Execution)నాయకుడు ఎప్పుడూ రెండు కళ్లతో చూస్తాడు. ఒక కన్ను భవిష్యత్తు మీద (Vision) ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో మనం ఎక్కడ ఉండాలి? మన లక్ష్యం ఏంటి? అని ఆలోచిస్తుంది. మరో కన్ను ప్రస్తుత పని మీద (Execution) ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఈ రోజు మనం చేయాల్సిన చిన్న పని ఏంటి? అని ఆలోచిస్తుంది. కేవలం కలలు కనేవాడు 'ఉత్తమ ఆలోచనాపరుడు' అవుతాడు, కానీ ఆ కలలను నిజం చేసేవాడే 'నాయకుడు' అవుతాడు.ఎమోషనల్ స్టెబిలిటీ (Emotional Stability)యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం ఎప్పుడూ సేనాపతి ముఖం వైపు చూస్తుంది. సేనాపతి కళ్ళలో భయం ఉంటే సైన్యం ఓడిపోతుంది. అలాగే, ఆఫీసులోనో, ఇంట్లోనో సమస్య వచ్చినప్పుడు మీరు ఎంత 'ప్రశాంతంగా' ఉన్నారనేదే మీ నాయకత్వ లక్షణం.మీ నియంత్రణలో లేని వాటి గురించి ఆందోళన చెందకుండా, మీరు చేయగలిగిన దానిపై దృష్టి పెట్టడమే Stoicism.నాయకత్వ లక్షణాలను బిల్డ్ చేయడంGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీలోని లీడర్ని మేల్కొలిపే విధానం.Step 1: అనుసరించే తత్వాన్ని బ్రేక్ చేయండి"ఎవరో వస్తారు, ఏదో చేస్తారు" అని ఎదురుచూసే మనస్తత్వాన్ని 'Break' చేయండి. ఎవరూ రాకపోయినా, నేను మొదలుపెడతాను అనే చొరవ తీసుకోండి. నాయకుడు ఎప్పుడూ మొదటి అడుగు వేస్తాడు.Step 2: పీపుల్ స్కిల్స్ పెంచుకోండినాయకత్వం అంటే మనుషులతో పని చేయించడం. ఎదుటివారిలోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం నేర్చుకోండి. మీ గెలుపు కంటే మీ టీమ్ గెలుపు ముఖ్యం అని భావించినప్పుడే మీరు ఒక నాయకుడిగా ఎదుగుతారు. సహానుభూతి (Empathy) మీ అతిపెద్ద ఆయుధం.Step 3: లెగసీ మేకింగ్ మీరు లేకపోయినా మీ సిస్టమ్ నడవాలి. మీరు నేర్చుకున్నది పదిమందికి నేర్పించి, మరో పదిమంది నాయకులను తయారు చేయడమే 'Beyond' స్టేజ్. నిజమైన నాయకుడు అనుచరులను కాదు, మరో నాయకులను తయారు చేస్తాడు.మీలో నాయకుడు ఉన్నాడా?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:సమస్య వచ్చినప్పుడు మీరు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నారా? లేక ఎవరిని నిందించాలి అని చూస్తున్నారా?మీరు చేసే పని వల్ల కనీసం ఒక్కరికైనా ఉపయోగం ఉందా?మీరు మాట్లాడేటప్పుడు ఇతరులలో నమ్మకాన్ని నింపుతున్నారా?నాయకత్వం ఒక ఎంపిక!బ్రో, నాయకత్వం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది మీరు తీసుకునే 'నిర్ణయం'. మీరు మీ జీవితానికి నాయకుడిగా మారిన రోజే, ప్రపంచానికి నాయకుడిగా మారే ప్రయాణం మొదలవుతుంది. మీ వ్యక్తిత్వమే మీ అధికారం."A leader is one who knows the way, goes the way, and shows the way." (జాన్ సి. మాక్స్వెల్). -
