Lifestyle
-
వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ
ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్లో వెయిటర్గా మొదలైన భాస్కర్ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్ భాస్కర్ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్ బిజినెస్కు ఉంటుంది. కేఆర్ భాస్కర్ తయారు చేసే బొబ్బట్ల (పూరన్ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.ఇదీ చదవండి: 30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్లెట్లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్లెట్ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్! -
అలనాటి వేసివి ముచ్చట్లు..! చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన సరదాలు..
సెలవులు వస్తే అబ్బాయిలు ఆటల్లో పడతారు. ఆడపిల్లలు తీర్చుకోవాల్సిన ముచ్చట్లలో మునిగిపోతారు.మల్లెలు విరగగాసే ఈ సీజన్లోకనకాంబరాలతో వేసే పూలజడ మిస్సవకూడని జ్ఞాపకం. ఇక గోరింటాకు డిజైన్లు.... పట్టుచీరలతో కొత్త డ్రస్సులు...వెండి పట్టీల వెతుకులాట...పొదుపు చేసి కొనదలచిన బంగారు వస్తువు...వేసవిలో ఆడపిల్లల హడావిడే వేరబ్బా. పెద్దవాళ్లకు గుర్తుండాలేగాని. మరి ఈ సీజన్ సంబరంలో ఉంచారా వారిని? ఏం కావాలని అడిగారా?వేసవి వస్తే ఆడపిల్లల ఆటలు వేరు. చెట్ల నీడల్లో, వరండాల్లో గుంపుగా చేరి వారు చెప్పుకునే కబుర్లకు అంతు ఉండదు. ఇక గోరింట సింగారానికి వేసవి సెలవులే అదను. గోరింటాకు చెట్టు ఏ ఇంట్లో ఉందో వెతికి, వారిని బతిమాలి, ఆకు కోసుకొచ్చి, నూరి, చేతులకు మంచి మంచి డిజైన్లు వేసే అక్కలను వెతికి పెట్టించుకుని, గోరింట ఆరే దాకా అమ్మ చేత్తో ముద్దలు తింటూ... ఎప్పుడెప్పుడు పండుతుందా ఎంత ఎర్రగా పండుతుందా కాచుకుని... ఆ తర్వాత కడిగి నీదెలా పండిందంటే నాదెలా పండిందనుకోవడం... భలే వేడుక.ఇక అన్నింటికి మించిన అట్రాక్షన్ పూలజడ.మామూలుగానే అమ్మాయిలకు పూలు ఇష్టం. జడ ఇష్టం. పూలున్న ΄÷డవు జడ ఇంకా ఇష్టం. స్కూలుకెళ్లే రోజుల్లో ఈ ముచ్చట తీరే తీరుబడి ఉండదు కాబట్టి వేసవిలోనే ముహూర్తం. పూలజడ వేయించుకోవాలి... అద్దంలో జడ కనిపించేలా ఫొటో దిగాలి అని అప్పట్లో ప్రతి అమ్మాయి కోరిగ్గా ఉండేది. అది సెంటిమెంట్ కూడా. అయితే ఇది అనుకున్న వెంటనే అవదు. ఫలానా రోజున వేద్దామని ముందే అనుకుంటూరు. తండ్రికి సమాచారం ఇస్తారు... మరి స్టూడియోకు తీసుకెళ్లి ఫొటో తీయించాలి కదా. కాస్ట్యూమ్స్ సెలక్షన్ ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మ వంటి పెద్దవాళ్లకు పిన్ని, పెదమ్మలకు కబురు పెడతారు... పూల జడ కార్యక్రమం ఉందని. ఎందుకంటే పూల జడకు అవసరమైన మల్లెలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని తేవాలి. వాటి మధ్యన కనకాంబరాలు, రోజాలు, మరువం, దవనం లాంటివి పెట్టి జడలు అల్లే స్పెషలిస్టులు కొందరుంటారు. వారి డేట్ను ముందే తీసుకోవాలి. వారు అనుకున్న టైమ్కన్నా లేటుగా వచ్చి ఆ కబురూ ఈ కబురూ చెప్తూ జడ సిద్ధం చేస్తారు. పూలజడ వేసుకుంటే జడకుప్పెలు పెట్టుకోవటం మరో ముచ్చట. అవి అందరి దగ్గరా ఉండవు కదా... అక్కడికీ ఇక్కడికీ వెళ్లి జడకుప్పెలు తెచ్చుకుని, పూలజడ చివరలో అలంకరించుకుని పావడా కట్టుకుని ఇరుగమ్మలకు, పొరుగమ్మలకూ తాతయ్యలకూ పెదనాన్నలకూ మామయ్యలకూ అత్తయ్యలకూ చూపించి రావడం... వాళ్లు మెటికలు విరిచి పదో ఇరవయ్యో చేతిలో పెట్టటం మరో ముచ్చట. ఇంటికొచ్చిన నాన్న తన బంగారు కూతురు పూల జడతో కళకళలాడుతూ కనిపించేసరికి అనురాగం ΄పొంగుకొచ్చి ఏం అడిగినా కొని పెట్టేస్తాడు. ఫొటో తీయించి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో అందరికీ కనిపించేలా ప్రదర్శనకు పెడతాడు. ఈ తతంగం అంతా చూసిన కొందరు తల్లులు వారికి ఆడపిల్లలు లేకనోయినా పిల్లలు మగవాళ్లయినా సరే, బారెడు జుట్టు ఉందని పూలజడలు వేసి ఫొటోలు తీయించి పెద్దయ్యాక చూపించటం, వీళ్లేమో సిగ్గుపడుతూ వంకర్లు తిరగటం... ఇప్పుడు ఆ పూలూ లేవు... ఆ ముచ్చటా లేదు. (చదవండి: ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్ : ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు) -
మండు వేసవిలో ‘చల్లని’ వ్యాపారం, రెండు నెలల్లో రూ. లక్ష
సీజనల్ వ్యాపారం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యవసాయ, కూలీ పనులు పెద్దగా దొరకని మండు వేసవిలో ఆదాయ వనరుగా నిలుస్తోంది. పక్క జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ‘బిజీ’నెస్గా మారి, నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు దోహదపడుతోంది. తాండూరు టౌన్: వేసవి ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీడ పట్టున ఉంటూ ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉక్కపోత, వేడికి తట్టుకోలేక చల్లని నీడను ఆశ్రయించడంతో పాటు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతున్నారు. ఈ క్రమంలోనే డీ హైడ్రేషన్కు గురికాకుండా, వడదెబ్బ తగలకుండా గొడుగుతో బయటకు వెళ్తున్నారు. ఈ సమయంలో లస్సీ, జ్యూస్, సోడా, నిమ్మరసం, కూల్డ్రింక్స్ వంటివి సేవిస్తున్నారు. తాండూరు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో జనం వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా, ముఖ్య కూడళ్ల వద్ద వెలిసిన సీజనల్ దుకాణాలు వీరిని సేదతీరుస్తున్నాయి. జ్యూస్లతో పాటు కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, లస్సీ తాగడంతో పాటు, తాటి ముంజలను ఇష్టంగా తింటున్నారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏర్పాటు చేసిన దుకాణాల్లో జనాలకు అవసరమైన శీతల పానీయాలు, పండ్లు లభిస్తున్నాయి. ప్రత్యేకంగా వెలిసిన షాపుల ద్వారా పలువురికి ఉపాధి లభిస్తోంది. మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల నుంచి వచ్చిన వారు స్థానికంగా షాపులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఇక్కడే ఉంటారు. తాటి ముంజలపై మక్కువ వేసవి కాలంలో చాలా మంది తాటి ముంజలు తినేందుకు మక్కువ చూపుతారు. తాండూరు ప్రాంతంలో తాటి చెట్లు పెద్దగా లేకపోవడంతో చుట్టు పక్కల నుంచి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. డజనుకు రూ.వంద చొప్పున తాజా ముంజలను అమ్ముతున్నారు. రెండు నెలల పాటు ఇదే తమకు బువ్వ పెడుతుందని గ్రామీణ చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఏళ్లుగా ఇదే వ్యాపారం కొన్నేళ్లుగా వేసవిలో తాండూరుకు వచ్చి పుచ్చకాయలు విక్రయిస్తున్నాం. మహబూబ్నగర్ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టులో తెస్తాం. నిత్యం సుమారు క్వింటాలు నుంచి క్వింటాలున్నర వరకు అమ్ముతాం. ఎండలు తగ్గగానే స్వస్థలానికి వెళ్లిపోతాం. – హైమద్, మహబూబ్నగర్ జిల్లా రాయలసీమ నుంచి వచ్చాం మాది రాయలసీమ ప్రాంతం. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పలు రకాల ఫ్రూట్ జ్యూస్లు అమ్ముతుంటాం. ఒక్కో గ్లాసుకు జ్యూస్ను బట్టి రూ.10 నుంచి రూ.40 వరకు విక్రయిస్తాం. వేసవి సీజన్లో ఇదే మాకు ప్రధాన ఉపాధి. రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తాం. – రషీద్, ఫ్రూట్ జ్యూస్ విక్రయదారు రెండు నెలల్లో రూ.లక్ష.. వేసవిలో చాలా మంది తాటి ముంజలను భలే ఇష్టంగా తింటారు. వీటి సీజన్ తక్కువ కాలం ఉంటుంది. దీంతో ఎగబడి కొంటుంటారు. దూర ప్రాంతాల నుంచి ఆటోల్లో తీసుకువచ్చి విక్రయిస్తాం. రోజంతా ఎండలోనే పని, రెండు నెలల్లో రూ.లక్ష వరకు సంపాదిస్తాం. – హన్మంతు, చిన్నవార్వల్ సీమ నుంచి వచ్చి రాయలసీమ ప్రాంతానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఏటావేసవి సీజన్ ప్రారంభం కాగానే తాండూరుకు చేరుకుంటాయి. పలు అడ్డాల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకుని ప్రూట్స్ సలాడ్, బాదంపాలు, నిమ్మరసం వంటి జ్యూస్లను విక్రయిస్తారు. నిత్యం రూ.3 వేల నుంచి రూ.4 వేల వ్యాపారంజరుగుతుందని చెబుతున్నారు. జూన్ వరకు ఇక్కడే ఉండి ఐదు నెలల పాటు వ్యాపారం చేస్తారు. సీజన్ ముగిశాక తిరిగి తమ సొంతూళ్లకు వెళ్తారు. ఖర్చులు పోనూ నెలకు కనీసం రూ.30 వేల వరకు సంపాదిస్తామంటున్నారు. -
మిస్ వరల్డ్ పోటీల్లో ఆ దేశాలు డుమ్మా..!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీకి అధికారికంగా తెర లేచింది. మరో 3 వారాల పాటు నగరవాసులకు వైవిధ్యభరిత అనుభూతులను అందించనున్న ఈ పోటీలో మొత్తం 109 దేశాలు పాల్గొంటున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. అయితే రకరకాల కారణాలతో పలు దేశాలు తమ ప్రతినిధులను పంపలేకపోయాయి. దాంతో తొలి అంచనాలతో పోలిస్తే 30దేశాలు తగ్గినట్లయ్యింది. మిస్ వరల్డ్ 2025(Miss World 2025) పోటీకి ప్రారంభంలో 140 దేశాలు పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే తర్వాత ఈ సంఖ్యను 116కు కుదించారు. మొత్తం మీద చూస్తే.. తాజా సమాచారం ప్రకారం, ఈ పోటీలో 109 దేశాలకు చెందిన సుందరీమణులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇది గత మిస్ వరల్డ్ 2023 పోటీలో పాల్గొన్న 112 దేశాల కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. పోటీలో పాల్గొనని దేశాల్లో.. కోస్టారికా, ఇరాక్, లెసోతో, లైబీరియా, గినియాబిస్సావు, లైబీరియా, మకావ్, మొరాకో, నార్వే, స్లోవేకియా, టాంజానియా, ఉరుగ్వే తదితర దేశాలు ఉన్నాయి. స్పాన్సర్షిప్ లేక.. తమ దేశాల్లో జాతీయ స్థాయి పోటీలు సరిగా నిర్వహించలేకపోవడం, ప్రతినిధులను నియమించలేకపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల పోటీలో అవి పాల్గొనడంలేదు. లెసోథోకు చెందిన లెరాటో మాసిలా, టాంజానియాకు చెందిన ట్రేసీ నబుకీరా పంపించేందుకు స్పాన్సర్షిప్ లేక పోటీల నుంచి తప్పుకున్నారు. గినియా–బిస్సా, ఇరాక్, మాకావ్, ఉరుగ్వే దేశాలు తమ జాతీయ ఫ్రాంచైజ్ సమస్యల వల్ల ప్రాతినిధ్యం వహించలేకపోయాయి. నార్వేకి చెందిన నికోలిన్ ఆండర్సన్, తాను వ్యక్తిగత ప్రాజెక్టుల వల్ల మిస్ వరల్డ్కు హాజరుకాకపోవడంతో, ఆమెను మిస్ ఇంటర్నేషనల్కు పంపించారు. సరైన ప్రోత్సాహం, ఆర్థిక పరమైన మద్దతు లేకపోవడంతో మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ టాంజానియా ట్రేసీ నబుకీరా వైదొలిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చాలా పరిశీలించి ఆలోచించిన తర్వాత, మిస్ వరల్డ్ 2025లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, కానీ.. కావాల్సిన మద్దతు దొరకకపోవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం బాధ్యత వహించాల్సిన సంస్థ నుంచి తగినంత సన్నద్ధత లేని కారణంగా, ప్రపంచ వేదికపై టాంజానియాకు ప్రాతినిధ్యం వహించలేనని భావిస్తున్నా. మిస్ టాంజానియా టైటిల్ పట్ల ఇప్పటికీ చాలా గర్వపడుతున్నాను. నా ప్రాజెక్ట్, స్టెప్ బై స్టెప్ ద్వారా నా వంతు సామాజిక సేవ చేయడానికి నా గుర్తింపును ఉపయోగించుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో ఓపికగా, మద్దతుగా నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు.ఆఖరి నిమిషం వరకు ఆ దేశాలు..కొన్ని దేశాలు చివరి క్షణం వరకూ మార్పు చేర్పులు చేస్తూనే ఉన్నాయి. తమ అసలు పోటీదారులకు బదులుగా ఇతరులను పంపుతున్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన జస్టినా జెడ్నికోవా స్థానంలో అడేలా స్ట్రోఫెకొవా ఎంపికయ్యారు. ట్యూనీషియాకు చెందిన అమీరా అఫ్లీకి బదులుగా లామిస్ రెడిసి పోటీలో పాల్గొననున్నారు. బెలీజ్కు చెందిన నొయెలియా హెర్నాండెజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో షయారి మోరటాయా ఎంపికయ్యారు. కొట్ డి ఇవోరికి చెందిన మారీ ఎమ్మానుయేల్ డైమాలా స్థానంలో ఫటౌమటా కూలిబాలీ వస్తున్నారు. నమీబియాకు చెందిన అల్బర్టినా హైంబలా స్థానంలో సెల్మా కామాన్యా భర్తీ అయ్యారు. కంబోడియాకు చెందిన మానితా హాంగ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో జూలియా రస్సెల్ ఎంపికయ్యారు. మాల్డోవాకు చెందిన మికాయెలా నికోలాలేవ్ను ఏంజెలినా చిటైకా భర్తీ చేశారు. కొంతకాలం విరామం తర్వాత ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో తిరిగి పాల్గొంటున్న దేశాల్లో స్విట్జర్లాండ్, అల్బేనియా, ఆర్మేనియా, ఈక్వటోరియల్ గినియా, కిర్గిజిస్తాన్, లాట్వియా, నార్త్ మాసిడోనియా, సూరినామ్, బ్రిటిష్ వెర్జిన్ ఐలాండ్స్, జాంబియాలు ఉన్నాయి. (చదవండి: మిస్ వరల్డ్ ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్.) -
ఆ వ్యసనం నుంచి మా అబ్బాయి బయటపడగలడా..?
డాక్టర్ గారూ, మా అబ్బాయిని అగ్రికల్చరల్ బి.ఎస్సి. కోసం మహారాష్ట్రకి పంపాం. మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కాలేజీకి వెళ్ళకుండా రూమ్లోనే ఉంటున్నాడని, తిండి సరిగ్గా తినట్లేదని, బాగా వీక్ అవుతున్నాడని వాడి ఫ్రెండ్స్ చెపితే చూడడానికి వెళ్ళాము. చూసి షాక్ అయ్యాం. జుట్టు, గడ్డం బాగా పెంచుకొని స్నానం కూడా చేయకుండా మాసిన బట్టలు వేసుకొని ఉన్నాడు. రూమ్ చిందర వందరగా ఉంది. అతన్ని అక్కడ నుండి కోదాడకి తీసుకొచ్చేశాము. ఇంటికి వచ్చాక కూడా రూమ్లో తలుపులు వేసుకునే ఉంటున్నాడు. పదే పదే చెప్తే గాని బ్రష్, స్నానం చేయడం లేదు. మంచిగా రెడీ అవ్వాలనే ఆలోచనే లేదు. మా చుట్టాలబ్బాయితో బయటకి వెళ్ళి తిరిగి రమ్మంటే ఇంటరెస్ట్ లేదంటాడు. మావారు తనతోపాటు షాపుకి రమ్మంటే రాలేను అంటాడు. ఒక్కడే బయటకి వెళ్ళి వస్తాడు. సిగరెట్లు విపరీతంగా తాగుతున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు గంజాయి కూడా తీసుకునే వాడని, ఇక్కడ కూడా కొంతమంది ద్వారా గంజాయి తెప్పించుకొని తాగుతున్నాడనీ తెలిసింది. మేము ఏదైనా గట్టిగా చెప్పాలని చూస్తే మా మీదికి కొట్టడానికి వస్తాడు. లేదా తలుపులు వేసుకొని రూమ్లో పడుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. అబ్బాయి చదువుకొని బాగు పడతాడు అనుకుంటే ఇలా తయారయ్యాడు. అసలు మా ఇంటా వంటా ఇలాంటి జబ్బులు లేవు. ఏం చేయాలో మాకు అర్ధం కావట్లేదు. దయచేసి సహాయం చేయగలరు.– కవిత, కోదాడ మీరు చెప్పిన లక్షణాలని బట్టి చూస్తే మీ అబ్బాయి గంజాయి తాగడం వలన వచ్చే ‘ఎమోటివేషన్ సిండ్రోమ్’ అనే ఒక తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నాడని అర్థం అవుతోంది. గంజాయి తాగేవారిలో కొన్నాళ్ల తర్వాత మెదడుని ఉత్తేజపరిచే భాగాలు పూర్తిగా చచ్చుబడిపోతాయి. భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాల్లో రసాయనాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీనివల్ల వారిలో జీవితంలో ఎలాంటి మోటివేషన్ ఇంటరెస్ట్ లేకుండా తయారవుతారు. ‘ఏకాగ్రత తగ్గి, మతిమరుపు సమస్య వస్తుంది. దాంతో చదువులో ఫెయిల్ అవుతారు. కెరీర్లో వెనక బడతారు. ఇది క్లిష్టమైన మానసిక సమస్య అయినప్పటికీ దీన్ని ట్రీట్ చేయడం అసంభవమైతే కాదు! రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి మందులు, కౌన్సెలింగ్, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవాటు చేయడం ద్వారా తిరిగి తనలో ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంపొందించవచ్చు. ఐతే గంజాయి వలన మెదడులో వచ్చే మార్పులు చాలా గాఢంగా ఉంటాయి కాబట్టి ఈ మార్పు రావడానికి చాలా సమయం పడుతుంది. చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారని తెలిసినా కూడా, వాళ్ళే మెల్లిగా మానేస్తారులే అనుకుంటారు. సిగరెట్, మందుతో పోల్చినప్పుడు గంజాయి వలన వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసిన వెంటనే సైకియాట్రిస్ట్ని కలవడం ముఖ్యం. లేదంటే ఇలా ‘ఎమోటివేషన్ సిండ్రోమ్’, సైకోసిస్ లాంటి సమస్యల బారిన పడి తమ జీవితం నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీ అబ్బాయిని మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయించండి. తప్పకుండా మళ్ళీ మాములు మనిషి అవుతాడు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com) (చదవండి: ఓఆర్ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..? హెచ్చరిస్తున్న నిపుణులు) -
కొత్త బట్టలు అలానే ధరించేస్తున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా మనం షాపింగ్కి వెళ్లి కొత్తగా బట్టలు కొనుగోలు చేసి వెంటనే వేసుకుని చూస్తాం. పైగా అవి మనకు సరిగ్గా సరిపోయిందో లేదని ట్రయల్ రూంలో వెళ్లి మరి చెక్ చేస్తాం. ఆ తర్వాత ఇంటికి తెచ్చుకుని నేరుగా ధరించేస్తాం. ఇది సర్వసాధారణం. చాలామటుకు అందరు ఇలానే చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన బట్టలను కొందరు దేవుడి వద్ద పెట్టి అలానే వేసుకుంటాం. కానీ అలా వేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు చర్మ నిపుణులు. కొన్ని కొత్త బట్టలు వాటికి ఉపయోగించే రసాయనాల రీత్యా అలా కొత్త బట్టలను నేరుగా ధరించొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అలా అనడానికి రీజన్ ఏంటో చూద్దామా..!.స్టైలిష్గా ఉండే దుస్తులు ధరించడం నేటి యువత ట్రెండ్. అందుకోసం సరసమైన ధరల్లో లభించే బజార్లు తెలుసుకుమని కొంటున్నారు. కొందరు బ్రాండ్వి కొనుగోలు చేయగలరు. మరికొందరు వన్ప్లస్ టు ఆఫర్లు లేదా కాస్త తక్కువ ధరకు దొరికే చోట కొనుగోలు చేస్తుంటారు. అయితే అలానే ఒక కుర్రాడు బట్టలుకొని నేరుగా ధరించాడు. అంతే ఒక్కసారిగా అలెర్జీల ఒంటిమీద ఎర్రటి పొక్కులు వచ్చేశాయి. అందరిలానే కొత్తగాకొన్నవే కదా అని వేసుకున్నాడు. కానీ దాని వల్ల అతడు బాడీ అంత ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి..దారుణంగా తయారైంది. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ పోస్ట్పై డెర్మటాలజిస్ట్లు స్పందించారు. అతడి పరిస్థితిని మొలస్కం కాంటాజియోసమ్ అనే అంటువ్యాధి అని అన్నారు. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్గా నిర్థారించారు. ఈ మధ్య రెట్రో ఫ్యాషన్ ఓ ట్రెండ్గా మారింది. అంతేగాదు పర్యావరణ హితంగా రీసైకిల్ చేసిన పాత బట్టలను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అలాంటివి కూడా కొన్నవెంటనే నేరుగా ధరిస్తే ఇలాంటి ప్రమాదమే ఎదురవుతుందని అన్నారు. అంతేగాదు కొన్న వెంటనే ఎలాంటి బ్రాండెడ్ బట్టలైన ఉతికి ధరిస్తేనే మంచిదని సూచించారు. ఎందుకంటే ఆయా ఫ్యాబ్రిక్ల రంగుల కోసం ఉపయోగించే గాఢ రసాయనాలు.. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు న్యూయార్క్కి చెందిన వైద్య నిపుణుడు. అలాగే ఇలాంటి అవాంఛిత చర్మ సమస్యలను నివారించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన స్టైలిష్వేర్ అయినా ఒక్కసారి వాష్ చేశాక ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు.గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఓఆర్ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..? హెచ్చరిస్తున్న నిపుణులు) -
ఓఆర్ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..?
ఎండలు మండుతున్నాయి, చిన్నారులు అనేక మంది డీ హైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు యధాలాపంగా ఎంచుకునే ఓఆర్ఎస్ పరిష్కారం ప్రమాదకరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) పేరిట చక్కెర అధికంగా ఉండే పానీయాలను నమ్మడం మానేయాలని సూచిస్తున్నారు. తప్పుదారి పట్టించే మార్కెటింగ్ పద్ధతుల వల్ల పిల్లల మరణాలకు కూడా దారి తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ముందున్నారు హైదరాబాద్కి చెందిన సీనియర్ శిశువైద్యురాలు ప్రథమ చికిత్స శిక్షకురాలు శివరంజని సంతోష్ ఎలక్ట్రోలైట్ డ్రింక్గా విక్రయించినప్పటికీ, ఇది విరేచనాల సమయంలో రీహైడ్రేషన్కు తగినది కాదనీ తయారీదారులు పిల్లల వైద్యులతో కుమ్మక్కై, ఇది నిజమైన పరిష్కారం అనే అభిప్రాయాన్ని కలిగించారనీ ఆమె వెల్లడించారు. వాస్తవానికి, ఇది శీతల పానీయాలు పండ్ల రసాలతో పోల్చదగిన చక్కెర స్థాయిలను కలిగి ఉంటుందనీ దీనివల్ల సోడియం కంటెంట్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంటుందన్నారామె ‘చాలా మంది పిల్లల విరేచనాలు తీవ్రమవుతున్నాయని నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈ బ్రాండెడ్ ఉత్పత్తి ఓఆర్ఎస్ కాదని గ్రహించాం‘ అని ఆమె చెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్య హెచ్ ఒ )ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)కు ఉండాల్సినవిగా సిఫార్సు చేస్తున్న ప్రమాణాల ప్రకారం ఇవి ఉండడం లేదు. దీనికి విరుద్ధంగా పలు ఔషధ సంస్థలు మార్కెట్లో విక్రయించే కొన్ని ప్యాకెట్లలో లీటరుకు దాదాపు 120 గ్రాముల చక్కెర ఉంటుంది, అందులో 110 గ్రాములు అదనంగా కలిపిన చక్కెర. వాటిలో లీటరుకు 1.17 గ్రాముల సోడియం, 0.79 గ్రాముల పొటాషియం, 1.47 గ్రాముల క్లోరైడ్ కూడా ఉన్నాయి. ‘‘ఓఆర్ఎస్ అనేది లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఒక ప్రాణాలను రక్షించే చికిత్స. కానీ ఇప్పుడు మనం ఆ లేబుల్ను దుర్వినియోగం చేసి అధిక చక్కెర పానీయాలను విక్రయించే ఉత్పత్తుల పెరుగుదలను చూస్తున్నాము, ఇవి వాస్తవానికి విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి,‘ అని శివరంజని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఫార్ములా కంటే 6 నుంచి 10 రెట్లు ఎక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉన్నప్పటికీ, అనేక ప్రసిద్ధ బ్రాండ్లు వీటిని రీహైడ్రేషన్ సొల్యూషన్లుగానే భ్రమింపజేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నాయని డాక్టర్ శివరంజని పేర్కొన్నారు. ఫార్మసీలలో అందుబాటులో ఉంటూన్న ఈ ఉత్పత్తులను సాధారణంగా డెంగ్యూ టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకు సంబంధించిన డీహైడ్రేషన్ కోసం సిఫార్సు చేయడం జరుగుతోంది.అయితే ఇవి చికిత్సా ఉత్పత్తులను నియంత్రించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ) నుంచి కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) దగ్గర మాత్రమే అనుమతి పొందడం గమనార్హం. వైద్య నిపుణుల ఒత్తిడి మేరకు,గత 2022లో అటువంటి చక్కెర–భారీ పానీయాల వాడకాన్ని నిషేధించడం జరిగింది. అయితే, నియంత్రణ సంస్థ అదే సంవత్సరం జూలైలో తమ నిర్ణయాన్ని సవరించింది, తయారీదారులు ‘‘ఇది ఓఆర్ఎస్ కాదు’’ అని రాసి ఉత్పత్తులను కొనసాగించడానికి అనుమతించింది, ‘‘ చాలా మంది తల్లిదండ్రులు, కొంతమంది వైద్యులు కూడా ప్యాకేజింగ్ ద్వారా తప్పుదారి పడుతున్నారు. ఈ పానీయాలు నిరుపయోగం మాత్రమే కాదు, అనారోగ్యంతో ఉండే చిన్నారులకు మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరమైనవి, ’’అని డాక్టర్ శివరంజని హెచ్చరించారు. అటువంటి ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం, ఆసుపత్రి రిటైల్ ఫార్మసీల నుంచి వాటిని తొలగించడం డీహైడ్రేషన్ చికిత్సకు డబ్లు్యహెచ్ఓ ఆమోదించిన ఫార్ములేషన్లను ఏకైక ప్రమాణంగా అమలు చేయడం వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరుతున్నారు.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!) -
మెగా గుమ్మడి!
దక్షిణాఫ్రికాలోని కల్లినన్ ప్రాంత రైతు సంఘం ప్రతి ఏటా గుమ్మడికాయల పోటీ పెడుతుంటుంది. కార్నెలి బెస్టర్ అనే రైతు ఈ ఏడాది 445 కిలోల గుమ్మడి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. ఈ అవార్డు ఆయనకు కొత్త కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవటం విశేషం. ఏడాదిలో అతిపెద్ద గుమ్మడి సైజు అంత ఎందుకు తగ్గిందో తెలీదు. బహుశా భూతాపోన్నతి కావచ్చు. అదలా ఉంచితే, 2023లో ఇంకా బరువైన గుమ్మడి కాయను పండించిన వైకస్ లాంప్రెచ్ట్ విజేతగా నిలిచారు. ఆయన గుమ్మడి కాయ బరువెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.. 890 కిలోలు! వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ఈ వార్షిక ΄ోటీలు పెడుతుంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు! (చదవండి: దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..) -
దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..
విదేశీ ట్రెండు నుంచి సీజనల్గా వచ్చే పండు దాకా కాదేదీ మిక్సింగ్కు అనర్హం అంటున్నారు నగర నలభీములు. అసలే మామిడి సీజన్ అందులోనూ వెరైటీలు కోరుకునే నగరవాసులు.. ఇంకేం ఉంది.. నగరంలోని రెస్టారెంట్స్, కేఫ్స్, పార్లర్స్.. మ్యాంగో మానియాతో ఊగిపోతున్నాయి. పోటా పోటీగా మామిడిని రకరకాల వంటకాలకు జతచేస్తూ మెనూలను రూపొందిస్తున్నాయి. ఆ విశేషాలు ఇవిగో.. జూబ్లీ హిల్స్లోని లిల్లీస్ – ది బోహో కేఫ్ మామిడి ఆధారిత డెజర్ట్స్ను అందిస్తోంది. అలాగే కొబ్బరి పాలు, తాజా మామిడి ముక్కలు, హోమ్మేడ్ గ్రానోలాతో మామిడి చియా పుడ్డింగ్ను వడ్డిస్తోంది. బ్రియోష్ బ్రెడ్, మామిడి కంపోట్, కొబ్బరి క్రీమ్తో మామిడి ఫ్రెంచ్ టోస్ట్తో నోరూరిస్తోంది. అరటి, ఖర్జూరాలతో తయారు చేసిన మామిడి స్మూతీ బౌల్, మామిడి ఫ్రాప్పే, మామిడి ప్యాషన్, ఫ్రూట్ కూలర్ వంటి పానీయాలు కూడా అందుబాటులోకి తెచ్చింది. పదుల సంఖ్యలో.. బంజారా హిల్స్లోని ఖండానీ రాజధాని ‘ఆమ్లీíÙయస్’ పేరిట అందిస్తున్న ఫుడ్ ఫెస్టివల్లో పదుల సంఖ్యలో మామిడి వంటకాలు కొలువుదీరాయి. కైరీ చనా దాల్ ధోక్లా, మామిడి కోఫ్తా పులావ్, మలబారి మామిడి కఢీ, మామిడి పచ్చడి, మామిడి రైతాలతో పాటుగా మామిడి జిలేబి, మామిడి బాసుందీ వంటి డెజర్ట్స్ కూడా ఇందులో భాగమే. నాన్వెజ్ స్టార్టర్స్లో.. గచ్చిబౌలోని 3.63 డిగ్రీస్ సమర్పిస్తున్న ‘మామిడి మానియా’ ఫెస్టివల్లో మామిడి చికెన్ వింగ్స్, మామిడి ల్యాంబ్ చాప్స్, మామిడి క్రిస్పీ ఫిష్ వంటి స్టార్టర్లు. మామిడి దాల్, మామిడి అనాస పులావ్, మామిడి చికెన్ కర్రీ వంటి వాటితో మెయిన్ కోర్సులు, ఆమ్రస్ ఫౌంటెన్తో కూడిన డెజర్ట్స్ అందిస్తోంది. డెజర్ట్స్, మెయిన్ కోర్సులు.. జూబ్లీహిల్స్లోని ప్యూర్ వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ తత్వాలో.. ఆమ్రఖండ్, మామిడి మిలే ఫ్యూయిల్, మామిడి కులీ్ఫ, మామిడి టార్ట్ వంటి తీపి రుచులను అందిస్తున్నారు. మాధాపూర్లోని వెస్టిన్ హోటల్ అందిస్తున్న ‘మామిడి బ్రంచ్’లో మామిడి గిలాఫీ, మాహీ అండ్ కచ్చే, మామిడి సుషీ, మామిడి చికెన్ సౌవ్లాకీ వంటి స్టార్టర్లు. మామిడి క్రేప్స్, దసేరి ఆమ్, ముర్గ్ కే పసందే, మామిడి చికెన్ సౌవ్లాకీ వంటి మెయిన్ కోర్స్లు ఉన్నాయి. అలాగే మామిడి స్రూ్టడెల్, మామిడి గటో, మామిడి శ్రీఖండ్, మామిడి పాయసం వంటి డెజర్ట్స్..ను సర్వ్ చేస్తోంది. డియరెస్ట్..డెజర్ట్స్.. మెయిన్ కోర్సు పూర్తయ్యాక డెజర్ట్స్ తినడం అలవాటుగా మారింది. మామిడిని మేళవిస్తూ అనేక డెజర్ట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చారి్మనార్ ప్రాంతంలోని మిలన్ జ్యూస్ సెంటర్లో రుచికరమైన మ్యాంగో మలాయ్, కోఠిలోని జోకొలెట్ కొత్తగా పరిచయం చేసిన మ్యాంగో డెజర్ట్, జూబ్లీహిల్స్లోని టారో రెస్టారెంట్లో శాఫ్రోన్ మ్యాంగో స్టిక్కీ రైస్, జూబ్లీహిల్స్లోని స్పైసీ వెన్యూ అందిస్తున్న మంగమ్మ మామిడి పుడ్డింగ్, టెగర్ లిల్లీ కేఫ్ బిస్ట్రో అందిస్తున్న మామిడి రసమలై ఫ్రెంచ్ టోస్ట్, బంజారాహిల్స్లోని ఫెరానోజ్లో మామిడి క్రోసెంట్ ఫ్రెంచ్ టోస్ట్.. ఇలా నగరం నలుమూలలా మామిడి తియ్యదనం పరుచుకుని దిల్ మ్యాంగో మోర్ అనిపిస్తోంది. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో అంతో ఇంతో వంటకాలకు కలపడం సాధారణమే కానీ.. మ్యాంగో సీజన్లో భోజన ప్రియుల అభిరుచికి అనుగుణంగా మామిడి ఆధారిత వంటకాలను కలిగి ఉన్న ప్రత్యేక మెనూలను సిటీ వంటశాలలు తయారు చేస్తున్నాయి. స్టార్టర్స్తో మొదలుపెట్టి మెయిన్ కోర్స్, డిజర్ట్స్ దాకా.. ఆఖరికి సలాడ్లు కూడా వైవిధ్యభరిత వంటకాలెన్నో సిటీ రెస్టారెంట్స్లో సందడి చేయడం ఈ సారి విశేషంగా చెప్పొచ్చు. (చదవండి: కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..! దొరికితే ఆస్వాదించేయండి..) -
వారిపై క్రిమినల్ కేసు వేయచ్చు
కొన్ని సంవత్సరాల క్రితం నగర శివార్లలో కొత్తగా ఏర్పడనున్న కాలనీలో ఒక భూమి కొని రిజిస్టర్ చేసుకున్నాను. కాలనీలో చాలామంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. మేము ఇల్లు కడుతుంటే కొందరు స్థానికులు వచ్చి మా స్థలాన్ని వాళ్లకు అమ్మేయమని బలవంతపెట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ‘‘మీరు దళితులని తెలియక భూమిని అమ్మాము. మీవల్ల పక్క ప్లాట్లకు ధర తగ్గుతుంది. కాలనీలో మీరు ఒక్కరే దళితులు. ప్రస్తుత మార్కెట్ ధర ఇస్తాము వెళ్లిపొండి’’ అన్నారు. మేము వినలేదని, కక్ష సాధింపుగా మాది అక్రమ కట్టడం అంటూ అధికారులకు ఫిర్యాదు చేసి ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ అధికారులు కూడా వారితో కుమ్మక్కయ్యారు. మాకు అర్థంలేని నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మాకు తగిన సలహా ఇవ్వగలరు.– వీరన్న స్వామి, హైద్రాబాద్ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా కుల వివక్ష చూడటం, అందులోనూ హైదరాబాద్ వంటి మహా నగరాలలో కూడా వివక్ష ఇంకా ఉండటం బాధాకరం. ఇటీవలే మీ లాంటి ఒక కేసు చూశాను. మీరు ముందుగా పోలీసులని ఆశ్రయించి సదరు వ్యక్తులపై ఎస్.సి. ఎస్.టి. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయండి. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 (జ)–(జ) ప్రకారం ఎస్.సీ – ఎస్.టి.ల ఆస్తిని గానీ, వారికి కేటాయించిన భూములను గానీ, నివాసముంటున్న స్థానాన్ని గానీ అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, లేదా అక్రమంగా వారి పేరు తొలగించడం – అలాగే వారి సంపదలో, నీటి సరఫరాలో, వ్యవసాయ దిగుబడి మొదలగు అంశాలలో జోక్యం చేసుకోవడం, వారి ఆస్తులకు భంగం కలిగించడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలు అధికార దుర్వినియోగం చేసే ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తాయి. అవసరమైతే, మీ హక్కులకు భంగం కలిగించే విధంగా మునిసిపల్ అధికారుల పాత్ర ఉంటే సదరు అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. ఎస్.సి. – ఎస్.టి. చట్టం చాలా పటిష్టమైనది. ఎన్నో తప్పులు – అందుకు తగ్గ కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కేసు ఏదైనా, కేవలం ‘‘కులం పేరుతో దుర్భాషలాడారు’’ అని మాత్రమే కేసులు పెట్టడం సర్వసాధారణం ఐపోయింది. అది తప్పు. ఈ చట్టం ప్రకారం మీరు ఒక న్యాయ సలహాదారు/సామాజిక కార్యకర్తను మీ వెంట పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్ళవచ్చు. అది మీ హక్కు. సరైన రీతిలో కేసు నమోదు చేస్తే మీకు ఖచ్చితమైన న్యాయం దొరుకుతుంది. క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా మునిసిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు కాబట్టి వారిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. మీ కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత లాయర్ సలహా మేరకు సివిల్ కోర్టును ఆశ్రయించాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. – శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..) -
సివిల్స్లో ఇల్లాలి అపూర్వ విజయం..! వైకల్యాన్ని జయించి..
ఇరవైలలో సివిల్స్కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా మాత్రం 35వ యేట ప్రిపరేషన్ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్కు సిద్ధం అవుతున్నప్పుడు... ‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్లో సక్సెస్ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్ ప్రిపరేషన్లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైమ్ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా. (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..) -
ఫ్యామిలీ ట్రీ తయారు చేద్దామా..?
అలెక్స్ హేలీ రాసిన ‘ఏడు తరాలు’ చాలా ప్రసిద్ధం. ఇప్పటి పిల్లలు కనీసం మూడు తరాలు తెలుసుకుని ఉన్నారో లేదో. దాయాదుల సంగతి తర్వాత. మేనత్తలు, మేనమామలు, పిన్ని, బాబాయి... ఈ రక్తానుబంధం పిల్లలకు తెలియచేయాలి. తల్లి తరఫు తాత, తండ్రి తరఫు తాత అక్కడి నుంచి సాగిన కొమ్మలు రెమ్మలు ఈ వంశ వృక్షం తెలియాలి. మూలాలు తెలిసిన ప్రయాణం అర్థవంతమైనది. ఈ వేసవిలో పిల్లల చేత ఫ్యామిలీ ట్రీ తయారు చేయించండి. వారితో మీరు తయారు చేయించే చార్టు నిధి పటానికి తక్కువ కాదు.పిల్లలకు ఊహ తెలిశాక ‘అమ్మా... నేను ఎక్కడి నుంచి వచ్చాను?’ అనే ప్రశ్న అడుగుతారు. పిల్లలకు తమ జన్మ మూలాలే కాదు జన్మకు కారణమైన వారి మూలాల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకూ ప్రతి ఇంట్లో పెద్దవాళ్ల ఫొటోలు గోడలకు వేలాడుతుండేవి. పిల్లలు ఎదుగుతూ ఆ ఫొటోల్లో ఉన్నది తమ పెద్దవారని తెలుసుకునేవారు. జేజి నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య... వీళ్లను ఫొటోల్లో చూసి తెలుసుకునేవారు. రాను రాను ‘ఇంటీరియర్స్’లో భాగంగా ఈ ఫోటోలకు పెద్దగా చోటు లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ‘ఫ్యామిలీ ఆల్బమ్స్’ ఉండేవి. అవి తెరిచి వాటిని చూస్తూ ఉంటే రక్త సంబంధీకులందరూ తెలిసేవారు. డిజిటల్ యుగం వచ్చాక ఆల్బమ్లు కూడా పోయాయి. ఉమ్మడి కుటుంబాలుంటే ఒకరు చెప్పక΄ోయినా మరొకరైనా పెద్ద వాళ్ల గొప్పతనాలు, ఘనతలు, పడిన కష్టాలు పిల్లలకు తెలియచేసేవారు. ముత్తాత, తాతలు అంత కష్టపడి, అన్ని గొప్ప పనులు చేశారు... నేను వారి పేరు నిలబెట్టాలి అని పిల్లలకు తెలిసి వచ్చేది. కాని ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలూ లేవు. వాస్తవం చెప్పాలంటే నేడు చాలా ఇళ్లల్లో పిల్లలకు అమ్మమ్మలు, నానమ్మలు అతి కష్టం మీద తెలుస్తున్నారు. మనిషికి ఒంటరితనం అనుమతి లేదు. ప్రకృతి అలా అంగీకరించదు కనుకే కుటుంబాన్ని ఇచ్చింది. బంధు పరివారాన్ని ఇచ్చింది. నూరేళ్లు జీవించాలంటే ఎన్ని సందర్భాలలోనో ఎందరి తోడో అవసరం. మనకంటూ నిలబడేది మనవారే అనే భావన పిల్లలకు రావాలంటే వారికి ‘వంశ వృక్షం’ తెలియాలి. పెద్దవాళ్లూ... గమనించండి... నేడు పిల్లలకు లోకేశ్ కనకరాజ్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ యూనివర్స్ తెలుస్తున్నాయిగాని... సొంత ఫ్యామిలీ యూనివర్స్ తెలియడం లేదు. అందుకని ఈ సమ్మర్లో ఒక ప్రాజెక్ట్ వర్క్లాగా వారి చేత ఫ్యామిలీ ట్రీని గీయించండి.చార్టులూ, నోట్బుక్కులూ:ఫ్యామిలీ ట్రీని చార్టు మీద తయారు చేయడం ఆనవాయితీ. అంత పని వారు చేయలేక΄ోయినా ఒక నోట్బుక్ ఇచ్చి పేజీకి ఒక ఫ్యామిలీ రాయించి కూడా వారికి ఫ్యామిలీ ట్రీని తెలియచేయనివ్వ వచ్చు. వారి చేత ఇలా ఫ్యామిలీ ట్రీ తయారు చేయించండి. 1. మొదట సొంత ఇంటి చెట్టు గీయించండి. నేనూ, తమ్ముడు, అమ్మా, నాన్నా. అమ్మా నాన్నలు చెట్టు కాండమైతే కొమ్మలు పిల్లలు.2. మరోరోజు ఇంకొంచెం పెద్ద చెట్టు గీయించండి. ఈ చెట్టులో నాన్న తల్లిదండ్రులు, అమ్మ తల్లిదండ్రులు వస్తారు.3. మూడోరోజు మరికాస్త పెద్ద చెట్టు గీయించి ముత్తాతల వరకూ పేర్లు రాయించాలి. దీంతో ప్రాథమిక వంశ వృక్షం పూర్తయినట్టే. ఇక్కడి నుంచి పిల్లల అవగాహనను బట్టి శాఖలు విస్తరించుకుంటూ వెళ్లాలి.పెద తాత, చిన తాతతాతల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉంటారని వారూ వారి పిల్లలు మనకు దగ్గరి బంధువులు అవుతారని చెప్పాలి. అలాగే నానమ్మ, అమ్మమ్మల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉంటారని చెప్పాలి. వాళ్లల్లో ఇప్పుడు అందరూ పిల్లలకు పరిచయంలో లేకపోవచ్చు. కాని కొందరు ఉంటారు. వారు ఫ్యామిలీట్రీలో ఎక్కడ చేరుతారో గీయించాలి.తక్షణ తరంపిల్లలకు తక్షణమే అనుబంధంలో ఉండాల్సిన వారు పెదనాన్న, చిన్నాన్న, మేనత్తలు వారి పిల్లలు. ఈ ట్రీని ఒకటి తయారు చేయించాలి. అలాగే పెదమ్మ, పిన్ని, మావయ్య... వీరూ వీరి పిల్లలు. ఈ ట్రీ కూడా తెలియాలి. వీరందరి పిల్లల గ్రూప్ను ఒకటిగా చెట్టు మీద చిటారు కొమ్మల్లో రాయించవచ్చు.సాయాలూ, ప్రేమలూ:ఫ్యామిలీ ట్రీలో వరుసలు తెలిస్తే సరిపోదు. ఆ రక్త సంబంధీకులంతా ఒకరి కోసం ఒకరు ఎలా నిలబడ్డారో ఏ సమయంలో ఎవరు సాయం చేశారో, ఎవరు ఎలాంటి ప్రేమను ప్రదర్శించారో పిల్లలకు చె΄్పాలి. తెగిన బంధాల గురించి వాటిపై ఉన్న కోపాల గురించి పిల్లలకు చెప్పకపోవడమే మంచిది. ‘రేపు మీరు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసినా ఎక్కడ ఉన్నా మీ వాళ్లు ఎవరో వారు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలి. మంచి చెడుల్లో పాల్గొనాలి. కమ్యూనికేషన్లో ఉండాలి’ అని గట్టిగా చెప్పాలి. రోజులు, ప్రపంచం టఫ్గా మారుతున్నప్పుడు పిల్లలకు బలగం ఉందన్న భరోసా ఫ్యామిలీ ట్రీ ఇస్తుంది. ఆ చెట్టు పచ్చగా ఉండేలా చూడండి.ఫస్ట్–ఉమన్ దుఃఖాన్ని జయించి...ప్రతిష్ఠాత్మకమైన ‘మిచెలిన్ స్టార్’ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఫిమేల్ ‘సుషీ చెఫ్’గా పారిస్కు చెందిన 54 ఏళ్ల చిజుకో కిమురా రికార్డ్ సృష్టించింది. నిజానికి ఆమె అనుకోని పరిస్థితుల్లో చెఫ్గా మారాల్సివచ్చింది. కిమురా భర్త షునై చెఫ్. మూడు సంవత్సరాల క్రితం రెస్టారెంట్ ప్రారంభించి తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. ఆ రెస్టారెంట్ విజయవంతం అయింది. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవ లేదు. భర్తకు క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో చిజుకో కిమురాకులు పోలేదు. ఆ విషాదం నుంచి తేరుకొనక ముందే భర్త చనిపోయాడు. ఏడుస్తూ కూర్చోవడం కంటే భర్త కలను నెరవేర్చడమే ముఖ్యం అనుకుంది.ఒకప్పుడు టూర్ గైడ్గా పనిచేసిన కిమురాకు రెస్టారెంట్ వ్యవహారాలు, వంటల గురించి బొత్తిగా తెలియదు. ఒక్కటొక్కటిగా భర్త నుంచి నేర్చుకుంది. భర్త లేక΄ోయినా ఆయన నేర్పిన విద్య తనకు తోడుగా ఉంది. ఆ విద్య తనను తిరుగులేని చెఫ్ని చేసింది. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. (చదవండి: భారతీయ హస్తకళకు అర్థంపట్టే డిజైనర్వేర్లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..) -
Met Gala 2025: స్టైలిష్ డిజైనర్వేర్లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
ప్రతిష్టాత్మకమైన మెట్గాలా 2025 ఈవెంట్లో బాలీవుడ్ తారలంతా తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్ అటెన్షన్ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్గాలా ఈవెంట్కే హైలెట్గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్ వేర్లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్ ఫ్యాషన్తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్ గాలా ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్లో భారతీయ ఫ్యాషన్ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్. స్టైలిష్ డ్రెస్లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్ని రూపొందించారు. టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్లో అత్యంత స్టైలిష్ లుక్లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్ అనామిక ఈ డ్రెస్కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్లా డిజైన్ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్ వేర్కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్ లుక్లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్గాలాకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్వేర్లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్ థీమ్ "సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..) -
వరల్డ్ బెస్ట్ ఇండియన్ మద్యం బ్రాండ్.. ఫుల్లు రూ. 2వేలే!
భారతీయులు స్వభావ సిద్ధంగా బలమైన, గాఢమైన రుచులను రంగులను ఇష్టపడతారు అందుకేనేమో మన దేశంలో మద్యం వినియోగంలో విస్కీ, బ్రాండీ, రమ్, బీర్ లకే ఎక్కువ డిమాండ్. అయితే విస్కీ, బ్రాందీ, రమ్లకు బ్రిటిష్ పాలన నాటి నుంచే ఆదరణ బాగా ఉంది. ముఖ్యంగా విస్కీ,ఎప్పటి నుంచో మద్యం ప్రియులకు ప్రధాన ఎంపికగా నిలిచింది. రమ్ బ్రాందీ విస్కీలు అందరికీ అందుబాటు ధరలలో సులభంగా లభించే మద్యం రకాలుగా మారాయి.వోడ్కా కూడా ఇటీవలి కాలంలో పుంజుకుంటుండగా. వీటన్నింటి తర్వాత స్థానం వైన్కు దక్కింది. అయితే మన దేశంలోని మద్యపాన ప్రియుల్లో అనేకమంది దాదాపుగా మర్చిపోయిన ఒక మద్యం వెరైటీ ఒకటి ఉంది అది జిన్. లైట్ కలర్లో, సున్నితమైన రుచులతో ఉండటంతో, భారతీయ అభి‘రుచుల’ను అది అంతగా సంతృప్తి పరచలేకపోయింది. అంతేకాకుండా జిన్ గురించి ప్రచారం కూడా తక్కువే. అందుకే చాలా మందిలో జిన్ ను ఎలా తాగాలో, ఏ కాక్టెయిల్స్లో ఉపయోగించాలో అవగాహన లేకపోయింది. దాంతో పెద్దగా ఎవరూ పట్టించుకోని రకంగా జిన్ మిగిలిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న గ్లోబల్ కాక్టెయిల్ కల్చర్ జిన్ వినియోగానికి ఊపునిస్తోంది. తరచుగా కాక్టెయిల్స్లో కలుపుకుని జిన్ను సేవించడం ఓ ప్రత్యేకమైన వెస్ట్రన్ డ్రింకింగ్ కల్చర్. ఇలాంటి శైలి ఇప్పుడ మను నగరాల్లో మాత్రమే క్రమంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ దాన్, హాపుసా వంటి భారతీయ క్రాఫ్ట్ జిన్ల ఆవిర్భావంతో, నగరాల్లో యువత, ప్రయోగాలకు వెరవని ఆల్కహాల్ ప్రియుల వల్ల జిన్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మన దేశానికి చెందిన ఒక జిన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్గా నిలిచింది. సాధారణంగా మన దేశీయ మద్యం రకాలు ప్రపంచ పోటీలో నిలవడం అరుదు. అలాంటిది ఏకంగా విజేతగా గెలుపొందడం చెప్పుకోదగిన విషయమే. భారతదేశంలో తయారైన జిన్ బ్రాండ్ ’జిన్ జిజి’ ఇటీవల లండన్లో నిర్వహించిన పోటీల్లో ’స్పిరిట్ ఆఫ్ ది ఇయర్ 2025’ అనే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ పురస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ మద్యం ఉత్పత్తులకు ఇస్తారు. జిన్ జిజి గోవాలో తయారవుతుంది. ఇది హిమాలయ జునిపర్, తులసి, దార్జిలింగ్ టీ, క్యామొమైల్ వంటి భారతీయ సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన సుగంధాలు దీనికి ప్రత్యేకతను అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ మద్యం బ్రాండ్లకు గుర్తింపు తీసుకువచ్చిన జిన్ జిజి... ధర రూ.2వేల దగ్గర్లోనే ఉండడం కూడా మరో విశేషం. సాధారణంగా ఇలా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మద్యం బ్రాండ్స్ ధర కనీసం రూ.5వేల పైమాటే ఉంటుంది. అయితే జిన్ చోటా మోటా వైన్ షాప్స్లో దొరకకపోవచ్చు. డ్రింక్స్.ఇన్ వంటి వెబ్సైట్లలో ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం మద్యం దుకాణాల్లో కూడా లభించవచ్చు. -
కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!) -
మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!) -
జపాన్లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్లు స్టోర్స్లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..) -
గడ్డకట్టిన మంచుపై పరుగు పందెం..! సత్తాచాటిన భాగ్యనగరవాసులు
ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు? అరుదైన సాహసాలు చేయాలనే తపన ఉండాలే గానీ..అద్భుతాలు సృష్టించవచ్చు.. ఘనమైన ప్రతిభను పొందవచ్చు.. అంటున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన అడ్వెంచర్ టూరిస్టులు. నగరంలో సాహసికులు పెరుగుతున్న కొద్దీ వైవిధ్య భరిత సాహసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో నగరానికి చెందిన నలుగురు భిన్న రంగాలకు చెందిన ఔత్సాహికులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన పాంగోంగ్ ఫ్రోజెన్ లేక్లో హాఫ్ మారథాన్లో పాల్గొని హైదరాబాద్ నగరం నుంచి ఆ ఘనతను దక్కించుకున్నారు. లద్దాఖ్, ఫిబ్రవరి 24–25, 2025: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్గా ప్రసిద్ధి పొందిన పాంగోంగ్ ఫ్రోజెన్ సరస్సు మారథాన్ ఈ ఏడాది కూడా లద్దాఖ్లో ఘనంగా జరిగింది. ఇది కేవలం రన్నింగ్ ఈవెంట్ మాత్రమే కాకుండా, హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న హిమనీనదాలపై మరియు వాతావరణ మార్పుల ప్రభావంపై చైతన్యాన్ని పెంచే ప్రయత్నం కూడా. రన్ విశేషాలివీ.. హిమాలయాల్లో కరుగుతున్న హిమనీనదాలు, తగ్గుతున్న మంచు సరస్సుల వల్ల భవిష్యత్తు మార్పులపై అవగాహన కల్పించటం కోసం లద్దాఖ్లోని పాంగోంగ్ సరస్సులో 4,273 మీటర్ల ఎత్తులో 2023లో మొదటిసారి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్, గిన్నిస్ వరల్డ్ రికార్డులో ‘అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్’గా గుర్తింపు పొందింది. తాజా రన్లో అమెరికా, నేపాల్, కొరియా, ఆ్రస్టేలియా, భారత్కు చెందిన అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లు జరగకపోవచ్చని హెచ్చరిస్తూ, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ నిర్వహించే ఈ మారథాన్ను ‘ది లాస్ట్ రన్’ అని కూడా పిలుస్తారు. నగరానికి చెందిన ప్రవీణ్ గోయెల్, నవీన్ సింకా, బిక్కినా వెంకట రాజేష్ రతన్ నలుగురూ వేర్వేరు రంగాలకు చెందిన వారు. అయితే వీరంతా.. సమవయస్కులు కూడా కాదు. అయితేనేం.. అభిరుచి వారిని కలిపింది. ఆత్మవిశ్వాసం వారిని విజయ శిఖరాన నిలిపింది. ‘ఇంట్లో వాళ్లు వద్దనే చెప్పారు. కానీ.. అప్పటికే సైక్లింగ్, రన్నింగ్ వంటివి అలవాటయ్యాయి. అందుకే దీన్ని ప్రయత్నించడం భయం అనిపించలేదు’ అని చెప్పారు వ్యాపారి ప్రవీణ్గోయెల్. ‘16 డిగ్రీల చలిని పట్టించుకోకుండా కదులుతూ ఉండటానికి చేసిన మానసిక ప్రయత్నం..ఫలించింది. భయాన్ని అధిగమించడానికి సహాయపడింది’ అని భారత నావికాదళంలో అధికారిగా పనిచేసే రతన్ (29) చెప్పారు. ‘గత 15 సంవత్సరాలుగా మారథాన్ రన్నర్, బ్యాడ్మింటన్ ఆటగాడిగా అనుభవం ఉంది. అయినప్పటికీ ఇది పూర్తిగా ప్రత్యేకం అంటున్నారు ఐటీ నిపుణులు నవీన్ సింకా (45). పరుగులో మా ముఖాలు మొద్దుబారిపోయాయి. మా దగ్గర ఉన్న నీరు కూడా పరుగు మధ్యలో గడ్డకట్టుకుపోయింది’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘గ్లోబల్ వార్నింగ్ కారణంగా, పాంగోంగ్ త్వరలో గడ్డకట్టడం ఆగిపోవచ్చు’ అని మరో ఐటీ ప్రొఫెషనల్ (50) రాజేష్ చెప్పారు. ‘తనకు ఇది వ్యక్తిగత రికార్డ్ కన్నా ఎక్కువ అని, ఈ రన్లో ఇమిడి ఉన్న సందేశమే తనకు ముఖ్యమని అంటున్నారాయన. లాస్ట్ రన్ పేరు ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ.. దాని వెనుక అంతరార్థం మాత్రం ఆందోళనకరం’ అని చెప్పారు.విభిన్న నేపథ్యాల నుంచి..నావికాదళ అధికారి, కార్పొరేట్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్వేర్ నిపుణుడు, ఐటీ మారథానర్ – వంటి విభిన్న నేపథ్యాలున్నప్పటికీ, ఈ నలుగురూ అవరోధాలను అధిగమించి అనూహ్యమైన రికార్డు సాధించారు. నగరానికి తిరిగి వచ్చిన వారి ప్రయాణం కొత్త లక్ష్యాల దిశగా సాగనుంది. ఐరన్ మ్యాన్ గోవా అనే ఈవెంట్పై రతన్ తన దృష్టి పెట్టారు. కిలిమంజారోను అధిరోహించాలని నవీన్ యోచిస్తుంటే, రాజేష్ 6000+ మీటర్ల హిమాలయ శిఖరంపై సూపర్ రాండన్నూర్ సైక్లింగ్ హోదాను గురిపెట్టారు. పాంగోంగ్ నుంచి కొత్తగా ప్రేరణ పొందిన ప్రవీణ్ మరిన్ని సాహసాలను అన్వేషిస్తున్నారు.(చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..) -
16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..
హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 ‘ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ’ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో సోమవారం సందడి చేశారు. బంజారాహిల్స్లోని సింఘానియాస్ వస్త్ర దుకాణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ‘ఓపాల్ ఫర్ హర్’కు మద్దతుగా సింఘానియాస్ చీరలు, లెహంగాలను ధరించారు. తన ఫ్యాషన్ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!! గ్లోబల్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. అనూహ్యంగా.. మిస్ థాయ్లాండ్గా మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. నా జీవితంలో ఇదొక మిరాకిల్. తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ప్రోత్సాహాన్ని అందించిన థాయ్ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ వేదికపై విజేతగా నిలవడమే నా దేశానికిచ్చే రిటర్న్ గిఫ్ట్. పుట్టి పెరిగిందంతా థాయ్లాండ్ ఫుకెట్లో. విద్యాభ్యాసం అక్కడే చేశాను. ఉన్నత చదువులకు బ్యాంకాక్ వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. ఆ బాధ నాకు తెలుసు.. సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నాను. 16 ఏళ్ల వయసులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా నాన్ క్యాన్సరస్ లంప్ను తీసేశారు. ఆ అవస్థలు, వేదన నాకు భాగా తెలుసు. అందుకే.. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటాను. ముందస్తు చికిత్స–గుర్తింపు అవసరముంది. మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యం. మిస్ థాయ్లాండ్గా నా స్వరాన్ని వినిపిస్తున్నాను. ఇలాంటి సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపాల్ ఫర్ హర్’లో పాలుపంచుకున్నా. థాయ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. ప్రపంచానికి సేవచేస్తాను. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆతిథ్యం అదుర్స్.. ఎయిర్ పోర్ట్లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్ విశిష్టతల గురించి విన్నాను.. ఇది పెరల్ సిటీ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటాను. చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్కు కూడా వెళతాను. (చదవండి: 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! తండ్రి ఫెయిలైనా..తనయ సాధించింది..!) -
వేసవిలో కిచెన్ క్లాసెస్: అప్పుడే చిన్నారులు ఆహార నిర్భర్గా..
పిల్లలకు ట్రంప్, మస్క్, జుకర్బర్గ్ ఎవరో తెలుసు. ఆవాలు, గసగసాలు, మిరియాలు కూడా తెలియాలి. అబ్బాయిలు, అమ్మాయిలు వంట గదిలోకి రాకుండా చదువుకోవాలని భావించడం మంచిదేకాని ఉప్పుకూ చక్కెరకూ తేడా తెలియకపోతే కష్టం.12 ఏళ్లు వచ్చే సరికి తల్లికి వంటలో సాయం చేయడమే కాదు వంట గది రాజ్యాంగం పిల్లలకు పరిచయం కావాలి. పదహారేళ్లకు రొట్టెలు, అన్నం, రెండు రకాలకూరలు చేయడం వస్తే పిల్లలు ఎక్కడైనా ఆహార నిర్భర్గా ఉండగలరు.ఈ వేసవిలో కిచెన్ క్లాసెస్ మొదలుపెట్టండి. ‘కన్నా... ఫ్రిజ్లో నుంచి ఎగ్స్ తీసుకురా’ అన్నప్పటి నుంచి పాఠం మొదలవుతుంది. ఎగ్స్ను ఫ్రిజ్ నుంచి తెచ్చి పగలకుండా కిచెన్ ఫ్లాట్ఫామ్ మీద పెడితే పరీక్ష పాసైనట్టే. ‘రవ్వ ఏ డబ్బాలో ఉందో చూడు’ అన్నప్పుడు చిన్న స్టూల్ వేసుకుని కప్బోర్డ్ తెరిచి అన్ని డబ్బాలు పరీక్షించాల్సిందే. ఒకదానిలో తెల్లగా పొడి ఉంటుంది. అది గోధుమ పిండి. ఒకదానిలో లేత పసుపురంగు పొడి ఉంటుంది. అది శనగపిండి. ఒకటి తెరవగానే అమ్మో.. అది కారప్పొడి. చివరకు రవ్వ దొరుకుతుంది. బరకగా ఉండే ఆ రవ్వతో ఏం చేస్తారో పిల్లలకు తెలుసు. ఎలా చేయాలో తెలియాలంటే ఈ వేసవిలో అప్పుడప్పుడు కిచెన్లో గడపనివ్వండి.‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు ఎన్ని ర్యాంకులు తెచ్చినా డొనేషన్ లేని సీట్లు తెచ్చినా క్యాంపస్ సెలక్షన్ భారీ జీతానికి కుదిరినా అంతిమంగా తినాల్సింది అన్నమే. అది వండుకోవడం రావాలి ఫస్టు. ఎసట్లో అన్నం వండటానికి ఓపిక లేనప్పుడు రైస్ కుక్కర్లో ఎంత బియ్యం, ఎన్ని నీళ్లతో ఎలా పెట్టాలో తెలిస్తే చాలు జీవితాంతం సగం చింత తీరినట్టే. మిగిలిన సగం.. బయట నుంచి కర్రీ తెచ్చుకోవచ్చుగా. పెద్దలు ఏం చెబుతారంటే రెండు కూరలు చేయడం నేర్చుకుంటే చాలు నిశ్చింతగా బతకొచ్చు అని. నిజం. వంట తెలిసిన వారు ఆకలైతే ఇంట్లో ఉంటారు. లేదంటే బజార్లో పడతారు. బజారు తిండి తింటారు. వంట కూడా ఒక శాస్త్రమా? అవును వంటంతా మేథమెటిక్సే. ఎన్ని గ్లాసుల బియ్యం, ఎన్ని చెమ్చాల నూనె, ఎంతమందికి ఎన్ని వంకాయలు కోయాలి, ఎన్ని బెండకాయలు సిద్ధం చేసుకోవాలి, ఎన్ని పదార్థాలు వండితే కడుపు నిండుతుంది... లెక్కలే లెక్కలు. ‘ఉప్పు తగినంత’... అనే మాట ‘పై’ను డిఫైన్ చేయడంతో సమానం. ‘తగినంత ఉప్పు’ వేయడం తెలిస్తే మొత్తం గణితాన్ని జయించినట్టే.వంట చేయడం పిల్లలకు నేర్పిస్తే వంట వారికి ఓర్పు నేర్పిస్తుంది. వైనం నేర్పిస్తుంది. వొండిన వంట ఎంత కష్టపడితే తినడానికి రెడీ అవుతుందో తెలిసి అన్నం, కూరలు వృధా చేయరు. ఎదుటివారు వండిన దానికి వంకలు పట్టరు. వంటలో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్సు ఉంటాయి. నిలువు కోతలు, అడ్డుకోతలు తెలుస్తాయి. విడగొట్టి కలపడమూ అందుకు కేటలిస్టులను వాడడమూ తెలుస్తుంది. వంట ఏకాగ్రతను నేర్పిస్తుంది. మంట హై ఎప్పుడు పెట్టాలి, లో ఎప్పుడు పెట్టాలి... ఇవి తెలిస్తే నిజ జీవితంలో ఉద్వేగాలు కూడా హై, లో తెలుస్తాయి. పిల్లలు వంట నేర్చే సమయంలో పెద్దలు కచ్చితంగా ఉండాలి. వారు చేస్తూ ఉండగా మాటసాయం అందిస్తూ ఉండాలి. వంట చేస్తూ కబుర్లాడుకుంటే పిల్లల గురించి పెద్దలకు పెద్దల గురించి పిల్లలకు తెలుస్తుంది. బంధంలో రుచి వస్తుంది. జీవితం రుచి తెలుస్తుంది. వేసవి సెలవులు వచ్చేది పిల్లల అరుపులు, కేరింతలకే కాదు... వారి చేతి గరిట చప్పుళ్ల కోసం కూడా. నలబాలపాకం ఇవాళ రెడీ చేసుకుని తినండి.– కె (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!) -
Met Gala 2025: ఆ ఐదు ఆహార పదార్థాలపై నిషేధం.. రీజన్ తెలిస్తే!
మెట్ గాలా (Met Gala) అంటే మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ (Costume Institute). ఇది అత్యంత ప్రసిద్ధమైన ఫ్యాషన్ ఈవెంట్లలో ఒకటి. దీన్ని ప్రతి ఏడాది మే నెలలో న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో నిర్వహిస్తారు. దీన్ని కొత్త ఫ్యాషన్ ప్రదర్శనకు నిధులు సమకూర్చడం కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు. దీన్ని కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ వార్షిక ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించిన వేడుకగా పేర్కొంటారు కూడా. ఈ కార్యక్రమానికి ఫ్యాషన్, సినీ, వ్యాపార, క్రీడల, రాజకీయ ప్రముఖులంతా విచ్చేస్తారు. ఈ ఏడాది మే5 సాయంత్రం ఆరు గంటలకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, దిల్జిత్ దోసాంజ్ వంటి భారతీయ తారలు అరంగేట్రం చేయనున్నారు. దీన్ని వోగ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటౌర్ నిర్వహిస్తారు. ఇక ఈవెంట్లో అత్యంత ప్రసిద్ధి చెందింది పసందైన విందు మెనూ. ఈసారి ఈవెంట్లో ఎలాంటి వంటకాలు అందించనున్నారనేది వెల్లడి కాకపోయినా..ఆ ఫుడ్స్ని మాత్రం పూర్తిగా బ్యాన్ చేశారట. అవేంటి, ఎందుకని నిషేధించారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అన్నా వింటౌర్ నిర్వహించే ఈ వేడుకలో మెనూలో ఆ ఫుడ్స్ని ఆమె ఎందుకు నిషేధించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఏడాది మెట్ గాలా 2025(Met Gala 2025) డిన్నర్ నుంచి నిషేధించిన ఆహారాలు ఇవే..1. వెల్లుల్లి2. ఉల్లిపాయ3. చివ్స్4. పార్స్లీ5. బ్రూషెట్టాఎందుకు నిషేధించారంటే..ఈ ఐదింటిని ఎందుకు బ్యాన్ చేశారో లాస్ ఏంజిల్స్ గ్రేట్ టేస్ట్ క్యాటరింగ్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ జాక్సన్ పరేడ్ వివరించారు. తాము అందించే ఆహారం సెలబ్రిటీల శ్వాసను, దంతాలను ప్రభావితం చేసేలా ఉండకూడదనే ఇలా ఆ ఐదు ఆహారాలకు చోటు ఇవ్వలేదట. అంతేగాదు ఆ ఐదు ఆహారాల వల్ల కలిగే అసౌకర్యం ఏంటో కూడా తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి అంటే అలెర్జీ ఉన్నవారు చాలామంది ఉన్నారట. అలాగే పార్సీ కచ్చితంగా దంతాల్లో ఇరుక్కుని ఇబ్బంది పెడుతుందట. అందుకని దాన్ని మెనూలోంచి తొలగించారు. బ్రూషెట్టా కూడా రాత్రిపూట ఇచ్చే విందులో అసౌకర్యంగా ఉంటుందట. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ఇబ్బందిలో పెట్టేస్తుందట. కాగా, ఈ ఏడాది మెట్గాలా కోసం ఫుడ్ మోనూని 'సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్తో అతిథులకు సర్వ్ చేయనున్నారు. దీన్ని అందించేది సెలబ్రిటీ చెఫ్ క్వామే ఒన్వుచి. ఈ అవకాశం తనకు లభించడం ఓ గౌరవమని అన్నారు ఒన్వుచి. న్యూయార్క్ సంస్థలో భాగం కావడం అనే తన ప్రోఫెషనల్ కల ఇన్నాళ్లకు నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఓఫ్యాషన్ ప్రేమికుడిగా 'సూపర్ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్కి అనుగుణంగా వంటకాలు సిద్ధం చేసేలా చెఫ్ బృందంలో భాగం కావడం అనేది మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. (చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్ ఛేంజర్..) -
నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! ఎలా చేస్తారంటే..
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర(Dharmendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలతో వేలాది అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఎనిమిది పదుల వయసులో కూడా అంతే అందంగా మంచి ఫిట్నెస్తో ఉంటారు. అంతేగాదు తరుచుగా తన వర్కౌట్ వీడియోలతో ఆరోగ్య స్పృహను కలుగుజేస్తుంటారు. తాజాగా తన గేమ్-ఛేంజర్ వాటర్ వ్యాయామాలతో వీడియోని షేర్ చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. కండరాల కదలికలు కోసం, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే శారరీక కదలికలకు ఈవ్యాయామాలు మంచి గేమ్ ఛేంజర్ అనిపోస్ట్లో పేర్కొన్నారు 89 ఏళ్ల ధర్మేంద్ర. ఈ నేపథ్యంలో ఆ వ్యాయమాలు ఎలా చేస్తారు..? కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నీటిలో చేసే ఈ సున్నితమైన వాటర్ వ్యాయామాలు శరీరానికి మంచి కదలికలని చెబుతున్నారు నిపుణులు. కాళ్లకు, మొత్తం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు తప్పనిసరి అని అన్నారు. ఇలా చల్లటి నీటిలో తేలియాడుతూ చేసే రిలాక్స్డ్ వ్యాయామాలు ఏంటో చూద్దామా..!.వాటర్ వాకింగ్: ఇక్కడ నీటిలో నడవడం బయట భూమిపై నడిచినంత ఈజీగా చేయలేం. కొద్దిమొత్తంలో బలాన్ని ఉపయోగించి నడవాల్సి ఉంటుంది. మన అడుగుపడకుండా చేసే నీటి నిరోధకతతో ఫోర్స్గా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేగాదు నీటిలోకి దిగి తేలియాడుతూ..స్మిమ్మింగ్పూల్ చుట్టూ నడవాలి. దీనివల్ల ఎలాంటి కండర సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు.వాటర్ జాగింగ్: ఇక్కడేంటంటే ఇంకాస్త ముందడుగు వేసి భూమ్మీద చేసినట్లుగా పూల్ చుట్టు జాగింగ్ చేయాలి. దీనివల్ల త్వరితగతిన చెమటలు పట్టేస్తాయి. స్పీడ్గా కేలరీలు బర్న్ అవ్వడమే గాక శరీరానికి చక్కని వ్యాయామంలా కూడా ఉంటుంది.ఫ్లట్టర్ కిక్స్: పూల్ సైడ్ను పట్టుకుని శరీరాన్ని నిటారుగా ఉంచి.. ఫ్లట్టర్ కిక్ చేయాలి. చల్లటి నీటిలో ఉంటూ కాళ్ళకు తగిన వ్యాయామం అందించే మార్గం. ఇది ఒకరకంగా ఈత కొడుతున్న అనుభూతి కలిగిస్తుంది. .లెగ్ రైజెస్: పూల్ చివరలో నిలబడి కాళ్ళను పక్కకు ఎత్తండి. ఇది హిప్ ఫ్లెక్సర్లను బలంగా ఉంచుతుంది. ఇది బాడీకి సూపర్ ఎఫెక్టివ్గా ఉంటుంది.వాటర్ పుష్-అప్లు: పూల్ అంచుపై చేతులను ఉంచి, మోచేతులు వంచి నిలబడండి. ఆ తర్వాత అంచు నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టండి, ఆపై నెమ్మదిగా వెనుకకు తగ్గించండి. ఇది అచ్చం పుష్-అప్ చేయడం లాంటిది. అయితే నీటి నిరోధకత పైకి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ శరీరాని మంచి కదలికలను అందించడమే గాక కండరాలు స్ట్రాంగ్గా ఉండేందుకు ఉపకరిస్తాయి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగ నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) (చదవండి: ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..) -
ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..
మన టాలెంట్ మన కన్నవాళ్లకి తెలిసినట్టుగా మరెవరకి తెలియదు. మనల్ని మనం నమ్మకపోయినా..మన తల్లిదండ్రులకు మాత్రం అపార నమ్మకం ఉంటుంది. బహుశా ఆ ప్రేమే పిల్లల్ని ప్రయోజకులుగా మారుస్తుందేమో ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇక్కడొక తండ్రి తన కొడుకు టాలెంట్ని చూసి సంబరపడటమే కాదు సీక్రెట్గా రికార్డు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనసుని టచ్ చేసే ఈ ఘటన ఎవ్వరినైనా కదిలిస్తుంది. ఆ వీడియోలో ఓ బాలుడు మంచం మీద కూర్చొని హాయిగా పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఓ పక్కన బ్యాగులో పుస్తకాలు సద్దుతూ..పంజాబీ ఫేమస్ పాట “దో గల్లన్” పాడుతున్నట్లు కనపడుతుంది వీడియోలో. అతడు ఆ పాటని మైమరిచిపోయి పాడుతున్నాడు. పైగా లయబద్ధంగా అందంగా ఆలపించాడు. దాన్ని మొత్తం అతడి తండ్రి తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేస్తూ. చివర్లో అది చూసి కొడుకు స్టన్ అయిపోతాడు. కాసేపటికి తేరుకుని ఏంటి నాన్న అంటూ మాట్లాడటంతో ముగిసిపోతుంది ఆ వీడియో. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి..ప్రోత్సహించే పద్ధతి ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఏ చిన్నారులకైనా తమలోని టాలెంట్కి మొదటి విమర్శకులు తల్లిదండ్రులే..వారు స్పందించే తీరే ఆ రంగంలో పిల్లలు ఎదగడానికి, విజయం సాధించడానికి కారణమవుతుంది కదూ..!. View this post on Instagram A post shared by 🤍☘️ (@_bhangraempire_) (చదవండి: రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ నంది వడ్డెమాన్గా..) -
నోని కీర్తికి స్త్రీ శక్తి పురస్కారం
‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అని చెక్ బయో ఆర్గానిక్స్ కో–ఫౌండర్ కీర్తి అంటున్నారు. ఇటీవల నగరంలోని నోవోటెల్ హోటల్ వేదికగా స్త్రీ శక్తి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్, బ్యూటీ, టూరిజమ్, వైద్యం, ఎంటర్ప్రెన్యూర్ వంటి వివిధ విభాగాల్లో 30 మంది మహిళలు పురస్కారాలను అందుకున్నారు. వారిలో చెకోటి కీర్తి రెడ్డి ఎంటర్ప్రెన్యూర్ జర్నీ వైవిధ్యమైనది. ఆమె ఏనాడూ ఒక పారిశ్రామికవేత్త కావాలని కల కనలేదు. కంప్యూటర్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి, హైదరాబాద్కి కంప్యూటర్ పరిచయమైన తొలినాళ్లలో కోచింగ్ సెంటర్ నిర్వహించారు. కానీ జీవితం ఆమెను వ్యవసాయం, పరిశ్రమల రంగం వైపు నడిపించింది. పరిశ్రమను నడిపించడంలో ఆమె పాటించిన నియమాలే ఆమెను తన రంగంలో వన్ అండ్ ఓన్లీగా నిలిపాయి. ‘రైతు నేస్తం, ఏరువాక, నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్’ పురస్కారాలు ఆమెకు గతంలో గుర్తింపునిచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ వేదికగా ప్రకటించిన ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ కీర్తి ప్రస్తుతం స్త్రీ శక్తి పురస్కారం అందుకుని మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారు. పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు..‘తొగర చెట్టు.. ప్రకృతి మనదేశానికి అందించిన వరం. సంజీవని వంటి తొగర పండు మీద పాశ్చాత్య దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఆ చల్లటి వాతావరణంలో ఈ చెట్లు మనలేవు. మా కుటుంబ సభ్యులకు నోని ఫ్రూట్ ఔషధంగా పని చేయడంతో నేను ఆ పండు మీద అధ్యయనం మొదలుపెట్టాను. దీని కోసం పొలం కొని పంట వేశాను. పండ్లతో జ్యూస్లు, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి పాతిక ఉత్పత్తులకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. కేవలం పరిశ్రమ నిర్వహణ మాత్రమే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం కలగలిసి ఉండడంతో నాకు ‘ఫార్మర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ వెల్నెస్ ప్రోడక్ట్స్’ విభాగంలో ఈ పురస్కారం లభించింది. నోని పండు మీద చేసిన పరిశోధనల కారణంగా ‘నోని కీర్తి’ నయ్యాను. ఈ స్త్రీ శక్తి పురస్కారం ఎంపిక ప్రక్రియలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు పాతిక మంది పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులు పురస్కార గ్రహీతలను జూమ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు’ అని వివరించారు కీర్తిరెడ్డి. ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు స్త్రీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ సంప్రదాయ గోంద్లడ్డు, నారాయణపేట చీరలు, టెర్రకోట బొమ్మలు వంటి హస్తకళాకృతులను తయారు చేస్తున్న ఐదుగురు గ్రామీణ, ఆదివాసీ మహిళలు స్త్రీ రత్న పురస్కారాలను అందుకున్నారు. (చదవండి: అందాల తారల ఆగమనం..) -
భాగ్యనగరంలో అందాల హడావిడి..!
హైదరాబాద్ నగర వేదికగా జరగనున్న 72వ ప్రపంచ సుందరి పోటీల కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 120 దేశాలకు చెందిన అందాల భామలు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ వంటి ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. కాగా ఆదివారం మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాన్డియుజ్జి పెడ్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్బర్గ్ నగరానికి చేరుకున్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కి చేరుకున్న మిస్ బ్రెజిల్ జెస్సికా, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్కు భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యాలతో జెస్సికాను, జోయలైజ్ను ఆహ్వానించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్–2025’ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి మరికొందరు సుందరీమణులు ఈనెల 6వ తేదీ వరకూ ఒక్కొక్కరుగా రానున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల సందడి.. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా జరగనున్న ప్రారంభ వేడుకల్లో గ్లోబల్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయనున్నారు. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్లో ముందస్తు బుకింగ్ చేశారు. అంతేకాకుండా విమానాశ్రయంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు భారత్ నుంచి మిస్ వరల్డ్గా నిలిచిన మాజీ మిస్ వరల్డ్లు సైతం నగరానికి చేరుకోనున్నారు. ఈనెల 10వ తేదీ లోపు బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ముఖ్య అతిథులుగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
అనారోగ్య మరణాల్లో.. పురుషులే అధికం!
పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. 200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. 131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్తో 25 దేశాల్లో, డయాబెటిస్తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్కు చెందిన గ్లోబల్ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్ బస్ తెలిపారు.(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!) -
ఆపదలో ఆమె సైతం..!
ఆపదలో ఆదుకునే రెస్క్యూ టీమ్లో సైతం మహిళలకు అవకాశం కల్పించిన సంస్థగా సింగరేణి రికార్డు సొంతం చేసుకుంది. సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రెయినీగా పని చేస్తున్న అంబటి మౌనిక ఇటీవల రెండోసారి రెస్క్యూ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఖమ్మం నగరానికి చెందిన అంబటి మౌనిక కొత్తగూడెం కేఎస్ఎం కాలేజీలో మైనింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత రాజస్థాన్లో ఓ ప్రైవేటు సంస్థలో మైనింగ్ ఇంజనీర్గా చేరింది. అప్పటికే ఆ సంస్థలో 15 శాతం వరకు మహిళలు పని చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సీపీఆర్తో పాటు ఇతరత్రా సాయం చేసేందుకు వీలుగా రెస్క్యూ టీమ్లో మహిళల అవసరం ఏర్పడింది. ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలే సమర్థంగా రెస్క్యూ టీమ్లను నిర్వహిస్తుండగా.. వెస్టర్న్ కోల్ఫీల్డ్కు సంబంధించిన నాగ్పూర్ రెస్క్యూ శిక్షణ కేంద్రానికి మౌనికను ఆ సంస్థ పంపింది. అయితే తాను తెలంగాణ అమ్మాయినని, సింగరేణిలో ట్రైనింగ్కు వెళ్తానని అంటే.. ‘అక్కడ శిక్షణ మరింత కఠినంగా ఉంటుంది. మహిళలు అది తట్టుకోలేరు’ అంటూ రాజస్థాన్ కంపెనీ ఆమె ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో నాగ్పూర్లోనే బ్రిగేడియర్గా మౌనిక శిక్షణ పొందింది. సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రెయినీగా..మేనేజ్మెంట్ ట్రెయినీ (మైనింగ్) పోస్టులకు 2024లో నోటిఫికేషన్ రావడం, అందులో తొలిసారిగా మహిళలకు అవకాశం ఇవ్వడంతో మౌనిక సింగరేణి రామగుండం ఏరియాలో జాయిన్ అయింది. ఈ సంస్థలో పనిచేసే మహిళా కార్మికులు, ఉద్యోగులు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన రెస్క్యూ టీమ్ మెంబర్గా మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.సింగరేణిలో రెస్క్యూ టీమ్ బ్రిగేడియర్గా మారాలంటే కఠినమైన శిక్షణ దాటాలి్సందే. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మనుషుల ప్రాణాలను ఈ బ్రిగేడియర్లు కాపాడాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా తనకు మించిన బరువులు మోయడం, బరువైన వçస్తువులను పక్కకు నెట్టడం వంటి తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. కఠినమైన శిక్షణ.. శిక్షణలో భాగంగా 30 కేజీల చొప్పున ఉండే రెండు ఇసుక సంచులను రెండు చేతులతో వంద మీటర్ల పాటు ఆగకుండా మోయాల్సి ఉంటుంది. దీంతో పాటు బరువైన టైర్లను అటూ ఇటు ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గాలి, వెలుతురు సరిగా లేని చోటుకు వెళ్లి సహాయక చర్యలు అందించేలా 15 కేజీల బరువు ఉండే బ్రిగేడియర్ పరికరాలు శరీరానికి తగిలించుకుని ఆపద సమయంలో అవలీలగా పని చేయాలి. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు సగటున 80 కేజీల బరువు ఉండే మనుషులను మోయడం, అడ్డదిడ్డంగా పడి పోయి ఉండే శిథిలాలను పక్కకు జరపడం వంటి పనులు సులువుగా చేసే సామర్థ్యం సంతరించుకునేలా రెస్క్యూ మెంబర్లకు శిక్షణ ఇస్తారు. రాష్ట్ర సేవల్లో ఒకే ఒక్కరు..ప్రస్తుతం తెలంగాణలో అంబటి మౌనిక ఒక్కరే మహిళా రెస్క్యూ బ్రిగేడియర్గా ఉన్నారు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా మౌనికను మంత్రులు కిషన్రెడ్డి, సీతక్క ప్రశంసించడంతో పాటు సత్కరించారు. తెలంగాణ నుంచి మొత్తం ముగ్గురు రెస్క్యూ బ్రిగేడియర్లుగా ఉండగా.. వీరంతా కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వారే కావడం విశేషం. వీరిలో మౌనిక సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తుండగా మిగిలిన ఇద్దరూ ఇతర రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు.వెలకట్టలేని విలువఆపదలో మనం చేసే సాయం ఎంత విలువైందో, ప్రాణాలు ఎలా కాపాడుతుందో రెస్క్యూ టీమ్ శిక్షణలో చెబుతారు. పాఠాలుగా విన్నప్పుడు ఆ మాటలు ఎంతో విలువైనవో సరిగా అర్థం కాలేదనే చెప్పాలి. కానీ, ఓసారి జైపూర్ ఎయిర్పోర్టులో ఉండగా ఒక మహిళ ఛాతినొప్పితో పడిపోయింది. నేను వెంటనే స్పందించి సీపీఆర్ అందించాను. కాసేపటికి ఆ మహిళ కోలుకుంది. అప్పుడు అర్థమైంది నేను పొందిన శిక్షణ ఎంత విలువైందనేది.– అంబటి మౌనిక– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
ఆ పవిత్ర జలంతో అత్యంత ప్రమాదం..!
ఇది ఒక ప్రార్థన మందిరంలోని పవిత్రమైన బావి. శతాబ్దాలుగా వేలాది మంది భక్తులు ఇథియోపియాలోని ‘బెర్మెల్ జార్జిస్’ అనే ఈ బావిలోని నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నారు. కాని, ఇప్పుడు ఉన్న రోగాలు నయం కాకపోగా, కొత్త రోగాలను తెప్పిస్తోంది ఈ పవిత్ర జలం. తాజాగా శాస్త్రవేత్తలు ఈ పవిత్ర జలం కారణంగానే యూరప్లో కలరా వ్యాధి వ్యాపిస్తోందని గుర్తించారు. యూరప్ దేశాల నుంచి కొందరు భక్తులు ఇటీవలే ఇథియోపియాకు ప్రయాణించి, ఈ బావిలోని నీటితో చేతులు, ముఖం కడుక్కుని, అదే నీటిని తాగారట! యూరప్లో వ్యాపించిన కలరా కేసులను పరీక్షించిన వైద్య పరిశోధకులకు బాధితులే ఈ సంగతి చెప్పారు. ఆ నీటిని పరీక్షించగా, అందులో విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటంతో నీరు తీవ్రంగా కలుషితమైందని తేలింది. ఈ కారణంగానే బాధితులందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. అదృష్టం కొద్దీ స్థానిక ప్రభుత్వాలు ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టి, అదుపులోకి తెచ్చాయి. ఇకపై ఎవరైనా ఆ పవిత్ర స్థలంలోని నీటిని ఉపయోగించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: మీరు ఇంట్రావర్టా..? ఎక్స్ట్రావర్టా..? చిటికెలో చెప్పే ట్రిక్ ఇదిగో..) -
పగలబడి నవ్వేందుకు పది కారణాలు...
'సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా'..అంటున్నారు నిపుణులు. నవ్వు నాలుగు విధాల చేటు కాదు ఆరోగ్యం అని ఘంటాపథంగా చెబుతున్నారు. నవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే గాక ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖం సదా నవ్వుతూ ఉండే సంబంధబాంధవ్యాలు కూడా సానుకూలంగా ఉంటాయట. నిజానికి 'నవ్వు' వైజ్ఞానికంగా చాలా మంచిది అనే విషయాన్ని హైలెట్ చేస్తోంది. ఇలా ఎందుకు అంటున్నారంటే..నవ్వు ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే..రోగనిరోధక శక్తిని పెంచుతుంది - ఇది యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండి రక్తపోటును తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది - నవ్వు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది, మరింత రిలాక్స్గా ఉండటానికి సహాయపడుతుంది.మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - ఇది శరీరం సహజ అనుభూతిని కలిగించే రసాయనాలు అయిన ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.సామాజిక బంధాలను బలపరుస్తుంది - నవ్వుతూ ఉంటే అందరు మనతో మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడతారు. తద్వారా సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలనే కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి. ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు. నొప్పిని తగ్గిస్తుంది - డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపించి..వివిధ రుగ్మతల నివారిణిగా పనిచేస్తుంది.సానుకూలతను ప్రోత్సహిస్తుంది - అంతేగాదు మనలో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమించగలుగుతారు. మానసిక ఆరోగ్యానికి మద్దతిస్తుంది - నవ్వు విశ్రాంతిని ప్రోత్సహించి ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది - గాఢమైన నవ్వు డయాఫ్రాగమ్కు మంచివ్యాయామంగా పని చేస్తుంది. పైగా శ్వాసక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది - ఎక్కువగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవిస్తారని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.కావునా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేద్దాం..చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం. ](చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
డిస్పోజబుల్ ప్లాస్టిక్తో ఇంటిని అందంగా మార్చేద్దాం ఇలా..!
యూజ్ అండ్ త్రో లేదా డిస్పోజబుల్ బాటిల్స్ మాత్రమే కాదు ఆహార పదార్థాల డబ్బాలు కూడా మన ఇంట్లో చేరుతుంటాయి. వాటిలోని పదార్థాలు తిన్న తర్వాత, అవి చెత్తలో పడేస్తుంటాం. ఈ రోజుల్లో మన దినచర్యలోకి వచ్చిన ఈ డిస్పోజబుల్ ప్లాస్టిక్ అంతా పర్యావరణాన్ని దెబ్బతీసేదే! డిస్పోజబుల్ ప్లాస్టిక్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదనే ఆలోచనతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వీటి వాడకం తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు వాటిని చెత్తగా మార్చకుండా, అలంకార వస్తువులుగా వాడుకోవడం కొంత నయం.స్వీట్ కప్స్తో..వాడిన ప్లాస్టిక్ బాక్సులను శుభ్రం చేసి, వాటికి పెయింట్స్ వేసి, అద్దాలను అతికించి వాల్ హ్యాంగింగ్స్ తయారుచేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ను విభిన్న రంగులతో తీర్చి, దానికి జనప దారాలను ఉపయోగించి మినీ ప్లాంటేషన్ వాల్ను క్రియేట్ చేయవచ్చు. బొమ్మల తయారీశుభ్రం చేసిన ప్లాస్టిక్ బాక్స్లు, కొన్ని పూసలు, గ్లూ సాయంతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలను డిజైన్ చేయవచ్చు. పిల్లల చేత వాటిని తయారుచేయించి, వారిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. క్రియేటివ్ షెల్ఫ్డిస్పోజబుల్లోనూ ఎకో–ఫ్రెండ్లీ ఐటమ్స్ వస్తున్నాయి. వాటిని పెన్నులు, పెన్సిళ్లు వంటి వస్తువులు వేసుకోవడానికి హోల్డర్స్ ఈ రీయూజ్ బాక్స్లతో డిజైన్ చేసుకోవచ్చు. (చదవండి: అక్కడ నేటికి విసుర్రాళ్లతోనే..) -
అక్కడ నేటికి విసుర్రాళ్లతోనే..
మిక్సీలు, గ్రైండర్లు ఇంటింటి వస్తువులుగా మారాక విసుర్రాళ్లు దాదాపుగా మూలపడ్డాయి. చాలాచోట్ల విసుర్రాళ్లు పండగ పబ్బాల్లో మాత్రమే వాడుకలోకి వస్తుంటాయి. ఆ తర్వాత ఇళ్లల్లో అలంకారప్రాయంగా మిగులుతుంటాయి. అయితే, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు నేటికీ విసుర్రాళ్లను వినియోగిస్తున్నారు. కందులు తదితర పప్పు ధాన్యాలను విసుర్రాళ్లలో విసురుకుని, ఏడాది పొడవునా నిల్వ చేసుకుని వాడుకుంటున్నారు. జక్కల్ నియోజకవర్గంలోని జక్కల్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో దాదాపు తొంభై శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పప్పు దినుసులను పండిస్తారు. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో దాదాపు అరవైవేల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత పప్పుగింజలను విసుర్రాళ్లలో విసురుకుని, ఏడాది అంతటికీ సరిపోయేలా డబ్బాల్లో నిల్వ చేసుకుంటుంటారు. పప్పు విసురుకునేటప్పుడు శ్రమ తెలియకుండా శ్రావ్యంగా జానపద గీతాలను పాడుకుంటూ ఉంటారు. మిల్లులు అందుబాటులోకి వచ్చినా, ఇలా విసుర్రాళ్లపైనే ఆధారపడుతున్నారు ఎందుకని ప్రశ్నిస్తే, ‘మార్కెట్లో అమ్మే పప్పు పాలిష్ చేసి ఉంటది. రుచి అంతగా ఉండదు. ఇసురుకున్న పప్పు రుచి చాలా బాగుంటది’ అంటుంది మర్నూర్ గ్రామానికి చెందిన ఉత్తుర్వార్ అనిత. స్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి(చదవండి: Lukla Airport: అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్..! ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్..) -
అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్..! ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్..
ప్రపంచంలోని ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో లుక్లా విమానాశ్రయం ఒకటి. నేపాల్లో ఉన్న దీనిని టెన్జింగ్–హిల్లరీ విమానాశ్రయంగా కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 2,860 మీటర్ల (9,383 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం చుట్టూ ఎత్తైన పర్వతాలు, లోయలు ఉన్నాయి. లుక్లా విమానాశ్రయం రన్వే కేవలం 527 మీటర్ల (1,729 అడుగులు) పొడవు మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అనేవి పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. వాతావరణ పరిస్థితులు కూడా తరచుగా మారుతూ ఉంటాయి. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు విమానాల రాకపోకలను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు లేకపోవడం కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం. సాహసికులు, పర్వతారోహకులకు లుక్లా విమానాశ్రయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. లేదంటే అనేక రోజుల పాటు నడవాల్సి ఉంటుంది. చిన్న విమానాలు, హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడ ల్యాండ్ కాగలవు. (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
ట్రావెల్ మేకప్ బ్యాగ్..! ఎక్కడైన ఈజీగా వేసుకోవచ్చు..
సాధారణంగా మేకప్ ప్రియులకు ప్రయాణాలనగానే దిగులు మొదలైపోతుంది. వెళ్లిన చోట మేకప్ వేసుకోవడానికి వీలుంటుందా? సరైన లైటింగ్ ఉంటుందా? కాస్మెటిక్స్ అన్నీ ఎందులో పెట్టుకోవాలి? ఎలా తీసుకెళ్లాలి? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఈ ట్రావెల్ మేకప్ బ్యాగ్.చిత్రంలోని ఈ స్టైలిష్ బ్యాగ్లో ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్ మిర్రర్ ఉంటుంది. దీనిలో మూడు రకాల లైటింగ్ సెట్టింగ్స్ ఉండటంతో మీరు ఎక్కడ ఉన్నా, నచ్చిన వెలుతురులో మేకప్ వేసుకోవచ్చు. ఇకపై ఎక్కడికి వెళ్లినా మేకప్ వేసుకునేటప్పుడు సరిగా కనబడటం లేదని చింతించాల్సిన పని లేదు. అన్ని రకాల సౌందర్య సాధనాలను చక్కగా అమర్చుకోవడానికి ఈ బ్యాగ్లో తగినంత స్థలం ఉంటుంది. బ్రష్లు, లిప్స్టిక్లు, ఫౌండేషన్లు, క్రీములు ఇలా అన్నింటినీ వేర్వేరుగా పెట్టుకోవచ్చు. ఇది రీచార్జబుల్ డివైస్ కాబట్టి, బ్యాటరీ అయిపోతుందనే భయం కూడా అవసరం లేదు. ఇది వెంట ఉంటే, ఎప్పుడంటే అప్పుడు మేకప్ వేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్లో చాలా రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా రంగుల్లో దొరుకుతున్నాయి. నిత్యం టూర్స్కో, ఫంక్షన్స్కి వెళ్లే మహిళలకు, దీన్ని బహుమతిగా కూడా ఇవ్వచ్చు. (చదవండి: నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..! అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు..) -
నిన్న పిజ్జా మేకర్.. నేడు ఫ్యాషన్ మోడల్..!
నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వద్ద అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్ మోడల్గా మారిపోయాడు. ఫ్యాషన్ మోడల్గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్ పేరు క్రిస్టియానో వెన్మన్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ‘స్కార్స్’ అనే పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తూ ఉండేవాడు. న్యూయార్క్లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విల్లీ షవారియా అసిస్టెంట్లలో ఒకరు ‘స్కార్స్’ పిజ్జా సెంటర్కు వచ్చినప్పుడు క్రిస్టియానో అతడి కంటపడ్డాడు. ఆకట్టుకునే రూపంతో ఉన్న క్రిస్టియానో ఫ్యాషన్ మోడలింగ్కు బాగా పనికొస్తాడని అంచనా వేశాడు. ఇదే విషయాన్ని తన బాస్ విల్లీకి చెప్పాడు. విల్లీ వెంటనే అతణ్ణి పిలిపించి, మోడలింగ్లో అవకాశం ఇచ్చాడు. విల్లీ చలవతో క్రిస్టియానో ఇటీవల ప్యారిస్లో జరిగిన ఫ్యాషన్ వీక్లో ర్యాంప్వాక్ చేసి, ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ దెబ్బతో క్రిస్టియానోకు అవకాశాల వెల్లువ మొదలైంది. అంతేకాదు, ‘హీరో’, డేజ్డ్’ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు క్రిస్టియానో ఫొటోలతో ప్రముఖంగా వ్యాసాలను ప్రచురించడం మరో విశేషం.(చదవండి: Vomiting During Pregnancy: ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?) -
ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. వర్క్లో బిజీగా ఉండి ఏ జాగ్రత్తా సరిగ్గా తీసుకోలేదు. నార్మల్ డెలివరీ కావాలని ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – నిర్మల, నల్గొండనార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెంచుకోవటానికి ప్రెగ్నెన్సీ అంతా కూడా పోషకాహారాలు తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చెయ్యాలి. ఈ రోజుల్లో చాలా చోట్ల చైల్డ్ బర్త్ ప్రిపరేషన్ క్లాసెస్ అని అవుతున్నాయి. అవి హాజరైతే మంచిది. మొదటి ప్రెగ్నెన్సీలో ఈ సలహాలు పాటిస్తే సులభంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ మీరు బిజీగా ఉండి క్లాసెస్ హాజరు కాలేకపోయినా, తొమ్మిదవ నెలలో అయినా పోషకాహార నిపుణుడిని కలసి సమత్యులమైన ఆహారం ఏమి తీసుకోవాలో తెలుసుకోండి. పండ్లు, కూరగాయలు, ఫైబర్, పానీయాలు ఎక్కువ తీసుకోవాలి. ప్రినేటల్ విటమిన్ టాబ్లెట్స్ రోజూ తీసుకోవాలి. ఇప్పుడైనా రెగ్యులర్గా వాకింగ్, స్విమ్మింగ్ లేదా ప్రీనేటల్ యోగా చెయ్యండి. దీనితో సత్తువ పెరుగుతుంది. కెగల్ వ్యాయామాలు అని పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంతెనింగ్ అయేవి మీకు ఆన్లైన్లో కూడా వీడియోస్లో నేర్పిస్తారు. అవి తొమ్మిదవ నెల నుంచి డెలివరీ తరువాత కూడా పాటించండి. పెరినియల్ మసాజ్ కూడా కొంతమందికి సూచిస్తాం. మీ గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు దీని గురించి కనుక్కోండి. సరైనంత నిద్ర కూడా అవసరం. బేబీ కదలికలని జాగ్రత్తగా ట్రాక్ చేసుకోండి. స్క్వాట్స్, బర్తింగ్ బాల్ వ్యాయామాలతో బేబీ తల కిందకి వచ్చే అవకాశాలు, సులభ కాన్పు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఇవి అన్నీ పాటించవచ్చా లేదా అని స్కాన్ రిపోర్ట్ చూసి మీ డాక్టర్ నిర్ణయిస్తారు.నాకు మొదటి ప్రెగ్నెన్సీలో అసలు వాంతులు లేవు. సులభంగా నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీలో చాలా వాంతులు అవుతున్నాయి. ఏమీ తినటం లేదు మందులు సేఫ్ కాదని వేసుకోవాలను కోవటం లేదు. బేబీ గ్రోత్ ఏమయినా ఎఫెక్ట్ అవుతుందా మళ్లీ నార్మల్ డెలివరీ అవుతుందా?– భ్రమర, గుంటూరు. ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు అనేవి చాలా సాధారణం. ప్రెగ్నెంట్ హార్మోన్స్ వలన ఈ మార్పులు అవుతాయి. ఐదవనెలకి హార్మోన్స్ తగ్గడంతో వాంతులు తగ్గుతాయి. వాంతులు ఎక్కువ అవుతున్నప్పుడు దానిని హైపెరెమెసిస్ అంటారు. దీని వలన మీకు డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సరైన ఆహారం లేనందు వలన పోషాకాహార లోపం ఉంటుంది. కానీ, బేబీ శరీరంలోని స్టోర్స్ నుంచి బేబీకి పోషకాలు అందుతాయి. కాబట్టి, బిడ్డ ఎదుగుదలకు ప్రభావం ఉండదు. మీ డెలివరీ ప్రాసెస్ కూడా దీని వలన ఎఫెక్ట్ అవదు. మళ్లీ నార్మల్ డెలివరీకి ఈ వాంతుల వలన ఏమీ సమస్య ఉండదు. మీరు మందులు వాడొద్దు అనుకుంటే డైట్లో ఈ మార్పులు చేసుకోవాలి. డ్రై టోస్ట్ లేదా ప్లేన్ బిస్కెట్స్ ఉదయం తీసుకోవాలి. తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఆహారం భోజనంలో తీసుకోవాలి. కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. బ్రెడ్, రైస్ తీసుకోవచ్చు. పానీయాలు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల వరకు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఎండబెట్టిన అల్లం లేదా ఎండబెట్టిన ఆమ్లా నములుతున్నా వాంతులు తగ్గుతాయి. విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి. మీకు వాంతి వచ్చే ఆహారం, వాసనలకు దూరం ఉండండి. ఇవన్నీ ప్రయత్నించినా తగ్గకపోతే, మందులు తప్పకుండా తీసుకోవాలి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
Summer Holidays: శిక్షాకాలం కాదు..శిక్షణ కాలం..!
‘వేసవి వచ్చిందంటే మా ఇంట్లో రోజుకో యుద్ధం జరుగుతోంది సార్!’ అని చెప్పారో తండ్రి. ‘మొబైల్ తీసేస్తే మా పాప ఏడుస్తుంది సర్. గట్టిగా అరిచి చెప్పినా పట్టించుకోవడం లేదు. చివరకు కోపంతో ఒక దెబ్బ వేస్తేనే దారికొస్తుంది’ అని చెప్పారో తల్లి. ‘మా అబ్బాయి టెన్త్ క్లాస్కు వెళ్తున్నాడు సర్. చదవమంటే మొహం చిట్లిస్తున్నాడు. సమ్మర్ హాలిడేస్లో కూడా చదవాలా?’ అని గొడవపడుతున్నాడు’ అని మరో తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలున్న ప్రతి ఇంటిలోనూ ఇలాంటి పోరాటమే జరుగుతుంటుంది. పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తల్లిదండ్రులు తలపట్టుకుంటారు. అలాంటివారి కోసమే ఈ ఆర్టికల్. ఈ వేసవిని అవకాశాల మార్గంగా, ఒక టర్నింగ్ పాయింట్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఇదేమీ పనిష్మెంట్ సీజన్ కాదు...స్కూల్, కాలేజీ ఉన్నన్ని రోజులూ రోజూ ఉదయం ఆరు గంటలకే లేచి, సిద్ధమై, బస్సు పట్టుకుని వెళ్లి, పాఠాలు, పుస్తకాలు, పరీక్షలతో కుస్తీ పట్టే పిల్లలకు వేసవి సెలవులు ఒక ఆటవిడుపులా కనిపిస్తాయి. తమకు నచ్చిన టైంలో నిద్ర లేవచ్చని, నచ్చిన ఆటలు ఆడుకోవచ్చని భావిస్తారు. పుస్తకాలు, పరీక్షల గొడవ ఉండదని ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు తల్లిదండ్రులు ఈ వేసవిలో పిల్లలకు ఏదైనా నేర్పించాలని ప్లాన్ చేస్తుంటారు. లేదా నెక్స్ట్ క్లాస్కు రెడీ చేయాలని భావిస్తుంటారు. అందుకు మొబైల్ ఫోన్ అడ్డుగా ఉందని, దాన్ని తీసేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇక్కడే సంఘర్షణ మొదలవుతుంది. ఒక సెలవు రోజు మిమ్మల్ని ఆఫీసుకు రమ్మంటే మీరెలా ఫీలవుతారో గుర్తుచేసుకోండి. మీ పిల్లలు కూడా అలాగే ఫీలవుతుంటారు. ‘ఇవాళ్టి నుండి మొబైల్ తీసేస్తా’, ‘చదవకపోతే తినొద్దు’– ఇలాంటి మాటల వల్ల పిల్లల మెదడులో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. తల్లిదండ్రులపై కోపం, భయం, దూరం పెరుగుతాయి. తల్లిదండ్రులను సంతోషపెట్టేందుకే తాము బతుకుతున్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా వయసు పెరిగినప్పటికీ వారు సెల్ప్ డౌట్లో కొట్టుకుంటుంటారు. నిజానికి పిల్లలు మొబైల్కు అతుక్కుపోయేది మెదడులో విడుదలయ్యే ‘డోపమైన్’ అనే హ్యాపీ కెమికల్ కోసమే. అది మొబైల్ ద్వారా కాకుండా సహజమార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించండి. వేసవిని విలువైన కాలంగా మార్చండి... ఒక వారం రోజులపాటు ఏ శిక్ష లేకుండా మీ బిడ్డ ప్రవర్తనను గమనించండి. పొద్దున్నే లేచే సమయం, స్క్రీన్ టైం, భోజన సమయం, బోర్ అవుతున్న సమయాలు గమనించి నోట్ చేసుకోండి. మొబైల్ తీసేయమంటే వాళ్లు ఎలా ఫీలవుతున్నారో అడిగి తెలుసుకోండి. ‘మొబైల్ కాకుండా నీకు ఆనందం కలిగించే విషయం ఏమిటి?’ అని అడిగి తెలుసుకోండి. వారి ఆసక్తిని ప్యాషన్గా మార్చుకునే మార్గం చూపించండి. ఈ వేసవిని మూడు జోన్లలో డిజైన్ చేయండిలెర్నింగ్ జోన్: ఓ వారం రోజులు మొబైల్ ఫోన్ కాస్త పక్కన పెట్టి,జీవితానికి అవసరమైన వంట, ఫస్ట్ ఎయిడ్, డబ్బు వినియోగం గురించి బేసిక్స్ నేర్చుకునేలా ప్రోత్సహించండి. తమకు నచ్చిన పుస్తకాలు తెప్పించి, చదువుకునే అవకాశం కల్పించండి. మైండ్ గేమ్స్ తెప్పించి ఇవ్వండి. ఆటోమేటిగ్గా మొబైల్కు దూరం అవుతారు. క్రియేటివ్ జోన్: ఈ వేసవిని వారికి నచ్చింది నేర్చుకునే అవకాశంగా మార్చండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్, కోడింగ్, బ్లాగింగ్ లాంటిది ఏదైనా కావచ్చు. అలాగే గార్డెనింగ్, సైన్స్ ప్రయోగాలు, బాటిల్ ఆర్ట్ లాంటివి చేయడానికి ప్రోత్సహించండి. యూట్యూబ్లో వీడియోలు చూసి సైన్స్ ప్రయోగాలు చేయమనండి. తాము నేర్చుకున్న దాన్ని మీకు నేర్పమని చాలెంజ్ ఇవ్వండి. కనెక్షన్ జోన్: మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయేవరకు ఉరుకులు పరుగుల్లో ఉంటారు. ఈ వేసవిని వారితో బంధాన్ని బలపరచుకునేందుకు ఉపయోగించండి. మీ చిన్ననాటి సంగతులు పంచుకోండి. అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, బాబాయి, అత్తలతో మీ అనుభవాలు ఎలా ఉండేవో చెప్పండి. అలాగే వారి అనుభవాలను ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా వినండి. ‘వాట్ ఐ లవ్ అబౌట్ అవర్ ఫ్యామిలీ’ స్క్రాప్బుక్ తయారు చేయమని చెప్పండి. (చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
నోటి కేన్సర్ నిర్ధారణ ఇలా!
నోటి పరిశుభ్రత పెద్దగా పాటించకుండా గుట్కా, ఖైనీల రూపంలో పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు నోటి కేన్సర్ను ప్రేరేపిస్తాయి. ఇలాంటివారిలో చెంపలు, నాలుక, పంటి చిగుర్ల... వంటి భాగాలను పరీక్షించి ఏ భాగంలో కేన్సర్ వచ్చిందో కేన్సర్ స్పెషలిస్టు పరీక్షించి చూస్తారు. వీళ్లలోని కొందరిలో నోటిలో వాపు కూడా రావచ్చు. అప్పుడు కూడా దాన్ని కేన్సర్గా అనుమానించాల్సి ఉంటుంది. మొదట సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ, ఎమ్మారై స్కానింగ్ వంటి పరీక్షలు చేయించి, కేన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటు నుంచి అది ఏ మేరకు వ్యాపించి ఉందో తెలుస్తుంది. అది దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిందా అన్న విషయాన్ని కూడా డాక్టర్లు తెలుసుకుంటారు. పేషెంట్ నోటిని మామూలుగానే తెరవగలుగుతున్నాడంటే, కేన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఎందుకంటే కేన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కష్టమవుతుంది. నోటిలోని కేన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే మొదట కేన్సర్ వచ్చిన మేరకు ఆ భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత...ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా తొలగించిన భాగాన్ని పునర్మించవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా కేన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స తాలూకు గాయాలు మానాక, రేడియోథెరపీ ప్లాన్ చేస్తారు. నోటి కేన్సర్ అన్నది చాలా బాధాకరమైనది కావడం వల్ల గుట్కా పొగాకు అలవాటు ఉన్నవారు వెంటనే దాన్ని మానేయాలి. ఈ అలవాటు కేవలం నోట్లోని భాగాలకే కాకుండా మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా కేన్సర్ వచ్చేలా చేయగలదన్న విషయం గుర్తుంచుకుని జాగ్రత్త పడాలి.(చదవండి: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతలు శరీరంలోని నీటిని ఆవిరి చేస్తుంటాయి. ఎన్నిసార్లు నీళ్లు తాగినా దాహం తీరదు. ఆకలిగానూ అనిపించదు. అలసట, నీరసంతో రోజంతా చికాకు. ఈ సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉందంటున్నారు పోషకాహార నిపుణులు సుజాతా స్టీఫెన్. ‘శరీరం త్వరగా డీ–హైడ్రేట్ అయ్యే కాలం ఇది. తినే పదార్థాల ఎంపిక సరిగా లేకపోతే జీర్ణవ్యవస్థ గాడి తప్పుతుంది. ఇలాంటప్పుడు... కూరగాయలతో చేసిన సలాడ్స్, సాంబార్, రసం.. వంటివి రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి.రెండు గంటలకు ఒకసారి గ్లాసుడు నీళ్లు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. అకస్మాత్తుగా తలనొప్పి, భావోద్వేగాలలో మార్పు, నీరసం, ఇరిటేషన్.. వంటివీ తలెత్తుతుంటాయి. దీనిని సైలెంట్ డీ–హైడ్రేషన్ సమస్యగా గుర్తించి నీళ్లు తాగి, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. నిమ్మరసం, సబ్జా గింజలతో తయారు చేసుకున్న లస్సీ ఒంటికి మేలు చే స్తుంది. నిమ్మరసంలో షుగర్కు బదులు కొద్దిగా ఉప్పు, సోడా కలుపుకొని తాగచ్చు. మధుమేహులు ఒకేసారి ఎక్కువ మొత్తం తింటే, శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. అందుకని టైమ్ ప్రకారం ఏదో ఒకటి మితంగా తినాలి. గర్భిణులకు ప్రత్యేకంఈ కాలం గర్భిణులు ఏ కొంచెం తిన్నా ఆయాసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు మసాలా ఉన్న ఆహారం కాకుండా పండ్లు, జ్యూసులు, సలాడ్స్ పైన దృష్టి పెట్టాలి. దీని వల్ల కడుపులో హెవీగా ఉన్నట్టు అనిపించదు. ఆయాసం సమస్య తలెత్తదు. వయసు పైబడిన వాళ్లు పగటివేళ ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి అయితే వెంట నీళ్లు, పండ్లు తీసుకెళ్లాలి. డీ హైడ్రేట్ అయితే బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడి΄ోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వారి వెంట మరొకరు తోడుండాలి. రీ హైడ్రేషన్ వేసవిలో యూరిన్ పసుపు రంగులో వస్తుందంటే శరీరంలో నీటిశాతం తగ్గిందని అర్ధం. రీ హైడ్రేషన్ కోసం నీళ్లు, నిమ్మరసం సరైన ఎంపిక. ఫ్లేవర్డ్, షుగర్ లెస్ మెడికేటెడ్ ఓఆర్ఎస్లను ఎంచుకోవచ్చు. ఇది మంచి సీజన్బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి సీజన్. వేడికి ఎక్కువ ఆహారం తినబుద్ది కాదు.. పండ్లు, కూరగాయలు, జ్యూస్, నీళ్లు ఎక్కువ తీసుకుంటాం. ఇదంతా లో క్యాలరీ ఫుడ్. దీనివల్ల బరువు సులువుగా తగ్గచ్చు. వాకింగ్, జాగింగ్, వ్యాయామాలకు ఉదయం వేళ ఎంచుకోవడమే మంచిది. వేసవిలో పార్టీలకు వెళ్లినప్పుడు తినే మసాలా ఫుడ్స్ మరుసటి రోజు కూడా ప్రభావం చూపుతుంది. పడుకునేటప్పుడు మజ్జిగ తాగితే అసౌకర్యం తగ్గుతుంది.కూల్ సలాడ్కీరా, దోస, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వంటివి సన్నని ముక్కలుగా తరిగి, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్లో పెట్టి, రోజులో రెండు మూడుసార్లు తింటే, తేలికగా అనిపిస్తుంది. సొరకాయ జ్యూస్, పుదీనా, కొత్తిమీర షర్బత్లు, చట్నీలు, రాగి జావ వంటివి.. ఒంటికి మేలు చేస్తాయి.మాంసాహారులు తాజాగా తయారు చేసుకున్నవి, నూనె తక్కువగా ఉపయోగించినవి తీసుకోవాలి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ (చదవండి: బుల్లితెర నటి అస్మిత హెల్తీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..) -
బుల్లితెర నటి అస్మిత హెల్దీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..
