Nagarkurnool
-
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
● ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పోషణ్ పక్వాడా ● 22 వరకు అంగన్వాడీల్లో వారోత్సవాలు ● పౌష్టికాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కందనూలు: జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని గుర్తించి.. నివారించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమాలు 22 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు 4,692, బాలింతలు 4,462, ఐదేళ్లలోపు చిన్నారులు 41,993 మంది ఉన్నారు. తల్లిపాల ఆవశ్యకత.. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శిశువు జన్మించిన మొదటిరోజు వెయ్యి రోజుల వరకు ప్రాముఖ్యతను వివరించడం, పౌష్టికాహారం లోపంతో ఉన్న చిన్నారులను గుర్తించడం, అనుబంధ పోషకాహారం కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేస్తారు. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గర్భిణుల బరువు తీయడం, గర్భిణుల సంరక్షణపై భర్తలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. 15 రోజులపాటు ఓ కార్యక్రమం చొప్పున పోషకాహార లోపాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ పక్షోత్సవాల్లో అంగన్వాడీ టీచర్లతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వా ములు అవుతున్నారు.జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా వివరాలిలా.. ప్రాజెక్టు గర్భిణులు బాలింతలు ఐదేళ్లలోపు చిన్నారులు నాగర్కర్నూల్ 1,552 1,362 15,552 కల్వకుర్తి 984 1,019 7,660 కొల్లాపూర్ 918 901 8,167 అచ్చంపేట 672 610 5,810 బల్మూర్ 566 570 4,804 అవగాహన కల్పిస్తున్నాం.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి కేంద్రం పరిధిలో పోషకాహార లోపం, తక్కువ బరువుతో శిశువుల జననం, ఊబకాయ లోపం ఉన్నవారిని గుర్తిస్తాం. వారి పర్యవేక్షణతో పాటు పోషకాహారం అందిస్తాం. – రాజేశ్వరి జిల్లా సంక్షేమఅధికారి -
అణగారిన వర్గాలకూ రాజకీయ, సంక్షేమ ఫలాలు
నాగర్కర్నూల్/ కొల్లాపూర్: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్లోని అంబేడ్కర్, జగ్జీవన్రాం విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాల ప్రజలు సంక్షేమ, రాజకీయ ఫలాలు పొందుతున్నారన్నారు. అలాగే జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలన్న దృఢ సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన మహనీయుడు అంబేద్కర్ అని, దళిత గిరిజన, వెనకబడిన, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రవణ్కుమార్, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూలే, అంబేడ్కర్ జాతర వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
సమగ్ర విచారణ జరిగేనా?
కల్వకుర్తి రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వినియోగదారులు సైతం దొడ్డు బియ్యం తినలేమనే ఉద్దేశంతో వచ్చిన ధరకు మధ్యవర్తులకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వినియోగదారుని వద్దకు వెళ్లిన బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుకోవడం అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి వెళ్లి మళ్లీ రేషన్ షాపుల ద్వారా వినియోదారులకు రావడం ఒక రీసైక్లింగ్ వ్యవహారంగా కొనసాగింది. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్ప్రయోజనంగా మారిపోయాయి. తలా పాపం తిలా పిడికేడు అన్న చందంగా రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి అధికారులు తదితరవి రేషన్ బియ్యం చుట్టూ తిరగడంతో అక్రమ రవాణాకు అడ్డు, అదుపు లేకుండా చేశాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్న బియ్యం సైతం పక్కదారి పట్టి అధికారులకు పట్టుబడిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి మండలంలోని మార్చాల రైస్ మిల్లులో ఏకంగా వెయ్యికిపైగా క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపింది. మిల్లులో 90 శాతం.. అధికారులు దాడి చేసిన రైస్ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎంఆర్ ధాన్యం ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. అయితే సీఎంఆర్ కేటాయించని మిల్లులో రేషన్ బియ్యం ఎలా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం ఈ మిల్లుకు ఎలా వచ్చాయనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. సదరు మిల్లులో ఏకంగా 90 శాతం రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరికొన్ని మిల్లుల భాగోతం బయటకు వస్తుందని పలువురు చెబుతున్నారు. కొన్ని బ్రాండ్ల కవర్లను తొడిగి రేషన్ బియ్యం కల్వకుర్తిలోని కొందరికి అమ్మేందుకు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఆదివారం సైతం దాడులు నిర్వహించడం పక్కా సమాచారంతోనే అంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న కొన్ని మిల్లుల యజమానులు తమ వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారని తెలుస్తుంది. రేషన్ బియ్యం వ్యవహారంపై మరిన్ని నిజాలు తెలిసే విధంగా అధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటంతో కలకలం -
డిగ్రీ కళాశాలలోనే ఎన్నికల సామగ్రి
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎన్నికల సామగ్రిని తరలించకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సామగ్రి, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కళాశాలలో ఏర్పాటుచేశారు. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా.. ఇతర సామగ్రి మొత్తాన్ని కళాశాలలోనే నిల్వ చేశారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్ గదులు రెండింటిని వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిజికల్ డైరెక్టర్ గదిని మరోచోట ఏర్పాటు చేసుకోవా ల్సివచ్చింది. 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల సామగ్రిని తరలించి తమకు గదులు అప్పగించాలని కళాశాల ప్రిన్సిపాల్ పలుమార్లు అధికారులు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిసింది. అయితే ఆ సామగ్రిని ఎక్కడికి తరలించాలో తెలియక అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం కళాశాల గదులను ఇస్తే.. వాటిని 16 నెలలుగా తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని అధ్యాపక బృందం వాపోతోంది. ఇప్పటికై నా ఎన్నికల సామగ్రిని తరలించాలని ప్రిన్సిపాల్ సుకన్య కోరుతున్నారు. -
దాహం తీరేనా..?!
శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టం తాగునీటి అవసరాలకే.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ ● మిషన్ భగీరథ అవసరాలకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ● వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు చర్యలు ● యాసంగి సీజన్ ముగియడంతో నిలిచిన సాగునీటి సరఫరా ● నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో లభించనున్న శాశ్వత పరిష్కారం ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీరు 38.86 టీఎంసీలు ఇందులో వాడుకునే అవకాశం ఉన్నది 1.86 టీఎంసీలు కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా 3 నియోజకవర్గాల పరిధిలోని 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. అయితే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. వేసవి ప్రభావంతో శ్రీశైలంలో బ్యాక్వాటర్ లెవెల్స్ వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 818 అడుగుల వద్ద 38.86 టీఎంసీల నీరు ఉండగా.. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల (37.0 టీఎంసీల డెడ్ స్టోరేజీ) వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ముగియడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నీటి అవసరాలు తీర్చేలా... మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.2 టీఎంసీల నీళ్లు అవసరం. కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒక్కసారి రిజర్వాయర్ను నింపితే దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ ప్రకారం వేసవి పూర్తయ్యే వరకు నీటిని ఎత్తిపోసుకునే వీలుంది. తాగునీటి కేటాయింపుల ప్రకారమే శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగం ఉంటుంది. జలాశయం డెడ్ స్టోరేజీ 37.0 టీఎంసీలు కేఎల్ఐ కాల్వ అప్రోచ్ కెనాల్లో కృష్ణా బ్యాక్వాటర్ మిషన్ భగీరథకు ప్రతిరోజు అవసరమైన నీరు 0.2 టీఎంసీలు -
వచ్చే ఏడాది నుంచి..
ప్రతి సంవత్సరం తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం చిన్నది కావడంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు నెలకొంటున్నాయి. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగితే తాగునీటి ఇక్కట్లు పూర్తిస్థాయిలో తీరుతాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6 టీఎంసీల పైనే. ఒక్కసారి రిజర్వాయర్ నిండుగా ఉంచితే వేసవి మొత్తం మిషన్ భగీరథకు తాగునీరు అందుతుంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకానికి నీటిని మళ్లించేందుకు వీలుగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. -
అగ్ని ప్రమాదాలపై నిర్లక్ష్యం వహించొద్దు
నాగర్కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి అన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ముంబాయి విక్టోరియా డాక్ యార్డు నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు అనేవి అనుకోకుండా సంభవిస్తామని, ప్రమాదాలు జరిగినప్పుడు డయల్ 101కు సమాచారం అందిస్తే వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరకుని ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు కృషిచేస్తారన్నారు. అగ్ని అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని, కానీ దానిని ఉపయోగించే క్రమంలో ఏదైనా అలసత్వం ప్రదర్శిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం కూడా సంభవిస్తుందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ‘భూ భారతి’కి మద్దూరు ఎంపిక నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు 17.. భూమి 30,621 ఎకరాలు మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్దిన్నె దమ్గన్పూర్ దొరెపల్లి, జాదరావ్పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు
నాగర్కర్నూల్: జిల్లాలో ప్రతిఏటా వరిసాగు గణనీయంగా పెరుగుతోంది. అనుకున్న స్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, కేఎల్ఐ నీటితో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపడం వల్ల వరిపంట సాగు చేసే రైతుల సంఖ్య కూడా ఏటా రెట్టింపు అవుతోంది. గత యాసంగి సీజన్తో పోలిస్తే ఈసారి వరి సాగు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్లో పంట చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల అధికారుల సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. 99 వేల మె.ట., మాత్రమే.. జిల్లాలో వానాకాలం సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ప్రైవేటు వైపే మొగ్గు చూపడంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరలేదు. ఇది కాక జిల్లాలో సన్నరకాలపై రైతులు ఆసక్తి చూపడం, సన్న రకాలకు ప్రభుత్వం ఇచ్చే ధర, బోనస్ కలిపినా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రైవేట్లోనే ఈ ధాన్యాన్ని అమ్ముకున్నారు. 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం 99 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, తేమ పేరుతో ధరలు తగ్గించడం, ఇతరత్రా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వినిపించినా అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానమిస్తున్నారు. రైతులు సన్నాలు పండించడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపడం లేదని సమాధానమిస్తున్నారు. ఈ సీజన్లో మాత్రం నాగర్కర్నూల్ జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా 2,87,297 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. 234 కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 70, పీఏసీఎస్ 160, మెప్మా ఆధ్వర్యంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సన్నాలకు రూ.500 బోనస్ జిల్లాలో ఈ యాసంగిలో 1,53,164 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇందులో సన్నరకం 76,584 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా దీని ద్వారా 3.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే 2.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం క్వింటాల్ ఏ–గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. దీంతోపాటు సన్న రకానికి బోనస్గా రూ.500 ఇవ్వనున్నారు. రైతులు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, వీఆర్ఓ, ఏఈఓతో ధ్రువీకరణ పత్రం తేవాల్సి ఉంటుంది. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి.. తర్వాత చెల్లింపులు చేస్తారు. అందుబాటులో గన్నీ బ్యాగులు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కావాల్సిన గన్నీ బ్యాగులను అధికారులు సమకూరుస్తున్నారు. ధాన్యం సేకరణకు మొత్తం 47 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ప్రస్తుతం 26 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం సేకరణ జరగుతున్న సమయంలో అవసరాన్ని బట్టి మిగతా వాటిని తెప్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు 4,670 అవసరం ఉండగా ప్రస్తుతం 2,600 అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దిగుబడి అంచనా 3,50,635 మె.ట., జిల్లాలో సాగైన వరి పంట 1,53,164 ఎకరాలు ధాన్యం సేకరణ లక్ష్యం 2,87,297 మె.ట., ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలు 234 ఏ–గ్రేడ్ ధాన్యం మద్దతు ధర రూ.2,320 సన్నాలు క్వింటాల్కు అందించే బోనస్ రూ.500 సాధారణ రకం మద్దతు ధర రూ.2,300 ఊపందుకుంటున్న పంట కోతలు.. సేకరణకు చర్యలు రేపటిలోగా పూర్తిస్థాయిలో కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు గత సీజన్లో కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపని రైతులు అత్యధికంగా ప్రైవేట్ వ్యాపారులకే అమ్మకాలుకొర్రీలు పెట్టొద్దు.. గతేడాది మాదిరిగా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం ధాన్యం సేకరించారు. ప్రభుత్వ ధర కంటే ప్రైవేట్ వ్యక్తులే గతేడాది అధిక ధరలకు కొనుగోలు చేశారు. తేమ శాతం, ధూళి పేరుతో గతేడాది సక్రమంగా కొనుగోలు చేయలేదు. ఈసారైనా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులు పండించిన సన్నధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం మద్దతు ధర మరింత పెంచాలి. – పెద్ద మశన్న, రైతు, గట్టురాయిపాకుల రేపటి నుంచి ప్రారంభిస్తాం.. జిల్లాలో రైతుల నుంచి వరిధాన్యాన్ని సేకరించేందుకు 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. ఈ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. మంగళవారం నుంచి అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీనివాస్, డీఎస్ఓ -
వెళ్లొస్తాం.. లింగమయ్యా
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ● ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ● మూడురోజుల్లో లింగమయ్య దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు ● ఫర్హాబాద్ చెక్పోస్టులు మూసివేత నల్లమలలోని లోతట్టు ప్రాంతం సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. చివరిరోజు వస్తున్నాం.. లింగమయ్యా.. వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. – అచ్చంపేట వివరాలు 8లో u -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్కొండ, మహబూబ్నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. సన్నవి ఇస్తుండడంతో ఊరికొచ్చి తీసుకున్నాం.. నా భార్య, పిల్లలతో సహా 15 ఏళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాం. మేం మొత్తం ఐదుగురం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈ సారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. – స్వామి, వలస కూలీ, దుప్పల్లి, మదనాపురం, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల నాణ్యతపై రాజీ పడొద్దు.. మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. సన్నబియ్యం ఇవ్వడం సంతోషం. ఇప్పుడు వచ్చినవి వండుకుంటే అన్నం బాగానే అయింది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు. – కాసింబీ, గోప్లాపూర్, దేవరకద్ర, మహబూబ్నగర్ 3 రోజుల్లోనే అయిపోయాయి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షా పుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం స రఫరా జరిగిపోయింది. గతంలో బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేది. కోటా అయిపోయి న కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం. – సంజీవరెడ్డి, డీలర్, రేషన్షాప్ నంబర్–3, మద్దూరు, నారాయణపేట జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ మహబూబ్నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్షాపులు,రే.కా: రేషన్కార్డులు, రే.షా.ప.అ: రేషన్షాపులకు పంపిణీ అయింది, ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది అవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
నేటినుంచి అగ్నిమాపక వారోత్సవాలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో సోమవారం నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అదనపు కలెక్టర్ అమరేందర్ అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రజలకు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
కల్వకుర్తి రూరల్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వేపూరులో జై బాపు– జై భీమ్– జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోపాటు మహాత్మగాంధీ చెప్పిన శాంతి సందేశాన్ని గడపగడపకూ తీసుకెళ్లారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేస్తున్నాయని విమర్శించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాని అన్నారు. దేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత తమదేనని చెప్పారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్రెడ్డి, శ్యాంసుందర్రావు, మల్లేష్, శ్రీధర్, వెంకటేశ్వరరావు, లింగమయ్య, పాండురంగారెడ్డి, బాలరాజు, వంశీ, రవి, యుగంధర్, వెంకటేష్, గణేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్షకందనూలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దళితుల అభ్యున్నతి కోసం నిజాయితీగా బీజేపీ మాత్రమే పనిచేస్తుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఉయ్యాలవాడ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గంగిడి మనోహర్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 25 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేడ్కర్కు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి కుట్రపూరితంగా ఆయనను ఓడించారని విమర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. రాబో యే రోజుల్లో బీజేపీ సెమినార్లు, దళితవాడల్లో కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ ఇతర పార్టీలు చేసే తప్పుడు ప్రచారాలను ఎండగట్టి దళిత సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నేత పోతుగంటి భరత్ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జలాల్ శివుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్రెడ్డి, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాగరాజు, నాగేంద్రగౌడ్, చందు, భీమేశ్వర్రెడ్డి, అభిలాష్రావు, రాము పాల్గొన్నారు. -
1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని సంకల్పంతో రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మండలంలోని మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్మిల్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని చెప్పినప్పటికీ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా మిల్లులో ఎఫ్ఆర్కే బియ్యం దర్శనం ఇవ్వడంతో అవి రేషన్ బియ్యం అని అధికారులు తేల్చారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు. రాత్రి 10 గంటల వరకు.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు. పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సోదాలు -
శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. సలేశ్వరంలో భక్తుల సందడి
అమ్రాబాద్: వరుస సెలవుల కారణంగా శ్రీశైలం ప్రధాన రహదారి భక్తులతో రద్దీగా మారింది. సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో, సలేశ్వరానికి వెళ్లే మన్ననూర్ చెక్పోస్టు వద్ద వాహనాల తాకిడి ఎక్కువైంది. టోల్గేట్ వద్ద ఛార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో చెక్పోస్టు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరానికి వెళ్లేందుకు భక్తులు భారీ సంఖ్యలో బయలుదేరారు. ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరగడంతో మన్ననూర్ చెక్పోస్టు వద్ద చార్జీల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో, 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.Situation at saleshwaram jathara pic.twitter.com/37j3IcqLjf— 🚘 𝐊𝐂𝐑_𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 🌈™🚘 (@KCR_Vidheyudu) April 13, 2025ఇదిలా ఉండగా.. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను భక్తులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Yesterday #Saleshwaram was crowded with devotees. If you’re planning to visit, please plan accordingly. I’d suggest avoiding taking kids along, if possible. https://t.co/QckyDl4udO pic.twitter.com/TWHB1i9Wqo— Rudra🚩 (@Mee_Rudra) April 13, 2025 -
రెస్క్యూ ఆపరేషన్ @ 50!
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కుప్పకూలి శనివారానికి సరిగ్గా 50 రోజులైంది. దేశంలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో సుదీర్ఘంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 12 సంస్థలతోపాటు నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించినా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా గల్లంతైన వారిలో ఇంకా ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.150 మీటర్ల మేర మట్టిని తొలగించి.. ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం 8 మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. మిగితా ఆరుగురి జాడ కోసం నిత్యం మూడు షిఫ్టుల్లో మొత్తం 560 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతోపాటు సుమారు 150 మీటర్ల మేర టన్నులకొద్దీ మట్టిని తొలగించి 13.9 కి.మీ. అవతల సొరంగం నుంచి బయటకు తరలించారు. ఇంకా 100 మీటర్ల వరకు మట్టి, శిథిలాలను తొలగించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రంగంలోకి ఎన్నో సంస్థలు.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సింగరేణి, బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్, హైడ్రా, దక్షిణమధ్య రైల్వే, మేఘా, ఎల్ అండ్ టీ, రాబిన్స్, జేపీ సంస్థలతోపాటు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలి వద్ద సేవలు అందిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగం.. బురద, శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటివరకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, మానవ అవశేషాలను గుర్తించే కడావర్ డాగ్స్, నీటిలో సైతం మానవ రక్తం, అవశే షాలను గుర్తించే అక్వా–ఐ, ప్రోబోస్కోప్ టెక్నాలజీతోపాటు ఎన్జీఆర్ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నాయి.టీబీఎం భాగాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మల్, గ్యాస్ కట్టర్లను వినియోగిస్తుండగా మ ట్టిని వేగంగా కన్వేయర్ బెల్టుపై వేసేందుకు నాలుగు ఎస్కలేటర్లు, సైన్యానికి చెందిన మినీ బాబ్కట్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. సొరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 మీటర్ల ప్రాంతంలో ఎన్వీ రోబోటిక్స్కు చెందిన రొబోటిక్ యంత్రాలను వినియోగించనున్నారు. -
సన్నబియ్యం పథకం పేదలకు వరం
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పథకం పేదల కడుపు నింపుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన నాగనూలు లక్ష్మమ్మ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రేషన్ షాపులలో సన్నబియ్యం అందిస్తున్నట్లు వివరించారు. పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే గ్రామంలో పెద్ద మొత్తంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండారెడ్డిపల్లి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయడంతోపాటు అండర్ డ్రెయినేజీ పనులను ప్రారంభించాలన్నారు. పాల శీతలీకరణ భవనాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేయాలని, భగీరథ లైన్ ద్వారా తాగునీటి సరఫరా అందించాలని, గ్రామంలో వందశాతం సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యే క పూజలు చేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి విజయ్కుమార్, డీపీఓ రాంమోహన్రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు’
కల్వకుర్తి రూరల్: ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలు అమలులో ఘోర వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, అర గ్యారంటీ కూడా చేయలేదన్నారు. దళిత బంధు, ఫీజు రీయంబర్స్మెంట్, స్కూటీలు, తులం బంగారం అన్ని పథకాలు పక్కన పెట్టి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామన్నారు. ఈ సందర్భంగా చలో వరంగల్ పోస్టర్ను విడుదల చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివస్తారన్నారు. ప్రతి కార్యకర్త కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసి జనరంజక, రైతు ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్గౌడ్, విజితారెడ్డి, గోవర్ధన్, రాంరెడ్డి, బాలయ్య, మధు పాల్గొన్నారు. -
విద్యారంగం అభివృద్ధికే తొలి ప్రాధాన్యత
కందనూలు: విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, సొంత గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని నెలికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫేర్వెల్ వేడుకలు విద్యార్థుల మధ్య అనుబంధాన్ని పెంపొందించే విధంగా నిలుస్తాయన్నారు. చదువులో మేలు చేయాలన్న విద్యార్థుల ప్రయత్నాలకు తనవంతు సహాయ, సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని, విద్యతోనే మంచి జీవితం సృష్టించుకోవచ్చని పేర్కొన్నారు. గురువులు చెప్పే మాటలను ప్రామాణికంగా తీసుకుని ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. వివిధ స్థాయిలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఎమ్మెల్సీ ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు మదన్మోహన్, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన శనేశ్వరుడి వార్షికోత్సవం బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో శనేశ్వరస్వామి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వనాథశాస్త్రి అర్చక బృందం ఉమామహేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు. శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం వడ్డెమాన్ గ్రామస్తులు ఎద్దుల బండ్లతో ఆలయ పరిసరాల్లో శోకటోత్సవం నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రావు అన్నదానం ఏర్పాటు చేశారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు. -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాలుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్నగర్ క్రైం/ నాగర్కర్నూల్ క్రైంఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్స్టేషన్ మహబూబ్నగర్లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్కర్నూల్లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ను బట్టి రెండు షిఫ్ట్లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్నగర్లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్గేట్, ఔట్గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే వెంటనే సంఘటనా స్థలానికి వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్నగర్ ద్రవ పదార్థాలు తీసుకుంటున్నాం.. దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్కర్నూల్ ● -
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే కృషి
నాగర్కర్నూల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబాఫూలే ఎంతో కృషిచేశారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆడపిల్లలు చదువుకోవాలని, చదువు వల్లనే ఈ సమాజంలో ఆడపిల్లలకు భరోసా ఉంటుందని భావించి ఆ రోజుల్లోనే సీ్త్ర విద్య కోసం విశేష సేవలు అందించారన్నారు. శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతి బాఫూలే తన భార్యను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేసి మహిళా విద్యకు పాటుపడ్డారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కుల, లింగ వివక్ష లేకుండా ప్రస్తుతం అందరి జీవనం కొనసాగుతోందని, వారు చూపిన దారిలో నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడేలా మంచి పనులు చేసిన ప్రతిఒక్కరు మహనీయులుగా కీర్తించబడుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబాఫూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి కాజా నజీం అలీ అప్సర్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
శనేశ్వరుడికి శతకుంభ తిలతైలాభిషేకం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో వెలసిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామివారికి శతకుంభ తిలతైలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శుక్రవారం గణపతి పూజానంతరం జేష్ట్యాదేవి సమేత శనేశ్వరులకు వెయ్యి కుంభాలతో నువ్వుల నూనెతో ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక అష్టోత్తర సహిత అభిషేక పూజలు జరిపారు. కాగా.. శనివారం ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరస్వామి వ్రతం, శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్ర ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రావు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు వీరశేఖర్, పుల్లయ్య, ప్రభాకరచారి, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, మల్లికార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రతి చిన్నారికి టీకాలు అందేలా చూడాలి
నాగర్కర్నూల్ క్రైం: ప్రతి గర్భిణి సురక్షిత మాతృత్వం పొందాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలని, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నిర్వహించే ప్రత్యేక టీకాకరణ కార్యక్రమానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ సురక్ష మాతృత్వ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆశా నోడల్ పర్సన్స్, ఆశా ఫెసిలిటేటర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి టీకాకరణ చేయించుకుని, తప్పిపోయిన చిన్నారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. భవన నిర్మాణ ప్రదేశాలు, ఇటుక, బొగ్గు బట్టీల దగ్గర వలస కుటుంబాల చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నెల 21 నుంచి 26 వరకు, మే 21 నుంచి 28, జూన్ 23 నుంచి 30 వరకు ప్రతిరోజు టీకాకరణ నిర్వహించాలని సూచించారు. వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ అజహర్ మాట్లాడుతూ ప్రత్యేక టీకాకరణ శిబిరానికి అన్ని రకాల వ్యాక్సిన్, టీకాలు ఇవ్వాల్సిన చిన్నారులు, గర్భిణుల జాబితాను, తప్పనిసరిగా ఏఎన్ఎంలు తమ వెంట తీసుకువెళ్లాలన్నారు. మాతృ మరణాలు తగ్గించేందుకు కృషి మాతృ మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ఆమె చాంబర్లో బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మెన్, ఊర్కొండ మండలంలోని రాచాలపల్లిలో ఇటీవల జరిగిన మాతృ మరణాలపై సమీక్షించారు. గర్భిణుల వివరాల నమోదు, రక్త, మూత్ర పరీక్షల వివరాలను, ప్రసవ చరిత్ర, ప్రత్యక్ష, పరోక్ష కారణాలు, మాతృ మరణాలను నివారించగల పరిస్థితులపై ఆరాతీశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ నీలిమ మాట్లాడుతూ గర్భిణుల్లో ఏవైనా ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సిబ్బంది వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల, దానికి తగ్గట్టుగా ప్రసవ ప్రణాళిక చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్, డాక్టర్ భీమానాయక్, ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డీడీఎం సందీప్రావు తదితరలు పాల్గొన్నారు. -
ముంచిన నాసిరకం వరి సీడ్
పంట కాలం ముగుస్తున్నా ఈనె దశలోనే వరి బల్మూర్: మా కంపెనీ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి.. సదరు సీడ్ విత్తనాలతో పంట సాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. కంపెనీ పేరుతో మార్కెట్లోకి వచ్చిన సంజీవని (పీఎంఎస్పీ–1122) రకం వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంటలను సాగు చేశారు. కానీ, పంట కాలం ముగుస్తున్నా నేటికీ ఈనె దశలోకి కూడా రాకపోవడంతో నాసిరకం విత్తనాలతో నష్టపోయామని గగ్గోలు పెడుతున్నారు. మండల కేంద్రం బల్మూర్కు చెందిన ఎనిమిది మంది రైతులు స్థానికంగా ఓ లైసెన్స్ కలిగిన డీలరు వద్ద సంజీవని (పీఎంఎస్పీ– 1122) రకం వరి విత్తనాలు తీసుకెళ్లి నల్ల చెరువు ఆయకట్టు కింద జనవరి మొదటి వారంలో సుమారు 16 ఎకరాల్లో పంట సాగు చేశారు. ప్రస్తుతం తమ పక్క పొలంలో సాగు చేసిన వరి పంటలు కోతలకు రాగా.. తాము సాగు చేసిన సదరు సీడ్ విత్తనం పంటల గడువు దాటినా కూడా ఈనె దశకు రాకపోవడంతోపాటు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నాయని రైతులు వాపోతున్నారు. స్పందించని సీడ్స్ కంపెనీ ప్రతినిధులు నాసిరకం విత్తనాలతో నట్టేట ముంచారని అన్నదాతల ఆవేదన రైతుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఏఓ, శాస్త్రవేత్తలు నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడి -
కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు అనుగుణంగా ప్రస్తుత వేసవిలోనే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ రమేష్కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లాకు కొత్త పాఠ్యపుస్తకాలు చేరుకుంటున్నాయని, ఈ మేరకు జిల్లాకేంద్రంలోని టెస్ట్ బుక్స్ గోదాంలో భద్రపరిచిన పాఠ్య పుస్తకాలను జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నర్సింహులుతో కలిసి డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో మండల, జిల్లా పరిషత్, ఆదర్శ, గురుకులాలు, కేజీబీవీలు కలుపుకొని జిల్లాలో మొత్తం 939 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72,641 మంది విద్యార్థులకు సుమారు 6 లక్షల వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయన్నారు. జిల్లాకు పుస్తకాలు వస్తున్నాయని, ఇప్పటి వరకు వివిధ తరగతులకు సంబంధించి 35,710 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. మే నెలలో జిల్లాకు పూర్తిస్థాయిలో పుస్తకాలు వస్తాయని, ఇక్కడి నుంచి మండలాలకు, పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తామన్నారు. పుస్తకాల జాబితా ఎన్ని వచ్చాయి.. ఎన్ని పంపిణీ చేశారు.. ఏయే పాఠశాలకు ఎన్ని వెళ్లాయి.. తదితర వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి పారదర్శకంగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి తీవ్ర కృషి చేస్తోందన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
నాగర్కర్నూల్ క్రైం: అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా జడ్జి రాజేష్బాబు అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అన్నారు. అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు, మధుసూదన్రావు పాల్గొన్నారు. -
అంతుచిక్కని ఆచూకీ.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది?