యద్భావం తద్భవతి
వరదల ధాటికి ఒక ఊరు పెద్ద మొత్తంలో నష్ట పోయింది. ఆ ఊరి రైతుల ప్రధానపంట వేరుశనగ. వరద నీటి వల్ల వారు విత్తనాలకని దాచిపెట్టుకున్న వేరుశనగ విత్తనాలు పనికిరాకుండా పోయాయి. అందరూ వెళ్ళి జమీందారును సహాయం చేయమని కోరారు. దానగుణం కలిగిన జమీందారు సహాయం చేయడానికి అంగీకరించాడు. రైతులు అడిగినన్ని విత్తనాలు ఇవ్వసాగాడు.అదే సమయంలో అక్కడికి ఒక ముసలావిడ విత్తనాలకని వచ్చింది. ఆమె గురించి తెలిసిన కొందరు ఆమెను వింతగా చూశారు. మరి కొందరైతే ‘నీకు సెంటు నేల లేదు. నువ్వెక్కడ పండిస్తావు? నువ్వు పండించినా తినడానికి నీకు పిల్లాజెల్లా లేరు కదా’ అని వేళాకోళం చేశారు. ఆమె నవ్వి ఊరుకుంది. జమీందారు మాత్రం ఆమె అడిగినన్ని విత్తనాలు ఇచ్చి పంపాడు. మూడు నెలలు గడిచింది. వేరుశనగ తోటలు కోతకు సిద్ధమయ్యాయని తెలిసి వాటిని చూడటానికని జమీందారు జట్కాలో బయలుదేరాడు. ఆ ఊరి రైతులందరూ జమీందారుకు పడీపడీ నమస్కరించారు. తాము నాటిన వేరుశనగ తోటలను చూపారు. ఆ మొక్కలన్నీ పొట్టిగా, బలహీనంగా, ఆకులు ఎండి పోయి ఉన్నాయి. రైతులకు సరైన ఫలితం వచ్చే సూచనలు కనిపించలేదు. బాధగా వెనుదిరిగాడు.ఎండ ఎక్కువయ్యింది. విశ్రాంతి కోసం ఒక మామిడి చెట్టు కింద ఆగాడు. ఎదురుగా చిన్న గుట్ట కనిపించింది. ఆ గుట్ట మీద వేరుశనగ మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటి ఆకులు గాఢ పచ్చ రంగులో ఉన్నాయి. ఆశ్చర్య పోయాడు జమీందారు. చిన్నగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముసలావిడ కూర్చుని ఉంది.‘మీ ఊర్లో వేరుశనగ పంట ఎవ్వరికీ సరిగా పండలేదు, నీకు మాత్రం ఎలా పండింది?’ అని అడిగాడు. ఆమె చల్లటి కుండ నీళ్ళు జమీందారు చేతికి ఇస్తూ ‘నా ప్రార్థన వల్ల’ అని బదులిచ్చింది.ఆసక్తిగా ‘నువ్వు ఏమని ప్రార్థన చేశావో నాకు చెప్పు!’ అన్నాడు.నాకు పొలం లేదు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఇవి బాగా పండితే ఎవరో ఒకరు తింటారని ఈ గుట్ట మీద నిలబడి విత్తనాలు చల్లాను. అలా చల్లేటప్పుడు... ‘కాపలాదారుడు తినగా మిగిలింది, దొంగ తినగా మిగిలింది, చూసినవాడు తినగా మిగిలింది, పక్షులు తినగా మిగిలింది, నాకూ కొంత మిగిలితే సంతోషం స్వామీ’ అని దేవుణ్ణి ప్రార్థించాను’’ అని చెప్పింది.ఆమె సహృదయతకు జమీందారు చలించి పోయాడు. ‘మనం మంచిగా ఆలోచించి ఒక పని చేస్తే ప్రకృతి పదింతల సహాయం చేస్తుందని’ జమీందారుకు అర్థం అయింది. ఆమెకు హృదయపూర్వకంగా నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
యక్షప్రశ్న లంటే..?
ఎవరైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతుంటుంటే యక్షప్రశ్నలు వేస్తున్నావు అనడం....పరిపాటి. అసలు యక్షప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని ఏ సందర్భంలో అడిగారో ఇపుడు తెలుసుకుందాం. అలనాటి ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలోని అరణ్యపర్వానికి సంబంధించినవే.. ఈ యక్ష ప్రశ్నలు. పాండవులు మాయాజూదంలో ఓడిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైత వనానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఒక పండితుడు తన ‘అరణి‘( నిప్పు పుట్టించే కర్ర ) ఒక మృగం తీసుకు పోయిందని, దానిని వెతికి ఇవ్వమని ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అంటే... పాండవుల్లో పెద్దవాడు, బ్రహ్మవేత్త, పండితుడు, జ్ఞాని, సత్యవంతుడు, స్థితప్రజ్ఞుడు.ధర్మరాజు ధర్మనిష్టకు పరీక్షయే ఈ యక్షప్రశ్నలు. ధర్మరాజు తన తమ్ముళ్లలో నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముని ఒకరి తరవాత మరొకరిని అరణి తీసుకుని రావలసిందిగా కోరడంతో వారు అరణ్యంలోకి వెళ్లడం ఎంతకూ తిరిగి రాక పోవడంతో చివరకు ధర్మరాజే.. బయలుదేరి వెళ్ళాడు. అయితే తన సోదరులు విగతజీవుల్లా ఒక సరస్సు వద్ద పడి ఉండడాన్ని ధర్మరాజు గమనించాడు. ఈ నేపథ్యంలో తనకు దాహంగా ఉండడంతో సరస్సులో నీరు తాగేందుకు దిగుతుండగా ఒక యక్షుని అదృశ్యవాణి వినిపించింది. ఓ.. ధర్మరాజా! నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీకు తాగేందుకు మంచి నీరు లభిస్తుందని, లేకుంటే నీ సోదరులకు పట్టిన గతే నీకూ పడుతుందని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. అందుకు ధర్మరాజు సరే అనడంతో ఆ యక్షుడు 72 ప్రశ్నలను అడుగుతాడు. వాటన్నిటికీ ధర్మరాజు సక్రమంగా సమాధానాలను చెప్పడంతో ఆ యక్షుడు సంతృప్తి చెంది, మీ సోదరులలో ఒకరిని మాత్రమే బతికిస్తానని ఎవరు కావాలో కోరుకోమంటాడు. అందుకు ధర్మరాజు తన పినతల్లి కుమారులైన నకుల, సహదేవులలో ఒకరిని బతికించమని కోరడంతో ఆ యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు సంతోషించి, అందరికీ ప్రాణదానం చేస్తాడు. ధర్మాచరణ విశిష్టతను తెలిపిన ప్రశ్నలనే యక్షప్రశ్నలు అంటారు.– సి.ఎన్. మూర్తి, పాత్రికేయులు -
మౌనం..అంతరంగ అన్వేషణకు మార్గం
భారతీయ జీవన దర్శనం మౌనాన్ని ఒక మహోన్నత తపస్సుగా, ముని వృత్తిగా అభివర్ణించింది. ‘మౌనం సర్వార్థ సాధకమ్‘ – అనగా మౌనం ద్వారా సమస్త కార్యాలను సాధించవచ్చు. మౌనం అంటే కేవలం పెదవులు మూసి ఉంచడం కాదు; అనవసర ఆలోచనలను నియంత్రించి మనసును నిశ్శబ్దంగా మార్చడం.నేటి ఆధునిక కాలంలో మనిషి నిరంతరం బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య, సామాజిక మాధ్యమాల అలజడిలో జీవిస్తున్నాడు. ఈ గందరగోళం వల్ల తనతో తాను మాట్లాడుకునే అమూల్య సమయాన్ని కోల్పోతున్నాడు. మౌనం మనలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను, వివేకాన్ని మేల్కొల్పుతుంది. మాటల ద్వారా వ్యయమయ్యే శక్తిని ఆదా చేసి, ఆ శక్తిని అంతరంగ వికాసానికి ఉపయోగించేలా చేస్తుంది.వైదిక ఆధ్యాత్మిక చరిత్రలో మౌనానికి రమణ మహర్షి ఒక మహోన్నత నిదర్శనం. ఆయన కేవలం తన మౌనం ద్వారానే భక్తుల సంశయాలను నివృత్తి చేసేవారు. మాటలు వివరించలేని గూఢ సత్యాలను మౌనం సులువుగా వివరిస్తుంది. అలాగే, దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు మౌన ముద్ర ద్వారానే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అశాంతిగా ఉన్న మనసు ఎప్పుడూ వాదిస్తుంది; ప్రశాంతమైన చిత్తం మౌనంలో లీనమవుతుంది. మౌనం మనల్ని అహంకారం నుండి విముక్తులను చేసి, పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. లోతైన నిశ్శబ్దంలోనే దైవ వాక్కు వినిపిస్తుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనం మాట్లాడే మాటల్లో చాలా వరకు అనవసరమైనవి, ఇతరులను నొప్పించేవి ఉంటాయి. మౌనాన్ని అలవర్చుకోవడం వల్ల వాక్ దోషాలు నశిస్తాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు ఎదురు దాడి చేసే కంటే, కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా ఏకాంతంగా మౌనం పాటించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది మన నరాల వ్యవస్థకు విశ్రాంతినిచ్చి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాటలకు అంతటి గౌరవం పెరుగుతుంది. మౌనం బలహీనత కాదు; అది ఒక ఉన్నతమైన మానసిక పరిపక్వత.ఆర్ష సంస్కృతి అందించిన ఈ మౌన మార్గం వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్న నానుడి అక్షర సత్యం. మన అంతరంగంలో మౌనం అనే జ్యోతి వెలుగుతున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని కల్లోలాలు మనల్ని స్పృశించలేవు. మాటలకందని ఆనందాన్ని అనుభవించాలంటే మౌనమే ఏకైక శరణ్యం. అశాంతిని వీడి, మౌనాన్ని ఆలింగనం చేసుకుని ఆత్మాన్వేషణ సాగిద్దాం. మౌనమే శక్తి, మౌనమే శాంతి. సర్వం నిశ్శబ్దమయం!బాహ్య ప్రపంచంలో మనం ఎంత ఎదిగినా, అంతరంగంలో మౌనాన్ని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. మౌనంలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి; వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగు వైపు, అశాంతి నుండి ప్రశాంతత వైపు నడిపించే దివ్య మార్గం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
ఈ సండే సరదాగా 'కేసర్ పిస్తా దోసె' ట్రై చేయండిలా..!
