breaking news
Nagarkurnool
-
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
పెంట్లవెల్లి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంగంపల్లితండాలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, కలెక్టర్ బాదావత్సంతోష్తో కలిసి ఆయన శుంకుస్థాపన చేశారు. రూ.1.40 కోట్లతో పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణం, ఎంగంపల్లితండాలో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్వాడీ సెంటర్కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. మేనిఫెస్టో సంబంధం లేకుండా భవిష్యత్లో ఇంకా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పనులను కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు కాంట్రాక్టర్తో మాట్లాడుతూ వేగంగా, నాణ్యతగా రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు. 98 జీఓ నిర్వాసితులపై సీఎంతో చర్చిస్తా పెంట్లవెల్లి మండలంలోని యంగంపల్లితండాలో 98 జీఓ నిర్వాసితులను మంత్రి కలిసి, తొందర్లోనే ఉద్యోగం లేదా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సమస్యపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లంతా కలిసి సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తామని ఆయన నిర్వాసితులకు మాట ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయసింహ, ఎంపీడీఓ దేవేందర్, రామన్గౌడ్, వేణుగౌడ్, మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, నల్లపోతుల గోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ కబీర్, భీంరెడ్డి, గోపినాయక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
తిమ్మాజిపేట: మండలంలోని పలు గ్రామాల్లో చేపడుతున్న పనుల జాతర కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామ సమీపంలో నిర్మించిన పశువుల షెడ్డును అధికారులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని హనుమాన్తండాలో పశువుల కొట్టం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ, ఈసీ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామి అధికారులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
అచ్చంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ పోలీసులకు సూచించారు. శుక్రవారం అచ్చంపేట పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నియంత్రణకు సమష్టి కృషి చేయాలని ఎస్ఐ విజయభాస్కర్కు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు తదితరులు ఉన్నారు. -
కళాశాలల్లో వసతులేవి..?
● ఏడింటిలో పూర్తిస్థాయిలో వసతులు లేవని గుర్తించిన వీసీ ● మరో 7 కళాశాలలకు షోకాజ్ నోటీసులు ● గతంలో అప్లియేషన్ తనిఖీలు నిర్వహించిన అధికారులపై విమర్శలు విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదని మరోసారి తేటతెల్లమైంది. చాలా కళాశాలల్లో అర్హులైన సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో లేకపోవడం, ల్యాబ్స్, మరుగుదొడ్లు, విద్యార్థులు కళాశాలకు రావడం లేదని తదితర అంశాలపై విద్యార్థి సంఘాల నాయకులు వీసీ శ్రీనివాస్కు ఫిర్యాదు చేయడంతో ఇటీవల పలు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో 7 కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడం వంటివి గుర్తించి.. ఆయా కళాశాలలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అయితే నోటీసులకు అన్ని కళాశాలల నుంచి సమాధానం రావడంతో వాటిని పరిశీలించి తదుపరి చర్యలను తీసుకోనున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో ఓ కళాశాలపై చర్యలు సైతం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. డిగ్రీతోపాటు ఇతర కళాశాలలపై నిర్వహించాల్సిన అప్లియేషన్, ర్యాటిఫికేషన్ను అధికారులు ఇప్పటి వరకు నిర్వహించకపోవడం గమనార్హం. నామమాత్రంగా చేశారా.. పీయూ పరిధిలోని 29 బీఈడీ కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో అప్లియేషన్ కోసం అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారులు సంబంధిత కళాశాలలో నిబంధనలు పాటించని వాటికి సిబ్బంది, వసతులు తదితర అంశాలను సమకూర్చుకోవాలని రిమార్క్ రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు రిమార్కు చూపించారా.. లేక నామమాత్రంగా తనిఖీలు చేశారా.. అనేది ప్రశ్నగా మిగిలింది. తాజాగా అప్లియేషన్ తనిఖీలు చేసిన కళాశాలల్లోనూ వసతులు లేవని విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేసే వరకు చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు కళాశాలలను ఒక వీసీ నేరుగా వసతులపై తనిఖీలకు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కిందిస్థాయి సిబ్బంది ప్రైవేటు కళాశాలల్లో పర్యవేక్షణను పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో వీసీ నేరుగా తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు బీఈడీ కళాశాలల్లో ఆకస్మికంగా గతంలో తనిఖీలు నిర్వహించి.. వసతులు, నిబంధనలు పాటించని మొత్తం 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చాం. వారు సమాధానం ఇస్తే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా డిగ్రీ కళాశాలలపై కూడా ర్యాటిఫికేషన్, అప్లియేషన్ తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. సెయింట్ మేరీస్ కళాశాలపై చర్యల్లో భాగంగా 50 శాతం సీట్లను కుదించాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ గతంలో మొదటిసారి తనిఖీలు నిర్వహించిన క్రమంలో కళాశాలల్లో లేని వసతులపై రిమార్కులు కళాశాలల వారికి చూపించాం. మార్పులు లేనందుకు మరోసారి వీసీ నేరుగా తనిఖీలు చేసి.. వసతులు లేని 7 కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. గతంతో పోల్చితే తనిఖీలు మెరుగుపడ్డాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – చంద్రకిరణ్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ పీయూ వీసీ శ్రీనివాస్ మొత్తం 10 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇందులో 7కళాశాలలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో సెయింట్ మేరీస్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆల్ మదీనా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, నలంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆదర్శ కళాశాల ఎడ్యుకేషన్, శ్రీవాసవీ ప్రతాపరాజ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలమూరు కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కొన్నింటిలో ర్యాటిఫికేషన్ సమయంలో చూపించిన అధ్యాపకులు తనిఖీల సమయంలో లేకపోవడం, ల్యాబ్స్, లైబ్రరీలు, ఇతర వసతులు లేకపోవడం, ఉన్న సిబ్బందిలో నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు లేకపోవడం వంటివి ఉన్నాయి. వీటితోపాటు ఎస్డీఎం కాలేజీ ఆఫ్ లా వనపర్తికి నోటీసులు ఇచ్చారు. ఈ కళాశాల ప్రారంభం నుంచి సిబ్బందికి సంబంధించి అసలు ర్యాటిఫికేషన్ చేయించుకోలేదని, అందుకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. నోటీసులకు సమాధానం ఇచ్చిన కళాశాలల్లో సెయింట్ మేరీస్ కళాశాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కళాశాలలో బీఈడీలో ఇన్టెక్ 100 మంది కాగా ఇందులో 50 శాతం సీట్లకు కోత విధించారు. అంటే 50 సీట్లను తక్కువగా అడ్మిషన్ చేసుకోవాల్సి ఉంది. త్వరలో మరిన్ని కళాశాలలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. -
పొదుపుతో భద్రత
● 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 60ఏళ్లు నిండిన మహిళలతో ప్రత్యేక గ్రూపులు ● బ్యాంక్ లింకేజీ రుణాలు ● కొనసాగుతున్న అర్హుల గుర్తింపు ప్రక్రియ ● నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు, సభ్యులకు బ్యాంకు ఖాతాలు అచ్చంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వారిని స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి మిషన్–2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బాలికలతో పాటు 60 ఏళ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో స్వయం సహాయక సంఘాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసేలా సెర్ఫ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న కిశోర బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి డబ్బు పొదుపు, బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో కిశోర బాలికలను చేర్పించేందుకు సెర్ఫ్ అధికారులు, సిబ్బంది ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలకు మళ్లీ అవకాశం ప్రస్తుతం ఉన్న స్వయం సహాయక సంఘాల్లో 60 ఏళ్లు నిండిన వారిని తొలగిస్తున్నారు. కానీ కొత్త పాలసీలో వీరితో మళ్లీ సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఏ ఆసరా లేని మహిళలకు వృద్ధాప్యంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికేందుకు సాయం చేయడం, నలుగురిలో సంఘటితం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఈ నెల 12 నుంచి కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు, సంఘాల్లో లేని వృద్ధులు, దివ్యాంగులను గుర్తిస్తున్నారు. డీపీఎం, సీపీలు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సంఘాలు ఏర్పాటు చేసి సభ్యులతో బ్యాంకు ఖాతాలు తెరిపించనున్నారు. అనంతరం సెర్ఫ్ వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13,239 మహిళా సంఘాలు ఉండగా వాటిలో 1,47,123 మంది సభ్యులు ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిశోర బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను గుర్తిస్తున్నాం. జిల్లాలో 20వేల మందిని చేర్చేందుకు టార్గెట్ ఉండగా.. ఇప్పటి వరకు 5,246 మందిని గుర్తించగా ఇందులో 60ఏళ్ల వయస్సు దాటిన వారు 2,315 మంది, దివ్యాంగులు 684 మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి టార్గెట్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. – ఓబులేష్, డీఆర్డీఓ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకరానున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా సభ్యులుగా ఉండనున్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన మాదిరిగానే దివ్యాంగులకు కూడా వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ప్రతి సంఘంలో 7 నుంచి 10 మంది ఉంటారు. -
గణపతి ఉత్సవాల్లో డీజేలపై నిషేధం
అచ్చంపేట రూరల్: గణపతి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర మండలాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులతో అచ్చంపేట ఎస్ఐ విజయభాస్కర్ అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గణపతి ఉత్సవాల్లో డీజేలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి డీజేలు తీసుకొస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. గణపతి మండపాలకు పోలీసు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. యువత భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. నిమజ్జనం ర్యాలీలో పాల్గొనే వాహనాలకు ఫిటెనెస్ ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, సీఐ నాగరాజు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఎస్ఐలు విజయభాస్కర్, పవన్కుమార్, ఫైర్ ఆఫీసర్ శంకర్, విద్యుత్శాఖ అధికారులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
‘తాత్కాలికంగా వంతెన నిర్మిస్తాం’
లింగాల: మండల కేంద్రం సమీపంలో అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న చిన్నవాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో వర్షాలు కురిసిన సమయంలో వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్అండ్బీ డీఈ జలంధర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రంగినేని శ్రీనివాస్రావు పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణం కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80 లక్షలు కేటాయించింది. అప్పట్లో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు. వర్షాలకు వాగు ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోవడంతో విషయాన్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా తాత్కాలికంగా వంతెన పక్క నుంచి సిమెంట్ పైపులు వేయించి రాకపోకలకు ఆటంకం కలుగకుండా చూస్తామని డీఓ తెలిపారు. నిధులు విడుదలయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి: డీఎంహెచ్ఓ తెలకపల్లి: కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ రవికుమార్ సూచించారు. మండలంలోని బొప్పల్లి, పెద్దూరు ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. గర్భిణులకు 5వ నెలలోనే ప్రణాళిక తయారు చేయడంతో పాటు సాధారణ కాన్పులు చేయాలన్నారు. కాన్పు సమయంలో గర్భిణులకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే గుర్తించి జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, డెంగ్యూ జ్వరాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులకు ఆదేశించారు. -
12 గంటలు దాటినా విధులకు రాలే..