మహబూబ్నగర్/నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గురువారం నాటికి 48 రోజులు అవుతోంది. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. నిత్యం సహాయక సిబ్బంది 20 మీటర్ల మేర తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు తరలిస్తున్నారు.సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కారి్మకులు చిక్కుకోగా, మార్చి 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్సింగ్ మృతదేహాన్ని డీ2 ప్రదేశంలో వెలికితీశారు. మార్చి 25న ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి అచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.సొరంగం లోపల 13.73 కిలోమీటరు నుంచి 13.8 కిలోమీటరు వరకు కన్వేయర్ బెల్టును పొడిగించేందుకు గురువారం లోకో ట్రైన్ ద్వారా కన్వేయర్ బెల్టు, ఇతర సామగ్రిని సొరంగం లోపలికి తరలించారు. ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్టును పొడిగిస్తూ మట్టిని తవ్వే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. వారం రోజుల్లో శిథిలాల తొలగింపును పూర్తి చేసేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. -
పాల ధరల సడలింపు
విజయ డెయిరీలో పాల ధరల్లో హెచ్చుతగ్గులు నాగర్కర్నూల్: జిల్లాలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ సైతం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ ద్వారా గతంలో 40 వేల లీటర్ల వరకు పాలు సేకరించగా.. ప్రస్తుతం 74 వేల వరకు పెరిగింది. అయితే ఈ ఏప్రిల్ 1 నుంచి పాల ధరలు సడలిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో గేదె పాల ధరను పెంచగా ఆవు పాలకు ధరలను తగ్గిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. 220 అవుట్లెట్ల ద్వారా.. జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని నాగర్కర్నూల్, కొండారెడ్డిపల్లి, అచ్చంపేట, వెల్దండ, ఊర్కొండ, మాధారం, గుండూరు, కల్వకుర్తి, కుప్పగండ్ల ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ కేంద్రాలు కొనసాగిస్తున్నారు. రూర్బన్ పథకం కింద పెద్దకొత్తపల్లిలో మండలం పెద్దకార్పాములలో ఏర్పాటు చేస్తున్న పెరుగు తయారీ కేంద్రానికి సంబంధించి పనులు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అయితే జిల్లాలో తొమ్మిది కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా.. 220 అవుట్లెట్ల ద్వారా పాలు సేకరిస్తున్నారు. జిల్లాలో పాల ఉత్పత్తి 1.70 లక్షల లీటర్లు తగ్గించిన ఆవు పాల ధర రూ.4.33 విజయ డెయిరీ సేకరిస్తున్న పాలు 74,000 లీటర్లు పెంచిన గేదె పాల ధర రూ.4.50 తీవ్రంగా నష్టపోతాం.. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలకు బదులు ఆవులను అధికంగా పెంచుతాం. కానీ, ప్రభుత్వం గేదెపాలకు ధర పెంచి ఆవుపాలకు తగ్గించింది. లీటరు ఆవు పాలకు గతంలో రూ.46 ఇస్తుండగా.. ప్రస్తుతం ఆ ధరను రూ.4 తగ్గించి రూ.42లకే పరిమితం చేసింది. ఫలితంగా ఆవు పాల రైతులం తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం పునరాలోచించి ఆవు పాల ధర పెంచి రైతులను ఆదుకోవాలి. – కొండలయ్య, పాడిరైతు, గట్టునెల్లికుదురు 1 నుంచే అమల్లోకి.. విజయ డెయిరీలో సవరించిన పాల ధరలు ఈ నెల 1 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి సంస్థ చేపట్టే సమీక్షలో భాగంగా ధరలు హెచ్చు తగ్గులు అవుతుంటాయి. రైతులతో చర్చించే పాల ధరలను నిర్ణయిస్తారు. ఈసారి కూడా అదే కోవలో పాల ధరలను నిర్ణయించారు. – ధన్రాజ్ డీడీ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆవు పాలకు తగ్గింపు, గేదె పాలకు పెంపు జిల్లాలో అత్యధికంగా ఆవు పాలే సేకరణ తీవ్రంగా నష్టపోనున్న పాడిరైతులు -
రథచక్రాలు
కదిలిన రాములోరిపకడ్బందీగా వరిధాన్యం కొనుగోళ్లు ● అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం ● జనసంద్రమైన సిర్సనగండ్ల ● మార్మోగిన శ్రీరామ నామం వివరాలు 8లో u– చారకొండ నాగర్కర్నూల్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలుకు పగడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యాసంగి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ అమరేందర్, ఆయా శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో 2,87,297 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారన్నారు. ఇందుకోసం జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో 70, మెప్మా 4, పీఏసీఎస్ 160 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం గ్రేడ్–ఏ రకం ధాన్యానికి క్వింటాల్ రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరతోపాటు సన్న రకం ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఈ నెల 15లోగా 234 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కేంద్రానికి ధాన్యం వచ్చినప్పటి నుంచే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సన్నాలు, దొడ్డురకం వేర్వేరుగా కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు తాగునీరు, షామియానా, కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించి వివరాలను ట్యాబ్లో ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు లారీల కొరత లేకుండా చూడాలని, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వరిధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవీఎం గోడౌన్ పరిశీలన జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను గురువారం కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియ భాగంగా ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్ వెంట గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రవికుమార్, కల్పన తదితరులున్నారు. -
‘ర్యాలంపాడు’ లీకేజీల పరిశీలన
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలను సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణెకు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఉదయం11.30 గంటలకు రిజర్వాయర్ వద్దకు చేరుకున్న డాక్టర్ సంజీవ్ బరేలే, సునీల్ పిల్లై (కేరళ), కే. నర్సయ్య (ఏపీ కాకినాడ), మందిర ముజుకుదార్, తనుశ్రీ సమంత తదితరుల బృందం సభ్యులు దాదాపు 3 గంటల పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఎడమ కాల్వ వద్ద నీటి లెవెల్స్, ప్రాజెక్టు బండ్ అండ్ గ్రౌండ్ లెవెల్లను పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్తో పలు విషయాలు ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్ మ్యాప్స్, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి మెటీరియల్ వాడారు, ప్రాజెక్టు డిజైన్ను ఏ సంస్థ చేపట్టింది, ముందుగా సమస్య ఎక్కడ ఏర్పడింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత, లీకేజీల తరువాత ఎంత మేర నీటిని నిల్వ చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. అక్కడి నుంచి లీకేజీలు ఏర్పడిన మూడు ప్రాంతాలను బండ్ ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలించారు. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటి లెవెల్ కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో లీకేజీ ప్రాంతాల వద్ద ఊట లేకపోవడంపై చర్చించారు. ప్రాజెక్టుపై భాగంలో ఎలాంటి సమస్య లేదని, కేవలం తగ్గు ప్రాంతాల వద్ద మాత్రమే లీకేజీ సమస్య వచ్చినట్లు గుర్తించామని బృందం సభ్యులు తెలియజేశారు. లీకేజీలు ఏర్పడటానికి గల కారణాలను అధ్యయనం చేసందుకు ఇక్కడి నుంచి కొంత మెటీరియల్ను తీసుకు వెళ్లి టెస్టులు నిర్వహించి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సంబంధిత సీఈకి అందిస్తామని బృందం సభ్యులు తెలియజేశారు. ఇక్కడి నుంచి కృష్ణా నది కలిసే ప్రాంతం దూరాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ ప్రధాన కాలువల వెంట అక్కడక్కడ చేపట్టాల్సిన పనులపై ఎస్ఈ రహీముద్దీన్కు వివరించారు. పనులు త్వరలోనే పూర్తి చేస్తామని సభ్యులకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు పరిదిలోని మిగతా రిజర్వాయర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నోనిపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు డిజైన్, వాడిన మెటీరియల్పై పూణె నిపుణుల బృందం ఆరా -
ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలి
తెలకపల్లి: హిందు ధర్మాన్ని ప్రతిఒక్కరు కాపాడుకోవాలని అంబాత్రాయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామీజీ అన్నారు. తెలకపల్లిలో గురువారం రాత్రి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం వార్షికోత్సవ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామీజీకి భక్తులు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులనుద్దేశించి మాట్లాడారు. హిందువులంతా ధర్మం కోసం పాటుపడాలని, భక్తిభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఇతర మతాలకు ఆకర్షితులు కావొద్దని భక్తులకు సూచించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, హిందూ దేవతలను నిత్యం పూజించాలన్నారు. ఏ ఒక్కరు పరమతానికి వెళ్లవద్దని, ఈ దేశంలో అత్యుత్తమమైనది హిందూ మతం అన్నారు. హిందూ మతాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవితాన్ని గడపాలని ఆయన ఆకాక్షించారు. -
ఎస్ఏ–2 పరీక్షలు ప్రారంభం
కందనూలు/వెల్దండ: జిల్లాలో 1నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటీవ్ అసెస్మెంట్–2 పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వెల్దండ మండలం పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తుంకిబండ తండా ప్రాథమిక పాఠశాలలను డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి.. పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేటు, గురుకులాలు తదితర 1,100 పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలి పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా చూడాలని హెచ్ఎంలకు సూచించారు. ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగే పరీక్షలను సమర్థవంతగా నిర్వహించాలని తెలిపారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 23న ఫలితాలు వెల్లడించాలని.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి ప్రోగ్రెస్ కార్డులను అందించాలని డీఈఓ సూచించారు. డీఈఓ వెంట జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నర్సింహులు, ఇన్చార్జి ఎంఈఓ చంద్రుడు నాయక్ ఉన్నారు. సజావుగా ‘పది’ మూల్యాంకనం కందనూలు: జిల్లా కేంద్రంలో పదో తరగతి వార్షి క పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం సజా వుగా కొనసాగుతుందని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో బుధవారం రెగ్యులర్ విద్యార్థుల పరీక్ష పేపర్లు తెలుగు 6,761, హిందీ 6,089, ఆంగ్లం 4,144, గణితం 7,175, ఫిజికల్ సైన్స్ 8,331, బయోసైన్స్ 5,098, సోషల్ స్టడీస్ 5,908తో కలిపి మొత్తం 43,898 పేపర్లను మూల్యాంకనం చేసినట్లు డీఈఓ వెల్లడించారు. మూల్యాంకనం కేంద్రంలో ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రథమ చికిత్స మందులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎగ్జామ్స్ ఏసీ రాజశేఖరరావు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ కురుమయ్య పాల్గొన్నారు. -
రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దాం
బిజినేపల్లి: అగ్రకుల నాయకుల సహకారంపై ఆధారపడకుండా బీసీలు స్వయంగా ఉద్యమించి రాజ్యాధికారం సాధించుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం బిజినేపల్లిలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జాజులతో పాటు ప్రొ.కాశీం, బీఆర్ఎస్ రాష్ట్ర నేత బైకాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దీలీపాచారి హాజరయ్యారు. ఫూలే విగ్రహావిష్కరణ అనంతరం జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 10 శాతం జనాభా ఉన్న వారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అగ్రకులాల వారే బలహీన కులాల వారని.. బీసీలు బలమైన కులస్తులని అన్నారు. పోలవరంలో మునిగిపోయిన పడవను నలుగురు గంగపుత్రులు పట్టుకొచ్చారని గుర్తుచేశారు. కులవృత్తుల వారు లేకుంటే ఇతర వర్గాలకు బతుకు లేదని.. బీసీల చేతిలో గుత్ప ఉంటేనే రాజ్యాధికారం వస్తుందన్నారు. ప్రొ.కాశీం మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే ముదిరాజ్ కులస్తుడని, ఆయనను చదువుకు దూరం చేయాలని కొందరు యత్నిస్తే.. క్రైస్తవ పాస్టర్ వద్దకు రాత్రి బడికి వెళ్లి చదువుకున్నారని గుర్తుచేశారు. బీసీలు కులవృత్తుల వల్ల చదువుకు దూరమయ్యారన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోతున్నారని.. అతి తక్కువ జనాభా ఉన్న అగ్రకులాలు ఎందుకు రాజ్యమేలుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. బీసీలు ఏకమై ఉద్యమిస్తేనే భవిష్యత్లో రాజ్యాధికారం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ.పెబ్బేటి మల్లికార్జున్, స్థానిక నాయకులు బాలరాజ్గౌడ్, మంగి విజయ్, కుర్మయ్య, మిద్దె రాములు, రాజేందర్గౌడు, రామన్గౌడు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల ఆరోగ్యంపై నజర్
నాగర్కర్నూల్ క్రైం: ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వారిలో ప్రాథమిక దశలోనే దృష్టిలోపాలు, మానసిక ఎదుగుదల సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు మానసిక సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక బృందాలతో 0–6 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని పరీక్షలు నిర్వహించి.. అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 47,317 మంది చిన్నారులు.. జిల్లావ్యాప్తంగా 1,131 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ఆరేళ్లలోపు చిన్నారులు 47,317 మంది ఉన్నారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్ల సమక్షంలో వారికి కంటి పరీక్షలతో పాటు మానసిక ఎదుగుదలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలను కంటివైద్య నిపుణులు, ఆర్బీఎస్కే సంచార ఆరోగ్య బృందాలు సందర్శించి.. చిన్నారుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే వాటిని పరీక్షిస్తున్నారు. కంటి పరీక్షల కోసం ప్రత్యేకంగా బొమ్మలతో కూడిన చార్ట్ వినియోగిస్తున్నారు. ఈ పరీక్షల్లో కంటిచూపుతో పాటు మెల్లకన్ను, కార్నియా సమస్యలు, కంటి తేమలోపం, పొడిబారి పోవడం వంటి వాటిని ఆఫ్తాలమిక్ వైద్యులు గుర్తిస్తున్నారు. చిన్నారుల్లో దృష్టిలోపాలు ఉంటే.. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని కంటి స్పెషలిస్టు వైద్య నిపుణులతో మళ్లీ పరీక్షించి.. తగిన చికిత్సలతో పాటు కంటి అద్దాలను ఉచితంగా అందించనున్నారు. అదే విధంగా ఆర్బీఎస్కే వైద్యులు చిన్నారుల మానసిక ఎదుగుదల లోపాలను గుర్తిస్తున్నారు. చిన్నారులు సరిగ్గా మాట్లాడుతున్నారా.. ప్రవర్తనలో ఏమైనా అసహజ మార్పు లు, వయసుకు తగ్గుట్టు ఎలా స్పందిస్తున్నారు.. మానసిక ఎదుగుదల మైలురాళ్లను పరీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 8 అంగన్వాడీ కేంద్రాల్లో 923 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 9మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మానసిక ఎదుగుదలకు సంబంధించి 45 అంగన్వాడీ కేంద్రాల్లో 1,834 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురు చిన్నారులకు మానసిక ఎదుగుదల సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రత్యేక కార్యాచరణ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు మానసిక ఎదుగుదల సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ప్రత్యేక శిబిరాల్లో చిన్నారులకు పరీక్షలు చేసేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దృష్టిలోపం సమస్యలు ఉన్న వారికి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన చికిత్స అందిస్తాం. – డా.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ అంగన్వాడీ కేంద్రాల్లో కంటి, మానసిక పరీక్షలు ఈ నెల7న ప్రత్యేక శిబిరాలు ప్రారంభం దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
మెరుగైన విద్య అందించాలి
తిమ్మాజిపేట/తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తిమ్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుదవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలకపల్లి సీఎల్ఆర్ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుపై కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు అత్యాధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం చైర్మన్ను సత్కరించారు. ఆయన వెంట అధికారులు రాధాకృష్ణ, శివరాం, రామరాజు, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ జాకీర్ అలీ, ఎంఈఓలు శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణశెట్టి, సీఎల్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, రాజమహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ యా దయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బల్మూర్: జిల్లాలో అవకతవకలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప అన్నారు. బుధవారం బల్మూర్లో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణంతో పాటు పైలెట్ గ్రామం జిన్కుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 353 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. బల్మూర్ మండలం జిన్కుంట గ్రామానికి 73 ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఇందులో 50 ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వగా.. 12 నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా జియో ట్యాంగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసినప్పటి నుంచి.. నిర్మాణం పూర్తయ్యే వరకు పకడ్బందీగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. పీడీ వెంట డీఈ ఆనంద్రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ రాఘవులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, భూషన్న ఉన్నారు. దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాస పథకంలో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారిణి కె.రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయేతర రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 21–55 ఏళ్లు, వ్యవసాయ రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 21–60 ఏళ్లు ఉండాలన్నారు. ఆసక్తిగల దివ్యాంగులు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
గరుడ వాహనంపై ఊరేగిన రామయ్య
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్వామివారికి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. అంతకుముందు ఆలయంలో సీతారామచంద్రస్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అదే విధంగా శివదత్తాత్రేయ, పరశురామ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల తరలివచ్చిన భ క్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, మురళీదర్ శర్మ, సీతారామశర్మ, కోదండరామశర్మ, రఘుశర్మ, ప్రవీణ్శర్మ, అనంతరామశర్మ, భాస్కరశర్మ పాల్గొన్నారు. స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు -
సద్వినియోగం చేసుకోవాలి
ఎర్లీబర్డ్ స్కీం ఐదు శాతం ఆఫర్ ఈసారి పాత బకాయిదారులకు కూడా వర్తిస్తోంది. మొత్తం బకాయిలు చెల్లించి, 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ముందస్తు చెల్లించే వారికి అవకాశం ఉంటుంది. ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని ముందుస్తు పన్ను చెల్లించాలి. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట జిల్లాలోని మున్సిపాలిటీల్లోఈ ఏడాది ఆస్తిపన్ను వివరాలు మున్సిపాలిటీ అసెస్మెంట్లు పన్ను డిమాండ్ (రూ.కోట్లలో) నాగర్కర్నూల్ 11,028 4.20 కల్వకుర్తి 8,195 2.48 అచ్చంపేట 6,857 2.30 కొల్లాపూర్ 6,536 0.90 -
ఈదురు గాలుల బీభత్సం
కొల్లాపూర్: పట్టణంలో మంగళవారం సాయంత్రం అకాలవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీగా ఈదురుగాలులు వీచి బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆర్డీఓ కార్యాలయంలో చెట్టు కొమ్మలు విరిగి కార్లపై పడటంతో కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల కారణంగా మామిడితోటల్లో కాయలు రాలాయి. వరిదేల మాసూంబాబా దర్గా ముందు గల హైమాస్ట్ లైట్ విద్యుత్ స్తంభం విరిగి వైర్ల పడింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మరమ్మతు చేపట్టగా.. కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా పంటలు, పండ్లతోటలు ఏమైనా దెబ్బతిన్నాయా అనే వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. -
నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్మెంట్–2) నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఆయా ఎమ్మార్సీల నుంచి ప్రశ్నపత్రాలు పాఠశాలలకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 1,019 పాఠశాలలు ఉండగా.. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి 1,06,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. పరీక్షల సమయం ఇలా.. అన్ని తరగతులకు ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 1 నుంచి 7వ తరగతి వరకు 11– 30 గంటల వరకు, 8వ తరగతికి 11.45 గంటల వరకు, 9వ తరగతికి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్యార్థులకు ఈ నెల 11న తెలుగు, 12న ఆంగ్లం, 15న గణితం, 16న పరిసరాల విజ్ఞానం పరీక్షలు కొనసాగుతాయి. 6, 7 తరగతుల వారికి 9న తెలుగు, 10న హిందీ, 11న ఆంగ్లం, 12న సాంఘికశాస్త్రం, 15న జనరల్ సైన్స్, 16న గణితం పరీక్షలు ఉంటాయి. 8, 9 తరగతులకు 9న తెలుగు, 10న హిందీ, 11న ఆంగ్లం, 12న గణితం, 15న భౌతికశాస్త్రం, 16న జీవశాస్త్రం, 17న సాంఘికశాస్త్రం పరీక్షలు రాయనున్నారు. 23న పీటీఎం నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని జిల్లా డీసీఈబీ అధికారి రాజశేఖర్రావు తెలిపారు. జిల్లాలో 1,06,000 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత సాధించే విధంగా ప్రోత్సహిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో మహిళా సమాఖ్య భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రూ.5 కోట్ల నిధులతో పట్టణంలోని సర్వే నం.29లో 786 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 13 గదులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనం, మహిళల శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, కార్యాలయ వినియోగం, సామూహిక చర్చలకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేసినట్లు వివరించారు. మహిళా సమాఖ్య భవనం నిర్మాణం పూర్తయితే గ్రామీణ మహిళలకు మరింత శిక్షణ అవకాశాలు, సామూహిక కార్యాచరణకు వేదికలు, పాలకవర్గాల సమావేశాలు నిర్వహించుకునే అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. మహిళల అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తబితారాణి, పీఆర్ఏఈ శివకృష్ణ తదితరులు ఉన్నారు. -
నల్లగొండకు సాగునీరు తరలించడం అన్యాయం
కందనూలు: జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు అక్రమంగా సాగునీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసిందని, దీనిని అడ్డుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్యెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముఖ్యమంత్రిని నిలదీయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అధికార పార్టీ నేతలకు ప్రాజెక్టులపై అవగాహన లేదని, ప్రజల కోసం పనిచేయకుండా స్వార్థం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అన్ని అనుమతులను సాధించడం జరిగిందని, తద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపొందించిన పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ ఆడించే ఆటగా పాలకులు పనిచేస్తున్నారని ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించవచ్చని, అందుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి జీఓను కూడా విడుదల చేశారని దానిని పక్కన పెట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు చేస్తున్న కుట్రలతో ఉమ్మడి పాలమూరు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలో డీఈఓ విచారణ
కందనూలు: జిల్లాకేంద్రం శివారులోని నాగనూలు కేజీబీవీలో మంగళవారం డీఈఓ రమేష్కుమార్ విచారణ చేపట్టారు. వివరాలు ఇలా.. కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థిని స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చిందని మూడు గంటల పాటు నిలబెట్టిన ఓ ఉపాధ్యాయురాలు కనీసం నీళ్లు తాగనివ్వకుండా, బాత్రూం వెళ్లకుండా పనిష్మెంట్ ఇచ్చిందని మనస్తాపంతో చేయి కోసుకుంది. సమాచారం అందుకున్న డీఈఓ రమేష్కుమార్ కేజీబీవీ జిల్లా బాలిక అభివృద్ధి అధికారి శోభారాణితో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపారు. విద్యార్థులను కలిసి ఉపాధ్యాయురాలి తీరు, విద్యార్థులతో ప్రవర్తిస్తున్న విధానం గురించి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక కలెక్టర్కు అందజేస్తామన్నారు. ముందుగా ఘటనకు కారకురాలైన ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ఉపాధ్యాయురాలి వివరణ అనంతరం పూర్తిస్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పారు. అయితే ఉపాధ్యా యురాలిని సస్పెండ్ చేయాలని పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థి, కుల సంఘాల నాయ కులు ఆందోళన చేపట్టారు. పోలీసులు పాఠశాల దగ్గరకు వచ్చి విద్యార్థినికి న్యాయం చేస్తా మని చెప్పడంతో ఆందోళన విరమించారు. బ్యాంక్ సేవలు గ్రామీణులకు చేరువ చేయాలి లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేయాలని ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి డిబోజిత్ భౌరా అన్నారు. మంగళవారం లింగాలలోని సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని సందర్శించిన ఆయన కేంద్రం నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్ సేవలపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను తెలుసుకొని.. సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైం మోసాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం పనితీరును మరింతగా మెరుగుపర్చుకొని సమర్థవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, యూబీఐ అధికారి లక్ష్మణ్, ఎఫ్ఎల్సీ శేషయ్య, సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు ఎండీ మన్సూర్, రూపే ష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నేడు ఏఐపై జాతీయ సెమినార్ జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘వాణిజ్య రంగంలో ఏఐ ప్రభావం’ అన్న అంశంపై ఒకరోజు సెమినార్ కొనసాగుతుందని దేశంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి సెమినార్ కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటికే 130 జనరల్స్ వచ్చాయన్నారు. త్వరలోనే విద్యార్థులకు పాఠ్యాంశంగా తేబోతున్న ఏఐతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దానివల్ల కలిగే అనర్థాలు అదే తరహాలో వివిధ కళాశాలల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారన్నారు. సెమినార్కు రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, పీయూ వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్, సీసీఈ జేడీ జి.యాదగిరి, రాజేందర్సింగ్, ఏజీఓ బాల భాస్కర్, ముఖ్యవక్త యలమంచిలి రామకృస్ణ, రీసోర్స్ పర్సన్ డా.కె.రాజ్కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. వైస్ప్రిన్సిపాల్ డా.నర్మద, మీడియా కన్వీనర్ రాఘవేందర్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దాం
నాగర్కర్నూల్ రూరల్: సీపీఎం సీనియర్ నాయకుడు రణదివే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్యర్యంలో రణదివే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ.. టెక్స్టైల్స్, రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రణదివే చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన 1969 వరకు ఏఐటీయూసీలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఉద్యమాలు చేపట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, రాధాకృష్ణ, రాజు, నరేష్, రామస్వామి పాల్గొన్నారు. -
బీజేపీని మరింత బలోపేతం చేద్దాం
కందనూలు: క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీని స్థాపించి నేటితో 46 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పార్టీ కో సం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తుండటంతో నే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. -
బెట్టింగ్ భూతం..!
పందాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న యువత ● ఐపీఎల్ సీజన్లో పందెంరాయుళ్ల బిజీ ● జోరుగా క్రికెట్ బెట్టింగ్ ● బలవుతున్న యువత ● యాప్ల్లో మోసపోతున్నా.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు కేసులు నమోదు చేస్తాం.. బెట్టింగ్ ఆడుతున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. అనుమానం ఉన్న వ్యక్తులపై, గ్రామాల్లో నిఘా పెంచుతాం. ఇప్పటి వరకు బెట్టింగ్ల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలి. – శ్రీనివాసులు, డీఎస్పీ, అచ్చంపేట అచ్చంపేట రూరల్: కొందరు యువత ఆటను ఆస్వాదిస్తుండగా.. మరికొందరు సొమ్ము చేసుకోవాలని ఆశపడి బోల్తా పడుతున్నారు. బెట్టింగ్లతో జేబులు గుల్లా చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ చోట క్రికెట్ ఆడినా.. ఎలాంటి ఫార్మాటైనా పందెం ఆడుతూ బానిసలుగా మారుతున్నారు. బెట్టింగ్లతో జరగాల్సిన నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో పట్టణాలు, నగరాల్లోనే బెట్టింగ్లు జరిగేవి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా బెట్టింగ్ భూతం పట్టి పీడిస్తోంది. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ల జోరుతో పందెం రాయుళ్లకు పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలకు పాకిన పందెం.. చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్ పల్లెల్లోకూ వ్యాపించింది. గ్రామీణ యువత కొందరు తమ సెల్ఫోన్లో బెట్టింగ్లకు సంబంధించిన యాప్లను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ విధానంతో పందెం కాస్తున్నారు. మరికొందరు ఆఫ్లైన్ విధానంలోనూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. ఆఫ్లైన్కు సంబంధించి ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో యువత ఓ దగ్గర కూర్చొని బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, ప్లేయర్ల స్కోర్, వికెట్లపై బెట్టింగ్ కడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కోడ్ భాషతో మాట్లాడుకుంటూ పందెం కాస్తున్నారు. ప్రతి ఒక్కరి వద్ద సెల్ఫోన్ ఉండటంతో ఎప్పటికప్పుడు పందెం రాయుళ్లకు సమాచారం అందించి లావాదేవీలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యువత ఆసక్తి, సరదా పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ సంబంధాలు.. దేశానికి చెందిన కొంత మంది యువకులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి వారితో మన దేశంలో ఉన్న యువతకు పరిచయాలు ఉండటంతో వారితోనూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు. పందెంలో గెలిచిన వారికి ఓడిన వారు మరుసటి రోజు ఉదయం డబ్బులను అకౌంట్లో వేస్తారు. మధ్యవర్తిగా ఉన్న వారు 10 – 15శాతం కమీషన్ తీసుకుంటున్నారు. తెలిసిన వారు ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తే.. తాము ఎంచుకున్న యాప్ అధికారికమని, ఐటీ కూడా చెల్లిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.అప్పుల ఊబిలో యువత.. యువతకు బెట్టింగ్ ఓ వ్యసనంలా మారింది. కొందరు ఎలాంటి పనులు చేయకుండా బెట్టింగ్పైనే ఆధారపడుతున్నారు. అయితే పట్టణాలతో పాటు పల్లెల్లోనూ బెట్టింగ్లతో డబ్బులు నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. చివరకు అప్పులపాలై ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. మరికొందరు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. బెట్టింగ్ను అరికట్టకపోతే పెను ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. సరదా కోసం బెట్టింగ్ కాసిన ఎంతో మంది వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్లో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం తగదని.. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోకన్వీనర్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాడూరు మండలం పాపగల్లో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతర పోరాటాలతోనే కార్మికుల డిమాండ్లు సాధ్యమవుతాయన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు, రాంచంద్రయ్య, కృష్ణయ్య, చెన్నయ్య, బాలయ్య పాల్గొన్నారు. రామన్పాడులో 1,015 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల్లో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 15 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 52 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. హ్యాండ్బాల్ పోటీలకు పాలమూరు క్రీడాకారులు మహబూబ్నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం నుంచి శనివారం వరకు జరిగే జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ పోటీ లకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సాయి వివేక్, ఎండీ నవాజ్ తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజనీకాంత్రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్కుమార్, పీఈటీ ప్రణయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. తుర్క కాశలను ఆదుకోవాలని వినతి స్టేషన్ మహబూబ్నగర్: అన్ని రంగాల్లో వెనుకబడిన తుర్క కాశ (బీసీ–ఈ)లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధులు ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్కు వినతిపత్రం అందజేశారు. బీసీ–ఈ 14 నంబర్లో తుర్కకాశ, పత్తార్పోడ్లుగా పిలవబడే ముస్లిం కులస్తులు బండలు కొట్టుకుంటూ అరకొర జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తుర్కకాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతరం కొత్వాల్ను ఘనంగా సన్మానించారు. తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జుబేర్, ఉపాధ్యక్షుడు షేక్ ఖాజా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబుబకర్, సలహాదారులు చోటో హుస్సేన్మియా, జిల్లా ఇన్చార్జీ పాష, మహెబూబ్ పాల్గొన్నారు. -
మహనీయుడు.. జగ్జీవన్రాం
నాగర్కర్నూల్: ‘సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్రాం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద బాబు జగ్జీవన్రాం జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి కలెక్టర్ బాబు జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబుజగ్జీవన్రాం దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడిగానే కాకుండా, నిస్వార్థ సేవ, న్యాయ పోరాటానికి ప్రతీకగా నిలిచారని, సామాజిక శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి, నిస్వార్థంగా కొనసాగించిన ఉద్యమాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక సమానత్వం, ఐక్యత, విలువలను పాటించాలని, ఆయన చూపిన మార్గం, ఇచ్చిన సందేశం మనకు నిరంతర స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడుతూ జగ్జీవన్రాం గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడని, ప్రజాప్రతినిధిగా తనదైన ముద్రను వేశారన్నారు. దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరువలేనిదని, భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని, ఆయన ఆదర్శంగా యువత ముందుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్రాం జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రావణ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, ఏఎస్డబ్ల్యూఓ శ్రీకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
కందనూలు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం పథకం కోసం జిల్లాలోని బీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి శాఖ అధికారి ఖాజానాజిమ్ అలీ అప్సర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా ప్రాతిపదికన జిల్లా, మున్సిపాలిటీ, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారని, రూ.50 వేలు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంకు రుణం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇచ్చి మిగిలిన 30 శాతం బ్యాంకు రుణాల ద్వారా గ్రౌండింగ్ చేస్తారన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవడానికి ఈనెల 14 వరకు గడువు ఉందని చెప్పారు. బీజేపీ బలోపేతానికి కృషి చేద్దాం కందనూలు: జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా సహకరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మదగని శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించి, రైతులు, మహిళలు, యువత, వివిధ వర్గాల సమస్యలపై ఉధృతంగా పోరాడాలని తీర్మానిచారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సుధాకర్రెడ్డి, దిలీప్చారి, జిల్లా మాజీ అధ్యక్షుడు సుధాకర్రావు, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు. పట్టుబడిన దొడ్డు బియ్యం గోదాంకు తరలింపు పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తపేట బాలాజీ రైస్మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న 624 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని శనివారం కొల్లాపూర్ సివిల్ సప్లయ్ గోదాంకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎముల నాయక్ తెలిపారు. అలాగే రైస్మిల్ యజమాని సునీల్కుమార్పై పోలీస్స్టేషన్లో క్రిమినల్ కే సు, ఎన్ఫోర్స్ కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాలాజీ రైస్మిల్లు సీజ్ చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
రోజువారీ కూలి రూ.300 నుంచి రూ.307కు పెంపు ●సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనం రూ.307కు పెరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సగటు కూలి రూ.300 వచ్చేలా కొలతలు తీసి కూలీలతో పనులు చేయించాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – ఓబులేసు, డీఆర్డీఓ మరింత పెంచాలి.. ఉపాధి హామీ ద్వారా ఇస్తామన్న రూ.307 కూలి ఏమాత్రం సరిపోదు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత పెంచాలి. బయట వ్యవసాయ, ఇతర పనులకు వెళ్తే రూ.600 దాకా కూలి వస్తది. ప్రభుత్వం ఇచ్చే కూలి సరిపోక వ్యవసాయ ఇతర పనులకే పోతున్నాం. – లక్ష్మయ్య, ఉపాధి కూలీ, గట్టురాయిపాకుల నాగర్కర్నూల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలీలకు మేలు చేసేందుకు, కూలి చెల్లింపుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మరోమారు ఉపాధి హామీలో చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన కూలిని ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 2005 సంవత్సరంలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభం కాగా మొదట్లో రూ.87.50 చెల్లించేవారు. అయితే ప్రతిఏటా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం కూలీలకు రూ.300 చెల్లిస్తున్నారు. కాగా ప్రస్తుతం పెంచిన వాటితో ఉపాధి కూలి రూ.307కు చేరుకుంది. గతేడాది రూ.300.. జిల్లాలో మొత్తం 1,11,181 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 1,69,870 మంది కూలీలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన కూలితో పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. 2022 మార్చి వరకు కూలీలకు రోజుకు రూ.245 చెల్లిస్తుండగా.. అదే ఏడాది మార్చిలో రూ.12 పెంచి రోజువారీ కూలిని రూ.257 చెల్లించారు. తర్వాత 2023 ఏప్రిల్లో కూలిని మరో రూ.15 పెంచడంతో రూ.272కు చేరుకుంది. 2024లో రూ.28 పెంపుతో రూ.300లకు చేరుకోగా.. ఈ ఏడాది రూ.7 పెంచడంతో రూ.307కు చేరుకుంది. పెంచిన ఈ కూలిని ఈ నెల నుంచే అమలు చేసేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే గతేడాది ఉపాధి కూలి రూ.300 వరకు ఉన్నా ఒకరోజు సగటు వేతనం రూ.201 వరకే అందింది. కాబట్టి ఈ ఏడాది ప్రతి కూలీకి సగటున రూ.300 అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది 38.30 లక్షల పనిదినాల లక్ష్యం నిర్దేశించగా, ఇందుకోసం రూ.114 కోట్ల అంచనా బడ్జెట్ వెచ్చించారు. చెల్లింపుల్లోనూ పారదర్శకతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు గతేడాది సగటున రూ.201 మాత్రమే చెల్లింపు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపని ప్రజలు వ్యవసాయ పనులకే మొగ్గుచూపుతున్న వైనం ప్రైవేట్ వైపే మొగ్గు.. ఉపాధి హామీ పథకంలో కూలి ప్రతిఏటా పెంచుతున్నా జిల్లాలో కూలీలు మాత్రం ఉపాధి పనులకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో వేసవిలో కూలీలకు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపేవారు. అయితే ప్రస్తుతం రూ.300 కూలి చెల్లిస్తున్నా.. పనుల కొలతల ప్రకారమే ఇస్తుండటంతో కూలీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. దీనికితోడు ప్రైవేట్లో కూలీల కొరత ఉండడం, కూలి కూడా రూ.500 నుంచి రూ.600 వరకు వస్తుండటంతో కూలీలు ప్రైవేట్ పనులకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల సమయంలో కూలీలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో రూ.700 వరకు కూలి చెల్లించడమే కాకుండా కూలీలు వెళ్లేందుకు వాహన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి పనులు మానేసి ఇతర పనులపై కూలీలు ఆసక్తి చూపుతున్నారు. -
గ్రామ పాలనాధికారి కొలువులపై ఆశలు
అచ్చంపేట: గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గ్రామ పాలనాధికారి (జీపీఓ) పేరిట కొత్త అధికారుల నియామకానికి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇందుకనుగుణంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి గత నెల 29న జీఓ 129 విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)లుగా పనిచేసి వేరే శాఖల్లోకి వెళ్లిన వారు తిరిగి మాతృ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. వీరికి కూడా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖలోకి వచ్చే వారికి కామన్ సీనియార్టీ వర్తించదని, సర్వీస్ మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారని ప్రభుత్వం జీఓలో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై వీఆర్వో, వీఆర్ఏల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గూగుల్ ఫాం ద్వారా తమ ఆప్షన్లను మరోసారి ఈ నెల16 వరకు తెలియజేయాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. కాగా.. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించగా.. 245 మంది అంగీకరించారు. అయితే ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ లేదా ఇంటర్ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు. గతంలో ఆప్షన్లు ఇచ్చిన వారిలో ఇంటర్ విద్యార్హత లేని వారు కూడా ఉన్న నేపథ్యంలో.. తాజాగా డిగ్రీ, ఇంటర్ చదివిన వారికి మాత్రమే ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వారు.. జిల్లాలో 450 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. భూ వివాదాలు, ధ్రువపత్రాల జారీ, విపత్తుల సాయం, లబ్ధిదారుల ఎంపిక వంటి వాటిపై గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలు క్షేత్రస్థాయిలో విచారణ చేసేవారు. అయితే గత ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా 2022 ఆగస్టు 1న 176 మంది వీఆర్వోలను 25 శాఖల్లో సర్దుబాటు చేయగా, ఏడాది తర్వాత 2023 ఆగస్టు 10న 502 మంది వీఆర్ఏలను నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని 18 శాఖలకు కేటాయిస్తూ సర్వీసును క్రమబద్ధీకరించింది. మిగులు సిబ్బంది పేరిట ఇతర జిల్లాల్లో విధుల్లో చేరారు. అయితే ఈ ఏడాది జనవరిలో ప్రస్తుత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు అయిన వారి నుంచి మాతృ శాఖకు వచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో గ్రామస్థాయి పాలనాధికారి కోసం 228 మంది, సర్వేయర్కు 17 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 121 మంది వీఆర్వోలు, 124 మంది వీఆర్ఏలు ఉండగా.. పీజీ ఇద్దరు, బీటెక్ ముగ్గురు, 99 మంది డిగ్రీ, 42 మంది ఇంటర్, 99 మంది ఇంటర్లోపు అర్హత కలిగిన వారు ఉన్నారు. పూర్వపు వీఆర్ఓ, వీఆర్ఏలకు ప్రాధాన్యం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారే అర్హులు ఈ నెల 16 వరకు గూగుల్ ఫాం ద్వారా మరో అవకాశం మార్గదర్శకాలు సవరించాలి జీపీఓ పోస్టుల కోసం పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను సవరించాలి. జీఓ 129లో మార్పులు చేయాలి. ఈ నెల 16 వరకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయకపోతే వీఆర్వో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ఎలాంటి పరీక్ష లేకుండా మళ్లీ రెవెన్యూలోకి తీసుకొని కామన్ సీనియార్టీ వర్తింపజేయాలి. విద్యార్హత, చివరి తేదీ నిబంధనలు కూడా తొలగించాలి. – వెంకటేష్, పూర్వ వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడు పునరాలోచనలో.. జీపీఓ పోస్టుల కోసం ప్రభుత్వం జనవరిలో పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుంది. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫాం ద్వారా ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల్లో చర్చ మొదలైంది. జీఓ 129 మార్గదర్శకాల ప్రకారం పాత సర్వీసును పరిగణలోకి తీసుకోమని చెప్పడంతో ఆప్షన్లు ఇచ్చిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలను వదులుకొని రెవెన్యూలోకి వెళ్తే వచ్చే ప్రతిఫలం ఏమిటని ఆలోచిస్తున్నారు. జీరో సర్వీస్ కాకుండా తాము ఉద్యోగంలో చేరిన నాటిని నుంచి పరిగణిస్తే తప్ప వెళ్లడానికి సుముఖంగా కనిపించడం లేదు. ఈ క్రమంలో జీపీఓ పోస్టులకు ఎంత మంది గూగుల్ ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో 9 రకాల విధులు రూపొందించారు. అవన్నీ గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు ఉన్నప్పుడు నిర్వహించినవే కావడం గమనార్హం. -
చిన్నారులకు సమగ్ర కంటి పరీక్షలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని అంగన్వాడీల పరిధిలోని ఆరేళ్లలోపు చిన్నారులకు సోమవారం నుంచి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని పీహెచ్సీల పర్యవేక్షణ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 47,317 చిన్నారులకు ప్రాథమిక దశలోనే సమగ్ర కంటి పరీక్ష నిర్వహించి తగిన మందులతో చికిత్స నిర్వహించి.. కంటి అద్దాలు అందించడం వలన అంధత్వాన్ని నివారించగలమన్నారు. చిన్నారుల్లో విటమిన్–ఏ లోపం, మెల్ల కన్ను, టెరీజియం, హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి తదితర కంటి సమస్యలు వస్తాయని, వీటిని నివారించడానికి ప్రతి చిన్నారికి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం, నేత్రాధికారులు సంయుక్తంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చిన్నారుల సమగ్ర కంటి పరీక్ష కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు, ఆశాలు తమ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే సమగ్ర కంటి పరీక్ష శిబిరానికి చిన్నారులు హాజరయ్యేలా చూడాలన్నారు. శిశువులు, చిన్నారుల్లో ఎవరైనా టీకాకరణ చేయించుకోని వారు ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో టీకాకరణ క్యాచ్ అప్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు, ప్రోగ్రాం అధికారి రవికుమార్, రాజశేఖర్, డీపీఓ రేణుయ్య, ఏపీఓలు మినహాజ్, శ్రీనివాసులు, నిరంజన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
నాగర్కర్నూల్: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ పథకాలను అందించే బాధ్యత అధికారులదేనని, ఎవరైనా పథకానికి దూరంగా ఉంటే, వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 46 సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసి మాట్లాడారు. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ● జిల్లాకేంద్రంలో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయ సమీపంలో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహిళా సంఘాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు. అనంతరం ఎల్ఐసీ కార్యాలయం పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు, మాజీ కౌన్సిలర్లు సునేంద్ర, నిజాం తదితరులు పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యంతో దందా
అక్రమార్కులకు కలిసొచ్చిన సన్నబియ్యం పంపిణీ అందని మార్గదర్శకాలు.. ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రేషన్షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఉన్న పాత దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వ స్టాక్ పాయింట్లకు అప్పగించాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించారు. రేషన్ షాపులకు కేటాయించిన స్టాక్ మేరకు మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకపోతే వారి నుంచి ఈ మేరకు డబ్బులు వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ రేటు కన్నా అధిక ధరలకు దొడ్డుబియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైస్ మిల్లుల్లో కేటాయించిన మేరకు ప్రభుత్వానికి సీఎమ్మార్ ఇవ్వకుండా పెద్దఎత్తున రేషన్బియ్యాన్ని నిల్వ చేసుకుని సీఎమ్మార్గా చూపుతూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిందే.. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం రేషన్ దుకాణాల వద్ద ఉన్న పాత బియ్యం స్టాక్ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల్లోని దొడ్డు బియ్యాన్ని సైతం ఎఫ్సీఐకి అప్పగించాలి. – రాజేందర్, పౌర సరఫరాల శాఖ మేనేజర్, నాగర్కర్నూల్ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా ఇప్పటి వరకు కొనసాగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు తెరపడుతుందని భావిస్తుండగా.. ఇప్పటికే టన్నుల కొద్దీ పోగు చేసుకున్న పాత బియ్యంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. పాత దొడ్డు బియ్యాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్టాక్ పాయింట్లు, ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ నిల్వ చేసుకుని, అక్రమ రవాణా చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటలో ఉన్న రైస్మిల్లులో 300 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సీజ్చేసిన మిల్లులో.. పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్తపేట బాలాజీ రైస్మిల్లు గతంలో సీఎమ్మార్ కింద బియ్యం ఇవ్వకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. అయితే ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా, అక్రమ దందా చేయడంతో సీజ్ చేసినప్పటికీ మళ్లీ దందా కొనసాగిస్తుండటం గమనార్హం. శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డీసీబీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఆనంద్కుమార్ రైస్మిల్లుపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రైస్మిల్లులో 600 బస్తాల్లో నిల్వ చేసిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ మిల్లు కేంద్రంగా పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వచేస్తూ దందా చేస్తున్న మిల్లు యజమాని సునీల్కుమార్పై కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రైస్మిల్లుల్లో పెద్ద ఎత్తున రేషన్బియ్యాన్ని నిల్వ చేస్తూ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ దొడ్డు బియ్యం డంపు చేసిన మిల్లర్లు పాతవి స్టాక్ పాయింట్లకు తరలించకుండా దందా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి తాజాగా పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ రైస్మిల్లులో 300 క్వింటాళ్ల దొడ్డు బియ్యం స్వాధీనం -
సీతమ్మకు కీలక పదవి
నారాయణపేట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్రెడ్డి హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో జన్మించారు. ఆర్బీవీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా.. దయాకర్రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీడీపీని వీడుతూ కంటతడి.. సుదీర్ఘకాలం దయాకర్రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్లో దయాకర్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్రెడ్డి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి దయాకర్రెడ్డి కుటుంబానికి పెద్దపీట రాజకీయ రంగ ప్రస్థానం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు. 2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో సీతా దయాకర్రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. -
భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
బిజినేపల్లి: ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలకమైన ఘట్టం ఇంటర్ విద్య అని.. ఈ దశలో విద్యార్థులు తప్పటడుగులు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ బతకాల్సి వస్తుందని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా వార్షిక పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పే టీ–శాట్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీఈఓ బిజినేపల్లి కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో కలిసి వీక్షించారు. వీసీ అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకొని.. అందుగు తగు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, శోభారాణి, నాగేందర్, ఎంఈఓ రఘునందన్రావు, ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగిరం చేయాలి
నాగర్కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అమరేందర్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువవికాసం, తాగునీటిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలు అందరూ ఇల్లు కట్టుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని నిర్మాణంలో పురోగతి సాధించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వేసవికాలం యాక్షన్ ప్లాన్ ప్రకారం మున్సిపల్, పంచాయతీ, మిషన్ భగీరథ, ఎంపీడీఓలు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పైపులైన్ లీకేజీ, మరమ్మతు వంటివి ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం ద్వారా జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామన్నారు. ఆదివారం వరకు వందశాతం అన్ని రేషన్ షాపులలో స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యం పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగిందని, సన్న బియ్యం అందుకున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రికి కలెక్టర్ వివరించారు. -
వైద్యులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నాగర్కర్నూల్ క్రైం/ బిజినేపల్లి: వైద్యులు చట్టాలపై అవగాహన పెంచుకుంటే నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్లపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని జిల్లా జడ్జి రాజేష్బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఐసీఎఫ్ఏఐ లా స్కూల్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు శనివారం న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, మెడికల్ లీగల్ నేర పరిశోధనలో మెడికల్ సర్టిఫికెట్ల పాత్రపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోస్టుమార్టం నివేదికతోపాటు వైద్య సంస్థల్లో ర్యాగింగ్ పరిణామాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరంగా శిక్షకు గురవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే చాలా కేసుల్లో వైద్యుల సహాయం అవసరం అవుతుందని చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ లెక్చరర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని సద్వినియోగం చేసుకొని భవిష్యత్లో ఉన్నత స్థాయిలో స్థిరపడి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత ఎక్ఫై లా స్కూల్ ప్రొఫెసర్ దామోదర్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కల్నల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు, సునీల్, ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలలో.. బిజినేపల్లి మండలంలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి రాజేష్బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులు సర్టిఫైడ్ చేసిన వాటినే కొనేలా అవగాహన కల్పించాలని, వాటికి రశీదు తప్పనిసరిగా తీసుకునేలా చూడాలన్నారు. తద్వారా ఏదైనా కంపెనీ ద్వారా రైతులకు నష్టం వాటిల్లితే కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు. మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు తక్కువగా విక్రయించరాదని, అలా ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరంగా న్యాయం పొందడంపై జిల్లా న్యాయ సేవా సమితి కార్యదర్శి సబిత వివరించారు. మండలంలోని మంగనూర్ జెడ్పీహెచ్ఎస్లో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కళాశాల అసోసియేట్ డీన్ సుధాకర్, శాస్త్రవేత్తలు సత్యనారాయణ, సునీల్ ప్రేమ్, న్యాయవాదులు రవికాంత్రావు, దామోదర్రెడ్డి, మధుసూదన్రావు, శ్రీరామ్ ఆర్య, పరశురాములు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం : డీజీపీ
గద్వాల క్రైం: కేసుల నమోదు విషయంలో ఏ స్థాయి అధికారి అయినా నిర్లక్ష్యం.. అవినీతి, అక్రమ దందాల వ్యవహారంలో అంటకాగినట్లు బహిర్గతమైతే ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ప్రజలకు, యువతకు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఉండాలని జిల్లా పోలీసు శాఖకు డీజీపీ దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్లలో ఆన్లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువత బెట్టింగ్ యాప్ల ద్వారా తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాధ్యమైనంత వేగంగా నిందితులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కల్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి.. రౌడీ షిట్ ఓపెన్ చేయాలన్నారు. మావోయిస్టు, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలపై ద్వేషం, హింసాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని సూచించారు. 9న కలెక్టరేట్ ముట్టడి నాగర్కర్నూల్ రూరల్: రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తున్నామని సంఘం నాయకుడు వార్ల వెంకటయ్య అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే కలెక్టరేట్ల ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు జిల్లా సంఘం నాయకులు కృష్ణాజీ, అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి సూర్యశంకర్గౌడ్, నాయకులు చంద్రమోళి, రైతు సంఘం నాయకులు కృష్ణయ్య, కొండన్నగౌడ్, నారాయణ, కుర్మయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు కొల్లాపూర్: పట్టణం నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం ఉమాశంకర్ తెలిపారు. ప్రతిరోజూ కొల్లాపూర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బస్సు కల్వకుర్తి, ఆమనగల్, తుక్కుగూడ మీదుగా బయలుదేరుతుందని, మరుసటి రోజు తెల్లవారుజామున యాదగిరిగుట్ట నుంచి తిరుగు ప్రయాణం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
మిల్లు యాజమానిపై కేసు
పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తపేట సమీపంలో ఉన్న బాలాజీ రైస్ మిల్లులో డీసీబీ కొత్తకొట శ్రీనివాస్రెడ్డి, ఎన్ఫోర్సుమెంట్ ఏహెచ్పీ ఆనంద్కుమార్ దాడులు నిర్వహించి 600 బస్తాల దొడ్డు బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజిలెన్సు అధికారులు పట్టుకున్న 300 క్వింటాళ్ల బియ్యాన్ని మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ గోదాంకు తరలించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన మిల్లు యాజమాని సునీల్కుమార్పై కేసు నమోదు చేసి పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్ తరలించినట్లు అధికారులు చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి రవీందర్, తహసీల్దార్ రాజశేఖర్రెడ్డి, సిబ్బంది నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా కోచింగ్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తమ పిల్లలు ఐఐటీ ఎట్రెన్స్ రాసి ఇంజినీర్ కావాలలని, నీట్ రాసి డాక్టర్ కావాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు ప్రైవేటు విద్యాసంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. సీటు కోసం రూ.లక్షలు ఖర్చు చేయడానికై నా తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈ కోర్సులకు డిమాండ్ రావడంతో ఇటు ప్రైవేటు ఇంటర్ కళాశాలలతో టు కోచింగ్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. అయితే ప్రభుత్వం గత నెల 29 నుంచి ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. కానీ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాకేంద్రంలోని చాలా ప్రైవేటు ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఎఫ్సెట్ వంటి వాటిపై కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క కోచింగ్ సెంటర్కు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. అయినప్పటికీ యథేచ్ఛగా కళాశాలలు తెరిచి ఉదయం నుంచి రాత్రి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధగా వీటిని కొనసాగిస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్, విద్యాశాఖ అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల కోచింగ్ సెంటర్లు కలిపి 30కిపైగా ఉండగా.. వీటిలో సుమారు 5వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అధిక మొత్తంలో ఫీజులు.. ఐఐటీ, నీట్ వంటి కోచింగ్లకు యాజమాన్యాలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇందు లో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పేరిట ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఐఐటీ, నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు రూ. 60 వేలకు పైగా, షార్ట్టర్మ్కు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో హాస్టల్ ఫీజు రూ.4 వేలు, మెటీరియల్ రూ.10 వేల వరకు అదనంగా దండుకుంటున్నారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు రెండు, మూడు బ్రాంచ్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు గురుకుల, నవోదయ, ఆర్మీ స్కూల్ వంటి వాటికి రూ.15–20 వేల వరకు వసూ లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో కానిస్టేబుల్, వీఆర్వో, వీఆర్ఏ వంటి వాటికి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థి సంఘాల నిరసన.. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో సైతం కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్ తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. గతంలో పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని, ఇవ్వాల్సిన మెటీరియల్ ఇవ్వలేదని, సరిగా తరగతులు చెప్పలేదని పలువురు విద్యార్థులు విద్యాశాఖతో పాటు పోలీస్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. మహబూబ్నగర్లో ఓ ప్రైవేటు కళాశాల ఎదుట నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఇంటర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ పేరిట పెద్దఎత్తున వ్యాపారం ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కోచింగ్ పేరిట తరగతులు నవోదయ, గురుకుల, కానిస్టేబుల్, వీఆర్వో ఉద్యోగాలకు సైతం.. ప్రభుత్వ అనుమతులు లేకుండానేయథేచ్ఛగా నిర్వహణ -
పిడుగు పడి ఇద్దరు కూలీలు..