‘నాలుగు పదుల వయసు దాటిన మహిళల్లో హార్మోన్లలో మార్పులు సహజం. అందుకే పోషకాహారాన్ని ప్లాన్ చేసుకోవడమే కాదు ఆరోగ్యానికి కొన్ని సప్లిమెంట్స్ వాడకం కూడా అవసరమే’ అంటూ తన డైట్ప్లాన్ను వివరించారు బుల్లితెర నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అస్మిత కర్ణని. ‘ఇరవై ఏళ్లుగా హెల్తీ డైట్ ప్లాన్ చేసుకున్నందుకే ఈ రోజుకీ హెల్తీగా ఉన్నాను’ అని చెబుతున్నారు.‘మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే బాడీ కూల్గా ఉండాలి. నా శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో తెలుసుకుంటూ, 20 ఏళ్లుగా డైట్ ప్లాన్ చేస్తున్నాను. రోజూ ఉదయం నట్స్, డ్రై ఫ్రూట్స్తో రోజును స్టార్ట్ చేస్తాను. వర్కౌట్స్ తర్వాత సలాడ్స్, ఫుడ్ సంప్లిమెంట్స్ తీసుకుంటాను. ఒక పూట భోజనానికే ప్రాముఖ్యత. 40 ఏళ్ల తర్వాత హార్మోన్లలో చాలా వేగంగా మార్పులు వస్తుంటాయి. మన ఆరోగ్యం హార్మోన్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఆహారపదార్థాల్లో పోషకాలు బాగా తగ్గిపోయాయి. అందుకే నిపుణులు సూచించిన మెడికల్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకుంటాను. బయటి ఫుడ్ తీసుకోను...లంచ్ టైమ్లో ఒక వరస క్రమాన్ని పాటిస్తాను. మొదట కడుపులోకి వెళ్లాల్సింది పీచుపదార్థాలు. అందుకని కూరగాయలతో చేసిన సలాడ్ ముందుగా తీసుకుంటాను. తర్వాత ప్రోటీన్ డైట్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తీసుకుంటాను. బయటి ఫుడ్ దాదాపు తీసుకోను. ఉప్పు... చక్కెర తక్కువమన శక్తి స్థాయులు పెరగాలంటే ఉప్పు, పంచదార వాడకం బాగా తగ్గించేయాలి. అలా చేయడం వల్ల ఎనర్జీ ఏ మాత్రం తగ్గదు. సీజనల్ ఫ్రూట్స్ని ఎప్పుడూ వదులుకోను. వీటిని అరగంటసేపు నీటిలో నానబెట్టి, తీసుకుంటే రసాయనాల ప్రభావం తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్ సాయంత్రం 4:30 కి తీసుకుంటాను. తర్వాత బ్లాక్ కాఫీ. కాఫీ లేదా టీ పాలతో తీసుకుంటే బరువు పెరుగుతారు. అందుకని బ్లాక్ కాఫీ తీసుకుంటాను. సాయంకాలం ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటాను. దీని వల్ల బరువు 70 కేజీలు ఉన్నా, సన్నగా కనిపిస్తాను. ప్రోటీన్ పౌడర్కి, యోగర్ట్, కొన్ని ఫ్రూట్స్ కూడా కలిపి తీసుకుంటాను. సూర్యాస్తమయం తర్వాత ఏదీ తినను. ఏడాది మొత్తం నా డైట్ చార్ట్ ఇలాగే ఉంటుంది.కండరాల బలానికి...వేసవిలో డీ హైడ్రేట్ అవకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఎప్పుడైనా లో ఎనర్జీ అనిపిస్తే ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన చల్లని నీళ్లు తీసుకుంటాను. రోజులో 3–4 లీటర్ల నీళ్లు తాగుతాను. జనరల్ ఫిట్నెస్ కోసం వారంలో 2–3 సార్లు వర్కౌట్స్ చేస్తాను. దీనివల్ల బరువు కూడా మెయింటెన్ అవుతుంది. వృద్ధాప్యంలో కండరాల బలం కోల్పోకుండా ఉండాలంటే ఇప్పటినుంచే వాటికి పని పెట్టాలి. అందుకని వ్యాయామం తప్పనిసరి. అందం గురించి కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకోవడం జీవితాంతం చేసే ప్రయాణం. అందుకు నా జీవనశైలిని కూడా ఫిక్స్ చేసుకున్నాను’’ అని వివరించారు అస్మిత. నిర్వహణ: నిర్మలారెడ్డి (చదవండి: డాబా నిద్రలు కజిన్స్తో కబుర్లూ) -
డాబా నిద్రలు కజిన్స్తో కబుర్లూ
డాబా’, ‘మిద్దె’, ‘మేడ’... ఈ మాటలు పిల్లలకు తెలుసో లేదోగానీ వేసవి వస్తే ఊళ్ల నుంచి వచ్చిన కజిన్స్తో డాబా మీద చాపలు పరుచుకుని ఆకాశాన్ని చూస్తూ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం పెద్ద లగ్జరీ. అనుబంధాలకు బేస్మెంట్. నగరాల్లో సరే... ఊళ్లల్లో కూడా పిల్లలకు ఈ భాగ్యం ఉండటం లేదు. ఒకప్పటి ఈ దేశీయ ఆనవాయితీ కాలక్రమంలో ‘స్లీపోవర్’గా మారింది. కాని సిసలైన స్లీపోవర్స్ను ఈ వేసవిలో పెద్దలే కలిగించాలి. చుక్కల ఆకాశం. ఆగి ఆగి రివ్వున వీచే గాలి. సాయంత్రం నీళ్లు చల్లి డాబా నేల మీదున్న ఉడుకంతా కడిగిస్తే రాత్రికి వేడి కాస్త నిమ్మళించి ఉంటుంది. ఇంట్లోని ఎక్కడెక్కడివో చాపలు, బొంతలు, దుప్పట్లు, పరుపులు, దిండ్లు పైకి వస్తాయి. పక్కలు ఏర్పాటవుతాయి. టేబుల్ ఫ్యాన్ ఉంటే అది కూడా తోడు నిద్రపోవడానికి వస్తుంది. చెంబులు, వాటర్ బాటిల్స్లో నీళ్లు ఒక పక్కగా సిద్ధమవుతాయి. పెద్దవాళ్లు వాళ్ల పాతకబుర్లు చెప్పుకోవడం మొదలుపెడతారు. పిల్లల కోసం వేసిన వరుసలో పిల్లలు ఊరికూరికే నవ్వుతుంటారు. ఏమిటేమిటో మాట్లాడుతుంటారు. ‘ఏరా... నిద్రపోరా?’ అని పెద్దలు గదిమితే నిద్రపోతారా? వారికి నిద్రే రాదు. ఎందుకంటే అది వేసవి కాలం. అది డాబా మీద పక్క. తోడు ఉన్నది ఇష్టమైన బంధువులు. అన్నయ్యలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు, కజిన్స్... రాక రాక వచ్చారు. రాత్రిని నిద్రలో వృ«థా చేయరు పిల్లలు. కబుర్లే కబుర్లు చెప్పుకుంటారు. పాతకాలం దాటి వచ్చిన పెద్దవారిని వేసవి కాలం గురించి అడిగితే వారు ఇష్టంగా చెప్పుకునే జ్ఞాపకం మేడ మీది నిద్రలే. ఎండవల్ల ఇంట్లో ఉబ్బరింత భరించలేక డాబా మీద, బయటి అరుగుల మీద, పెరట్లో, ఆఖరుకు వీధిలో కూడా మంచాలు వేసుకుని వరుసగా కొలువు తీరి పొద్దు పోయేంత వరకూ వేసే బాతాఖానీ తలుచుకుంటారు. పిల్లలుగా ఉండగా ఏం మాట్లాడుకున్నారో గుర్తు ఉండదుగాని అలా నిద్ర΄ోవడంలోని ఆనందం గుర్తు ఉంటుంది.పుణ్యక్షేత్రాలలో, జాతరలలో, తిరునాళ్లల్లో గుంపుగా నిద్ర పోయినప్పుడు ఉత్సాహం వస్తుంది మనిషికి. పిల్లలకైనా అంతే. గుంపుగా కలిసి ఆరుబయలులో పడుకోవడం హుషారు. బంధువుల పిల్లలు వస్తే ‘వీళ్లు మనవారు’ అనే భావనతో విపరీతమైన దగ్గరితనం ఏర్పడుతుంది ఆ సమయాన. లోలోపల ఉన్న మొహమాటాలు పోయి ఓపెన్ అవుతారు. స్కూలు, పుస్తకాలు, సినిమాలు, ఆటలు, స్నేహితుల పేచీలు, టీచర్లు... ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటారు. వయసులో పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు అనేక విషయాలు చెబుతారు. చిన్న పిల్లలు కుతూహలంగా విని తెలుసుకుంటారు. ఈ ‘చెప్పడం వినడం’ అనేది వేసవి సెలవుల డాబా నిద్రల్లో అద్భుతంగా సాగుతుంది. చదవక ముందు పెసలు, చదివాక పిసలు అయినట్టుగా మన దగ్గర వందల సంవత్సరాలుగా ఉన్న పద్ధతి ఇప్పుడు శాస్త్రంగా వినాల్సి వస్తోంది. పిల్లలు ఎన్ని జోకులు వేయగలరో, ఎన్ని మిమిక్రీలు చేయగలరో, ఎన్ని వెక్కిరింతలు లోపల దాచుకుని ఉంటారో, ఎంత అబ్జర్వ్ చేసి ఉంటారో ఇవన్నీ తమ మనుషులతో తమకంటూ సమయం దొరికినప్పుడు బయటకు వెల్లడి చేస్తారు. కజిన్స్తో వేసవి నిద్రల్లో ఏముంది అనుకోవచ్చు నేడు. అదొక కౌన్సెలింగ్. అదొక వైద్యం. అదొక డీటాక్సినేషన్. వెన్నెలా చంద్రుడూ అందించే ‘ఎస్’ విటమిన్. ఎస్ అంటే సంతోషం. వేసవి సంబరం.మూసి ఉన్న ఇళ్ల నుంచి, మూసి ఉన్న తరగతి గదుల నుంచి ఆరుబయలుకు వచ్చి స్వేచ్ఛాకాశం కింద నిద్రపోవడం వేసవిలో పిల్లలకు కొత్త అనుభూతిని ఇచ్చి అందాకా అనుభవించిన బోర్డమ్ను తొలగిస్తుంది. అందుకే నగరాల్లో బాలల సైకియాట్రిస్టులు స్లీపోవర్లను ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు బంధువుల పిల్లలతో వేసవిలో సాగిన సామూహిక నిద్రలు ఇప్పుడు కరువవడంతో కనీసం ఏదో ఒక ఫ్రెండ్ ఇంట్లో పిల్లలంతా ఒక రాత్రి నిద్ర΄ోవడానికి చేరి కబుర్లు చెప్పుకుని వొత్తిడి దూరం చేసుకోమంటున్నారు. (చదవండి: Fart Walk: రాత్రి భోజనం చేసిన తర్వాత నడుస్తున్నారా?.. ఇలా చేశారంటే..) -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్నెస ట్రెండ్కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
ఏసీతో పనిలేకుండానే హీట్ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం. -
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు వారాలు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదు వారాల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించిందని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు నిద్రకు ఉపక్రమించేందుకు సురక్షితమైన స్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక జరిగినప్పుడూ.. ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.సాధనకు సరైన సమయం.. తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.పరికరం.. ఆరోగ్యకరం..సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది. అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు. ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?వేసవిలో సంగీత ప్రయాణం చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ గిటార్ సాధన చేస్తున్నా.. పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండచదవండి: Vaibhav Gautam వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు! -
స్లిమ్గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఇంతవరకు ఎందరో వెయిట్ లాస్ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్లు వర్కౌట్లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్బస్టర్ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్ డైట్ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. ఆ మందులపై అపోహ ఎక్కువ..ఓజెంపిక్, మౌంజారో వంటి జీఎల్పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెబుతున్నారు. భారత్లో ఎలి లిల్లీ లాంఛ్ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.Under medical guidance, I began Mounjaro to address rising blood sugar levels in the pre-diabetic range and to manage my steadily increasing weight. Paired with a committed lifestyle shift—high-protein meals, minimal sugar and alcohol, regular strength training, proper hydration,… pic.twitter.com/R0GnHuEcl7— Hansal Mehta (@mehtahansal) May 1, 2025గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..) -
పాతచీరలను అప్సైక్లింగ్ చేసి..స్టైలిష్గా మార్చేయండిలా..!
అప్ సైక్లింగ్ వార్డ్రోబ్లను చెక్ చేసుకుంటే కుప్పలుగా ఉన్న చీరలు, దుపట్టాలు కొన్నిచీరలు తమ పెళ్లినాటివి అయి ఉంటాయి. అమ్మ, అమ్మమ్మలు ఇచ్చిన జ్ఞాపకాల చీరలు సరేసరి మరికొన్నింటికి బ్లౌజ్లు పాతవయ్యావని పక్కన పడేసినవి కొన్ని... ఓల్డ్మోడల్ అయ్యాయని కొన్నిపక్కన పెట్టేసినవి ఉంటాయి.ఇలాంటి వాటన్నింటినీ ఈ సమ్మర్ రోజుల్లో కొత్తగా రూపు కట్టేలా ప్లాన్ చేయవచ్చు. మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్లను గమనిస్తూ కాలానుగుణంగా పాతచీరలను అప్సైక్లింగ్ చేసి, మీదైన కొత్తశైలిని వ్యక్తీకరించవచ్చు.అప్సైక్లింగ్ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతాం. వృధానూ అరికట్టవచ్చు.అంచులను మార్చి...అంచు ఉన్న కాటన్, పట్టుచీరలతో చేసిన ఇండోవెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, ఆర్గంజా, నెటెడ్ చీరల నుండి అనార్కలీలు, లాంగ్ గౌన్లు, కుర్తీలు డిజైన్ చేయించవచ్చు. పట్టు, బ్రొకేడ్, బెనారస్ వంటి వాటితో ఓవర్ కోట్స్, లాంగ్ జాకెట్స్, పలాజోలు, స్కర్ట్లు డిజైన్ చేయవచ్చు.ప్యాచ్ వర్క్పల్లూ, లేదా అంచులు కొద్దిగా చిరిగిన చీరలకు చిరిగిన అంచును తీసివేసి, జరీ, సీక్వెన్స్, కుందన్ వర్క్ చేసిన ప్యాచ్వర్క్ అంచును జత చేసి, తిరిగి వాడచ్చు. పాతకాలం నాటి చీరలను సల్వార్ సూట్లుగా మార్చవచ్చు. చీర పల్లూని పైభాగానికి ఉపయోగించవచ్చు. అంచులను నెక్కి, చేతులకు వాడచ్చు. కాంట్రాస్ట్ ప్యాచ్వర్క్ బోర్డర్లనూ జత చేయవచ్చు. బాటమ్, దుపట్టా కోసం మరొక పాత చీరను ఉపయోగించవచ్చు.లాంగ్ గౌన్లువన్పీస్ లాంగ్గౌన్లు ఎప్పుడూ ట్రెండ్లోనే ఉంటున్నాయి. అందుకని, పాతచీరను ఉపయోగించి లాంగ్ గౌన్ను తయారు చేయించుకోవచ్చు. అదనపు మెటీరియల్కి కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ను వాడచ్చు. చీరలను ఉపయోగించిన డ్రెస్సులనే కాదు, కటింగ్లో వృథాగా పడేసే ఫ్యాబ్రిక్తో ఫ్యాషన్ జ్యువెలరీనీ రూపొందించవచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ వేర్కి ముఖ్యంగా వేసవిలో మరింత ఆధునిక అట్రాక్షన్ను అద్దుతుంది. (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..
ఇంటిల్లిపాదికి శక్తిని ఇవ్వడానికి కష్టపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అందరూ తిన్నాక మిగిలినదో, ఫ్రిజ్లో ఉంచి తీసినవి తినడమో చాలా మంది చేస్తుంటారు. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోరు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, గర్భిణులు 30 శాతానికి పైగా రక్త హీనతతో బాధపడుతున్నారని నివేదికలు చూపుతున్నాయి. పోషకాలపై దృష్టి అవసరంజీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కేవలం ఆహార ప్లానింగ్ వల్లనే కాదు... తిన్నది జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి వాటితోనూ వస్తుంటాయి. తమ శరీరానికి ఏ ఆహారాలు సరిపడుతున్నాయో, సమస్య దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అవగాహన కలుగుతుంది. సహజంగా మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కొంత రక్తం పోతుంటుంది. దానిని భర్తీ చేయడానికి ఐరన్ సమృద్ధిగా లభించే బీట్రూట్, వేరుశనగ వంటి నట్స్ తీసుకోవాలి. ఆహారం తయారు చేసినప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయనుకుంటే పొరబాటు. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.పరీక్షలతో లోపాల గుర్తింపుఆహారం ద్వారా శరీరానికి పోషక విలువలు ఎంతమేరకు అందుతున్నాయి, హార్మోన్ల స్థితి ఎలా ఉంది.. అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు, ఫంక్షనల్ టెస్ట్లు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాహార లోపాలను గుర్తించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను అంచనా వేయడంలోనూ, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలోనూ ఈ టెస్టులు సహాయపడతాయి. కండరాల పటుత్వానికి40 నుంచి 50 ఏళ్ల మహిళల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. ఈ వయసులో సమతుల ఆహారంపై దృష్టిపెట్టకపోతే ఆ తర్వాత వయసులో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకని ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ డి ... ఉండే ఆహారాలతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. విశ్రాంతికీ ప్రాధాన్యత ఇవ్వాలిసమతుల ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో పనుల వల్ల అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి అనే విషయంలోనూ అంతే జాగ్రత్త చూపాలి. అందుకు ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్ర ఉండాలి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రుతుక్రమ దశలోనూ, మెనోపాజ్ దశలోనూ భావోద్వేగాలలో మార్పు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆహారం నుంచి తగినన్ని పోషకాలు అందక΄ోతే నిపుణుల సాయంతో సప్లిమెంట్స్ వాడాలి. ప్రతి పోషకాన్నీ కవర్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం, ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం. – డాక్టర్ సమత తూళ్ల, ఎమ్.డి, మెడికల్ డైరెక్టర్, కో–ఫౌండర్, పిఎమ్ఎక్స్ హెల్త్ (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
పేరెంటింగ్ నియమాలు తరానికీ తరానికీ మారుతున్నాయి. కొత్త తరం పేరెంటింగ్లో చాలా ఫ్లెక్సిబుల్గా, ఎంçపతీతో ఉంటోంది. పిల్లలతో చాలా దృఢమైన బంధాన్ని కోరుకుంటోంది. పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం ఎటువంటి భయాలూ, బిడియాలూ లేకుండా తాము అనుకున్నది ధైర్యంగా కమ్యూనికేట్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రోల్మోడల్ పేరెంటింగ్ రూల్ పాటించాలనుకుంటున్నారు. యాభైఏళ్ల కిందట పేరెంటింగ్లో క్రమశిక్షణ అనే పదం వీర విహారం చేసేది. నాన్న ఇంట్లో ఉంటే పిల్లల అల్లరి వినిపించకూడదు, పుస్తకం పట్టుకుని కనిపించాలి. నాన్న ప్రశ్నిస్తే వినయంగా సమాధానం చెప్పాలి. నాన్న ఎదుట పడాలంటే భయం. ఈ చట్రంలో పెరిగిన తరం, ఆ తర్వాతి తరం ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. ఈ జెన్ జెడ్ పేరెంట్స్ తమ పిల్లల విషయంలో భౌతికపరమైన క్రమశిక్షణ పాటించడం కంటే తల్లిదండ్రుల మాట మీద విశ్వాసం, అర్థం చేసుకోవడం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇంటి నిండా బొమ్మలే!జెన్ జెడ్ పేరెంట్స్ తమ బాల్యంలో ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోననే నియమావళిని రూపొందించుకుంటున్నారు. బాల్యంలో తాము నొచ్చుకున్న సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పిల్లల మనసు గాయపరచకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. ఇందులో విపరీతమైన షాపింగ్ ఒకటి. గత తరం పేరెంట్స్ చేతిలో డబ్బు పరిమితంగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా అందుతోంది. రోజువారీ శ్రామికుల కుటుంబాలు కూడా తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని సరదాలకు ఖర్చుపెడుతున్నాయి. అప్పట్లో ఏడాదికో రెండేళ్లకో ఒక బొమ్మ కొనిస్తే... ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతిక–ముప్పై బొమ్మలకు తక్కువ కాకుండా షెల్ఫ్లు నిండిపోతున్నాయి. పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే క్రమంలో ‘నో’ చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్న జెన్ జెడ్ పేరెంటింగ్ పిల్లలకు తాము కూడా ‘నో’ చెప్పవచ్చనే సంగతి మర్చిపోతున్నారు. ఇక మగపిల్లలు ఏడవకూడదనే సామాజిక షరతును ప్రశ్నిస్తున్న మనస్తత్వ నిపుణులు ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వండి’ అంటున్నారు. కాలం మారుతున్న క్రమంలో వస్తున్న మార్పులివన్నీ. ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వాలి, వారిలోని సున్నితత్వాన్ని పరిరక్షించాలి’ అని చెబుతున్న న్యూజెనరేషన్ పేరెంటింగ్ దానిని అమలు చేయడంలో మాత్రం తార్కికతను కోల్పోతోందన్నారు ట్రాన్స్పర్సనల్ హోలిస్టిక్ కోచ్ అర్పితాగుప్త. సంతోష క్షణాలు!ఈ తరంలో దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పేరెంట్స్ కూడా తమ బిడ్డ ఆడుకోవడానికి అక్క,చెల్లి, అన్న, తమ్ముడు లేని బాల్యాన్ని మిగిల్చామని అర్థం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని లోటు తీర్చడం కోసం పిల్లలతో తల్లులే కాదు తండ్రులు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. వారిని ఆటల్లో ఎంగేజ్ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తున్నారు. వాళ్లు పెద్దయిన తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటే తల్లిదండ్రులతో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు గుర్తు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లల మెదళ్లలో విరిసిన ఆలోచనను చక్కగా వ్యక్తం చేయగలిగేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆలోచనలను, ఆకాంక్షలను కొట్టిపారేయకుండా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లల కెరీర్ విషయంలోనూ వారి అభిరుచులను సమాజం గిరిగీతలను పట్టించుకోకుండా స్వాగతిస్తున్నారు. మొత్తంగా చూస్తే తమ బాల్యంలో తమకు కలలుగానే ఉండిపోయిన అన్నింటినీ తమ పిల్లలకు అందిస్తున్నారు. ఒక్క మాటలో చె΄్పాలంటే పిల్లల బాల్యంలో తామను తాము ప్రతిక్షేపించుకుంటున్నారు. తమకు దక్కని సంతోషాలను చాలా ఎక్కువగా అందించాలని తపన పడుతున్నారు. ఆదర్శవంతమైన పేరెంటింగ్కి ప్రతిరూపాలుగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఆచరణలో ఒకింత సమతుల్యత, సమన్వయం అలవరుచుకుంటే జెన్ జెడ్ పేరెంటింగ్ రోల్ మోడల్ పేరెంటింగ్ అవుతుంది.ఓ ఆశ్చర్యకరమైన సంఘటనఅది మహారాష్ట్రలో ఓ పర్యాటక ప్రదేశం. నడిరోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించి΄ోయింది. ఏం జరిగిందో చూద్దామని కొందరు తమ వాహనాలు దిగి ముందుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు, 30 ఏళ్లుంటాయి, తన కారును చూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ‘ఏమైంది’ అని అడిగారెవరో. కారు మీద పడిన గీతలు చూపిస్తూ మళ్లీ భోరుమన్నాడతడు. అది అతడికిష్టమైన కారు, ముచ్చటపడి కొనుక్కున్న కారని చెప్పి వెక్కిళ్లు పెడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు కారు లోపల ఉన్నారు. ‘మా అబ్బాయి చాలా సున్నితమనస్కుడండీ. తనకిష్టమైన కారుకి గీతలు పడితే భరించలేక΄ోతున్నాడు’ అన్నారు వాళ్లు సమర్థింపుగా. మగవాళ్లు ఏడవకూడదని బాల్యంలోనే మైండ్ని కండిషన్ చేసే పెంపకం ఒకప్పటిది. ఎమోషన్స్సకి లింగభేదం ఉంటుందా అని ఏడుపు వచ్చినప్పుడు అన్ కండిషనల్గా ఆ ఎమోషన్ని వ్యక్తం చేయవచ్చనే వాదన నేటిది. అయితే పైన చెప్పుకున్న కండిషన్లో ఆ కుర్రాడి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఎమోషన్స్ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి విషమిస్తుంది. పరిణతి చెందిన వాళ్లం కొంతమందిమి కలగచేసుకుని ‘కారు పక్కకు తీసుకుని, ఎమోషన్ కంట్రోల్ అయిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించండి’ అని సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని చెబుతున్నారు అర్పితాగుప్తా, హోలిస్టిక్ కోచ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: -
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్ విషయం లో స్ట్రిక్ట్గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్ అని, ఫ్యాట్ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. సాంబార్ కాంబినేషన్ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్ అటు ప్రోటీన్ రెండూ అందుతాయి. బ్రౌన్రైస్ని ప్రిఫర్ చేస్తాను. మన రోజుని మనం హెవీ బ్రేక్ఫాస్ట్తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్ ఎంత లైట్ అయితే అంత బెటర్. అందుకే నేను సూప్ లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్ అయితే నా వారం ప్లాన్ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్కి నేను దూరం. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్సైజ్లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్ అండ్ ఫైన్గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్ అండ్ ఫైన్గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్సైజ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్ బాడీ వర్కవుట్స్ చేస్తాను. – డి.జి. భవాని(చదవండి: -
'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
చాలా రకాల డైట్లు, వాటి ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. అయితే ఆ డైట్లలో కొన్ని మంచివైతే..మరికొన్ని మన శారీరక ధర్మానుసారం వైద్యులను సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా.. సరికొత్త డైట్ ట్రెండ్ అవుతుంది. దీర్ఘాయువుని అందించే సూపర్ డైట్గా శాస్త్రవేత్తలచే కితాబులందించుకుంది. అదీగాక ఈ డైట్తో మంచి ఆర్యోగం సొంతం అని హామీ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఏంటీ డైట్..? అదెలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం.!.ఐకానిక్ పర్వతం 'కిలిమంజారో' పేరుతో ఉన్న ఈ డైట్ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపోయాలే సత్ఫలితాలనిస్తోందట. డచ్ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ నమ్మకంగా చెబుతున్నారు. పాశ్చాత్యా ఆహార విధానం కంటే.. ఈ డైట్తోనే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిపారు. అందుకోసం టాంజానియా(Tanzania)లోని ప్రజలు, ముఖ్యంగా అగ్ని పర్వతాలకు సమీపంలో నివశించే ప్రజలపై పరిశోధనలు చేయగా.. వివిధ ప్రాంతాల్లో ఉండే మానవాళి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉండటం గమినించారు. వాళ్లంతా కిలిమంజారో డైట్ని అనుసరిస్తారట. పరిశోధకులు సగటున 25 సంవత్సరాల వయస్సు గల దాదాపు 77 మంది ఆరోగ్యకరమైన టాంజానియన్ పురుషులపై అధ్యయనం చేశారు. వారిలో 23 మంది కిలిమంజారో ఆహారాన్ని అనుసరించగా, 22 మంది ప్రాసెస్ చేసిన ఆహారం అందించారు. అయితే కిలిమంజారో డైట్ తీసుకున్నావారిలో వాపు తగ్గుదల, మెరుగైనా రోగనిరోధక పనితీరు ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడితో ఆపకుండా వారాలు తరబడి ప్రయోగాలు కొనసాగించగా..సానుకూల ప్రయోజనాల తోపాటు, దీర్ఘాయువుకి తోడ్పడుతుందని తెలుసుకున్నారు. కలిగే లాభాలు..అనేక దీర్ఘకాలిక పరిస్థితులకు వాపులే మూలం. వాటిని ఈ డైట్ నివారిస్తుంది. జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందిగుండె జబ్బులు, మధుమేహం, వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. చివరగా ఇది దీర్ఘకాలిక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన ఆహారం.ఇక టాంజానియా అధికారికంగా బ్లూ జోన్గా గుర్తింపు సైతం దక్కించుకుంది. ఇక్కడ బ్లూజోన్ అంటే ఆ ప్రాంతంలోని ప్రజలు సగటున ఎక్కువ కాలం జీవించడం, మంచి ఆరోగ్యపు అలవాట్లు కలిగి ఉంతే..ఆ దేశానికి ఈ గుర్తింపు ఇస్తారు. అంతేగాదు ఇక్కడ సగటు ఆయుర్దాయమే 67 సంవత్సరాలంటే..ప్రజలంతో ఎంత మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ డైట్లో ఏం ఉటాయంటే..కిలిమంజారో ఆహారంలో ఓక్రా, అరటిపండ్లు, కిడ్నీ బీన్స్, మొక్కజొన్న వంటి సరళమైన ఆహారాలే ఉంటాయట. ప్రాసెస్ ఫుడ్కి చోటుండదు. మెక్కల ఆధారిత ఆహారాలు, కూరగాయలు, పండ్లు తదితరాలు.ప్రోబయోటిక్లను కలిగి ఉన్న సౌర్క్రాట్, పులియబెట్టిన ఆహారాలు కూడా ఉంటాయి. మెడిటేరియన్ డైట్తో సమానంగా సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలం ఆరోగ్యవంతంగా జీవించాలనుకునే వారికి ఇది బెస్ట్ డైట్ అని అన్నారు. రానున్న కాలంలో కిలిమంజారో ఆహారం దీర్ఘాయువుకు సీక్రెట్గా ఉంటుందని అన్నారు నిపుణులు. అలాగే ఈ డైట్లో తీసుకునే ఆహారాలు అకాల మరణాలను చాలా వరకు నివారిస్తాయని నమ్మకంగా చెప్పారు పరిశోధకులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: రన్నింగ్ రేసులో బామ్మ వరల్డ్ రికార్డు ..! ఆమె ఫిట్నెస్కి శాస్త్రవేత్తలు సైతం ఫిదా..) -
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
వయసుతో సంబంధం లేకుండా కొందరు అద్భుతాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. అదికూడా లేటు వయసులో సాహసోపేతమైన పనులు చేసి వయసు అనేది శరీరానికే గానీ మనసుకు కాదని చేతల్లో చూపిస్తుంటారు. వృద్ధాప్య దశలో పీజీలు, పీహెచ్డీలు చేస్తే..కొందరు మాత్రం ఆ వయసుకి సాధ్యవుతాయా..? అనేలా ఛాలెంజింగ్ సాహసాలకు పూనుకుని, రికార్డులు సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ 91 ఏళ్ల బామ్మ. ఈమె ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. శాస్త్రవేత్తలక సైతం ఆమె చురుకైన యాక్టివిటీని చూసి కంగుతిన్నారు.ఇటలీకి చెందిన 91 ఏళ్ల ఎమ్మా మరియా మజ్జెంగా(Emma Maria Mazzenga) అనే బామ్మ 90 ప్లస్ 200 మీటర్ల రన్నింగ్ రేసులో ఊహకందని విధంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. జస్ట్ ఒక్క నిమిషంలోపే రన్నింగ్ రేస్ని ముగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆ వయసులో మరొకరి సాయం లేనిదే అడుగులు వేయలేరు. కానీ ఆమె మాత్రం చాలా వేగంగా పరుగులు తీయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా ఎలాంటి ఆయాసం లేకుండా యువకుల మాదిరిగా అత్యంత ఉత్సాహంగా పరుగులు తీయడం అత్యంత షాకింగ్ విషయం. ఆమె తోటివారందరూ ఆయాసంతో ఆందోళపడుతుంటే..ఆమె మాత్రం చాలా ప్రశాంతంగా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. ఈ వయసులో ఆ బామ్మ మజ్జెంగా ఇంత చురుగ్గా ఉండటానికి వెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటా అని ఆసక్తిని రేకత్తించింది. చివరికి అదేంటో సవివరంగా తెలుసుకున్నారు కూడా.ఇక్కడ బామ్మ 200 మీటర్ల పరుగును కేవల 51.47 సెకన్లలో పూర్తిచేసి, మునుపటి 90-ప్లస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఇంత వేగంగా చేయడానికి ఆమె శరీరం ధర్మం ఎలా సహకరిస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అందుకోసం ఆమెకు శారీరక కసరత్తులకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి మరీ ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకున్నారు. 90 ఏళ్ల వయసులో బామ్మను సూపర్ ఫిట్గా ఉండేలా చేసినవి..పుణుల అభిప్రాయం ప్రకారం బామ్మ మజ్జెంగా వండర్ ఉమెన్. అందుకు రెండే రెండు ప్రధాన అంశాలని చెబుతున్నారు. ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్నెస్లో ఆమె గుండె,ఊపిరితిత్తులు, రాలకు ఆక్సిజన్ను పంప్ చేసే విధానం 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన మహిళతో సమానంగా ఉంటుందట.ఆమె కండరాలు ప్రత్యేకమైనవి మరియు తక్కువ బర్నింగ్ని కలిగి ఉంటాయి. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండటంతో అలిసిపోతు. అందువల్లే ఆమె సుదురాలకు సులభంగా పరిగెత్తగలతు. ఆమెలో "చాలా ఎక్కువ శాతం" వేగవంతమైన సంకోచ ఫైబర్లు కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే ఆమె వేగవంతమైన కదిలికలకు కారణమని అన్నారు. ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఈ 200 మీటర్ల రన్నింగ్ రేసులో అలవోకగా రికార్డు చేచేసందుకు దారితీసిందని చెబుతున్నారు డాక్టర్ మార్టా కొలోసియో.ఈ ప్రత్యేకమైన శరీరాకృతి ఎలా వచ్చిందంటే..ఆమె దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తోంది. అదే ఆమె శరీరానికి వరంగా మారింది1933లో జన్మించిన మజ్జెంగా మొదట విశ్వవిద్యాలయంలో తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది, 100, 200, 400 మరియు 800 మీటర్ల రేసుల్లో కూడా పోటీ పడింది. అప్పటి నుంచే ఆమె విజయపరంపర మొదలైంది. ఆరోజుల్లో రోమ్లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్లలో నాల్గవ స్థానంలో నిలిచింది.తన విజయాలకు బ్రేక్పడింది పెళ్లి, పిల్లలు అనే చెప్పొచ్చు. అలా ఆమె రెండు దశాబ్దలకు పైగా తన ఫిట్నెస్ కెరీర్కు దూరంగాఉంది. మళ్లీ తిరిగి 1986లో తన కెరీర్ రన్నింగ్ రేస్లోకి వచ్చింద. అంటే.. 50ల వయసులో తన పాత సహచరులతో పోటీ పడటం మొదలైంది. మళ్లీ పుంజుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చినా..ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుందని అంటోంది బామ్మ. అదే కారణం..ఒక రేసు ఇచ్చే కిక్కే వేరు అంటోంది. ప్రతి శిక్షణా సెషన్ తనకు మంచి జీవితకాల వ్యాయామ శిక్షణ, అసాధారణ పనితీరుని అందిస్తుందట. అందువల్లే తొమ్మిది పదుల వయసులో కూడా ఇంతలా యువ క్రీడాకారులతో సరితూగేలా పోటీపడగలను అంటోంది. కాగా, బామ్మ ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్ విభాగంలో 28 ఉత్తమ ఇటాలియన్ పెర్ఫామెన్స్గా అవార్డులు గెలుచుకుంది. ఈ బామ్మ నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తి కదూ..!.(చదవండి: పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!) -
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్టాప్లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?) -
శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
రోజూ ఉదయం నుంచి వంటింట్లో చెమటలు కక్కుతూ వంటకాలతో కుస్తీ పడుతుంటుంది అమ్మ. ‘నీరసంగా ఉంటోంది.. ఏ పనీ చేయాలనిపించడం లేదు’ అని అంటూనే లేని ఓపికను తెచ్చుకొని పనులు చేస్తూనే ఉంటుంది. ‘కాళ్ల నొప్పులు.. కదలనివ్వడం లేదు’ అంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతుంటుంది బామ్మ. కాలేజీ నుంచి వస్తూనే ‘బ్యాగ్ కూడా మోయలేను.. అలసటగా ఉంది’ అంటూ సోఫాలో కూలబడిపోతుంది కూతురు. రోజూ మూడుపూటలా తింటూనే ఉన్నాం, అయినా ఎందుకిలా?! ఏ ఆరోగ్య సమస్యనో అని వైద్యులను కలిస్తే పోషకాహారం తీసుకోండి’ అని చెబుతుంటారు. మన శరీరానికి ఏయే పోషకాలు అవసరం, సీజన్కి తగినట్టు మన ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి. సింపుల్గా హెల్తీ వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చు... ఈ వివరాలతో వరుస కథనాలుమహిళల ఆరోగ్యం, ఫిట్నెస్కు సంబంధించి సమతులాహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పెరిగాయి. కానీ, మన రొటీన్ ఫుడ్ మాత్రం అలాగే ఉంటోంది. హార్మోన్ల సమతుల్యతకు, శక్తికి తినే ఆహారం చాలా ముఖ్యమైనది. సాధారణంగా మహిళలు తీసుకునే ఆహారంలో ఉండాల్సినవి ఐరన్, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు. శక్తికి ఇనుము... రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనం అవుతారు. త్వరగా అలసిపోతారు. రక్తస్రావం అధికం అవుతుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, తోటకూర. గోంగూర వంటి ఆకుకూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరంలో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి రోజువారీగా అవసరమైన ఐరన్ మోతాదు వారి వయసు, జెండర్పై ఆధారపడి ఉంటుంది. గర్భిణులు, బాలికలకు రోజూ 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. దీంతో పాటు విటమిన్ – సి ఉండే నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు, రసాలు తీసుకోవడం వల్ల ఒంట్లో ఇనుము శోషణ పెరుగుతుంది.పాల ఉత్పత్తులతో కాల్షియం... ఎముకల బలానికి,,, ప్రత్యేకంగా మెనోపాజ్ దశలో కాల్షియం అవసరం అధికం. అందుకు పాల ఉత్పత్తులు, బాదం, శనగలు, కాలీఫ్లవర్ .. వంటివి తినాలి. ∙గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం ఎక్కువ. ఆకుకూరలు, మాంసం, దాల్చిన చెక్క.. వంటి వాటి నుంచి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఒమేగా–3 ఫ్యాటి యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగ పడతాయి. ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చేపల నుంచి ఈ ప్యాటీ యాసిడ్స్ లభిస్తాయి శరీర బలానికి, కండరాల పెంపుకు ప్రోటీన్లు చాలా అవసరం. మినపపప్పు, చికెన్, గుడ్లు, నట్స్... నుంచి ప్రోటీన్లు లభిస్తాయి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఫైబర్ చాలా అవసరం. గోధుమ, మొక్కజొన్న, పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది.వయసుల వారీగా డైట్ చక్రటీనేజ్, యవ్వనం, గర్భధారణ, పిల్లలకు పాలు ఇవ్వడం, మోనోపాజ్, వయసు పైబడటం.. వంటి దశల ఆధారంగా పోషక అవసరాలు మారుతుంటాయి. కానీ, మన ఇళ్లలో సాధారణంగా అందరికీ ఒకేతరహా వంటను వండుతుంటాం. దీనివల్ల వయసుల వారీగా సరైన పోషకాలు శరీరానికి అందక, శక్తి సన్నగిల్లుతుంది. దీంతో చురుకుదనం తగ్గుతుంది. ఫలితం చేసే పనులపై ప్రభావం చూపుతుంది. అందుకని పోషకాహార చక్రం ఎవరికి వారు, వయసుల వారీగా ఆరోగ్యదాయకంగా మార్చుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. బాల్యం నుంచియవ్వనం (8–18 ఏళ్లు) వరకు శరీరం వృద్ధి చెందడానికి, హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల బలానికి ... పాల ఉత్పత్తులు, బాదం, ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, మటన్, చికెన్, బచ్చలి, బ్రొకోలి, బీట్రూట్.. మొదలైన ఐరన్ నిచ్చే పదార్థాలు ఈ వయసుకు కీలకం. బ్రేక్ఫాస్ట్: ఉప్మా/΄పొంగల్/ ఇడ్లీ.. + ఒక గుడ్డు + గ్లాస్పాలుమధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్/ రోటీ (2)+ పప్పు, ఆకుకూర, బీన్స్, పెరుగుసాయంత్రం స్నాక్స్: బాదం/జీడిపప్పు/ఇతర డ్రై ఫ్రూట్స్తో చేసిన స్నాక్స్ (చిన్న మోతాదులో)+ అరటి పండురాత్రి భోజనం: రోటీ (2) లేదా మినప పిండితో చేసిన అట్టు +ఏదైనా కూరగాయ + నిమ్మరసం కలిపిన వెజ్ సలాడ్యువతులకు (19–30 ఏళ్లు)రుతుక్రమం చురుకుగా ఉండటం, సంతానోత్పత్తి ప్లానింగ్కి సరైన సమయం. ఈ దశలో... ఐరన్ – ఫోలేట్ సమృద్ధిగా లభించే ఆకుకూరలు, అరటి మొదలైనవి తినాలి. ఒమేగా–3 యాసిడ్స్ ఉండే ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, వాల్నట్స్ను కూడా చేర్చుకోవాలి.. పీచుపదార్థాలు ఉండే గోధుమ, కూరగాయలు, జామ వంటి పండ్లు తినాలి. కాల్షియం కోసం పాలు, పెరుగు, టోఫు వంటివి తీసుకోవాలి. జింక్ సమృద్ధిగా లభించే చిక్కుళ్లు లాంటివి.. ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.గర్భధారణ సమయంలో...పిండం అభివృద్ధికి, తల్లి శక్తికి తీసుకోవాల్సినవి... డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ + ఆకుకూరలు, నువ్వులు, దాల్చిన చెక్క, ప్రోటీన్ల కోసం గుడ్లు, పప్పులు, చికెన్, కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, ఫైబర్కి పండ్లు, బ్రౌన్ రైస్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి చేపలు, ఫ్లాక్స్ సీడ్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.బ్రేక్ఫాస్ట్: గోధుమ రవ్వ/ ఓట్స్ ఉ΄్మా+ అరటి పండు + గ్లాసుడు పాలులంచ్: బ్రౌన్ రైస్ /రోటీ (2) / మెంతికూర పప్పు/ పెసరపప్పు+ బెండకాయ కూర, పెరుగు + కారట్/కీరా సలాడ్సాయంత్రం స్నాక్స్: బాదం/వాల్నట్ (4–5) +అరటిపండు / సపోటాడిన్నర్: రొట్టెలు (2) / మినప దోస, బీన్స్ / సొరకాయ కూర + గ్లాస్ మజ్జిగ.పాలిచ్చేతల్లులుతగినంత శక్తిని తిరిగి పొందడానికి, పాల వృద్ధికి తీసుకోవాల్సినవి.. ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, పండ్లు, లేత మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ తల్లులకు ప్రోటీన్ అందిస్తాయి. పాల ఉత్పత్తులు, నువ్వులు, ఆహారం జీర్ణం అవడానికి పల్చని మజ్జిగ మొదలైనవి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్: పెసరట్లు, అల్లం పచ్చడి+గ్లాసుడు పాలు/రాగి జావలంచ్: బ్రౌన్ రైస్+ మటన్/ చికెన్కర్రీ, మెంతికూర పప్పు, పెరుగు, గోంగూర పచ్చడి. సాయంత్రం స్నాక్స్: జీరా రసం + బాదం/మెంతి లడ్డు, ఏదైనా ఒక పండు. డిన్నర్: రోటీ (2)/మినప రొట్టె, పల్లీలు, బచ్చలి కూర రాత్రి పడుకునే ముందు (ఒంటిగంట లోపల) గ్లాస్ నీళ్లు లేదా చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చనిపాలు. బాగా ఆకలిగా అనిపిస్తే అర టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు. మెనోపాజ్ దశ 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్లాన్ చేసుకోదగిన పోషకాహారంలో హార్మోన్ల సమతుల్యత, ఎముకల బలం, కోలెస్ట్రాల్ నియంత్రణ పై దృష్టి పెట్టాలి. కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, సోయా, టోఫు వంటివి తీసుకోవాలి. చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, పీచుపదార్థాలు ఉండే కూరగాయలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే బెర్రీస్, నాటు, తాటి బెల్లం, గ్రీన్ టీలను చేర్చుకొని చక్కెర, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి... బ్రేక్ఫాస్ట్: (ఉదయం 8:00 – 9:00): ఓట్స్ + పాలు + కొద్దిగా వాల్నట్ లేదా బాదం (లేదా) రాగి దోస + పెసరపప్పు చట్నీ, ఒక అరటి పండు + గ్లాస్ నీరు. మధ్యాహ్న భోజనం (లంచ్ – 1:00): బ్రౌన్ రైస్ లేదా గోధుమ/జొన్న/సజ్జ రొట్టెలు, ఆకుకూరల పప్పు (గోంగూర, తోటకూర వంటివి), దుంపలు కాకుండా దోండకాయ/బీన్స్/బెండకాయ, సలాడ్ (కీరా, గాజర్), పెరుగు. సాయంత్రం స్నాక్స్ (5:30 – 6:00): గ్రీన్ టీ లేదా తులసి టీ (షుగర్ లేకుండా) నట్స్ (బాదం, నువ్వులు లేదా ఫ్లాక్స్సీడ్స్) (లేదా) ఆపిల్ / పియర్ / సపోటా రాత్రి భోజనం (డిన్నర్ – 7:30 – 8:00): గోధుమ రొట్టె (1–2). వెజిటబుల్ సూప్ లేదా తేలికగా జీర్ణం అయ్యే కూర (బెండకాయ, సొరకాయ వంటివి), మజ్జిగ (ఉప్పు తక్కువతో) తీసుకోవాలి.సమతుల్యత అవసరంఓవర్ ఈటింగ్/ తక్కువ తినడం రెండూ సమస్యలు తెచ్చిపెట్టేవే. వ్యక్తి శరీర బరువు, శ్రమను బట్టి డైట్ ΄్లాన్ చేసుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. ప్రతి వ్యక్తికి వారి శరీర బరువు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా డైట్ చార్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఉదాహారణ: 50 ఏళ్ల మహిళ డైట్ చార్ట్. ∙సమతుల్యత, ఎముకల ఆరోగ్యం, శక్తి ఉండేటట్లు డైట్ ప్లాన్ చేయాలి. ప్రత్యేక సూచనలు: రోజూ కనీసం 7,000 – 8,000 అడుగులు నడవాలి / యోగా / లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఉప్పు, స్వీట్స్ తక్కువగా వాడాలి. మెనోపాజ్ దశ కాబట్టి కాల్షియం, విటమిన్–ఇ విషయంలోప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాల ఉత్పత్తులు తప్పనిసరి. 15 నిమిషాలు శరీరానికి సూర్యరశ్మి నేరుగా తాకేలా చూసుకోవాలి. – డా.బి. జానకి, పోషకాహార నిపుణులు (చదవండి: 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..) -
'మైండ్బ్లోయింగ్ టాలెంట్'..! అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్..