● తహసీల్దార్పై ఎమ్మెల్యే అసహనం ● ఫోన్లో కలెక్టర్కు ఫిర్యాదులింగాల: విధులను విస్మరించే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హెచ్చరించారు. ఎమ్మెల్యే గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు. కార్యాలయంలో ఆయా విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే తహసీల్దార్తో పాటు కింది స్థాయి సిబ్బంది విధులకు హాజ రు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో సకాలంలో పనులు కాకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలయినా తహసీల్దా ర్ విధులకు రాకపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. ధీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న వారిని స్థాన చలనం కల్పిస్తామన్నారు. కార్యాలయంలో ముడుపుల వ్యవహారం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆరోపించారు. అధికారుల పనితీరు గురించి కార్యాలయం నుంచే కలెక్టర్తో మాట్లాడారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. భూ భారతికి సంబంధించి మొత్తంలో 5,836 దరఖాస్తులు రాగా.. అధికారుల నిర్లక్ష్యం వల న వాటి పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు. కాంగ్రెస్లో చేరికలు మండలంలోని అవుసలికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ తిరుపతిరెడ్డితో పాటు లింగాల, ఎంసీ, డీసీ తండాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర నాయకుడు రంగినేని శ్రీనివాస్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు నాగేశ్వర్రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ, మాజీ ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు. -
ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం
● ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ● ఇంటర్మీడియట్తో పాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు ● బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు ● టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. ఆన్లైన్ విధానంలోనే.. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. -
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
● రాష్ట విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ నాగర్కర్నూల్: జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొందని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విపత్తు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా అత్యధికంగా వర్షపాతం నమోదైందని, మరోసారి అల్పపీడనం ఏర్పడే హెచ్చరికలు ఉన్నందున నెల రోజుల పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే స్పందిచాల్సిన విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా శాఖలకు సంబంధించి నష్ట వివరాలను కలెక్టర్ అందించాలన్నారు. పూడికతీతలో వేగం పెంచాలి జిల్లాలో ప్రధానంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలాల్లో పూడికతీత పూర్తి చేయాలని, వరద నీరు వేగంగా బయటకు వెళ్లేలా చూడాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృదాలు ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక చర్యల్లో కీలకంగా వ్యహరించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎండీఆర్ఎఫ్ ద్వారా ముందస్తు చర్యలు పక్కాగా చేపడితే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చన్నారు. విపత్తు సహాయ చర్యల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. వర్షపాత తీవ్రతను గుర్తించి అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆగస్టు 14న జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, వరద నీటి ప్రవాహం కారణంగా లోలెవెల్ కాజ్వేలు మునిగిపోగా.. భారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించామని వెల్లడించారు. అంతకుముందు నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని చర్లతిర్మలాపూర్, సిర్సవాడలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వారు పరిశీలించారు. వరదలతో ధ్వంసమైన రహదారులు, చెరువులు, వాగులు, వంతెనలు, తాగునీటి సౌకర్యాలు, వ్యవసాయ పొలాలు, విద్యుత్ లైన్లకు వీలైనంత వేగంగా మరమ్మతు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉజ్వల భవిష్యత్..
పాలమూరులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఉజ్వల భవిష్యత్ లభిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు సాధ్యపడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఇంజినీరింగ్ కళాశాలలు రావడంతో భవిష్యత్లో వేల సంఖ్యలో సీట్లు కేటాయించే అవకాశం ఉంది. తద్వారా కార్పొరేట్ కంపెనీలు జిల్లాకు వచ్చి.. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు మొదలు, హాస్టల్ ఇతర వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ ● -
స్టేడియం ఊసేది..?
ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి ●ఎన్టీర్ మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలి. – ఎంఎన్గౌడ్, ఏఆర్ఎం క్రికెట్ అకాడమీ హెడ్కోచ్ స్టేడియం కోసం వందలాది క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు. తగిన సౌకర్యాలు కల్పించనప్పటికీ మా వంతుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం. నాలాంటి ఎంతో మంది కోచ్లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులో స్టేడియాలు లేక ఖాళీ స్థలాలు, మైదానాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కోచ్లను అభినందించలేదు. పతకాలు సాధించిన తర్వాత ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు. – ఎడ్మ శ్రీనుయాదవ్, మాస్టర్ అథ్లెటిక్ అసోషియేషన్ జిల్లా కార్యదర్శి అచ్చంపేట: జిల్లాలో అత్యంత ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్నా.. సాధన చేసేందుకు సరైన స్టేడియాలు, వసతులు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, రాష్ట్ర, జోనల్ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు జిల్లాలో కొకోల్లలు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్లో ఇండోర్ స్టేడియాలు ఉన్నా నిర్వహణ లేక క్రీడాకారులకు అనుకూలంగా లేవు. కల్వకుర్తిలో ఫుట్బాల్ కోచ్ మినహా ఎక్కడ కూడా కోచ్లు లేరు. నాగర్కర్నూల్లో మల్టీపర్సస్ ఇండోర్ స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఉన్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ నైపుణ్యాలు ఉన్న క్రీడాకారులను వెలికితీస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటనలు ఇస్తున్నా.. ఆయన పుట్టిన సొంత జిల్లాలో స్టేడియాల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 2003 డిసెంబర్ 8న అప్పటి ప్రభుత్వం రూ.60లక్షలు మంజూరు చేయగా.. అప్పటి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి పి.రాములుు శంఖుస్థాపన చేశారు. 2004లో ప్రభుత్వం మారడంతో రూ.10లక్షలు ఖర్చు చేసి చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. 2011 నవంబర్లో ఎమ్మెల్యే రాములు రూ.20లక్షలు కేటాయించి పనులు మొదలు పెట్టగా.. భవన నిర్మాణం, షెడ్డు పిల్లర్లు పనులు పూర్తి చేశారు. రూ.30లక్షలు ఖర్చు చేసినా స్టేడియం పనులు పూర్తి కాలేదు. 2013 జూన్లో స్పోర్ట్స్ అథారిటీ నుంచి మరో రూ.30లక్షల నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ షెడ్డు నిర్మాణం పూర్తి చేసి వదిలేశారు. సింథటిక్ గ్రౌండ్, గ్యాలరీ, సైడ్ వాల్స్, ప్లాట్ఫాం, లైటింగ్, డ్రెసింగ్ రూం, ఆఫీసు రూం పనులు చేయాల్సి ఉంది. ఇండోర్ స్టేడియానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో తర్వాత అధికారంలో వచ్చిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, గువ్వల బాలరాజు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2019లో రూ.2కోట్ల నిధులు మంజూరైన ఇంత వరకు పనులు మొదలు కాలేదు. అచ్చంపేట ప్రాంతంలో షటిల్ క్రీడాకారులున్నా.. కోర్టులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పబ్లిక్ క్లబ్, ఇతరులు ప్రతి ఏటా డివిజన్, జిల్లా స్థాయి షటిల్ పోటీలు నిర్వహిస్తున్నారు. పబ్లిక్ క్లబ్, ప్రైవేట్ వ్యక్తులు వేరువేరుగా రెండు షటిల్ ఇండోర్ నిర్మాణాలు చేపట్టారు. ఇండోర్ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి సౌకర్యాలు లేకున్నా జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు రూ.10కోట్లు మంజూరైన మొదలు కాని పనులు నల్లమలలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో అచ్చంపేటలో ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మించారు. ఆ తర్వాత ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభించడంతో క్రీడాకారుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఉన్న స్టేడియంలో కొన్నేళ్లుగా ప్రతి ఏటా రెండు పర్యాయాలు జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా 2021లో స్టేడియం చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చి కొంత దూరం పొడిగించారు. అక్కడక్కడ లైటింగ్ ఏర్పాటు చేసిన సౌకర్యాలు మరిచారు. 2018లో రూ.1.5కోట్లు, 2023లో రూ.6.50కోట్లు నిధులు మంజూరైన పనులు ప్రారంభించలేదు. దీంతో నిధులు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. స్టేడియం విస్తరణ పనులు చేపట్టి రాజీవ్ఎన్టీఆర్ పేరుగా మారస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటించినా.. ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. -