అచ్చంపేట: పదర గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పదర గ్రామానికి చెందిన రైతు పోగుల వినోద్ పొలంలో వేరుశనగ పంట తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కూలీలు కొంత మంది చెట్ల కింద తలదాచుకోగా.. చెట్ల కింద పిడుగులు పడుతాయనే ఉద్దేశంతో వర్షంలోనే ఒకే దగ్గర నిల్చున్న సుంకరి సైదమ్మ(45), గాజుల వీరమ్మ(55), సుంకరి లక్ష్మమ్మలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే పదర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కోడోనిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. పదర ఎస్ఐ సర్దామ్, ఆర్ఐ శేఖర్ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. గేదెలు మేపుతుండగా.. మానవపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) గేదెలను మేపేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ చంద్రకాంత్ను సంప్రదించగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. బుడమొర్సులో మరొకరు.. శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని బుడమర్సు గ్రామానికి చెందిన మాదిగ రాజు, తిమ్మక్కల చిన్న కుమారుడు మహేంద్ర(21) గురువారం గేదెలు మేపడానికి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు మహేంద్ర సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా మహేంద్ర రాకపోవడంతో కుంటుంబ సభ్యులు తుంగభద్ర నదితీరానికి వెళ్లి చూడగా విగతజీవుడై కనిపించడంతో బోరున విలపించారు. -
కలెక్టరేట్కు బాంబు బెదిరింపు
నాగర్కర్నూల్: జిల్లా కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేగింది. గురువారం ఉదయం 7:24 గంటలకు జిల్లా కలెక్టర్ మెయిల్కు ఈడీ బేస్డ్ పైప్ బాంబ్తో సాయంత్రం 3.20 గంటలకు కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని మెసేజ్ వచ్చింది. ప్రతి రోజు ఉద్యోగులు వచ్చిన వెంటనే కలెక్టర్కు వచ్చిన మెయిల్స్ చెక్ చేయడం సర్వసాధారణమే. కాగా గురువారం వచ్చిన ఈ బెదిరింపు మెసేజ్ను గమనించిన సెక్షన్ ఉద్యోగులు విషయాన్ని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఏఓ ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు ఎస్పీ రామేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్యలు బాంబ్స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో అక్కడికి చేరుకొని అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకపోవడంతో ఫేక్ మెసేజ్గా పోలీసులు తేల్చారు. అయితే ముప్పల లక్ష్మణ్రావు పేరుతో వచ్చిన ఈ మెసేజ్ చివరి అల్లాహూ అక్బర్ అని రాయడం గమనార్హం. బాంబు బెదిరింపు రావడంతో కలెక్టరేట్ ఉద్యోగులు సైతం బయటికి వెళ్లిపోయారు. విచారణ చేస్తున్నాం: శ్రీనివాసులు, డీఎస్పీ, నాగర్కర్నూల్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు విషయంలో విచారణ చేస్తున్నాం. ఇది ఫేక్ మెసేజే. కలెక్టరేట్లో తనిఖీలు కూడా చేపట్టాం. మెయిల్ ఐడీ ఎక్కడి నుంచే వచ్చిందనే విషయం కనుగోనేందుకు ఐపీ అడ్రస్ కోసం ఐటీ సిబ్బంది ద్వారా విచారణ చేస్తున్నాం. ముప్పల లక్ష్మణ్రావు పేరుతో మెయిల్ మధ్యాహ్నం 3.30 గంటలకు పేల్చేస్తామని హెచ్చరిక తనిఖీ చేసి.. ఫేక్ మెసేజ్ అని తేల్చిన పోలీసులు -
పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం
నాగర్కర్నూల్ రూరల్/ పెద్దకొత్తపల్లి: పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం నాగర్కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి, పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకోల్, చెన్నపురావుపల్లి, మారెడ్దిన్నే గ్రామాల్లో రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఈ పథకంపేదల ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని, రైతుల కష్టానికి గౌరవం దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, సబ్సిడీ సిలిండర్లు, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, రేషన్ కార్డులను అర్హులైన వారికి అందజేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. కల్వకోల్లో రెవెన్యూ అధికారులతో భూములపై సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు తహసీల్దార్ తబిత, నాయకులు మణెమ్మ, నాగేష్, సూర్యప్రతాప్గౌడ్, శ్రీనివాసులు, కృష్ణయ్య, విష్ణువర్ధన్రెడ్డి, వెంకటస్వామి, ఏసయ్య, సత్యం, చంద్రయ్య, రవికుమార్ పాల్గొన్నారు. విద్యాశాఖలో పరస్పర బదిలీలు కందనూలు: విద్యా శాఖలో పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లా నుంచి 55 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అవుతుండగా.. వేరే జిల్లాల నుంచి నాగర్కర్నూల్కు 55 మంది ఉపాధ్యాయులు రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు తర్వాత జోన్లను విభజించింది. ఆ సందర్భంలో జోన్ల వారీగా బదిలీ చేయడంతో నాగర్కర్నూల్ జిల్లాకు చెందినవారు ఇతర జిల్లాలకు పెద్దఎత్తున బదిలీలు అయ్యారు. దీంతో వారంతా తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని తమను సొంత జిల్లాకు బదిలీ చేయాలంటూ ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వడంతో దీంతో ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారు నాగర్కర్నూల్కు బదిలీపై వస్తే వారి స్థానంలో ఇక్కడ పనిచేస్తున్న వారు ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. అయితే పరస్పర బదిలీలకు సంబంధించి ఇరువురు కలిసి దరఖాస్తు చేసుకున్న వారివి మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. దీంతో నాగర్కర్నూల్ జిల్లా నుంచి రంగారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట తదితర జిల్లాలకు 55 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. వారి స్థానంలో నాగర్కర్నూల్కు 55 మంది రానున్నారు. బార్ల కోసం దరఖాస్తు చేసుకోండి నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని అచ్చంపేటలో రెన్యూవల్ కానీ రెండు బార్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బార్ ఎకై ్సజ్ టాక్స్ ఏడాదికి రూ.30 లక్షల రుసుం ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు రూ.లక్ష dirtrictproh&exiseofficer, nagarkurnool పేరిట దరఖాస్తు తీసి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు అందజేయాలన్నారు. దరఖాస్తుతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్, పాన్ కార్డు జతచేయాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 29న కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన నూతన లైసెన్స్దారుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. -
ప్రైవేటులో కడుపు కోతలే
నాగర్కర్నూల్ క్రైం: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రసవాలే చేయాలని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలని చెబుతోంది. అయితే ప్రభుత్వ ఆస్పపత్రుల్లో మాత్రమే ఈ లక్ష్యం నెరవేరుతుండగా.. ప్రైవేట్లో మాత్రం ఈ నిబంధనలు తుంగలో తొక్కి.. ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతేడాది మార్చి 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,342 సిజేరియన్లు చేయడమే ప్రైవేట్లో కడుపు ‘కోత’లకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా.. రూ.వేలకు వేలు చెల్లించి ప్రసవాలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారితోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తూ సాధారణ ప్రసవాలు చేస్తుండటంతో గర్భిణులు ఎక్కువ సంఖ్యలో కాన్పులు చేయించుకునేందుకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలోని జనరల్, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు చేస్తుండటంతో ప్రైవేట్ కన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాసుల కోసమే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు చేసేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశాలు ఉండటంతో ఆ దిశగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కానీ, జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లే ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల కోసం శస్త్రచికిత్సలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో సాధారణ, సిజేరియన్ ప్రసవాల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. సాధారణ సిజేరియన్లు మొత్తం కాన్పులు ప్రసవాలు 4,237 3,839 8,076 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇలా.. సాధారణ సిజేరియన్లు మొత్తం కాన్పులు ప్రసవాలు 653 2,342 2,995 తనిఖీలు చేస్తున్నా.. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలకు సంబంధించి ప్రతినెలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్లో జరిగే సిజేరియన్లు కేవలం లెక్కలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు తూతూమంత్రంగా నోటీసులు అందజేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకే మొగ్గు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న వైద్యాధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ కాన్పులు అధికం ఆడిట్ నిర్వహిస్తున్నాం.. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుండడంతో ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేట్లోనూ సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య, ఆరోగ్య శాఖ పరంగా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. డబ్బుల కోసం సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆడిటింగ్ నిర్వహిస్తున్నాం. – స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ -
సూరాపూర్లో మరో రైతు..
లింగాల: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో స్టార్టర్ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
చర్యలు తీసుకోవాలి..
ప్రభుత్వం కళాశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. అన్ని తెలిసి ఇంటర్మీడియట్ శాఖ అధికారులు ఎందుకు అటువైపు వెళ్లడం లేదు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. – సతీష్, ఏబీవీపీ, జిల్లా కన్వీనర్ కళాశాలలు మూసివేయాలి.. జిల్లాలోని అన్ని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. నేటి నుంచి ఏ కళాశాలలో అయినా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ఓ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. – కౌసర్ జహాన్, డీఐఈఓ, మహబూబ్నగర్ గుర్తింపు రద్దు చేయాలి.. జిల్లాకేంద్రంలోని తిరుమల హిల్స్లో ఉన్న ప్రైవేటు కళాశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా ఎంసెట్, నీట్ వంటి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలి. అన్ని తెలిసి తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న డీఐఈఓ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. కళాశాల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తుంటే ఇంటర్మీడియట్ అధికారులు ఏం చేస్తున్నారు. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి● -
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ను పేల్చేస్తామంటూ బెదిరింపు..!
నాగర్ కర్నూల్ : ఓ ఫేక్ బెదిరింపు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో అలజడి సృష్టించింది. కలెక్టరేట్ ను పేల్చేస్తామంటూ టైమ్ మరీ చెప్పి నాగర్ కర్నూల్ కలెక్టర్ కు వచ్చిన ఓ బెదిరింపు మెయిల్.. కాసేపు మొత్తం యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది. ఈ రోజు ఉదయం 7. 30 కి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కలెక్టర్ కు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం గం. 3.30 ని.లకు కలెక్టరేట్ ను పేల్చేస్తామని అందులో ఉంది. దీంతో కలెక్టర అప్రమత్తమై సిబ్బందిని అలెర్ట్ చేశారు. మొత్తం కలెక్టరేట్ అంతా తనిఖీలు చేసింది బాంబు స్క్వాడ్, అయితే అది చివరకు ఫేక్ మెయిల్ అని తేలింది. ఎక్కడా బాంబు లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అది ఫేక్ మెయిల్ అని తేల్చిన కలెక్టర్ రెట్ ఏవో చంద్రశేఖర్.. అయితే అసలు ఆ మెయిల్ చేసింది ఎవరనే దానిని కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. -
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్గౌడ్, హరీశ్గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బదావత్ సంతోష్తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎన్డీఆర్ఎస్ అధికారి డా.హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిఽధి ఫిరోజ్ ఖరేషి, జీఎస్ఐ అధికారులు రాజశేఖర్, కాడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్ తదితరులు ఉన్నారు. లభించని కార్మికుల ఆచూకీ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాద ఘటన బాధాకరం 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పరిశీలన -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం నిర్వహించిన సోషల్ స్టడీస్ పరీక్షకు 10,555 మంది విద్యార్థులకు గాను 10,529 మంది హాజరు కాగా.. 26 మంది గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. గతనెల 21న ప్రారంభమైన పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని చెప్పారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఏ చిన్న ఘటన చోటు చేసుకోకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారన్నారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, వివిధ శాఖల అధికారులు సందర్శించి, పరీక్షలు సజావుగా జరిగేలా పలు సూచనలు చేశారని.. అందుకు అనుగుణంగా పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించినట్లు డీఈఓ తెలిపారు. డీ కోడింగ్ ప్రక్రియ.. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జవాబు పత్రాలను విద్యాశాఖ అధికారులు డీ కోడింగ్ ప్రక్రియను చేపట్టారు. అందుకోసం సిబ్బందిని నియమించారు. వచ్చిన జవాబు పత్రాలు ఏ జిల్లావో తెలియకుండా, వాటికి వేరే నంబర్ ఇచ్చి కంప్యూటరీకరణ చేస్తున్నారు. డీ కోడింగ్లో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాకు 1,33,631 జవాబు పత్రాలను కేటాయించినట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. మూల్యాంకనం కోసం ఇద్దరు కోడింగ్ అధికారులు, ఐదుగురు సహాయ కోడింగ్ అధికారులు, ఏడుగురు సహాయకులతో పాటు చీఫ్ ఎగ్జామినర్లు 64 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 384 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 130 మందిని కేటాయించినట్లు వెల్లడించారు. మూల్యాంకనానికి పకడ్బందీగా ఏర్పాట్లు -
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
నాగర్కర్నూల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26వ వరకు నిర్వహించే తెలంగాణ సార్వత్రిక ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలపై బుధవారం అదనపు కలెక్టర్ చాంబర్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీకి సంబంధించి 4 సెంటర్లలో 404 మంది, ఇంటర్మీడియట్ 4 సెంటర్లలో 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 307 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. ఆ తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సాధారణంగా అన్ని పరీక్షల మాదిరిగానే సార్వత్రిక పరీక్షలకు నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. సమావేశంలో డీఈఓ రమేష్ కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివకుమార్ తదితరులు ఉన్నారు. -
ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చూస్తాం
నాగర్కర్నూల్ క్రైం: ఉర్కొండ మండలం ఊర్కొండపేటలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి పలు సెక్షన్ల కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలను ఎవరు సహకరించరని.. నిందితులను సమాజం బహిష్కరణ చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలతో పాటు ట్యాంక్బండ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పోలీసు నిఘా, పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే పోలీసు, ప్రభుత్వ పరంగానే కాకుండా సమాజంలోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి మానవీయ విలువల్లో మార్పు రావాలని అన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలికి రూ. 25,000 చెక్కు కందనూలు: ఊర్కొండపేటలో అత్యాచారానికి గురైన మహిళకు మహిళా, శిశుసంక్షేమ శాఖ నుంచి రూ. 25,000 చెక్కు అందించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మామిడి రైతుకు.. మార్కెట్ కష్టాలు
కొల్లాపూర్: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ ఏర్పాటు కలగానే మారింది. ఇక్కడ మామిడి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ.. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ప్రైవేటులో విక్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి మామిడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్లో మార్కెట్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణం జరగడం లేదు. ఫలితంగా రైతులు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే పంటను అమ్ముకుంటున్నారు. కొల్లాపూర్లో కలగా మారిన మార్కెట్ నిర్మాణం పండ్ల విక్రయాలకు రైతులకు తప్పని అవస్థలు ప్రైవేటు వ్యాపారుల సిండికేట్తో నష్టాలు మామిడి మార్కెట్ ఏర్పాటుతోనే రైతులకు మేలు -
మార్కెట్ నిర్మించాలి..
కొల్లాపూర్లో మామిడి సాగుచేసే రైతులు వేల సంఖ్య లో ఉన్నారు. ప్రభు త్వం రైతులను పట్టించుకోవాలి. మామిడి మార్కెట్ ఏర్పాటుచేస్తామని కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ మార్కెట్ నిర్మించడం లేదు. ప్రైవేటు మార్కెట్లలోనే రైతులు పంట అమ్ముకుంటున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధు లు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. రైతులందరికీ ఉపయోగపడేలా మార్కెట్ ఏర్పాటుచేయాలి. ఈ ఏడాది పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బాలచంద్రయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి మార్కెట్ నిర్మాణం మార్కెటింగ్ శాఖ పరిధిలోనిద. మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థల సేకరణ కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మామిడి సాగు, దిగుబడి, మార్కెటింగ్ అంశాలను గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు మార్కెట్లకు వెళ్తున్న విషయాలను కూడా తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ ● -
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్పై మంత్రి కీలక ప్రకటన
సాక్షి, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో 15 రోజుల్లో సహయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రమాదం అత్యంత బాధకార ఘటన అన్నారు. గడచిన 40 రోజులుగా సహయక బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని తెలిపారు. మిగిలిన బాధిత కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించినట్టు తెలిపారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును వచ్చే రెండున్నర ఏళ్లలో ఎస్ఎస్బీసీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఇవాళ మంత్రి.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహయక చర్యలను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు నుండి నేటి వరకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లు మంత్రికి వివరించారు. సహయక బృందాల పనితీరును మంత్రి అభినందించారు. -
నాగర్కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, నాగర్ కర్నూల్: ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఇవాళ ఆరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాద్ తెలిపారు.తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి రూ.6 వేలు లాక్కున్నారని చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310, కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.నిందితులు ఊర్కొండ పేటకు చెందిన మరి పాకుల ఆంజనేయులు, సిద్ధిక్ బాబా, మొగుల్దాస్ మనీ అలియాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. దాహం వేసి నీళ్లు అడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. -
సెలవు దినంగా ప్రకటించాలి
స్టేషన్ మహబూబ్నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పోరాటయోధుడు మహాత్మ జ్యోతిరావుపూలే అని, భార్య సావిత్రిబాయితో కలిసి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అలాంటి మహానుభావుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి కార్యక్రమాలు నిర్వహించి అతని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. రిటైర్డ్ డీఈఓ విజయ్కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావుపూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో సత్యశోధక్ అనే సంస్థను ఏర్పాటు చేసి అన్ని కులాలు, మతాలను భాగస్వామ్యం చేసి అణగారిన వర్గాల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు అన్నారు. ఆ మహానీయుని జయంతి రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రముఖ కవి భీంపల్లి శ్రీకాంత్, రమేష్గౌడ్, డాక్టర్ ఎంఎస్ విజయ్కుమార్, సారంగి లక్ష్మీకాంత్, బుగ్గన్న, అశ్విని సత్యం, మహేష్గౌడ్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
జంటలే లక్ష్యంగా దోపిడీలు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. చట్టం తెలిసిన నేరస్తులు.. మైనర్ల జోలికి వెళ్లరు మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్ బాబా, హరీశ్, వాగుల్దాస్, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నారు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి, డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కనీస వసతులకూ దిక్కులేదు.. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమేనా..? ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలింగ్ పెంచుతాం: ఐజీ కల్వకుర్తి టౌన్: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్స్టేషన్కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో బ్లాక్మెయిల్ ముఠా వీడియోలు, ఫొటోలతో బెదిరించి డబ్బుల వసూళ్లు తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే.. ప్రముఖ ఆలయం వద్ద కరువైన పోలీసుల నిఘా -
అంగన్వాడీలు ఒంటిపూటే..