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?మన హైదరాబాద్కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్లను పారిస్లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్లు, టెక్నికల్ టీమ్లలో పాల్గొనడం, ఈవెంట్ల నిర్వహించడం వల్ల కంఫర్ట్జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
వేసవి సెలవులు...అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు
ఘట్కేసర్: వేసవి సెలవులు అనగానే విద్యార్థులను అమ్మమ్మ, బంధువుల ఇళ్లు, విహారయాత్రలు పంపిస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో అందరిలో ముందుంటేనే గుర్తుంపు ఉంటుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అదనపు నైపుణ్యం సంపాదించడంపై దృష్టి సారిస్తే జీవితంలో రాణించవచ్చు. తద్వారా శారీరక, మానసిక వికాసం పెంపొందుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకే వేసవి సెలవులు వృథా చేయకుండా పిల్లలకు ఏదో ఒకటి నేరి్పంచాలని తల్లితండ్రులు భావిస్తున్నారు. ఫీజులు చెల్లించి మరీ వారి ప్రతిభకు సానబెడుతు పిల్లల అభిరుచులకు అనుగుణంగా పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఫీజులు చెల్లించి శిక్షణ పొందుతుండగా పేద పిల్లలకు ఆ అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం నూతనంగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని, శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తామని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాము, వైస్ ప్రిన్సిపాల్ రాములు తెలిపారు. ప్రతిభకు సాన... పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిని నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు సుశిక్షుతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లలిత కళల పాఠశాలలో రాష్ట్రంలోని ఒక్కో గురుకులం నుంచి ప్రతిభగల ఐదుగురి చొప్పున సుమారు 1200 మంది విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మలు, కార్డున్, ఫొటోగ్రఫీ, నకాసీ పెయింటింగ్, అల్లికలు, జర్నలిజం వేద గణితం, చేతిరాత, బంజారా ఎంబ్రాయిడరీ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అదనపు నైపుణ్యం పెంపొందుంచుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. సమయం వృథా చేయకూడదని... వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకూడదని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రోద్భలంతో వేసవి శిబిరానికి వచ్చాను. బంజారా ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్నా. అందరితో కలిసి నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – రిషిత, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆలేరు నైపుణ్యం పెంచుకునే అవకాశం... వేసవి శిబిరంలో అరుదైన కళ నకాసీ పెయింటింగ్, వేదిక్ మ్యాథ్స్లో శిక్షణ పొందుతున్నాను. వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లభింంది. జీవితంలో మరిపోలేని శిబిరం. వేసవి శిక్షణ శిబిరం నిర్వాహణ చాలా బాగుంది. –లోహిత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆలేరు ప్రతిభను వెలికి తీయాలని... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభకు సానబెట్టడానికి వేసవి శిబిరం నిర్వహిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు రాణించడానికి శిబిరం తోడ్పడుతుంది. సెలవులు సద్వినియోగం చేసుకునే వారికి బంగారు అవకాశం లభించింది.– వింధ్యారాణి, జోనల్ ఆఫీసర్ -
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్ వెడ్డింగ్గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్హ్యారీ, మేఘన్ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్కాస్ట్లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్కాస్ట్లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
ఆ పహల్గాం దారుణ ఘటన ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులెవ్వరికీ కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టి..బతికే ఉన్నామా..! అనే ఆందోళనలకు లోనవ్వుతున్నారు. ఆ ఘటనలో తమవాళ్లను తమ కళ్ల ముందే చంపేస్తున్న హృదయవిదారక దృశ్యాలు కనులముందు మెదులుతూనే ఉన్నాయంటున్నారు కొందరు బాధితులు. వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే..ఇక ఆ బాధితులకు బాధ వర్ణనాతీతమే. ఇప్పట్లో దాన్నుంచి బయటపడటం కూడా కష్టమే. అయితే ఇదే దుర్ఘటనలో వెంట్రుకవాసిలో ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. వాళ్ల భయానక అనుభవం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చకచక తెలుసుకుందామా..!కర్ణాటక చెందిన ప్రదీప్ హెగ్డే,అతని భార్య శుభ హెగ్డే, వారి కుమారుడు సిద్ధాంత్ ఏప్రిల్ 21న శ్రీనగర్కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు పహల్గామ్కు బయలుదేరారు. ఆ కుటుంబం టూర్లో 'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి చెందిన బైసరన్ ఉంది. అందుకోసం మూడు గుర్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రోడ్డంతా భయానకంగా, బురదగా జారేలా ఉండటంతో. పైకి చేరుకోవడానికి ఒక గంట 15 నిమిషాలు పట్టేసిందట వారికి. అయితే అప్పటికే కొంతమంది పర్యాటకుల గుంపు ఉంది. ఇక ప్రదీప్ హెగ్డే కుటుంబం కూడా వారితో జాయిన్ అవ్వాలనుకున్నారు. అయితే రైట్సైడ్ జిప్లైన్ ప్రారంభమయ్యే చోట ఖాళీ ప్రాంతం ఉండటంతో అక్కడే పోటోలు తీస్తూ.. గడిపిందట ఆ కుటుంబం. ఆ తర్వాత కొంతసేపటికి లోయలోని సాహస కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం వైపు ఉన్న స్టాళ్లువై పుగా సాగారు. సరిగ్గా అప్పటికే మధ్యాహ్నం 1.45 అయ్యింది. వాళ్ల కుమారుడు సిద్ధాంత్ ఆకలిగా ఉందని గొడవ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు ప్రదీప్. నచ్చచెబుతున్నా.. వినకపోవడంతో చేసేదేమి లేక ఇక అక్కడ ఓ స్టాల్ వద్ద మ్యాగీ ఆర్డర్ చేశామని అన్నారు. ఇక తన భార్య ఈలోగా వాష్రూమ్కి వెళ్లి వచ్చిందన్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఒక రౌండ్ కాల్పులు వినిపించాయి. అప్పుడే టీ కూడా ఆర్డర్ చేసినట్లు తెలిపారు ప్రదీప్. అయితే అవి క్రాకర్ల శబ్దాలు కావచ్చని దుకాణ యజమాని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నామని చెప్పారు ప్రదీప్. పైగా అవి బుల్లెట్ శబ్దాలని మాకస్సలు తెలియదని అన్నారు. ఇక సుమారు 15-20 సెకన్ల తర్వాత, పెద్ద తుపాకులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులను చూశామన్నారు. అందులో ఒక ఉగ్రవాది లోయ దిగువ భాగం వైపు వెళ్తుండగా, మరొక ఉగ్రవాది తమ వైపుకి దూసుకు వస్తున్నాడంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రదీప్. వెంటనే తమ కుటుంబం అంతా నేలపై పడుకుని ఉన్నాం. ఇంతలో తన భార్య టేబుల్పై తమ ఐడెంటిలన్నీ ఉన్న బ్యాగ్ని తీసుకునేందుకు పైకి లేచింది. అంతే ఒక తూటా ఆమె కుడి చెవి నుంచి దూసుకుపోయింది. అయితే ఆమె వంగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక ప్రదీప్ భార్య శుభ హెగ్డే కూడా మాట్లాడుతూ..తన వెంట్రుకలను రాసుకుంటూ ఏదో వెళ్తున్నట్లు అనిపించిందన్నారు. ఏంటా అని పక్కకు చూసేంతవరకు తెలియలేదు అది బుల్లెట్ అని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఒక్క క్షణం అసలేం జరగుతుందో అర్థంకానీ భయాందోళన ఎదురైంది. ఇంతలో ఎవరో గట్టిగా అరిచి గేటువైపుకి పరిగెత్తమని చెప్పారు. నూరుశాతం చనిపోతామనే అనుకున్నాం..అదంతా చూశాక కచ్చితంగా తన కుటుంబం అంతా చనిపోతుందనే అనుకున్నానని అన్నారు ప్రదీప్. అయితే తన భార్య మాత్రం ఏం జరగదు అని ధైర్యం చెబుతూనే ఉంది. నిజానికి ఆమె నమ్మకమే మమ్మల్ని కాపాడింది. అక్కడున్న పర్యాటకులంతా ఒకేసారిగా గేటు వద్దకు వచ్చేయడంతో తమ కొడుకు కింద పడిపోయాడన్నారు. అలా బయటకు వచ్చాక ఎటు వెళ్లాలి అనేది తెలియని గందరగోళానికి గురయ్యాం. గుర్రపుస్వారీ సైనికులు కనిపంచడంతో వాళ్లని రక్షించమని ప్రాధేయపడినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు మాకు రెండు గుర్రాలని అందించి కిందకు వచ్చేందుకు సహాయం చేశారంటూ ఆ బాధకరమైన అనుభవాన్ని వివరించారు ప్రదీప్ హెగ్డే. ఆ పర్యాటకుడి అనునభవం విపత్కర పరిస్థితుల్లో మసులుకోవాల్సిన విధానం తోపాటు..ఒకరు భయపడుతుంటే మరొకరు ఎలా సానుకూలంగా వ్యవహరించాలో చెబుతోంది. ఆ పరిస్థితుల్లో శుభా హెగ్డేలా ఏదో రకంగా ధైర్యం చెప్పాలే కానీ బ్యాలెన్స్ తప్పకూడదు. ఆ దృక్పథమే మనల్ని ఆపద నుంచి గట్టేక్కేలా చేస్తుందనడానికి ఆ పర్యాటకుడి కుటుంబమే ఓ ఉదహరణ. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
ఒరిగామిపై 1988లో ఆసక్తి పెంచుకున్న రవి కుమార్ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేలా ఈ కళ ఉపకరిస్తుందని గుర్తించారు. ‘ఒరిగామి ద్వారా గణితం – రవికుమార్ తోలేటి’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. కోవిడ్ సమయంలో విద్యార్థుల కోసం డీఐవై మోడల్స్ వీడియోలుగా అందించడంతో పాటు, శాస్త్రవేత్తల స్థాయిలో ప్రాజెక్టులు రూపొందించేందుకు ప్రేరణనిచ్చారు. పలు అవార్డులు.. గతంలో రవి కుమార్కు ఎన్సీఈఆర్టీ ఇన్నోవేషన్ అవార్డు (2002), రాష్ట్రపతి పురస్కారంగా ‘నేషనల్ టీచర్స్ అవార్డు’ (2005), కేవీఎస్ నేషనల్ ఇన్నోవేషన్ అవార్డులు (2012, 2019) లభించాయి. అలాగే 2022లో ప్రపంచంలో అతి పెద్ద ఒరిగామి నెమలిని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. నాలుగేళ్లు పట్టింది.. ఒరిగామి కళతో ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి సుమారు నాలుగేళ్ల సమయం పట్టింది. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఒరిగామిని వినియోగిస్తున్నా. ఇది ప్రాచీన జపాన్ కళ కాగా, ప్రస్తుతం పలు రంగాల్లో విస్తరిస్తోంది. ఇది కేవలం కళ కాదు, సృజనాత్మకత, ఆవిష్కరణల సమ్మేళనం. – రవి కుమార్ తోలేటి, ఒరిగామి కళాకారుడు (చదవండి: కొవ్వొత్తులతో పీస్ వాక్..! తీవ్రవాద నిర్మూలన, శాంతి స్థాపనకు..) -
కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
అప్పుడప్పుడు వంటగది చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిన్న చిట్కాలున్నాయి.పదును పెట్టే రాయి.. పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృథా కాదు.నైఫ్ షార్ప్నర్.. ఎలక్ట్రిక్, మాన్యువల్ కత్తి షార్ప్నర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.చాకుల్ని పొడిగా ఉంచాలి.. తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయి΄ోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.చాపింగ్ బోర్ట్.. గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.కటింగ్ టెక్నిక్.. చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కటింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్ల పాక నైపుణ్యం) -
పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
కోల్కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బీబీసి నేచురల్ హిస్టరీ యూనిట్ డైరెక్టర్. పశ్చిమబెంగాల్ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్ టు కెమెరాస్’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్గ్లాస్ సస్టెయిన్’ దారి చూపింది.‘రౌండ్గ్లాస్ సస్టెయిన్ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్. ‘రౌండ్గ్లాస్ సస్టెయిన్’ సంస్థను సియాటెల్కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్ప్రీత్ సన్నీసింగ్ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.‘రౌండ్గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్మేకర్స్తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్గ్లాస్ సస్టెయిన్ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్’ క్రియేటివ్ డైరెక్టర్, ఫిల్మ్మేకర్ సమ్రీన్ ఫారూఖీ. ‘రౌండ్గ్లాస్ సస్టెయిన్’ నిర్మాణ సంస్థ తన వెబ్సైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్ చేయడానికి టీమ్ విస్తృతంగా మార్కెటింగ్ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్లైన్ స్క్రీనింగ్లు నిర్వహిస్తారు.‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్ ఫిల్మ్మేకర్స్పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్గ్లాస్ సస్టెయిన్ గురించి చెబుతోంది సమ్రీన్.పిల్లల జీవితాలను మార్చిందివైల్డ్ లెఫ్ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.– నేహా దీక్షిత్, ఫిల్మ్మేకర్వారే నిజమై హీరోలుభూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్మేకర్గా నా బాధ్యత.– అశ్వికా కపూర్, ఫిల్మ్మేకర్నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్గ్లాస్ సస్టెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!) -
Akshaya Tritiya : ధగధగల వెనుక దగా!
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, పెట్టుబడిదారులు బంగారంపైనే అధికంగా దృష్టి పెట్టడం తదితర కారణాలు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లోనే ధరలు దూసుకుపోతున్నాయి. ఇవాళ (ఏప్రిల్30) అక్షయ తృతీయ. ఆ రోజున బంగారం కొంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించినట్లేనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మిగతా రోజులతో పోలిస్తే ఆ రోజున బంగారం వ్యాపారం మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు పెరిగిన నేపథ్యంలో అక్షయ తృతీయ రోజున బంగారం వ్యాపారం ఎలా ఉంటుందోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్క్ బంగారం కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్వచ్ఛమైన బంగారానికి సాధారణంగా హాల్ మార్క్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ (బిఐఎస్) హాల్ మార్క్ ఇస్తుంది. అయితే కార్పొరేట్ సంస్థలు హాల్ మార్క్ సెటప్ చేసుకున్నట్లుగా ప్రకటించుకుంటూ నాణ్యతకు సొంత మార్కు ఇచ్చుకుంటున్నాయి. బంగారం కొనుగోలులో హాల్ మార్క్, క్యారెట్లను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిబంధనల మేరకు బంగారాన్ని బ్యాంకుల ద్వారా దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులు సరఫరా చేస్తున్నాయి. బిల్లు తీసుకోకపోతే నష్టమే.. బంగారం వ్యాపారంలో 85 శాతం జీరో జరుగుతోంది. 90 శాతం వ్యాపారులు ఆథరైజ్డ్ బిల్లులు ఇవ్వడం లేదు. కేవలం షాపు పేరు కలిగిన కాగితాలపై బిల్లులు ఇస్తున్నారు. వీటిలో పాన్నెంబర్, వ్యాట్ నెంబర్ ఇతరత్రా వివరాలు ఉండవు. ఇలా ఇవ్వడం జీరో వ్యాపారం కిందకు వస్తుంది. మరికొందరు తెల్లపేపర్పైనే వివరాలు రాసిస్తుండటం గమనార్హం. వాణిజ్య పన్నుల శాఖ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఎక్సైజ్ సుంకం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బంగారం పోగొట్టుకున్నా.. దొంగలు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బిల్లులు తప్పనిసరి. కొంతమంది వ్యాపారులు తూకాల్లో దగా చేస్తున్నట్లు తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖకు వారి టార్గెట్లకు అనుగుణంగా తనిఖీలు చేయడం, కేసులు పెట్టడం తప్ప అక్రమాలను అరికట్టాలనే చిత్తుశుద్ధి లోపించినట్లు తెలుస్తోంది. కొనుగోలులో అప్రమత్తత అవసరం స్వచ్ఛమైన బంగారం కొంటే తిరిగి అమ్ముకున్నప్పుడు ఆ రోజు ఉన్న ధర లభిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 1,500 వరకు బంగారం దుకాణాలు ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం బిస్కెట్ రూపంలో లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లలో ఉంటాయి. వీటి స్వచ్ఛత 916 ఉంటుంది. జిల్లాలో జరిగే వ్యాపారంలో 80 శాతం వరకు 22 క్యారెట్ల బంగారం(నగలు, ఆభరాణాలు) కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు 22 క్యారెట్ల బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.14, 16, 18 క్యారెట్ల బంగారానికి 22 క్యారెట్ల ధర వసూలు కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో సహా అన్ని ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు 14, 16, 18, 20 క్యారెట్ల బంగారం ఆభరణాలు అమ్ముతూ వాటికి 22 క్యారెట్ల ధర వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటు బంగారం ధర రూ.89,400 పలుకుతోంది. ఒక క్యారెట్ విలువ రూ.4,063.63. 22 క్యారెట్లు(916 స్వచ్ఛత) ఉన్న బంగారమైతే ఈ ధర చెల్లించాలి. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం 20 క్యారెట్లు కలిగినదైతే 10 గ్రాముల ధర రూ.81,272 అవుతుంది. కానీ అధిక శాతం జ్యువెలరీ షాపుల్లో తక్కువ క్యారెట్లు ఉన్న బంగారానికి కూడా 22 క్యారెట్ల బాంగారం ధర వసూలు చేస్తుండటం గమనార్హం.కొనక తప్పడం లేదు బంగారం ధరలు అందుబాటులో ఉంటే కాస్త ఎక్కువ కొంటాం. మా కుటుంబంలో వివాహం ఉన్నందున ధర ఎంతు న్నా కొనక తప్పడం లేదు. అక్షయ తృతీయ నేపథ్యంలో ఆఫర్లు ఉండటంతో బంగారం కొనడానికి మలబార్ గోల్డ్కు వచ్చాం. ఆర్నమెంటు బంగారం 10 గ్రాముల ధర రూ.89,800 ఉన్నప్పటికీ డిజైన్ను బట్టి తరుగు కలుపుతుండటంతో రూ.లక్షపైనే అవుతోంది. ఇంత ధర ఉండటం నిజంగా బాధాకరమే. – ప్రత్యూష, సంతోష్నగర్, కర్నూలుధరలు తగ్గించాలి బంగారం ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ధరలు భారీగా పెరిగిపోతుండటం మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం శుభకార్యాలు, అక్షయ తృతీయ ఉండటంతో బంగారం కొనడానికి వచ్చాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉన్నప్పటికీ వనరులను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. – శైలజ, కోడుమూరు(చదవండి: అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ..! బంగారం కొనాల్సిందేనా..?) -
ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!
నా స్నేహితుడు ఒక ప్రైవేటు చిట్ఫండ్ కంపెనీలో డబ్బు తీసుకునేటప్పుడు నేను హామీ (ష్యూరిటీ) ఇచ్చాను. ఇప్పుడు అతను పరారీ లో ఉన్నాడు. చిట్ఫండ్ వారు నాపై కేసు వేశారు. ఆ మొత్తం నేను కట్టవలసిందేనా?– రాహుల్, ఖమ్మం ష్యూరిటీ ఇమ్మని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు కదా! ష్యూరిటీ ఇచ్చిన తర్వాత మీరు ఎంత మొత్తానికి హామీ ఇచ్చారో అంత మొత్తం మీ వద్ద నుండి వసూలు చేస్తారు. వాయిదా పద్ధతుల్లో చెల్లించవచ్చు. మీ స్నేహితుడికి ఏవైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేయవలసినదిగా కోరవచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ష్యూరిటీ ఇచ్చేముందు జాగ్రత్త వహించడం మంచిది. నమ్మకస్తులకి, డబ్బు తిరిగి చెల్లించే స్థితి ఉన్న వారికి మాత్రమే ష్యూరిటీ ఇవ్వడం మంచిది.నేను ఒక ప్రైవేటు సంస్థలో చిట్టీ కట్టాను. మొత్తం 50 నెలలు కట్టాలి కానీ నా పరిస్థితులు బాగుండక 15 నెలలు మాత్రమే కట్టాను. చిట్టీ ఎత్తలేదు. నేను కట్టిన డబ్బు నాకు తిరిగి రావాలంటే ఏం చేయాలి?– సుందర్, హైదరాబాద్చిట్టీ కట్టడాన్ని మధ్యలోనే ఆపేయడం తరచుగానే చూస్తుంటాం. మంచి సంస్థలలో అయితే లిఖితపూర్వక హామీపత్రాలు (అగ్రిమెంట్) ఉంటాయి కాబట్టి, అందులోని ఒప్పందం ప్రకారం కొంత జరిమానా విధించి మీరు అప్పటివరకు కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంటారు. కొన్ని సంస్థలు అయితే చిట్టీ గడువు పూర్తిగా ముగిశాక లేదా మీ బదులు ఇంకెవరైనా మీ గ్రూపు చిట్టీలో కలిస్తే కొంత కమీషన్ తీసుకొని డబ్బు తిరిగి ఇస్తుంటారు. ఏది ఏమైనా, మీరు కట్టినన్ని డబ్బులు మీకు రావు కానీ పూర్తి నష్టం మాత్రం ఉండదు. మీరు చిట్టీ కట్టిన సంస్థని సంప్రదించి క్యాన్సిలేషన్ అడగండి. వారి నిబంధనల మేరకు వారికి రావలసిన మొత్తాన్ని మినహాయించుకుని మిగిలినది ఇస్తారు. (చదవండి: ప్లంబర్లుగా మహిళా శక్తి!) -
తినదగిన 'రోబోటిక్ కేక్'ను చూశారా?
ఎన్నో రకాల కేక్లు చూసుంటారు. కానీ ఇలాంటి కేక్ని మాత్రం చూసుండరు. అదికూడా సాంకేతికతను, సైన్సుని మిళితం చేసేలా కేక్ని రూపొందించారు. అయితే దీనిని భవిష్యత్తులో ఒక పర్పస్ కోసమే తయారు చేశారట. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పేస్ట్రీ చెఫ్లు కలిసి ఎంతో శ్రమించి తయారు చేశారు. మరిదాన్ని వేటితో తయారు చేశారో సవివరంగా చూద్దామా..!. వినూత్నంగా తయారు చేసిన కేకులు ఇటర్నెట్లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అయితే ఈ 'రోబోటిక్ కేక్' మాత్రం అందుకోసం చేసింది మాత్రం కాదు. దీన్ని తినదగిన సాంకేతికతలో పురోగతికి చిహ్నంగా తయారుచేశారు. ఈయూ నిధులతో కూడిన రోబోఫుడ్ ప్రాజెక్ట్లో భాగంగా రూపొందించారు. దీన్ని ఓ వెడ్డింగ్ కేక్ మాదిరిగా తయారు చేశారు. స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లౌసాన్ (EPFL), ఇటాలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) శాస్త్రవేత్తలు, అలాగే లౌసాన్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (EHL) పాక నిపుణులు కలిసి తయరు చేశారు. ఈ నెల ఏప్రిల్ మధ్యలో ఒసాకాలో జరిగిన ఎక్స్పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఈ "రోబోకేక్" అత్యంత వినూత్న భాగాలలో ఒకటి తినదగిన రీఛార్జబుల్ బ్యాటరీలు. వీటిని B2, క్వెర్సెటిన్, యాక్టివేటెడ్ కార్బన్, చాక్లెట్తో తయారు చేశారు. కేక్పై LED కొవ్వొత్తులను వెలిగించడానికి వాటిని ఉపయోగించారు. ప్రముఖ డిజైనర్ మారియో కైరోని సమన్వయంతో IIT పరిశోధకులు ఈ బ్యాటరీలను రూపొందించారు. అలాగే ఈ కేక్పై రెండు పూర్తిగా తినదగిన రోబోటిక్ టెడ్డీ బేర్లు ఉంచారు. వాటిని తయారు చేసేందుకు జెలటిన్, సిరప్, ఫుడ్ కలర్స్ని ఉపయోగించారు. అంతర్గత వాయు వ్యవస్థ ద్వారా యానిమేట్ చేయబడతాయి. ఇవి ప్రత్యేక మార్గాల ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినప్పుడు, వాటి తలలు, చేతులు కదులుతాయి కూడా. అలాగే రుచికి ఇవి దానిమ్మ గమ్మీల టేస్ట్ని కలిగి ఉంటాయి. ఎందుకోసం ఇలా..రోబోటిక్స్ ,ఆహారం రెండూ వేర్వేరు ప్రపంచాలు. అయితే, వాటిని ఇలా విలీనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ తినదగిన రోబోట్లను అంతరించిపోతున్న ప్రాంతాలకు ఆహారాన్ని అందించడానికి, మింగడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు లేదా జంతువులకు వినూత్న మార్గాల్లో మందులను అందింవచ్చట. పైగా తినగలిగే సెన్సార్లను ఉపయోగించి ఆహారాన్ని దాని తాజాదనాన్ని కూడా పర్యవేక్షించొచ్చట. చివరగా ఈ రోబోటిక్స్ భాగాలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని, మంచి రుచిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. రానున్న కాలంలో ఇక కేకులు ఇలానే ఉంటాయేమో కాబోలు. (చదవండి: Free AI healthcare revolution: మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..!) -
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఒకరకంగా అవి మనలోని టాలెంట్ని పదునుపెట్టేలా చేస్తాయి. మనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరికో మార్గం చూపే కాంతికిరణలవుతాయి. అందుకు నిదర్శనం ఈ మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రులే. వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న సిండ్రోమ్ ఫలితంగా వచ్చిన ఫ్రీ ఏఐ హెల్త్కేర్ ఎందరికో మార్గం చూపి, వైద్యులే గుర్తించడంలో విఫలమైన వ్యాధులను ఐడెంటిఫై చేసి ఇవాళ ఎందరి ప్రాణాలనో కాపాడుతోంది.మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ జూలియన్ ఇస్లా కొడుకు సెర్గీయో అరుదైన నాడీ సంబంధిత రుగ్మత డ్రావెట్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. నిజానికి ఈ వ్యాధిని అంతతొందరగా ఏంటన్నది వైద్యుల కూడా త్వరగా గుర్తించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నో నిరీక్షణల తర్వాత గానీ తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ జూలియన్ ఇస్లా కూడా తన పసికందు సమస్య ఏంటన్నది ఒక ఏడాది వరకు తెలుసుకోలేకపోతాడు. అప్పుడే ఆయన ఈ అరుదైన వ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ఇస్లా వైద్య పురోగతి కోసం AIని ఉపయోగించేలా లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29ని స్థాపించారు. సరిగ్గా ఆ సమయంలోనే అనుకోకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రసంగం వింటాడు. ఆయన తన స్పీచ్లో కొడుకు పోరాడుతున్న సెరిబ్రల్ పాల్సీ వ్యాధి తీరును హృదయవిదారకంగా వెల్లడిస్తాడు. దీంతో ఇస్లా వెంటనే నాదెళ్లను ఇమెయిల్ ద్వారా సంప్రదించి.. తన కొడుకు సెర్గియో కథను పంచుకుంటాడు. అలాగే ఇలా ఒక పట్టాన వ్యాధులు నిర్ధారణ కాని రోగులకు ఏఐ సాంకేతికత గేమ్-ఛేంజర్గా ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇస్లా. ఆ వెనువెంటనే నాదెళ్ల ఐదు నిమిషాల్లోనే రిప్లై ఇచ్చి.. మైక్రోసాఫ్ట్ AI హెల్త్కేర్ బృందాలతో కనెక్ట్ అయ్యారు. అంతేగాదు ప్రాథమిక AI అల్గారిథమ్లను ఉపయోగించి క్లినికల్-గ్రేడ్ డయాగ్నస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇస్లా స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29 అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. 2023 నాటికి, వారు అధునాతన భాషా నమూనాల ఆధారిత డయాగ్నస్టిక్ అసిస్టెంట్ అయిన DxGPT అభివృద్ధి చేశారు. ఇదెలా పనిచేస్తుందంటే..DxGPT అంటే ..ఇది వ్యాధిని నిమిషాల వ్యవధిలోనే నిర్థారిస్తుంది. ఇది ప్రజా వైద్య వనరులు, ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల కలయికతో ూకూడిన పజీపీటీ-40, 01 నమునాలను ఉపయోగిస్తుంది. ోగోప్యత దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికత. అలాగే ఏ రోగి డేటాను సేకరించదు, స్టోర్ చేయదు. జస్ట్ రోగులు లేదా సంరక్షకులు ఇచ్చే లక్షణాలు, వివరణల ఇన్పుట్ని ఆధారంగా చేసుకుని రోగనిర్ధారణ సారాంశాన్ని పొందుతారు. దీని ఆధారంగా వైద్య పరీక్షలు చేయించుకుని ధృవీకరించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో ఉచితంగా యాక్సెస్ అయ్యే DxGPT అంతుచిక్కని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల బాధను తీర్చడంలో కీలకంగా ఉంటుంది.(చదవండి: పిల్లిలా కనిపించాలనుకోవడం ఎంత పనైపాయే..! ఏకంగా రూ. 6 లక్షలు పైనే..) -
నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
ఆభరణాల క్రియేటివిటీలో సరికొత్త ట్రెండ్..!
ఆభరణం అంటే మగువల అందాన్ని పెంచడానికి విభిన్న సృజనాత్మక రూపాల్లో తయారు చేయడమే. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో ఆభరణాల ప్రపంచంలో ఒక కొత్త ధోరణి చెలామణి అవుతోంది. ‘థీమ్ ఆధారిత ఆభరణాలు’ అనే ఈ ట్రెండ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇది విస్తృతంగా ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ప్రకృతి, ఋతువుల సౌందర్యానికి ప్రతిగా రూపొందించిన ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఆభరణ బ్రాండ్లు ఈ కొత్త ధోరణిని స్వీకరించి, ప్రతి ఆభరణంలోనూ ప్రకృతి సౌందర్యాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్లు ప్రత్యేకంగా రూపొందించిన కళాఖండాలు, కశ్మీర్ ఋతువుల మాయాజాలాన్ని ప్రతిబింబిస్తూ మార్కెట్లోకి వస్తున్నాయి. అది బంగారమా, వజ్రమా అనే తేడా లేకుండా వ్యాపార విలువతో పాటు ఆభరణంలోని థీమ్ను, వైవిధ్యాన్ని, వినూతనత్వాన్ని ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఆభరణాల తయారీలోని హస్తకళ వైవిధ్యానికి థీమ్ ఆధారిత జ్యువెలరీ మరింత హంగులను అద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రెండింగ్లో ఉన్న కొన్ని ఆభరణ సౌందర్యాలు. ఋతువుల కవిత్వం తాకిన కళ.. ‘ఈ లోయ గుండా నడిచిన ప్రతిసారీ, ఋతువులు తమ పాటలు పాడతాయి’ అనే భావనతో ఒక కవిత్వ సృష్టిలాంటి ఆభరణాలు అలరిస్తున్నాయి. చినార్ ఆకుల నృత్యం నుంచి మంచుతో కప్పబడిన పైన్ చెట్ల పరవశం వరకూ ప్రతి ఆభరణం ప్రకృతి గాథను చెబుతోంది. శరదృతువులో చినార్ ఆకులు గాలిలో ఊగే తీరు, తెల్లటి మంచుతో అలంకరించిన దృశ్యాలను ప్రతిబింబించే చెవిపోగులు, లాకెట్లు, రౌండ్ కట్లో తెల్ల వజ్రాలతో తయారైన కశీ్మర్ శీతాకాలపు నిర్మలత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రకృతిని ధరించే సోయగాలు.. ఈ కొత్త థీమ్ ఆధారిత ఆభరణాలు ప్రకృతిని మించిన అందాలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఋతువుల స్వభావాన్ని, కశీ్మర్ వంటి సుందర ప్రదేశాలను ప్రతిబింబించేలా తయారు చేస్తున్న ఆభరణాలు నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. అధునాతన సంప్రదాయానికి వినూతనత్వాన్ని జోడిస్తున్న ఈ కళాఖండాలు ప్రస్తుత జీవన శైలి, ఫ్యాషన్ ప్రపంచానికి ప్రకృతితో కూడిన కొత్త పంథాను పరిచయం చేస్తున్నాయి. శీతాకాలపు అందాల్లో మునిగిపోయిన పైన్ చెట్లు, కిరణాలపై మెరిసే వజ్రాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన నెక్లెస్లు, చెవిపోగులు శీతాకాలపు సౌందర్యానికి నిదర్శనంగా తయారు చేస్తున్నారు. నెమ్మదిగా వెలిసే శీతాకాలం మొదలు వికసించే వసంతానికి మధ్య మార్పును చూపించే ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వసంతపు వర్ణ విహారం.. వసంత ఋతువులో కశీ్మర్ లోయను అలంకరించే తులిప్ పువ్వుల కాంతిని పసుపు వజ్రాలు, గులాబీ క్వార్ట్ట్జ రత్నాలతో తయారు చేసినట్టుగా ప్రతిబింబిస్తున్నాయి. తులిప్ పువ్వుల వర్ణాలను దృశ్యాన్ని చేస్తున్నట్లుగా చెవిపోగులు, నెక్లెస్లు ప్రతి రూపంలో ప్రకృతి ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. సృష్టి కథను ఆభరణాల్లో వర్ణిస్తూ.. ‘ఇప్పటికీ మిగిలి ఉన్న స్వర్గం’ అనే భావన ఆధారంగా రూపొందించిన ఈ కొన్ని కలెక్షన్ కశీ్మర్ లోయల శాశ్వత అందాన్ని మిళితం చేస్తూ అందమైన కథగా చెబుతున్నాయి. బంగారం పై తయారు చేసిన చినార్ ఆకులు, వజ్రాల కాంతిలో మెరిసే తులిప్ పువ్వులు, కాలానికి అర్థం చెప్పకనే చెబుతున్నాయి. మై ఎంబ్రేస్.. మగువల ఆలోచనలు.. ప్రస్తుత తరుణంలో ఆభరణాలను అందం కోసమే కాకుండా ఒక కళాత్మక జీవనానికి నిదర్శనంగా ధరిస్తున్నారు మగువలు. దీనికి అనుగుణంగానే ఆభరణాల తయారీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే జోయా ఆధ్వర్యంలో మై ఎంబ్రేస్ అనే థీమ్తో.. సాధారణంగా మహిళలు జీవితంలో ఎన్ని పాత్రలు పోషించినా, వారి జీవితానికి పరమార్థంగా ‘తనను తాను ఆలింగనం చేసుకునేలా’ అందమైన జ్యువెలరీ రూపొందించాం. మగువ ఆలోచనలు, ఆనందాలు సార్థకం అయ్యేలా తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకునేలా సృష్టించిన ఈ ఆభరణాలు నగరంలోని జ్యువెల్ లవర్స్ను ఆకర్షిస్తున్నాయి. – అమన్ప్రీత్ అహ్లువాలియా, జోయా బిజినెస్ హెడ్ (చదవండి: ఖాదీ కమ్ బ్యాక్) -
Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..?
అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్రూమ్లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్లో ఫ్రాక్చర్ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్ వేయడం, సిమెంట్ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్ ఆర్థోపెడిక్స్ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. వాటంతట అవే అతుక్కునే ఎముకలు...విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్వాల్వ్ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్ చేయలేకపోతే) ఆ కండిషన్ను ‘ఇన్సఫిషియెంట్ రిడక్షన్’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్యూనియన్’ అంటారు.ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్డ్ యూనియన్’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్ యూనియన్’ అంటారు.డిలేయ్డ్ యూనియన్ / నాన్ యూనియన్కు కారణాలుఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రావడం. విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్సఫిషియెంట్ స్ప్లింటేజ్). రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్) కలిగించక΄ోవడం (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్ అంటారు). ఎముక అతుక్కోకపోవడానికి కారణాలుఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్యూనియన్ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ ఉండవచ్చు. అవేమిటంటే... ∙క్యాలస్ బ్రిడ్జ్ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్ రావడం. దీని గురించి ఇంగ్లిష్లో చె΄్పాలంటే... టూ లార్జ్ స్పేస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాలస్ బ్రిడ్జ్గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్ బ్రిడ్జ్’ అంటారు. గ్యాప్ రావడం వల్ల అది ఏర్పడదు. ఇంటర్΄ పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ గా పేర్కొంటారు. అవసరమైన పరీక్షలు విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స రహిత విధానాలుఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్ సప్లిమెంటేషన్ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. చికిత్సఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్గ్రాఫ్ట్ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. డాక్టర్ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి. పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్) సమస్య ఉన్నవారిలో నాన్–యూనియన్కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ చెప్పే అని సూచనలనూ పాటించాల్సి ఉంటుంది.అతుక్కోని భాగాలు ఏవంటే...నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... లాటెరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్: మోచేతిలో బయటవైపు ఉండే ఎముక విరిగితే దాన్ని లాటరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.ఫీమోరల్ నెక్ ఫ్రాక్చర్: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్ కాకపోవచ్చు. ఫిఫ్త్ మెటాటార్సల్ (జోన్స్ ఫ్రాక్చర్)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.టాలస్ ఫ్రాక్చర్చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్. స్కేఫాయిడ్ ఫ్రాక్చర్మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్లు. సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే... ఫ్రాక్చర్ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్–యూనియన్) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. ఎముక సరిగా అతకకపోయినా (నాన్యూనియన్లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్డ్ యూనియన్లో) కనిపించే సాధారణ లక్షణాలివి... ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. ఎముక ఫ్రాక్చర్ అయిన చోట వాపు (స్వెల్లింగ్) రావడం. విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్)ను కదల్చలేక΄ోవడం. విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి... విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... ∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్డ్ యూనియన్)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్యూనియన్’గా పేర్కొనవచ్చు. ∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్యూనియన్)గానే పరిగణించాల్సి ఉంటుంది. ∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్యూనియన్’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్సఫిషియెంట్ రిడక్షన్’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డాక్టర్ బాలవర్థన్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్లో..) -
ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్లో..
నూక్లియర్ సైన్స్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మకమైన మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్(ఎంఎస్సీఎఫ్పీ)కు ఇండియన్ స్టూడెంట్ హేమంగి శ్రీవాస్తవ ఎంపికైంది. మాస్కో పవర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ (ఎంపీఈఐ) లో హేమంగి ఎలక్ట్రానిక్స్ అండ్ నానో ఎలక్ట్రానిక్స్లో మాస్టర్స్ చేస్తుంది.2023లో రష్యాలో నిర్వహించిన ‘వరల్డ్ యూత్ ఫెస్టివల్’కు హాజరైన హేమంగి అక్కడ ఒక మహిళా ప్రొఫెసర్ నోటినుంచి నూక్లియర్ ఎనర్జీ ప్రాముఖ్యత గురించి విన్న మాటలు ‘ఎంపీఈఐ’కి దరఖాస్తు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తాను ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి ‘సైన్స్, ఆర్ట్ల సమ్మేళనం’ అంటుంది హేమంగి. మరింతమంది మహిళలు నూక్లియర్ సెక్టర్లోకి రావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) మేరీస్లో్కడోస్కా–క్యూరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టింది. (చదవండి: ఖాదీ కమ్ బ్యాక్) -
ఖాదీ కమ్ బ్యాక్
సాంస్కృతికపరంగానే కాదు వాణిజ్యపరంగా కూడా ఖాదీ పునర్జీవనం హైలెవెల్లో ఉంది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు 2024–25 నాటికి అనూహ్యంగా రూ.1,70,551,37 కోట్లకు పెరిగాయి. గ్రామీణ భారతంలో ఖాదీ జీవనోపాధి వనరు, పట్టణాల్లో మాత్రం ప్రతీకాత్మక వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ దుస్తులు ధరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్లు ఖాదీతో ఎక్స్పెరిమెంట్స్ చేయడం విశేషం. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ‘న్యూ ఖాదీ ఫర్ ది న్యూ ఇండియన్’ ధోరణి వేళ్లూనుకుంది. ‘న్యూ ఖాదీ ఫర్ న్యూ ఇండియన్’ నినాదాన్ని తమ ప్రచారానికి వాడుకుంటుంది లూనా బ్రాండ్. ఆధునిక మార్కెట్ కోసం ఖాదీని పునర్నిర్వచిస్తున్న బ్రాండ్లలో బెంగళూరుకు చెందిన లూనా బ్రాండ్ ఒకటి. కొత్త బ్రాండ్లు ట్రెండ్ ఆధారిత ఫ్యాషన్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ‘ఖాదీకి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా విలాసవంతమైన, నైతిక, పర్యావరణ హితమైన భవిష్యత్తుకు పునాది వేయవచ్చు’ అంటున్నారు ఖాదీని ఇష్టపడే ఫ్యాషన్ డిజైనర్లు.(చదవండి: Rich Man's Disease: ఇవి తింటున్నారా? జాగ్రత్త!) -
Rich Man's Disease: అరటి పండ్లు తిన్నారంటే ఇలా..!
ఇదేం వ్యాధి ఆ పేరేంటీ.. అనుకోకుండి. కేవలం ధనవంతులకే వచ్చే వ్యాధా..? అంటే..ఔననే అంటున్నారు నిపుణులు. ధనవంతులు, వారి జీవనశైలి, అలవాట్ల కారణంగా వస్తుంది కాబట్టి దీన్ని Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని అంటారు. ఇంతకీ ఏంటా వ్యాధి..? ఎలా నయమవుతుంది అంటే..బాగా డబ్బున్న వ్యక్తులు(Rich Man's )తీసుకునే మాంసం, పానీయాలు, ప్రత్యేక కూరగాయాలు తదితరాల కారణంగా వచ్చే వ్యాధి కావడంతో Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని పిలుస్తారు. ఆర్థరైటిస్ మరో రూపామైన గౌట్ వ్యాధిని ఇలా పిలుస్తారట. కీళ్లల్లో తరుచుగా బొటనవేలు దిగువన తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపులతో ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా సున్నితంగా ఉండి కొంచెం తాకిన నొప్పితో విలవిలలాడినట్లుగా ఉంటుంది. ఇది ఒకరమైన ఆర్థరైటిస్గా చెబుతుంటారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..గౌట్ శరీరంలో యూరిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది కీళ్లలో సూది లాంటి స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల గౌట్కు ఎలా కారణం అంటే..కొన్ని ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే రసాయనాలను విచ్ఛిన్నం కావడంతో యూరిక్ యాసిడ్ ఉత్ఫన్నమవుతుంది. అదీగాక శరీరం కూడా సహజంగా యూరిక్ యాసిడ్ను తయారు చేస్తుంది. ఫలితంగా శరీరంలో అదనపు యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం మొదలై గౌట్కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు సాధారణంగా రక్తం నుంచి యూరిక్ యాసిడ్ను ఫిల్టర్ చేసి, మూత్ర విసర్జన రూపంలో బయటకి పంపించేస్తుంది. అయితే శరీరం అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ని ఉత్పత్తి చేస్తే.. మూత్రపిండాలను దాన్ని బయటకు పంపించలేకపోతాయి. ఫలితంగా ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లల్లో ఏర్పడతాయి. ఆ పదునైన స్ఫటికాలు కారణంగా నొప్పి, వాపు ఇతర సమస్యలు ఉత్ఫన్నమై గౌట్ వ్యాధి వస్తుంది. గౌట్ సంకేతాలు, లక్షణాలు..గౌట్ అటాక్స్ చాలా బాధాకరంగా ఉంటుందితీవ్రమైన, భరించలేని నొప్పిరంగు మారడం లేదా ఎరుపుదనంకీళ్ల దృఢత్వంవాపు తేలికపాటి స్పర్శకు కూడా తట్టుకోలేని సున్నితత్వంవెచ్చదనం, లేదా కీలు మండుతున్నట్లుగా అనిపించడంఏ ఆహారాలు గౌట్కు కారణం అంటే..ప్యూరిన్లతో నిండిన ఆహారాన్ని తినడం లేదా త్రాగడం వల్ల గౌట్కు దారితీసే అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర పానీయాలు, డెజర్ట్లు.కార్న్ సిరప్ ఇది అన్ని ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల్లోనూ ఉంటుందిఆల్కహాలిక్ పానీయాలలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందిహెర్రింగ్, స్కాలోప్స్, మస్సెల్స్, కాడ్ ఫిష్, ట్యూనా, ట్రౌట్, హాడాక్ వంటి సముద్రపు చేపల్లోరెడ్మీట్నివారణ..ఆహారంలో మార్పులను సూచిస్తారు వైద్యులు. తక్కువ ప్యూరిన్ ఆహారాన్ని అనుసరించడం ద్వారా సమస్య తగ్గుతుంది. నిపుణులు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినాలని సిఫార్సు చేస్తారు. ఇది మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ను విసర్జించడానికి సహాయపడుతుంది. అలాగే, అరటిపండ్లు విటమిన్ సి పవర్హౌస్. ఇది రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ కూడా. అలాగే, అరటిపండ్లతో పాటు నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, కివి స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, చెర్రీస్, ఆపిల్స్, పైనాపిల్స్ వంటి వాటిల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి గౌట్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్ వర్క్షాప్
భారతీయులలో పక్షులను వీక్షించడం అనేది అభిరుచిగా అభివృద్ధి చెందుతోంది. అయితే, ఆ అనుభవాన్ని మరింత అందంగా ఆనందకరమైన అనుభవంగా మిగిల్చేందుకు ఎర్లీ బర్డ్ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎర్లీ బర్డ్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక వర్క్షాప్ను నిర్వహిస్తోంది.తద్వారా పక్షుల ప్రపంచంలోకి చిన్నారులు మరింత డీప్గా వెళ్లేందుకు ,ఇతర జీవరాశులను నిశితంగా గమనించే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎర్లీ బర్డ్ ప్రకటించింది. ఈ వర్క్షాప్ను ఆన్లైన్లో అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ బర్డ్ లవర్స్ చేరాలని ఆశిస్తోంది.మే 11 నుండి జూన్ 8 వరకు జరిగే 6వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్టు ఎర్లీ బర్డ్ తెలిపింది. యంగ్ బర్డర్స్ వర్క్షాప్ 2021లో ఆన్లైన్ వర్క్షాప్గా ప్రారంభమైందనీ,అప్పటి నుండి ఈ ఫార్మాట్లో కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటివరకు, దాదాపు 200 మంది పిల్లలు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు.ఈ వర్క్షాప్ 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ పక్షి పరిశీలకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 4 వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రూపంలో ఉంటుంది. ప్రతి వారం, పాల్గొనేవారు పక్షులకు సంబంధించిన విభిన్న ఇతివృత్తాలను అన్వేషిస్తారు. ఈ సెషన్లు పూర్తిగా ఆన్లైన్లో ఉంటాయి .మల్టీమీడియా, గైడెడ్ ఇంటరాక్షన్లు, ఉల్లాసమైన చర్చలు , కార్యకలాపాల మిళితంగా ఈ వర్క్షాప్ ఉండనుంది.పక్షుల గురించి లోతైన పరిశీలనలను సులభతరం చేయడానికి సంబంధించిన కథనాలు అందిస్తుంది. ఇందులో పాల్గొనేవారు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పచ్చని ప్రదేశాలను స్వతంత్రంగా అన్వేషించడంలో సహాయపడతాయి. ఇది వారి వేసవి సెలవుల్లో అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వారపు ప్రత్యక్ష సెషన్లు వరుసగా వారాంతాల్లో ఆన్లైన్లో అందిస్తాయిరు. ప్రతి ఒక్కటి ఎంచుకున్న థీమ్ గురించి నేర్చుకున్న విషయాలను తిరిగి పొందడమే కాకుండా పాల్గొనేవారు స్వయంగా కొనసాగించగల కొత్త కార్యకలాపాలను కూడా పంచుకునే ఇలస్ట్రేటెడ్ యాక్టివిటీ షీట్తో ఉంటాయి.ఈ వర్క్షాప్ పాల్గొనేవారు ఎప్పుడూ గమనించిన, తమ ఇళ్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిజంగా తెలుసుకోవడానికి అనుమతిస్తుందని నిర్వహికులు తెలిపారు. వర్క్షాప్కు హాజరు కావడానికి ఉచితం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టిసిపెంట్స్, మెటీరియల్కు సంబంధించి రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. https://bit.ly/ybw_2025 అనేలింక్ ద్వారా వర్క్షాప్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యావేత్తలు, తల్లిదండ్రులు , ప్రకృతి ఔత్సాహికులు ఎవరైనా వారి వారి ప్రాంతాలలోని పిల్లల కోసం ఇలాంటి వర్క్షాప్ను నిర్వహించడానికి ఆసక్తి ఉన్నవారికి, తాము'యంగ్ బర్డర్స్ కోసం వర్క్షాప్ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఈ ఉచిత గైడ్ https://early-bird.in/ybw-guideను ఎర్లీ బర్డ్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎర్లీ బర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎర్లీ బర్డ్ఎర్లీ బర్డ్ అనేది పిల్లలను పక్షులు , ప్రకృతికి దగ్గరగా తీసుకురావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF)లో ఒక భాగం. -
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్నగర్, అమీర్పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్బాల్ వేదిక: సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్బాల్ వేదిక: సనత్నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
'గ్రాండ్మాకోర్' అంటే..? యువత ఇష్టపడుతున్న ట్రెండ్..
ఈకాలం యువత ఎంత ఫాస్ట్గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్ జెడ్ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్ పెంచుకుంటోంది యువత. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాంప్రదాయ హాబీలనే ఇష్టపడుతూ షాక్కి గురి చేస్తున్నారు. పరిగెడుతూ బిజీ లైఫ్లు, లక్షలు సంపాదనలు వద్దంటూ నిధానం, ప్రశాంతతే కావలంటూ..'గ్రాండ్మాకోర్'కి జై కొడుతున్నారు. అలసలేంటీ ట్రెండ్ అంటే..గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జెన్ జెడ్ మిలీనియల్స్ అమ్మమ్మల నానమ్మల అభిరుచుల వైపుకి మొగ్గుచూపుతున్నారు. అలాంటి రెట్రో కార్యకలాపాలలోనే సౌకర్యం ఉందని నొక్కి చెబుతున్నారు. గ్రాండ్మాకోర్ అంటే..'గ్రానీ'ల జీవనశైలి. అంటే ఏంలేదు..ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లు అనుసరించే అభిరుచులనే ఈతర యువత ఇష్టపడుతుండటం విశేషం. ఈ డిజిటల్ యుగంలో ఏ కోడింగ్, కంటెంట్ రైటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యూజిక్ అంటూ ఇతరత్ర కళలను ఇష్టపడే యువత మైండ్సెట్ మార్చుకుంది. ఏకంగా బామ్మల కాలం నాటి జీవనశైలికే ఓటేస్తూ..ఇదే అత్యంత హాయిగా ఉంటుంది, మసుసుకు మంచి ప్రశాంతతనిస్తుందని అని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. ఈ ట్రెండ్కి సంబంధించి.. సోషల్మీడియా ఫ్లాట్ఫాంలలో గ్రాండ్మాకోర్ హ్యాష్ట్యాగ్లతో వాళ్ల బామ్మల అభిరుచులను డాక్యుమెంటు చేస్తున్నారు కూడా. నిధానంగా ఓపికతో నేర్చుకునే ఈ హాబీలే మనకు సరైన దృక్పథాన్ని ఇవ్వగలవని అంటున్నారు. వాళ్లు పనిచేయాలనుకోవడం లేదట..పనిలో పొందే ఆనందాన్ని వెతుకుతున్నారట..మంచి అభిరుచితో కూడిన పని ఇచ్చే ఆనందం వెలకట్టలేనిదని నమ్మకంగా చెబుతోంది నేటి యువత. ఒకరకంగా ఇది వారికి తమ అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి వచ్చేలా చేయడమే గాక స్వాంతన చేకూరుతుందని ఈ ట్రెండ్ని స్వీకరించిన అమెరికాకు చెందిన గృహిణి హన్నా ఆర్నాల్డ్ అంటున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో కూడా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతామని అంటున్నారామె.ఈ గ్రాండ్మాకోర్ భావోద్వేగాలకు సంబంధించింది, పైగా హానికరం కానీ సృజనాత్మకత మార్గాన్ని అందించే గొప్ప అభిరుచులట అవి. ఇంతకీ అవేంటో తెలుసా..ఏం లేదండీ..తోటను చూసుకోవడం, స్కార్ఫ్ అల్లడం, కుట్లు, ఆహారం వృధాకాకుండా కేర్ తీసుకుని చేసే చిరు వంటకాలు తదితరాలే..నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ట్రెండ్ వల్ల ఆందోళన కలిగించే విషయాల నుంచి కాసేపు ఆలోచనలు మళ్లించడం సాధ్యపడుతుందట. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని ప్రశాంతంగా గమనించే అవకాశం ఏర్పడుతుందట. పైగా వీలైనంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త గాబ్రియెల్ వైడెమాన్. మరీ ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా మీ బామ్మల హాబీలను ట్రై చేసి చూడండి.(చదవండి: సాహసం చేద్దాం బ్రదర్..! అడ్వెంచర్కే ప్రాధాన్యత ఇస్తున్న భాగ్యనగరవాసులు) -
తొందర తొందరగా లాగించేస్తున్నారా? అయితే లావైపోతారు!
వేగం..వేగం..అంతా స్పీడ్ యుగం. మల్టీ టాస్కింగ్.. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా నత్తనడకన చేస్తానంటే కుదరదు. అంతా ఫాస్ట్. పనులు చక్క బెట్టుకోవడం వరకు ఓకే కానీ.. ఆహారం విషయంలో వేగం అస్సలు పనికి రాదు. ఆహారాన్ని త్వరగా, ఆదరాబాదరగా మింగేయడం వల్ల వల్ల అనేక రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంటుంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా. నమ్మశక్యంగా లేదు కదూ, అసలు ఎలాంటి అనర్ధాలు వస్తాయో చూసేద్దాంఅన్నం గానీ, ఇంకేదైనా ఆహారాన్నిగానీ నెమ్మదిగా ప్రశాంతంగా, బాగా నములుతూ తినడం అనేది ఉత్తమం. ఆహారం నమ్మిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేదంటే త్వర, త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది. అవును నిజమే. ఎందుకంటే గబా గబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు.త్వరగా తినడం వల్ల తీసుకునే కేలరీల సంఖ్యంగా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు, కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.ఆహారం నమలకుండా ఆబగా తినేయడంతోపాటు, కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇదీ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకు పోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి.పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణసమస్యలొస్తాయి. అజీర్తి కడుపు ఉబ్బరంతోపాటు, గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతోపాటు, గాలిని (సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో) ఎక్కువగా మింగే అవకాశం ఉటుంది. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. వుక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.చాలా వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాం.అంతేకాదు ఆత్రంగా భోజనం తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్ను కలిగి ఉంటారు. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట.భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలని కూడా పెద్దలు చెప్పేమాట. చివరగా .. కూటికోసంమే కోటి విద్యలన్నట్లు..కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది. ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించు కోవాలి. అనసరంగా సమయాన్ని వృధా చేసే పనులనుపక్కన బెట్టి శ్రద్ధగా, రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి. -
సాహసం చేద్దాం బ్రదర్..! ఈ సమ్మర్లో చూడాల్సిన బెస్ట్ అడ్వెంచర్ స్పాట్స్..
వేసవి సెలవులను ఎంజాయ్ చేయడంలో ఇప్పుడు అడ్వెంచర్స్ కూడా భాగమవుతున్నాయి. గతంలో ఈ తరహా సాహస వినోదాల కోసం విహార యాత్రలకు వెళ్లినప్పుడు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు నగరం నుంచి కేవలం 30కి.మీ నుంచి 200 కి.మీ పరిధిలోనే పలు రకాల అడ్వెంచర్ స్పాట్స్ సాహసికులను, ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్లో కాసింత ఉత్కంఠ, మరి కాసింత ఉద్వేగవంతమైన అనుభూతిని పొందేందుకు వినోదాన్ని మేళవించిన అనుభవాలను పొందాలనుకుంటే.. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే అన్నట్లు పలు స్పాట్స్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ సాహసాలు ఏవైనా అవగాహన పెంచుకుని, ముందస్తు శిక్షణ తీసుకున్న అనంతరమే ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. మన దేశంలో తొలిదశలో ఉన్న సాహసికులను ఆకర్షించేది అడ్వెంచర్ పారా గ్లైడింగ్ దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ క్రీడా వినోదానికి బాగా ఆదరణ పెరిగింది. వందల/వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తూ ఓ గ్లైడర్/ కనోపి సాయంతో గాల్లో ఎగరడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనిని ఎంజాయ్ చేయాలంటే.. నగరం నుంచి ఓ 50 కిమీ ప్రయాణించాలి. షామీర్పేట్, తుర్కపల్లి దగ్గర ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఈ అడ్వెంచర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు.హైలెస్సో.. హైలెస్సా అంటూ నదిలో బోట్లు నడిపే కయాకింగ్ సాహసాలందు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందంటున్నారు సాహసికులు. నీళ్లలో పడవను స్వయంగా నడుపుకుంటూ వైవిధ్యభరిత అనుభూతిని అందుకోవాలనునే వారిని.. సుమారు 100 కి.మీ.దూరంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ ఆహ్వానిస్తోంది. నీళ్లలో పడవల యానం.. మొదటిసారిగా ప్రయతి్నస్తున్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుభవజు్ఞలైన వారికి మరింత ఆస్వాదించదగిన అనుభవం. గుహల అన్వేషణ.. హిమాలయాల కంటే పాతవైన ఈ పర్వత సమూహాల్లో గుహల అన్వేషణకు పాండవుల గుట్ట ప్రత్యేక చిరునామా. అక్కడ జంతువులు, పురాతన చిహ్నాలతో కూడిన ప్యాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. నగరం నుంచి సుమారు 195 కిమీ దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుట్టలో గుహలను శోధించడం.. ఓ సాహసం మాత్రమే కాదు చరిత్రను గుర్తుచేసుకోవడం కూడా. దీనిని సాహసాలను ఇష్టపడేవారి వారాంతపు వినోదానికి సరైన ఎంపిక అనవచ్చు. డర్ట్ బైక్.. ఏటీవీ రైడ్స్.. ఆఫ్–రోడ్ థ్రిల్ కోరుకునే వారికి నగరం నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ సరైన అడ్రెస్ అని చెప్పాలి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి డర్ట్ బైకులు మాత్రమే కాదు ఏటీవీ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొండలు, చెట్లు రాళ్లు రప్పల నడుమ ప్రత్యేకంగా రూపుదిద్దిన రేసింగ్ ట్రాక్పై చేసే డర్ట్ బైక్స్, ఏటీవీ రైడ్స్ సాహసికులకు థ్రిల్ని అందిస్తాయి. జిప్ లైనింగ్.. నగరం నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఘట్కేసర్ దగ్గరలోని పెబుల్ బీచ్ అడ్వెంచర్ క్లబ్లో జిప్ లైనింగ్ ట్రిప్లు ఉన్నాయి. వీటిని పిల్లలకూ, పెద్దలకూ సరిపోయేలా రూపుదిద్దారు. ఇంకా నగరం చుట్టు పక్కల బ్యాలెన్స్వాక్, ఫారెస్ట్ క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. లతో పాటు మరిన్న వైవిధ్యభరిత సాహస వినోదాలు అందుబాటులో ఉన్నాయి. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఎంజాయ్ చేస్తే చక్కని సమ్మర్ అనుభూతిని అందుకోవచ్చు. రాప్పెలింగ్.. స్కై సైక్లింగ్.. ఓ వీకెండ్ను వైవిధ్యభరితంగా, ఉద్విగ్నంగా గడపాలంటే స్కై సైక్లింగ్ మరో మంచి ఎంపిక. ఇది నగరం నుంచి 105కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు దగ్గర అందుబాటులో ఉంది. ఈ స్కై సైక్లింగ్ చేస్తూ ఆ చెరువు అందాలను, పరిసర ప్రదేశాల్లో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. రాక్ క్లైంబింగ్.. తెలంగాణలో అనేక కొండలు, గుట్టలు రాక్ క్లైంబింగ్కు ప్రసిద్ధి చెందాయి. అయితే భువనగిరి కోట ప్రత్యేక శైలి నిర్మాణం రాక్ క్లైంబింగ్ సాహసానికి చారిత్రాత్మక ఆకర్షణను అందిస్తుంది. ఇది నగరం నుంచి దాదాపు 105 కిమీ దూరంలో ఉంది.బంగీ జంపింగ్.. ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, బయటా స్టార్స్ చేయగా చూసి ఉంటారు. అలాంటి బంగీ జంపింగ్ నగరవాసులకు కూడా చేరువలోకి తెచ్చింది లియోనియా రిసార్ట్. నగరం నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ రిసార్ట్కు వెళితే ఈసాహసాన్ని ఆస్వాదించవచ్చు. (చదవండి: అరేబియా సౌందర్యం..కన్నడ దైవత్వం..! ఏకంగా ఆరు రోజులు, ఐదు రాత్రులు..) -
అనుభవాలే పాఠాలుగా...