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు
వెల్దండ: మండల కేంద్రంతో పాటు కొట్ర, పెద్దాపూర్, కుప్పగండ్ల, తిమ్మినోనిపల్లి, బైరాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు కోళ్లు, పొటేళ్లు కోసి అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భూపతిరెడ్డి, చిందం కృష్ణయ్య, మట్ట వెంకటయ్యగౌడ్, నిరంజన్, విజేందర్రెడ్డి, ఎర్ర శ్రీను, తాటికొండ కృష్ణారెడ్డి, రాజేందర్రెడ్డి, ఆనంద్ తదితరులు ఉన్నారు.వెల్దండలో బోనాలతోఊరేగింపుగా వస్తున్న మహిళలు -
భూ సమస్యలు పరిష్కరించాలి
చారకొండ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జనార్దన్రెడ్డి కల్వకుర్తి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చారకొండకు విచ్చేసిన సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. భూ భారతి రికార్డులను పరిశీలించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, డిప్యూటీ తహసీల్దార్ విద్యాధరిరెడ్డి, సీనియర్ అస్టిస్టెంట్ శ్రీనునాయక్, ఆర్ఐలు భరత్, సుజాత, సిబ్బంది ఉన్నారు.నిబంధనలు అతిక్రమించొద్దుకోడేరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హౌజింగ్ జిల్లా అధికారి సంగప్ప హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి 72 ఇళ్లు మంజూరయ్యాయని, ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి రవితేజ, కారోబార్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.చెంచుల చెంతకు ఓపెన్ యూనివర్సిటీకల్వకుర్తి టౌన్/బల్మూర్: విద్యకు నోచుకోని గ్రామీణ, చెంచు పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీలు, చెంచులు, గోండులు తదితర జాతులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం రూ.500 లకు విద్య అందిస్తుందని ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ (ఎల్ ఎస్ఎస్బీ) వై.వెంకటేశ్వర్లు తెలిపారు. కల్వకుర్తి పట్టణంతో పాటు బల్మూర్ మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ–143 స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం బిల్లకల్, చెంచుగూడెం, గ్రామాల్లో ఓపెన్ యూనివర్సిటీ విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచులకు విద్య లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి దొరకక పేదరికంలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన చెంచు జాతులతో పాటు ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్టైఫండ్ ఆధారిత, ఉచిత విద్య అందిస్తుందని తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల వయసు కలిగిన వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ పరంగి రవి, సాల్మన్, కల్వకుర్తి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
శిశు సంజీవని సేవలు వినియోగించుకోవాలి
అచ్చంపేట రూరల్: జిల్లాలో ఉన్న శిశు సంజీవని కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ కోరారు. బుధవారం పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలోని శిశు సంజీవని ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. శిశువులకు వెంటనే టీకాలు వేయించాలని చిన్నపిల్లల వైద్య నిపుణులకు సూచించారు. శిశు సంజీవనిలో తక్కువ బరువుత, అవయవ లోపాలతో పుట్టిన చిన్నారులకు, పసిరికలు తదితర అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నడింపల్లి, చందాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పల్లె దవాఖానా డాక్టర్లు ప్రతిరోజు ఓపీ సేవలు అందించాలని, క్రమం తప్పకుండా అధిక రక్తపోటు, మధుమేహ రోగులను పరీక్షించి మందులు వాడేటట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ అంటు వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలి
కల్వకుర్తి టౌన్: ప్రతి ఒక్కరూ వారి పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి సూచించారు. బుధవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమావేశ మందిరంలో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు వినాయక మండపాలను రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించొద్దని కోరారు. తప్పనిసరిగా పోలీస్శాఖ వారు రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో వారి మండపాలను రిజిస్ట్రర్ చేసుకోవాలన్నారు. వీటికి తోడు మంటపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బుక్లోనూ విధిగా పోలీసు వారి తనిఖీలను రాసేలా చూడాలని పేర్కొన్నారు. నిమజ్జనానికి డీజేలను వాడకుండా.. భక్తిగీతాలను ఆలపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎస్ఐలు మాధవరెడ్డి, రాజశేఖర్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీను, మున్సిపల్ ఏఈ షబ్బీర్, వినాయక మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు. సాయంత్రమే నిమజ్జనం చేయాలి తిమ్మాజిపేట: వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు డీజేలతో కాకుండా భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలు ఆలపిస్తూ నిర్వహించాలని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ సూచించారు. తిమ్మాజిపేటలో ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం రోజు సాయంత్రం 4 లేదా 5 గంటలకు వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రారంభిస్తే పెద్దలు, మహిళలు, చిన్నారులు వీక్షించి మొక్కులు తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అంతక ముందు పోలీస్స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ అశోక్రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
20 ఏళ్లుగా ఎదురుచూపే..
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు దాదాపుగా 20ఏళ్లుగా నిరాశే మిగులుతోంది. కేఎల్ఐ కాల్వ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి వరకు ఉంది. ఇందులో భాగంగా వంగూర్, చారకొండ, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలంలోని నాగిళ్ల రైతులకు సాగునీరు అందించడానికి 65 కి.మీ పొడవున డీ–82 కాల్వ తవ్వకాలు చేపట్టారు. దీంతో దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు అంచనా వేశారు. నిరంతరం ఏదో ఒకచోట.. ఇటీవల డీ–82 కాల్వ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్నా తరుచుగా తెగిపోతుండడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. మండలంలోని లింగారెడ్డిపల్లి వద్ద కాల్వ తెగడంతో అధికారులు సరిచేశారు. పోతేపల్లి, వెల్దండ శివారులోనే ఒకే చోట 5 సార్లు కాల్వ తెగిపోయింది. చొక్కన్నపల్లి వద్ద ఒకసారి, బండోనిపల్లి సమీపంలో ఒకసారి, చారకొండ మండలం జూపల్లి వద్ద మరోసారి కాల్వలకు గండ్లు పడడంతో సాగునీరు వృథాగా పోతుంది. 60వేల ఎకరాల సాగునీరు బీడు భూములకు డీ–82 కాల్వ ద్వారా కల్వకుర్తి నియోజవర్గంలో దాదాపుగా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వంగూర్ మండలంలో కొంత భాగం కలుపుకొని చారకొండ, వెల్దండ మండలాల్లో 40 కిలోమీటర్ల దూరం కాల్వ రావడంతో 29వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, మాడ్గుల మండలంలోని జంగారెడ్డిపల్లి చివరి ఆయకట్టు వరకు 25 కిలోమీటర్ల దూరం కాల్వ రావడంతో మరో 29వేల ఎకరాలకు పైగానే సాగునీరు పారుతుందని కేఎల్ఐ అధికారులు తెలిపారు. వెల్దండ మండలంలోని భర్కత్పల్లికి నీరు చేరుకోక ముందే డీ–82 కాల్వకు ఎక్కడో ఒకచోట గండిపడుతుంది. సాగునీటి కోసం రైతులకు తిప్పలు వెల్దండలో తరుచుగా తెగుతున్నడీ–82 కాల్వ కొరవడిన అధికారుల పర్యవేక్షణ -
లైసెన్స్ లేని డ్రైవర్లు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు చేస్తున్నా మారని తీరు నాగర్కర్నూల్ క్రైం: వాహనాలను నడపాలంటే లైసెన్సు తప్పనిసరి అని మోటారు వాహన చట్ట నిబంధనలు చెబుతున్నప్పటికీ.. తమకేమి సంబంధం లేదంటూ మైనర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ద్విచక్రవాహనాల నుంచి భారీ వాహనాలను సైతం నడుపుతున్నారు. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో మైనర్లు ర్యాష్డ్రైవింగ్ చేస్తూ తరుచూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల మైనర్ల ర్యాష్ డ్రైవింగ్తో పలువురు ఆసుపత్రుల పాలయిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అడ్డు చెప్పాల్సిన తల్లిదండ్రులు అప్పటికప్పుడు వారి అవసరం కోసం మైనర్లకు వాహనాలు ఇస్తుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తున్నా.. జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే జరిగే పరిణామాలతో పాటు విధించే శిక్షల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మైనర్ల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. జిల్లాలోని పలువురు విద్యార్థులు యథేచ్ఛగా ద్విచక్ర వాహనాలను పాఠశాలలకు, కళాశాలలకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ద్విచక్రవాహనాలను పాఠశాలలకు, కళాశాలలకు తీసుకొస్తే సదరు యాజమాన్యం గుర్తిస్తారని వాటిని దూరంగా పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు పాఠశాలల సమయంలో తనిఖీలు నిర్వహిస్తే ద్విచక్రవాహనాలను నడిపే మైనర్లను గుర్తించే ఆస్కారం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. రెండేళ్లలో నమోదైన మైనర్ డ్రైవింగ్ కేసులు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాతో పాటు కేసులు సైతం నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో 2024 సంవత్సరంలో 270 కేసులు నమోదు చేసి రూ.1.35 లక్షల జరిమానా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు చేసి రూ.65 వేల జరిమానా విధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. మైనర్ డ్రైవింగ్పై తనిఖీలు నిర్వహించే సమయంలో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నాం. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకోవడం పాటు జైలుకు పంపిస్తాం. – గైక్వాడ్ వైభవ్రఘునాథ్, ఎస్పీ వాహనాలతో దూసుకుపోతున్న మైనర్లు ర్యాష్ డ్రైవింగ్తో తరచూ ప్రమాదాలు విద్యాసంస్థలకు సైతం వాహనాలు తీసుకెళ్తున్న వైనం -
జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు
నాగర్కర్నూల్: వర్షాల కారణంగా జన జీవనానికి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం మండలంలోని చర్లతిర్మలాపూర్ రోడ్డుపై నిలిచిన వరద నీటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఉయ్యాలవాడ నుంచి చెర్లతిర్మలాపూర్ వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు కలెక్టర్ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల జిల్లాలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, శిథిలావస్థ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి కోసం పునరావాసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ్, నాగర్కర్నూల్ ఆర్డీఓ సురేష్బాబు తదితరులు ఉన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చే యాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు, నీటి పారుదల, విద్యుత్, ఆరోగ్యం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సోలార్ విద్యుదీకరణ, మిషన్ భగీరథ వంటి రంగాల్లో పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ విజయ్కుమార్, డీఈఓ రమేష్కుమార్, డీఆర్డీఏ చిన్న ఓబులేష్, కల్వకుర్తి ఆర్డీఓ జనార్ధన్రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్సింగ్, ఆర్అండ్బీ, విద్యుత్ డీఈ, డైరీ, ఉపాధి కల్పన అధికారులు పాల్గొన్నారు. -
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఊర్కొండ: రైతులకు అవసరమైన యూరియాను ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు వి క్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి యశ్వంత్రావు హెచ్చరించారు. బుధవారం మండలంలోని రైతు కేంద్రం, పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ మండల రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని, ఎవరైనా డీలర్లు కృత్తిమ కొరత సృష్టించినా.. అధిక ధరలకు విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. డీలర్లు విధిగా స్టాక్ బోర్డులను అప్డేట్ చేయాలని ఆదేశించారు. రైతులు వారి అవసరం మేరకు ఎరువులు తీసుకోవాలని కోరారు. యూరియాను అధికంగా వాడడం వల్ల పంటకు చీడ పీడలు ఆశించి, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. సాధారణ యూరియాతో పోలిస్తే నత్రజని వినియోగ సామర్థ్యం నానో యూరియాలో ఎక్కువగా ఉంటుందని, నానో యూరియాను ఇతర పురుగు మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల రైతులకు శ్రమ, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. మండలంలో గతేడాది వానాకాలంలో 151 మె.టన్నుల యూరియా సరఫరా చేయగా.. ఈ ఏడాది 427 మె.టన్ను యూరియా సరఫరా చేశామన్నారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కిరణ్కుమార్, ఏఓ దీప్తి పాల్గొన్నారు. -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూ రు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు. ‘సాక్షి’లో ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా ప్రచురితమైన ‘మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ’ ‘పల్లెగడ్డను వదులుకోం’ కథనాలకు స్పందించిన నారాయణపేట ఎమ్మె ల్యే పర్ణికారెడ్డి.. పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పల్లెగడ్డ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సూర్యమోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని 36 మందికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని.. ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రూ.లక్షలు వెచ్చించి నివాస గృహాలు నిర్మించుకున్నామని, ఇప్పుడు పొమంటే ఎక్కడికి వెళ్లాలని ఆయనతో గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై ఎమ్మెల్యే దేవాదాయశాఖ కమిషనర్తో మాట్లాడారని, ఇకపై గ్రామంలో ఎవరికి నోటీసులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చి కోర్టుకు తిరుగుతున్న వారి తరపున ప్రభుత్వం నుంచి న్యాయవాదిని నియమించి కోర్టులో వాదన వినిపిస్తామని.. పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసానిచ్చారు. -
‘సర్కారు’కు సౌర వెలుగులు
అచ్చంపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలోనే సౌర విద్యుత్ అందనుంది. తద్వారా విద్యుత్ ఆదా కావడంతో పాటు ఆయా శాఖలకు భారంగా మారుతున్న విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ఊరట కలగనుంది. ఇప్పటికే కలెక్టరేట్లో సౌర విద్యుత్ వినియోగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ అందించేందుకు గాను సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల వివరాలు సేకరించేందుకు ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించారు. ప్లాంట్ల ఏర్పాటుకు వివరాల సేకరణ.. పక్కా భవనాలు ఉన్న కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పక్కా భవనాలు ఉన్న కార్యాలయాల వివరాలను టీజీ రెడ్కో అధికారులు సేకరిస్తున్నారు. ఏ భవనం ఎంత విస్తీర్ణంలో ఉంది? అక్కడ ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందనే వివరాలను మండలస్థాయి నుంచి సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రామపంచాయతీ, పాఠశాలలు, కళాశాలల భవనాలతో పాటు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టుల కార్యాలయాలు.. ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ వినియోగం ఆధారంగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం నెలకు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది..? ఎంత విద్యుత్ బిల్లు వస్తోందనే వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. ఈ లెక్కన తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న భవనాలకు హెచ్టీ సర్వీస్ కింద సోలార్ ప్లాంట్లను బిగించనున్నారు. రూ. 2వేల నుంచి రూ. 3వేల వరకు కరెంటు బిల్లులు వచ్చే కార్యాలయాలకు ఎల్టీ సర్వీస్ కింద 3 నుంచి 5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాలమైన భవనాలు కలిగి, ఎక్కువ విద్యుత్ వినియోగించే కార్యాలయాలకు హెచ్టీ సర్వీస్ కింద 100 కిలోవాట్లకు పైగా సోలార్ ప్లాంట్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్న అధికారులు.. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదించి బడ్జెట్ కేటాయిస్తే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. నివేదిక పంపిస్తాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్ని కార్యాలయాలకు పక్కా భవనాలు ఉన్నాయి.. ఈ భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఎంత మేర ఏర్పాటుచేసే అవకాశం ఉందనే వివరాలు సేకరిస్తున్నాం. ఇందుకు ఎంపీడీఓలను నోడల్ అధికారులుగా నియమించారు. వారు వివరాలు సేకరించి అందజేస్తారు. వీటన్నింటినీ క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. – మనోహర్రెడ్డి, డీఎం, రెడ్కో మహబూబ్నగర్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు వివరాలు సేకరిస్తున్న టీజీ రెడ్కో అధికారులు ఇప్పటికే కలెక్టరేట్లో ఏర్పాటు -
సీపీఎస్ను రద్దు చేయాలి
కందనూలు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే సీపీఎస్ను తక్షణమే రద్దు చేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వచ్చే నెల 1న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశనిపాతంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను సమూలంగా రూపుమాపడానికి పీఆర్టీయూ టీఎస్ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా చేపట్టనున్న మహాదర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బావండ్ల వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరావు, పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యదర్శి సురేందర్రెడ్డి, నాయకులు బిచ్చానాయక్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోండి కొల్లాపూర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చివరి విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కొల్లాపూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 99899 45177 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలనుకునే యువత, మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలిగేశ్వర్గౌడ్ తెలిపారు. ఈపథకం ద్వారా బ్యాంకు రుణాలతో పాటు కేంద్ర నిధుల నుంచి సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సాంకేతిక సమస్యల కారణంగా ఆన్లైన్ పోర్టల్ సేవలు నిలిచిపోయాయని, ప్రస్తుతం పునరుద్ధరించబడినందున ఆసక్తి గల అభ్యర్థులు https://www.kviconline.gov.in/pmegpeotal ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. -
పాత ఇళ్లలో ఉంటే ప్రమాదమే..