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం హాఫ్డే ప్రకటించడంతో పనివేళలు మార్చారు. గత నెల 15 నుంచే కొనసాగుతుండగా.. రెండు నెలల పాటు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కేంద్రాలు తెరిచి ఉంటున్నాయి. ప్రీ స్కూల్ కార్యక్రమాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కార్యక్రమాలు 12.30 వరకే పూర్తి చేయాలని సూచించారు. వేసవిలో ఎండ తీవ్రతకు చిన్నారులు అవస్థలు పడే అవకాశం ఉండటంతో ఒంటిపూట నిర్వహిస్తున్నారు. ఇది వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాలు తెరిచి ఉంచేవారు. ప్రస్తుతం ఒంటిపూట నిర్వహిస్తున్నందున చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఉదయం 11 నుంచి 11.30 వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు చిన్నారులు ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత టీచర్లు, ఆయాలు వార్షిక సర్వే, కుటుంబాల సందర్శన, ప్రీస్కూలు చిన్నారుల ప్రవేశాల నమోదు, బడి మానిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ● జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, బల్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 46,229 మంది చిన్నారులు, 5,745 మంది గర్భిణులు, 3,772 మంది బాలింతలు ఉన్నారు. ఒంటిపూటతో ఊరట.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు చాలావరకు పక్కా భవనాలు లేవు. అద్దె భవనాలు, పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, విద్యుత్ సౌకర్యం, కనీసం సరైన వెలుతురు, గాలి వసతి లేని కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేక ఇళ్ల నుంచే సీసాల్లో తెచ్చుకుంటున్నారు. ఎండాకాలంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలే కాకుండా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సైతం ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట కేంద్రాల నిర్వహణ చిన్నారులకు ఉపశమనంగా మారింది. అలాగే ఎండ తీవ్రతకు అనుగుణంగా మే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు కొనసాగిస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట నిర్వహిస్తున్నాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలిచ్చాం. సమయ పాలన పాటించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని సూచించాం. వారు నిర్దేశిత చార్ట్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. – లక్ష్మి, సీడీపీఓ, అచ్చంపేట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఎండ నుంచి చిన్నారులకు ఉపశమనం పని వేళల్లో మార్పు.. మే 31 వరకు కొనసాగింపు -
బాధితురాలికి ప్రభుత్వం అండ
ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో అత్యాచార ఘటన జరగడం దారుణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు, పోలీసులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయమై తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ వేగవంతం చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. స్థానికంగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానికులు దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో లైటింగ్ను మెరుగుపర్చడంతోపాటు ఆలయ ప్రాంతానికి చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. అలాగే ప్రతిరోజు పోలీస్ పికెట్ నిర్వహించేలా ఎస్పీతో మాట్లాడానని చెప్పారు. -
అయితే.. రికార్డే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు. 1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు.. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు. రెండో వారంలో కేంద్రాలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన కలెక్టర్లు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు -
అర్హుల గుర్తింపు షురూ
●ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎల్–1 జాబితా పునఃపరిశీలన ● పైలెట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం ● మిగతా గ్రామాలు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు ● ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ ప్రక్రియ పైలెట్ గ్రామాల్లో పనులు ప్రారంభం.. జిల్లాలోని పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. ఏడు మండలాల పరిధిలో 18 మంది లబ్ధిదారులకు ముగ్గు పోశాం. వారు నిర్మాణపు పనులు చేపట్టారు. బేస్మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి రెండు, మూడు రోజుల్లో బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల గుర్తింపునకు రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండు, మూడు రోజుల్లో పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. – సంగప్ప, పీడీ, గృహనిర్మాణశాఖ అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపికలో భాగంగా అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే జనవరి 26న జిల్లావ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 20 గ్రామపంచాయతీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. గ్రామ, మున్సిపల్ వార్డు సభల్లో అర్హుల జాబితాను వెల్లడించింది. తొలి విడతలో 850 మందికి ఇళ్లను మంజూరు చేశారు. అయితే గతంలో అర్హుల జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి.. మిగిలిన గ్రామాలు, పట్టణాల్లో అర్హుల ఎంపికపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను మూడు రకాలుగా విభజించి జాబితాలు తయారు చేశారు. సొంత స్థలాలు ఉన్నవారిని ఎల్–1గా, సొంత స్థలం, ఇల్లు లేని వారిని ఎల్–2గా, ఇతరులను ఎల్–3గా గుర్తించారు. ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలో కమిషనర్ల లాగిన్కు చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తికాగా.. ఇప్పుడు ఎల్–1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 56,486 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. మండలానికి నాలుగైదు బృందాలు.. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పునఃపరిశీలన కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేశారు. ఎల్–1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్–2, ఎల్–3లో చేర్చారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి దరఖాస్తుదారుల వివరాలు సైతం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల లాగిన్కు వెళ్లాయి. మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు.. ఈ ఫిర్యాదులపై కూడా పునఃపరిశీలన చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 850 మంది అర్హులను మినహాయించి.. మిగతా వారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. పైలెట్ గ్రామాల్లో నిర్మాణాలు.. జిల్లాలోని 20 పైలెట్ గ్రామపంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. బిజినేపల్లి మండలం అల్లాపూర్లో ఇద్దరు, చారకొండ మండలం గోకారంలో ఇద్దరు, వంగూరు మండలం మిట్టసదగోడులో ముగ్గురు, కల్వకుర్తి మండలం రంగాపూర్లో ఐదుగురు, బల్మూర్ మండలం జిన్కుంటలో నాలుగు, ఊర్కొండ మండలం నర్పంపల్లిలో ఒకటి, ఉప్పనుంతల మండలం మొల్గరలో ఒకరు.. మొత్తం 18 మంది ఇళ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇంకా 13 పైలెట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ చేశారు. ఇళ్లకు ముగ్గు పోసుకున్న ప్రాంతం ఫొటోలు, అక్షాంశ రేఖాంశాల ఆధారంగా వివరాలను ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేశారు. తదుపరి తనిఖీలకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో నిర్మాణం ఉండాలి. చోటు మారితే జియో ఫెన్సింగ్ ఆధారంగా సులభంగా గుర్తిస్తారు. ఆ నిర్మాణ ఫొటో యాప్లో క్యాప్చర్ కాదు. దీంతో ఇంటి స్థలాన్ని మార్చినట్టుగా అధికారులు గుర్తించి.. లబ్ధిదారులను అనర్హత జాబితాలోకి మార్చి ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తారు. ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన లబ్ధిదారులకు తొలి విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 15 నాటికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొంత అలస్యమైంది. రెండు, మూడు రోజుల్లో ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థికసాయం జమ చేయనున్నట్లు గృహనిర్మాణశాఖ అధికారులు వెల్లడించారు. స్థలం ఉండి పక్కా ఇల్లు లేని వారు (ఎల్–1): 56,486 ఇంటి స్థలం, ఇల్లు లేని వారు (ఎల్–2): 15,812 పక్కా ఇళ్లు కలిగిన వారు: 1,29,392 జిల్లాలో దరఖాస్తులు: 2,33,124 ఇతరులు (ఎల్–3) : 31,434 ఒక్కో నియోజకవర్గానికి మంజూరు చేసిన ఇళ్లు: 3,500 ఎట్టకేలకు మోక్షం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం మొదలుపెడతామని ఎన్నికల ప్రచారంలో పార్టీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన 16నెలల తర్వాత గాని ఇళ్ల నిర్మాణాలు మొదలుకాలేదు. లబ్ధిదారుల గుర్తింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఏడాది క్రితం దరఖాస్తులు అందితే అర్హులను తేల్చి.. గ్రామసభల ద్వారా జాబితా రూపొందించడానికి ఏడాది సమయం పట్టింది. ఐదేళ్లలో సంవత్సరానికి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. తొలి ఏడాది ఎలాంటి పురోగతి లేకుండా గడిచిపోయింది. -
భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్
కందనూలు: జిల్లావ్యాప్తంగా సోమవారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద జామా మసీదు ఫాహి ఇమామ్ అబ్ధుల్ హక్ ప్రత్యేక ప్రార్ధనలు చేయించారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో అందరూ పయనించాలని ఆయన సూచించారు. కాగా, కొల్లాపూర్లోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ● జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల మాట్లాడుతూ.. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన ఈమాన్ నమాజ్ రోజా జకాత్ హజ్ సూత్రాలను ముస్లింలు పాటిస్తూ సోదరభావంతో ముందుకు సాగడం హర్షనీయమన్నారు. ప్రతి ఒక్కరూ బలహీనతలు, వ్యసనాలను జయించి మత గురువుల ప్రబోధాలను ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు కౌన్సిలర్లు సునేంద్ర, జక్కరాజు, బచ్చన్న తదితరులు పాల్గొన్నారు. మసీదులు, ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సా యంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రు లు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సా మూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమ వా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదు పులోకి తీసుకున్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరానన్నారు. ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం ఒళ్లు జలదరించే రీతిలో చిత్రహింసలు జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత యథేచ్ఛగా మద్యపానం, గంజాయి వినియోగం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం -
ప్లాస్టిక్కు చెక్
నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు 16 మంది స్వచ్ఛ సేవకులు అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనూహ్య స్పందన.. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు. వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు మన్ననూరు, దోమలపెంట చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
కల్వకుర్తి టౌన్: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీ రేషన్ దుకాణంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పీసీబీ మెంబర్ బాలాజీసింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి భారమైనా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శలు, అనవసర రాద్దాంతాలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా రేషన్ బియ్యాన్ని తూకం చేసి ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అత్యాచారం చేసి.. నోట్లో మూత్రం పోసి..
సాక్షి, నాగర్కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రు లు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సా మూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వమని వేడుకున్నా కనికరించలేదు. పైగా నోట్లో మూత్రం పోసి అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమ వా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికైనా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పారీ్టకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పారీ్టకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కలి్పంచాలని కోరానన్నారు. -
ఈద్గాలు ముస్తాబు..
కందనూలు: షవ్వాల్ నెలవంక ఆదివారం సాయంత్రం దర్శనమివ్వడంతో ముస్లింలు 30 రోజులపాటు చేపట్టిన ఉపవాస దీక్షలు విరమించారు. సోమవారం రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్)ను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అందరూ కొత్త దుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్దకు ఉదయం 8 గంటలకు ర్యాలీగా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తాగునీరు, నీడ వసతి కల్పించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో పాటు పలు పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఈద్గా పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. పండుగ సందర్భంగా ఆదివారం కిరాణం, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నేడు ఈద్–ఉల్–ఫితర్ దర్శనమిచ్చిన షవ్వాల్ నెలవంక ముగిసిన ఉపవాసదీక్షలు -
పండుగ ఆనందంగా జరుపుకోవాలి : కలెక్టర్
నాగర్కర్నూల్: పవిత్రమైన రంజాన్ పండుగను జిల్లా ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది.. ప్రేమమూర్తిగా మార్పు చెందుతారన్నారు. ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ.. దాతృత్వాన్ని అలవరిచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. -
స్వర్ణాభరణాలంకరణలో వేంకటేశ్వరుడు
స్వర్ణాభరణాలంకరణలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ధగధగా మెరిసిపోతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. విశేషోత్సవాల్లో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తుండగా.. ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజు స్వామివారిని స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. శ్రీరామ నవమి వరకు స్వామివారికి ఈ అలంకరణ ఉంటుంది. దీంతో వారం రోజుల పాటు స్వామివారు స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరించారు. – మహబూబ్నగర్ రూరల్ -
ఎత్తిపోతలు జరిగేనా..?
‘పాలమూరు’ ద్వారా 4 టీఎంసీల నీటి పంపింగ్కు అనుమతులు మోటార్ల బిగింపు పూర్తి.. పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటి వరకు నాలుగు మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు మోటార్లకు విద్యుత్ సరఫరా, చార్జింగ్ వంటి పనులన్నీ పూర్తిచేశారు. డెలివరీ మెయిన్స్ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలే ఎత్తిపోతలు పెండింగ్లో పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా.. నిర్మాణం, విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నా నీటి ఎత్తిపోతలు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా నీటి ఎత్తిపోతలు చేపడుతామని సంబంధిత అధికారులు చెబుతుండగా ఆచరణలో అమలుకు నోచుకుంటుందా.. లేదా.. అనేది సందేహంగా మారింది. 4 టీఎంసీలకు అవకాశం.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లూరు సమీపంలోని మొదటి లిఫ్ట్ను ప్రారంభించగా.. ఒక మోటారు ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తాగునీటి అవసరాల కోసం ఈ సీజన్లో నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్లోనే కృష్ణానది పరవళ్లు తొక్కగా.. నాటి నుంచి ఎత్తిపోతలు చేపడతామని అధికారులు చెబుతూ వస్తుండగా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిసారిస్తేనే.. పాలమూరు ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం జరగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా నీటి ఎత్తిపోతలు జరిగితే.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరుతాయి. కేఎల్ఐ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న భారం కూడా తగ్గుతుంది. పాలమూరు ప్రాజెక్టు పంప్హౌజ్లో ఏర్పాటుచేసే మోటార్లు 9 ఒక మోటారుతో రోజు ఎత్తిపోసే నీరు 3,000 క్యూసెక్కులు ఈ సీజన్లో తాగునీటి అవసరాలకు అనుమతి ఉన్న నీటి వాటా 4 టీఎంసీలు నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు తుది దశకు పనులు.. ఎల్లూరు లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. సివిల్ వర్క్స్, డెలివరీ మెయిన్స్ పనులు తుది దశకు చేరాయి. అక్టోబర్ తర్వాత ఎత్తిపోతలు చేపట్టాలని భావించినా.. మోటార్ల బిగింపు, విద్యుత్ సరఫరా పనులు కొనసాగుతున్నందున సాధ్యం కాలేదు. తాగునీటి అవసరాలకు ఈ సీజన్లో 4 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్లో తప్పనిసరిగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటి పారుదలశాఖ పంప్హౌజ్లో కొనసాగుతున్న పనులు పూర్తికాని విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం గతేడాది అక్టోబర్ నుంచి వాయిదా పడుతున్న వైనం వచ్చే నెలలో తప్పనిసరిగాచేపడతామంటున్న అధికారులు ఒక్కో మోటారు సామర్థ్యం 145 మెగావాట్లు -
తగ్గుతున్న నీటి నిల్వలు..
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్వాటర్ ఫుల్గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్వాటర్ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. -
ఎల్ఆర్ఎస్.. తిరకాసు!
ఫీజు చెల్లించేందుకు వెళ్తే నిషేధిత జాబితాలో ఉన్నట్లు వెల్లడి ● అధికారుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు ● రుసుము, ఇతరత్రా సమస్యలతో సతమతం ● దరఖాస్తుల అప్లోడ్లో శాఖల మధ్య కొరవడిన సమస్వయం కల్వకుర్తి టౌన్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రజలకు మంచి చేస్తుందని అనుకుంటే.. ఇప్పుడు అదే వారికి గుదిబండగా మారింది. అనధికార లే అవుట్లు చేసి ప్రజలకు అంటగట్టిన వెంచర్ల యజమానులు బాగానే ఉండగా.. వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. రూ.1000 రుసుముతో 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీతో రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతి ఇచ్చినా.. అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపాలిటీల్లో హెల్ప్డెస్క్లు, గ్రామపంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా.. అది ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అనేక సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయి. భారీగా షార్ట్ఫాల్ దరఖాస్తులు.. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 20–30 శాతం వరకు మాత్రమే క్లియర్ చేశారు. వాటిలో పేమెంట్ చేస్తున్న, పేమెంట్ జనరేట్ కాని వారి వివరాలన్నీ షార్ట్ఫాల్లో కనిపిస్తూ.. డాక్యుమెంట్లను మళ్లీ అప్లోడ్ చేయాలని ఆన్లైన్లో చూయిస్తుంది. అయితే ఎలాంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలనే వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్డెస్క్లకు వెళ్లే ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. అక్కడి అధికారులు ఇష్టం వచ్చినట్టుగా చెబుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన షార్ట్ఫాల్ దరఖాస్తుదారులకు పేమెంట్కు సంబంధించిన వివరాలు ఎల్–1 లెవల్లో ఎప్పుడు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే, కొందరు దరఖాస్తులను నింపే సమయంలో వారి ప్లాటులో ఉన్న గజాలను తక్కువగా ఎంటర్ చేయడం.. ఇతరత్రా సమస్యలకు పరిష్కారం లభించడం గగనంగా మారింది. కొరవడిన సమన్వయం.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించి మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్న సర్వే నంబర్లకు సంబంధించి దరఖాస్తుదారులు హెల్ప్డెస్క్లో సంప్రదిస్తే.. సదరు సర్వే నంబర్ నిషేధిత జాబితాలో లేదని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి లెటర్ తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తుదారులు సంప్రదిస్తే.. మున్సిపాలిటీ నుంచి సంబంధిత సర్వే నంబర్ ఎఫ్టీఎల్/బఫర్ జోన్లో లేనట్టుగా ధృవీకరణ పత్రం తీసుకురావాలని చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు ఇరిగేషన్ శాఖలో అసలు ఎఫ్టీఎల్/బఫర్ జోన్కు సంబంధించిన పలు వివరాలు లేకపోవటం ప్రజలకు మరో శాపంగా మారింది. అధికారులు మాత్రం పేమెంట్ చేయడానికి వచ్చిన వారి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తూ కార్యాలయాలకే పరిమితయ్యారు. మిగతా దరఖాస్తులకు మోక్షం లభించక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఫోన్ నంబర్కు ఎలాంటి సమాచారం రావడం లేదు. ఆన్లైన్లో చెక్ చేస్తేనే దరఖాస్తు స్థితి తెలుస్తుంది. దరఖాస్తు రుసుములో చాలా మంది కేవలం రెగ్యులరైజేషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తున్నారు. ఓపెస్ స్పేస్ చార్జీలను చెల్లించడానికి చాలా మంది వెనకాడుతున్నారు. అందుకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించడం లేదు. రెగ్యులరైజేషన్ చార్జీలను ప్రస్తుతం 25 శాతం రాయితీతో చెల్లిస్తున్నా.. 14శాతం ఓపెన్ స్పేస్ చార్జీలను ఎప్పుడు చెల్లిస్తారో అప్పటి మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇలా.. ఆన్లైన్లో చెక్ చేస్తేనే.. కల్వకుర్తి మున్సిపాలిటీలోని 55వ సర్వే నంబర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన పలువురు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమయ్యాక అదే సర్వే నంబర్లో మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు వెళ్తే.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కింద ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంచారు. భవన నిర్మాణ అనుమతుల సమయంలో అధికారులకు కనపడని నిషేధిత జాబితా.. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో కనిపించింది. ఇలా చాలా సర్వే నంబర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. అనుమతులు ఎలా వచ్చాయి.. మున్సిపాలిటీలో చాలా చోట్ల ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉంచిన సర్వే నంబర్లలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇంటి నిర్మాణ అనుమతులు ఎలా ఇచ్చారో అధికారులకే తెలియాలి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మాత్రం ప్రొహిబిటెడ్ చూయించడం ఎంటో అర్థం కావడం లేదు. మున్సిపాలిటీలోని హెల్ప్డెస్క్లో ఎల్ఆర్ఎస్పై అసంపూర్తిగా సమాచారం అందిస్తున్నారు. – మజహర్, సుభాష్నగర్, కల్వకుర్తి ఇబ్బందులు లేకుండా చూస్తాంఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్ప్డెస్క్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాం. షార్ట్ఫాల్ దరఖాస్తుల విషయంలో సదరు దరఖాస్తుదారులకు మళ్లీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని సూచిస్తున్నాం. పేమెంట్ విషయంలో రెగ్యులరైజేషన్ ఫీజులు మాత్రమే కాకుండా, మొత్తం ఫీజు చెల్లిస్తేనే ప్రజలకు మేలు. శాఖల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదు. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి -
రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి దుర్మరణం
నాగర్ కర్నూల్: జిల్లాలోని చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లిదోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఉన్నత విద్యకు బాటలు
అభివృద్ధి వైపు పాలమూరు యూనివర్సిటీ పయనం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన భవనాలు, అధునాతన ల్యాబ్లు, వినూత్న కోర్సులతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యూనివర్సిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేయడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి విద్యార్థులకు హాస్టళ్లు, తరగతి, గదులు, ల్యాబ్లు, గ్రౌండ్స్ వంటివి లేక సతమతమవయ్యే వారు. కానీ, ఈ సంవత్సరం పెద్దమొత్తంలో నిధుల కేటాయింపుతో భవనాల నిర్మాణానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం ద్వారా ఇచ్చిన నిధులతో పెద్దఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్మాణాల కోసం రూ.35 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులతో మరిన్ని భవనాల నిర్మాణాలకు అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. రూ.150 కోట్లు కేటాయింపు.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేవలం సిబ్బంది వేతనాల కోసమే కేటాయింపులు జరిగివి. 2018లో పీయూలో న్యాక్ గ్రేడింగ్ రావడంతో ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేయగా.. పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో సిబ్బంది వేతనాల కోసం గతేడాది రూ.11 కోట్లు, ఈ సంవత్సరం రూ.15 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు కూడా ఇచ్చారు. గతేడాదితో పోల్చితే రూ.4 కోట్లు అదనంగా ఇవ్వడంతో యూనివర్సిటీపై వేతనాల భారం తగ్గనుంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించనప్పటికీ అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధులు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నిధులు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఒకేసారి కేటాయించడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని భావిస్తున్నారు. యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయింపు ఇలా.. సంవత్సరం ప్రతిపాదనలు కేటాయింపులు (రూ.కోట్లలో..) 2019– 20 119 6.63 2020– 21 216 7.39 2021– 22 137 7.58 2022– 23 75 9.58 2023– 24 84 10.91 2024– 25 200 50 ఒకే విద్యా సంవత్సరంలో రూ.150 కోట్లు మంజూరు పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రం రాష్ట్ర బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయింపు లా, ఇంజినీరింగ్ కళాశాలల భవనాల నిర్మాణంపై దృష్టి హాస్టల్స్, ల్యాబ్స్ భవనాలను నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ -
వనరులను వదిలేసి..