జీవితంలో పైకి రావాలనుకున్న వారెవరికైనా ముందుగా తాము చేస్తున్న పని పట్ల, తమ లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తమపట్ల తమకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అన్న నమ్మకం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. కావల్సినంత బలాన్నిస్తుంది. అందువల్ల జీవితంలో ఎవ్వరిని నమ్మినా నమ్మకపోయినా మనలో ఉన్న మన ఆత్మవిశ్వాసమే మనల్ని విజయ తీరాల వైపు తీసుకువెళుతుందన్న విషయాన్ని గుర్తించాలి.తమ లక్ష్యాలను సాధించి జీవితంలో విజయ బావుటా ఎగురవేసిన వారిని మనం నిత్యజీవితంలో అనేక మందిని చూస్తుంటాం. వింటూ ఉంటాం. అయితే వారివారి విజయ గాధలలో ఆయా వ్యక్తుల సాఫల్యాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుంటాం కానీ ఆ విజయం వెనుక సదరు వ్యక్తులు పడిన తపన, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవరోధాల గురించి మనం పట్టించుకోం. నిజానికి ప్రతి విజయ గాధ వెనుక ఎన్నో అపజయాలు, మరెన్నో అవరోధాలు ఉంటాయని తెలుసుకోలేం. నేడు సమాజంలో ఉన్నత స్థితికి వచ్చిన ఏ వ్యక్తినైనా తీసుకోండి. వారి విజయం వెనుక వారెన్ని కష్టాలు, ఇబ్బందులు పడ్డారో తేటతెల్లమవుతుంది. ఎన్నో అపజయాలు, ఓటములు అనుభవించిన తరువాత గానీ, ఆయా వ్యక్తులకు విజయం సిద్ధించలేదన్న విషయం బోధపడుతుంది. జీవితంలో ఎవ్వరైనా తాము అనుభవిస్తున్న, అనుభవించిన అవమానాలు, అపజయాలు, ఓటముల ద్వారానే పాఠాలు నేర్చుకోవాలి. ఆయా పాఠాలు నేర్పిన గుణపాఠాలను ఆత్మవిశ్వాసం ద్వారా అధిగమించాలి. తమమీద తాము విశ్వాసాన్ని పెంచుకుని అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకున్న వారే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సాధించగలరు. అందువల్ల ఆత్మవిశ్వాసమే ఆశావహుల ఆభరణమని తెలుసుకోవాలి. మనం చిన్నపుడు తాబేలు, కుందేలు కథ విని ఉంటాం. నిదానంగా, నెమ్మదిగా పరుగెత్తే తాబేలు, అత్యంత వేగంగా పరుగెత్తే కుందేలుతో పరుగెత్తి విజయం సాధించిందని ఆ కథ సారాంశం. మరి ఈ కథలో తాబేలుకు విజయం వరించడానికి ప్రధానమైన కారణమే ఆత్మవిశ్వాసం. ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే వేగంగా కదలలేని తాబేలు, వేగంగా పరుగెత్తే కుందేలు తో పందెం కడుతుంది. ఎంత ఆత్మవిశ్వాసముంటే తాబేలు కుందేలుతో పోటీపడి గెలుస్తుంది. ఎంత అతి విశ్వాసముంటే, పోటీలో గెలిచే సామర్ధ్యమున్నా, కుందేలు విజయానికి దూరంగా ఉందన్న విషయం అవగతమవుతోంది. ఈ కథ ద్వారా జీవితంలో పైకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే, మన లక్ష్యాలను గమ్యాలను దూరం చేసే అతి విశ్వాసం పనికిరాదని తేటతెల్లమవుతుంది.ఆత్మవిశ్వాసంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుదు అబ్రహాం లింకన్ జీవిత గాథ మనకు అవగతం చేస్తుంది. విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించి విజేతగా నిలిచిన గొప్ప వ్యాపారవేత్త కల్నల్ సాండర్స్. కనుక జీవితంలో విజేతగా నిలవాలనుకున్న ప్రతిఒక్కరూ కష్టాలకు నెరవకుండా, అనుభవాలను పాఠాలుగా నేర్చుకుంటూ ముందుకి వెళితే విజయం తప్పక వరిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుని మసలుకోవాలి. – దాసరి దుర్గా ప్రసాద్ -
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ధాన్యాగారంగా మిద్దెలు.. చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. బోధన్: పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు. ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్ పెంకుని అమర్చారు. మట్టి గోడలకు సిమెంట్తో ప్లాస్టరింగ్ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం. – బండారు హన్మాండ్లు సేట్ ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. రుద్రూర్: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్ సేట్ తండ్రి విఠల్ సేట్ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్ను మైమరించేలా తీర్చిదిద్దారు. -
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ప్రతి ఒక్కరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ రియాల్టీలో అది సాధ్యం కాదు. ఇవన్నీ ఆలోచనలకే పరిమితం అవుతాయి. జీవితానుభవం వేరేలా ఉంటుంది. అందుకే మనసుకి - ఆలోచనలకి అస్సలు పొత్తు కుదరదు. మీకు తెలుసా..? మన ప్రవర్తన, ఇతరులతో సంభాషించే విధానం, మన మాటలు, మన హావభావాలు ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయట. అవును.. వీటిని బట్టి ఎదురి వారి మనసును ఇట్టే చదివేయొచ్చు. అలాగే శరీర ఆకారాలు, కళ్ళ రంగు, జుట్టు పొడవు.. ఇలా ఒక్కటేమిటి నఖశిఖ పర్యాంతం వరకు మన వ్యక్తిత్వం ఇట్టే చెప్పేస్తాయ్..అలాగే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా కూడా ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించొచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అలాంటి ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే అందులో మీరు మొదట ఏం చూస్తారనే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పొచ్చు. అంతేనా.. ఈ ఫొటోలో మొదట మీరు ఏం చూస్తారో దానిని బట్టి.. మీరు ఇంట్రావర్ట్ లేదా ఎక్స్ట్రావర్ట్ అనే విషయం కూడా తేలిపోతుంది. ఇంతకీ ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అంటే ఏమిటో అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం..! పదిమందిలో ఉన్నా అంటీముట్టనట్టుగా, ఇబ్బందిగా ఫీల్ అవడాన్నే ఇంట్రావర్ట్ అంటారు. అదే ఒంటరిగా ఉన్నా తనచుట్టూ నలుగురు పోగయ్యేలా చేసేవారు ఎక్స్ట్రావర్ట్స్. ఇదీ తేడా. సరే ఈ కింది ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీరు ఫస్ట్ ఏం చూశారో నిజాయితీగా చెప్పేయాలి మరీ.. View this post on Instagram A post shared by Recovery Trauma Ltd ♥️♥️♥️ (@recoverytraumaltd) ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు, చెట్టు, చెట్టు వేర్లు ఏది ఫస్ట్ చూశారు? ఒక వేళ మీరు చూసింది చెట్టు అయితే.. మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రావర్ట్. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇట్టే చక్కబెట్టేస్తారు. అందరితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ ఇలాంటి వారు ఎక్స్ట్రావర్ట్ అయినప్పటికీ వీరి మనసును చదవడం మాత్రం అంతసులువుకాదు. చాలా టఫ్.అదే ఈ చిత్రంలో మొదట వేర్లు చూసినట్లైతే.. మీరు ఇంట్రావర్ట్. చాలా సౌమ్యంగా, చిన్న విషయానికే హడలేత్తిపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ వీరిలో దృఢ సంకల్పం, మొండి పట్టుదల దండిగా ఉంటుంది. వీరి సంకోచ స్వభావం వల్ల తొలుత వీరిని అందరూ పక్కనపెట్టినా.. వీరి సామర్ధ్యాన్ని అర్ధం చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు.పై రెండూకాకుండా ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు చూసినట్లైతే.. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి అని అర్థం. ప్రకృతి సౌందర్యాన్ని, సరళతను ఆస్వాదించే ప్రశాంతమైన, స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఇలాంటి వారు ఎదుటి వారి డ్రామాలను అస్సలు సహించలేరు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సమతుల్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. స్ట్రెస్కి అంత సులువుగా ప్రభావితం కాలేరు. భావోద్వేగ స్థిరత్వం కలిగి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు.మన చుట్టూ ఉండేవారిలో ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్లేకాదు యాంబీవర్ట్ కూడా ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. ముందు రెండింటిలోని లక్షణాలన్నీ కలగలిపి బాగా ఒంట పట్టించుకున్న వారే యాంబీవర్ట్ వ్యక్తులు. అంటే అంతర్ముఖుడిలా మూతి ముడుచుకొని ఉన్నా.. సమయం వచ్చినప్పుడు బహిర్ముఖుడిలా చెలరేగిపోవడమే యాంబీవర్ట్స్ స్టైల్..!(చదవండి: వాట్ ఏ డేరింగ్..! చెట్టుపైన డ్యాన్స్ అదుర్స్..! కానీ..) -
ఈ ఆదివారం పసందైన స్నాక్స్ ట్రై చేయండిలా..!
బనానా– మీల్మేకర్ పకోడాకావలసినవి: అరటికాయ– 1 (తొక్క తీసి, ఉడికించి, చల్లారాక గుజ్జులా చేసుకోవాలి) మీల్మేకర్– 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుము కోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి– అరకప్పు చొప్పున, శనగపిండి, ఉల్లిపాయ తరుగు– పావుకప్పు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు– 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం– 1 టీ స్పూన్ చొప్పున, పసుపు– చిటికెడు, నిమ్మరసం– 2 టీ స్పూన్లు, నీళ్లు, నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, అరటికాయ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తురుము అన్ని వేసుకుని సరిపడా నీళ్లుతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలచగా కలుపుకుని, అందులో కొద్ది కొద్దిగా అరటికాయ మిశ్రమాన్ని ముంచి, శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి, కాగుతున్న నూనెలో పకోడాలు వేసుకోవాలి. దోరగా వేగాక, వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.గుజరాతీ ఖండ్వీ..కావలసినవి: శనగపిండి, పెరుగు– ఒక కప్పు చొప్పున, పసుపు– పావు టీ స్పూన్, ఉప్పు– తగినంత, నీళ్లు– సరిపడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, నూనె– 2 టేబుల్ స్పూన్లుఆవాలు, నువ్వులు– ఒక టీ స్పూన్ చొప్పున కరివేపాకు– కొద్దిగా, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము– గార్నిష్ కోసంతయారీ: ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్ వేసి, ఉండలు లేకుండా సరిపడా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కళాయిలోకి వడకట్టి తీసుకుని చిన్న మంట మీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడు నాలుగు ప్లేట్లు తీసుకుని వెనుక భాగంలో నూనె రాసి, వాటి మీద ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పలుచగా పూయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని, గుండ్రగా చుట్టుకోవాలి. అనంతరం ఆవాలు, నువ్వులు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివన్నీ నూనెలో తాళింపు వేసుకుని, పచ్చి కొబ్బరి తురుముతో కలిసి.. గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.కొరియన్ యాక్గ్వా స్వీట్కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు (జల్లెడ పట్టుకోవాలి), తేనె, నువ్వుల నూనె– ఒక కప్పు చొప్పున, సోజు లేదా వోడ్కా– ఒక టేబుల్ స్పూన్ (కుకీలను మరింత మెత్తగా ఉండటానికి కొరియన్స్∙వాడతారు), అల్లం పొడి – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, తేనె, నీళ్లు– ఒక కప్పుపైనే, నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్, నట్స్ లేదా నువ్వులు– కొన్ని (నేతిలో వేయించాలి, గార్నిష్ కోసం)తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, నువ్వుల నూనె, ఒక టీ స్పూన్ తేనె, సోజు లేదా వోడ్కా, అల్లం పొడి వేసుకుని, ఉండలు కాకుండా బాగా కలుపుకోవాలి. అనంతరం సరిపడా నీళ్ల పోసి చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ ముద్దను అర అంగుళం మందంతో చపాతీలా ఒత్తుకుని, నచ్చిన మోడల్ కుకీ కట్టర్ సాయంతో కట్ చేసుకుని, వాటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు ఒక పాత్రలో తేనె, నీళ్లు పోసుకుని చిన్న మంట మీద మరిగించాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కబడిన తర్వాత నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం వేయించిన కుకీస్ను వేడివేడిగా ఉన్నప్పుడే ఈ తేనె సిరప్లో వేసుకుని నానబెట్టుకోవాలి. అనంతరం ప్లేట్లో పెట్టుకుని నట్స్ లేదా నువ్వులతో గార్నిష్ చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..? ఆఫీస్ వర్క్ చేయొచ్చా..?) -
క్షణాల్లో మేకప్ వేసుకోవచ్చు..!
సాధారణంగా మేకప్ ప్రక్రియ సమయంతో కూడిన పని. తీరా క్రీమ్స్, పౌండేషన్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసుకున్నాక, ఆ మేకప్ కాస్త ఎక్కువైనా, తక్కువైనా సరి చేసుకోవడం ఇంకాస్త పెద్ద పని. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఈ పరికరం. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ వినూత్న పరికరాలు ఇప్పుడు నిజంగానే వినియోగంలోకి వచ్చేశాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ పరికరాలు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి.చిత్రంలోని ‘టెంప్ట్ యూ 2.0’ ఎయిర్ బ్రష్ మేకప్ సిస్టమ్లో ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ బ్రష్ ఉంటాయి. కంప్రెసర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ బ్రష్తో మేకప్ లిక్విడ్స్ను సన్నని పొరగా చర్మంపై స్ప్రే చేస్తుంది. ఎయిర్పాడ్లో మేకప్ లిక్విడ్ నింపుకోవాలి. కంప్రెసర్ గాలితో అప్లై చేసుకునే మేకప్, చర్మంపై సమానంగా పడుతుంది.ఈ మెషిన్తో మేకప్ వేసుకుంటే తక్కువ కాస్మెటిక్స్తో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది మేకప్ని వేగంగా వేయడంతో పాటు, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఇది ఇంట్లోను, సెలూన్స్లోను ఎక్కడైనా వాడుకునేందుకు అనుకూలమైనదే! ఈ ‘టెంప్ట్ యూ’ ఎయిర్బ్రష్ మేకప్ సిస్టమ్, సాంప్రదాయ మేకప్ పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రెప్పల సోయగంఅందమైన మోముకి వాలు కనులు మరింత సొగసునిస్తాయి. అందుకే చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాష్లను అతికించుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదంటోంది బ్యూటీ ప్రపంచం. కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా పొడవుగా పెరిగేందుకు ‘ఐలాష్ ట్రాన్స్ప్లాంట్’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది నిపుణులతో మాత్రమే చేయించుకోవలసిన శస్త్రచికిత్స పద్ధతి. ఈ చికిత్సలో తల వెనుక భాగం నుంచి వెంట్రుక కుదుళ్లను తీసి, కనురెప్పల మీద అమర్చుతారు. ఆ తర్వాత ఈ వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి, రాలుతాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇతర తాత్కాలిక పద్ధతుల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..?
నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి? – జాగృతి, కర్నూలు. గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గ్రూప్ అయి, మీ భర్తది పాజిటివ్ గ్రూప్ ఉంటే కనుక, రీసస్ యాంటీ–డీ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు. ఇప్పుడు ఫ్లూ సీజన్ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ల వలన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్ వర్క్ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి? – మమత, హైదరాబాద్. ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ చెప్పేది పాటిస్తూ, జాబ్ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్ రీచ్ కాలేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్ఫెక్షన్స్ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి. తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి. నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి? – కీర్తి, నల్గొండ. చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్లాగా వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది. ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి, బేబీకి పెల్విస్ సరిపోతుందా అని చెక్ చేసి, నార్మల్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవాలి. పెల్విస్ ఫ్లోర్ లేదా కెగెల్ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!) -
పక్షులను చల్లగా కాపాడుకుందాం!
వేసవి కాలం పక్షులకు కష్టకాలం. అధిక వేడి పక్షులకు ప్రమాదకరంగా మారుతుంది. డీౖహెడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా పక్షులను రక్షించడానికి... నీరు, నీడ, గాలి ప్రసరణకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కొన్ని జాగ్రత్తలు...పక్షులకు అన్నివేళలా శుభ్రమైన మంచినీరు అందుబాటులో పెట్టాలి ∙ వేర్వేరు ప్రదేశాలలో వాటర్ బౌల్స్ పెట్టాలి ∙ చల్లగా, ఫ్రెష్గా ఉండడానికి వాటర్ బౌల్స్లో ఐస్ క్యూబ్స్ వేయవచ్చు చల్లని, సౌకర్యవంతమైన స్థలంలో పక్షులు ఉండేలా చూడాలి అవసరమైతే కూలింగ్ మ్యాట్స్ ఉపయోగించవచ్చు పక్షులపై ఒక నిమిషం లేదా అర నిమిషం నీటిని స్ప్రే చేయాలి పక్షులకు సమీపంలో తడి టవల్స్ ఏర్పాటు చేయాలి వేగంగా శ్వాస తీసుకోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం, బద్దకంగా కనిపించడం, తినడానికి ఆసక్తి చూపించకపోవడం...మొదలైనవి పక్షులకు సంబంధించి ఓవర్ హీటింగ్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!)ఆహారం విషయానికి వస్తే.... నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయలాంటివి అందించవచ్చు ఉత్తర్ప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో వందలాది గ్రామాల్లో యానిమల్ యాక్టివిస్ట్లు వేసవి వేడి నుంచి పక్షులను కాపాడానికి ‘బర్డ్ రెస్టారెంట్స్’ ఏర్పాటు చేశారు. పక్షులకు చల్లని నీడను ఇచ్చేలా నీరు, ఆహార పదార్థాలతో చెట్టు కొమ్మలపై ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: మూగజీవాల పట్ల ఆదరణ చూపండి) -
మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..
విషయమేదైనా ఆకట్టుకనే ప్రచారం ఆతని సొంతం హాస్యం, చతురోక్తులతో ఆకట్టుకునే స్వరం యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్ మైక్సెట్ బిగించడంతో ప్రారంభమై నో డేట్స్ ప్లీజ్ అనే స్థాయికి ఎదిగిన నూకరాజుపుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి వ్యక్తపరచినపుడే ఆ కళకు సార్థకత. ఇదిగో ఈ పిఠాపురానికి చెందిన నూకరాజు ప్రావీణ్యం అలాంటిదే. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు మైక్సెట్లు బిగించడంతో ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు నో డేట్స్ ప్లీజ్ అనే వరకు వెళ్లిందంటే అతనిలోని ప్రతిభను ఏ మేరకు సానబట్టారో. అతని గొంతు వినపడిందంటే చాలు ఏదో ముఖ్యమైన సమాచారమేనని ఇళ్లలో ఏ మూలనున్నా ఓ చెవు అతడు చెప్పే మాటపై వేస్తున్నారంటే ఆ మాటకున్న విలువ అంతటిదని చెప్పడం అతిశయోక్తి కాదు. మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రారంభించే నూకరాజు ధాన్యం కొనుగోళ్లు.. జాతరల కార్యక్రమ వివరాలు.. రాజకీయ సభల వివరాలు, ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి పాంప్లేట్లలోని సమాచారం.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రతి మనిషికి చెవినిల్లు కట్టుకుని మరీ చెప్తుంటాడు. కరోనా కష్టకాలంలో అయితే అతని సేవలు అంతా ఇంతా కాదు.. ఆరోగ్య భద్రతపై అతను చేసిన ప్రచారం స్థానికంగా ఎంతో మేలు చేసింది. చిన్న సైకిల్పై మైక్ సరంజామా అంతా కట్టుకుని అతను చేసే ప్రచారం పేరున్న యాడ్ ఏజెన్సీలు సైతం చేయలేవంటారు స్థానికులు. కారణం లేకపోలేదు. అతని స్టైలే అతని ప్రచారానికి ప్రధాన ఆకర్షణ. కేవలం పాంప్లేట్ లేదా పోస్టర్లో ఉన్న అంశాన్ని చెప్తూ వెళ్లిపోతుంటే ఇంతలా చెప్పుకోవడం ఎందుకూ.. అక్కడే ఉంషమ్మత్తు అంతా.. అతని మాటలో మహత్తు అది. హాస్యం, చతురత, విషయానుకూలంగా హాస్యోక్తులు జోడించి చెప్పడం అతని ప్రత్యేకత. మరి 50 ఏళ్ల ప్రస్థానమది. ఊరికే వస్తుందా ఆ పరిణితి. మైక్ అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయేంతగా. మైక్తో అనుబంధం నిరుపేద కుటుంబంలో పుట్టిన మొల్లేటి నూకరాజు మండలంలోని విరవ గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి మైక్ సెట్లు అంటే ఇష్టం. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడు 20 ఏళ్ల వయసులో మైక్సెట్లు బిగించే పనిలో చేరాడు. అన్ని రకాల శుభకార్యాలకు, సభలు, సమావేశాలకు వెళ్లి మైక్ సెట్లు వేసే వాడు. ఆ క్రమంలోనే సరదాగా మైక్లో చతురోక్తులు వేస్తూ అందరిని అలరించేవాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సభలు, సమావేశాల్లో ఆయనతో ముందుగా మాట్లాడించేవారు. ఇలా మైక్ ఎనౌన్సర్గా మంచి పేరు సంపాదించాడు. ఏదైనా విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఉపయోగించే దండోరాలకు బదులు మైక్ సెట్లు వినియోగం వచ్చాక రిక్షాలో మైక్ ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని వచ్చినా నూకరాజుకు మాత్రం ఆ సైకిలే ప్రచార వాహనం.నా జీవితం మైక్కే అంకితం మైక్ అనేది నా జీవితంలో భాగమైపోయింది. అది లేని రోజంటూ లేదు. రోజంతా ఊరంతా తిరిగి ప్రచారం చేసి ఇంటికి వచ్చాక కూడా దానిని మరుసటి రోజుకు సిద్ధం చేయడం తప్ప వేరే పని తెలీదు నాకు. మైక్లో ప్రచారం చేసే వాయిస్ కూడా నేనే చెబుతాను. ఐదో తరగతి మాత్రమే చదివినా చదవడం రాయడం బాగానే వచ్చు. విషయం చెబితే దానికి తగ్గట్టుగా వాయిస్ రికార్డు చేసి ప్రచారం చేస్తుంటాను. గతంలో మైక్లో మాట్లాడుతూ ప్రచారం చేసే వాడిని. ఇప్పటికీ సైకిల్ తొక్కగలుగుతున్నానంటే ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహం అభిమానం మాత్రమే. ఇదే పనితో కుటుంబాన్ని పోషించుకుంటు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు నాజీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. – మైక్ నూకరాజు, విరవ, పిఠాపురం మండలం గిరాకీ అంతా ఇంతా కాదు మైక్ ప్రచారాల కోసం ప్రయత్నించే వారు ఆయన కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనా కార్యక్రమానికి అతని ప్రచారం కావాలంటే నెల రోజులు ముందుగానే బుక్ చేసుకోవలసిన స్థాయి అతనిది. 74 ఏళ్ల వయసులో ఇప్పటికీ సైకిల్ పైనే తిరుగుతు మైక్తో ప్రచారం చేస్తున్న అతనిని అందరూ ఇంట్లో వ్యక్తిగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
చల్లచల్లగా వేడితాక'కుండ'..!
వేసవి ముదురుతోంది. తెలంగాణ హైదరాబాద్ నగరంలో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. చల్లని నీటిని అందించడానికి ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన చల్లదనం కోసం నగరవాసులు మళ్లీ మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని అందించే మట్టి ప్రత్యేకతను గుర్తించినవారు ఇప్పుడు నగరంలోని మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల నుంచి, ఆర్గానిక్ బజార్ల నుంచి కుండలను కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో దాహార్తిని తగ్గించుకోవాలంటే కుండలోని నీటితోనే సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బంకమట్టిలోని ఖనిజాలు ఎంజైమాటిక్ కార్యకలాపాలకు మద్దతునిస్తాయి. పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. మట్టిలోని ఖనిజాలు నీటి రుచిని కొద్దిమోతాదులో పెంచుతాయి. తద్వారా అధిక పరిమాణంలో నీరు తాగడానికి దోహదం చేస్తుంది. తద్వారా డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఈ మట్టి నీళ్లలోని ఆల్కలీన్ స్వభావం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తుంది. అలాగే ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లతో పోలిస్తే, మట్టికుండలో నీరు రసాయనాల రహితం. కుండలో నిల్వవున్న నీటికి కాలపరిమితి కూడా ఉండదు. మట్టికుండలు బయోడీగ్రేడబుల్ అంటే పునరి్వనియోగానికి వీలైనవి. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీరినట్టు అనిపించినా, ఆ తర్వాత శరీరానికి హానినే కలిగిస్తుందని వైద్యులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. సహజంగానే మట్టికి చల్లబరిచే గుణం ఉంటుంది. మట్టి కుండలు సహజంగా ఆవిరి ద్వారా నీటిని చల్లబరుస్తాయి. వాటిని వేడి వాతావరణానికి అనువైనవిగా తయారు చేస్తాయి. అలా నీటిని చల్లబరచడం, సహజమైన శీతలీకరణ, మెరుగైన జీవక్రియ, మెరుగైన జీర్ణక్రియతో పాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు మట్టికుండల్లో నీరుటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది పర్యావరణానికీ మేలు చేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, వడదెబ్బను నివారించడంలోనూ సహాయపడుతుంది. కడుపులో ఉత్పత్తయ్యే ఆమ్లతను తగ్గించే సామర్థ్యం ఈ నీటికి ఉండటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలకు నివారణగా పనిచేస్తుంది. చేతికుండలకు కేరాఫ్ ఆదిలాబాద్.. నగరంలో ఆదిలాబాద్ కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదిలాబాద్ ప్రాంతం మట్టికళలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడి మట్టి అత్యంత మెత్తగా, మరిన్ని అధిక ఫిల్టర్ గుణాలు కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాక ఆదిలాబాద్ కుండలు మిగతా ప్రాంతాల కుండలకంటే గాఢతతో ఉండి, ఎక్కువ రోజుల పాటు నీటిని చల్లగా ఉంచగలుగుతాయి. అలాగే వాటిపై ప్రత్యేకమైన చేతి పనితో ఆకర్షణీయమైన డిజైన్లు కూడా జతచేస్తూ అక్కడి కళాకారులు వాటిని సంపూర్ణంగా సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నారు. వేసవిలో టూర్లు ఎక్కువ వెళ్లే వాళ్లు ఉంటారు కాబట్టి వారి కోసం.. బయట ప్రయాణాలకు అనువైన చిన్న పరిమాణంలో క్లే వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆకట్టుకునే వెరైటీలెన్నో.. ప్రస్తుతం మార్కెట్లో గడ్డ కుండలు, జైపూర్ కుండలు, పెయింటెడ్ డిజైన్ కుండలు, ఆదిలాబాద్ మట్టి కుండలు వంటి అనేక రకాలు లభిస్తున్నాయి. చిన్న పరిమాణం గల సాధారణ కుండలు నుంచి పెద్ద డిజైనర్ కుండలు వరకూ ఎన్నో రకాలు వినియోగదారులను ఆకట్టుకునేలా కొలువుదీరాయి. చిన్న చిన్నవి రూ.100 నుంచి ధరల్లో ఉంటే మధ్యస్థాయి మోడళ్లు రూ.250–400 మధ్య ఉన్నాయి. ఇంకా పెద్ద డెకరేటివ్ కుండలు రూ.600 నుంచి రూ.1200 వరకూ ధరక్లూ లభిస్తున్నాయి. ప్రత్యేక హ్యాండీ క్రాఫ్ట్ కుండలు, ప్రత్యేక డిజైన్లతో రూపొందించినవాటి కోసం రూ.1500 ఆపైన కూడా నగరవాసులు వెచి్చస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లోని లామకాన్, సికింద్రాబాద్లోని సాక్రడ్ స్పేస్, వంటి చోట్ల నిర్వహించే ఆర్గానిక్ సంతల్లో గచ్చిబౌలిలోని పలు ఆర్గానిక్ బజార్లలో కుండలు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ కుండలు పూర్తి స్థాయిలో హ్యాండ్ మేడ్, రసాయన రహిత మట్టి ఉపయోగించి తయారవుతాయని, అందుకే వీటితో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఆన్లైన్లో.. మట్టి వాసన.. ఏళ్లనాటి మట్టి వాసనకు మళ్లీ మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనంగా ఆన్లైన్లో పలు వెబ్సైట్లు నిలుస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కాంప్లాంట్ మార్కెట్లు, సహజశ్రీ, ఆర్గానిక్ ఇండియా వంటి ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా నగరవాసులు మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు.. ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించే వెబ్సైట్లలో లభించే ప్రత్యేకమైన ‘ఎకో ఫ్రెండ్లీ వాటర్ పాట్స్‘కి మంచి ఆదరణ ఉంది. ఎర్తెన్ ఫైన్ క్రాఫ్ట్స్ విలేజ్ డెకార్, కావేరీ డెల్టా ప్రాంతం నుంచి హ్యాండీ క్రాఫ్ట్ చేసిన మట్టికుండలు, క్లే కుకింగ్వేర్ సైతం అందించే జిష్తా, కుకింగ్ పాన్లు, కర్రీ పాన్లు, వాటర్ డిస్పెన్సర్లు తదితర మట్టి ఉత్పత్తులు అందించే మడ్ కార్ట్ వంటివి ఆన్లైన్ విపణిలో మట్టికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. (చదవండి: చిన్నారులకు వచ్చే సాధారణ డెంటల్ సమస్యలకు చెక్పెడదాం ఇలా..!) -
చిన్నారుల నోటి ఆరోగ్యం కోసం..!
పిల్లలు ఎదుగుతూ ఉండే సమయంలో అన్ని ఎముకలతోపాటు ముఖానికి సంబంధించిన ఎముకలూ, దవడ ఎముకల్లోనూ మార్పులు వస్తుంటాయి. దాంతో చిన్నారుల్లో ఈ ఎదుగుదలకు సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించవచ్చు. అలాగే చిన్నపిల్లలు చాక్లెట్లు, స్వీట్స్, జంక్ఫుడ్ వంటివి ఇష్టంగా తింటుంటారు. వేసవిలో కూల్డ్రింక్స్ తాగుతుంటారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. పిల్లల్లో వచ్చే కొన్ని సాధారణ డెంటల్ సమస్యలూ, వాటికి పరిష్కారాల కోసం ఈ కథనం. ఎముకలు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పులు స్వాభావికమైనవి. అయితే ఎదిగే వయసులో ఉన్న కొందరు చిన్నారులు అలవాటుగా తమ వేలిని నోట్లో పెట్టుకుని థంబ్ సకింగ్ చేస్తుంటారు. ఇది నివారించాల్సిన విషయమే అయినప్పటికీ... పిల్లల సైకలాజికల్ ఎదుగుదల దృష్టితో చూస్తే వారి ఈ అలవాటును బలవంతంగా మాన్పకూడదనీ, క్రమంగా మాన్పించాలని నిపుణులు పేర్కొంటుంటారు. ఇలా ఎముకల పెరుగుదలతో వచ్చే మార్పులతోనూ, నోట్లో వేలుపెట్టుకునే అలవాటు వల్లా పలువరస షేప్ మారవచ్చు. కొన్ని సాధారణ దంతసమస్యలివి... పిప్పిపళ్లు చిగుర్ల సమస్యలు పాలపళ్లు సరైన సమయంలో ఊడకపోవడం ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు పళ్లు, పళ్ల మధ్య సందులతో సమస్యలు ముఖానికి దెబ్బలు తగలడం వల్ల వచ్చే సమస్యలు. పిప్పిపళ్లు...దాదాపు 80 శాతానికిపైగా పిల్లల్లో పిప్పిపళ్లు, చిగుర్ల జబ్బులు కనిపిస్తుంటాయి. తీపి పదార్థాల ముక్కలు నోటిలోనే ఉండిపోవడంతో పెరిగిపోయిన బాక్టీరియాతోపాటు వారు సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఆ పెరిగిన బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో నోటిలోనే ఉండిపోవడం, అవి విడుదల చేసే హానికర రసాయనాల వల్ల పళ్లలో రంధ్రాలు ఏర్పడి పిప్పిపళ్లు రావచ్చు. రంధ్రాల పరిమాణం పెరుగుతున్న కొద్దీ ఆహార వ్యర్థాలు అక్కడ ఎక్కువగా ఇరుక్కుపోవడం, దాంతో రంధ్రం మరింతగా పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చి నొప్పిరావచ్చు. ఇలాంటి పిప్పిపళ్ల కారణంగా చిన్నారులు ఆహారం నమలడానికి ఇబ్బందిపడతారు. అన్నం తినడాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు వచ్చే నొప్పిని తల్లిదండ్రులకు సరిగా చెప్పలేక ఇలా అన్నం తినడానికి నిరాకరిస్తుంటారు. దాంతో ఎదుగుదల కూడా ఎంతో కొంత ప్రభావితం కావచ్చు. చికిత్స...పిప్పిపళ్లకు సరైన సమయంలో చికిత్స చేయించక΄ోతే ఇన్ఫెక్షన్ పంటి ఎముక వరకు చేరి, పాల పళ్లతోపాటు తర్వాత రావాల్సిన శాశ్వతదంతాలూ పాడయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి పిల్లలను దంతవైద్యులకు చూపించినప్పుడు వారు పంటిలోని రంధ్రాలను పూడ్చివేయడం, ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తగిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం వంటి చికిత్సలు చేస్తారు. చిగుర్ల జబ్బులు... చిన్నారులకు బ్రషింగ్ నైపుణ్యాలు అంతగా తెలియక΄ోవడంతో పళ్లలో చిక్కుకున్న ఆహారపదార్థాలను సరిగా శుభ్రం చేసుకోక΄ోవడం కారణంగా పిప్పిపళ్ల తోపాటు చిగుర్ల సమస్యలు వచ్చే ముప్పూ ఉంటుంది. దీనికో కారణముంది. నోట్లో విపరీతంగా పెరిగి΄ోయిన బ్యాక్టీరియా, ఆహారపదార్థాలతో కలిసి ప్లాక్, క్యాలికులస్ అని పిలిచే మురికి సున్నితమైన చిగుర్ల చివర్లలోకి చేరుతుంది. ఈ మురికి కారణంగా చిగుర్లలో వాపు, కొందరిలో చిగుర్ల నుంచి రక్తస్రావం కావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా రావచ్చు. చిన్నవయసులోనే చిగుర్ల జబ్బు వస్తే పిల్లలు జీవితకాలం దృఢమైన పళ్లు లేక ఇబ్బంది పడవలసి రావచ్చు. చికిత్స...జింజివైటిస్ వంటి సమస్యలకు తగిన యాంటీబయాటిక్స్ వాడటతోపాటు చిగుర్లకు వచ్చే సమస్యను బట్టి దంతవైద్యులు పలురకాల చికిత్సలు అందిస్తారు. ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు పళ్లు / వంకరపళ్ల వంటి సమస్యలు... ఎత్తుపళ్లు అన్నది పిల్లలను ఆత్మన్యూనతకు గురిచేసే సమస్య. మొదట్లో ఇది నివారించదగిన సమస్యే అయినప్పటికీ, తల్లిదండ్రుల అవగాహనాలోపం, మరికొందరిలో వారి నిర్లక్ష్యం వల్ల ఇది తీవ్రమవుతుంది. ఎత్తుపళ్లు / ఎగుడుదిగుడు పళ్లు / వంకర పళ్లకు కారణాలు... ఎత్తుపళ్లు చాలావరకు వంశపారంపర్యంగా వస్తుంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరికిగానీ లేదా ఇద్దరికీ ఎత్తుపళ్లు ఉంటే పిల్లల్లోనూ వచ్చే అవకాశాలు 70 శాతానికి పైమాటే. పిల్లలకు ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు / వంకరపళ్లు, పళ్లమధ్య సందులు రాకుండా చేసే చికిత్సలు సైతం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నోట్లో వేలుపెట్టుకోవడం, పెదవులు కొరకడం, నాలుకతో పళ్లను ముందుకు తోస్తూ ఉండటం, నోటితోనే గాలిపీల్చడం వంటి అంశాలూ ఎత్తుపళ్లకు కారణమవుతుంటాయి. ఎదుగుతున్న చిన్నారుల దవడ ఎముకలు మైనంలా ఒత్తిడి పడుతున్న దిశకు వంగి΄ోతుంటాయి. ఈ కారణం వల్లనే ఇక్కడ పేర్కొన్న దురలవాట్లు ఉన్న పిల్లల్లో దవడ ఎముకల షేపు మారి΄ోయి పళ్లు ఎత్తుగా రావచ్చు. పాలపళ్లు సమయానికి ఊడిపోకపోయినా, పిప్పిపళ్లను ముందే తీసేయాల్సి వచ్చినా ఎత్తుపళ్లు లేదా ఎత్తు పళ్లు, ఎగుడుదిగుడు పళ్లు రావడానికి ఈ అంశాలు కూడా ఒక కారణం. ఎదిగే వయసులోనే ఎత్తుపళ్లను, ఎగుడుదిగుడు దంతాలనూ, సరిచేయడం, పళ్ల మధ్యన ఉండే సందులు చక్కదిద్దడం చాలా సులువు. చికిత్స ఫలితాలు కూడా దాదాపు నూరు శాతం ఉంటాయి. ఎదిగే వయసులో వచ్చే ‘గ్రోత్ స్పర్’ అనేది చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చికిత్స త్వరగా, సమర్థంగా జరిగేందుకు ఈ గ్రోత్ స్పర్ అంశం సహాయపడుతుంది. ఎత్తుపళ్ల సమస్య రెండు రకాలుగా ఉండవచ్చు... కేవలం పళ్లు మాత్రమే ఎత్తుగా ఉండటంపళ్లతోపాటు దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉండటం. పిల్లలు నవ్వినప్పుడు చిగుర్లు ఎక్కువగా కనిపించడం, నిద్రపోతున్నప్పుడూ పెదవులు తెరచుకునే ఉండటం, పెదవులు ముందుకు వచ్చినట్లుగా కనపడటం వంటివి ఎముక కూడా ఎత్తు పెరిగిందని చెప్పడానికి గుర్తులు. చికిత్స...ఎదిగే వయసులో ఎత్తుగా ఉన్నట్లు గుర్తిస్తే... ఎలాంటి శస్త్రచికిత్సలూ లేకుండానే పళ్లు, దవడలను ప్రత్యేకమైన క్లిప్స్తో సరిచేయవచ్చు. అయితే... ఎదిగిన పిల్లల్లో దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే సర్జరీ చేయాల్సి రావచ్చు. పళ్లు ఎత్తుగా ఉన్నా, పళ్ల మధ్య సందులు ఉన్నా, వంకర టింకరగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా క్లిప్పులతో వాటిని సరిచేయవచ్చు. అయితే పిల్లలకు అమర్చాల్సిన క్లిప్పులు అందరిలో ఒకేలా ఉండవు. వ్యక్తిగతమైన పరీక్షల తర్వాతే వారికి సరి΄ోయేవాటిని నిర్ణయించాల్సి ఉంటుంది. పాలపళ్లు సరైన టైమ్లో ఊడకపోవడం... సాధారణంగా పాలపళ్లలోని ప్రతి పన్నూ ఓ నిర్దిష్ట సమయం తర్వాత ఊడుతుంది. శాశ్వత దంతం తయారై బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడే పాలపన్ను ఊడుతుంది. ఊడిన 3 నుంచి 4 నెలల్లో శాశ్వత దంతం వచ్చేస్తుంది. ఏ కారణం వల్లనైనా పాలపన్ను ఊడక΄ోతే, దానికి ముందువై΄ో, వెనకవైపు నుంచో శాశ్వత దంతం వస్తుంది. (కొన్నిసార్లు పాలపన్ను ఊడకపోవడం వల్ల శాశ్వత దంతం బయటకు రాలేక చిగురులోనే చిక్కుకుపోవచ్చు కూడా). దాంతో రెండు వరసల్లో పళ్లు కనపడతాయి. అందుకే ఆరేళ్లు దాటిన పిల్లలను దంతనిపుణులకు తరచూ చూపిస్తూ పాలపళ్లు సరైన సమయంలోనే పడిపోతున్నాయా లేదా అని పరీక్ష చేయిస్తూ ఉండాలి. అవసరాన్ని బట్టి వారి పర్యవేక్షణలో చికిత్స చేయించాలి. పరీక్షలు : ఎక్స్–రే సహాయంతో పాలపళ్లు, శాశ్వత దంతాలను, శాశ్వతదంతాలను చిక్కుకు΄ోయిన తీరును దంతవైద్యులు తెలుసుకోగలరు. ముఖానికి దెబ్బలు తగలడం వల్ల... ఎదిగే పిల్లలు ఆటలాడుతుంటారు. పైగా ఇవి సెలవురోజులు కావడం ఆడుకోవడం మరింత ఎక్కువ. ఆటల్లో పరుగెత్తుతూ పడి΄ోవడం, దెబ్బలు తగలడం, క్రికెట్ బంతి లేదా ఇతర బంతుల వంటివి తగలడం, పిల్లలు ΄ోట్లాడుకోవడం వంటి చర్యలతో ముఖానికి దెబ్బలు తగలడం, పళ్లు విరగడం / వంగి΄ోవడం, దెబ్బలు తీవ్రమైనవైతే పెదవులు చీలడం, ముక్కు వంకర కావడం కూడా జరగవచ్చు. ఇలా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే చికిత్స చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే పలువరస షేపు మారడం, పళ్లపై గుర్తులు ఏర్పడి అలాగే ఉండి΄ోవడం జరగవచ్చు. అందుకే పన్ను విరిగినా, ఊడినా వెంటనే ఆ ముక్కను పాలలో లేదా మంచినీళ్లలో ఉంచి దంతవైద్యులను కలవాలి. వేసవి సెలవులు దంతవైద్యం చేయించడానికి అనువైన సమయం. ఈ సమయంలో స్కూళ్లకు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల చదువులు వృథా కాకుండానే చికిత్స చేయించవచ్చు. పైగా చికిత్స తర్వాత వారు ఇంటిపట్టునే ఉంటారు కాబట్టి టైముకు మందులు ఇవ్వడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోడానికి, పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వడానికి సెలవులన్నవి సరైన సమయం. కాబట్టి తల్లిదండ్రులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పంటి సమస్యలున్న పిల్లలకు తగిన వైద్యసహాయం అందించవచ్చు. (చదవండి: మిలమిల మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపించే ప్రాంతం అది..! ) ∙ -
వేసవిలో చిన్నారులకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే..!
వేసవిలో పిల్లలకు ఆహారం ఇవ్వాలంటే రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వేసవి వేడిమి. రెండోది సెలవుల్లో వాళ్ల ఆటలు. నగరాల్లోని పిల్లలు ఎండల్లో పెద్దగా ఆడే అవకాశం లేకపోయినా పట్టణాల్లో, పల్లెల్లోని పిల్లలు ఇలా ఎండ వేడిమిలో ఆడటం మామూలే. అలాగే పెద్ద నగరాల్లోంచి సెలవులకు పల్లెలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గినప్పటికీ... కొంతమంది ఇప్పటికీ ఇలా వచ్చేవారు లేకపోలేదు. ఇలా వేసవిలోని వేడిమిని తట్టుకుంటూ... ఎక్కువ సమయం ఆటలకు ఇచ్చుకుంటూ ఉండేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తూ ఉండటానికి చిన్నారులకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలిపే కథనం. అధిక శక్తికోసం పాల ఉత్పత్తులు... పిల్లలకు తాజా లస్సీ, తాజా మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి ఇవ్వడం వల్ల ఒకపక్క అవి ద్రవాహారాలుగా వారు కోల్పోయే నీరు లవణాలను భర్తి చేయడం తోపాటు ప్రొటీన్లనూ అందజేస్తాయి. ఎదిగే వయసులో ఎముకల బలం కోసం క్యాల్షియమ్ను ఇస్తాయి. తాజా పండ్లు... పిల్లలకు తాజా పండ్లు తినిపించడం ఎప్పుడూ మంచిదే. కాకపోతే పండ్ల రసాలకు బదులు వీలైనంతగా పండ్లను కొరికి తినేలా చూడాలి. ద్రవాలను భర్తీ చేయడం కోసం, వేసవి ఉపశమనం కోసం అప్పుడప్పుడూ చల్లగా ఉండే తాజా పండ్ల రసాలనూ ఇవ్వవచ్చుగానీ... వీలైనంత వరకు వాటిలో చక్కెర కలపకపోవడం మంచిది. జంక్ఫుడ్ వద్దు... బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి వాటి కోసం వాళ్లు మారాం చేస్తున్నప్పటికీ ఆరోగ్యానికి అవి హానికరమంటూ వాళ్లను సముదాయించడం మంచిది. ఆ వయసు పిల్లలను సమాధానపరచడం కష్టం కాబట్టి వాటిలో పనీర్, తాజాకూరగాయలు పుష్కలంగా నింపి ఇవ్వడం మంచిది. అయితే వాటిల్లో చీజ్ ఎక్కువగా ఉన్నవాటిని తినిపించడం అంతగా మంచిది కాదు. మరీ మారాం చేస్తుంటే గ్రిల్డ్ వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. ఐస్క్రీముల విషయంలో... వేసవిలో ఐస్క్రీములు అడగని పిల్లలు ఉండరు. ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్ వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఇవి ఆరోగ్యకరమే. ఇక కూల్డ్రింక్స్ కోసమూ డిమాండ్ ఎక్కువగానే ఉండవచ్చుగానీ వాటిని ఇవ్వడం అంతమంచిది కాదని గుర్తుంచుకోండి. (చదవండి: మిలమిల మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపించే ప్రాంతం అది..! ) -
కుందనపు బొమ్మ నటి మేఘా ఆకాశ్ ఇష్టపడే ఆభరణాలు ఇవే..!
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం.. వెండి వెలుగులుఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే. సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్ను తెప్పిస్తున్నాయి. వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది. (చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..) -
వేసవి అంటే సెలవులేనా?
వేసవి కాలం వచ్చిందంటే చాలామంది టీనేజర్లు మెల్లగా మధ్యాహ్నం లేచి, తాపీగా రీల్స్ చూసుకుంటూ, సాయం కాలం క్రికెట్ ఆడుతూ కాలం గడిపేస్తుంటారు. కాని, కాస్తంత మనసు పెడితే ఈ వేసవిని మీ మైండ్సెట్ను మార్చుకునే అద్భుత అవకాశంగా మలచుకోవచ్చు. మెరుగైన ఫోకస్, స్పష్టమైన లక్ష్యాలు, కొత్త స్కిల్స్, నిజమైన ఆత్మవిశ్వాసం గల మీ బెస్ట్ వెర్షన్గా మారవచ్చు. అందుకోసం ‘ఎస్.టి.ఏ.ఆర్’ను ఫాలో అయితే సరి.సిట్యుయేషన్ వేసవి సెలవుల వాస్తవంవేసవి అనేది తెల్లవారుఝాము వరకు నెట్ఫ్లిక్స్ చూస్తూ, మధ్యాహ్నం వరకు నిద్రపోయే టైమ్ మాత్రమే కాదు. మీ జీవితాన్ని మార్చుకునే టర్నింగ్ పాయింట్ కూడా! వేసవి అంటే మూడు అద్భుతమైన అవకాశాలు:రీచార్జ్: ఎనర్జీ లెవల్స్ని తిరిగి రీచార్జ్ చేసుకునే అవకాశంరిఫ్లెక్ట్: మీ అభిరుచులు, ఆలోచనలు గురించి అర్థం చేసుకునే అవకాశంరీ ఇన్వెంట్: మీరు కొత్తగా రూపుదిద్దుకునే అవకాశంథాట్ నిన్ను నీవు తెలుసుకోవడంఈ వయస్సులో మీ మనస్సు ఐడెంటిటీ కోసం వెతుకుతుంది. ‘నేనెవరు?’, ‘ఏం చేస్తే నా జీవితానికి అర్థం వస్తుంది?’ అన్న ప్రశ్నలు రోజూ మనసులో తిరుగుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ వేసవిని ఉపయోగించుకోండి. అందుకోసం ఐదు విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి.ప్యాషన్స్: నాకు నిజంగా ఏది ఇష్టం? ఫియర్స్: నన్ను వెనక్కి లాగుతున్న భయాలు ఏవి?స్ట్రెంగ్త్స్: నా మానసిక బలాలేంటి?హ్యాబిట్స్: నేను రోజూ చేసే పనులు నన్ను ముందుకు నడిపిస్తున్నాయా? నాశనం చేస్తున్నాయా?విజన్: వచ్చే రెండు మూడేళ్లలో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను?యాక్షన్ ఐదు వారాల చాలెంజ్ఈ వేసవిలో వారానికో చాలెంజ్ చొప్పున ఐదు వారాలు ఐదు చాలెంజŒ లు స్వీకరించండి. ఇవేవీ స్కూల్లో, కాలేజీలో కనిపించేవి కావు, బోధించేవీ కావు. కానీ మీ జీవితాన్ని సంతోషమయం చేస్తాయి. మొదటివారం డిజిటల్ డీటాక్స్. అంటే స్క్రీన్ టైమ్ను రోజుకు మూడు గంటలకే పరిమితం చేయడం. నిద్రకు గంట ముందు, నిద్రలేచాక గంటపాటు స్మార్ట్ఫోన్ ముట్టుకోకుండా ఉండటం. రోజూ 15 నిమిషాలు డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల మీ మెదడులో డోపమైన్ బ్యాలెన్స్ అవుతుంది. క్లారిటీ, మోటివేషన్ పెరుగుతుంది. రెండో వారం మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదా హాబీని ఎంచుకుని, రోజుకో రెండు గంటలపాటు దానిపై పనిచేయండి. ఇలా డీప్ వర్క్ చేయడం వల్ల మీ ఫోకస్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మూడోవారం రాత్రి నిద్రకు ముందు పదినిమిషాలు డైరీ రాయండి. ఈరోజు హైలైట్స్ ఏమిటి? నన్ను ఏది ఇన్స్పైర్ చేసింది? రేపు ఏం మెరుగుపరచుకోవాలి? ఇలా రాయడం వల్ల మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుతుంది.నాలుగోవారం ఐదు బేసిక్ లైఫ్ స్కిల్స్ నేర్చుకునేందుకు ఉపయోగించండి. మనీ మేనేజ్మెంట్కనీసం రెండు మూడు వంటలు నేర్చుకోవడంఒక లోకల్ ట్రిప్ ప్లాన్ చేయడంప్రాథమిక చికిత్స నేర్చుకోవడంమీకు నచ్చిన సబ్జెక్ట్పై మూడు నిమిషాలు మాట్లాడటంఐదోవారం కనెక్షన్ వీక్. ఒక రోజంతా కంప్లయింట్ చేయకుండా గడపండి. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీ అవ్వాతాతలతో కూర్చుని మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. అలాగే దగ్గరలో ఉన్న పిల్లలకు మీకు తెలిసింది నేర్పించండి. ఇలా చేయడం మీ బంధాలను బలపరచడమే కాకుండా, మీకు నిజమైన ఆనందాన్నిస్తుంది.రిజల్ట్ కొత్త నువ్వుఈ వ్యాసంలో చెప్పినవన్నీ పాటిస్తే ఈ వేసవి ముగిసేసరికి నీ గురించి నీకు స్పష్టత వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మెదడులో డోపమైన్ వ్యసనం తగ్గి, ఫోకస్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. నిన్ను నువ్వే మెచ్చుకునేలా మారిపోతావు. ఆల్ ది బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ
ఒకపుడు గర్భం దాల్చడం, ప్రసవించడం, పిల్లలకు పాలివ్వడం ఇవన్నీ చాలా గోప్యమైన వ్యవహారాలుగా భావించేవారు. గర్భధారణ, మాతృత్వం, ప్రసవవేదన, పిల్లల పెంపకం అంత ఈజీ కాదనీ, ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ సవాళ్ల గురించి సమాజం తెలుసుకోవాలనే చర్చ ఇటీవలి కాలంలో బాగా జరుగుతోంది. తల్లిపాలు ఇవ్వడం (Breastfeeding)-తల్లుల మానసిక ఆరోగ్యంపై ప్రభావంపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే నటీమణులు రాధికా ఆప్టే, బిపాసా బసు ప్రెగ్నెన్సీ అంటే ఫ్యాన్సీ కాదని దీని వెనుక ఎంతో శారీరక,మానసిక ఆందోళనతో పాటు, భావోద్వేగ పూరిత జర్నీ గురించి చర్చించారు. తాజాగా ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గర్భంతో ఉన్న సమయంలోనూ, పాలిచ్చే సమయంలోనే తాను అనుభవించిన సమస్యలు, సవాళ్ల గురించి మాట్లాడటం విశేషం.భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన నవజాత కొడుకును చూసుకునే బాధ్యత తనను చాలా బాధపెట్టిందని సానియా మీర్జా చెప్పింది. మాతృత్వం అనుభవాలను, ఆటనుంచి రిటైర్ కావడానికి గల కారణాల గురించి ఓ పాడ్ కాస్ట్ లో పంచుకుంది. నిజంగా బిడ్డకు పాలివ్వడం అనేది గర్భధారణకంటే అత్యంత కష్టతరమైనదిగా అనిపించిందని కూడా చెప్పింది. అంతేకాదు మరో మూడు సార్లు అయినా గర్భవతి అవుతానేమో కానీ, పిల్లలకు పాలివ్వడం, వారి ఆకలి తీర్చడం అనే పని మాత్రం తన వల్ల కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ డ్యూటీ శరీరంలో భాగం కాదు, పైగా పిల్లలు మనపై ఆధారపడి ఉంటారు. ఇది నిజంగా మిమ్మల్ని కట్టివేస్తుంది. అందుకు సమయం కేటాయించాలి, తగినంత నిద్ర ఉండదు . బిడ్డకు పాలిచ్చే సమయానికి ఆటపరంగానో, లేదా ఇంకేదో పనుల్లోనో ఉండాల్సి వస్తుంది అంటూ తన బాధల్ని పంచుకుంది. మానసిక భావోద్వేగం, మతిపోయేంత ఆందోళనగర్భధారణ అనేది అనేక హార్మన్లతో కూడుకున్న అంశం. ప్రెగ్నెన్సీఅనేది అందమైన అనుభవం కంటే, కానీ ఆ సమయంలో కంటే తన కొడుకు ఇజాన్కు తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది. తాను దాదాపు మూడు నెలలు తల్లిపాలు ఇచ్చాననీ, కానీ తన బిడ్డకు పోషకాహారం అందించే ఏకైక వ్యక్తిగా ఉండటం అనేక మానసిక ఆందోళన కలిగించిందని వివరించింది. అలాగే పసిబిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ కడుపు నింపే క్రమంలో తాను బాగా అలిసిపోయే దాన్నని చెప్పుకొచ్చింది. శారీరక అంశాల కంటే మానసిక భావోద్వేగం ఎక్కువ ఉంటుందని, ఉద్యోగం చేసే మహిళలకు తల్లిపాలు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ఆమె చెప్పుకొచ్చింది. ఒక దశలో తనకు పిచ్చెక్కిపోతోందనే భావన కలిగిందనీ, దీంతో నేపథ్యంలోనే పిల్లల వైద్యుడిని సంప్రదించా.. ఇంకో నెల కొనసాగించమని చెప్పినా తన వల్ల కాదని చెప్పేశానని తెలిపింది. అలాగే బాడీ షేమ్ చేస్తారనే అంశాన్ని కూడా గుర్తు చేసుకుంది. ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ కావడానికి గల కారణాలను పంచుకుంటూ సానియా ఇలా చెప్పింది. తన కుమారుడితో ఎక్కువ క్వాలిటీ సమయాన్ని గడపాలనే ఆలోచనతోనే రిటైర్మెంట్నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇజాన్ బాల్యంలో అతనికి అవసరమైనసంరక్షణ అందించాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.కాగా సానియా మీర్జా , షోయబ్ మాలిక్(మాజీ భర్త) దంపతులకు 2018లో కొడుకు ఇజాన్ జన్మించారు. ప్రస్తుతం సానీయా, షోయబ్ విడాకులు తీసుకోగా, షోయబ్ మరో వివాహం కూడా చేసుకున్నాడు. -
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
అప్పటిదాక భారత్ పాక్ల మధ్య చక్కటి సానుకూల వాతావరణంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఏవో కొద్దిపాటి ఘర్షణలు ఉన్నా..శాంతియుత జీవన విధానానికే పెద్దపీట వేస్తూ..ఇన్నాళ్లు భారత్ సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆ ఒక్క ఘటన.. భారత్ ఆగ్రహం కట్టలు తెంచుకునేందుకు కారణమైంది. ఆ దెబ్బతో సరిహద్దులు, ఒప్పందాలు..అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఆ అమానుష ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే గాక పాక్ని కళ్లర్రజేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదమే కష్టాలు తెచ్చిపెట్టింది. పైగా ప్రపంచం ముందు దోషిలా నిలబెట్టింది. కానీ ఈ చర్యలతో అల్లాడుతున్న అమాయక జనం వెతలు చూస్తే..కడుపుతరుక్కుపోతోంది. అందుకే పెద్దలు అంటుంటారు..ఏ పనిచేసినా.. ముందు ఒక్క క్షణం ఆలోచించు..లేదంటే దాని పర్యవసానం ఏ పరిస్థితికి తీసుకొస్తుందో ఊహకందదని." ఇప్పుడు ఆ స్థితినే పాక్ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు.ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ వచ్చినా..ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే అనేది జగమెరిగిన సత్యం. అదే మూడు రోజులక్రితం జరిగిన పహల్గామ్ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఆ ఘటనతో భారత్ పాక్ల మధ్య సార్క్ వీసా హక్కులు రద్దు అయ్యాయి. అలాగే వాఘా సరిహద్దులు మూసేయడం జరిగింది. దీంతో పిల్లల చికిత్స కోసం వచ్చిన పాకిస్తాన్ తల్లిదండ్రుల బాధలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. తమ కంటిపాపల కోసం భారత్కు వస్తే.. హఠాత్తుగా ఉన్నపళంగా వెనక్కి వెళ్లిపోమని దేశాల నుంచి ఆదేశాలు వస్తుంటే.. ఏం పాలుపోక దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్న ఆ దృశ్యాలు ఎవ్వరినైనా కంటతడిపెట్టిస్తాయి. వారి గాథలు ఎలా ఉన్నాయంటే..ఒక పాకిస్తానీ తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. "ఇక్కడైతే ఆధునాతన వైద్య చికిత్స ఉంటుందని డిల్లీకి వచ్చాడు. మరో వారం రోజుల్లో ఆపరేషన్ జరగనుంది. అందుకు అక్కడ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సహకరిస్తున్నారు. కానీ ఈ అనూహ్య పరిణామం కారణంగా షాక్కి గురయ్యాం. ఇక్కడ ఉండటానికి..చికిత్సకు చాలా ఖర్చు అయ్యిందంటూ వేదనగా ఓ పాక్ తండ్రి చెబుతున్నాడు. మరొక పాకిస్తానీ వ్యక్తి తన కొడుకు గుండె ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చామని, రెండు రోజుల్లో సర్జరీ అని కన్నీటిపర్యంతమయ్యాడు. ఒక్కొక్కరిది ఒక్కే విధమైన వేదన. అయితే వారంతా ఇక్కడ వారికి హృదయం ఉంది, ఎలాగైనా ఇరుదేశాలను అభ్యర్థిస్తాం తమ పిలల్లకు సర్జరీ అయ్యేంతవరకు ఉండనివ్వమని అని ధీనంగా చెబుతున్నారు. అయితే వారందర్నీ భారత పోలీస్ యంత్రాంగం, విదేశాంగ కార్యాలయం వెంటనే భారత్ నుంచి బయలుదేరాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, పాకిస్తాన్లో ఉన్న 100 మందికి పైగా భారతీయ పౌరులు గురువారం భారతదేశానికి తిరిగి రాగా, భారత్లో ఉన్న 28 మంది పాకిస్తానీయులు వాఘా సరిహద్దు మూసేయడంతో తిరిగి భారత్లోకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనా..ఒక్క దుశ్చర్య ఎంతమందిని బాధల్లోకి నెట్టేసిందనేందుకు ఈ ఉదంతమే ఉదహరణ.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు) -
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మంచి ఆరోగ్యం కోసం తినాల్సిన వాటి గురించి సదా ఆరోగ్య నిపుణులు ద్వారా వింటుంటాం. అయితే అవి మన వల్ల కాదని, ఇష్టం లేదనో లేక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని రకాల నట్స్ మాత్రం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని మన డైట్లో భాగం చేసుకుంటే చాలామటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాదంపప్పు. బరువుతగ్గేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెండచడంతో దీనికి సాటి మరొకటి లేదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవో పరిశోధనాత్మకంగా వివరించి చెప్పారు. అవేంటంటే..!.గుండె ఆరోగ్యం: ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ, డయాస్టొలిక్ రక్తపోటును కొద్దిగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణ: రోజూ కనీసం 50 గ్రాముల బాదం తీసుకుంటే బరువు పెరగమని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి హెల్ప్ అవుతుందని అన్నారు. గట్హెల్త్: బాదం ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.బ్లడ్ షుగర్: బాదం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్బీఏ1సీస్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేగాక బాదంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నందున రోజవారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం తమ అధ్యయనాలు బాదం ప్రయోజనాలను బలంగా హైలెట్ చేశాయని అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ డైట్లో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక వాటి పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు నిపుణులు.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు) -
సలుపుతున్న రాచపుండు!