కేసర్ పిస్తా దోసెకావలసినవి: బియ్యం–ఒక కప్పు, మినపప్పు–పావు కప్పు , శనగపప్పు–ఒక టేబుల్ స్పూన్ , మెంతులు–ఒక టీ స్పూన్ , ఉప్పు– రుచికి సరిపడా, కుంకుమ పువ్వు–15, వేడి పాలు–2 టేబుల్ స్పూన్లు, నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు, ఏలకులు–3 (పొడి చేయాలి)పిస్తా చట్నీ కోసం: పిస్తా–100 గ్రాములు, పచ్చి మిరకాయలు–2, తురిమిన కొబ్బరి–2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం–ఒక టీ స్పూన్ , జీలకర్ర పొడి–అర టీ స్పూన్, ఉప్పు –రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పులను కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటల సేపు పులియబెట్టండి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పావుగంట ఉంచండి. ఈ పాలను పులిసిన దోసెపిండిలో వేసి, బాగా కలపండి. అదే సమయంలో ఏలకుల పొడి కూడా కలపండి. అంతే దోసెపిండి రెడీ. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యితో దోసెలు వేసుకోవాలి.పిస్తా చట్నీ తయారీ: పిస్తా, పచ్చి మిరపకాయలు, కొబ్బరి తురుము, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే టేస్టీ పిస్తా చట్నీ రెడీ. ఈ వేడి వేడి దోసెలను ఈ చట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.రష్యన్ మష్రూమ్ జూలియన్ కావలసినవి: పుట్టగొడుగు ముక్కలు–250 గ్రాములు ఉల్లిపాయ–1, వెల్లుల్లి రెబ్బలు–2, వెన్న–ఒకటిన్నర టేబుల్ స్పూ¯Œ హెవీ క్రీమ్–ముప్పావు కప్పు, మోజరెల్లా చీజ్– ఒక కప్పు (తురిమినది), మిరియాల పొడి–ఒక టీ స్పూన్, ఉప్పు– రుచికి సరిపడా. తయారీ: ముందుగా ఒక కడాయిలో టీ స్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పుట్టగొడుగుల్లోని నీరు ఆవిరయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న సిరామిక్స్ బౌల్స్లో వేయాలి. అదే పాన్లో అర టీస్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో హెవీ క్రీమ్ వేసి మిక్స్ చేయండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సాస్లా బాగా కలపండి. ఈ సాస్ను ముందుగా రెడీ చేసిన పుట్టగొడుగుల మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 375 ఫారన్హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన మైక్రోవేవ్ ఒవెన్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేయండి. అంతే టేస్టీ రష్యన్ మష్రూమ్ జూలియన్ రెడీ.ఛత్తీస్గఢీ ఫరా కావలసినవి: అన్నం–ఒక కప్పు, బియ్యప్పిండి–2 కప్పులు, ఎండు మిరపకాయలు–2, నువ్వులు–ఒక టేబుల్ స్పూన్ , జీలకర్ర– ఒక టేబుల్ స్పూన్, ఆవాలు–ఒక టీ స్పూన్ , కరివేపాకు–రెండు రెమ్మలు, పచ్చిమిర్చి–3 (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర–కొద్దిగా, నూనె–తాలింపు కోసం, ఉప్పు–రుచికి సరిపడా.తయారీ: ముందుగా వండిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి చపాతీ ముద్దలా తయారు చేసి కాసేపు ఉంచండి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నిలువుగా చిత్రంలో చూపిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని స్టీమర్ సాయంతో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. మరోవైపు పాన్ లో కొద్దిగా నూనె వేసి 2 ఎండు మిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు వేయించండి. అంతే టేస్టీ ఫరా రెడీ. వీటిని పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి.