గ్రామాల్లో ఇంటి పన్నులతోనే సరిపెడుతున్న అధికారులు ●కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తాం.. ఆస్తిపన్నుతోపాటు పంచాయతీలకు వచ్చే ఇతర ఆదాయ మార్గాలను వసూలు చేసేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తాం. పంచాయతీలు గ్రాంట్లు, ఇతరత్రా నిధుల కోసం వేచి చూడకుండా వారే సొంతంగా ఆదాయం సృష్టించుకునేందుకు వీలుంది. ఆ దిశగా అన్ని పంచాయతీల కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. – రాంమోహన్, డీపీఓ కల్వకుర్తి: గ్రామ పంచాయతీల్లో కేవలం ఇంటి పన్నులు, తైబజార్ ద్వారానే నిధుల సమీకరణ జరుగుతోంది. స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వానికి ఉన్నట్లే గ్రామ పంచాయతీలకు కొన్ని ఆదాయ వనరులు ఉంటాయి. ఇలా వచ్చిన ఆదాయంలో స్థానికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను కల్పించే స్వేచ్ఛ పంచాయతీలకు ఉంటుంది. కానీ, స్థానిక ప్రభుత్వానికి ఉండే హక్కులు, విధులను స్థానిక అధికారులే విస్మరించడం, ఉన్నతాధికారులు సైతం అవసరం లేదులే అన్నట్లుగా వ్యవహరించడం వంటి పరిణామాలు, స్థానిక ప్రభుత్వాలు అన్న పేరును చులకన చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించి 1998– 99 సంవత్సరంలో ఇళ్ల రివిజన్ చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఇంటి పన్నుల జాబితాను రివిజన్ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనిని ఉన్నతాధికారులు విస్మరించడంతో ఇప్పటికీ పాత జాబితా ఆధారంగానే ఏటా పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. సేవా పన్నుపై నిర్లక్ష్యం గ్రామ పంచాయతీల విభజనకు ముందు ఇంటి పన్నుల రికార్డులు అస్తవ్యస్తంగా నిర్వహించిన కారణంగా ఇంటి నంబర్లు ఇష్టానుసారంగా కేటాయించారు. ఫలితంగా కేటాయించిన ఇంటి నంబర్లు అన్నీ ఆన్లైన్లో కొంత వరకు నమోదు కాలేదు. గతంలో ఇంటి పన్నులు చెల్లించిన రశీదులు ఉన్నా.. ఆన్లైన్ ప్రక్రియలో నమోదు కాని కారణంగా అలాంటి ఇళ్ల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. అలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అది కాస్తా ఇంటి పన్నుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. కానీ, గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఇంటికి సేవలు అందిస్తున్నందున ఇంటి నంబరు లేని ఇళ్ల నుంచి మెమో నంబర్ 512 ప్రకారం సేవాపన్ను పేరుతో పన్ను వసూలు చేయాలని నూతన పంచాయతీరాజ్ చట్టం–2018లో ప్రభుత్వం పేర్కొంది. కేవలం నూతన ఇంటికి విద్యుత్ సౌకర్యం అవసరమైన సమయంలో అరకొరగా సేవాపన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఆ తర్వాత కూడా ఆయా ఇళ్ల నుంచి నెలకు రూ.200 సేవాపన్ను వసూలు చేయాలన్న నిబంధనలను విస్మరిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే.. గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు మాత్రమే ఆదాయ వనరుగా చూస్తూ ఇతరత్రా వనరులను విస్మరిస్తున్నానే చెప్పాలి. ఫలితంగా ప్రతి పనికి ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేక స్థానిక ప్రభుత్వ హోదాను దిగజారుస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీల్లో ఆదాయ వనరులపై సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో వసూలు చేస్తే పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టిగా సాధించే అవకాశం ఉంది. ఊసేలేని సేవాపన్ను, కొలగారం వంటి సేవల రుసుం ఇతర ఆదాయ మార్గాలనూ పట్టించుకోని వైనం ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడుతున్న పంచాయతీలు 1998– 99 నాటి ఇళ్ల రివిజన్ జాబితా ఆధారంగానే పన్నుల వసూలు -
నవజాత శిశువుల్లో దృష్టిలోపాలు గుర్తించాలి
నాగర్కర్నూల్ క్రైం: నవజాత శిశువుల్లో అంధత్వాన్ని నివారించేందుకు దృష్టిలోపాలను గుర్తించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హైదరాబాద్ పుష్పగిరి కంటి ఆస్పత్రి వారి సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నవజాత శిశువుల్లో కలిగే అంధత్వంపై చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్నర్సులు, నేత్రాధికారులకు పునశ్చరణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవజాత శిశువుల్లో కలిగే దృష్టి లోపాలను వెంటనే గుర్తించి, తగిన చికిత్స చేయాలన్నారు. రెటినోపతి సమస్య 37 వారాల కంటే ముందే ప్రసవించిన శిశువులు, శిశువు బరువు రెండు కిలోల కన్నా తక్కువ ఉన్న వారిలో ఏర్పడుతుందన్నారు. పిల్లల్లో రెటినోపతి సమస్యను వెంటనే గుర్తించి తగిన చికిత్స చేయడం వల్ల అంధత్వాన్ని నివారించవచ్చన్నారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ సాయికిరణ్మయి మాట్లాడుతూ రెటినోపతి లోపం ఉన్న శిశువులకు మందులు, లేజర్ చికిత్స ద్వారా చాలా సులభంగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ బాల మాట్లాడుతూ ప్రతినెలకు ఒకసారి నాగర్కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెటినోపతి సమస్య ఉన్న శిశువుల కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిశువుల్లో అంధత్వాన్ని నివారించడంలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్, చిన్నపిల్లల వైద్యులు ఉమాదేవి, ప్రశాంత్, పాండురంగ, ఆర్బీఎస్కే వైద్యులు, నేత్రాధికారులు వెంకటస్వామి, వెంకటేష్, బాలాజీ, ఎంపీహెచ్ఈఓ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు 28 మంది గైర్హాజరు
కందనూలు/ చారకొండ: జిల్లావ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలోని 60 కేంద్రాల్లో ఫిజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించగా 10,584 మందికి గాను 10,556 మంది హాజరవగా.. 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు చారకొండ పోలీస్స్టేషన్ నుంచి జిల్లాలోని 60 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో డీఈఓ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్లు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాలను సందర్శించి సిబ్బందికి రోజువారి సూచనలు చేయాలన్నారు. అనంతరం వంగూరు, చారకొండ మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులు, మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టిసింగ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. అనంతరం చారకొండలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా అధికారులు నర్సింహులు, చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిపార్ట్మెంటల్ అధికారి మురళీధర్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నేడు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పర్యటన అచ్చంపేట: బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు శనివారం అచ్చంపేటలో పర్యటిస్తారని బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజానాజిమ్అలీ అప్సర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అచ్చంపేటకు చేరుకొని.. 2 గంటలకు బుడుబుడకల కమ్యూనిటీలతో సమావేశం అవుతారని చెప్పారు. ప్రశ్నలకు సమాధానం వెతికేదే పరిశోధన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో రెండో రోజు ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టు వర్క్ రూపకల్పనపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాఫెసర్ సాయికుమార్ మాట్లాడుతూ పరిశోధన అనేది అనేక ప్రశ్నలకు సమాధానం వెతికేదని, పరిణామాత్మక, గుణాత్మక డేటాను విశ్లేషించే ఒక నిర్మాణాత్మక శాసీ్త్రయ విధానం అన్నారు. పరిశోధన పద్ధతిని రాయడానికి ముందు పరిశోధన పరిమితులు, నైతిక ఆందోళనలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రొఫెసర్ చేతన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మంచి పరిశోధన పద్ధతి పరిశోధన ఫలితాల విశ్వసనీయత, చెల్లుబాటును నిర్ధారించడంలో కూడా సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వర్రావు, డాక్టర్ ఎం.కృష్ణయ్య, డాక్టర్ జె.మాళవి, డాక్టర్ ఎ.కరుణాకర్రెడ్డి, డాక్టర్ అర్జున్కుమార్, డాక్టర్ జావీద్ మొహమ్మద్ఖాన్, డాక్టర్ నాగసుధ తదితరులు పాల్గొన్నారు. -
అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
కొల్లాపూర్: రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఖాదర్పాషా దర్గా వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో మంత్రి పాల్గొని ముస్లింలకు ఫలహారం తినిపించి.. సహపంక్తి భోజనాలు చేశారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ముస్లింల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల ప్రారంభం కొల్లాపూర్ డిపోకు నూతనంగా మంజూరైన 10 ఆర్టీసీ బస్సులను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. వీటిలో ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. బస్సులో కొద్దిసేపు మంత్రి ప్రయాణించారు. ఆర్టీసీ డిపోకు సంబంధించిన పలు అంశాలను ఆర్ఎం సంతోష్కుమార్, డీఎం ఉమాశంకర్ మంత్రికి వివరించారు. డిపో అభివృద్ధి కోసం ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రయాణిలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ భన్సీలాల్, నాయకులు రహీంపాష, నయూమ్, అన్వర్పాష, ఎక్బాల్, నర్సింహరావు, నాగరాజు, నర్సింహ, కమలాకర్రావు, ధర్మతేజ, కిరణ్యాదవ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
కడావర్ డాగ్స్తో మరోసారి గాలింపు
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారి జాడ తెలుసుకునేందుకు గురువారం మధ్యాహ్నం మరోసారి కడావర్ డాగ్స్ను తీసుకెళ్లి ప్రమాదస్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో సొరంగం ఎండ్ ఫేస్ చివరలో ఈ డాగ్స్తో గాలించారు. ఇప్పుడు వెనుకవైపు 160 మీటర్ల దూరంలో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాల వాసనలను గుర్తించేందుకు మరోసారి డాగ్స్ను టన్నెల్లోనికి తీసుకెళ్లారు. మొత్తం 13.940 కి.మీ వరకు తవ్విన సొరంగంలో 13.500 వరకు లోకోట్రైన్ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి 250 మీటర్ల వరకూ పేరుకుపోయిన మట్టి, శిథిలాల్లో సుమారు 60 మీటర్ల మేరకు మట్టిని తొలగించగలిగారు. ఇందుకోసం నాలుగు ఎస్కవేటర్లు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అధికారి శివశంకర్ నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక బృందాల నిపుణులతో కలసి సమీక్షిస్తున్నారు. భారీగా కొనసాగుతున్న నీటి ఊట.. సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంతో నిమిషానికి 3,900 లీటర్ల నీరు ఊరుతోంది. భారీ ఎత్తున వస్తున్న నీటిని సొరంగం నుంచి బయటకు తరలించేందుకు ప్రతీ 2.5 కి.మీ. పాయింట్లో ఒకటి చొప్పు న 150 హెచ్పీ సామర్థ్యం ఉన్న మోటార్లను వినియోగిస్తున్నారు. అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను గ్యాస్కట్టర్లతో కట్ చేస్తూ లోకోట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. స్వగ్రామానికి చేరిన మనోజ్కుమార్ మృతదేహం జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్కుమార్(50) మృతదేహం ప్రత్యేక అంబులెన్స్లో గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నవ్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన బంగార్మావ్ చేరుకుంది. మనోజ్కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును అధికారులు అందజేశారు. -
గ్రామీణ ప్రాంతాలకు తపాలా సేవలు
లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తపాలా శాఖ సేవలను విస్తరిస్తున్నట్లు వనపర్తి డివిజన్ ఎస్పీఓ భూమన్న అన్నారు. మండలంలోని రాయవరం గ్రామ పంచాయతీకి నూతనంగా మంజూరైన బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాయవరంలో బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారన్నారు. ఈ బ్రాంచి పోస్టాఫీసు పరిధిలోకి కొత్తచెర్వుతండా, పాతరాయవరం, వడ్డెబక్కనగూడెం గ్రామాలు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాయవరంతోపాటు ఇతర గ్రామాల వారు అంబట్పల్లి పోస్టాఫీసుకు వెళ్తూ ఇబ్బందులకు గురయ్యేవారని, ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టాఫీసు ద్వారా ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీల డబ్బులు, ఇతరత్రా సేవలు ప్రజలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు సృజన్నాయక్, రవికుమార్, ప్రసాద్, రవికుమార్, బ్రాంచి పోస్టాఫీస్ ఇన్చార్జ్ బాలాజీనాయక్, నాయకులు మల్లయ్య, తిరుపతిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
మానవుడి ఆయుష్షు పెంచడమే ఉగాది ఉద్దేశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవిస్తున్న మానవుడి ఆయుష్షు పెంచడమే పండగ ఉద్దేశం అని, షడ్రుచులను వివిధ ప్రకృతి ప్రసాదాలతో తయారు చేసిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందన్నారు. చేదు, తీపిలు జీవితంలో మంచి చెడులను ఆస్వాధించడమే అన్నారు. వక్త గుంత లక్ష్మణ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ముఖ్యమని, సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని సూచించారు. ప్రపంచ విపత్తులకు భారతదేశ యువత మార్గాలను చూపాలని, చెడు వ్యసనాలకు బానిసై నిర్వీర్యం కాకుండా, తన కుటుంబంతో పాటు దేశసేవలో భాగం కావాలని, వసుదైక ఉమ్మడి కుటుంబ విలువను పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కవితలు, జానపద గేయాలు, జానపద నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ రాజ్కుమార్, తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సంధ్యారాణి, ప్రిన్సిపాళ్లు రవికాంత్, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెసులుబాటు
వడ్డీ మాఫీతోమున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపునకు గ్రీన్సిగ్నల్ ●ప్రయోజనం పొందాలి.. పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. ఈ నెల 31 వరకు అయితే 10 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలోని దుకాణాలు, ఇంటింటికి వెళ్లి ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. సమయం తక్కువగా ఉండటంతో ఈ అవకాశాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలి. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చెల్లింపులకు బకాయిదారులు ముందుకు వస్తున్నారు. ఈ నెల 31 చివరి తేదీ కావడంతో కేవలం 10 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి బకాయి వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అధికారులకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లోగా వందశాతం పన్నులు వసూలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అచ్చంపేట: ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ ఊరటనిచ్చింది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు సంబంధించి రాయితీ అవకాశం కల్పించారు. మొండి బకాయిలను రాబట్టేందుకు వన్టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్) ప్రకటించింది. ఆస్తిపన్ను బకాయిలు పూర్తిగా చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బకాయి ఉన్నవారికి ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని 90 శాతం తగ్గిస్తూ ఓటీఎస్ అమలులోకి తీసుకొస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బకాయిలు 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని పేర్కొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు పన్నుల రాబడితో అభివృద్ధికి అడుగులు పడతాయి. దీంతో ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించింది. ముందే చెల్లించిన వారికి సర్దుబాటు జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 90 శాతం రాయితీకి అర్హులైన పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఈ మేరకు వీరంతా వందశాతం రాయితీ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 2025 మార్చి నాటికి ఆస్తిపన్ను వడ్డీ, జరిమానా చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన 90 శాతం వడ్డీ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తారు. ప్రభుత్వం ప్రతి ఏటా మార్చి, అక్టోబరు నెలల్లో ఇదే మాదిరిగా వన్టైం సెటిల్మెంట్ స్కీం తీసుకొస్తోంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి ఈ స్కీం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వందశాతం సద్వినియోగం చేసుకునేలా పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలందాయి. సెలవు దినాల్లో సైతం కార్యాలయాల్లో అందుబాటులో ఉండి పన్ను చెల్లింపు స్వీకరించాలని సూచించింది. మరో నాలుగు రోజులే.. 90 శాతం రద్దుకు అంగీకరించిన ప్రభుత్వం 31 వరకే ఓటీఎస్ పథకానికి అవకాశం బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరిగి వసూలు వందశాతం వసూలే లక్ష్యంగా చర్యలు -
గుడుంబాపై ఉక్కుపాదం
జిల్లాలో మళ్లీ పుంజుకుంటున్న సారా తయారీ, విక్రయాలు వేరుశనగ @రూ.6,409 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ క్వింటాల్ అత్యధికంగా రూ.6,409, కనిష్టంగా రూ.4,309, సరాసరిగా రూ.5,899 ధర లభించింది. మార్కెట్కు గురువారం 60 మంది రైతులు సుమారు 330 క్వింటాళ్ల వేరుశనగను తీసుకొచ్చారని మార్కెట్ కార్యదర్శి చెప్పారు. నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. ఎప్పటిలాగే నిషేధిత సారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలో గుడుంబా కట్టడికి ఎకై ్సజ్శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎకై ్సజ్, పోలీస్ శాఖలు సారా తయారీ, విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి.. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కట్టడికి కృషిచేస్తున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో సారా తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి.. రిమాండ్కు తరలిస్తున్నారు. ఇటీవల ఘటనలు.. ● జనవరి 18న లింగాల, కల్వకర్తి, కోడేరు మండలాల్లో ఎకై ్సజ్శాఖ దాడులు నిర్వహించి పెద్దమొత్తంలో సారా, బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు. ● జనవరి 21న కొల్లాపూర్ మండలంలో 20 లీటర్ల సారా, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ● మార్చి 18న లింగాలలోని 14వ వార్డులో ఎకై ్సజ్శాఖ అధికారులు దాడులు చేసి 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ● మార్చి 19న లింగాలలోనే 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ● మార్చి 23న లింగాల మండలంలోని క్యాంపు రాయవరంలో దాడులు జరిపి 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ● మార్చి 26న బల్మూరులో సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 4 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బతుకుదెరువు చూపినా.. గతంలో సారా తయారీ, విక్రయదారులకు ఎలాంటి ఉపాది మార్గాలు లేక సారా తయారీ మార్గాన్ని ఎంచుకున్నారు. వీరి కోసం 2017–18 సంవత్సరంలో దాదాపు 300 మందిని ఆ వృత్తిని మానిపించేందుకు కొందరికి ఆటోలు, పాడిపశువుల కోసం రూ.2 లక్షలు ఇచ్చి బతుకుదెరువు చూపించింది. ప్రస్తుతం వారిలో చాలా మంది మళ్లీ సారా తయారీపై వైపు మొగ్గు చూపుతుండటం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అడ్డుకట్టకు చర్యలు చేపడుతున్నారు. 2024–25లో నమోదైన కేసులు 1,232 అరెస్టు అయిన వారు 934 స్వాధీనం చేసుకున్న సారా 6,802 లీటర్లు పట్టుబడిన నల్లబెల్లం, స్పటిక 62,604 కిలోలు ధ్వంసం చేసిన బెల్లం పాకం 1,81,010 లీటర్లు సీజ్ చేసిన వాహనాలు 205 ఇటీవల వరుస దాడులతో భారీ స్థాయిలో బెల్లం పట్టివేత కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఎకై ్సజ్శాఖ చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎకై ్సజ్శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నాం. సారా తాగడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – గాయతి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
మరమ్మతు..!
‘జూరాల’కురూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు రామన్పాడు గేట్లకు లీకేజీ.. రామన్పాడు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు ఆయా గేట్లను పూర్తిస్థాయిలో మూసివేసినా లీకేజీలు ఏర్పడి ముందుకు పారుతోంది. అంతేగాకుండా ఎప్పుడో చేసిన కాల్వల లైనింగ్ దెబ్బతినడంతో ఎప్పుడు తెగిపోయాయోనన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రామన్పాడు రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తుంటారు. కాల్వల గేట్లు దెబ్బతినడంతో నీటి తాకిడికి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు, అక్కడక్కడ దెబ్బతిన్న కాల్వ లైనింగ్, చిన్న చిన్న మరమ్మతులు వేసవిలో చేపట్టేందుకు అధికారులు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం కాల్వల్లో సాగు, తాగునీరు వదులుతున్నామని పంట కోతలు పూర్తయిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవి పూర్తయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామన్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడుతోందని.. వేసవిలో మరమ్మతులు పూర్తిచేసి సకాలంలో సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఉన్న జూరాల ఎడమకాల్వ వెంట ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని గండ్లు ఉన్నాయో గుర్తించే పనుల్లో వర్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ వెంట మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం రూ.1.20 కోట్లతో గేట్లు, లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలుగా ఉండగా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలం వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున కాల్వ ఉంది. ఆయా మండలాలను కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీరు ఎడమకాల్వ ద్వారానే విడుదల చేస్తున్నారు. ఆరు కిలోమీటర్లు.. ఎనిమిది రంధ్రాలు... మూలమళ్ల నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది ప్రదేశాల్లో కాల్వ దెబ్బతింది. వీటి మరమ్మతులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలం వరదల నీటి ఉధృతికి లైనింగ్ దెబ్బతిని గండ్లుపడే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా.. జూరాల ప్రధాన ఎడమకాల్వకు ఏర్పడిన రంధ్రాలను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రెండేళ్లుగా కాల్వ పనులు, చేపట్టకపోగా.. కనీసం పూడికతీత, ముళ్లపొదలు కూడా తొలగించడం లేదు. – వెంకటేష్, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చడంతో పాటు చిన్న చిన్న మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఈ ఏడాది జూరాల ఎడమ కాల్వ, రామన్పాడు కుడికాల్వ గేట్ల మరమ్మతులు, చిన్న చిన్న పనుల కోసం రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు మంజూరైతే పంట కోతలు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ సబ్ డివిజన్ దెబ్బతిన్న జూరాల ఎడమ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు.. లైనింగ్ వేసవిలో పనులు చేపట్టేందుకు అధికారుల సన్నాహాలు -
సిర్సనగండ్ల రామయ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
చారకొండ: రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు సీతారామచంద్రాస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయ పాలక మండలితో కలిసి రెవెన్యూ, పోలీసు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ, ఫైర్, విద్యుత్, పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆలయం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేరు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను ఎమ్మెల్యే పరిశీలించారు. వాటి నిర్వహణపై శ్రద్ధ వహించాలని పాలక మండలికి సూచించారు. అదే విధంగా సీతారామచంద్రాస్వామిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ, మండల నాయకు లు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్చైర్మన్ బాలాజీ సింగ్, ఆలయ ఈఓ ఆంజనేయులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సంధ్య, పీఆర్ డీఈ బస్వలింగం, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఆర్టీసీ డీఎం సుభాషిణి, మాజీ జెడ్పీటీసీ వెంకట్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రాంగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. -
ఐకేపీ వీఓఏల నిర్బంధం ఆపాలి
నాగర్కర్నూల్ రూరల్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న ఐకేపీ వీఓఏలను అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐకేపీ వీఓఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్బంధాలు విధించడం తగదన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని.. ఐకేపీ వీఓఏలపై ప్రభుత్వం విధిస్తున్న నిర్బంధాలను ఆపాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమకు రూ. 20వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు పర్వతాలు, సహాయ కార్యదర్శి రామయ్య, కోశాఽధికారి అశోక్, వీఓఏల సంఘం నాయకులు వెంకటయ్య, మల్లేష్, సునీత, శశిరేఖ, అలివేల, బేగం, రేణుక, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు ముస్తాబు..
సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయాన్ని బ్రహ్మోత్సవాలకు ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు అద్దారు. భక్తులకు తాగునీటి సదుపాయం మెరుగుపరిచారు. ఆలయ పరిసరాలను చదును చేశారు. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయడంతో పాటు గుట్టపైకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు తొలగించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు తెలిపారు. -
రుణాలు చెల్లించిఅభివృద్ధికి సహకరించాలి
పాన్గల్: సింగిల్విండో ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం పాన్గల్ రైతువేదికలో నిర్వహించిన మహాజన సభకు ఆయన హాజరై మాట్లాడారు. విండో ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు రుణాలు అందిస్తున్నామన్నారు. అలాగే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న 1,433 మంది రైతులకు రూ.9.94 కోట్ల మాఫీ వర్తించిందని.. 887 మంది రైతులకు రూ.6.97 కోట్ల వరకు తిరిగి రుణాలు ఇచ్చినట్లు వివరించారు. పంట రుణాలతో పాటు విద్య, గృహ నిర్మాణ, ఉపాధి రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షల వరకు రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు 6 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తామని.. మంత్రి జూపల్లి, ఎంపీ డా. మల్లు రవి సహకారంతో విండోను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విండో వైస్చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్గౌడ్ తదితరులు ఉన్నారు.దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండిఅచ్చంపేట రూరల్: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తిరుపతమ్మ డిమాండ్ చేశారు. బుధవారం అచ్చంపేటలో నిర్వహించిన రాష్ట్ర మహిళా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. వికలాంగులకు గుర్తింపు, గౌరవం వచ్చిందంటే మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమేనని అన్నారు. ప్రతి జిల్లాలో మహిళా కమిటీలను ఏర్పాటుచేసి.. వికలాంగ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వికలాంగులకు పింఛన్లు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చి 16 నెలలు గడిచినా.. అమలుకు నోచుకో వడం లేదన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో కనీ సం 10 మందికి రాయితీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి చైతన్యరెడ్డి, పద్మ, నాగమ్మ, శ్రీనివాసులు, కృష్ణంరాజు, శంకర్, లక్ష్మీనారాయణ, అచ్చాలి పాల్గొన్నారు.నైపుణ్యాలుపెంపొందించుకోవాలిమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. పీయూలో బుధవారం కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ చివరి సంవత్సరం విద్యార్థులకు లారస్ ల్యాబ్ ఆధ్వర్యంలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ మొత్తం 80 మంది విద్యార్థులు ఎంపికలో పాల్గొన్నారు. వీరికి ఇంటర్ూయ్వ, రాత పరీక్షలు నిర్వహించారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, అధాపకులు రవికుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు 99.76 శాతం హాజరు
కందనూలు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన గణితం పరీక్షకు 10,560 మంది విద్యార్థులకు గాను 10,535 మంది హాజరు కాగా.. 25 మంది గైర్హాజయ్యారు. 99.76 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. కాగా, పరీక్షల నిర్వహణపై ప్రాంతీయ విద్యాశాఖ సంచాలకులు, జిల్లా పరిశీలకురాలు విజయలక్ష్మి చీఫ్ సూపరింటెండెంట్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో సీఎస్లదే కీలక పాత్రని.. ఉదాసీనతకు వీల్లేదన్నారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి పంపించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఏమాత్ర నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఈఓ రమేష్కుమార్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు తనిఖీ చేశారు. పకడ్బందీగా మూల్యాంకనం.. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం, కోడింగ్ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూల్యాంకనం కేంద్రానికి వివిధ జిల్లాల నుంచి చేరిన జవాబు పత్రాలను పరిశీలించారు. అనంతరం కోడింగ్, సహాయ కోడింగ్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. మూల్యాంకనం కంటే ముందు నిర్వహించే కోడింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. జవాబు పత్రాలపై విద్యార్థి వివరాలను తీసివేసి.. కోడింగ్, మూల్యాంకనం అనంతరం ఆ విద్యార్థి వివరాలను జవాబు పత్రాలపై ఉంచే ప్రక్రియ కీలకమైనదని అన్నారు. కోడింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు, నాగరాజు, కుర్మయ్య, లత, కృష్ణారెడ్డి, వెంకటయ్య, సత్యనారాయణరెడ్డి, పాండు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్యసేవలు
కొల్లాపూర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కొల్లాపూర్ ఆస్పత్రిలో టీబీ రోగులకు న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించి.. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు, టీబీ ప్రోగ్రాం అధికారి రాజశేఖ ర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టీబీ సూపర్వైజర్లు రాజ్కుమార్, ముఖ్తర్ అ హ్మద్, ఖరీఫ్ఖాన్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
ఎల్ఆర్ఎస్తో కూడిన రిజిస్ట్రేషన్లు 500ల్లోపే.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 406 దస్తావేజులకు ఎల్ఆర్ఎస్తో కూడిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. మహబూబ్నగర్లో 30, జడ్చర్లలో 42, వనపర్తిలో 107, ఆత్మకూర్లో 8, గద్వాలలో 59, అలంపూర్లో 14, నారాయణపేటలో 17, మక్తల్లో 4, నాగర్కర్నూల్లో 26, అచ్చంపేటలో 3, కల్వకుర్తిలో 71, కొల్లాపూర్లో 25 వరకు ఎల్ఆర్ఎస్తో కూడిన రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ గణాంకాలు ఈ నెల 19వ తేదీ వరకు కాగా.. ఇప్పటి వరకు మరో సుమారు 80 దస్తావేజుల వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మక్కై వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. రూ.6 కోట్ల వరకు నష్టం.. విచారణకు సన్నద్ధం ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో సమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు అంచనా. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఐదు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో అధికారులు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని చెబుతున్నా.. గతంలోనే రిజిస్ట్రేషన్లు పూర్తికావడంతో తలనొప్పులు ఎందుకని భావించి మౌనం వహిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినా.. 25 శాతం రాయితీ కల్పించినా.. ప్రజలు ముందుకు రాకపోవడం, సరైన ఆదాయం సమకూరకపోవడం.. జీపీ లేఅవుట్ల అక్రమ రిజిస్ట్రేషన్లతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు సన్నద్ధమవుతుండగా.. అక్రమార్కుల్లో భయం నెలకొంది. సామాన్యులపై భారం మోపొద్దు.. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నత్తనడకన ఎల్ఆర్ఎస్ ప్రక్రియ 25 శాతం రాయితీ ఇచ్చినా ముందుకు రాని దరఖాస్తుదారులు పలు అనధికార జీపీ లేఅవుట్లకు ఇది వరకే రిజిస్ట్రేషన్లు అప్పటి సబ్రిజిస్ట్రార్లకు కాసుల పంట పండినట్లు అనుమానాలు తాజాగా తూతూమంత్రంగా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన సర్కారు ఆదాయానికి భారీగా గండి.. పూర్తిస్థాయిలో విచారణకు సన్నద్ధం ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ -
పాఠశాలలకు కంప్యూటర్లు..
విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మొదటి విడతలో ఎంపికై న పీఎంశ్రీ పాఠశాలలకు పది డెస్క్టాప్ కంప్యూటర్లు, ఒక ప్రింటర్, 2 కేవీ ఇన్వర్టర్ల చొప్పున జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలలకు అందించారు. పీఎంశ్రీ పథకం కింద మొదటి దఫాలో ఎంపికై న ఉన్నత పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలులోకి వచ్చింది. ప్రతి ఎమ్మార్సీకి అందించిన ఎలక్ట్రికల్ నెట్ వర్కింగ్ సిస్టమ్తోపాటు డెస్క్టాప్, ప్రింటర్లు, యూపీఎస్లు, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ధ్రువీకరించారు. అలాగే ప్రైమరీ స్కూళ్లకు సంబంధించి అవసరాలను బట్టి ఆట వస్తువులు, కంప్యూటర్, ప్రింటర్లు, స్కూళ్ల భద్రత కోసం సీసీ కెమెరాలు, టీవీలు, ఫీల్డ్ విజిట్లు చేశారు. -
వేలంతో రూ.3.20 లక్షల ఆదాయం
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు, తలానీలాలు, కొబ్బరి చిప్పలకు వేలంలో పాటదారులు డిపాజిట్ చేసి పాల్గొన్నారు. కొబ్బరి కాయల వేలానికి సరైన వేలం రాకపోవడంతో వాయిదా వేసినట్లు చైర్మన్, ఈఓ తెలిపారు. కొబ్బరి చిప్పలకు నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన సాంబశివుడు రూ.2,01 లక్షలు, తలనీలాలు నాగర్కర్నూల్కు చెందిన మల్లికార్జున్ రూ.1.19 లక్షలకు పాటలో దక్కించుకున్నారు. వాయిదా పడిన కొబ్బరికాయల వేలం గురువారం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణాధరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
కొల్లాపూర్: పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ టాస్క్ రీజినల్ సెంటర్ హెడ్ నవీన్రెడ్డి, రిలేషన్షిప్ మేనేజర్ ఎండీ సిరాజ్, టాస్క్ ప్రతినిధి భాస్కర్లు మంగళవారం కొల్లాపూర్ వచ్చి.. పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాల పైఅంతస్తులు, మినీ స్టేడియంలోని ఆడిటోరియంను పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన వసతి, సౌకర్యాల గురించి మంత్రి కార్యాలయ అధికారులు కృష్ణయ్య, నాగరాజు, ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్పోలోనియస్తో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అన్ని పోటీ పరీక్షలకు, స్కిల్స్ పెంచే కోర్సులపై శిక్షణ ఇచ్చే సెంటర్ ఏర్పాటు చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన మేరకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. సెంటర్ ఏర్పాటు అయితే స్థానిక యువతకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. -
నవోదయ ఫలితాలు విడుదల
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రేపు మెగా జాబ్ మేళా బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 33 ఏళ్లలోపు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధికి కృషిచేయాలి నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి సిబ్బంది నిరంతరం కృషి చేయాలని డిపో మేనేజర్ యాదయ్య అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమం నిర్వహించి పలువురు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థకు ప్రతి నెలా ఆదాయం పెంచేలా సిబ్బంది కష్టపడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు సహకారం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ సరస్వతి, సిబ్బంది శ్రీనివాసులు, బాలస్వామి, పరశురాం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9 నుంచి ఎస్ఏ–2 పరీక్షలు కందనూలు: జిల్లావ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–2) పరీక్షలు వచ్చే నెల 9 నుంచి 17 వరకు నిర్వహించాలని డీఈఓ రమేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుల నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. బుధవారం నుంచి అన్ని ఎమ్మార్సీల్లో ఎస్ఏ–2 ప్రశ్నపత్రాలను తీసుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి.. ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించాలని, అనంతరం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ కార్డులు అందించాలని సూచించారు. జిల్లాలో 1 నుంచి 9వ తరగతి వరకు సుమారు లక్షకు పైగా విద్యార్థులు చదువుతున్నారని, వీరంతా పరీక్షలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 12 వరకు ఎస్ఏ–2 పరీక్షలు నిర్వహించాలని డీఈఓ సూచించారు. -
పోరాటాలతోనే హక్కుల సాధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోగలుగుతామని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హన్మేష్, ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులతో ర్యాలీ తీశారు. అనంతరం బోయపల్లిగేట్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో సంఘం మూడో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మి కులు ఉన్నారన్నారు. వారి కోసం సంక్షేమ పథకాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధనికుల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు కనీస పింఛను రూ. ఆరు వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ, బీఓసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, టీయూసీఐ నాయకులు సి.వెంకటేశ్, పి.అరుణ్కుమార్, దేవదానం, కె.రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు సమాజసేవలో భాగస్వాములు కావాలి
కందనూలు: విద్యార్థులు చిన్ననాటి నుంచే సమాజసేవలో భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. నాగర్కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామంలో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)లో భాగంగా ఏడు రోజులపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం ముగింపు కార్యక్రమానికి డీఎంహెచ్ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని, సమాజ సేవ ద్వారా పొందే సంతృప్తి అమూల్యమన్నారు. వీరు గత ఏడు రోజుల నుంచి విద్యార్థులు గ్రామంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. గ్రామంలో విద్యార్థులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంతోషదాయకమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, గ్రామాల్లో ఉండే సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ వనిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణారావు, డీపీఓ రేనయ్య, పంచాయతీ కార్యదర్శి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదులకు రక్షణ కల్పించాలి
నాగర్కర్నూల్ క్రైం: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని బార్ అసోసియేషన్ కార్యదర్శి పర్వత్రెడ్డి అన్నారు. చంపాపేట్లో కోర్టుకు వెళ్తున్న న్యాయవాది ఇజ్రాయిల్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తిలో భాగంగా కేసులను వాదిస్తుంటారని కేసుల్లో ఓడిపోయిన కొందరు కక్షపూరితంగా న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యాయవాదులకు రక్షణ కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాబుపియర్స్, శ్రీనివాసులు గుప్తా, శ్యాంప్రసాద్రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
SLBC టన్నెల్లో మరో మృతదేహం వెలికితీత
సాక్షి, నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వారి స్వగ్రామానికి తరలించనున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.లోకో ట్రాక్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించా. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్బాడీని గుర్తించిన రెస్క్యూ బృందాలు.. తవ్వకాలు చేపట్టాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకి తీసుకువచ్చారు. శిథిలాలను గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా, ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది కార్మికులలో ఇద్దరిని వెలికితీశారు.ఇక ఆరుగురి మృతదేహాలను వెలికితీయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 8 మంది లోపల చిక్కుకుపోగా, ఇప్పటివరకు రెండు మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు.కాగా, నిన్న(సోమవారం) అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం ఎస్ఎల్బీసీ ప్రమాదం, సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రభుత్వం సొరంగంలో సహాయక చర్యలు నిలిపివేస్తారన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేమని సహాయక బృందాలు చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని రోజులపాటు ఆపరేషన్లో పాల్గొననున్నారు. 30 మీటర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక సిబ్బంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు.సొరంగం కుప్పకూలిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక సిబ్బంది సోమవారం 31వ రోజు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్తో కట్ చేసి బయటకి తెస్తున్నారు. మట్టి, రాళ్ల దిబ్బలు, బురద పూడిక, ఉబికి వస్తున్న నీటిని వాటర్ జెట్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో విద్యుత్, వెంటిలేషన్ పనులను పునరుద్ధరిస్తున్నారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాద జోన్గా అధికారులు గుర్తించారు. నేషనల్ జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్డీఆర్ఐ నిపుణుల నివేదిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ కొనసా గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్స్ఫర్ట్ కమిటీని కూడా నియమించి వారి సూచనలు, సలహాల మేరకు పనులు కొనసాగించనున్నారు. కేరళ నుంచి వచ్చిన కాడవర్స్ డాగ్స్ గుర్తించిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యలకు టీబీఎం భాగాలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. అదేవిధంగా సొరంగం తవ్వకాలకు మినీ హిటాచీ, కన్వేయర్ బెల్టు, డీవాటరింగ్ పైపులు కూడా అడ్డు పడుతున్నాయి. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణమధ్య రైల్వే, హైడ్రా, ర్యాట్ హోల్స్ మైనర్స్, ఆర్మీ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. -
క్షయ నిర్మూలనకు కృషి చేయాలి
నాగర్కర్నూల్ క్రైం: క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధిపై క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ వందరోజుల నిక్షయ్ శిబిర్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 250 క్యాంపులు నిర్వహించి 1,37,325 మంది అనుమానితులను (మధుమేహ వ్యాధిగ్రస్తులు, పొగ తాగేవారు, క్షయవ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు, మద్యపానం చేసేవారిని) పరీక్షించి, ఎక్స్రే 7,717, సీబీ నాట్ కళ్లె పరీక్షలు 2,061, మైక్రోస్కోపిక్ కళ్లె పరీక్షలు 250 మందికి జరిపి కొత్తగా 511 క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స ప్రారంభించినట్లు చెప్పారు. క్షయవ్యాధి సంపూర్ణ చికిత్సతో పూర్తిగా నయమవుతుందని, క్షయ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెల వారి బ్యాంక్ అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు, ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు సంతోష్ అభిరాం, వాణి తదితరులు పాల్గొన్నారు. జన్యుపరలోపంతో సికిల్ సెల్ అనీమియా సికిల్ సెల్ అనీమియా జన్యుపరమైన లోపంతో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సికిల్ సెల్ అనీమియాపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణంగా ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుందని, కానీ.. సికిల్ సెల్ వ్యాధితో బాధపడే వారికి వాటి జీవితకాలం 10– 20 రోజులకు తగ్గుతుందన్నారు. ఈ వ్యాధి గిరిజనులలో అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 59,154 మంది గిరిజనులకు సికిల్ సెల్ ప్రాథమిక పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. సికిల్ సెల్ బాధితులు దివ్యాంగుల కోటా కిందికి వస్తారని, వీరికి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే అన్ని ఉచిత పథకాలు వర్తిస్తాయన్నారు. -
ఇకపై సన్నబియ్యం
వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ వివరాలు 8లో u●ఆదేశాలు వచ్చాయి.. వచ్చే నెల నుంచి జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తాం. – శ్రీనివాస్, డీఎస్ఓ బియ్యం పక్కదారికి చెక్.. రేషన్ దుకాణాల్లో వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం తీసుకునే చాలామంది లబ్ధిదారులు వాటిని వాడుకోకుండా బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతుంది. వీటిని అమ్ముకోవడంతోపాటు బహిరంగ మార్కెట్లో దాదాపు 5 వేలకు పైగా చెల్లించి క్వింటాల్ సన్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు సైతం పేద వారితో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తే పేదలే వాడుకుంటే బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. నాగర్కర్నూల్: తెల్లరేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే సన్న బియ్యం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చకచకా చేపడుతోంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు కావాల్సిన సన్నబియ్యం అందుబాటులో లేకపోవడంతో ఈ పథకాన్ని ఇన్నిరోజులు వాయిదా వేసింది. తాజాగా గత సీజన్లో రైతులకు సన్నబియ్యంపై రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడం, రైతులు పెద్దఎత్తున సన్న బియ్యం పండించారు. దీంతో వానాకాలం సీజన్లో కేంద్రాల ద్వారా ఈ బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత డిసెంబర్లో ఈ బియ్యాన్ని కొనుగోలు చేయగా.. ప్రస్తుతం లబ్ధిదారులకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండటంతో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కరికి 6 కిలోలు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 558 రేషన్ దుకాణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం 2,37,833 రేషన్ కార్డులు ఉండగా అందులో 7,50,598 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం ప్రతినెలా 4,861 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు. ఇందులో సాధారణ రేషన్ కార్డులు 2,19,144, అంత్యోదయ కార్డులు 18,652, అన్నపూర్ణ కార్డులు 37 ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో 7 రేషన్ మండల లెవల్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఆహార భద్రత కింద ఒక్కో మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం, అంత్యోదయ కార్డుల దారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఉగాది పండుగ కానుకగా అమలుకు చర్యలు జిల్లాలో 2.37 లక్షల కుటుంబాలకు ప్రయోజనం ప్రతినెల 4 వేల మె.ట., బియ్యం అవసరం బియ్యం పక్కదారికి అడ్డుకట్ట పడినట్టేనా? -
చల్లంగుండాలి..
మాకు మీరు.. మీకు మేము ! ‘సివిల్ సప్లయ్’లో తోడు దొంగలు ● జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఇద్దరు అధికారుల హవా ● మిల్లర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వ్యవహారం ● వేడి భరించలేం.. ఏసీలు ఇవ్వాలంటూ బేరం ● నజరానాగా లారీకి 5 క్వింటాళ్ల సీఎమ్మార్ మిగిలించుకునేలా ఒప్పందం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే.. ‘మమకారం’ పంచిన మిల్లర్లకే మొగ్గు.. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నులు.. మొత్తం 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యంగా ఇవ్వాలని గద్వాల జిల్లాలోని 37 రైస్ మిల్లులకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే సివిల్ సప్లయ్ అధికారులు వివక్ష చూపినట్లు తెలుస్తోంది. తమపై మమకారం చూపిన మిల్లర్లకు అధికంగా.. తమను పట్టించుకోని వారికి తక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. మొత్తానికి గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించి.. 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
పకడ్బందీగా ‘పది’ మూల్యాంకనం
కందనూలు: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని లిటిల్ ప్లవర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఇప్పటి వరకు వివిధ జిల్లాల నుంచి నాగర్కర్నూల్కు చేరుకున్న జవాబు పత్రాలను భద్రపరిచి గదికి తాళం వేసిన సీల్ను డీఈఓ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మూ ల్యాంకన కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, బెంచీలు, కుర్చీలతోపాటు జవాబు పత్రాల కోడింగ్ను పరిశీలించాలన్నారు. మూల్యాంకనానికి వచ్చే ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫ్యాన్లు ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పారు. డీఈఓ వెంట జిల్లా పరీక్షల నిర్వహణాధికా రి రాజశేఖర్రావు, సహాయ అధికారి సత్యనారాయణరెడ్డి, పాఠశాల హెచ్ఎం రాజు తదితరులున్నారు. -
నల్లమలలో పులుల గణన
కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పులుల గణన చేపట్టారు. కొల్లాపూర్ సమీపంలోని నల్లమల అడవిలో రెండు రోజుల క్రితం గణన ప్రారంభించినట్లు ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫేజ్–4లో భాగంగా కొల్లాపూర్ రేంజ్లో బయాలజిస్టు రవికాంత్ నేతృత్వంలో పులులు, చిరుతల పాదముద్రలు సేకరిస్తున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతంలో ప్రతి రెండు చదరపు కిలోమీటర్లకు ఒక కెమెరా ఏర్పాటు చేశామని, కెమెరాలో రికార్డు అయిన వన్యప్రాణులతోపాటు పాదముద్రల ఆధారంగా గణన కొనసాగుతుందని చెప్పారు. పులుల గణనలో స్థానిక ఫారెస్టు అధికారులతోపాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. గతేడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పులులను గుర్తించామని ఆయన వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. -
‘ప్రజావాణి’కి 27 అర్జీలు
నాగర్కర్నూల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్కు చెప్పుకొని అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 11 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో పోలీస్ ప్రజావాణికి తగు న్యాయం చేయాలని 6, భూమి పంచాయతీకి సంబంధించి 4, భార్యాభర్తల గొడవపై ఒక ఫిర్యాదు వచ్చాయన్నారు. నేడు డయల్ యువర్ డీఎం నాగర్కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు నాగర్కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ప్రయాణికులు సెల్ నం.73824 46772కు ఫోన్ చేసి ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు. 27న గ్రీవెన్స్ డే కందనూలు: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై జిల్లాకేంద్రం హెచ్బీకాలనీలోని ఎస్ఈ కార్యాలయంలో గురువారం సీజీఆర్ఎఫ్(కన్జూమర్ గ్రేవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం) హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీపాల్రాజు, డీఈ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి హాజరయ్యే వారు ఆధారు, కరెంట్ బిల్లు రశీదు తీసుకొని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాలని కోరారు. నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. నేడు న్యాయవాదులు విధుల బహిష్కరణ పాలమూరు: హైదరాబాద్లో న్యాయవాది ఇజ్రాయెల్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో విధులు బహిష్కరిస్తున్నట్లు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టులో పనిచేసే న్యాయవాదులు మొత్తం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో న్యాయవాదుల హత్యలతోపాటు దాడులు పెరగడం బాధాకరమన్నారు. -
సీహెచ్సీని పరిశీలించిన కాయకల్ప బృందం
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుపరిచేందుకు ప్రతిఏటా అందించే కాయకల్ప టీం సభ్యులు సోమవారం సీహెచ్సీని పరిశీలించారు. కాయకల్పలో భాగంగా పీర్ అసెస్మెంట్ టీం సభ్యులు ఆస్పత్రిని పరిశీలించి.. పలు వివరాలు సేకరించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన బృందం సభ్యులు ఇందిర రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. ముఖ్యంగా మెటర్నిటీ వార్డులో ఉన్న లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవల వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోని బయో మెడికల్ వేస్టేజ్, పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్పత్రి అభివృదికి తీసుకుంటున్న చర్యలు, ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలు తదితర అంశాలను సేకరించి నమోదు చేసుకున్నారు. వైద్యుల బృందంతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు విష్ణు, ఉదయ్, షకీల్, హెడ్నర్సు సునీత పాల్గొన్నారు. -
సొ‘రంగం’ వదిలేస్తారా?
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం సరిగ్గా ఎక్కడ కుప్పకూలిందో అక్కడ తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవా?.. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు. ఇప్పటివరకు సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం నుంచి పక్కకు కొట్టుకువచ్చిన బండరాళ్లు, మట్టి, బురద, తుక్కును తొలగించారు. ఇక సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ శిథిలాలను తొలగించాల్సి ఉండగా, అక్కడ తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలి సహాయక సిబ్బందికి ప్రమాదం వాటిల్లవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేక నిలుపుదల చేయాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మొత్తం 12 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారికి తోడుగా రాడార్లు, డ్రోన్లు, రోబోలు, ఎక్సవేటర్లను వాడినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో సహాయక చర్యల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలరోజులు గడిచినా.. ఎమ్మార్పి–ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు సొరంగం–1 తవ్వకాలు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో తవ్వకాలను అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తుండగా గత నెల 22న సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోగా ఇప్పటివరకు ఒక కార్మికుడి మృత దేహాన్ని మాత్రమే వెలికితీయగలిగారు. భూగర్భంలో 400 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పైకప్పు కూలినప్పుడు భారీ పరిమాణంలో బండరాళ్లు, మట్టి, శిథిలాలు ప్రమాద స్థలానికి రెండువైపులా గుట్టల్లా ఏర్పడ్డాయి. బయటికి వెళ్లే మార్గం వైపు పేరుకుపోయిన శిథిలాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టగా, శనివారం నాటికి కార్మికుల ఆచూకీకి సంబంధించి డీ1 నుంచి డీ2గా గుర్తించిన ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం కన్వేయర్ బెల్ట్ నుంచి డీ2 ప్రాంతం దిశగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కొంత ప్రమాదకరమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సింగరేణి రెస్క్యూ బృందాలు సాహసించి పనులు కొనసాగిస్తున్నాయి. కూలిన చోట శిథిలాల కిందే మిగతా కార్మికులు! కేరళ నుంచి రప్పించిన కడావర్ డాగ్స్ పసిగట్టిన ప్రాంతాలన్నింటిలో తవ్వకాలు పూర్తి చేయగా, డీ2 ప్రాంతంలో ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఇతర కార్మికుల జాడ తెలియరాలేదు. దీంతో గల్లంతైన మిగతా కార్మికులు కచ్చితంగా సొరంగం కూలిన ప్రాంతంలో భారీ బండరాళ్లు, బురద, మట్టి శిథిలాల కిందే ఉండవచ్చని సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగానికి పైన 400 మీటర్ల వరకు ఉన్న బండరాళ్లు, మట్టి మళ్లీ కూలి పడతాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సొరంగానికి రక్షణలో భాగంగా కాంక్రీట్ సెగ్మెంట్లతో లైనింగ్ చేశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ఆవలి వైపు ఏర్పాటు చేసిన ఓ కాంక్రీట్ సెగ్మెంట్కి పగుళ్లు వచ్చాయి. రెండు వైపులా పేరుకుపోయిన ఉక్కు, ఇతర శిథిలాలు సపోర్టుగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ సెగ్మెంట్ కూలిపోకుండా ఉంది. ఒక వేళ శిథిలాలను తొలగిస్తే వెంటనే దానితో పాటు సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుందని, సహాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు ఒకట్రెండు రోజులు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిoచాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్జీఆర్ఐ నివేదిక కోసం నిరీక్షణ సొరంగం కూలిన ప్రాంతంలో ఉపతరితల భాగం ఎంత మేర పటిష్టంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? తవ్వకాలను ముందుకు కొనసాగించవచ్చా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే సహాయక చర్యలు ముందుకు కొనసాగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపగ్రహ సహాయంతో అధ్యయనాలు నిర్వహించిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణులు ఈ నెల 25 లేదా 26న నివేదిక ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.కాగా ప్రత్యామ్నాయంగా సొరంగానికి ఉపరితలం నుంచి బోర్ హోల్ చేసి గల్లంతైన కార్మికులను బయటకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్జీఆర్ఐ ఇవ్వనున్న నివేదికపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. సోమవారం నాటి సమీక్షకు ఎన్జీఆర్ఐ నిపుణులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రమాదం నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్ సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో సొరంగంలో పేరుకుపోయిన బురద, మట్టి శిథిలాలు ఒక్కసారిగా కొట్టుకువచ్చి సిబ్బందిని ముంచెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్పించుకోవడానికి బురదకు ఫెన్సింగ్ చేస్తున్నారు. బురద లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఫెన్సింగ్ ఉబ్బినట్టు అవుతుంది. దీనిని సంకేతంగా భావించి సహాయక సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫెన్సింగ్ వల్ల బురద ఒక్కసారిగా జారిపడకుండా సిబ్బందికి కొంత సమయం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డీ2 ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. -
దొరకని కార్మికుల ఆచూకీ
సంగమేశ్వరాలయంలో పూజలు ప్రారంభం కొల్లాపూర్: కృష్ణానదిలోని సప్తనదుల సంగమ స్థానంలో వెలసిన సంగమేశ్వరాలయంలో ఆదివారం నుంచి సాధారణ పూజలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఆలయం మొత్తం నది నీటి నుంచి బయటపడిన విషయం తెలిసిందే. గత మూడురోజులుగా ఆలయంలో మట్టి, బురద తొలగింపు పనులను భక్తులు చేపట్టారు. ఆలయ శుభ్రత పనులు పూర్తికావడంతో సంగమేశ్వరుడి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయ అర్చకులు రఘురామశర్మ పూజలు నిర్వహించారు. ఇక నుంచి ప్రతిరోజు ఆలయంలో పూజలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సిర్సనగండ్లలో రేపు వేలం పాట చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొబ్బరికాయలు, కొబ్బరి ముక్కలు, తలనీలాలకు మంగళవారం స్వామివారి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు కొబ్బరికాయలకు రూ.5 లక్షలు, తలనీలాలకు రూ.లక్ష, కొబ్బరి ముక్కలకు రూ.50 వేల చొప్పున డిపాజిట్ చెల్లించాలని, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వేలం దక్కించుకున్న వారు వెంటనే 75 శాతం డబ్బులు చెల్లించి.. మిగతా డబ్బులు డబ్బులు రెండు రోజుల్లో చెల్లించాలని పేర్కొన్నారు. వివరాలు 8లో u ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు ఆటంకాలు సృష్టిస్తున్న ఊటనీరు, బురద మట్టి డీ1, డీ2 ప్రదేశాల్లో ఆచితూచి తవ్వకాలు అధికారులకు సవాల్గా మారిన ప్రమాదం – అచ్చంపేట -
రిజిస్ట్రేషన్ సమయంలోనే.. క్రమబద్ధీకరణ
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ● గత ప్రభుత్వ హయాంలో 2020 ఆగస్టు 26న అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. ప్లాటుకు ఏదైనా లింకు డాక్యుమెంట్ లేదంటే ఒకసారి విక్రయించి ఉంటే రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చింది. ● అక్రమ, అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ఎల్ఆర్ఎస్ అవకాశం ఇచ్చారు. నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ● 2020 కంటే ముందు అక్రమ లే అవుట్లో 10 శాతం రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన ప్లాట్లకు తాజాగా రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. ఆ ప్లాట్లకు స్టాంపు డ్యూటీ, ఎల్ఆర్ఎస్ రుసుం రెండు రకాలుగా ఆదాయం సమకూరనుంది. అచ్చంపేట: ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ లేకుండానే ప్లాట్లను విక్రయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇకపై రిజిస్ట్రేషన్కు వచ్చే ప్రతి ప్లాట్కు లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించింది. ఒకవేళ చేసుకోలేకపోతే అనుమతి నిరాకరిస్తారు. ప్లాట్లో కొంత భాగం ఇప్పటికే విక్రయించినా.. మిగతాది ఎల్ఆర్ఎస్ చేసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో అనుమతి లేకుండానే అనధికారక లేఅవుట్లతో ఆదాయం రాకుండాపోతుంది. భవిష్యత్లో మౌలిక వసతులు కల్పించేందుకు, పట్టణాభివృద్ధికి భారంగా మారుతోంది. ప్లాట్లు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ యజమానులు మాత్రం సౌకర్యాలు కల్పించకుండా ఆదాయం వెనకేసుకుంటున్నారు. వారికి 25 శాతం రాయితీ రిజిస్ట్రేషన్ శాఖలో దరఖాస్తు చేయగానే ఎప్పటిలాగే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ప్లాట్ల వివరాలు ఆన్లైన్లో వెళ్తాయి. ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ చేసేందుకు వీలుందో.. లేదో పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో లెవల్–1, తర్వాత లెవల్–2, లెవల్–3లో అధికారులు పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయ లాగిన్లోకి తిరిగి పంపిస్తారు. ఒకవేళ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు తిరస్కరిస్తే ప్లాటు యాజమాని ముందుగా చెల్లించిన రుసుంలో 10 శాతం చార్జీల కింద పట్టుకొని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులకు చెల్లిస్తారు. రానున్న రోజుల్లో క్రమబద్ధీకరించని భూములకు ఎలాంటి రిజిస్ట్రేషన్, నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నెల 31లోగా ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సాంకేతిక అవగాహన కలిగి, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ అందుబాటులో ఉండే వారు ఇంటి నుంచే ఫీజు చెల్లించవచ్చు. గూగుల్ సెర్చ్లో ఎల్ఆర్ఎస్ 2020 అని టైప్ చేస్తే అక్కడ వెల్కం టు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం వస్తోంది. దానిపై క్లిక్ చేస్తే తెలంగాణ జీఓవీ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ హోం పేజీలో సిటిజన్ లాగిన్ను ఎంచుకోవాలి. అందులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు సమయంలో మనం ఇచ్చిన ఫోన్ నంబరును నమోదు చేయాలి. ఓటీపీ నంబరు అడుగుతోంది. మీసెల్కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి వ్యాలిడెట్ చేసుకోవాలి. వివరాలు పరిశీలించుకున్న తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేస్తూ అన్ని అంశాలను అంగీకరిస్తూ పేమెంట్ బటన్పై క్లిక్ చేయాలి. అక్కడ క్యూఆర్ కోడ్ను చూపించే బటన్ను నొక్కి ఫోన్ నంబరు నమోదు చేసిన తర్వాత కంటిన్యూ అండ్ పే క్లిక్ చేయగానే ఫోన్పే, గూగుల్ పే ఆధారంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ అనంతరం రసీదు డౌన్లోడ్ చేసుకోవాలి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి అనధికారిక లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31 వరకు మున్సిపల్ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ హెల్ప్డెస్క్లో కానీ, సెల్, కంప్యూటర్ ద్వారా కానీ ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో స్వయంగా కానీ సెల్నం.80086 64194కు ఫోన్ చేసి కాని తెలుసుకోవచ్చు. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ఎల్ఆర్ఎస్ లేకపోతే అనుమతుల నిలిపివేతకు నిర్ణయం భవిష్యత్లోనూ ఇవ్వబోమని తేల్చిచెప్పిన ప్రభుత్వం నెలాఖరులోగా చెల్లించే వారికి 25 శాతం రాయితీ జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు 44,137 -
పొదుపు చేస్తేనే..!