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ కేన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20–25 ఏళ్ల యువతనూ పట్టిపీడిస్తోందంటున్నారు. పొగాకు తీసుకోవడం ప్రారంభించిన 10–20 ఏళ్ల తర్వాత కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతోందని, దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు.ఒత్తిడితో ప్రమాదమే..మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో శరీరంలో వ్యాధి నిరోరధకశక్తిపై తీవ్రప్రభావం చూపి కొన్ని రకాల హర్మోన్లు లోపిస్తాయి. దీంతో కూడా కేన్సర్ బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు..ఏటా కరీంనగర్ జిల్లాలో వందల మంది కేన్సర్తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవనశైలిలో మార్పుతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో నోటి, వివిధ రకాల కేన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉన్నాయి.నోటి కేన్సర్కు కారణాలు..పురుషుల్లో స్మోకింగ్, స్మోక్లెస్ టొబాకో వినియోగం ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బీడీ, సిగరేట్తోపాటు నాన్ స్మోకింగ్ టొబాకోలో పాన్ మసాలా, తంబాకు, గుట్కా, ఖైనీ తినడం, ఆల్కహాల్ తాగడం వంటివి కారణమవుతున్నాయి. పొగాకు 14 రకాల కేన్సర్లకు కారణమవుతోంది. దీని పొగలో కనీసం 80 రకాల కేన్సర్ కారకాలు(కార్సినోజెనిక్ ఏజెంట్లు) ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. రక్త ప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా విస్తరిస్తాయి. అందుకే ఊపిరితిత్తులు, నోటి కేన్సర్లు మాత్రమే కాకుండా ఇతర రకాలు కూడా వస్తాయి. మహిళలు బాధితులవడం ఆందోళన కలిగిస్తోంది.అందుబాటులో టీకా..కేన్సర్ దరిచేరకుండా వ్యాక్సిన్(టీకా) అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు హెచ్పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు.రొమ్ము కేన్సర్కు..ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ లక్ష మంది మహిళల్లో 35 మంది రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. జన్యులోపాలు, వంశపారంపర్యం, ఇన్ఫెక్షన్లు, రొమ్ములో గడ్డలు ఏర్పడడం, ఆధునిక జీవనశైలి, సంతానలేమి, 12 ఏళ్లలోపు రజస్వల అవడం, 55 ఏళ్ల కన్నా ముందుగానే రుతుక్రమం ఆగిపోవడం ఇందుకు కారణం. వ్యాధి నిర్ధారణ పద్ధతులున్నా అవగాహన లేక చివరిదశలో బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు.ఇలా గుర్తించండి..నోటి, రొమ్ము, సర్విక్ కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్లో రక్తం, తెల్లబట్ట, ఎర్రబట్ట, ఒక్కసారిగా బరువు తగ్గితే.. సర్విక్ కేన్సర్గా భావించి హెచ్పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడంతో ముందస్తుగా కేన్సర్ను గుర్తించే వీలుంటుంది. నోటి ఆల్సర్లు, దగ్గితే రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి కేన్సర్ పరీక్ష చేయించాలి.‘ఆరోగ్య మహిళ’ వరం ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్నివ్యాధులకు నిర్ధారణపరీక్షలతోపాటు ముఖ్యంగా కేన్సర్ స్క్రీనింగ్పై దృష్టి పెడుతున్నాం. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్, గర్భాశయ, ఇతర కేన్సర్లు ఉంటే మేం చేసే పరీక్షల్లో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స సులభమవడమే కాకుండా కేన్సర్ నిర్మూలన ఫలితం మెరుగ్గా ఉంటుంది.– డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు కేన్సర్ను తొలిదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. మగవారు ఎక్కువగా ఊపిరితిత్తుల కేన్సర్కు గురవుతున్నారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో, రెడ్మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. మద్యపానం నియంత్రించాలి. నిర్దేశిత బరువు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అర్ధగంటపాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. – డాక్టర్ రవీంద్రచారి, పల్మనాలజిస్టు(చదవండి: పారేయకండి.. పదును పెట్టండి..!) -
పారేయకండి.. పదును పెట్టండి..!
ఒకసారి వాడి పడేసే కార్టర్లను ఆహ్లాదకరమైన జంతువుల ఆకారాలుగా మార్చవచ్చు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంచడానికి దోహద పడుతుంది. ఇందుకోసం పిల్లలను వారికి ఇష్టమైన జంతువు లేదా పక్షుల గురించి అడిగి, వాటి ఆకారాలను కాగితంపై ఔట్లైన్ గీయడం ద్వారా ప్రారంభించవచ్చు. కావలసినవి: ఖాళీ కార్టన్లు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, గమ్, గూగ్లీ కళ్ళు, పైప్ క్లీనర్లు. ఆలోచనకు తగ్గట్టు కార్టర్ను వివిధ ఆకారాలుగా కత్తిరించుకుని వారికి ఇష్టమైన రంగులలో పెయింట్ చేయనివ్వండి. రంగులు కలిపి నమూనాలను రూపొందించడానికి వారికే అవకాశం ఇవ్వడం మంచిది. అలంకరణ: రంగు ఆరిన తర్వాత, గూగ్లీ కళ్ళపై జిగురు వేయండి. మార్కర్ల సాయం తో ముఖంలో ఇతర భాగాలను లేదా నమూనాలను గీయండి. పైప్ క్లీనర్లతో కాళ్ళు, యాంటెన్నా లేదా తోకలుగా చేసి చిన్న రంధ్రాలు చేసి దారంతో అటాచ్ చేయండి.టాయిలెట్ పేపర్ రోల్ బైనాక్యులర్లు.. ఖాళీ టాయిలెట్ పేపర్ రోల్స్ను బైనాక్యులర్లుగా మార్చుకోండి, కావలసినవి: రెండు ఖాళీ టాయిలెట్ పేపర్ రోల్స్, నూలు లేదా రిబ్బన్, యాక్రిలిక్ పెయింట్ బ్రష్లు, గమ్, స్టిక్కర్లు, డెకరేషన్లు.పెయింటింగ్: పిల్లలను టాయిలెట్ పేపర్ రోల్స్కు పెయింట్ వేయమని చెప్పి, వాటిని పూర్తిగా ఆరిన తర్వాత పక్కపక్కనే అతికించండి. గ్లూ గట్టి పడగానే మెడ పట్టీకోసం రెండువైపులా నూలు లేదా రిబ్బన్ముక్కను అటాచ్ చేయండి. వీటికి స్టిక్కర్లు, మార్కర్లు, ఇతర అలంకరణలతో డెకరేట్ చేయండి. అలా తయారైన∙బైనాక్యులర్లతో సరదాగా బయటి ప్రదేశాలను చూడమని చెప్పండి. బాటిల్ క్యాప్ అయస్కాంతాలు...పాత బాటిల్ మూతలను అయస్కాంతాలుగా మార్చండి. వీటితో మీ రెఫ్రిజిరేటర్ను అందంగా అలంకరించండి.కావలసినవి: మెటల్ బాటిల్ మూతలు, చిన్న గుండ్రని అయస్కాంతాలు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, పూసలు, బటన్లు, సీక్విన్ , గ్లూతయారీ: బాటిల్ మూత లోపల, వెలుపల బ్రైట్ కలర్స్ తో పెయింట్ చేయండి.ఆరిన తర్వాత క్యాప్ల లోపల చిన్న పూసలు, బటన్లు లేదా గవ్వలను అతికించండి. గ్లూ లేదా మంచి గమ్తో ప్రతి బాటిల్ మూత వెనుక భాగంలో ఒక చిన్న గుండ్రని అయస్కాంతాన్ని అటాచ్ చేయండి. ఇలా తయారైన వాటితో రిఫ్రిజిరేటర్పై కళాకృతులు, నోటీసులు లేదా ఫోటోలను ప్రదర్శించండి.ప్లాస్టిక్ బాటిల్ ప్లాంటర్లు...ప్లాస్టిక్ బాటిళ్లను అందమైన ప్లాంటర్లుగా తిరిగి ఉపయోగించవచ్చు, పిల్లలకు రీసైక్లింగ్, తోటపని నేర్పచ్చు.కావలసినవి: ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, కత్తెర, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, మట్టి, చిన్న మొక్కలు లేదా విత్తనాలు.తయారీ: ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కట్ చేసి, పైభాగాన్ని పారవేయండి. సీసాల దిగువ భాగాలను రంగులతో అలంకరించండి. ఇలా అలంకరించిన సీసాలను మట్టితో నింపి వాటిలో విత్తనాలు లేదా చిన్న మొక్కలను నాటండి. వీటిని ఎండ పడే ప్రదేశంలో ఉంచి, రోజూ నీరు పెట్టండి.వార్తాపత్రిక కోల్లేజ్ కళ...పాత వార్తాపత్రికలను కథను చెప్పే అద్భుతమైన కొల్లేజ్ కళాఖండాలుగా మార్చండి కావలసినవి: పాత వార్తాపత్రికలు, కత్తెరగ్లూ స్టిక్, కాగితం లేదా కాన్వాస్, మార్కర్లు తయారీ: వార్తాపత్రికల నుంచి ఆసక్తికరమైన చిత్రాలు, ముఖ్యాంశాలు, ఇతర న్యూస్ను కత్తిరించండి. కొల్లేజ్ సృష్టించడానికి కటౌట్ లను కాగితం లేదా కాన్వాస్పై అమర్చండి. విభిన్న లే ఔట్లు, థీమ్లతో ప్రయోగం చేయండి. తర్వాత, ఈ ముక్కలను అతికించండి. మార్కర్లు లేదా రంగు పెన్సిళ్లతో కొల్లేజ్కు నేపథ్యాలను జోడించండి. ఇలా తయారైన∙కోల్లెజ్ను కనిపించేలా వేలాడదీయండి.సీడీ సన్ క్యాచర్లు...పాత సీడీలకు మిరుమిట్లు గొలిపే సన్ క్యాచర్లుగా కొత్త జీవం పోయవచ్చు, కావలసినవి: పాత సీడీలు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్లు, క్రాఫ్ట్ జిగురు, స్ట్రింగ్ లేదా రిబ్బన్, పూసలు, ఇతర డెకరేషన్లు.తయారీ: రంగురంగుల డిజైన్లు, నమూనాలు లేదా అబ్స్ట్రాక్ట్ ఆర్ట్తో సీడీలు మెరిసే వైపు పెయింట్ చేయండి. అంచుల చుట్టూ లేదా మధ్యలో పూసలతో అలంకరించి వాటిని సీడీ మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా దారంతో అతికించండి. వీటిని ఎండ పడే కిటికీలో వేలాడదీస్తే అందమైన కాంతులు వెదజల్లుతాయి.న్యూస్ పేపర్లతో ఫోటో ఫ్రేమ్...కొన్ని పాత న్యూస్పేపర్లను తీసుకొని ప్రతి షీట్ను ముక్కలుగా చింపివేయండి. ఇప్పుడు, వార్తాపత్రికను ఒక మూల నుండి చుట్టడం ద్వారా సన్నని రోల్స్ తయారు చేయండి. రోల్ను భద్రపరచడానికి వార్తాపత్రిక అంచుని అతికించండి. ఇప్పుడు మీకు కావలసిన ఏ పరిమాణంలోనైనా కార్డ్బోర్డ్ ముక్కను తీసుకోండి. మీరు ఫ్రేమ్ చేయాలనుకుంటున్న ఛాయాచిత్రాన్ని ఫ్రేమ్ మధ్యలో ఉంచి, దాని రూపురేఖలను గీయండి. వార్తాపత్రిక రోల్స్ను అవుట్లైన్లపై అతికిస్తూ నాలుగు వైపులా కవర్ చేయండి. అదనపు వార్తాపత్రికను కత్తిరించండి. ఫ్రేమ్కు మీకు నచ్చిన ఏ రంగునైనా పెయింట్ చేసి ఫోటోగ్రాఫ్ను అతికిస్తే సరి.. మీ ఫోటో ఫ్రేమ్ రెడీ!పిల్లల చేత ఇలాంటి వాటిని తయారు చేయిస్తే వారికి మంచి కాలక్షేపం అవుతుంది.వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిల్స్, న్యూస్ పేపర్లు, పనికిరాని ఇతర గృహోపకరణాలను బుర్రకు కాస్త పడును పెడితే చాలు... కళాఖండాలుగా తయారు చేయచ్చు. ఈ వేసవి సెలవల్లో పిల్లలకు దీనిపై కాస్తంత ఐడియా ఇస్తే చాలు... ఆనక వాళ్లే అల్లుకుపోతారు. వీటితో సృజనాత్మకత పెరగడమే కాదు.. కుదురు వస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్య తెలుస్తుంది. వనరుల పరిరక్షణ, రీసైక్లింగ్ ప్రాముఖ్యత తెలిసొస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. (చదవండి: జర్నలిస్టులకు.. సండేస్ ఆన్ సైకిల్) -
జర్నలిస్టులకు.. సండేస్ ఆన్ సైకిల్
సండేస్ ఆన్ సైకిల్ మిషన్లో తెలంగాణలోని జర్నలిస్టులు పాల్గొనాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత చతుర్వేది కోరారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య స్పృహ కలిగిన రవాణా విధానాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్ చేపట్టనుందన్నారు. దీని ద్వారా సాధారణ శారీరక శ్రమ, ఫిట్నెస్ ప్రోత్సహించడం ద్వారా పౌరులను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రేరేపించడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు అనుగుణంగా తమ శాఖ ఈ నెల 27న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘సండేస్ ఆన్ సైకిల్’ ప్రత్యేక ఎడిషన్ను నిర్వహించ తలపెట్టామని, ఈ కార్యక్రమం గచ్చిబౌలిలో జరుగుతుందన్నారు. ఈ డ్రైవ్ను గతేడాది డిసెంబర్ 17న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ జర్నలిస్టులందరూ తమ పేర్లను నమోదు చేసుకుని పాల్గొనాలని ఆ శాఖ కార్యదర్శి సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. (చదవండి: వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తుందంటే..) -
వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఎందుకు మంచిదంటే..?
వేసవికాలంలో మజ్జిగ మహాపానీయం ఆరోగ్యానికి మంచిది. ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాంటి పానీయానికి సంస్కృతంలో తక్రం, మధితం, ఉదశ్విత్తు అని మూడు పేర్లు ఉన్నాయి. తక్రం : నాలుగో వంతు నీరుపోసి తయారు చేసేది తక్రం. మధితం : అసలు నీరు పోయకుండా చిలికినది. ఇది రుచిగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. ఉదశ్విత్తు : సగం నీళ్లు పోసి తయారు చేసేది. ఈ మూడింటిలో తక్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేడి నుంచి ఉపశమనాన్నిస్తుంది.. గతంలో అయితే ఇంటికి వచ్చిన అతిథులకు.. ఎండలో వచ్చిన వారికి, వెళ్లే వారికి మజ్జిగను ఇచ్చేవారు. బాగా చిలికిన మజ్జిగలో ఒక నిమ్మకాయరసం, తగినంత ఉప్పు, చిటికెడు పంచదార కలిపి ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లే వారు గాజుసీసాలో మజ్జిగ తీసుకెళ్తే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. – ఉన్నవ పూర్ణచందర్రావు, మూసారంబాగ్ వేసవిలో కూర్చిక పానీయం.. ఒక గ్లాసు పాలు తీసుకుని కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపాలి. ఈ పానీయాన్ని కూర్చిక అంటారు. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాములు చొప్పున దేనికదే మెత్తగా దంచి కలుపుకోవాలి. ముందుగా ఈ మూడింటినీ కలిపి తగినంత ఉప్పు చేర్చి దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కూర్చికను తాగినప్పుడల్లా అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే.. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది. దప్పికని పోగొడుతుంది.మజ్జిగ తాగేవారికి ఏ వ్యాధులూ దరిచేరవని, వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని, విషదోషాలు, దుర్భలత్వం, చర్మరోగాలు, ధీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమితవేడి తగ్గిపోతుందని, శరీరానికి మంచి వర్చస్సు కలుతుందని యోగరత్నాకరంలో పేర్కొన్నారు. ప్రయోజనాలు..వేసవిలో మజ్జిగ ఎక్కువగా తీసుకోడం వల్ల శరీరంలో లవణాలను తగ్గకుండా చేస్తుంది.తోడుపెట్టినందు వల్ల పాలల్లో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉంటాయి. దీంతోపాటు మంచి బ్యాక్టీరియా మనకు దొరుకుతుంది. ఫ్రిజ్లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా దెబ్బతింటుంది. అందుకే అతి చల్లని మజ్జిగ తాగకూడదు. మజ్జిగను చిలకడం వల్ల తేలికగా అరిగే గుణం ఏర్పడుతుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ మంచింది. (చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్గా, ఇండస్ట్రియలిస్ట్గా..) -
నోరూరించే మామిడి పండ్లతో బిర్యానీ, బొబ్బట్టు చేసేద్దాం ఇలా..!
వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలైనట్లే. నోరూరించే పుల్లటి, తియ్యటి మామిడి రుచులను కాస్త ప్రత్యేకమైన వంటల్లో ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దామా?మామిడి బిర్యానీకావలసినవి: బాస్మతి బియ్యం – ఒక కప్పు; పచ్చి మామిడికాయ – 1 (ముక్కలుగా తరిగినది); పచ్చిమిర్చి – 3 (చిన్నగా తరిగినది); నువ్వులు – ఒక టీ స్పూన్; వేరుశెనగలు – 4 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – అర కప్పు; బెల్లం తురుము – ఒక టీ స్పూన్; నూనె – సరిపడా; ఆవాలు, శనగపప్పు, మినపప్పు – ఒక టీస్పూన్ చొప్పున; కరివేపాకు, ఇంగువ, పసుపు – కొద్దికొద్దిగా; ఉప్పు – తగినంత; నీరు – 2.5 కప్పులు)తయారీ: ముందుగా బియ్యం కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత కుకర్లో బియ్యం, నీళ్లు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు ఒక మిక్సీ బౌల్లో తరిగిన మామిడికాయ ముక్కలు, నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగలు, కొబ్బరి తురుము, అభిరుచిని బట్టి బెల్లం తురుము వేసుకుని, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని, అందులో మిగిలిన వేరుశెనగలు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, గరిటెతో తిప్పుతూ ఉండాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో మామిడి–కొబ్బరి పేస్ట్ వేసుకుని సుమారు 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఉడికించిన అన్నం వేసి గరిటెతో బాగా కలిపి, మూతపెట్టి, చిన్న మంట మీద మగ్గనివ్వాలి. రైస్ ఉడికిపోతే మామిడికాయ బిర్యానీ సిద్ధమైనట్లే. నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని, వేయించిన పాపడ్లు, చిప్స్, పెరుగు ఇలా వేటితోనైనా సర్వ్ చేసుకోవచ్చు.మామిడి బొబ్బట్లుకావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మామిడిపండు గుజ్జు – ఒక కప్పు (బాగా పండి, తియ్యగా ఉన్నది); కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం తురుము – పావు కప్పు (మామిడి తీపిని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు); యాలకుల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – సరిపడా; నీరు – కొన్ని;తయారీఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని ఉండలు లేకుండా కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలిపి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో 2 టేబుల్స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని కొబ్బరి తురుము వేయించి, బెల్లం తురుము వేసి కలపాలి. బెల్లం కరిగిన వెంటనే మామిడిపండు గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఇది దగ్గరగా హల్వాలా కాగానే, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరోవైపు గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పూరీల్లా ఒత్తుకుని, మధ్యలో మామిడి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఉంచి చేత్తో బొబ్బట్లలా చేసుకోవాలి. వాటిని నేతిలో వేయించుకుంటే సరిపోతుంది. (చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్గా, ఇండస్ట్రియలిస్ట్గా..) -
స్లిమ్గా నటి మాధురి దీక్షిత్ భర్త..! మొదట తండ్రిపై ఆ తర్వాత..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90లలో ఎన్నోబ్లాక్బస్టర్ హిట్ మూవీలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి. ఇక ఆమె డాక్టర్ శ్రీరామ్ని పెళ్లాడి..సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవలే అడపదడపా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తళుక్కుమంటున్నారు. ఆమె ఈ వయసులో కూడా అంతే స్లిమ్గా అందంగా ఉంటారామె. అందులోనూ ఆమె భర్తే ఆరోగ్య నిపుణుడు కాబట్టి..ఫిట్నెస్పై మంచి శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. అంతేగాదు ఈ ముద్దుగుమ్మ భర్త శ్రీరామ్ బరువు ఏవిధంగా తగ్గించుకోవచ్చో తనపైనే ప్రయోగాలను చేసుకుని మరీ వివరిస్తున్నారు. ఆయన చిన్న చిన్న మార్పులతో బరువు తోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్ని కూడా తగ్గించుకున్నట్లు తెలిపారు. అదెలాగో చూద్దామా..!.ఇంక్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డియాక్ థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అయిన శ్రీరామ్ నేనే ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషించేది జీవనశైలేనని నొక్కి చెప్పారు. చక్కటి ఆరోగ్యం కోసం జీవశైలిలో మంచి మార్పులు అనే పెట్టుబడి పెట్టాలన్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదన్నారు. వివిధ సంక్రమిత వ్యాధులకు ప్రధాన కారణం మానవులు అనుసరించే లైఫ్స్టైలేనని అన్నారు. ఆయన తన పేషెంట్లకు వచ్చే వ్యాధులను చక్కటి జీవశైలితో బయటపడేలా చేశాడు. ఆయన తండ్రి 55 ఏళ్ల వయసులో డయాబెటిస్తో బాధపడుతున్నప్పుడూ.. అతని జీవనశైలి మార్చి..మందులపై ఆధారపడకుండా నిర్వహించగలిగేలా చేశానని అన్నారు. ప్రస్తుతం ఆయనకు 86 సంవత్సరాలని అన్నారు. తన తండ్రిలో వచ్చిన మంచి పరివర్తన చూశాక.. ఓ డాక్టర్గా తాను కూడా మంచి జీవనశైలిని పాటించాలని గ్రహించానన్నారు శ్రీరామ్. అప్పుడే మంచిగా ప్రజలకు సేవల చేయగలనని విశ్వసించి..మార్పుకు శ్రీకారం చుట్టారట. ఎప్పుడైతే శ్రీరామ్ జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావడం ప్రారంభించారో..త్వరితగతిన సత్ఫలితాలను అందుకున్నారు. దాదాపు 18 కిలోల బరువు తగ్గారు, అలాగే 16శాతం శరీర కొవ్వు కూడా తగ్గిందని చెప్పారు. దీన్ని అలాగే కొనసాగించి..తదుపరి పుట్టిన రోజుకల్లా..12 నుంచి 15 శాతం కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలనేది తన లక్ష్యమని అన్నారు. ఇంతలా ఎందుకంటే..తాను ఓ మ్యాగ్జైన్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంటే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చాని ప్రయోగపూర్వకంగా చెప్పడమే ఎందరికో స్ఫూర్తిని కలిగించారు డాక్టర్ శ్రీరామ్.(చదవండి: ChatGPT: చాట్జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..) -
వేసవిలో మలేరియాతో జరభద్రం..!
వేసవి వచ్చేసింది. వాతావరణ మార్పుల ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది వారాలు గడిస్తే నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేసి, వానలు జోరందుకుంటాయి. ఇటువంటి వాతావరణం దోమల పెరుగుదలకు, వ్యాధులకు అనుకూలం. ముఖ్యంగా చిన్న దోమ కాటు వేస్తే ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మలేరియా మహమ్మారి బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలి. వ్యాప్తి ఇలా...తేమ శాతం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఆడ ఎనాఫిలిస్ దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ దోమ కుడితే మలేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల తరువాత మలేరియా జ్వర లక్షణాలు బయట పడతాయి. మలేరియా సోకిన వారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఒకవేళ రోగి కోలుకున్నా ఆ పరాన్నజీవి మాత్రం శరీరంలో ఏడాది పాటు నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారు సమతుల ఆహారం తీసుకుంటే త్వరితగతిన కోలుకుంటారు. గత ఏడాది 12 అనుమానిత కేసులు మలేరియా నియంత్రణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 12 మలేరియా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ అధికారులు తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేటల్లో డివిజన్ మలేరియా యూనిట్లున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అదనంగా మరో మూడు సబ్ మలేరియా యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, మలేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అమలాపురం డివిజన్ యూనిట్కు అమలాపురం టౌన్, అమలాపురం రూరల్, కొత్తపేట డివిజన్కు రావులపాలెంలో సబ్ మలేరియా యూనిట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలివీ.. మలేరియాను రక్త పరీక్ష (ఆర్డీ) ద్వారా నిర్ధారిస్తారు. ఈ వ్యాధి సోకిన వారు చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడతారు. వ్యాధి నిరోధక శక్తి లేని వారికి విపరీతమైన తలనొప్పి వచ్చి, ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంటుంది. వ్యాధి నిర్ధారణ కాక ముందే బాధితులు తక్కువగా మూత్రం విసర్జించడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే మూత్రపిండ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఏకధాటిగా 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. మలేరియాలో ప్లాస్మోడియం ఫాల్సీఫారం రకమైతే మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స పొందాలి. ఈ చికిత్స అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రోగులు సత్వరమే కోలుకునేందుకు పండ్ల రసాలు, గ్లూకోజ్, చెరకు రసం వంటి ద్రవ పదార్థాలు విరివిగా తీసుకోవాలి. నివారణ చర్యలతో మేలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇంట్లో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందు పిచికారీ చేయాలి. ఇంటి గోడలపై సింథటిక్ ఫైరిత్రాయిడ్, ఏసీఎం క్రిమి సంహారక మందును అవసరమైన మేరకు పిచికారీ చేయాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి మలేరియా బారిన పడిన వారు వ్యాధి తీవ్రత తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలి. నివారణ ఎంతో ముఖ్యమో కోలుకోవడానికి కూడా ఆహారపు అలవాట్లు కూడా అంతే ముఖ్యం. జిల్లాలో మలేరియా కేసులను సున్నా శాతానికి తగ్గించేలా కృషి చేస్తున్నాం. – ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా యూనిట్ ప్రత్యేక అధికారి, అమలాపురంనేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ఇంగ్లండ్కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత సర్ రోనాల్డ్ రోస్ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు (1881–1899) చేసిన పరిశోధనల వల్ల మలేరియా వ్యాధి సోకే తీరును గుర్తించారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల కుట్టడం వల్లే ఈ వ్యాధి సంభవిస్తుందని నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) 2008 ఏప్రిల్ 25 నుంచి ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తోంది. (చదవండి: ChatGPT: చాట్జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..) -
చాట్జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..!
చాట్జీపీటీ వంటి సాంకేతికతో ఆరోగ్య సలహాలు తీసుకోవద్దుని నొక్కి చెబుతుంటారు నిపుణులు. అవి నేరుగా వైద్యుడిని సంప్రదించినట్లుగా ఉండదు, పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాధులను నిర్థారించలేదనే హెచ్చరిస్తుంటారు. అయితే ఆ మాటలన్నింటిని కొట్టిపారేసేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులే గుర్తించలేని ఆరోగ్య సమస్యను గుర్తించి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. అసలు ఆ ఏఐ చాట్జీపీటీ లేకపోతే నా ప్రాణాలే ఉండేవి కాదని కన్నీటిపర్యంతమైంది ఆమె. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..అమెరికాలోని నార్త్కరోలినా ప్రాంతానికి చెందిన మహిళ ఎన్నేళ్లుగానో తెలియని అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం కారణంగా ఆమె బాడీలో ఎన్నో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. దీంతో వైద్యులను సంప్రదించినా లాభం లేకుండాపోయింది. వాళ్లంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్థారించారు.పైగా యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా ఆమెకెందుకో తాను అంతకుమించిన పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్న ఫీల్ ఉండేది. దీంతో సరదాగా ఏఐ చాట్జీపీటీలో తాను ఫేస్ చేస్తున్న అనారోగ్య సమస్యలను వివరించింది. చివరగా వైద్యులు ఏమని నిర్థారించారో చాట్జీపీటో సంభాషిస్తుండగానే..ఆమె హషిమోటో వ్యాధితో బాధపడి ఉండొచ్చని చెప్పింది చాట్జీపీటీ. దీంతో ఆమె వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఆ దిశగా వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమె ప్రాణాంతక కేన్సర్ అయినా..హషిమోటో వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. స్క్రీనింగ్ పరీక్షల్లో వైద్యులు ఆమె మెడలో రెండు చిన్న గడ్డలను గుర్తించారు. ఆ తర్వాత వాటిని కేన్సర్ కణితులుగా నిర్థారించారు. ప్రస్తుతం ఆమె తగిన చికిత్సను పొంది ఆ సమస్య నుంచి బయటపడింది. తాను గనుక చాట్జీపీటీనీ సంప్రదించి ఉంకడపోతే..ఇంకా ఆర్థరైటిస్ మందులు వాడుతూ..కేన్సర్ సమస్యను ముదరబెట్టుకునేదాన్ని అని వాపోయింది. ఇలా మరో ప్రయత్నం చేయకుంటే తన ప్రాణాలే పోయేవి అంటూ తన అనుభవాన్ని వివరించారామె. ఏంటీ వ్యాధి అంటే..హషిమోటో వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇది హైపోథైరాయిడిజం (thyroid గ్రంధి తక్కువ పనితీరు)కు కారణమవుతుంది. దీని వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని విదేశీ కారకంగా భావించి, దానిపై దాడి చేస్తుంది. ఈ దాడి థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీసి, దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చితకిత్స మాత్రం.. మందులతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిందే.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Starch-Free Rice Cooker: డయాబెటిస్, ఊబకాయాన్ని దరిచేరనీయదు..) -
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
వేసవి సెలవులొస్తున్నాయంటే విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంటుంది. ఆటలు ఆడుకోవచ్చని, అమ్మానాన్నలు, స్నేహితులతో సరదాగా గడపొచ్చని, బంధువుల ఇళ్లకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అమ్మా నాన్నలు.. ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వేరు. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) చదువుకుంటూ, హాస్టళ్లలో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నాయంటే దిగులు మొదలవుతుంది. బుధవారం సాయంత్రం వీరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. గురువారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో ఇలాంటి బాలలంతా బాలసదన్లకు చేరుకున్నారు.నల్లగొండ బాలసదన్కు ఇద్దరు బాలికలు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కేజీబీవీలో గోగుల మనీష 9వ తరగతి, ఆంబోతు లక్ష్మి8వ తరగతి చదువుతున్నారు. వారికి తల్లిదండ్రులు లేరు. వారిని తీసుకుపోయేందుకు ఇతరులెవరూ లేకపోవడంతో ఎప్పటిలాగే నల్లగొండలోని బాలసదన్ నిర్వాహకులు వారిని తీసుకెళ్లేందుకు వచ్చారు. బాలసదన్ ఎస్వో రాజేశ్వరికి పాఠశాల సిబ్బంది విద్యార్థినులను అప్పగించారు. తమకు అమ్మానాన్నలు లేకపోవడంతో తాము తమ ఇంటికి వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తల్లిదండ్రులు లేరు..సంరక్షకులు లేరు: పూజనేను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయా. తెలిసినవారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసదన్లో చేర్పించారు. అక్కడే పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేశా. తర్వాత ఆర్మూర్మండలంలోని పెర్కిట్ కేజీబీవీలో గతసంవత్సరం ఏడో తరగతిలో చేరాను. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు వచ్చాయి. నాకు తల్లిదండ్రులతో పాటు, సంరక్షకులు కూడా ఎవరూ లేక పోవడంతో తిరిగి బాలసదన్కే వెళ్తున్నా. అక్కా, తమ్ముడు, చెల్లి.. తలోచోట...నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. ఆ మహిళ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండగా కొద్దిరోజుల క్రితం వీరిద్దరు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పెద్దకూతురు స్థానిక కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మరో కుమార్తె కుబీర్ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు వివేకానంద ఆవాసంలో 3వ తరగతి చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులు వచ్చినా ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఈ ముగ్గురు పిల్లలది. ఓ బాలిక నిర్మల్ బాలసదన్కు వెళ్లగా, మరో బాలిక కేజీబీవీ సమ్మర్ క్యాంపు ఉండటంతో అక్కడే ఉండిపోయింది. బాలుడు తాను చదువుతున్న వివేకానంద ఆవాసంలోనే ఉంటున్నాడు. ఇలా వీరు ముగ్గురూ సెలవుల్లోనూ వేర్వేరు చోట్లే ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్నలు లేక బంధువులు ఆదరించక..అమ్మా నాన్నలు చిన్నతనంలోనే వివిధ కారణాలతో చనిపోవడంతో, బంధు వులు బాలసదన్లో చేర్పించడంతో వారి వయసుకు అనుగుణంగా బాలిక లనైతే కేజీబీవీల్లో, బాలురను సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం చదివిస్తోంది. సెలవుల్లో వీరంతా తాము ఎక్కడ ఏ బాలసదన్లో ఉంటున్నారో అక్కడికే వెళ్లిపోవాల్సి ఉంటుంది. మళ్లీ స్కూళ్లు తెరిచాకే వారు హాస్టళ్లకు తిరిగి వచ్చేందుకు వీలవుతుంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో అలాంటి విద్యార్థులంతా తమ తమ బాలసదన్లకు చేరుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిఆవేదనలో అనాథ విద్యార్థులుహాస్టళ్లలో ఉన్న ఇతర పిల్లలను వారి అమ్మానాన్నలు వచ్చి తీసుకెళుతుంటే దీనంగా చూడటం ఈ అనాథ పిల్లల వంతయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని గురుకులాలు, కేజీబీవీల్లో ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. తమ కోసం ఎవరూ లేరనే ఆవేదన కొంచెం ఎదిగిన పిల్లల్లో స్పష్టంగా కన్పించింది. అప్పటివరకు స్కూల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో తోటి విద్యార్థులతో సరదాగా గడిపిన వీరంతా బిక్క మొహాలు వేయడం ఇతర పిల్లల తలిదండ్రులను కదిలించింది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి వారిని ఆవేదనకు గురి చేసింది. తమ పిల్లలు వారికి ఉత్సాహంగా బై బై చెబుతుంటే వారి గుండెలు బరువెక్కాయి. ఈ సందర్భంగా కొందరు అనాథ పిల్లలు కంట తడి పెట్టడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్కడి సిబ్బంది, బాలసదన్ల నిర్వాహకులు కూడా కంట తడి పెట్టారు. నిర్మల్ జిల్లాలో బైంసా మండల కేంద్రంలో వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న ముగ్గురు పిల్లలకు సెలవులు వచ్చినా.. అమ్మా నాన్నలు లేక, తీసుకెళ్లేవారు లేక సెలవుల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండి కలుసుకోలేని పరిస్థితి కదిలించింది. అయితే తల్లిదండ్రులు లేని కొందరు విద్యార్థులను వారి సంరక్షకులుగా ఉన్న బంధువులు తీసుకెళ్లడం కన్పించింది.చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా? -సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
మధుమేహ బాధితులూ ఇకపై మీరంతా అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని నిశ్చింతగా తినేయొచ్చు. ఊబకాయులు సైతం కార్బొహైడ్రేట్స్ను ఎంత కావాలంటే అంత లాగించేయొచ్చు. అవును.. మీరు వింటున్నది నిజమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ను అదుపులో ఉంచే స్మార్ట్ కుక్కర్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కుక్కర్గా పేటెంట్ సైతం దీనికి లభించింది.గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మనం తీసుకునే ఆహారంలో 55% కంటే తక్కువగా ఉంటే రక్తంలో సుగర్ అత్యంత నిదానంగా పెరుగుతాయి. జీఐ 56–70% మధ్య ఉంటే నెమ్మదిగా.. 70% పైబడి ఉంటే వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర పాళ్లు పరిమితికి మించి పెరిగితే క్లోమ గ్రంధి (పాంక్రియాస్)పనితీరు మందగించి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా..ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దల్లోనేకాదు.. పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ను నియంత్రించాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డి.సందీప్రాజా నేతృత్వంలో డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, వి.వాసుదేవరావు, ఎల్.ఏడుకొండలుతో కూడిన శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధన ఎట్టకేలకు ఫలించింది. ఎలాంటి వరి రకమైనా సరే ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాటిలోని జీఐ స్థాయిలను తగ్గించి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ ఆహార రంగంలో విప్లవమే.ఇదెలా పనిచేస్తుందంటే..ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా జీఐను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ను అభివృద్ధి చేశారు. ఇందులో బియ్యాన్ని స్టీమింగ్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు. గంజిని సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వేరు చేస్తారు. తర్వాత అన్నం వేగంగా చల్లబడే (ర్యాపిడ్ కూలింగ్) చాంబర్లోకి పంపి 1–2 డిగ్రీల సెల్సియస్లో ప్రాసెస్ చేస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే.. బియ్యాన్ని రీట్రో గ్రేడ్ చేయడం (అన్నేలింగ్, హీట్ మాయిశ్చర్ ట్రీట్మెంట్ (హెచ్ఎంటీ) ద్వారా అన్నంలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం)లో 20 నిమిషాల్లో జీర్ణమయ్యే పదార్థం (ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్–ఆర్డీఎస్)ను 90 నిముషాల్లో నెమ్మదిగా జీర్ణయ్యే పదార్థం (స్లో డైజెస్టబుల్ స్టార్చ్–ఎస్డీఎస్)గా మారుస్తుంది. దీంతో పాటు అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది అసలు జీర్ణ మవకుండా డైటరీ ఫైబర్లా ప్రవర్తించేలా ఒక రకమైన పిండి పదార్థం. బియ్యాన్ని వండే సమయంలో అదనపు పానీడు తీసేయడంతో కొంత స్టార్చ్ తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కుక్కర్లో వండితే 45% ఆర్డీ ఎస్ను ఎస్డీఎస్గా మార్చి ఆర్ఎస్ను 121% శాతానికి పెంచుతుంది. ఫలితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గిపోతుంది. ఇలా వండిన అన్నం సాధారణ అన్నంలాగే ఉంటుంది. సాధారణంగా వండే అన్నా నికి ఉన్నట్టుగానే రంగు, రుచి, వాసనలు పాడవకుండా ఉంటుంది.ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్ఇది పూర్తిగా స్మార్ట్ కంట్రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇంటిగ్రేషన్తో పనిచేస్తుంది. ఐవోటీ కంట్రోల్ రిమోట్ (మొబైల్ యాప్) ద్వారా ఎంతదూరం నుంచైనా దీనిని నియంత్రించవచ్చు. కేవలం ఒక కమాండ్ ఇస్తే చాలు ఇంట్లో అన్నం నిర్ణయించిన సమాయనికి రెడీ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. రైస్ వేరియంట్, బియ్యం–నీరు నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, స్టీమింగ్ సమయం వంటి వాటిని మొబైల్ ద్వారానే సెట్ చేసేలా ఏర్పాటు చేశారు. మనం పెట్టే బియ్యం రకం ఆధారంగా దానికి అవసరమైన నీటి నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, ఉడికే సమయం, చల్లబడే ఉష్ణోగ్రత, చల్లబడే కాలం, స్టీమింగ్కు అవసరమైన సమయం, వంటి అంశాలను కూడా ప్రత్యేక ఆల్గారిథం ద్వారా స్వయం చాలకంగా నియంత్రిచబడతాయి. 2022లో ప్రారంభమైన ఈ పరిశోధనకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ పరిశోధన పూర్తిగా బాపట్లలోనే జరిగింది. ఫ్యాబ్రికేషన్ కోసం కోయంబత్తురులోని ఓ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఈ వినూత్నమైన రైస్ కుక్కర్కు గత నెలలోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు(405194–001) లభించింది.డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగంస్మార్ట్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల రక్తంలోని సుగర్ స్థాయిలను పూర్తిగా నియంత్రించవచ్చు. నిధానంగా జీర్ణమవడం వల్ల మళ్లీ ఆకలి వేయడానికి సమయం పడుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం ఒక కంపెనీతో ఎంవోయూ చేసుకోబోతున్నాం. గతంలో నేను అభివృద్ధి చేసిన ఆప్లాటాక్సిన్ను కనుగొనే ఒక రాపిడ్ కిట్తో పాటు అతి తక్కువ ధరలోనే గైసెమిక్ ఇండెక్స్ను తగ్గించేలా తయారు చేసిన కిట్కు పేటెంట్ హక్కులు లభించాయి. వరుసగా మూడో ఆవిష్కరణకు పేటెంట్ హక్కు రావడం ఆనందంగా ఉంది.– డాక్టర్ దోనేపూడి సందీప్ రాజా, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల(చదవండి: ఇంటిని కూల్గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?) -
ఇంటిని కూల్గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?
వేసవిలో ఇల్లు చల్లగా ఉండడానికి ఆవు పేడ ఉపయోగపడుతుందా? కాస్త వెనక్కి వెళితే....‘అవును’ అనే జవాబు వినిపిస్తుంది. ఒకప్పుడు పల్లెల్లో ఇంట్లో నేల, వాకిళ్లను పేడతో అలికేవారు. గోడలకు పూసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్లో ఆవు పేడతో అలకడం అనేది ఎకో–ఫ్రెండ్లీ అల్టర్నేటివ్. ఆవుపేడ పూసిన గృహాలు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. ఇది మన దేశ వైవిధ్య వాతావరణానికి సరిపోయే పద్ధతి. ఈత సంప్రదాయ పద్ధతి మళ్లీ పునర్దర్శనం ఇస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీలో లక్ష్మీబాయి కాలేజి క్లాస్రూమ్ గోడకు ప్రిన్సిపాల్ డా.ప్రత్యూష వత్సల ఆవుపేడను పూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాజీ ప్రొఫెసర్, పర్యావరణ ప్రేమికులు డా.శివసుదర్శన్ మాలిక్ ఇళ్లను చల్లబర్చడానికి ఆవు పేడను ఉపయోగించే పురాతన భారతీయ విధానాన్ని పునరుద్ధరిస్తున్నారు.ఆవుపేడ, బంకమట్టి, వేప ఆకులు, జిప్సం... ఇలాంటి వాటితో ‘వేద ప్లాస్టర్’ను సృష్టించారు మాలిక్. సిమెంట్ ఆధారిత ప్లాస్టర్ మాదిరిగా ఇది వేడిని గ్రహించదు.ఇళ్లలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. స్థానికంగా లభించే పదార్థాలు, ఆవుపేడతో ‘గోక్రెట్ బ్రిక్స్’ తయారు చేశారు మాలిక్. ‘ఈ ఇటుకలు వేడి ప్రవేశాన్ని 70 శాతం తగ్గించడానికి రూపొందించాం’ అంటున్నారు మాలిక్. పురాతన జ్ఞానం, సివిల్ ఇంజనీరింగ్ను మిళితం చేసి వాతావరణ మార్పులకు పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు డా.శివసుదర్శన్ మాలిక్. -
జిడ్డుగా ఉంటే.. మేలైన ప్యాక్స్
వేసవిలో చర్మం తరచూ జిడ్డు అవుతుంటుంది. ఎండ వేడికి చర్మం మండుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య తగ్గడంతో పాటు చర్మానికి తాజాదనం రావాలంటే సహజ సిద్ధమైన ఉత్పాదనలు మేలు చేస్తాయి. అలోవెరా జ్యూస్కు, కొద్దిగా రోజ్వాటర్ కలిపి శరీరానికి తరచూ మసాజ్ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మం సహజకాంతికి వస్తుంది. చర్మం మండడం సమస్య కూడా తగ్గుతుంది. దురద, దద్దుర్లు.. ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. జిడ్డుచర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. పాలు, తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి చర్మం కమిలి, నల్లబడిన చోట రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చిటికెడు గంధం పొడి, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్వాటర్ కలిపి, ముఖానికి ΄్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. టీ స్పూన్ నారింజ రసం, ఓట్స్, తేనె, గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వలయకారంగా మృదువుగా స్క్రబ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి.బియ్యప్పిండిలో చిటికెడు పసుపు, తేనె, దోస రసం కలిపి పేస్ట్లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ΄్యాక్. ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ఐస్ప్యాక్ లేదా ఐస్ క్యూబ్తో ముఖానికి మృదువుగా రబ్ చేయాలి. ఎండవేడికి కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. -
ఆర్గానిక్ ఐస్క్రీమ్ ట్రెండ్స్..! జస్ట్ ఒక రూపాయికే..
ఐస్క్రీమ్.. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఆహారం. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే అర్ధరాత్రి వరకూ ఐ్రస్కీమ్ పార్లర్ చుట్టూ చెక్కర్లు కొడతారు హైదరాబాద్ నగర వాసులు. దీనికితోడు భాగ్యనగరం వేదికగా విభిన్న స్టోర్స్లో వినూత్న ఫ్లేవర్లలో ఐస్క్రీమ్స్ అందుబాటులో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర వేదికగా వినూత్నంగా ఒక రూపాయికే ఒక గ్రాము ఐ్రస్కీమ్ అంటూ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ సందడి చేస్తోంది. ఇవి పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తులు కావడం మరో విశేషం. గోంధ్ గమ్, గ్వార్ గమ్ వెరైటీలు.. దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్ క్రీమరీ అయిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ హైదరాబాద్లో తన సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బేగంపేటలో నూతన ఔట్లెట్ను ప్రారంభించింది. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో ఐస్క్రీమ్ను అందించే ఈ బ్రాండ్ ఏ2 దేశీ ఆవుపాలు, ఆర్గానిక్ యెల్లో బటర్తో పాటు సహజ సిద్ధమైన తీపి పదార్థాలైన ధాగా మిశ్రీ, కోకోనట్ షుగర్, బెల్లం వంటి వాటితో రుచికరమైన మనసుదోచే ట్రీట్ అందిస్తోంది. వినూత్నంగా గోంధ్ గమ్, గ్వార్ గమ్తో పేటెంట్ పొందిన ప్రిజర్వేటివ్–రహిత ఫార్ములాతో ఐస్ బర్గ్ సరికొత్త పదార్థాలను నగర వాసులకు పరిచయం చేసింది. ప్రీమియం నట్స్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్, ఆర్గానిక్ సిరప్లతో 40కి పైగా ఆర్గానిక్ టాపింగ్స్తో కస్టమర్లకు మధురానుభూతిని అందిస్తోంది. ఔట్ లెట్లో డెత్ బై చాక్లెట్ సండేస్, ఆర్టిసానల్ ఐస్క్రీం కేక్స్ వంటి సిగ్నేచర్ ఆఫర్లు మాదాపూర్, బేగంపేట, కేపీహెచ్బీలో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. వంద మందికి పైగా సేంద్రీయ రైతులతో ఐస్బర్గ్ భాగస్వామి అయ్యింది. బేగంపేటలో గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవంలో సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్తో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. (చదవండి: అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్..) -
అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్..
గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్లు తమ వాహనాల నెంబర్ల కోసం ఎంతటి ఖర్చుకైనా సై అంటున్నారు. ఇటీవలె ఓ ప్రముఖ టాలీవుడ్ నటుడు తన వాహనం కోసం ఓ ఫ్యాన్సీ నెంబర్ను వేలంలో కొనుగోలు చేశారు. ఆయన ఈ నెంబర్ కోసం ఏకంగా రూ.7లక్షలకు పైగా వెచ్చించడం విశేషం. ఆయనొక్కరే కాదు టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. అయితే స్టార్ల ఆరాటం వెనుక అనేక రకాల సెంటిమెంట్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల నగరానికి చెందిన కార్పొరేట్ కంపెనీలు సైతం నెంబర్ల వేటలో స్టార్లతో పోటీపడుతుండడం కనిపిస్తోంది. మహేష్ నుంచి మాస్ మహారాజ్ దాకా.. సూపర్ స్టార్ మహేష్బాబు సైతం నెంబర్ల వేటకు నేను సైతం అంటున్నారట. ఆయన తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడీజ్ జీఎల్ఎస్ల కోసం టీఎస్ 09 ఇకె 600, టీఎస్ 09 జీఒ 600 లను కొనుగోలు చేశారట. నాగార్జున బీఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఏపీ 09 బీడబ్ల్యూ 9000ను వేలంలో దక్కించుకున్నారని సమాచారం. నెంబర్ను ఆయన పవర్ఫుల్ నెంబర్గా పరిగణిస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నెంబర్లపై ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. ఆయన తన రేంజ్రోవర్, వోల్వో ఎక్స్సీ 90 నెంబర్ టీఎస్07 జీఇ 9999 రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారని సమాచారం. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బీవైడీ అట్టో 3 నెంబరు టీఎస్ 09 జీబీ 2628 కోసం రూ.17,628 వెచి్చంచారని సమాచారం. కార్పొరేట్ కంపెనీలు సైతం.. హీరో బాలకృష్ణ తర్వాత ‘0009’నెంబర్ను నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కొనుగోలు చేయడం విశేషం. కంపెనీలు సైతం తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు పోటీ పడుతున్నాయనడానికి ఇదో నిదర్శనం. వ్యాపార ప్రతిష్ఠను పెంచడంలో, బ్రాండ్ గుర్తింపును పెంచడంలో వాహనాల నెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టీఓ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీజీ 09 9999’ నంబర్ను సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ సంస్థ రూ.25.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్ను టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనానికి కేటాయించారట. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) ‘టీజీ 09 డీ 0009’ నంబర్ను రూ.10.4 లక్షలకు సొంతం చేసుకుంది. ‘టీజీ 09 సీ 9999’ నంబర్ను రూ.7.19 లక్షలకు శ్రియాన్ కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసిందట. అదే విధంగా పోరస్ అగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ’ టీజీ 09 డీ 0006’ నంబర్ను రూ.3.65 లక్షలకు దక్కించుకుందని, వేగశ్రి గోల్డ్ అండ్ డైమండ్స్ ‘టీజీ 09 డీ 0005’ నంబర్ను రూ.3.45 లక్షలకు కొనుగోలు చేసిందని సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ సైతం.. సినీ హీరో నందమూరి బాలకృష్ణ రూ.7.75 లక్షలకు అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ను దక్కించుకుని వార్తల్లో నిలిచారు. అదే విధంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారట. ఆయన రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన లాంబోర్గినీ ఉరూస్ వాహనం నెంబర్ కోసం భారీగానే వెచ్చించారని విస్వసీయ వర్గాల సమాచారం. టీఎస్ 09 ఎఫ్ఎస్ 9999 కోసం ఏకంగా రూ.17లక్షలు వ్యయం చేశారు. ఎనీ్టయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్నే ఎంచుకుంటారట. సెంటిమెంట్స్తో ఆర్టీఏకి కాసుల పంట.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లను పొందడం ద్వారా తమ ప్రతిష్ఠను పెంచుకోవాలని చూడడం ఈ ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. అలాగే 6, 9 తదితర నంబర్లను సెంటిమెంట్గా లక్కీ నెంబర్లుగా భావించడం కూడా మరో కారణం. కంపెనీలు తమ బ్రాండ్ను ప్రత్యేకంగా చూపించేందుకు ప్రత్యేక నంబర్లను ఉపయోగిస్తున్నాయి. ఏదైతనేం.. సదరు సెంటిమెంట్లు, క్రేజ్ మూలంగా గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో నగరంలోని ఐదు ఆర్టీఓ కార్యాలయాలు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.124.20 కోట్లు ఆదాయాన్ని గడించాయి. పోటీ పెరుగుతుండడంతో వీటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇది గత ఏడాది ఆదాయం రూ.118 కోట్లతో పోలిస్తే సుమారు 5% పెరుగుదల నమోదైందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. -
24 ఏళ్లకే కంపెనీ ..28కే రిటైర్మెంట్! ఏకంగా రూ. 106 కోట్లు..
ఆరుపదుల వయసుకి రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇది సహజం. కానీ రెండు పదుల వయసుకే అంటే..జస్ట్ 28 ఏళ్లకే రిటైర్ అవ్వడం గురించి విన్నారా..!. పైగా పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దే పనిలో గడుపుతున్నాడట. అంతలా చకచక కెరీర్లో సెటిల్ అయిపోయి..పిల్లలు పెంచే సమయానికే హాయిగా వారితో గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు ఈ యూఎస్ వ్యక్తి. అతడి స్టోరీ వింటే..ఇది కదా పక్కా ప్లానింగ్ లైఫ్ అంటే అనిపిస్తుంది.అతడే యూఎస్కి చెందిన నథానెల్ ఫారెల్లీ. ఈతరం జెన్ జెడ్ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 29 ఏళ్ల నథానెల్ ఫారెల్లీ 21 ఏళ్లకే రిజిస్టర్డ్ నర్సు అయ్యాడు. సరిగ్గా అప్పుడే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న సమయం. దాన్నే తన అభ్యున్నతికి మార్గంగా మలిచాడు. ఆ సమయంలో ఫారెల్లీ రివిటలైజ్ అనే కంపెనీ ప్రారంభించి..దాంతో ఈ హోమ్ ఇన్ఫ్యూషన్ థెరపీ సేవలు అందించాడు. అందులోనూ మహమ్మారి సమయంలో చికిత్స పొందడం రోగులకు చాలా కష్టంగా ఉండేది. అందుకని వారికి తన కంపెనీ సాయంతో ఇంటి వద్దే యాంటీబయాటిక్ మందులతో చికిత్స పొందేలా నర్సులను సరఫరా చేసేవాడు. ఆ హోమ్ ఇన్ఫ్యూషన్ థెరపీ వ్యాపారంతో కొద్దికాలంలోనే కోట్లు గడించాడు. దాంతో అలా జస్ట్ నాలుగేళ్లకే తన వ్యాపారాన్ని $12.5 మిలియన్లకు (రూ. 106 కోట్లు) విక్రయించి బిందాస్గా సెటిల్ అయిపోయాడు. అంటే..నిండా ముప్పై ఏళ్లు నిండక ముందు పూర్తి ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందాడు. అలా ఫారెల్లీ 28 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని.. ఆ వచ్చిన సొమ్ముపై వచ్చే వడ్డీతో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రస్తుతం ఫారెల్లీ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఫ్లోరిడాలోని పెన్సకోలాలో నివసిస్తున్నాడు. అంతేగాదు తన పిల్లలకు సాకర్ క్రీడలో శిక్షణ ఇవ్వడం, రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను నిర్వహించడం తదితర పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నానని, కానీ భవిష్యత్తులో మరో కంపెనీ పెట్టే అవకాశం ఉందని చెబుతున్నాడు ఫారెల్లీ. (చదవండి: యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్) -
సమ్మర్ హీట్ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే..!