భారీ వర్షాల నేపథ్యంలో రోజుల తరబడి తడిసి ఉన్న మట్టి మిద్దెలు, పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఙప్తి చేస్తున్నారు. గతేడాది జూలైలో జిల్లాకేంద్రం సమీపంలోని వనపట్లలో మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఏడాది ఇప్పటికే అమ్రాబాద్ మండలం జంగిరెడ్డిపల్లిలో నాలుగు, పెద్దకొత్తపల్లి మండలం దేవునేనిపల్లి గ్రామంలో ఓ ఇంటి పైకప్పు పూర్తిగా కూలింది. -
‘ఆధార్ ఆధారిత హాజరు సరికాదు’
కందనూలు: ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ దేవ సహాయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ నాయకులు మాట్లాడుతూ.. ఆధార్ ఆధారిత హాజరు ద్వారానే వేతనాలు చెల్లించనున్నట్లు వివిధ పత్రికల్లో రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
అడవిలో తప్ప బయట బతకలేం
మేం ఏళ్లుగా మా తాత ముత్తాతల నుంచి అడవిలో ఉంటున్నాం. అడవిలో ఉన్న ఆధారం మాకు బయట దొరకదు. ఇక్కడ దొరికింది తిని బతుకుతున్నాం. బయటకు పోయినంక మాకు దిక్కు ఎవరు ఉంటరు. గ్రామాలు అన్నీ వెళుతున్నాయని అంటున్నరు. మేం అడవిలోనే ఉంటాం. – దంసాని లింగయ్య, కొల్లంపెంట, అమ్రాబాద్ మండలం పునరావాసం ఇచ్చాకే పోతాం.. మేం ఏళ్లుగా అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మాకు వేరే పని తెలువదు. పులులు, వన్యప్రాణుల కోసం మమ్మల్ని బయటకు పొమ్మని అంటున్నారు. మాకు చెప్పినట్టుగా పూర్తిగా పరిహారం, ఇల్లు, భూమి ఇచ్చాకనే పోతాం. – గోరటి చంద్రమ్మ, కుడిచింతల్బైల్ అన్ని పూర్తయ్యాక తరలించాలి.. అడవి నుంచి బయటకు తీసుకెళ్లి అక్కడ ఇళ్లు కట్టించి ఇస్తామంటున్నారు. వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇస్తాం అని చెప్పారు. అన్నీ చెప్పినట్టుగా ఇస్తేనే ఇక్కడి నుంచి బయటకు పోతాం. పోడు భూములు, నమ్ముకున్న అడవిని విడిచి పోతే మాకు బతికేందుకు పని కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా మానవీయ కోణంలో తరలింపు చేపడతాం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో రెండు దశల్లో గ్రామాల రీలొకేషన్ ప్రక్రియ ఉంటుంది. నిర్వాసితులకు ఎన్టీసీఏ ద్వారా పూర్తిస్థాయిలో పరిహారం అందించాకే రీలొకేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రీలొకేషన్ కోసం స్వచ్ఛందంగా ముందుకువచ్చిన వారికే ప్యాకేజీ అందించి తరలింపు చేపడతాం. – రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ ● -
ఎడతెరిపి లేకుండా..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా వరకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. గ్రామాలను అనుసంధానిస్తూ ఉన్న కాజ్వేలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం పెరిగిపోవడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం జిల్లాలోని తిమ్మాజిపేట మండలంలో అత్యధికంగా 28 మి.మీ. వర్షపాతం నమోదైంది. బిజినేపల్లి, ఊర్కొండ, ఉప్పునుంతల, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మండలాల్లో 20 మి.మీ. మించి వర్షం కురిసింది. వంగూరు, వెల్దండ, చారకొండ మండలాల్లో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. జిల్లాకేంద్రం సమీపంలోని నల్లవాగుతో పాటు చర్లతిర్మలాపూర్ – ఉయ్యాలవాడ మధ్యనున్న చెరువు నిండి కాజ్వే మీదుగా నీటి ప్రవాహం ప్రమాదకరంగా కొనసాగుతోంది. ఈ దారిలో వెళ్లే విద్యార్థులను గ్రామస్తులు పుట్టీ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దుందుబీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాడూరు మండలం సిర్సవాడ, కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద రాకపోకలను నిలిపివేశారు. పంటలకు నష్టం.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలను వరద ముంచెత్తుతోంది. బిజినేపల్లి, తాడూరు, కల్వకుర్తి మండలాల్లో సాగుచేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం కలిగింది. సుమారు 500 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. పత్తి, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ముసురు వాన తిమ్మాజిపేట మండలంలోఅత్యధికంగా 28 మి.మీ. వర్షపాతం పలుచోట్ల పంటలను ముంచెత్తిన వరద -
శభాష్.. వెంకటేశ్
నారాయణపేట జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రమంలో చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభంపై వైరు తెగిపోయి తన పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి వైర్లు సరిచేసి సరఫరా పునరుద్ధరించి శభాష్ అనిపించుకున్నాడు యువకుడు వెంకటేశ్. సంబంధిత గ్రామాలకు కొన్నేళ్లుగా విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా లైన్మెన్ లేకపోయినా కరెంట్ బిల్లుల వసూలుకు నియమించబడిన సదరు యువకుడు తన పని కాకపోయినా ధైర్యం చేసి విద్యుత్ మరమ్మతులు చేశాడు. ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు సంబంధించిన కరెంట్ బిల్లుల వసూలుకు స్పాట్బిల్లర్గా కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముశ్రీఫా శివారులో ఉన్న చెరువు మధ్యలో విద్యుత్ వైరు తెగిపోయింది. దీంతో ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు విద్యుత్ సరఫరా నిలిచి గ్రామాల్లో చీకటి అలుముకుంది. సోమవారం ఉదయం విద్యుత్ లైన్ను పరిశీలించగా.. చెరువు మధ్యలో వైరు తెగినట్లు గుర్తించారు. స్పాట్బిల్లర్ వెంకటేశ్ ఎల్సీ తీసుకొని చెరువులో ఈదుకుంటూ వెళ్లి మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి వైర్లు సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వెంకటేశ్ను అభినందించారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ ధైర్యం చేసి చెరువు మధ్యలోకి వెళ్లి మరమ్మతు పనులు పూర్తి చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో వెంకటేశ్కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
నాగర్కర్నూల్ జిల్లా: మండలంలోని ముకురాలలో గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వింజమూరి ఈశ్వరయ్య (52) ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో గుడ్డు తిన్నాడు. అందులోని పచ్చసోన గొంతులో ఇరుక్కుపోవడంతో భార్య ఈశ్వరమ్మ తలపై కొట్టి గుడ్డును కక్కించే ప్రయత్నం చేయడంతోపాటు నీళ్లు తాపినా ప్రయోజనం లేక అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. ఈశ్వరయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో చేసేదేమి లేక ఇంటికి తీసుకెళ్లి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తి హఠాన్మరణం పాన్గల్: కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలంలోని కేతేపల్లికి చెందిన తోకల కృష్ణ పబ్లిసిటీ పెయింటింగ్ కాంట్రాక్టర్. ఆయన దగ్గర ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి చెందిన జానీ రంగరావు, సదరం రమణ (58) పెయింటర్స్గా పని చేస్తున్నారు. ఏపీలోని అనంతపూర్లో పెయింటింగ్ పని ముగించుకొని ఈ నెల 16న రాత్రి కేతేపల్లికి చేరుకున్నారు. 18వ తేదీన సదరం రమణ బహిర్భూమికి వెళ్తూ గ్రామపంచాయతీ కార్యాలయ భవనం దగ్గర కళ్లు తిరిగి కిందపడిపోయాడు. వెంటనే గ్రామంలోని ఆర్ఎంపీ దగ్గరకు అటు నుంచి జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తోకల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
జల విలయం
సాక్షి, నాగర్కర్నూల్/నాగర్కర్నూల్ క్రైం/ బిజినేపల్లి: జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం పెద్దకొత్తపల్లి మండలంలో అత్యధికంగా 96.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని లింగాల, బిజినేపల్లి, తాడూరు, బల్మూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, ఉప్పునుంతల మండలాల్లో 55 మి.మీటర్లకు మించి వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. చారకొండ మండలంలో అత్యల్పంగా 25.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెరువులు మత్తడి దూకుతూ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సిర్సవాడ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగుతో పాటు జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మత్తడి ప్రవాహాన్ని కలెక్టర్ సంతోష్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకేంద్రం నుంచి కేసరిసముద్రం మీదుగా ఎండబెట్ల వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఉప్పొంగుతున్న వాగులు, చెరువుల ప్రవాహాల మీదుగా దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం హైఅలర్ట్ భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్ట నివారణకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వరదలు, ముంపు ప్రాంతాల బాధితుల సంరక్షణ, సహాయం కోసం ఇప్పటికే ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు నేరుగా 08540–230201 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. నిలిచిన రాకపోకలు జిల్లాలో దుందుభీ వాగు ప్రవాహం ఉధృతంగా మారడం, పలుచోట్ల చెరువులు మత్తడి దూకి రహదారుల మీదుగా ఉప్పొంగుతుండటంతో గ్రామాల మధ్య రాకపోకలకు ఆటకం ఏర్పడుతోంది. జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం చెరువు ఉప్పొంగి నాగర్కర్నూల్–ఎండబెట్ల రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తాడూరు మండలంలోని సిర్సవాడ వద్ద దుందుభీ ప్రవాహం ఉధృతం కావడంతో అధికారులు ఈ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ప్రజలు ఎవరూ ఈ మార్గంలో వెళ్లకుండా నిరంతరం పహారా ఏర్పాటుచేశారు. పలుచోట్ల కుండపోత జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయంగా మారాయి. పాత ఇళ్లతో ప్రమాదం భారీ వర్షాలకు జిల్లాలోని అమ్రాబాద్ మండలం జంగిరెడిపల్లిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. గ్రామానికి చెందిన మద్దెల అర్జనమ్మ, మంతటి నారమ్మ, కల్వల లక్ష్మమ్మకు చెందిన పాత ఇళ్ల పైకప్పు వర్షానికి తడిసి సోమవారం నేలకూలాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిథిలమైన, పాత ఇళ్లలో ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు వాగులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించొద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువును పరిశీలించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రమాదకర స్థితిలో పారుతున్న వాగుల్లో ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, అలాంటి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. బిజినేపల్లి మండల కేంద్రం నుంచి నందివడ్డెమాన్ గ్రామానికి వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం వారు నందివడ్డెమాన్ గ్రామానికి వెళ్లే క్రమంలో రోడ్డుపై ప్రవహిస్తున్న భీమసముద్రం అలుగు ఉధృతికి ద్విచక్ర వాహనం కొద్ది దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అతి కష్టం మీద నీటి ఉధృతి తక్కువ ఉన్న ప్రాంతంలో ద్విచక్ర వాహనాన్ని తిరిగి లాక్కొచ్చారు. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో అత్యధికంగా 96.4 మి.మీ. వర్షపాతం చెరువులను తలపిస్తున్న పంట పొలాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు పొంగిపొర్లుతున్న వాగుల రహదారులపై రాకపోకలు సాగించొద్దని కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ విజ్ఞప్తి -