కల్వకుర్తి: వేసవి నేపథ్యంలో ప్రజలు ఎండ వేడికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రతినెలా గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేస్తుంది. అయితే విద్యుత్ను విచ్చలవిడిగా వాడితే ఈ పథకం వర్తించకుండాపోయే ప్రమాదం ఉంది. 200 యూనిట్లకు ఒక్క యూనిట్ అదనంగా వచ్చినా మొత్తం బిల్లు కట్టాల్సిందే. ఈ క్రమంలో ఒకవైపు వేసవితాపం.. మరో వైపు విద్యుత్ బిల్లుల భారంలో ఒకటి కావాలంటే మరొకటి వదుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే విద్యుత్ను పొదుపు చేసుకోవడమే మార్గం. ఉపకరణాలను పూర్తిగా కట్టేయాల్సిన అవసరం లేకుండా విద్యు త్ను పొదుపుగా వాడుకుంటే నిరంతరాయంగా గృహజ్యోతిని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఎల్ఈడీ బల్బులనే వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు ఫ్లోర్సెంట్ ట్యూబ్లైట్లు వాడుతున్నారు. వీటి సామర్థ్యం 40 వాట్లు ఉండటంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీని దృష్ట్యా ఎల్ఈడీ ట్యూబ్లైట్లు వాడటమే మేలు. ● ఏసీలను 24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతోపాటు బిల్లు ఆదా అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్తో నడిచే ఏసీలు లభిస్తున్నాయి. గది చల్లబడగానే ఆటోమేటిక్గా ఏసీ నిలిచిపోతుంది. వీటితో కొంత విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు పునఃప్రారంభమయ్యే సమయంలో లోడ్ పెరుగుతుంది. ఇది విద్యుత్ సరఫరాపై భారం పడుతుంది. ● సీజన్ మేరకు ఫ్రిజ్లో ఫ్రీజర్ దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. ● ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్ఈడీ బల్బులు, రిఫ్రిజరేటర్లు తదితర విద్యుత్ గృహోపకరణాలు 5 స్టార్ ఉంటేనే విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది. ● కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలి. ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్ను ఫ్లగ్ నుంచి తొలగించాలి. ఇలా చేస్తే ఆదా.. వేసవిలో విద్యుత్ ఆదా చేస్తేనే గృహజ్యోతి 200 యూనిట్లు దాటితే వర్తించని పథకం చిట్కాలు పాటిస్తే బిల్లు భారం నుంచి గట్టెక్కే అవకాశం -
రైతు సమస్యల పరిష్కారమే ఎజెండా
నాగర్కర్నూల్ రూరల్: రైతు సమస్యల పరిష్కారమే ఎజెండాగా రాష్ట్ర రైతు సంఘం ఆవిర్భవించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని లక్ష్మణాచారి భవన్ వద్ద నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మూడో మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులను రక్షించుకుందాం.. వ్యవసాయాన్ని పరిరక్షించుకుందాం.. గ్రామాలను కాపాడుకుందాం.. అంటూనే దేశానికి అన్నం పెట్టే రైతుకు పాలకులు సున్నం పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతుల పోరాటాల వల్లే వాటిని వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అలాగే రైతు భరోసా అందరికీ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులుగౌడ్, వెంకటయ్య, కృష్ణాజీ, బాలమురళి, రవీందర్, శ్రీను, భరత్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
● డీ1, 2 ప్రదేశాల్లో తవ్వకాలు మమ్మురం ● అతి క్లిష్టమైన ప్రదేశంలో మట్టి, రాళ్లు, బురద తొలగింపు ● గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం 29 రోజులుగా గాలింపు ● ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు వివరాలు 8లో u -
సన్నాలకు బోనస్ ఎప్పుడో..?
నాగర్కర్నూల్: సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన పరిహాసంగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి దాదాపు రెండు నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు సన్నాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆమాట నిలబెట్టుకోవడం లేదు. సన్నరకం పండించిన రైతులందరికీ క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాల్సి ఉంది. దీంతో సీజన్ ముందే వరి సాగు చేస్తే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపారు. అయితే కొనుగోళ్లు ముగిసి దాదాపు రెండు నెలల పైబడినా పూర్తిస్థాయిలో బోనస్ జమ కాపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయాలంటే రైతులు ఎక్కువ శాతం సన్నబియ్యాన్ని సాగు చేయాల్సి ఉంటుంది. అందుకే సన్నబియ్యం సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించింది. బోనస్ డబ్బులు రాలేదు నాకున్న కొద్దిపాటి పొలంలో 10 క్వింటాళ్ల సన్నరకం వడ్లు పండించాను. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు సంబంధించి డబ్బులు పడ్డాయి. కానీ, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు పడలేదు. క్వింటాల్కు రూ.500 చొప్పున రూ.5 వేల బోనస్ రావాల్సి ఉంది. – మనోహర్రెడ్డి, రైతు, అప్పాజిపల్లి, తిమ్మాజిపేట ప్రభుత్వం నుంచే రావాలి జిల్లాలో సన్నాలకు సంబంధించి బోనస్ డబ్బులు రైతులకు ఇంకా రూ.7.19 కోట్లు రావాల్సి ఉంది. రైతుల వివరాలన్నీ ఉన్నతాధికారులకు అప్పట్లోనే పంపించడం జరిగింది. పైనుంచే నిధులు జమచేస్తారు. – శ్రీనివాస్, డీఎస్ఓ రెండు నెలలైనా జమ చేయని ప్రభుత్వం త్వరగా చెల్లించాలని రైతుల వేడుకోలు -
మినీ స్టేడియం అభివృద్ధికి కృషి
అచ్చంపేట రూరల్: పట్టణంలోని మినీ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరలోనే కోలుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు రాజీవ్ మినీ స్టేడియాలను మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు సమకూర్చుతామన్నారు. పట్టణంలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. నల్లమల క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చత్రునాయక్, మల్లికార్జున్, రాము, లక్ష్మణ్, పవన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అంజన్నను దర్శించుకున్న న్యాయమూర్తులు
ఊర్కొండ/ వెల్దండ: మండలంలోని ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామిని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్బాబు, మహబూబ్నగర్ జడ్జి శ్రీదేవి, కల్వకుర్తి జడ్జి కావ్య దర్శించుకున్నారు. అంతకు ముందు వారికి ఆలయ కమిటీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, పాలక మండలి సభ్యులు జడ్జిలను శాలువాలతో సన్మానించారు. వారి వెంట ఎస్ఐ కృష్ణదేవ తదితరులున్నారు. అలాగే ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ధ్వజస్తంభాన్ని బహూకరించిన హర్షవర్ధన్రెడ్డిని ఆలయ పాలక మండలి చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సభ్యులు సన్మానించారు. అనంతరం ధ్వజస్తంభం ఏర్పాటు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అర్చకులు దత్తాత్రేయశర్మ, శ్రీనుశర్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గుండాలలో ప్రత్యేక పూజలు వెల్దండ మండలంలోని గుండాల అంబారామలింగేశ్వరస్వామి ఆలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు కల్వకుర్తి కోర్టు సివిల్ జడ్జి శ్రీదేవి, కావ్య శివుడికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సందీప్రెడ్డి, పర్వత్రెడ్డి, మల్లేష్, అంజయ్య, ఈఓ ప్రసాద్, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, అర్చకులు శివకుమార్శర్మ, నరహరిశర్మ, సంతోష్శర్మ, సురేష్శర్మ, కృష్ణయ్యశర్మ, కిషన్ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి బీమా తప్పనిసరి నాగర్కర్నూల్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరు జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తపాలా ప్రమాద బీమా పాలసీ సేకరణ కేంద్రాలను సందర్శించారు. అంతకు ముందు తపాలా కార్యాలయం వద్ద నాగర్కర్నూల్ ఎంపీడీఓ కోటేశ్వర్ తపాలా బీమా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ పర్యవేక్షకుడు భూమన్న మాట్లాడుతూ కేవలం తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా పొందవచన్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ఏడాదిపాటు రూ.15 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్మికులు, ఉపాధి, అంగన్వాడీ, యువకులకు ఈ ప్రమాద బీమా చేయించాలని గ్రామీణ తపాలా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎం గఫార్, సిబ్బంది మహ్మద్ ఖాన్, జగన్ పాల్గొన్నారు. ‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’ వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కందులు క్వింటాల్ రూ.6,821 జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,821, కనిష్టంగా రూ.5,659 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,889, కనిష్టంగా రూ.6,680, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,280, కనిష్టంగా రూ.2,027, జొన్నలు గరిష్టంగా రూ.4,527, కనిష్టంగా రూ.4,027, ఆముదాలు గరిష్టంగా రూ.6,345, కనిష్టంగా రూ.6,225 చొప్పున ధరలు వచ్చాయి. -
రూ.9.44 కోట్లు
అచ్చంపేట మున్సిపల్ బడ్జెట్ అచ్చంపేట రూరల్: అచ్చంపేట మున్సిపాలిటీ 2025–26 సంవత్సరానికి సంబంధించి రూ.9,44,70,000లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. శనివారం మున్సిపల్ సమావేశ హాల్లో చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కాగా.. 2024– 25లో రూ.10,76,37,000 ప్రవేశపెట్టగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.9,44,70,000తో బడ్జెట్ను రూపొందించారు. గతేడాదికన్నా దాదాపు రూ.1,31,67,000 ఆదాయం తక్కువ వస్తుందని అంచనా వేశారు. అంటే సాధారణ పన్నులతోపాటు మొండిబకాయిల వసూళ్లపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత సంవత్సరం ముగిసే నాటికి రూ.1,44,79,000 మిగులు బడ్జెట్ ఉండగా.. ప్రస్తుత అంచనా బడ్జెట్ రూ.9,44,70,000తో కలిపి రూ.10,89,49,000 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అలాగే ఈ ఏడాది రూ.9,31,60,000 ఖర్చుగా చూయిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.13,10,000 మిగులు చూయించారు. కాగా చర్చోపచర్చల మధ్య బడ్జెట్ను అన్ని పార్టీల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అధికారుల తీరుపై అసంతృప్తి మున్సిపల్ సమస్యలపై పార్టీలకతీతంగా కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్ గళమెత్తారు. వార్డు సమస్యలతోపాటు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తున్నా కాలనీల్లో అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. కొన్ని వార్డులను చిన్నచూపు చూస్తున్నారని, అన్ని వార్డులకు సమానమైన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలన్నారు. కనీసం కౌన్సిలర్లకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. తప్పుల తడకగా బడ్జెట్ నివేదిక తయారు చేశారని.. సమావేశం వాయిదా వేసి మరోరోజు నిర్వహించాలని ప్రతిపక్ష, పాలకపక్ష కౌన్సిలర్లు పట్టుబట్టారు. సమావేశం తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని అధికారులు చెప్పారు. 2025–26 ఏడాదికి ప్రవేశపెట్టిన చైర్మన్ శ్రీనివాసులు చర్చోపచర్చల మధ్య ఆమోదించిన సభ్యులు -
అప్రమత్తతే ప్రధానం!
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి జాగ్రత్త వహించాలి సాక్షి, నాగర్కర్నూల్: వేసవికాలం ప్రారంభమై రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకూ మధ్యాహ్న వేళల్లో ఎండలో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. పెరిగిన ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎవరైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే.. డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి ముందస్తు ఏర్పాట్లు.. హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు.. జిల్లాలో వేసవికాలంలో వడదెబ్బ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఎక్కడైనా వడదెబ్బ కేసులు గుర్తిస్తే వెంటనే ఐహెచ్ఐపీ పోర్టల్లో రిపోర్టు చేస్తాం. వడదెబ్బ సోకిన వ్యక్తిని కేవలం గంటలోపు గోల్డెన్ హవర్లో ఆస్పత్రిలో చేర్పిస్తే వెంటనే రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం వహించి ఆలస్యం చేస్తే పరిస్థితి విషమించే అవకాశాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వడదెబ్బ బాధితులు, వైద్యసేవలు అత్యవసర సంప్రదింపుల కోసం హెల్ప్లైన్ నంబర్ 98667 56825 ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం వేళల్లో వీలైనంత వరకూ బయటకు వెళ్లొద్దు జనరల్ ఆస్పత్రి, పీహెచ్సీల్లో వడదెబ్బ కేసులకు ప్రత్యేక ఏర్పాట్లు అత్యవసర సమయంలో హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలి ‘సాక్షి’తో డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి -
పారదర్శకంగా ‘పది’ పరీక్షల నిర్వహణ
కందనూలు/ అచ్చంపేట: జిల్లాలో పదో తరగతి పరీక్షలు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోలీస్స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాల తరలింపు అత్యంత కీలకం అని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా శనివారం డీఈఓ కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు సీఎస్, డీఓలతో వైర్లెస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోరోజు శనివారం సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్ష 60 కేంద్రాల్లో నిర్వహించగా.. 10,551 మంది విద్యార్థులకు గాను 10,527 మంది హాజరవగా.. 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా జరిగేలా జిల్లావ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టిసింగ్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. అలాగే అచ్చంపేటలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. పరీక్షల విధుల్లో ఉపాధ్యాయులు అలసత్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు అనుమతించరాదని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్రావు, ఎంఈఓ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
SLBC: సొరంగంలో సరిగ్గా నెల కిందట..
నాగర్ కర్నూల్, సాక్షి: దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనుల సన్నాహాకాల కోసం కార్మికులు, ఇంజినీర్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు. బోర్ టన్నెల్ మిషన్ను ఆన్ చేశారు. అంతే.. భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా కాళ్లకు బలం కూడదీసుకుని బయటకు పరుగులు తీశారు. కట్ చేస్తే.. టన్నెల్ ట్రాజెడీ జరిగి నెలకావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు... ఫిబ్రవరి 22వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30గం. ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన.. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇటు సింగరేణి నుంచి అటు సైన్యం దాకా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు.మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది!మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్ప్రీత్సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారుమిగతా ఏడుగురి జాడ గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు,బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా చూసుకుంటే.. లోకో ట్రైన్స్, కన్వేయర్ బెల్టులు, హైకెపాసిటీ పంపులతో నీరు, బురదను బయటకు పంపిస్తున్నా లాభం కనిపించడం లేదు. అడ్వాన్స్డ్ సెంట్ డిటెక్షన్, టన్నెల్ బోరింగ్ మెషిన్.. భారీ ట్రాన్స్ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రా థర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే రోబో సహయక చర్యలు ప్రారంభం కాలేదు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదరు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
పట్టించుకునే వారు లేరు..
ఏదైనా రోగం వచ్చి ఆస్పత్రికి వెళ్తే అక్కడ పట్టించుకునే వారు లేరు. పేరుకు మాత్రం పెద్ద దవాఖానా కట్టించారు. 15 రోజుల క్రితం మా మనువరాలుకు జ్వరం వచ్చిందని వెళ్తే ఆస్పత్రిలో ఎవరూ లేరు. అక్కడ ఉన్న సిబ్బందిని అడిగినా పట్టించుకోలేదు. ఇక్కరిద్దరు అందులో పనిచేసే సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాలాంటి పేదలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. – రాములమ్మ, ఉప్పునుంతల ●రిక్రూట్మెంట్ లేకనే.. రిక్రూట్మెంట్ లేకపోవడంతో కొత్తగా ఏర్పాటు చేసిన సీహెచ్సీల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకం చేపట్టలేదు. దీంతో అప్గ్రేడ్ అయిన సీహెచ్సీలను పీహెచ్సీ వైద్యులు, వైద్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వం సీహెచ్సీలకు కొత్తగా వైద్యులు, సిబ్బందిని నియమిస్తే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. – రామకృష్ణ, సీహెచ్సీల జిల్లా కోఆర్డినేటర్ -
తొలిరోజు 99.70 శాతం
● ‘పది’ పరీక్షలు ప్రారంభం ● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్జేడీ, డీఈఓ కందనూలు/ అచ్చంపేట: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 10,557 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. వీరికోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు పరీక్ష జరగగా 10,557 మంది విద్యార్థులకు గాను 10,528 మంది (99.70 శాతం) హాజరవగా.. 29 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని ప్రభుత్వ ప్రాజెక్టు పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, సీఎన్ఆర్, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి డీఈఓ తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. కల్వకుర్తిలోని పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ విజయలక్ష్మి తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 37 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నామని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని డీఈఓ తెలిపారు. -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి వస్తున్న అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఈఓ రమేష్కుమార్వెల్దండ జెడ్పీహెచ్ఎస్లో నంబర్లు చూసుకుంటున్న విద్యార్థినులు 30 పడకలతో సీహెచ్సీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఏఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా కొనసాగిన చంద్రశేఖర్రెడ్డి చొరవతో ఆయన స్వగ్రామమైన ఉప్పునుంతల పీహెచ్సీని సీహెచ్సీగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో 30 పడకల సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) స్థాయి పెంచుతూ రూ.5.80 కోట్లతో పనులు చేపట్టడానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. వాటిలో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.3.80 కోట్లు, పరికరాల కొనుగోలుకు రూ.95 లక్షలు, వైద్యులు, సిబ్బంది జీతభత్యాల కోసం రూ.1.05 కోట్లు వెచ్చించారు. నాలుగేళ్లపాటు సాగదీసి ఆస్పత్రి భవనాన్ని నిర్మించి 2023 అక్టోబర్లో ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారు. కానీ, డెంటల్, చిన్నపిల్లలు తదితర అన్ని విభాగాలకు సంబంధించి 7 మంది వైద్యులు ఉండాల్సిన సీహెచ్సీలో ఒక్క డాక్టర్ను కూడా నియమించలేదు. కేవలం ఇద్దరు స్టాఫ్ నర్సులను నియమించడంతో వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. డెంటల్, ఎక్స్రే తదితర అన్ని విభాగాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయి. సరిపడా వైద్యులను నియమించపోతే రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మించి.. పరికరాలు సమకూర్చినా.. ఏమాత్రం ఫలితం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు 8లో u● 28వ రోజుకు చేరిన సహాయక చర్యలు ● డీ–1 పాయింట్ వద్ద ముమ్మరంగా తవ్వకాలు ● కార్మికుల జాడ కోసం ప్రయత్నిస్తున్న అధికారులు ● అందుబాటులోకి రాని రోబోల సేవలు – అచ్చంపేటఇవీ కేంద్రాలు.. 1. ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్ 2. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం 3. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట 4. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగుళూరు 5. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్ 6. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ 7. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్ నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. రేపటి వరకు అవకాశం.. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. దరఖాస్తు విధానం.. కార్మికులు ఈ–శ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి నాగర్కర్నూల్ రూరల్: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ–శ్రామ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎక్స్గ్రేషియా అందించడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఆగస్టు 26, 2021 నుంచి మార్చి 31, 2022 మధ్య ఈ–శ్రామ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం పొందిన అసంఘటిత రంగ కార్మికుల నామినీలకు కేంద్రం ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందిస్తుందన్నారు. మృతిచెందిన కార్మికుల నామినీలకు రూ.2 లక్షలు, అంగవైకల్యం పొందిన కార్మికులకు రూ.లక్ష అందిస్తారన్నారు. జిల్లాలో అర్హులైన అసంఘటిత కార్మికులు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎస్ఎల్బీసీలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదావకాశం ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. -
నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పించాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో నేరం చేసిన బాల, బాలికలందరినీ సాధారణ నేరస్తుల మాదిరిగా కాకుండా అబ్జర్వేషన్ హోంలో ఉంచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, నైపుణ్యాన్ని బట్టి వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించాలని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన నాల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఆధారంగా జువైనల్ బోర్డు ఏర్పాటు అయిందన్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలందరూ బడిలో చదువుకోవాలని విద్యాహక్కు చట్టం చెబుతుందన్నారు. బాల, బాలికలకు ఏదైనా సమస్యలు ఉంటే 1098 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం ద్వారా న్యాయ పరిష్కారం లభిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా బాలికలు వివాహం చేసుకోకూడదని, ఒకవేళ ఎవరైనా బలవంతంగా వివాహం చేస్తే వారిపై చట్ట ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ ఖాజా, అబ్దుల్ రహీం, పారా లీగల్ వలంటీర్ బాలస్వామి పాల్గొన్నారు. పన్నుల వసూళ్లు వందశాతం చేరుకోవాలి కల్వకుర్తి టౌన్: పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లు వందశాతం చేరుకోవాలని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి దేవసహాయం వార్డు ఆఫీసర్లకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఆస్తి పన్నులను చెల్లించని వారిపై ప్రత్యేక శ్రద్ధతో వసూళ్లను చేపట్టాలన్నారు. కమర్షియల్ దుకాణాదారులు విధిగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని, లేకపోతే వారిపై మున్సిపల్ చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మ హమూద్ షేక్, మేనేజర్ రాజకుమారి, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బీసీ బిల్లు దేశానికే మార్గదర్శకం కల్వకుర్తి టౌన్: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించి దేశానికే రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందని మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తిలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగించేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమన్నారు. ఈ బిల్లుతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహుజన హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హరిదాస్, మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో 1,017 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం 1,017 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 48 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,691 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శక్రవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,691, కనిష్టంగా రూ.5,611 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,935, కనిష్టంగా రూ.5,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,291, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,011, కనిష్టంగా రూ.3,817 ధరలు పలికాయి. -
SLBC: 28వ రోజూ అన్వేషణ.. ఏడుగురి జాడ ఎక్కడ?
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 28 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం కాగా, మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది. ఇంకా అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోల పని ప్రారంభం కాలేదు. రోబోలకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటం జఠిలంగా మారింది.ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి 28 రోజులు గడిచింది. సాంకేతిక పరిజ్జానాన్ని, నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహయక చర్యలు కొనసాగిసాగుతున్న ఏడుగురి మృతదేహాల ఆచూకీ దొరకడం లేదు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు. రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆధునాతనమైన వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు.జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో రెండు ఎస్కవేటర్లతో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సింగరేణి జీఎం బైద్య నిత్యం ఉదయం, సాయంత్రం సహాయ బృందాల హెడ్స్తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు. గడిచిన 28 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.భారీగా ఊరుతున్న సిపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్ తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 800 టన్నుల స్టీల్ను లోకో ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊటనీరుతో సహాయకచర్లకు అడుగడుగున ఆటంకాలుఎదురవు తున్నాయి.రోబోల వినియోగానికి నెట్ వర్క్ సమస్యతో పాటు.. మిగిలిన పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు క్యాడవర్ డాగ్స్ను టన్నెల్లోకి పంపి శోదన చేయించారు.అయితే జీరో పాయింట్ వద్ద మనుషులు వెళ్లి పనిచేయటం ప్రమాదమని సహాయక బృందాలు అభిప్రాయపడుతున్నాయి. అవిశ్రాంతంగా చేస్తున్న తమ కృషి ఫలిస్తుందని ధీమాతో సహాయక చర్యలు మాత్రం షిఫ్ట్ ల వారీగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఆయిల్పాం తోటల సాగుతో అధిక లాభాలు
తాడూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లో భాగమైన ఆయిల్పాం తోటలతోపాటు వివిధ రకాల పండ్ల తోటల సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవన శాఖ ఆయిల్పాం తోటల సలహాదారు, శాస్త్రవేత్త బీఎన్ రావు అన్నారు. గురువారం మండలంలోని మేడిపూర్లో రైతు వెంకట్రెడ్డి సాగు చేసిన ఆయిల్పాం తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులకు సూచనలు,సలహాలు ఇచ్చారు. అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ప్రధానంగా వేసవిలో లేత ఆయిల్పాం తోటల్లో నీరు, ఎరువుల యాజమాన్యం గురించి తెలిపారు. బిందు సేద్యం ద్వారా నీటితోపాటు ఎరువులను అందించాలని సూచించారు. సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పాం తోటలను సాగుచేయాలన్నారు. మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలుగా కూరగాయలు, బొప్పాయి, అరటి, పప్పుధాన్యలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయవచ్చన్నారు. 2020– 21 సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సాగు చేస్తున్న ఆయిల్పాం తోటల దిగుబడులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి దశలో తీసుకోవాల్సిన పురుగుల యాజమాన్యం, ఎరువుల మోతాదు, ఆడ, మగ పూల గుత్తులను తొలగించే విధానం, పక్కవారికి వచ్చిన గెలలను గుర్తించే విధానం రైతులకు క్షేత్రస్థాయిలో వివరించారు. ప్రధానంగా సూక్ష్మ పోషకాల సేంద్రియ ఎరువులను సిఫార్సున చేసిన మోతాదులో వాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్, ప్రీ యూనిక్ కంపెనీ డీజీఎం మల్లేశ్వరరావు, ఉద్యాన వన శాఖ అధికారులు మహేశ్వరి, స్రవంతి, లక్ష్మణ్, ఫణికుమార్, మేనేజర్ రాకేష్, క్లస్టర్ అధికారి శివభార్గవ్, రైతులు పాల్గొన్నారు. -
సహాయక చర్యలు వేగవంతం
● డీ–1, 2 ప్రదేశాల్లో బండరాళ్ల తొలగింపు ● భారీ పంపులతో ముమ్మరంగా డీవాటరింగ్ ● ఒక్కొక్కటిగా సవాళ్లన అధిగమిస్తూ ముందుకు.. ● 27 రోజులుగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు ● ఎస్ఎల్బీసీలో అందుబాటులోకి రాని రోబో సేవలు – అచ్చంపేట వివరాలుIIలో u -
21 రకాల వికలత్వాలకు ధ్రువపత్రాల జారీ
నాగర్కర్నూల్: గతంలో 7 రకాల వికలత్వాలకు మాత్రమే సదరం ద్వారా ధ్రువపత్రాలు ఇచ్చేవారని, ఇప్పుడు దీన్ని 21 రకాలకు పెంచారని అదనపు కలెక్టర్ దేవసహాయం తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని దివ్యాంగుల సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం నుంచి యూనిక్ డిజెబిలిటీ ఐడీ కార్డు (యూడీఐడీ)ను ఎలా పొందాలనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మెడికల్ బోర్డు ద్వారా ఈ యూడీఐడీ కార్డును మంజూరు చేస్తారన్నారు. ప్రతి నెల మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని దాని ప్రకారం శిబిరానికి హాజరైతే యూడీఐడీ కార్డును పొందవచ్చన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
కందనూలు/ అచ్చంపేట/ కల్వకుర్తి టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని పకడ్బందీ ఏర్పా ట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. నిమిషం నిబంధన లేనప్పటికీ విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాలో మొత్తం 10,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 5,273 మంది బాలురు, 5,325 మంది బాలికలున్నారు. వీరి కోసం 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షల పర్యవేక్షణకు 60 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 62 మంది డిపార్టుమెంట్ అధికారులు, 36 మంది కస్టోడియన్లు, 510 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వసతుల ఏర్పాటు ఈ ఏడాది ఎండలు మండిపోతుండడంతో కేంద్రాల వద్ద తాగునీటి వసతి, ప్రతి గదిలో కరెంట్, ఫ్యాన్, ఫర్నిచర్, ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు సమయానికి కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అనుమతి లేదు.. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎలాంటి అనుమతి లేదు. సీఎస్, డీఓ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఈ నిబంధన ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి సైతం వర్తిస్తుంది.