సమ్మర్ హీట్ని బీట్ చేయాలంటే కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే. సన్గ్లాసెస్ ఫ్యాషన్ యాక్సెసరీ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. సూర్యుడి అతి నీలలోహిత కిరణాలకు రేడియేషన్కు ఎక్కువసేపు గురి కావడం రకరకాల సమస్యలకు కారణం అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ నుంచి సన్గ్లాసెస్ మన కళ్లకు రక్షణగా ఉంటాయి.ఎలాంటి సమస్యలు రాకుండా కంటి ఆరోగ్యం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగపడతాయి. తీవ్రమైన సూర్యకాంతి వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. తలనొప్పి రావచ్చు. బయటికి వెళ్లినప్పుడు సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించి కంటిపై ఒత్తిడి లేకుండా చేస్తాయి కూల్ గ్లాసెస్.ఎలాంటి సన్గ్లాసెస్ను ఎంచుకోవాలంటే...100 శాతం యూవీ ప్రొటెక్షన్ ఇచ్చేవాటిని ఎంపిక చేసుకోవాలి. పోలరైజ్డ్ లెన్సెస్ సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తాయి. బ్రైట్ కండీషన్స్లో పోలరైజ్డ్ గ్లాసెస్ మంచి క్లారిటీని ఇస్తాయి స్ట్రాంగ్, స్క్రాచ్–రెసిస్టెంట్ సన్ గ్లాసెస్ను ఎంచుకోవాలి లైట్ వెయిట్, ఇంపాక్ట్–రెసిస్టెంట్, గుడ్క్లారిటీ కోసం పాలీకార్బోనేట్ లెన్సులు పాపులర్ ఛాయిస్రకరకాల సైజ్, షేప్లలో సన్గ్లాసెస్ వస్తున్నాయి. అయితే వాటిలో మన ముఖ ఆకృతికి నప్పే అద్దాలను ఎంచుకోవడం ఉత్తమం. (చదవండి: చీర కేవలం మహిళల సొత్తు కాదు..! స్టైలిష్ ధోతీలా పురుషులు కూడా..) -
చీరలో మగవాళ్లు కూడా స్టైలిష్గా కనిపించొచ్చు ఇలా..!
ఫ్యాషన్కి లింగ భేదం, సరిహద్దులు లేవని చూపించారు చాలామంది. కొద్దిపాటి సృజనాత్మకతతో మహిళల అందాన్ని రెట్టింపు చేసే చీర కూడా పురుషులను అందంగా చూపించగలదని విన్నారా..?. అవును మీరు వింటుంది నిజమే..!. మగవాళ్లు చీర కట్టుకుంటారా ఏంటి..? అని అనుకోకండి..ఎందుకంటే చీరను మగవాళ్లు ధరించే వాటిలా మలిచి స్టైలిష్గా చూపించొచ్చట. పైగా ఫ్యాషన్కి సరికొత్త అర్థం ఇస్తున్నారు ఇలా..!.అదెలా అంటే... భారతదేశపు తొలి పురుష మోడల్గా పేరుగాంచిన వ్యక్తి, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ అదెలాగో చేతల్లో చూపించాడు. ఫిట్నెస్ ఐకాన్గా పేరుతెచ్చుకున్న సోమన్..ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ ర్యాంప్పై చాలా అందంగా మెరిశాడు. అతడి స్టైలిష్ లుష్ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేసింది. సంప్రదాయానికి ప్రతీగా చూసే బంగారు చీరలో తళుక్కుమని కనిపించాడు. అది కూడా ఓ సాధారణ చీర మగవాళ్లకు కూడా ఇంత మంచి లుక్ ఇవ్వగలదా అనే ఆశ్యర్యానికి గురిచేసేలా అతడి ఆహార్యం అందర్నీ ఆకర్షించింది. అందులోనూ రుద్రాక్షలను ధరించి.. రుద్ర అవతారాన్ని ఓ సరికొత్తఫ్యాషన్ లుక్లో చూపించాడు సోమన్. ఆ లుక్ చూడటానికి మన సాంస్కృతిక సంప్రదాయాలకు ఆధునికతను జోడిస్తే.. ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడికి అసలైన అర్థంలా అతడి స్టైలిష్ లుక్ ఆకర్షిస్తోంది. అంతేగాదు సోమన్ ఆ ఫ్యాషన్ ర్యాంప్పై చెప్పులు లేకుండా ధోతీ కట్టులో వస్తున్న తీరు..మన సంప్రదాయ లుక్ ఇచ్చే ఆత్మవిశ్వాసమే వేరేలెవెల్ అన్నట్లుగా ఉంది. అలనాటి రాజవంశికులు పండుగలు, పర్వదినాల్లో ధరించే వస్త్రధారణ తీరుని గుర్తు చేసింది సోమన్ ఫ్యాషన్ వేర్. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ధరించే రుద్రాక్షలు శక్తికి ప్రతీకలు. అందువల్లే ఈ ఫ్యాషన్ ర్యాంప్పై సోమన్ లుక్ శక్తిమంతంగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Suta- Mindful Lifestyle Brand (@suta_bombay) (చదవండి: స్పేస్ ఫుడ్ టేస్ట్ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్) -
నువ్వన్నదే కరెక్ట్ నాన్నా.. మార్కులకన్నా లక్ష్యం మిన్న
స్వీటీ ఎక్కడుంది.. మంచి మార్కులతో టెన్త్ పాస్ అయింది కదా.. ఇదిగో తనకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను.. వెళ్ళి ఇవ్వు.. అసలు ఇంతకూ తను ఎక్కడుంది.. ఆఫీసునుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు అడిగాడు శేఖర్ .. ఆ..అయింది..కానీ దానికి మార్కులు సరిపోవట.. దాని అంచనాకు సరిపడా రాలేదని ఏడుస్తూ బెడ్ రూములో కూర్చుంది.. ఎంత చెప్పినా వినదాయే మీరే వెళ్ళి దాన్ని బుజ్జగించండి అంటూ వంటింట్లోంచి చెప్పింది పావని..ఓహ్.. అలాగా అనుకుంటూ చిన్నారి స్వీటీ.. ఏం చేస్తున్నావ్.. మంచి మార్క్స్ వచ్చాయి కదా మరి నీ సేవింగ్స్తో నాకు పార్టీ ఇస్తాను అన్నావు మరి రెడీనా అన్నాడు శేఖర్..ఆ మీరు నన్ను వెక్కిరిస్తున్నారు.. నేను అనుకున్నట్లు స్కోర్ రాలేదు..నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను.. ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఎర్రని బుగ్గలు కందిపోయేలా తుడుచుకుంటూ కన్నీళ్ళు కారుస్తోంది స్వీటీ.. అదేంటి తల్లీ నైన్టీ పర్సెంటేజీ వచ్చింది..అంటే డిస్టింక్షన్ వచ్చినట్లే..ఇంకెందుకు బాధ..అంతకన్నా పైన క్లాస్ లేదుగా నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చేశావు తల్లి.. ఆమాత్రం చాలు.. డోంట్ వర్రీ అంటూ తలనిమిరాడు.. లేదు నాన్నా నాకు అవమానంగా ఉంది..నా క్లాస్మేట్స్ అందరికీ నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి.. ఇది నాకు చాలా ఇన్స్టాలింగ్ ..రేపు నేను వాళ్లకు ఎలా మొహం చూపాలి..ఇక బతకడమే వేస్ట్ అనేసింది స్వీటీ..బతకడమే వేస్ట్ అన్న మాట విన్నాక శేఖర్ తుళ్ళిపడ్డాడు..అదేంటి అమాయకంగా ఉండే స్వీటీ ఇంత ఫోర్స్ గా మాట్లాడింది అనుకుంటూ..అదేం లేదు నాన్నా..నేను చెబుతాగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఆ చెప్పు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ .. పావనీ ఆ సూట్కేసులోంచి నా బ్లూ ఫైల్ పట్రా అని కేకేశాడు.. తెస్తున్నా అంటూ ఈ తండ్రికూతుల్లకు సేవలోనే నా బతుకు తెల్లారిపోతోంది అనుకుంటూనే ఫైల్ తెచ్చి ఇచ్చింది.కూతురికి ఇచ్చి దాన్ని ఓపెన్ చెయ్యి అన్నాడు శేఖర్. ఓపెన్ చేశాక ఇదేంటి నాన్నా బాగా నలిగిపోయి ఉంది అంది స్వీటీ.. అది నా టెన్త్ మార్కుల లిస్ట్..చూడు అన్నాడు .. చూసింది.. బొటాబొటి 38 మార్కులతో అన్నీ పాసైనట్లు ఉంది. చివర్న పాస్డ్ ఇన్ ఆర్డినరీ క్లాస్ అని ఉంది. అది చూసి నాన్నా మీరు జస్ట్ పాస్..థర్డ్ క్లాసులో పాసయ్యారా అని అబ్బురంగా.. అవునమ్మా అన్నాడు శేఖర్.. నెక్స్ట్ చూడు అన్నాడు.. అందులో ఇంటర్ మార్క్స్ ఉన్నాయి.. అందులో 52 శాతం మార్క్స్.. అంటే సెకండ్ క్లాస్ వచ్చింది.. నాన్నా ఈసారి ఈ ప్రోగ్రెస్ పెరిగింది సుమీ అంది కూతురు మెచ్చుకోలుగా .. తరువాత చూడు అన్నాడు.. అందులో బీకాం..ఫస్ట్ క్లాస్ అని ఉంది.. నాన్నా ఈసారి మరింత మెరిట్ వచ్చింది అంది స్వీటీ.. అవునమ్మా అన్నాడు శేఖర్..చూసావా బుజ్జి నేను థర్డ్ క్లాసులో పాసైనా నేను నీలాగా అవమానం అనుకోలేదు.. బతకడం వేస్ట్ అనుకోలేదు.. ఇంకా బాగా కష్టపడ్డాను..ఇంటర్లో సెకండ్ క్లాసు..డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. బ్యాంక్ పరీక్షలు రాసి ఆఫీసర్ అయ్యాను... నాకన్నా అప్పట్లో టెన్త్ ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మురళి అంకుల్ మా బ్రాంచిలోనే క్లర్క్ గా చేస్తున్నారు ..దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు తల్లీ అన్నాడు.. ఆలోచించింది స్వీటీ.. మార్కులు ముఖ్యం కాదు.. కష్టపడి చదవాలి.. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్తే నీలాగే మంచి పొజిషన్ కు చేరుకోవచ్చు.. అంది కాస్త స్థిమిత పడుతూ.. మరి ఇప్పుడేం చేద్దాం అంటావ్..అన్నాడు శేఖర్.. నువ్వు అన్నట్లుగానే నా పాకెట్ మనీతో నీకు, అమ్మకు మంచి పార్టీ ఇస్తాను..ఇంటర్లో ఇంకా బాగా చదివి మంచి సీట్ కొడతాను..సరేనా అంది స్వీటీ కాన్ఫిడెంట్ గా.. ఎస్..అదీ లెక్క.. ఆ స్పిరిట్ ఉండాలి.. పదా మరి పార్టీ చేసుకుందాం అంటూ కూతుర్ని..భార్యను తీసుకుని బయటకు బయల్దేరాడు..::సిమ్మాదిరప్పన్న -
సెలబ్రిటీ రైటర్స్
మూవీ సెలబ్రిటీల ఆట, మాట, పాట మనకు తెలుసు. మరి అక్షరం? ... ఈ పుస్తకాలే సాక్ష్యం. మూవీ సెలబ్రిటీలు రాసిన ఈ పుస్తకాల్లో మచ్చుకు కూడా కాలక్షేప కథనాలు లేవు. స్త్రీ సాధికారత నుంచి మానసిక ఆరోగ్యం వరకు విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి.ప్రయాణంలో ప్రతి అడుగు పాఠమే: ప్రియాంక చోప్రా‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. ఈ పుస్తకం తన జ్ఞాపకాల సమాహారం. తాను నడిచొచ్చిన దారి.‘నేను ఎప్పటినుంచో పుస్తకం రాయాలనుకుంటున్నాను. అయితే ఎప్పుడు రాయాలనేదే సమస్య. నా జీవితం గురించి రాయడానికి ఇది సరిౖయెన సమయం కాదు.ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు అనుకుంటాం. అయితే జీవితంలో గొప్ప పాఠాలు ప్రయాణంలోనే బోధించడతాయి. వాటి గురించి పంచుకోవడం అవసరం. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అందుకే కలం పట్టుకున్నాను. నా జ్ఞాపకాలను అన్ఫినిష్డ్ ద్వారా పాఠకులతో పంచుకున్నాను’ అంటుంది ప్రియాంక చోప్రా.డిజిటల్ యుగంలో పిల్లల పెంపకం: సోనాలి బింద్రే‘బంగారు కళ్ల బుచ్చమ్మ’గా ‘మురారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనాలి బింద్రే ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్: ఎన్చాంటింగ్ టేల్స్ ఆఫ్ ఇండియా’ ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకాలు రాసింది. ఆమె తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ నేడు విడుదల అవుతోంది. ‘బర్డ్స్ అండ్ బీస్ట్స్’ పుస్తకంలో భారతీయ జానపద కథలను తనదైన శైలిలో తిరిగి చెప్పింది సోనాలి. లడఖ్, అస్సాం, తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాఖండ్లలో తాను విన్న మౌఖిక జానపద కథలకు అక్షర రూపం ఇచ్చింది. పిల్లలను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే పుస్తకం ఇది.ఒకప్పుడు సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ కుటుంబాలే కనిపిస్తున్నాయి. ‘ఈ డిజిటల్ యుగంలో పిల్లలను ఎలా పెంచాలి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘ది మోడ్రన్ గురుకుల్’ పుస్తకం రాసింది సోనాలీ. పిల్లల పెంపకానికి సంబంధించి మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఇక తాజా పుస్తకం ‘ఏ బుక్ ఆఫ్ బుక్స్’ పుస్తకాలకు సంబంధించి సమస్త విషయాల గురించి మాట్లాడుతుంది. పుస్తకాలు ఎందుకు చదవాలి? ఉపయోగం ఏమిటి? ఎలాంటి పుస్తకాలు చదవాలి?... మొదలైన విషయాలతో ‘జీవితాంతం రీడర్గా ఉండాలి’ అని చెబుతుంది ఏ బుక్ ఆఫ్ బుక్స్.తరాల మధ్య అంతరం: ట్వింకిల్ ఖన్నా‘మిసెస్ ఫన్నీ బోన్స్’ ‘పైజామాస్ ఆర్ ఫర్ గీవింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మిప్రసాద్’ ‘వెల్కమ్ పారడైజ్’ పుస్తకాలతో రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది ట్వింకిల్ ఖన్నా. ‘పాఠకులకు హితబోధ చేయడం నా ఉద్దేశం కాదు. ఇలా జరిగింది తెలుసా? అంటూ నాకు తెలిసిన విషయాలను పాఠకులతో పంచుకుంటాను’ అంటున్న ట్వింకిల్ దయాదక్షిణ్యాలు, ఒంటరితనం, తరాల మధ్య అంతరాలు వంటి ఇతివృత్తాలతో రచనలు చేసింది.‘నేను రాయడానికి కూర్చున్నప్పుడు ఇతివృత్తం గురించి ఆలోచించను. నా కథలు హితబోధ చేస్తున్నట్లు ఉండకుండా జాగ్రత్త పడతాను. ఐడియా మదిలో మెరవగానే కథ పూర్తికాదు. కథ ఎక్కడ మొదలవుతుందో చెప్పలేము. అది మైండ్లో తనకు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటుంది. కొన్నిసార్లు మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళుతుంది’ అంటుంది ట్వింకిల్, ‘జెల్లీ స్వీట్స్’ అనే కథ రాయడానికి ఆమెకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది!తల్లులు, కాబోయే తల్లుల కోసం...: కరీనా కపూర్ప్రెగ్నెన్సీ సమయంలో తన శారీరక, భావోద్వేగ అనుభవాలకు ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకంతో అక్షర రూపం ఇచ్చింది కరీనా కపూర్. ఐవీఎఫ్ మదర్స్, ప్రెగ్నెన్సీ డిప్రెషన్, వికారం, మార్నింగ్ సిక్నెస్, పిల్లలకు పాలు ఇవ్వడం... ఇలా ఎన్నో విషయాల గురించి తన పుస్తకంలో రాసింది. ఈ పుస్తకం తన వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే అనలేము. ఎక్స్పెక్టింగ్ మదర్స్కు ఎంతో ఉపయోగపడే పుస్తకం. ‘ఈ పుస్తకం నా మూడవ సంతానం’ అని నవ్వుతూ అంటుంది కరీనా.రోషెల్ పింటోతో కలిసి ‘ది స్టైల్ డైరీ ఆఫ్ ఎ బాలీవుడ్ దివా’ అనే పుస్తకం కూడా రాసింది కరీనా కపూర్.‘ఆటోబయోగ్రఫీ రాయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు కాదు’ అని పుస్తక ఆవిష్కరణ సభలో చెప్పింది. ఆటోబయోగ్రఫీకి ముందు ఆమె నుంచి మరిన్ని పుస్తకాలను ఆశించవచ్చు.జెండర్ ఈక్వాలిటీ... దయా గుణం... పర్యావరణం: అలియా భట్‘ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్’ పుస్తకంతో రచయిత్రిగా మంచి మార్కులు తెచ్చుకుంది అలియా భట్. పిల్లల కోసం రాసిన పుస్తకం ఇది. పర్యావరణం, దయాగుణం, లింగ సమానత్వం... ఇలాంటి ఎన్నో విషయాల గురించి పుస్తకంలో రాసింది. బాల పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రాసింది.‘పిల్లలకు ప్రకృతిపై ప్రేమ కలిగేలా చేయడానికి, పర్యావరణ పరిరక్షణ బాధ్యత గురించి తెలియజెప్పడానికి ఈ పుస్తకం రాశాను. ఇంట్లో కంటే ఆరుబయట ఎక్కువ సమయం గడపడానికి, సహజ ప్రపంచంలోని అద్భుతాలను అన్వేషించడానికి పిల్లలను ్రపోత్సహించడానికి మొదటి అడుగుగా ఈ పుస్తకం రాశాను’ అంటుంది అలియా భట్.పింపుల్స్ నుండి పీరియడ్స్ వరకు...: టిస్కా చోప్రాయాక్టర్, డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న టిస్కా చోప్రా రైటర్ కూడా. తమ శరీరంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడాని 9 నుంచి 13 ఏళ్ల బాలికల కోసం ‘వాట్స్ అప్ విత్ మీ?’ పుస్తకం రాసింది. యుక్త వయస్సు సమస్యలు, పీరియడ్స్, మొటిమలు... ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. యుక్తవయసులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి యువతకు సహాయపడే పుస్తకం ఇది. ‘తొమ్మిదేళ్ల నుంచి 13, 14 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వాట్స్ అప్ విత్ మీ రాశాను. తల్లులే కాదు తండ్రులు కూడా నా పుసక్తంలో భాగం కావాలని కోరుకున్నాను. మార్కెట్లో లభించే ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్ల గురించి తెలియజేశాం. పాఠం చెబుతున్నట్లుగా కాకుండా వినోదాత్మకంగా ఉండేలా పుస్తకం రాశాను’ అంటుంది టిస్కా చోప్రా. -
Viral: అబ్బాయి జీతం రూ.2.50 కోట్లు ఉండాలి.. పిల్లలు వద్దు!, వధువు 18 కోరికల చిట్టా
అమ్మా..! సుధా(పేరు మార్చాం) బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. మా వయసు మీద పడిపోతుంది. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలని మీ నాన్న కంగారు పడుతున్నారు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. సంబంధాలు వెతుకుతాం అంటూ జానకి తన కూతురికి విజ్ఞప్తి చేసింది. తల్లి విజ్ఞప్తితో ఏమో అమ్మా.. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా పెళ్లి నీ ఇష్టం అని చెప్పడంతో నా బంగారు తల్లి అనుకుంటూ భర్త భూషణ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఏవండోయ్ సుధా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. మనోళ్లు ఉన్నారు కదా మంచి సంబంధం చూసి పెట్టమనండి అంటూ వంటింట్లోకి వెళ్లిన జానకి గుక్కెడు పంచదారను భర్త భూషణం నోట్లు కుమ్మరించింది. భార్య జానకి మాటలకు సంబరపడిపోయిన భర్త నాగభూషణం కుమార్తె సుధాకు పెళ్లి సంబంధాలు చూసేందుకు పక్కూరు తన పెద్దమ్మ పార్వతమ్మ ఇంటికి బయల్దేరాడు. ఈ స్టోరీ వినడానికి ఎంత బాగుంది.కానీ అదే సుధని పెళ్లి సంబంధాలు చూస్తాం. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పమ్మా అంటూ అడిగిన తల్లిదండ్రులకు ఎలాంటి కోరికలు లేవంటూనే తనకు కాబోయే వరుడిలో 18 రకాల కోరికలు ఉండాలంటూ తన కోరికల చిట్టా విప్పితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఓ యువతి విషయంలో అలానే జరిగింది. పేరు, ఊరు వెలుగులోకి రాలేదు. కానీ ఆమె కోరికల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఆ కోరికల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.జీతం ఏడాదికి 3లక్షల డాలర్ల సంపాదించాలి (మన కరెన్సీలో దాదాపు రూ.2.5 కోట్లు!)జెనరస్, స్పాయిల్గా ఉండాలి. అంటే భోజనం, ప్రయాణం, ఫ్యాషన్ ఇలా ప్రతీది కాస్ట్లీగా ఉండాలిలగ్జరీ లైఫ్ ఇష్టపడాలి (ఫైన్ డైనింగ్, ట్రావెలింగ్, వైన్ టేస్టింగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్)నన్ను నిజంగా ప్రేమించాలి. అన్ని విషయాల్లో నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలిఎమోషనల్ ఇంటెలిజెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండాలినైట్ ఎప్పుడైనా బయటికి వెళితే షాడోలా నన్ను వెన్నంటే ఉండాలిఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం, దూర దృష్టితో కష్టపడి పనిచేసే వ్యక్తి కావాలికుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇష్టమైన వారితో గడపడం. తరచుగా కుటుంబ విలువలు, సంప్రదాయాలు బాధ్యతలకు ప్రాముఖ్యత ఇవ్వాలిసోషల్ మీడియాలో షో ఆఫ్ వద్దు. ప్రైవసీ ఇష్టంశృంగారం విషయంలో నమ్మకంగా ఉండాలి.నాకు పిల్లలు వద్దు .. ఆవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పని,వంట పని ఇలా అన్నింట్లో సహాయపడే వ్యక్తే జీవిత భాగస్వామి కావాలని పోస్టులో పేర్కొంది. She sent me a list of her requirements. One of them includes a salary of $300k+byu/New_Ambassador2442 inTinder -
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
‘కష్టాల్లో, సుఖాల్లో భర్తకు తోడుగా’ అంటుంటారు. కష్టాలు, సుఖాల్లోనే కాదు... వృత్తిలోనూ భర్తకు తోడూ నీడగా ఉంటుంది జ్యోతి. భర్త డ్రైవర్, భార్య క్లీనర్!జ్యోతి ఎందుకు క్లీనర్ కావాల్సి వచ్చింది? కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... లారీ డ్రైవర్ అయిన భర్త శోభనాద్రి దూరప్రాంతాలకు వెళుతుండేవాడు. ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా‘ఎక్కడ ఉన్నాడో... ఏం తింటున్నాడో’ అని ఎప్పుడూ భర్త గురించి బెంగగా ఉండేది. అందుకు తగ్గట్టే డ్యూటీ దిగి ఇంటికి వచ్చిన భర్త బక్కచిక్కి కనిపించే వాడు.ఒకరోజు అడిగింది...‘నేను నీతోపాటే వస్తాను’‘మరి ఇల్లు?’ అన్నాడు భర్త.‘బండే మన ఇల్లు’ అన్నది ఆమె. ఇక ఆరోజు నుంచి బండే వారి ఇల్లు, బండే స్వర్గసీమ. లారీ ఎక్కడికి కిరాయికి వెళ్లినా క్లీనర్గా జ్యోతి భర్త వెంటే వెళుతుంది. లారీలోనే వంట సామగ్రి ఏర్పాటు చేసుకుని, మార్గ మధ్యంలో భర్తకు అవసరమైన భోజనం, టీ, అల్పాహారం వంటివి ఏర్పాటు చేస్తుంది. గతంలో దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాల్లో సరైన భోజనం లేక శోభనాద్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. భర్త వెంట వెళితే ఇబ్బందులు ఉండవని జ్యోతి భావించింది. రాత్రి పూట భర్త డ్రైవింగ్ చేస్తుంటే నిద్ర రాకుండా ఉండేందుకు భర్తతో ముచ్చట్లు పెడుతూ అతడిని అప్రమత్తం చేస్తుంటానని చెబుతోంది జ్యోతి. కోళ్ల దాణా, ధాన్యం, బొగ్గు, మొక్కజొన్న వంటివి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు రవాణా చేస్తుంటామని, భార్య తోడు రావడం వల్ల ఇంటి బెంగ కూడా ఉండదని శోభనాద్రి చెబుతున్నాడు.చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!‘పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. బాధ్యతలు తీరిపోయాయి. ఇక మా ఇద్దరి జీవనం ఇలా కలిసిమెలిసి సాగిపోతోంది’ అని భార్యాభర్తలు చెబుతున్నారు. వీరిది ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం.జి.వి.వి. సత్యనారాయణ, సాక్షి, కొవ్వూరు -
ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఐఐటీలో క్లాస్మేట్, ప్రియుడు సంభవ్ జైన్ను వివాహమాడింది హర్షిత. బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.డిల్లీ మాజీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్హంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణితో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన హిట్ చిత్రం పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!అందంగా వధూవరులుతన వెడ్డింగ్ డే కోసం, ఎరుపు లెహంగాలో గోల్డెన్ కలర్ వర్క్ బ్లౌజ్తో కళకళలాడింది. ఆమె ధరించినవీల్కూడా హైలైట్గా నిలిచింది .సంభవ్ తెల్లటి రంగు షేర్వానీ, తలపాగా నల్ల సన్ గ్లాసెస్ క్రిస్పీగా, రాయల్గా కనిపించాడు.ఇక అరవింద్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, సునీత పింక్ చీర, కమర్బంద్, గులాబీ రంగు చూడీల సెట్, చక్కటి హెయిర్ బన్తో అత్తగారి హోదాలో హుందాగా కనిపించారు.ఎవరీ సంభవ్ జైన్హర్షిత, సంభవ్ IIT ఢిల్లీలో కలుసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గురుగ్రామ్లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో పనిచేసింది హర్షిత. ఆ తరువాత సంభవ్తో కలిసి, బాసిల్ హెల్త్ అనే స్టార్టప్ను మొదలు పెట్టింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన, అనుకూలీకరించిన భోజనాన్ని అందించడమే దీని లక్ష్యం.. హర్షిత కన్సల్టెంట్గా పనిచేస్తున్నపుడు మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆమె మనసులోకి వచ్చిందట. ఇక హర్షిత సోదరుడు పుల్కిత్ కూడా IIT ఢిల్లీలో చదువుతున్నాడు. -
స్పేస్ ఫుడ్ టేస్ట్ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్లో పోలాండ్కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్యాన్ మిషన్కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..) -
ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..
‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’.‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’.‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది....వీరంతా బతకాల్సిన వారే అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.రోజూ ఇద్దరు..ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.నివారిద్దాం ఇలా..నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి.గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి..ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రతీ సమస్యకు పరిష్కారంఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మానసిక నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో తమను నమ్ముకొని ఉన్న అమ్మనాన్నలు, భార్యాపిల్లలు, స్నేహితులను ఐదు క్షణాలు తలుచుకుంటే కొంతమేర మార్పు వస్తుంది.– రవివర్మ, మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్ గోదావరిఖని (చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ల్యాప్టాప్ అమ్ముతున్నారా? రీసైకిల్ చేస్తున్నారా?
మీరు ల్యాప్టాప్ అమ్మడం, రీసైకిల్ లేదా డొనేట్ చేయడానికి ముందు విండోస్ బిల్ట్–ఇన్ ఫ్యాక్టరీ రీసెట్ ఉపయోగించడం మంచిది. ఇది అన్ని యాప్స్, సెట్టింగ్స్, పర్సనల్ ఫైల్స్ను డిలీట్ చేస్తుంది రీసెట్ తర్వాత కూడా పాస్వర్డ్లు, డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలను హ్యాకర్లు తిరిగి పొందగలిగే అవకాశం ఉంది. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్, హార్డ్డ్రైవ్లు, మెమొరీ కార్డులలో 90 శాతం రికవరీ చేయదగిన డేటా ఉంటుంది. చాలామంది కస్టమర్లు తమ డివైజ్లను రీసేల్ లేదా డిస్పోజ్ చేసేముందు డేటాను వైప్ చేయడంలో విఫలమవుతున్నారు.వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి.... పర్సనల్ యూజర్లు తమ డివైజ్లను విక్రయించడానికి లేదా రీసైకిల్ చేయడానికి ముందు డేటా–వైపింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. అయితే కొన్ని ట్రెడిషినల్ వైపింగ్ మెథడ్స్ ప్రభావవంతంగా ఉండకపోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ష్రెడ్డిట్’లాంటి యాప్లు సురక్షితమైన డేటా–వైపింగ్ ఆప్షన్లను అందిస్తాయి సమాచారాన్ని తొలిగించడానికి పూర్తి రీసెట్ అత్యంత ప్రభావంతమైన మార్గం సర్టిఫైడ్ డేటా–వైపింగ్ సాధనాలను ఉపయోగించడం మంచిది. (చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
అతిగా వంటనూనెలు వాడుతున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇన్నాళ్లు వంటలు చేయగా మిగిలిన నూనెని తిరిగి వాడొద్దని హెచ్చరించేవారు. ఇప్పుడు ఏకంగా అసలు వంటనూనెలే వాడొద్దని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. పైగా అవి కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటూ.. విస్తుపోయే విషయాలు చెబుతున్నారు. ఇదేంటి ఇంకేం వాడాలి వంటకు అన్న అనుమానం రావడం సహజమే. కానీ తాజా పరిశోధనలు వంట నూనెలు కేన్సర్ ప్రమాదాన్ని ప్రోత్సహిత్సాయని చెబుతున్నాయి. అంతేగాదు అదెలా జరుగుతుందో కూడా సవివరంగా వివరించారు పరిశోధకులు.వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధనల్లో వంట నూనెలు, కూరగాయల నూనెలు అతిగా వాడకూడదని తేలింది. ఆ నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందట. ముఖ్యంగా రొమ్మ కేన్సర్(Breast Cancer)లోని కణాల్లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుందని తెలిపాయి. అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని ఈ లినోయిక్ ఆమ్లం వేగవంతం చేస్తుందట. అంటే సాధారణ రొమ్ము కేన్సర్లో కంటే ఈ ట్రిపుల్ నెగటివ్లో కేన్సర్ కణాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఇక మనం వాడే ఈ నూనెలు ఆ కేన్సర్ కణాలను మరింత అభివృద్ధి చేస్తాయని గుర్తించామని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా సోయాబీన్, కుసుమ నూనె వంటి సీడ్స్ ఆయిల్స్, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్ చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము కేన్సర్ పెరుగదలను ప్రత్యేకంగా పెంచగలదని పరిశోధనలో నిరూపితమైందన్నారు. లినోలెయిక్ ఆమ్లం FABP5 అనే ప్రోటీన్తో బంధించడం ద్వారా కేన్సర్ కణితి కణాలను మరింత వేగంగా అభివృద్ధి చెందేలా సక్రియం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కానీ ఇతర హార్మోన్ సెన్సిటివ్ ఉప రకాల్లో అలా జరగడం లేదు. అంటే ఇక్కడ లినోలెయిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారం కేన్సర్ కణితి పెరుగుదల మెరుగ్గా ఉంచుతుందని క్లియర్గా నిరూపితమైందన్నారు. ఈ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడటటేమ గాక నిర్దిష్ట పోషక సిఫార్సులు ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనేది క్లియర్ నిర్వచించగలమని అంటున్నారు పరిశోధకులు. (చదవండి: నలుగురిలో కలవనివ్వకుండా చేసే వ్యాధి.. ! గంటల్లోనే నయం అయిపోతుందట..) -
World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.చారిత్రక నేపథ్యం: ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి. మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.ఆ జాబితాలో మనవి..మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోట, తాజ్మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే. ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.ఏవేవి ఉన్నాయంటే..ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్లోని జంతర్మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్లోని రాణీకీ వావ్, చండీగఢ్లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!) -
గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. ) -
శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు..
పరీక్షలు అయిపోయాయి.. వేసవి సెలవులు వచ్చాయి.. మరి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థులు ఏం చేయాలి? వారికి నచ్చిన రంగాల్లో, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సరి.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.. మాదాపూర్లోని శిల్పారామం ప్రతి ఏడాది సమ్మర్ ఆర్ట్ క్యాంప్ చేపడుతోంది. ఈ ఏడాది కూడా మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తోంది. దీనిలో మట్టికుండల తయారీ విధానం, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, మండల పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాల పఠనం, సంస్కృతంలో మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు ఏఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు అధ్యాపకులు శిక్షణ ఇస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా గృహిణులు, ఉద్యోగినులు సైతం వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన మహిళలు వివిధ రకాల బట్టలపై పెయింటింగ్లు వేసి ఆర్థికంగా సంపాదిస్తున్నారు. కొంత మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. 6 సంవత్సరాలకుపై బడినవారు ఎవరైనా సమ్మర్ ఆర్ట్ క్యాంపులో పాల్గనవచ్చు. చిన్నారులకు భగవద్గీత, సంస్కృత భాషలను నేర్పడం వల్ల వారు ప్రయోజకులు కావడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రత్యేకతను తెలుసుకుంటారని అధ్యాపకులు తెలుపుతున్నారు. కేవలం సరదాగా నేర్చుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడవచ్చు.. సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి భాషను నేరి్పంచడం అరుదు. శిల్పారామం విద్యార్థులకు, ఆసక్తిగల వారికి సమ్మర్ క్యాంపు ద్వారా ఈ అవకాశాన్ని కలి్పస్తోంది. సులభ పద్ధతిలో సంస్కృత భాషను నేర్చుకోవచ్చు. సంస్కృత భాషను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వల్ల అనేక గ్రంథాలను, పుస్తకాలను చదువుకొని అర్థం చేసుకోవచ్చు. – సంతోష్, అధ్యాపకుడు, సంస్కృత భాష మధుబని పెయింటింగ్లో శిక్షణ మధుబని పెయింటింగ్ను ఆసక్తితో నేర్చుకోవాలి. ప్రత్యేకత ఉన్న మధుబని పెయింట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. గృహిణులు ఇంట్లో సరదాగా వేసి అమ్ముకోవచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో నేర్చుకున్న వారు మరి కొంతమందికి శిక్షణ ఇవ్వవచ్చు. – రాజేశ్, మధుబని పెయింటింగ్ అధ్యాపకుడు ఆసక్తి గలవారు 8886652030,8886652004లలో సంప్రదించగలరు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ఆరు నుంచి 60 సంవత్సరాల వారు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. మొత్తం 9 అంశాలలో శిక్షణ (చదవండి: హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!) -
హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!
సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది. విద్యార్థుల కోలాహలంతో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 1,628 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశంలోని మూడు రాష్ట్రపతి నిలయాల చరిత్ర, ప్రాముఖ్యతను వివరించే వీడియోను వీక్షించారు. అనంతరం విద్యార్థులు హెరిటేజ్ వాక్లో భాగంగా రాష్ట్రపతి నిలయంలోని పురాతన భవనాలను సందర్శించి వాటి చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వారసత్వ పరిరక్షణకు సంబంధించిన నిపుణులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. ఈ సెషన్లలో ఇంజినీర్ వేదకుమార్ మణికొండ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్), మధు వొటెరి (సీనియర్ ఫెలో – కేంద్ర సాంస్కతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ టూరిజం వాక్ కోఆర్డినేటర్), కల్పనా రమేష్ (కావా డిజైన్ స్టూడియో – ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు) పాల్గొన్నారు. (చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!) -
హీట్ని బీట్ చేసేలా హెల్దీగా ఉందాం ఇలా..!
భాగ్యనగరవాసులారా.. మీకో ‘సన్’గతి చెప్పాలా.. భానుడు భగభగ మండుతున్నాడు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. న‘గరం’గరంగా మారుతోంది.. జర జాగ్రత్త! టెంపరేచర్ గ్రేడ్ పెరిగి 47 సెంటీగ్రేడ్ను టచ్ చేసే ప్రమాదం పొంచి ఉంది. నగర జీవనశైలిలో వేడికి అనుగుణంగా మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ ఏడాది వేసవి గత ఏడాదితో పోల్చితే ఎంత భిన్నంగా ఉందో తెలుసుకోవడం కూడా అంతే అవసరం. వాతావరణ పరిశోధన నిపుణుల సూచనలను బట్టి చూస్తే ఈ వేసవి మరింతగా ఎండలు ఉండే అవకాశముంది. 2017లో నమోదైన 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలకు సమీపంగా ఈ ఏడాది వేసవి తాపం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికల ప్రకారం హైదరాబాద్లో ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా అదనంగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశం ఉంది. ఇది నగరవాసులకు మరింత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఈ వేసవిలో ఎల్నినో ప్రభావం కారణంగా వడదెబ్బ ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మే నెల వరకు వడదెబ్బ ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు నగరవాసుల నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. వేసవి తాపానికి ముఖ్యమైన జాగ్రత్తలు.. వేడి తీవ్రత పెరిగే సమయంలో మన శరీరం నుంచి ఎక్కువగా చెమట రూపంలో నీరు పోయి డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల నీటిని రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు తాగడం, కొబ్బరి నీరు, నిమ్మకాయ రసం, బటర్ మిల్క్ లాంటి సహజ పానీయాలను ఎక్కువగా తీసుకోవడం అవసరం. ఇళ్ల నుంచి బయటకి వెళ్లే సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదు. వెళ్లాల్సి వచ్చినప్పుడు శరీరాన్ని కప్పి ఉంచేవిధంగా లైట్ కలర్ సూటీ దుస్తులు, కూలింగ్ గాగుల్స్, స్కార్ఫ్ లాంటి రక్షణ దుస్తులు ధరించాలి. సన్స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. ఆహారం విషయంలో వేడికాలం అంటే జీర్ణశక్తి తక్కువగా ఉండే సమయం. తేలికపాటి ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు, తేమ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంటిని చల్లగా ఉంచడానికి మొక్కలు, గాలి చక్కగా వచ్చేటట్లుగా విండోస్ ఏర్పాటు చేయడం మంచిది. కొన్ని తాత్కాలిక వర్షాలు నమోదు కావచ్చన్న అంచనాలున్నా, అవి వేసవి తీవ్రతను తగ్గించేంతగా ప్రభావం చూపించవు. అంతేకాదు.. వర్షాల తర్వాత తేమ పెరగడం వల్ల ఉక్కిరిబిక్కిరి చేయగల వాతావరణం ఏర్పడే ప్రమాదమూ ఉంది. ఈ సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండటం అవసరం. (చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ) -
వేసవి ఉక్కపోతల్లో డ్రెస్సింగ్ స్టైల్స్ అదిరిపోవాలంటే..!
వేసవిలో వివాహ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కాలానికి తగినట్టు డ్రెస్సింగ్ ఉండాలి. అలాగని లుక్లో రిచ్నెస్ ఏ మాత్రం తగ్గకూడదు. ఎంపిక పెద్ద టాస్క్. సీజన్కి తగినట్టు సౌకర్యంగా ఉండేలా, అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా ఉండాలంటే మనదైన స్టైల్ స్టేట్మెంట్ను చూపించాలి. వేసవిలో ఉక్కపోతలో డ్రెస్సింగ్ స్టైల్స్ ఆహ్లాదంగా... ఆకట్టుకునేలా ఉండాలి. మిగతా సీజన్లో ఎంత బ్రైట్ కలర్స్ని ఎంపిక చేసుకున్నా,.. సమ్మర్లో మాత్రం పేస్టల్ కలర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. వీటికే కాంట్రాస్ట్ బ్లౌజ్లు, లైట్షేడ్స్ ఉన్నవి, అవి కూడా హెవీ వర్క్తో కాకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. ఫ్లోరల్స్... ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలకు లెహంగా అయినా, వివాహ వేడుకకు శారీ అయినా ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవడం వల్ల అకేషన్ కాస్తా ఆహ్లాదంగా మారిపోతుంది. పేస్టల్, గోల్డ్, సిల్వర్ కలర్స్లో ఉన్నా ఫ్లోరల్స్తో ఉన్న లైట్ వెయిట్ పట్టు చీరలకు, మరో డిజైనర్ పల్లూని జత చేసి వధువు, ఆమె తరపు స్నేహితులు.. మహారాణీ స్టైల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇండో వెస్ట్రన్... మన హ్యాండ్లూమ్ పట్టు చీరల్లోనూ లైట్ వెయిట్వి ఎంపిక చేసుకోవాలి. వాటికి పూర్తి కాంట్రాస్ట్ బెలూన్ స్లీవ్స్, స్లీవ్లెస్, యునిక్గా ఉండే బ్లౌజ్ డిజైన్స్ సరైన ఎంపిక అవుతుంది. శారీ గ్రాండ్నెస్ అంతా బ్లౌజ్ డిజైన్లో చూపించవచ్చు హెవీ ఎంబ్రాయిడరీ అవసరం లేకుండానే. లినెన్ అండ్ కాటన్ స్టైల్... వొవెన్ బార్డర్ ఉన్నవి, లినెన్స్, కాటన్స్ని ఉపయోగించి కూడా తమదైన స్టైల్ స్టేట్మెంట్తో ఈ సీజన్ వేడుకలో పాల్గొనవచ్చు. కాంట్రాస్ట్ స్టైలిష్ బ్లౌజులు, మనవైన సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న ప్లెయిన్ శారీస్ను కూడా ఈ వేడుకలకు ఎంచుకోవచ్చు. వీటితోపాటు చందేరీ స్టైల్స్తోనూ గ్రాండ్లుక్ను తీసుకురావచ్చు. ఆభరణాల ఎంపిక... ముత్యాలు, పచ్చలు, ఇతర బీడ్స్తో చేసిన లేయర్డ్ జ్యువెలరీ ఈ వేసవికి సరైన ఎంపిక అవుతుంది. వీటి వల్ల చెమటతో పెద్ద ఇబ్బంది ఉండదు. పైగా, ధరించిన డ్రెస్కు హైలైట్గా నిలుస్తాయి.(చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ) -
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె. అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె. శరరీంలో చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు. ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్నెస్ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత. View this post on Instagram A post shared by Anandita De (@ananditade) (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్నెస్పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్స్టైల్ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్నెస్పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్లో చోటు..) -
రక్తం ధారగా పోతోందా?.. బీ కేర్ఫుల్
చిన్న చిన్న గాయాలైనప్పుడూ జాగ్రత్త..!. రక్తం కారడం సహజమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఒకవేళ అనుకోకుండా గాయమైనా..రక్తం కారి కాసేపటికి కంట్రోల్ అవ్వాలి. లేదంటే అది హిమోఫిలియా రుగ్మతే అయ్యి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి బాధితులు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. ఇవాళ ఏప్రిల్17 ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా అసలేంటి వ్యాధి..? దీనికి చికిత్స ఏంటి తదితరాల గురించి తెలుసుకుందాం.చాలామంది హీమోఫిలియా అనే వ్యాధి గురించి తెలియదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 17న హీమోఫిలియా అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు.హీమోఫిలియా అంటే హీమోఫీలియా అనే పదం హెమోరాఫిలియా అనే పదానికి సంక్షిప్త రూపం. దీన్ని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ షోన్లీన్ , అతని అసోసియేట్ ఫ్రెడరిక్ హాప్ఫ్ సృష్టించారు. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధి 'హిమోఫిలియా'. ఇది వారసత్వంగా తల్లి దండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. అలాంటి వారికి ఎముక సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో నిర్ధారణ చేసి మందులు వాడకపోతే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. 'రాయల్ డిసీజ్'.. ఈ సమస్య ఈనాటిది కాదు. ప్రాచీన ఈజిప్టు కాలం నుంచి దీని తాలుకా కేసులు నమోదయ్యాయట. అంతేగాదు దీన్ని 'రాయల్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈజిప్ట్రాణి విక్టోరియాకి ఈ వ్యాధి ఉందట. అలాగే ఆమెకు పుట్టిన తొమ్మిది మంది పిల్లల్లో ముగ్గురికి ఈవ్యాధి ఉందని, వారికి వారసత్వంగా వచ్చిందని అప్పుడే నిర్థారించారు వైద్య నిపుణులు. ఎందువల్ల ఇలా అంటే..సాధారణంగా ఎప్పుడైనా శరీరానికి గాయమైతే, రక్తస్రావం అవ్వడం మొదలవుతుంది. ఈ రక్తస్రావాన్ని ఆపేందుకు క్లాట్ ఏర్పడి, ప్లేట్లెట్స్ రక్తాన్ని చిక్కపరుస్తాయి. ఇలా రక్తస్రావం ఆగిపోతుంది. కానీ, హీమోఫిలియా ఉన్న వారికి శరీరంలో రక్తం గడ్డకట్టే కణాలు తక్కువగా ఉంటాయి. దీంతో వారికి గాయం అయితే రక్తం ధారగా శరీరం నుంచిపోతూనే ఉంటుందట. ఇక ఈ వ్యాధి ఏ,బీ అని రెండు రకాలుగా ఉంటుందట. ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి తన శరీరంలో రక్తం గట్టకట్టడానికి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు వీలుండదు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుంది.హీమోఫిలియా బీ ఉన్న వారు తమ బ్లడ్ ప్లాస్మాలో ప్రొటీన్ను అంటే ఫ్యాక్టర్ 9ను సహజంగా ఉత్పత్తి చేసుకోలేరు. ఇప్పటి వరకు ఈ రోగులు ఫ్యాక్టర్ 9 కోసం ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే. వారంలో పలుసార్లు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది.ఈ వ్యాధి జన్యుపరంగా వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, పిల్లలకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకేందుకు ఇతర కారణాలు చాలా తక్కువని అంటున్నారు నిపుణులు. ఇది చాలా అరుదైన వ్యాధని చెబుతున్నారు వైద్య నిపుణులు.అంతేగాదు పదివేల మందిలో ఒకరికి హీమోఫిలియా -ఏ సోకుతుందని, 40 వేల మందిలో ఒకరికి హీమోఫిలియా బీ వస్తుందని చెప్పారు. చివరిగా..ఏ రూపంలో ఈ వ్యాధి సోకినా అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులులక్షణాలు..ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా లేదా చాలా తీవ్రంగా ఉంటాయిముక్కు నుంచి రక్తం కారడంపళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావంచర్మం తేలిగ్గా ఊడొస్తుంది.శరీరం లోపల రక్తస్రావమవుతూ ఉండటంతో జాయింట్లలో నొప్పిహీమోఫిలియా వల్ల తలలో ఇంటర్నల్గా రక్తస్రావమవుతుంది. తీవ్ర తలపోటు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.దీంతో పాటు, చిన్నవయసులోనే ముసలివాళ్లుగా మారడం, మెదడుకు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో స్పృహ కోల్పోవడం, ముఖం అందవికారంగా మారడం వంటివి కూడా కనిపిస్తుంటాయి.ఈ లక్షణాలు అతి కొద్ది మంది రోగులలో మాత్రమే కనిపిస్తాయి.హీమోఫిలియా మూడు స్థాయుల్లో ఉంటుంది. స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలో 5 నుంచి 10 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలుంటాయి.మధ్యస్థంగా ఉన్నప్పుడు 1 నుంచి 5 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, వీటి స్థాయి శరీరంలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంటుంది.ఈ పైలక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందే. చికిత్స ఏంటంటే..నిజానికి కొన్నేళ్ల వరకు ఈ వ్యాధికి చికిత్స అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రక్తం గడ్డకట్టేందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వ్యాధి అంత ప్రమాదకరస్థాయిలో లేకపోతే ఔషధాలతో ఉపశమనం పొందొచ్చు. అలాగే తోబుట్టువుల్లో ఒకరికి ఉండి మరొకరికి లేకపోయినా..కొంతకాలం తర్వాత వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయిన హెచ్చరిస్తున్నారు. ఇక హీమోఫిలియా బీ రకం వ్యాధి అయితే చికిత్స అత్యంత ఖరీదైనదే అంటున్నారు నిపుణులు. ఇటీవలే అమెరికా దీనికి హెమ్జెనిక్స్ అనే ఇంజెక్షన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందట. అయితే దీని ధర 3.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 28 కోట్లు.). అంతేగాదు ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఔషధాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్గా నిలిచింది. ఇది అత్యంత అరుదైన వ్యాధికావడంతో దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ప్రత్యేకంగా ఒక రోజుని ఏర్పాటు చేసి మరీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది థీమ్ "అరుదైన రక్రస్రావం రుగ్మత గురించి మహిళలు, బాలికలు అందరూ తెలుసుకోవాలి".. అనే నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు) -
వేసవి సెలవులు.. విద్యార్థులకు ఆదాయ మార్గాలు..!
స్కూళ్లు, కాలేజీలకు విరామం వచ్చిన ఈ సమయం యువతకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, స్వల్ప ఆదాయం సంపాదించడానికి మంచి అవకాశం. ఆదాయం, అనుభవం రెండింటికీ అనేక రంగాల్లో సమ్మర్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన దిశలో అడుగేస్తే, ఈ వేసవి తమ జీవితానికే మార్గనిర్ధేశం చేసేదిగా మారవచ్చని భావిస్తున్న విద్యార్థులు సెలవుల్లో పలు ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటిలో కొన్ని.. కాల్ సెంటర్ / బీపీఓలు.. ఐటీ హబ్గా మారుతున్న నగరంలో పలు కంపెనీలు తాత్కాలిక కాల్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను అందిస్తున్నాయి. వీటికి 10వ తరగతి నుంచి ఇంటరీ్మడియట్ విద్యార్థులు సైతం అర్హులే. పనివేళలు షిఫ్ట్ ప్రాతిపదికన ఉండటంతో సెలవులు ముగిశాక కూడా అవసరం అనుకుంటే క్లాసుల వేళలతో సమన్వయం చేయవచ్చు. నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. ట్యూటరింగ్ /హోం ట్యూషన్లు.. పాతదే అయినా ఇప్పటికీ వన్నెతగ్గని ఉపాధి ఇది. ఇంటర్ లేదా డిగ్రీ చదువుతున్న యువత, పాఠశాల విద్యార్థులకు హోమ్ ట్యూషన్లు చెప్పడం ద్వారా నెలకు రూ.15 వేల వరకూ ఆదాయం వస్తోంది. కొంతమంది ఆన్లైన్ ట్యూటర్గా కూడా పని చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. రిటైల్, కస్టమర్ సర్వీస్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ షోరూమ్స్లో కస్టమర్ సర్వీస్, క్యాషియర్, స్టాక్ మేనేజ్మెంట్ వంటి ఉద్యోగాలు వేసవిలో తాత్కాలికంగా లభిస్తాయి. వీటిలో నెలకు రూ.15 వేల వరకు వేతనం అందుతుంది. ఈ ఉద్యోగం వల్ల ప్రధాన లాభం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కంపెనీలూ రెడీ.. స్వల్పకాలిక ప్రాజెక్ట్ల కోసం వేసవి సెలవుల్లో విద్యార్థులను నియమించుకోవడం అనేది కొంత కాలంగా కంపెనీలు అనుసరిస్తున్న విధానం. నగరంలోని ప్రొఫెషనల్ రెగ్యులర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ వేసవిలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పని చేయబోతున్నామని చెప్పారు. కళలు హ్యుమానిటీస్ నేపథ్యానికి చెందిన విద్యార్థులు కంటెంట్ రైటింగ్ నుంచి ఫీల్డ్ రీసెర్చ్ వరకు ఉద్యోగాలపై పని చేస్తుంటే, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి వచ్చిన వారు కంపెనీల ద్వారా అవుట్సోర్స్ చేసే ప్రాజెక్ట్లలో పని చేస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం, వేసవి ఉద్యోగాల ద్వారా నెలకు సగటున రూ. 20 వేల నుంచి రూ.35 వేల వరకు ఆదాయాలు ఉంటాయి. సెలవులు ప్రారంభం కావడానికి ముందే కళాశాలలు విద్యార్థులకు ఇలాంటి ఉద్యోగాలు అందుకోవడంలో సహకరిస్తున్నాయి.ఫుడ్ డెలివరీ అంతకంతకూ విస్తరిస్తున్న ఊబర్ ఈట్స్, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎప్పుడూ ఉద్యోగుల అవసరం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసిన యువతకు డెలివరీ బాయ్తో పాటు మరికొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించవచ్చు. ‘నేను ప్రస్తుతం ఒక ప్రసిద్ధ కంపెనీలో నెలకు రూ.12 వేల జీతంతో రెండున్నర నెలల పాటు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇది తక్కువ జీతానికి పని చేసినట్లుగా అనిపించవచ్చు. అయితే ఈ అనుభవం దీర్ఘకాలంలో సహాయపడుతుంది.‘ అని నగరానికి చెందిన విద్యార్థి హరితా సింగ్ చెప్పింది. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు) -
ఆరోగ్యానికి అదే మార్గం..!