‘ప్రకృతి ఒడిలో పాలధార’
అచ్చంపేట రూరల్: ప్రకృతి ఒడిలో అలరారుతున్న శ్రీశైలేషుడి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరుడి క్షేత్రంలో పాపనాశిని గుండం కొండపై నుంచి జాలు వారే జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కొన్ని రోజులుగా నల్లమల్ల పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియల నుంచి వచ్చే జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. చల్లని వర్షపు నీటిలో తడిసి ముద్దవుతున్నారు. అక్కడే సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పైనుంచి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. -
ప్రజావాణికి గైర్హాజరైతే చర్యలు తప్పవు
నాగర్కర్నూల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కా ర్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తప్ప వని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించొద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి జి ల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 30 వినతులు అందగా.. వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు కేటాయించారు. ఐటీఐతో బంగారు భవిష్యత్ జిల్లాలోని కల్వకుర్తి, మన్ననూర్లో ఉన్న ఐటీఐ (ఏ.టీ.సీ) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలను పెంచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. ఐటీఐలో ఖాళీల భర్తీ కోసం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరు, కల్వకుర్తి పట్టణంలోని ఐటీఐ కళాకాలల్లో 2025–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీఐలు టెక్నాలజీ హబ్లుగా మారిపోయాయని, అత్యాధునిక మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి ల్యాబ్లు, టాటా టెక్నాలజీస్ సహకారం, ప్రముఖ ఇండస్ట్రీల భాగస్వామ్యంతో యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉండే విద్యార్థులను గుర్తించి, ఐటీఐలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీజీఏటీఈ వైస్ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, జిల్లా కన్వీనర్ మన్ననూర్ ఐటీఐ ప్రిన్సిపల్ ఎస్పీ లక్ష్మణ్స్వామి, ఐటీఐ కల్వకుర్తి ప్రిన్సిపల్ జి.జయమ్మ, జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.రాఘవేంద్రసింగ్, జిల్లా కార్మిక శాఖ అధికారి జె.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెంచులకు న్యాయ సహాయం అందిస్తాం
కొల్లాపూర్ రూరల్: చెంచులకు అన్ని విధాల న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ నాగర్కర్నూల్ సెక్రెటరీ నసీం సుల్తానా అన్నారు. హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని అమరగిరి గ్రామాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా చెంచుల యొక్క జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆర్థిక స్థోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని వారికి తమ సంస్థ తరుఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమించి, న్యాయ సహయం అందిస్తామన్నారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకోవాలని తెలిపారు. బాల్య వివాహలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఉన్న విశ్వశాంతి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధుల యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవా, మండల న్యాయ సేవా సంస్థ చేదోడు వాడోడుగా ఆశ్రమానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతుల నాగరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం
కందనూలు: జిల్లా కేంద్రమైన నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ, 17వ వార్డులో ఆయన పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. 2012లో అప్పటి ప్రభుత్వం బీసీ కాలనీలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో వందలాది కుటుంబాలు స్థిరనివాసం ఏర్పర్చుకొని నివసిస్తున్నాయన్నారు. నాటి నుంచి నేటి వరకు కాలనీ అభివృద్ధిపై పాలకులు దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలనీలో కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. మరోవైపు ఇంటి నంబర్లు లేవని, మిషన్ భగీరథ నీరు రావడం లేదని, కరెంటు కూడా సక్రమంగా ఉండటం లేదన్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా.. వృద్ధులు బయటకు రావాలన్నా సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రం అయినప్పటికీ కాలనీలపై అశ్రద్ధ చేయడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు. -
42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిద్దాం
అచ్చంపేట: 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు, నాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్యనాయకులు, కుల సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ఈ నెల 20న అచ్చంపేటలో నిర్వహించే భారీ ర్యాలీలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్ గోపిశెట్టి శివ, బీసీ సంఘాల నాయకులు కాశన్నయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై. శ్రీనివాసులు, శరణ్గౌడ్, శారదమ్మ, నిరంజన్, సత్యమ్మ, హరినారాయణగౌడ్, మల్లయ్య ఉన్నారు. -
అంబరాన్నంటిన తీజ్ వేడుకలు
లింగాల: గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాన్ని చాటుతూ తీజ్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. లింగాల, సూరాపూర్ తదితర గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ వేడుకలను మొలకల పండుగతో ముగించారు. లింగాల బంజారవాడలోని మేరమ్మ భవాని ఆలయం ఆవరణలో గిరిజన యువతులు నిష్టతతో మొలకలను పెంచారు. చివరి రోజు బంజార వేషధారణతో యువతులు మొలకల బుట్టలను తలపై ఉంచుకొని ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. డీజే సౌండ్ మధ్య ఊరేగింపు అనంతరం పట్టణ సమీపంలోని రామాలయం ఎదుట ఉన్న పెద్దకర్ణం కుంటలో నిమజ్జనం చేశారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. సంప్రదాయానికి ప్రతీక తీజ్ కల్వకుర్తి టౌన్: తీజ్ ఉత్సవాలు లంబాడీల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని భగత్సింగ్ తండాలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీజ్ ఉత్సవాలను గిరిజనులు కనులపండువగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలు కొనసొగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, భగత్సింగ్ తండావాసులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న యువతుల సంప్రదాయ నృత్యాలు మొలకలతో భారీ ఊరేగింపు -
వానొస్తే.. వాగు దాటేదెలా
అచ్చంపేట: వానొస్తే వాగులను దాటలేని పరిస్థితి నెలకొంటోంది. ప్రధాన రహదారులపై ఉన్న లోలెవల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఫలితంగా పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే పాలకులు, అధికారులు.. ఆ తర్వాత వాటి గురించే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని దుందుభీ, చంద్రవాగు, ఇతర వాగులపై లోలెవల్ కాజ్వేలు, వంతెనలపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ప్రమాదాలు ఇలా.. ● ఈ నెల 11న నాగర్కర్నూల్–నాగనూలు మార్గంలో వరద ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. గతేడాది ఇక్కడే వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్ రక్షించారు. ● లింగాల–పద్మన్నపల్లి రహదారిలో చిన్నవాగు వరద ఉధృతికి ఈ నెల 15న లింగాలకు చెందిన ముడావత్ పెంట్యానాయక్ (65) కొట్టుకుపోయి మృతిచెందాడు. ● మూడేళ్ల క్రితం కోడేరు మండలం పస్పుల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పడి మృతిచెందాడు. ● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి వద్ద వాగులో ఇప్పటికే మూడు ట్రాక్టర్లు, ఒక కారు కొట్టుకుపోయాయి. ● తెలకపల్లి మండలం కార్వంగ–నడిగడ్డ మార్గంలోని వాగులో గతేడాది గొర్రెల కాపరులు వరదలో చిక్కుకుంటే ఎన్డీఆర్ఎ్ఫ్ బృందాలు రంగంలోకి దిగి రక్షించాయి. నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే.. మొల్గర హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023 జూలై 24న రూ. 35కోట్లు మంజూరయ్యాయి. 80 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ మేరకు సర్వే చేసి, భూసార పరీక్షలు నిర్వహించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు వంతెన నిర్మాణ డిజైన్ చేసి ఆర్అండ్బీ ఈఎన్సీకి పంపించారు. డిజైన్ అప్రూవల్ దశలోనే ఉండటంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిషేధిస్తూ పోలీసులు బారికేడ్స్ ఏర్పాటుచేశారు. ● కోడేరు–పెద్దకొత్తపల్లి ప్రధాన రహదారిలో బావాయిపల్లి వద్ద వాగుపై వంతెన నిర్మాణానికి 2021లో రూ. 96లక్షలు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ● కోడేరు మండలం పస్పుల వద్ద వంతెన నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరైనా పనులకు మోక్షం కలగడం లేదు. ● తెలకపల్లి మండలం కార్వంగ–నడిగడ్డ మార్గంలో ఐదేళ్ల క్రితం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. ● వెల్దండ మండలం సిరసగండ్ల–చారకొండ మార్గంలో మూడేళ్ల క్రితం భైరాపూర్ వాగు ఉధృతికి వంతెన కొట్టుకుపోయింది. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ. 3.50కోట్లు మంజూరయ్యాయి. ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. అలాగే చెర్కూర్–గాన్గట్టుతండా మార్గంలో వాగుపై వంతెన నిర్మాణానికి రూ. 4.15 కోట్లు మంజూరైనా పనులు చేసేందుకు కంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ● తాడూరు మండలం సిర్సవాడ–మాదారం దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. 300 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ఈఏడాది మార్చి 7న రూ. 20.20కోట్లు మంజూరు చేసింది. ఇంత వరకు పనులు మొదలు కాలేదు. ప్రయాణం నరకప్రాయం.. ఉప్పునుంతల, వంగూరు మండలాల మధ్య దుందుభీ వాగు ప్రవహిస్తోంది. మొల్గర వద్ద వాగు ఉధృతికి ఉప్పనుంతల, మొల్గర మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉల్పర, మిట్టసదగోడు, కోనాపూర్, రంగాపూర్, ఎల్లికల్లు, మొల్గర, జప్తిసదగోడు, పెద్దాపూర్, లక్ష్మాపూర్, మామిళ్లపల్లి వంటి 10 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ● అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి–చందంపేట రహదారిపై దుందుభీ వాగు ఉధృతి కారణంగా కాజ్వే దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐనోలు, బొమ్మనపల్లి, సిద్ధాపూర్, మన్నెవారిపల్లి, ఘనపూర్, అక్కారం, బక్కాలింగాయిపల్లి ఏజెన్సీ గ్రామాల ప్రజలు 70 కి.మీ. తిరిగి దేవరకొండ, చందంపేటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ● అచ్చంపేట మండలంలోని చంద్రవాగు పొంగితే చౌటపల్లి, బాణాల, బిల్లకల్లు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. ● కొల్లాపూర్ మండలం నార్లాపూర్– ముక్కిడిగుండం మార్గంలో పెద్దవాగు ఉధృతంగా పారుతుండటంతో ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా, చెంచుగూడెం, మొలచింతలపల్లి గ్రామాల రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ● అచ్చంపేట–ఉప్పునుంతల రహదారిలో మల్లప్ప వాగు పారితే జనజీవనం స్తంభిస్తుంది. ● దాసర్లపల్లి, లక్ష్మాపూర్ మధ్య చీకటివాగు వరద ఉధృతికి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోతాయి. ● ఉప్పునుంతల–పెద్దపూర్ వాగుపై వంతెన ఏర్పాటు చేయా లని ఏళ్లుగా కోరుతున్నా ఫలితం లేదు. ● బల్మూర్, వీరంరాజుపల్లి రహదారిలోని కల్వర్టు, చెన్నారం, వీరంరాజుపల్లి, రామాజీపల్లి మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే కొండనాగుల, అచ్చంపేట మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ● లింగాల–అంబటిపల్లి రోడ్డులో కేసీతండా గేట్ వద్ద వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ● యాపట్ల–అంబట్పల్లి మార్గంలో ఉన్న వాగుపై ప్రస్తుతం ఉన్న కాజ్వే శిథిలావస్థకు చేరింది. ● వంగూరు–జూపల్లి, గోకారం–తుర్కపల్లి మార్గాల్లో వాగులు దాటనీయడం లేదు. ● కోడేరు–పెద్దకొత్తపల్లి, కోడేరు–పస్పుల, ఖానాపూర్–పస్పుల, గంట్రావుపల్లి మార్గాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ● లింగాల–చెన్నంపల్లి మధ్య పెద్దవాగు వాగు దాటడం ప్రమాదకరంగా మారింది. చెన్నంపల్లి, ఎర్రపెంట, పద్మనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతిపాదనలు సిద్ధం.. దుందుభీ వాగుపై వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే మొల్గర వద్ద వంతెన ఏర్పాటుకు రూ. 35కోట్లు మంజూరయ్యాయి. సర్వే, భూసార పరీక్షలు పూర్తయాయి. ఆర్అండ్బీ అధికారులు వంతెన డిజైన్ చేసి ఆర్అండ్బీ ఈఎన్సీకి పంపించారు. డిజైన్ అప్రూవల్ దశలో ఉంది. మన్నెవారిపల్లి వద్ద డిండి వాగుపై కూడా వంతెన నిర్మాణం చేపడుతాం. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వంతెనలు అవసరమున్నాయో గుర్తించి మంజూరు చేయించేందుకు కృషి చేస్తా. – డా.చిక్కడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్న పల్లె జనం మొల్గర–కల్వకుర్తి, మన్నెవారిపల్లి–చందంపేట మధ్య బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ 17 గ్రామాలకు రాకపోకలు బంద్ ముందుకు సాగని వంతెనల నిర్మాణ పనులు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కోడేరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి సంబంధించి మైనార్టీలకు 34 కట్టు మిషన్లు మంజూరయ్యాయని తెలిపారు. అదే విధంగా సాతాపూర్, గంట్రావుపల్లి, ఖానాపూర్, కోడేరు వరకు బీటీరోడ్డు, బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.13కోట్లు నిధుల కేటాయించినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా పస్పుల వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కోడేరుకు 76 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500 వందలకే గ్యాస్, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్కుమార్, ఆర్ఐ జంబులయ్య, పంచాయతీ కార్యదర్శి రవితేజ, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ మహేష్రెడ్డి, రంగినేని జగదీశ్వరావు, మాజీ వార్డు సభ్యులు రాజు, సురేష్ యాదవ్, కురుమయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు . మంత్రి జూపల్లి కృష్ణారావు -
పైప్లైనే ముద్దు
కాల్వ వద్దు.. జిల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపుపై రైతుల విజ్ఞప్తి మా గ్రామాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చాలాసార్లు చెప్పారు. కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. కాల్వలు తవ్వితే ఉన్న కొద్దిపాటి భూములు కోల్పోతాం. కాబట్టి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తే అందరికీ ఉపయోగం. – గోవిందు, రైతు, మొలచింతలపల్లి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో స్లూయిస్ ఏర్పాటుచేశారు. అక్కడే 318 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో పైప్లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ అధికారులకు వివరించాం. – బండి వెంకట్రెడ్డి, గ్రామాభ్యుదయ సేవాసంస్థ నిర్వాహకుడు, ఎల్లూరు జీల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించాం. కానీ కాలువలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్లైన్ ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం, ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వారి ఆదేశాల తర్వాతనే పనులు ప్రారంభిస్తాం. – అమర్సింగ్, డీఈ, నీటిపారుదల శాఖ కొల్లాపూర్: కృష్ణానది నీటిని జిల్దార్తిప్ప చెరువుకు తరలించే పనులు ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు. లక్షల ఎకరాలకు నీరందించే కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులు పక్కనే ఉన్నా మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం ఆయకట్టుకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రైతులు రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు. జిల్దార్తిప్ప చెరువే ఆధారం జీల్దార్తిప్ప చెరువును 2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 1970లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జలగం వెంగళ్రావు శంకుస్థాపన చేయగా.. ఎమ్మెల్యే కే.రంగదాసు నిర్మాణం పూర్తి చేశారు. ఈ చెరువు కింద 13 వందల ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోంది. మొలచింతలపల్లిలోని చింతల్చెరువు, పెద్దచెరువు, చిలుకలూటి చెరువు, ముక్కిడి గుండం గ్రామంలోని ఊరచెరువుల కింద మరో 8 వందల ఎకరాల సాగు జరుగుతోంది. రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూముల విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది 3 వేల ఎకరాలకు పైగా చేరుతుంది. మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్ల వ్యయంతో కృష్ణా బ్యాక్ వాటర్పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరోసారి 2019లో కేఎల్ఐ నుంచి జీల్దార్తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించి.. శంకుస్థాపనలు చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే కారణంగా పనులు ముందుకు సాగలేదు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్ల వ్యయంతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది. మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాలకు అందని సాగునీరు నీటి తరలింపునకు రెండుసార్లు శంకుస్థాపనలు ముందుకు సాగని పనులు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల పక్కనే ఉన్నా అలసత్వమే.. -
శనైశ్వరాలయానికి భక్తులు
బిజినేపల్లి: ఏలినాటి శనిదోష నివారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చెరుకుని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరునికి తిలతైలాభిషేకం, పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులతో శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, ప్రదక్షిణలు, నందీశ్వర దర్శనం, అన్న ప్రసాదం వంటి కార్యక్రమాలు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమా మహేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కిటకిటలాడిన తిరుమలయ్య గుట్టవనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన తిరుమలనాఽథ వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా, గుట్ట కింద దాతలు అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో గుట్టపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్లో ఇరువైపులా వాహనాల రద్దీ ఏర్పడి రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి సిబ్బందితో చేరుకొని రాకపోకలను పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు. గుట్టపైన భక్తులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.రేపు గురుకులాల్లో స్పాట్ కౌన్సెలింగ్గద్వాల న్యూటౌన్: జిల్లాలోని కేటీదొడ్డి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 5, 6, 7, 8, 9వ తరగతుల్లో (ఇంగ్లీష్ మీడియం) మిగులు సీట్లకు ఈనెల 18వ తేదీ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్లోని తిరుమల హిల్స్ అప్పన్నపల్లి నందు 18న ఉదయం 10గంటలకు స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని, గిరిజన విద్యార్థినులకు మాత్రమే సీట్లు ఉన్నాయని, ఎస్టీ ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్, పీహెచ్సీ క్యాటగిరీలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. -
ఇంటర్లోనూ ఫేస్ రికగ్నేషన్
నాగర్కర్నూల్: విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో వవిద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నేషన్ హాజరు విధానం ప్రవేశపెట్టగా.. ఇదే విధానాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం విద్యార్థులు, అధ్యాపకుల హాజరులో మరింత పారదర్శకత ఉండేలా చూసుకుంటోంది. 16 కళాశాలల్లో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 16 ఉండగా.. అందులో ప్రథమ సంవత్సరంలో 2,389 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,800 మంది కలిపి మొత్తం 4,189 మంది విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో మొత్తం 165 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల బయెమెట్రిక్ ద్వారా హాజరు వేస్తుండగా అక్కడక్కడ నెట్వర్క్ సమస్యలు, బ్యాటరీ లోపాలు వంటివి ఎదురవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే సీసీ కెమెరాల నిఘాలో... కళాశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.22కోట్లు మంజూరు చేయడంతో అన్ని కళాశాల్లో క్లాస్రూం, ల్యాబ్, ప్రిన్సిపల్ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయబడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచే అధికారులు తరగతులు, బోధనా పద్ధతులు, విద్యార్థుల, అధ్యాపకులు హాజరు వంటి విషయాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ కళశాలల్లో ఫేస్ రికగ్నేషన్ హాజరుకు సంబంధించి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఏర్పాటు పూర్తి చేసి ఫేస్ రికగ్నేషన్ హాజరు అమలు కానుంది. దీంతో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుకు సంబంధించి మరింత పారదర్శకత పెరగనుంది. – వెంకటరమణ, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టేందుకు చర్యలు విద్యా నాణ్యత పెంపొందించేలా చర్యలు జిల్లాలో 4,189 మంది విద్యార్థులు -