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రధానమని జాతీయస్థాయిలో పేరొందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియాతో కలిసి నగరంలోని తాజ్ డెక్కన్లో పోషకాహారంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఆహారంతో పాటు చురుగ్గా ఉండటం కూడా చాలా అవసరం అన్నారు. వ్యాయామానికి ముందు తర్వాత తీసుకునే ఆహారం చాలా కీలకమని, కొవ్వులు, ఆహారంలో ఫైబర్, జింక్, మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం వంటి పప్పులు మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఈ సదస్సులో భాగంగా జరిగిన చర్చలో అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ హరితా శ్యామ్, యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ సునీతా ఫిలిప్, స్టార్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జోరుగా.. హుషారుగా..శాస్త్రిపురం: వేసవిలో పచ్చని పార్కులు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు పార్కుల్లో సందడి చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పార్కులలో జీహెచ్ఎంసీ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓపెన్ జిమ్తో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో పార్కుల్లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఏ పార్కు చూసినా పిల్లలు, వృద్ధులు, మహిళలతో కళకళలాడుతున్నాయి. (చదవండి: నీడ పట్టున ఉండొద్దు..నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు
గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నారన్న సామెత అచ్చం సిటీ ప్రజలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఉదయం, సాయంత్రం.. వీలైనప్పుడు ప్రతిరోజూ కాస్త సమయం శరీరానికి ఎండ తగిలితే విటమిన్ డి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆమాత్రం సమయం కేటాయించకపోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఎముకలు, కండరాలు బలహీనపడిపోవడం, లివర్, కిడ్నీ, లంగ్స్, డయాబెటిస్, బీపీ, జుట్టు నుంచి గోర్ల వరకు వివిధ రోగాలు వస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చ్ (ఐసీఆర్ఐఈఆర్) సర్వే స్పష్టం చేస్తోంది. మన రాష్ట్రంతో పాటు హైదరాబాద్నూ సరాసరి 92 శాతం మంది ప్రజల్లో విటమిన్ డి లోపం వేధిస్తోందని నివేదికల్లో పొందుపరిచారు. ఇండోర్ జీవన శైలితో విటమిన్ డి లోపం పెరుగుతోందని ఐసీఆర్ఐఈఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. పిల్లలు, కౌమార దశ, గర్భిణులు, వృద్ధులపై అధిక ప్రభావం కనిపిస్తోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2019–21లో దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరిలో విటమిన్ డి లోపం కనిపించగా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 92 మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న యువత, విద్యార్థుల్లో సైతం విటమిన్ డి లోపించడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా దీర్ఘకాలిక వైకల్యం సంభవించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. దేశంలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏడాది పొడవునా సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయితే చాలా మంది వ్యక్తులు ఇంటి నుంచి బయటకు రాకపోవడం, పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ, దట్టంగా నిండిన నివాస ప్రాంతాలు, లైఫ్స్టైల్ తదితరాలు విటమిన్ డి లోపానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అధిక సమయం ఇల్లు, కార్యాలయాల్లో గడపటం, ఆధునిక జీవన శైలి సూర్యకాంతి ఎక్స్పోజర్ను తగ్గిస్తోందని ఐసీఆర్ఐఈఆర్ స్పష్టం చేస్తోంది. యువతలో ఎముకలు బలహీనపడుతున్నాయ్ నిమ్స్లో 2019–21 సంవత్సరాల మధ్య చేపట్టిన సర్వే, తాజాగా బీబీనగర్ ఎయిమ్స్లో జరుగుతున్న రీసెర్చ్ ఫలితాలు పరిశీలిస్తే పిల్లలు, వృద్ధులు, గర్భిణులతో పాటు ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల విద్యార్థులు, యువతలో సైతం వెన్ను, నడుం నొప్పి, ఎముకలు, కండరాల బలహీనపడటం, జుట్టు రాలిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిశోధనలో మొత్తం 700 మంది నివేదికలు పరిశీలించారు. అందులో యువత సుమారుగా 400 మంది ఉండగా, ఇతరులు మరో 300 మందికిపైగా ఉన్నారు. ఇంట్లో ఉన్న వారితో పోలిస్తే ఇంటి నుంచి బయటకు వచ్చే వారిలో ఈ లోపం కాస్త తక్కువగా ఉందని తేలింది. 92 శాతం మందిపై ప్రభావం తెలంగాణ, హైదరాబాద్లో 92 శాతం మంది ప్రజల్లో విటమిన్ డి లోపం కనిపిస్తోంది. ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. శరీరానికి ఎండ తగలకపోవడం, స్మోకింగ్ వంటివి విటమిన్ డి లోపానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. యువతలోనూ ఈ తరహా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం కాస్త సమయం ఎండ పడితే విటమిన్ డి శరీరానికి అందుతుంది. మంచి ఫలితాలు ఉంటాయి. – డా.మహేశ్వర్ లక్కిరెడ్డి, ఎయిమ్స్ బీబీనగర్ (చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!) -
బెడ్షీట్...బీట్ ది హీట్..!
వేసవిలో కాటన్ బెడ్షీట్లను ఉపయోగించడం మంచిది. కాటన్ చెమటను త్వరగా గ్రహిస్తుంది. నిద్ర పోతున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. చర్మాన్ని జిగటగా ఉంచదు. బెడ్ షీట్లను ఎంచుకునేటప్పుడు 100 శాతం కాటన్ ట్యాగ్కు ప్రాధాన్యత ఇవ్వండి. కొన్ని బ్రాండ్లు కాటన్ షీట్లను అమ్ముతున్నప్పటీకి... అవి బ్లెండెడ్ కాటన్వి (ఇతర రకాల పదార్థాలతో కలిసిన కాటన్) అయి ఉంటాయి. బ్లెండెడ్ కాటన్ స్కిన్ ఫ్రెండ్లీ కాదు.కలప గుజ్జును ఫైబర్గా మార్చడం ద్వారా తయారుచేయబడిన మృదువైన వస్త్రాలలో ‘టన్సెల్’ ఒకటి. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది. వేసవిలో చెమట కారణంగా బెడ్ షీట్లు త్వరగా మురికి పడతాయి. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు బెడ్ షీట్లను మార్చాలి. ఇలాంటి సందర్భాలలో తేలికైన, ఫ్లోయింగ్ కాటన్ షీట్లను ఎంచుకోవడం మంచిది.వేసవిలో దద్దుర్లలాంటి వివిధ చర్మ సమస్యలు వస్తాయి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే సింథటిక్ కాని బెడ్షీట్లను వాడితే మంచిది. వేసవిలో ఎలాంటి కలర్స్ బెడ్ షీట్లను ఎంచుకోవాలనే విషయానికి వస్తే నీలం రంగు బెటర్. లేత నీలం రంగు బెడ్షీట్లు చల్లదనాన్ని కలిగిస్తాయి. (చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!) -
ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!
మా ఆయనకు 52 సం‘‘లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వృత్తిలో పెద్దగా సమస్య లేదు. కాని ఈ మధ్య రాత్రి నిద్రలో తన కాళ్ళతో నన్ను కొడుతున్నాడు. నిద్రలో కాళ్ళను గట్టిగా కదిలించడం, అప్పుడప్పుడు కేకలు వేయడం, కలలో ఎవరితోనో పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఉదయాన్నే లేచిన తరువాత అడిగితే రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తులేవని అనడమే కాక, అసలు అలా చేయనే లేదని చెప్తున్నారు. మా ఇద్దరి వైవాహిక జీవితంలో వేరే ఏ సమస్యా లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నాపైన కోపంతో పగలు నన్నేం అనలేక రాత్రి నిద్రలో నన్ను ఇబ్బంది పెడ్తున్నారేమోనని అనిపిస్తుంది. దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు.– వరలక్ష్మి, మహబూబ్ నగర్ మీ భర్త విషయంలో మీరు వివరించిన లక్షణాలు రాత్రి నిద్రలో కాళ్ళతో తన్నడం, కేకలు వేయడం, చేతులు కదిలించడం, పొద్దున దాని గురించి అసలేం గుర్తు లేకపోవడం... ఇవన్నీ ‘రెమ్ స్లీప్ బివేవియర్ డిజార్డర్’ అనే నిద్రకు సంబంధించిన రుగ్మతను సూచిస్తున్నాయి. ఈ సమస్యలో ఆ వ్యక్తి నిద్రదశలో కలల్లో వచ్చే విషయాలకు అనుగుణంగా వారికి తెలియకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారు. సాధారణంగా కలలు వచ్చే సమయంలో మన శరీర కండరాలు అచేతనమై ఉంటాయి. కానీ పైన చెప్పిన సమస్య ఉన్న వారిలో అలా జరగక΄ోవడం వల్ల వారు విపరీతంగా కదలడం, కాళ్ళతో చేతులతో కొట్టడం చేస్తారు. మీరు వెంటనే మీ భర్తను ఒక న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్ళి ‘స్లీప్ స్టడీ’ చేయించి ఈ రుగ్మతను నిర్ధారించుకోవాలి. కొన్ని మంచి మందులతో ఈ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్స మొదలయ్యే వరకు మీ భద్రత కోసం మీరు వేరే బెడ్పై లేదా వేరే గదిలో నిద్రిస్తే మంచిది. ఆయన నిద్ర΄ోయే ముందు మద్యపానం, కాఫీ, సిగరెట్ లాంటివి తీసుకోకుండా చూడండి. అన్నిటికీ మించి ఇది ఆయన అదుపులో లేని ఒక వైద్యసమస్య అని గుర్తించండి. ఆయన్ని కోపగించుకోకుండా, అర్థం చేసుకొని వైద్య చికిత్స చేయించండి! అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్!(చదవండి: మంచి పనిచేశా..! భారత్పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..) -
'బెస్ట్ డెసీషన్': భారత్పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
మన భారతదేశం ఖ్యాతీ ఖండాంతరాలకు కూడా చేరవవుతోంది. అందుకు నిదర్శనం ఇటీవల కాలంలో పలువురు విదేశీయలు పంచుకున్న తమ భారత పర్యటన అనుభవాలే. ప్రతి విదేశీయుడు ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తుంటే మనమే ఎంత గొప్పవాళ్లం అనిపిస్తోంది. అంతెందుకు మన భారతీయులే ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యి కూడా.. మళ్లీ ఇక్కడకు వచ్చేస్తున్నారు. మాతృభూమే గొప్పదని కితాబిస్తున్నారు. మనం పుట్టిన దేశం కాబట్టి మనకు నచ్చుతుంది. కానీ ప్రాంతాలు, భాష, సంస్కృతుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ విదేశీయలు ఈ వాతావరణాన్ని ఇష్టపడుతుండటమే అత్యంత విశేషం. తాజాగా ఆ కోవలోకి మరో డెన్మార్క్ మహిళ కూడా చేరింది. పైగా ఆమె ఎలాంటి ప్లాన్ చేయకుండానే భారత్కి వచ్చి మంచి పనిచేశానంటోంది. మరీ ఆమెకు అంతగా భారత్లో ఏం నచ్చాయో చూద్దామా..!.డెన్మార్క్ దేశ రాజధాని కోపెన్హాగన్లో నివశించే ఎస్మెరాల్డా అనే మహిళ భారత పర్యటను వెళ్లాలనే నిర్ణయం తీసుకుని మంచి పనిచేశానని అంటోంది. ఆ కోపెన్హాగన్ నగర వాతావరణంతో విసుగొచ్చేసిందని, మంచి మార్పుకావలని కోరుకున్నట్లు చెబుతోంది. అందుకోసమే తానెంతో ఇష్టపడ్డ స్నేహితులు, ఉద్యోగాన్ని, నాకిష్టమైన అపార్ట్మెంట్ తదితరాలన్నింటిని వదిలేసి మరీ భారత్ పర్యటనకు వచ్చేసిందట. ఇది తాను తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్ అని చెబుతోంది. వేసవిలో మాత్రమే కోపెన్హాగన్ సరదాగా ఉంటుందే తప్పా..మిగతా సమయాల్లో బోరుగానే ఉంటుందని వాపోతోంది. అంతేగాదు తన నగరాన్ని నిద్రాణమైన ప్రదేశంగా అభివర్ణిస్తోందామె. ఇక భారతదేశంలో రిషికేశ్ నుంచి గోవా, ముంబై అంతటా చేసిన పర్యటనల్లో పొందిన అనుభవాలను డాక్యమెంట్ చేసి మరీ..ఇన్స్టాగ్రాంలో వీడియో రూపంలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఎస్మెరాల్డా భారత్పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి, ప్రజల ఆదరణను ఎంతగానో కొనియాడింది. ఈ భారత పర్యటనలో తన గురించి తాను తెలుసుకోగలిగానంటోంది. ఇక్కడ ప్రకృతి, వైవిధ్య భరితమైన సంస్కతి తనను ఎంతగానో కట్టిపడేశాయంటోంది. అంతేగాదు భారతదేశం తనలోని కొత్తకోణాలను పరిచయం చేసిందట. ఇక్కడ జర్నీ ఓ అపూర్వ అనుభవాన్ని అందిచాయట. పైగా ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని కూడా అందించిందని అంటోంది. చివరగా ఈ భారత పర్యటన తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది. నిజానికి తాను యూరోపియన్ వేసవి సాహసయాత్రకు బయలుదేరే ముందు అనుకోకుండా భారతదేశ పర్యటనకు వచ్చానని, అనుకోకుండా ఇంకో నెల ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు వివరించింది. ఇలా ఆమె దాదాపు పది నెలలు భారత్లో గడిపిందట.అంతేగాదు వర్షాకాలంలో భారత్కి మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నట్లు కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. అంతేగాదు నెటిజన్లు కూడా ఆల్ది బెస్ట్ చెబుతూ..భారతదేశానికి వస్తూ ఉండండి అని ఆమెను ఆహ్వానిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Astrid Esmeralda 🧚🏽♀️ Solo traveler (@astrid__esmeralda) (చదవండి: Train With ATM: దేశంలోనే తొలి ఏటీఎం రైలు..! ఎక్కడంటే..) -
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
ముహూర్తాల కోసం వేచి చూస్తున్న వారికి తీపి కబురు అందింది. మండు వేసవిలో శుభఘడియలు వచ్చాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట ‘రారండోయ్..వేడుక చేద్దాం’ అంటున్నారు. వరుసగా మంచిరోజులు రావడంతో పెళ్లి మండపాలు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ ఏర్పడింది. పురోహితులు, వంట మనుషులు, వీడియో గ్రాఫర్లకు, ఆర్డర్లు తలుపు తడుతున్నాయి.ముహూర్తాలు ఇవే..ఏప్రిల్లో 16, 18, 20, 23, 30 తేదీల్లో, మే నెలలో 1, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 21, 23, 28, 30, 31 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు. జూన్ 11 నుంచి జూలై 12 వరకు మూఢం రావడంతో ముహూర్తాలకు కొంత విరామం వచ్చింది. తిరిగి మళ్లీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరంలో శుభముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లిళ్లు కూడా ఎక్కువగానే జరుగనున్నాయి.మూణ్నెళ్లు శుభఘడియలుమూడు నెలలపాటు ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ నెల 30న అక్షయ తృతీయ రావడంతో ఆరోజు దివ్యమైన ముహూర్తం ఉంది. నిశ్ఛయ తాంబూలాలు పుచ్చుకున్నవారు వేడుకలకు సిద్ధమవుతున్నారు.– గొల్లపెల్లి రామానందాచార్య స్వామి, వేదపండితులు(చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!) -
భారతీయ ఫేమస్ వంటకాన్ని మెచ్చిన జపాన్ రాయబారి..!
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్పై అందంగా ఒక బౌల్లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!) -
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
నిజాం పాలనలో రజాకార్ల దాడుల గురించి ముందస్తుగా ప్రజలకు తెలియజేయడానికి గ్రామాల్లో అప్పట్లో బురుజులు నిర్మించారు. బురుజులపై ఎల్లప్పుడూ ఒకరిద్దరు కాపలా ఉండేవారు. గ్రామం పొలిమేర వరకూ కనిపించడానికి బురుజుల చుట్టూ కిటికీ లాంటి నిర్మాణాలుండేవి. అక్కడి నుంచి రజాకార్ల రాకను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేవారు. ఈ కట్టడాలు మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నాయి. అవి నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవచూపి వీటిని అభివృద్ధి చేస్తే భావితరాలకు చరిత్రను తెలిపే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శామీర్పేట మండలం లాల్గడి మలక్పేటలో, ఘట్కేసర్ మండలంలో కొండాపూర్, అంకుషాపూర్, మర్పల్లిగూడలో, మేడ్చల్ మండలంలోని డబిల్పూర్, బండమాదారంలో, మేడ్చల్ పట్టణంలో నిజాం రాజుల గుర్రాల కోసం నిర్మించిన గుర్రపుశాల నేటికీ తహసీల్దార్ కార్యాలయంగా వినియోగంలో ఉంది. వందల ఏళ్లు గడిచినా.. ఆ కట్టడాలు కట్టి వందల ఏళ్లు గడుస్తున్నా నేటికీ చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 400 సంవత్సరాల క్రితం రాజులు పాలిస్తుండగా తరచూ చోరీలు జరిగేవి. దీంతో నాటి కాలంలో గ్రామాల నడిబొడ్డున పెద్ద రాతి కట్టడాలు (బురుజులు) నిర్మించారు. అనంతరం రజాకార్ల కాలంలో వారి ప్రవేశాన్ని గుర్తించేందుకు బురుజులను వినియోగించారు. నాటి సైనికుల విడిది కేంద్రం..నాడు మేడ్చల్ అటవీ ప్రాంతం కావడంతో రాజులు వేటకు వచ్చేవారు. మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయ భవనం సైనికుల విడిది కేంద్రంగా, చుట్టూ ఆవరణలో ఉన్న చిన్న చిన్న గదుల్లో గుర్రాలను కట్టించి ఉంచేవారు. తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న మేడ్చల్ పెద్ద మసీదును ప్రార్థనల కోసం నాడు నిర్మించినదే. కాలక్రమేణ నాటి గుర్రపు శాల నేడు మేడ్చల్ తహసీల్దార్ భవనంగా మారింది. (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!) -
వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!
హైడ్రేషన్.. వేసవిలో ఈ పదం మన ఆరోగ్యానికే కాదు, మన జీవితానికీ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లాంటి మెట్రో నగరాల్లో వేడి ఉష్ణోగ్రతలు, ట్రాఫిక్ కష్టాలు, ఎయిర్ కండిషనర్ల నీడలో గడిచే జీవితాలు.. ఇలాంటి కారణాలతో మన శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గుతుంది. దాదాపు 70 శాతం పైగా నీరుండే మానవ శరీరం డీహైడ్రేషన్తో తాత్కాలిక ఆరోగ్య సమస్యలు మొదలు ప్రాణాపాయ పరిస్థితులకూ చేరుకుంటుంది. ప్రధానంగా చిన్నారుల్లో, వృద్ధుల్లో ఈ సమస్య జటిలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పళ్లరసాలు వేసవి తాపానికి, దాహానికి, దేహానికి సహజమైన పరిష్కారాలను అందిస్తున్నాయి. హైడ్రేషన్ కోసం సహజమైన, రుచికరమైన, ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం అందిస్తున్నాయి. వేసవిలో సైతం పండే పండ్లలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల.. ఇవి తక్షణ హైడ్రేషన్ను కలిగిస్తాయి. ద్రాక్ష, మామిడి, కర్భూజ, పుచ్చకాయ, నేరేడు, నారింజ వంటి పండ్లు పోషక సమ్మేళనంగా రసాలతో పాటు విటమిన్స్, మినరల్స్ను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా విటమిన్–సీ, పొటాషియం, ఫైటో న్యూట్రియంట్స్ వంటి పోషకాలుంటాయి. ఇవి శరీరానికి జలాభిషేకం చేయడమే కాదు, హీట్ స్ట్రోక్, చెమట వల్ల వచ్చే అలసట, నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తాయి. డీహైడ్రేషన్ను ఎలా తగ్గిస్తాయి? వేసవి కాలంలో చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు (ఎలక్ట్రోలైట్స్) కోల్పోవడం సర్వసాధారణం. పళ్లరసాల్లో ఉండే సహజ పొటాషియం, సోడియం లాంటి ఖనిజాల వల్ల ఈ లోపాలను భర్తీ చేయడం సాధ్యపడుతుంది. ముఖ్యంగా నారింజ రసం శరీరానికి తక్షణ శక్తిని అందించగలవని ఆరోగ్య నిపుణుల సూచన. ముఖ్యంగా పుచ్చకాయ రసంలో 90 శాతానికి పైగా నీరు ఉండటంతో ఇది సహజ కూలెంట్గానూ పనిచేస్తుంది. కూల్ డ్రింక్స్ ఎందుకు మంచివి కావు? హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో అధికంగా వినియోగించే కూల్ డ్రింక్స్లో అధిక చక్కెర, కృత్రిమ రంగులు, కార్బన్డయాక్సైడ్ ఉంటాయి. ఇవి తాత్కాలికంగా శరీరానికి చల్లదనాన్ని కలిగించినట్టు అనిపించినా, అసలైన హైడ్రేషన్ను కలిగించవు. పైగా.. అధికంగా తీసుకుంటే మధుమేహం, దంత సమస్యలు, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక ప్రమాదాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయం కార్యాలయానికి లేదా ఇతర పనుల మీద బయలుదేరేముందు ఓ గ్లాసు తాజా పళ్ల రసం తీసుకోవడం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఈ పండ్ల రసాలు రోడ్ల మీద దొరికేవి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం శ్రేయస్కరం. షుగర్ లేని, ప్లాస్టిక్ ఫ్రీ, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మార్గం ఇదేనని వెల్నెస్ ట్రైనర్ల అభిప్రాయం. వేసవిలో శరీరాన్ని చల్లబరచాలంటే.. చల్లని నీళ్లు కాకుండా, ఆరోగ్యవంతమైన పళ్లరసాలు ఎంచుకోవడం ఉత్తమం. ఎండదెబ్బ నుంచి రక్షణనిచ్చే పళ్ల రసాలు మామిడి పానకం : సహజ చక్కెరతో, తేనెతో తయారు చేస్తే శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. నారింజ/మోసంబి రసం : విటమిన్–సీ అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పుచ్చకాయ రసం : శరీర ఉష్ణోగ్రత తగ్గించడంలో ఉత్తమమైనది. ద్రాక్ష రసం : హైడ్రేషన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తాజా కొబ్బరి నీరు : సహజమైన ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. (చదవండి: ఖరీదైన పండ్లకు కేరాఫ్గా భాగ్యనగరం..! ఏకంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చిలీ..) -
ఖరీదైన పండ్లకు కేరాఫ్గా భాగ్యనగరం..!
హైదరాబాద్ నగరానికి విదేశాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నాయి. న్యూజిలాండ్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, దక్షిణాఫ్రికా, చిలీ, ఆస్ట్రేలియా, చైనా, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, సౌదీ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫలాలు వస్తున్నాయి. ప్రధానంగా యాపిల్, కివీ, ప్లం, పియర్, డ్రాగన్, ఖర్జూర, చెర్రీ వంటి ఖరీదైన పండ్లు విదేశాల నుంచి హైదరాబాద్కు వస్తున్నాయి. విదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వెరైటీల పండ్లు సరఫరా అవుతున్నాయి. కొన్ని ప్రూట్స్ ఏడాది పొడవునా..మరికొన్ని సీజన్ వారీగా విపణిలో అందుబాటులో ఉంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా అరటి, నారింజ, దానిమ్మ, నల్ల ద్రాక్ష, పైనాపిల్, జాక్ ఫ్రూట్ వంటివి దిగుమతి అవుతున్నాయి. మోసంబీ, సీతాఫలం, బొబ్బాయి, మామి డి, జామ, పుచ్చకాయ వంటి పండ్లు రంగారెడ్డి, వికారాబాద్లతో పాటు మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో సాగవుతున్నాయి. హైదరాబాద్లో ప్రధానంగా బాటసింగారం, మోజంజాహీ, గుడిమల్కాపూర్, బోయిన్పల్లి పండ్ల మార్కెట్లు ముఖ్యమైనవి. పోషక అవసరాలను తీర్చడంలో ఉద్యానవన ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా తర్వాతి నుంచి ప్రజల ఆహార అలవాట్లలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఒత్తిడి, బిజీ పనుల కారణంగా ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి. దీంతో పండ్లు, కూరగాయల వినియోగం పెరిగింది. దీంతో రైతులు కూడా వైవిధ్యమైన తోటలను సాగు చేస్తున్నారు. మరోవైపు ఉద్యానవన సాగుతో కార్మిక శక్తికి ఉపాధి అవకాశాలను అందించినట్లవుతుంది. బాటసింగారం మార్కెట్లోకే 2023–24లో 4,65,633 టన్నుల పండ్లు దిగుమతి అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం తెలిపింది. రంగారెడ్డిలో 94 వేల ఎకరాల్లో సాగు.. గ్రేటర్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఉష్ణమండలం, సహజ వనరులు, అనువైన నేలలతో పాటు విస్తారమైన భూమి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 94,139 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలోని మొత్తం పంట విస్తీర్ణంలో ఉద్యానాల సాగు విస్తీర్ణం వాటా 30–40 శాతం వరకు ఉంటుంది. ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి, జామ, తీపి నారింజ, దానిమ్మ, ఆమ్ల నిమ్మ, పుచ్చకాయ ప్రధానంగా సాగు అవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఉద్యానవన పంటలు లాభదాయకయమైన రాబడిని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాసెసింగ్ పరిశ్రమకు ముడి పదార్థాలను అందించడం, ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం వంటి కారణాలతో గణనీయమైన ప్రాముఖ్యతను పొందుతుంది.ఖరీదు ఎక్కువే.. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఖరీదైనవే ఉంటున్నాయి. డ్రాగన్, కివీ, ఖర్జూర, చెర్రీ వంటి పండ్లు ఎక్కువ ధర పలుకుతుండగా.. సాగు, సీజన్ను బట్టి మామిడి, యాపిల్, దానిమ్మ ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి. నగరంలో డ్రాగన్ ఫ్రూట్ ధర క్వింటాల్కు రూ.1,13,610లుగా ఉండగా.. పియర్ రూ.30 వేలు, కివీ రూ.18,471, చెర్రీ రూ.24,975, నల్ల ద్రాక్ష రూ.17,344, ఖర్జూర రూ.16,100, మామిడి రూ.13,338, యాపిల్ రూ.15,927, దానిమ్మ రూ.14,225లుగా ఉన్నాయి. ఇక సపోటా, మోసంబీ, బొప్పాయి, నారింజ, అరటి వంటి లోకల్ ఫలాలు ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. వీటి ధరలు రూ.2 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉన్నాయి.(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!) -
అలాంటివి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు..!
నేను ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాను. పెరిమెనోపాజ్ స్టేజ్లో ఉన్నాను. దాంతో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. ఆ సమయంలో చికాకుగా, ఆందోళనగా... ఎవరైనా ఏమైనా అంటే కొట్టాలన్నంత కోపంగా ఉంటుంది. మొదటి రెండు రోజులూ ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటాయి. దాంతో నావల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను డేట్ రాగానే లీవ్ పెడుతుంటాను. అయితే ఈ విషయమై కొందరు నా గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. కొందరైతే ఆ డేట్స్ గుర్తు పెట్టుకుని మొహం మీదే నువ్వు ఇంకా సెలవు పెట్టలేదేంటి అని వెకిలిగా అడుగుతుంటారు. నాకు చాలా బాధగా ఉంది. దీని గురించి నేను ఏమీ చేయలేనా? సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, హైదరాబాద్ 2013 పీఓఎస్హెచ్ చట్టం ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి లేదా అనేక అవాంఛనీయ(అంగీకార యోగ్యం కాని) చర్యలు లేదా ప్రవర్తన/వైఖరి ‘‘లైంగిక వేధింపు’’గా పరిగణించబడుతుంది:1. శారీరక సంప్రదింపు (కొరకు) పురోగతి, 2. లైంగిక ప్రయోజనాలు కోరటం/అభ్యర్థించడం లేదా డిమాండ్ చేయటం, లేదా3. లైంగిక స్వభావం కలిగిన వ్యాఖ్యలు చేయటం, లేదా4. అశ్లీల చిత్రాలను చూపించటం లేదా5. మరే ఇతర లైంగిక స్వభావం కలిగిన అవాంఛనీయ (ఆమోదయోగ్యం కాని) శారీరక, మౌఖిక లేదా సైగల ద్వారా ప్రదర్శించటం.ఒక స్త్రీ తన మెనోపాజ్ దశలో ఎదుర్కొనే అనేక శారీరక – మానసిక మార్పులు, మూడ్ స్వింగ్స్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆ కారణంగా స్త్రీ పట్ల వివక్ష లేదా శిక్షపూరిత చర్యలు తీసుకోవటం, అనుచితంగా (ఇన్సెన్సిబుల్) వ్యవహరించడాన్ని కూడా లైంగిక వేధింపుగానే పరిగణించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 స్ఫూర్తి కూడా ఇదే! మీరు ఏం భయపడకుండా దీనిమీద మీ బాస్కి చెప్పి చూడండి. ఒకవేళ మీ పై అధికారులే మిమ్మల్ని కామెంట్ చేస్తూ బాధపెడుతుంటే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: Japanese Tradition: ‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!) -
‘ఉచిమిజు’..మండు వేసవిలో కూడా చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు..!
జపనీయులు సాంకేతికంగా ఎంత ముందు ఉన్నా సంప్రదాయ పద్ధతులకు మాత్రం వీడ్కోలు చెప్పలేదు. అందులో ఒకటి... ఉచిమిజు. ‘ఉచి’ అంటే కొట్టడం లేదా తాకడం. ‘మిజు’ అంటే నీరు. ‘ఉచిమిజు’ అంటే నీటితో భూమిని తాకడం.వేడి వేసవి నెలల్లో ‘ఉచిమిజు’ అనేది సాధారణ దృశ్యం. వీధులు, బహిరంగ ప్రదేశాలలో నీటిని చల్లుతారు. ‘ఉచిమిజు’తో నీటి బాష్పీభవనం ద్వారా చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తారు. ఈ పద్ధతి గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది.గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘ఉచిమిజు’ను ప్రోత్సహించడానికి ప్రభుత్వంతో పాటు పర్యావరణ సంస్థలు నడుం బిగించాయి. వేసవిలో సామూహిక ఉచిమిజు కార్యక్రమాలు నిర్వహిస్తారు.యుకాటా, జీన్బీ అనేవి జపనీస్ వేసవి దుస్తులు. కంఫర్ట్, వెంటిలేషన్ వీటి ప్రత్యేకత. కాటన్తో తయారు చేసే ఈ సంప్రదాయ దుస్తులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.సంప్రదాయ సుడేర్ స్క్రీన్లు శతాబ్దాలుగా జపనీస్ గృహాలలో అంతర్భాగం అయ్యాయి. వెదురు పలకలు, నాచులతో కలిపి అల్లిన స్క్రీన్లు ఇవి. వేసవి నెలల్లో తీవ్రమైన వేడి ప్రభావం ఇంటి లోపలి భాగాలపై పడకుండా సుడేర్ స్క్రీన్లు ఉపయోగిస్తారు. ఇవి వేడి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు కళాకృతులుగా కూడా ఆకట్టుకుంటాయి. (చదవండి: హాట్సాప్ అన్నపూర్ణ ..! రియల్ ‘లేడి సింగం’) -
'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..!
ప్రపంచ అపరకుభేరుడు, మైక్రోసాఫ్ట్ విండోస్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ దంపతులు అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి స్వస్థి చెబుతూ విడిపోయారు. అయితే దీన్ని అతిపెద్ద విచారంగా పేర్కొన్నారు బిల్గేట్స్. ఆ వ్యాఖ్యలపై ఎప్పుడు స్పందించలేదు మెలిండా ఫ్రెంచ్ గేట్స్. అయితే ఆమె తొలిసారిగా విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెలిండా తన మాజీ భర్త బిల్గేట్స్ మాటలకు నేరుగా స్పందించకపోయినప్పటికీ..పరోక్షంగా సమాధానమిచ్చారు. "అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవంచలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అవసరంగా అభివర్ణించారు. అయితే బిల్గేట్స్ వ్యాఖ్యలపై మాట్లాడనని నిర్మోహటంగా చెప్పేశారు. ఎందుకంటే అతనికి తనకంటూ సొంత జీవితం ఉంది. ఇప్పుడు నా జీవితం నాకు ఉంది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి విడాకులు అనేది భావోద్వేగ భారం అన్నారు." ఎందుకంటే ఆ సమయంలో తానెంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. వివాహం విడిచిపెడుతున్నప్పుడు..చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఆ సమయంలో జరిగే చర్చలన్నీ కఠినంగా ఉంటాయన్నారు. 2014లో గేట్స్తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అచ్చం అలాంటి భాధ, తీవ్ర భయాందోళనలు కలిగాయని అన్నారు. అలాంటి సమయంలో వెంటనే ఇది సరైనది కాదా అని సానుకూలంగా ఆలోచించి..త్వరితగతిన బయటపడాలి లేదంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుందన్నారు. ఆ తర్వాత తాను నెమ్మదిగా దాని విలువ అర్థం చేసుకుని నిశబ్దంగా నిష్క్రమించానన్నారు. అలాగే ఇక్కడ భయాందోళనలకు గురవ్వడం అంటే తాను దెబ్బతిన్నట్లు కాదని కూడా చెప్పారు. ఇక్కడ తాను గుర్తించాల్సిన కొన్ని కష్టమైన విషయాలను ఎదుర్కొన్నానని అందువల్ల తనకు విడిపోవడం అనేది తప్పనిసరి అంటూ మెలిండా విడాకుల తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. కాగా, ఈ జంటకు జెన్నిఫర్(28) రోరీ(25), ఫోబ్(22)లు ఉన్నారు. అంతేగాదు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇక బిల్గేట్స్ 2022 నుంచి మాజీ ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో లేటు వయసు విడాకులు ఎక్కువఅవుతున్నాయి. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత తాము ఏం కోల్పోయామో వెతుకుతూ విడిపోతున్నారు. మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..ఎంతోమంది సెలబ్రిటీలు, ప్రముఖులు పిల్లలు సెటిల్ అయిపోయాక విడిపోతున్నారు. మాకు స్పేస్ కావాలని కొందరూ..ఇనాళ్లు తన ఉనికే కోల్పోయానని కొందరూ అంటున్నారు. అన్నేళ్లు కలిసి ఉండటానికి.. బాధ్యతలు, పిల్లలు వంటి తదితర కారణాలే గానీ ఎప్పుడో వాళ్ల మధ్య బంధం విచ్ఛిన్నమైందని, అందువల్లే ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదీఏమైనా..ఆ పరిస్థితి ఎదురవ్వక ముందే భాగస్వాముల్లో ఎవ్వరో ఒక్కరో దీన్ని గుర్తించి తమ బంధాన్ని కాపాడుకునే యత్నం చేయాలంటున్నారు. అలాగే మనతో సాగే సహచరులను నిర్లక్ష్యం చేస్తే..వాటి పర్వవసానం చివర్లో ఇలానే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి వయసులో కంటే వృద్ధాప్యంలోనే తోడు ఉండాలని ఆ సమయంలోనే.. అసలైన దాంపత్యం ఇరువురి నడుమ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఒర్రీ వెయిట్లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?) -
విటమిన్-డి... ఈ ఐదు విషయాలు తెలుసా?
విటమిన్ డి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. దీని లోపం వల్ల శక్తిస్థాయిలు క్షీణించి అలసటకు దారితీస్తుంది. రోగనిరోధకవ్యవస్థ పనితీరుకు కీలకమైనది ఇదే. అందువల్ల ఈ విటమిన్ లోపిస్తే అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు పరిశోధనలు సైతం ఈ విటమిన్ లోపిస్తే..ఆందోళన, డిప్రెషన్తో సహా మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉందని వెల్లడించాయి కూడా. అంత ప్రాముఖ్యత ఉన్న విటమిన్ డికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఇది కేవలం విటమిన్ మాత్రమే కాదు. కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న కాల్సిట్రియోల్ అనే హార్మోన్కు పూర్వగామిగా పిలుస్తారు. ఎముకల బలానికి ప్రసిద్ధి చెందినప్పటికీ..ఇది కండరాల పనితీరు, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ విటమిన్ సూర్యరశ్మిలో పుష్కలంగా దొరుకుతుంది. సహజంగా సులభంగా పొందగలిగే విటమిన్ ఇది. అంతేకాదండోయ్ సూర్యకాంతి నుంచి వచ్చే యూవీబీ కిరణాలకు గురైనప్పుడు..శరీరం ఆటోమేటిగ్గా 'డి'ని ఉత్పత్తి చేస్తుందట. అందువల్ల ఆరోగ్యం కోసం బహిరంగ కార్యకలాపాలు తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆహారంలో కూడా ఉంటుంది ఈ విటమిన్ డి. ముఖ్యంగా కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, సూర్యరశ్మికి గురయ్యే పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుందట. విచిత్రం ఏంటంటే ఇంతలా సమృద్ధిగా సూర్యరశ్మి భారత్లో ఉన్నప్పటికీ..ప్రతి ఐదు మంది భారతీయులలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.2023 నివేదికల ప్రకారం..భారతదేశ జనాభాలో దాదాపు 76% మంది ఈ విటమిన్ లోపంతోనే బాధపడుతున్నారుట. అందులో పురుషులు 79% మంది కాగా, స్త్రీలు 75% కావడం గమనార్హం. అలాగే 84% మంది పాతికేళ్ల వయస్సు కంటే తక్కువగా ఉన్న యువతే ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా వదోదర, సూరత్, జైపూర్, కోల్కతా, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. (చదవండి: ఒర్రీ వెయిట్లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?) -
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?
స్మార్ట్గా..అందంగా కనిపించడం అనేది మోడళ్లు, సినీతారలు ప్రముఖులకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్నైట్ స్టార్లుగా మారుతున్న వాళ్లు సైతం అదే బాటపడుతున్నారు. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఏం సమస్య లేదు. తక్కువ సమయంలో సన్నగా మారిపోవాలనుకుంటేనే.. ఆరోగ్యమే చిక్కుల్లో పడుతుంది. చాలామంది ఏదీఏమైనా పర్లేదు అంటూ రిస్క్ చేసి మరీ తప్పుడు డైటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకోసం శరీరాన్ని ఎంతలా కష్టపెడుతున్నారంటే..కేవలం వర్కౌట్లు కాదు, ఆహారం పరంగా శరీరం శుష్కించిపోయేలా చేస్తున్నారు. అవి వింటే.. బరువు తగ్గడం కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. ఆకృతికి ఇంత ప్రాముఖ్యత..? అనిపిస్తుంది కూడా. ఒర్రిగా ప్రసిద్ధిచెందిన కంటెంట్ క్రియేటర్ సైతం ఇలాంటి పనులే చేసి బరువు తగ్గాడట. అతడు బరువు తగ్గే క్రమంలో అనుసరించిన విధానాలు తెలిస్తే..నిజంగానే వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందులో నో డౌట్.ఒర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి అనే కంటెంట్ క్రియేటర్ 2023 ప్రారంభం వరకు 70 కిలోల బరువుతో ఉండేవాడు. చూడటానికి కొద్దిగా లావుగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఫేమస్ కావడంతో టీవీ షోల్లో కనిపించేందుకు స్మార్ట్గా ఉండక తప్పదు. అందుకోసం అతను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకునేవాడట. అలా చేసుకుంటే కాసేపటి వరకు వాంతి వస్తున్న ఫీలింగే ఉండి.. తిన్న ఆహారం అంతా బయటకొచ్చేస్తుంది. తద్వారా నీరసించి బరవు తగ్గేవాడట. అలా వాంతులు చేసుకుని చివరకు టాయిలెట్లో నిద్రపోయేవాడట. దాంతో మెడనొప్పితో ఇబ్బందిపడేవాడినంటూ తన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎలా మొదలయ్యాయో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో. బరువు తగ్గడం కోసం ఓజెంపిక్ లాంటి మందులు వాడొచ్చు. అయితే అది ఛీటింగ్ అవుతుందే తప్ప బరవుతగ్గడం కాదనే నమ్ముతా అంటున్నాడు ఒర్రీ. అయితే తన దృష్టిలో బరువు తగ్గడానికి అదే బెస్ట్ అని కితాబిస్తున్నాడు. కాగా, ఒర్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేయడమే గాక . ఓ సామాజిక కార్యకర్త కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సెలబ్రిటీల పార్టీల్లో మెరుస్తుంటాడు. అలాగే బాలీవుడ్ టీవీ షోల్లో తళ్లుకుమంటుంటాడు. ఎంత ప్రమాకరమైనదంటే..తనను తాను ఆకలితో అలమటింపచేసుకునేలా పదేపదే వాంతులు చేసుకోవడం అనే ప్రక్రియ అత్యంత హానికరమైనదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శారీరకంగా మానసికంగా అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణశయాంతర సమస్యలు, గుండెకు సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అంతేగాదు ఆకలి శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలను బలహీనపరిచి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని అన్నారు. కెరీర్లో విజయం సాధించడానికి ఎలా షార్ట్కట్లు ఉండవో అలాగే బరువు తగ్గడంలో కూడా ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సన్నగా మార్చినప్పటికీ..రాను రాను చిరాకు, ఒత్తిడి, వంటి వాటికిలోనై మొత్తం శరీరం పనితీరుపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అందువల్ల ఇలాంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తూ..ఆరోగ్యప్రదంగా బరువు తగ్గే వాటిని అనుసరిస్తే అన్ని విధాల మేలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
ఇదేం ఫిట్నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు
మంచి మంచి రీల్స్తో ఆకట్టుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్సర్లు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం చాలా రిస్క్ తీసుకుంటారు. అది వాళ్ల అభిరుచి కావొచ్చు కూడా. కానీ ఆ రీల్స్ ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు. అవి ఆరోగ్యదాయకంగానూ, ఆహ్లాదంగానూ ఉండాలి. అయితే ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అత్యుత్సాహంతో మరింత క్రియేటివిటీ కోసం చేసిన పని విమర్శలపాలు చేసింది. చివరికి నెటిజన్ల ఆగ్రహానికి గురైందిఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఢిల్లీకి చెందిన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కొత్త ట్రెండ్ సెట్చేసే క్రమంలో డేరింగ్ స్టంట్ రీల్ చేసేందుకు రెడీ అయిపోయింది. అయితే ఆమె అది ఎలాంటి సాహసోపేతమైన స్టంట్ అనేది పరిగణించలేదు. కేవలం వ్యూస్, క్రేజ్ కోసం ఏకంగా స్పీడ్గా దూసుకపోతున్న రైలు పక్కనే పరిగెడుతున్నట్లు చేసిన వీడియోని షేర్చేసింది. అందులో రైలు ఆమెను దాటి వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పైగా "రైలుతో పరుగు'అనే క్యాప్షన్ని జత చేసి మరీ పోస్ట్ చేయడంతో మరింత ఆగ్రహం తెప్పించేలానే కాకుండా తప్పుదోవ పట్టించేలా కూడా ఉంది. అసలు ఇది ఫిట్నెస్ అవేర్నెస్ లేక ఎంత రిస్క్ చేసి అయినా ప్రాణాలు పోగొట్టుకోవడమెలా? అని సందేశం ఇస్తున్నావా..? అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. డేరింగ్ స్టంట్కి అర్థమే మార్చేస్తున్నారా కథా..! మీరు అని మరొకందరూ విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. డేరింగ్ స్టంట్ అంటే కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా ఉండాలి గానీ ఇదేంటిరా బాబు అని తలపట్టుకునేలా ఉంటే ఇలానే ఉంటుందేమో..!.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..:(చదవండి: ఖండాంతరాలు దాటిన నృత్యం) -
పిల్లల ఇష్టాలను గుర్తించకపోతే నష్టమే..!
గూడూరుకు చెందిన రాజేష్కు ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషియల్పై మంచి పట్టుసాధించాడు. గ్రూప్సు రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. ఇష్టం లేని గ్రూపును సరిగా చదవలేక ఫెయిలయ్యాడు. తిరుపతికి చెందిన విద్యాసాగర్కు చిన్నతనం నుంచే చార్టెడ్ అకౌంటెంట్ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో తమ కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. తమ అభిప్రాయాన్ని పిల్లాడిపై రుద్ది బలవంతంగా ఎంపీసీలో చేరి్పంచారు. అయిష్టంతోనే ఎంపీసీ పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూపును తీసుకున్నాడు. పుత్తూరుకు చెందిన దీపికకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకేమో తన కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. డాక్టరును చేయాలనే తపనతో బైపీసీలో బలవంతంగా చేరి్పంచారు. పాస్మార్కులతో గట్టెక్కెడంతో మెడిసిన్లో సీటు రాలేదు. అప్పటికిగాని తల్లిదండ్రులు తమ తప్పును తెలుసుకోలేకపోయారు.సూళ్లూరుపేటకు చెందిన మనోజ్కుమార్ సాధారణ విద్యార్థి. పదోతరగతి పాస్ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కావడంతో ఇంటర్ తప్పాడు. ఏం చేయాలో తెలియక చదువును పక్కనబెట్టాడు. వీరే కాదు.. ఇలా తిరుపతి జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆ ఒక్క జిల్లాలోనే కాదు చాలాచోట్ల ఇదే పెను సమస్య. ఇష్టమైన సబ్జెక్టుపై మక్కువ పెంచుకుని అందులో రాణించాలనుకున్న చాలా మంది విద్యార్థులకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలతో రాణించలేకపోతున్నారు. ఇంటర్ ప్రవేశం సమయంలో తల్లిదండ్రుల బలవంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. తిరిగి సాధారణ చదువులను కొనసాగిస్తున్నారు. విద్యార్థి దశలో ఇంటర్ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తిని తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలు వారు కలలుగన్న రంగంలో రాణించగలుగుతారు. ఇష్టాన్ని గుర్తించాలి పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమ కోర్కెలను పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. స్వేచ్ఛనివ్వాలి జిల్లాలో పదోతరగతి పరీక్షలను ఈ ఏడాది 52,065మంది విద్యార్థులు రాశారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి వంటి పోటీ పరీక్షల ద్వారా ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. అంతేతప్ప ఇష్టాలను రుద్దడం చేయకూడదని, గ్రూపుల ఎంపికలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలని నిపుణులు చెబుతున్నారు. నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి పది తరువాత ఇంటర్ ప్రవేశంలో పిల్లలకే స్వేచ్ఛనివ్వాలి. వారికి నచ్చిన గ్రూపులో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరిపెట్టుకోవాలి. అంతేతప్ప ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చుతూ బలవంతం చేయకూడదు. –డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి, విద్యావేత్త, తిరుపతి బలవంతం వద్దు పిల్లల చదువు విషయంలో పెద్దలు బలవంతం చేయకూడదు. మన ఆలోచనలను వాళ్లపై రుద్దకూడదు. సమాజంలో ఇంజినీరింగ్, మెడిసిన్ రంగాలే కాదు... ఇంకా న్యాయ, విద్య, మేనేజ్మెంట్ వంటి చాలా రంగాలున్నాయి. తగిన కోర్సులకు ప్రాధాన్యత ఇస్తేనే వారు రాణించగలుగుతారు. – శ్రీధర్, కెరీర్ గైడెన్స్ నిపుణులు, తిరుపతి (చదవండి: ఖండాంతరాలు దాటిన నృత్యం) -
ఖండాంతరాలు దాటిన నృత్యం
దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ ప్రదర్శనలు చేస్తూ భారతదేశ ప్రాచీన నాట్య కళలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని భరత, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు. ప్రముఖ నాట్యాచారిణి నల్లా రమాదేవి శిక్షణలో తర్ఫీదు పొందుతున్న శ్రీవారి పాదాలు భరత నాట్య, కూచిపూడి అకాడమీ విద్యార్థినులు దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలే వేదికగా పలు ప్రదర్శనలు చేసి గుర్తింపు పొందారు. రెండేళ్లుగా వివిధ దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు చేసి భారతీయ కళలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. కొద్ది నెలల్లో అమెరికాలోని చికాగో, డల్లాస్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం 2015లో వెస్ట్ మారేడుపల్లిలో నల్లా రమాదేవి ప్రారంభించిన శ్రీవారి పాదాలు భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఎందరో ప్రతిభావంతులైన నృత్య కళాకారులను అందించింది. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మందిలో 120 మంది సుశిక్షితులైన నృత్య కళాకారులుగా రాణిస్తున్నారు. ఇందులో 25 మంది కళాకారులు దేశ విదేశాల్లో నృత్య కళాశాలలు ఏర్పాటు చేసుకుని శిక్షణ ఇస్తుండడం ఈ డ్యాన్స్ అకాడమీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నాలుగేళ్ల కోర్సు అనంతరం, డిప్లొమా, పీజీ వరకూ సరి్టఫికెట్ కోర్సులు పొందే విధంగా ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం 200 మంది బాలికలు కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందుతున్నారు. నాలుగేళ్ల బాల్యం నుంచి పీజీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసేంత వరకూ ఈ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. జ్యోతిర్లింగాల నుంచి తొలి అడుగు.. ఇక్కడ శిæక్షణ పొందుతున్న విద్యార్థులు నృత్య గురువు నల్లా రమాదేవి నేతృత్వంలో నగరంలో పలు ప్రదర్శనలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో నాట్య ప్రదర్శనలు చేయడం మామూలైన నేటి తరుణంలో ఏదైనా ప్రత్యేకతను సొంతం చేసుకోవాలన్న తపన మేరకు ప్రత్యేక ప్రదర్శనల కోసం జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను వేదికలుగా శ్రీవారి పాదాలు నృత్య అకాడమీని ఎంచుకున్నారు. అంతర్జాతీయ ప్రదర్శనలు.. ఇస్కాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కృష్ణభగవాన్ దేవాలయాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలు చేసిన అకాడమీకి చెందిన కళాకారులు అనేక పురస్కారాలు అందుకున్నారు. నృత్య కళకు సార్థకం చేకూర్చాలన్న తపనతో ఇప్పటి వరకూ 15 అష్టాదశ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాల ముందు ప్రదర్శనలు చేశారు. మలేషియా, ఇండోనేషియా, నేపాల్, బ్యాంకాగ్, దుబాయ్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాల్లో బతుకమ్మ, శివతాండవం వంటి నృత్య రూపకాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఏడాది మే నెల్లో అమెరికాలో నృత్యరూపకాల ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. నాట్యం అంటే చిన్ననాటి నుంచే ప్రాణం. భద్రాచలంలో పెరిగిన నేను అక్కడే నాట్యగురువు గిరిజాదేవి వద్ద నాట్యం నేర్చుకుని, భద్రాద్రి రాముడి సన్నిధిలోనే అరంగేట్రం చేశాను. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుని కళాశాల విద్య వరకూ భద్రాద్రి పరిసర ప్రాంతాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చా. అయితే పదిహేనేళ్ల క్రితం భద్రాచలం నుంచి హైదరాబాద్కు మా కుటుంబంతో షిఫ్ట్ అయ్యాం. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరినా సంతృప్తి కలగలేదు. నాట్యంపై మమకారంతో ఉద్యోగం వదిలి పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో డ్యాన్స్ సర్టిఫికేషన్ కోర్సులో చేరి మరింత తర్ఫిదు పొందాను. డాక్టర్ ఇందిరాహేమ సహకారంతో శ్రీవారి పాదాలు పేరుతో డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాను. నల్లా రమాదేవి, శ్రీవారి పాదాలు డ్యాన్స్ అకాడమీ నిర్వాహకురాలు (చదవండి: -
కొత్త శిఖరాలకు కో-వర్కింగ్..!
వేర్వేరు కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఒకే చోట ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడమనే కో–వర్కింగ్ స్పేస్ కాన్సెప్ట్ నగరంలో విజృంభిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఊతమిచ్చేలా కో–వర్కింగ్ స్పేస్ అందించే సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యకు చేరుకోవడం విశేషం. అత్యంత అధునాతన ఆఫీసులను డిజైన్ చేసి, సంస్థ అవసరాలను బట్టి కనీసం ఐదుగురి నుంచి 500 మంది ఉద్యోగుల వరకూ అవసరమైన స్పేస్ను కో–వర్కింగ్ స్పేస్ ఆఫర్ చేసే సంస్థలు అందిస్తున్నాయి. వర్క్ స్టేషన్కి ఇంత చొప్పున స్థలాన్ని కేటాయించి, దానికి అనుగుణంగా వీరు చార్జ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆఫీస్కు సంబంధించి ఏ బాదర బందీ సదరు కంపెనీకి ఉండదు. సెక్యూరిటీ మొదలు పెడితే.. క్యాబిన్స్, సర్వర్ రూమ్స్, సర్వర్ ర్యాక్స్, ఇంటర్నెట్, కెఫెటేరియా, లాబీస్పేస్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఇలా.. ప్రతిదీ అందుబాటులో ఉంటాయి. సేవలు అందించడానికి అవసరమైన మ్యాన్ పవర్ సైతం సిద్ధంగా ఉంటుంది. సంస్థ ఉద్యోగుల సంఖ్య పెరిగినా కేవలం 15 రోజుల వ్యవధిలో పెరిగిన ఉద్యోగులకు సరిపడా స్పేస్ విస్తరింపజేస్తారు. రెడీమేడ్ ఆఫీసులకు ఊతం.. ‘ఈ రోజు బిజినెస్ ఐడియా వస్తే.. రేపు కంపెనీ అనౌన్స్ చేసేయడానికి ఈ రెడీమేడ్ ఆఫీసులు సహకరిస్తాయి. కొన్నేళ్ల క్రితం కొండాపూర్లో 12,500 చదరపు అడుగుల్లో 200 సీటింగ్ కెపాసిటీతో కో–వర్కింగ్ స్పేస్ స్టార్ట్ చేస్తే అది కేవలం రెండు నెలల్లో ఫిలప్ అయిపోయింది. ఆ తర్వాత బంజారాహిల్స్లో 95వేల చదరపు అడుగుల్లో 1800 సీటింగ్ కెపాసిటీ ఉన్నది ఏర్పాటు చేశాం. స్టార్టప్స్కి అకౌంటింగ్, జీఎస్టీ రిటర్న్స్ తదితర అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తున్నాం. ప్రస్తుతం మేం అందిస్తున్న స్పేస్లో వందలాది కంపెనీలు ఆఫీసులు నిర్వహిస్తున్నాయి’ అంటూ వివరించారు ఐ స్ప్రౌట్స్ నిర్వాహకులు సుందరి. ఇంతింతై..స్పేస్ కొండంతై.. ప్రారంభంలో ఈ కాన్సెప్ట్ సృజనాత్మక రచయితలు, ఆర్టిస్టులు, ఫ్రీలాన్సర్లకే పరిమితమైంది. అయితే ఐటీ, ఎంఎన్సీలు, స్టార్టప్లు కో–వర్కింగ్లోకి రంగప్రవేశం చేయడంతో ఈ ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత కంపెనీలు స్టార్టప్లలో ఫ్లెక్సీ వర్క్స్పేస్ కాన్సెప్్టకు ఆదరణ పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకారం, దేశంలోని టాప్–7 నగరాల్లో మొత్తం 20.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్లో, కో–వర్కింగ్ స్పేస్ వాటా దాదాపు 25%గా ఉంది. కేఫ్స్, హోటల్స్, మాల్స్లోనూ.. కో–వర్కింగ్ ప్లేస్లు ఇప్పుడు నగరాల్లోని మాల్స్, హోటల్స్, కేఫ్స్కు కూడా విస్తరించడం గమనార్హం. ఇటీవలే వియ్ వర్క్ అనే గ్లోబల్ కంపెనీ, అమీర్పేటలోని ఎంపీఎమ్ మాల్లో తమ కో–వర్కింగ్ స్పేస్ను ప్రారంభించింది. అలాగే నగరంలో 25 సెంటర్స్ను నిర్వహిస్తున్న బ్రాండ్.. ‘ఆఫీస్(ఏడబ్ల్యూఎఫ్ఐఎస్)’ ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 40,000 సీటింగ్ను జోడించడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ను స్మార్ట్వర్క్స్ కో–వర్కింగ్ స్పేసెస్ ఇటీవలే లీజుకు తీసుకుంది.పోటాపోటీగా వసతులు.. ఈ కో–వర్కింగ్ స్పేస్లోకి కంపెనీలు ఆకర్షించడానికి పేరొందిన జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ‘మా కో–వర్కింగ్ స్పేస్లో కనీసం 300 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ, ప్రైవేట్ క్యాబిన్లు, డెడికేటెడ్ డెస్క్లు, హాట్ డెస్క్లు, మీటింగ్ రూమ్లు, కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. మా టీమ్ ప్రతిరోజూ నిర్వహణా బాధ్యతల్ని పర్యవేక్షిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది’ అని నగరంలో కో–వర్కింగ్ స్పేస్ నిర్వహిస్తున్న స్ప్రింట్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. దేశంలో మనమే ముందు..నగరంలోని ఆఫీస్ మార్కెట్ గతేడాది ప్రథమార్ధలోనే 50 లక్షల చదరపు అడుగుల లీజును దాటేసింది. హైటెక్ సిటీ, గచి్చబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు వర్క్స్పేస్ల కోసం పెరుగుతున్న డిమాండ్కు అద్దం పడుతున్నాయి. దేశంలో ఫ్లెక్సిబుల్ కో–వర్కింగ్ స్పేస్లను అందించడంలో హైదరాబాద్ ముందుందని ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో స్థలాలకు వ్యయం చాలా తక్కువని ఆయన అంటున్న మాట. పాశ్చాత్య దేశాల్లోని పలు నగరాల్లో దాదాపు 50 శాతం కో–వర్కింగ్ స్పేస్లే ఆక్రమించాయి. ప్రస్తుతం నగరంలో వీటి విజృంభణ చూస్తుంటే భవిష్యత్తులో వాటి సరసన మన నగరమూ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.