‘బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి’
నాగర్కర్నూల్: జిల్లా కేంద్రం నుంచి నాగనూల్ రోడ్డులో వరద నీరు వెళ్లే చోట బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా నాగర్కర్నూల్ నుంచి నాగనూల్ వెళ్లే దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డి అక్కడి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత తొందరగా నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయించి నిర్మిస్తామని అక్కడి ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గుడిపల్లిలో పర్యటన నాగర్కర్నూల్ మండలంలోని గుడిపల్లిలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిశీలించేందుకు పలు కాలనీల్లో ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి పర్యటించారు. గుడిపల్లి కాల్వకు లైనింగ్ లేకపోవడం వల్ల ఇళ్లలోకి, కాలనీల్లోకి నీరు ఊరుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాల్వ లైనింగ్ కోసం అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. -
అంతా.. అప్రమత్తం
ఆగని అవినీతి..నాగర్కర్నూల్జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల హై అలర్ట్ I‘స్వతంత్ర భారతదేశంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోనూ అవే రాజ్యమేలుతున్నాయి. స్వేచ్ఛ.. సమానత్వం అనేవి మాటలకే పరిమితమయ్యాయి. విద్య, వైద్యం అంటే కాసులు కుమ్మరించాల్సిందే.. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆయా విభాగాల్లో మెరుగైన ఫలితాల సాధనకు ప్రజాప్రతినిధులు మరింత కృషిచేయాలి.. ఈ మేరకు చట్టసభలతో పాటు అధికార యంత్రాంగంలో మార్పు రావాలి. మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తూ స్వాతంత్య్ర ఫలాలను ప్రతిఒక్కరికీ అందించాలి..’ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 78 ఏళ్లు పూర్తి చేసుకుని శుక్రవారం 79వ వసంతంలోకి అడుగిడుతున్న స్వతంత్ర భారతావనిలో స్వాతంత్య్ర ఫలాలు అందుతున్నాయా? వంటి పలు అంశాలపై ‘సాక్షి’ గురువారం సర్వే చేపట్టింది. పలు వర్గాల ప్రజలు ఉత్సాహంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025సర్వే సాగిందిలా.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మొత్తం 150 మంది నుంచి ‘సాక్షి’ బృందం శాంపిళ్లు సేకరించింది. ఒక్కో జిల్లా నుంచి 30 మంది (పురుషులు 15, మహిళలు 15) చొప్పున అభిప్రాయాలు తీసుకుంది. ఎంచుకున్న మూడు ప్రశ్నలకు ఒక్కొక్కరి నుంచి సమాధానాలను రాబట్టింది. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వ్యవస్థలోని కాలానుగుణ మార్పులు, లోపాలతో పాటు ఇంకా మెరుగు కావాల్సిన అంశాలను ప్రస్తావించారు. సాక్షి, నాగర్కర్నూల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిరాటంకంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని దాదాపుగా చెరువులన్నీ ఉప్పొంగి మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోలెవల్ వంతెల వద్ద వరద పోటెత్తుతోంది. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కలగకుండా ఉండేందుకు కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అత్యవసర సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కల్వకుర్తిలో 147.6 మి.మీ. వర్షం జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కల్వకుర్తి మండలంలో 147.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిమ్మాజిపేట మండలంలో 105.5 మి.మీ. వర్షం కురిసింది. పెద్దకొత్తపల్లి, వెల్దండ, ఉప్పునుంతల, ఊర్కొండ, వంగూరు, బిజినేపల్లి, కోడేరు, చారకొండ, నాగర్కర్నూల్, తాడూరు మండలాల్లో 60 మి.మీ. మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలో దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభీ ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షించారు. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పునుంతల మండలంలో దుందుభీ వాగుతో పాటు చిలకల వాగు ప్రవాహం అధికం కావడంతో స్థానిక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాకేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాంనగర్ కాలనీలో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. కల్వకుర్తి విద్యానగర్ కాలనీలో జలమయంగా మారింది. కేఎల్ఐ కాల్వకు పలుచోట్ల గండ్లు పడటంతో సమీపంలోని పంటపొలాలు జలమయం అయ్యా యి. చారకొండ మండలం జూపల్లిలో కేఎల్ఐ కాల్వ తెగిన ప్రాంతాన్ని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. వెల్దండ సమీపంలో ని కేఎల్ఐ డీ–82 కెనాల్కు గండిపడింది. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో తెగిన కేఎల్ఐ కాల్వను అధికారులు పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని కేసరి సముద్రం చెరువు వాగుతో పాటు తూడుకుర్తి సమీపంలో ప్రమాదకరంగా పారుతున్న వాగును బైక్లపై దాటుతూ కిందపడిన వ్యక్తులను స్థానికులు రక్షించారు. 78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి? అవినీతి పేదరికం అందని నాణ్యమైన విద్య అందని మెరుగైన వైద్యం కుల వివక్ష స్వేచ్ఛ– సమానత్వం నిజంగానే అందరికీ చేరుతోందా? స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నీతి, నిజాయితీగా పనిచేయాల్సిన రంగాలు ఏవి ? చట్ట సభలు న్యాయ స్థానాలు అధికార యంత్రాంగం మీడియా కొద్దిగా..లేదుఅవునునష్టనివారణకుకంట్రోల్ రూం.. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభవిత, ముంపు ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్రూం ఏర్పాటుచేశారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే 08540– 230201, 08540– 230203 నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంతెనలను ఎట్టి పరిస్థితుల్లో దాటేందుకు ప్రయత్నించవద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు. అంతరాలు తొలగించాలి.. సుపరిపాలన అందించే దిశగా ప్రధానంగా చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలనే ఆకాంక్ష ప్రజల్లో వ్యక్తమవుతోంది. పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు తొలగేలా ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో ముందుకుసాగాలని.. వ్యవస్థలను నిర్వీర్యం చేసే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయ నేతల ప్రమేయం గానీ, వారి ప్రభావం గానీ లేకుంటే అధికార యంత్రాంగం బాగానే పనిచేస్తుందని.. అప్పుడు న్యాయస్థానాలు, మీడియా అవసరం ఉండదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం అందని ద్రాక్షగానే స్వేచ్ఛ.. సమానత్వం చట్టసభలు, అధికారుల్లో మార్పు రావాలి మరింత నీతి, నిజాయితీగా పనిచేయాలి ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిమతం మూడు చోట్ల తెగిన కేఎల్ఐ కాల్వ.. ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అధికారుల పటిష్ట చర్యలు జిల్లావ్యాప్తంగా మత్తడి దూకుతున్న చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు పలుచోట్ల కేఎల్ఐ కాల్వకు గండి -
‘చంద్రసాగర్–అమ్రాబాద్’ పథకం చేపట్టాలి
కొల్లాపూర్: అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పర్ప్లాట్ ఎగువ, దిగువ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపో తల పథకాన్ని వెంటనే చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవా చారి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన కొల్లాపూర్లో విలేకర్లతో మాట్లాడారు. పాలమూరు జిల్లా అవసరాలకు అనుగుణంగా కృష్ణా జలాలను వాడుకోవడంలో నేటికీ పాలకులు నిర్లక్ష్యం కనబరుస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటా వినియోగంలో జరిగిన అన్యా యాన్ని తెలంగాణ వచ్చాక కూడా సరిచేయడం లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన నిధుల కేటాయింపులు జరగడం లేదన్నారు. అచ్చంపేట ఎత్తిపోతల, ఉమామహేశ్వరం ఎత్తిపోతల పథకాలంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి రంగానికి రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు.. అప్పర్ప్లాట్లోని 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎందుకు మనసు రావడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అప్పర్ప్లాట్కు నీటి సమస్య తీర్చేందుకు పోరాట కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అనంతరం అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక గద్వాల జిల్లా కన్వీనర్ ఎండీ ఇక్బాల్ పాషా, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.వామన్కుమార్ పాల్గొన్నారు. -
శిథిల భవనాల్లో ఎవరూ ఉండొద్దు
● కృష్ణానదిలో బోటు ప్రయాణం నిషేధం ● అత్యవసర శాఖల అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశం నాగర్కర్నూల్/వెల్దండ/చారకొండ: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శిథిల భవనాల్లో ఎవరూ ఉండొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్రూం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అన్నిశాఖల అధికారులు 24గంటలు అందుబాటులో ఉంటూ.. సమగ్ర సమాచారంతో వరద నిర్వహణ కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శిథిల భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అధిక వర్షపాతం నమోదు అయితే వెంటనే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని డీఈఓ, డీడబ్ల్యూఓలను కలెక్టర్ ఆదేశించారు. వాగులు, పాటుకాల్వల్లో వరద సాఫీగా ముందుకు పారేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సాగునీటి కాల్వలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సూచించారు. సోమశిల, ఇతర పర్యాటక ప్రదేశాల్లోని కృష్ణానదిలో బోటు ప్రయాణాన్ని నిషేధించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవానికి రెండు, మూడు రోజుల సమయం ఉన్న గర్భిణుల సంరక్షణ బాధ్యత వైద్యారోగ్యశాఖ అధికారులదేనని అన్నారు. వర్షాల అనంతరం జిల్లాలో ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ● వెల్దండ సమీపంలో ఇటీవల కోతకు గురైన డీ–82 కాల్వను కలెక్టర్ పరిశీలించారు. కాల్వ మరమ్మతు పనులు నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా చారకొండ మండలం జూపల్లి శివారులో గండి పడిన డీ–82 కాల్వను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించి.. గండికి గల కారణాలపై ఆరా తీశారు. కాల్వ డిజైన్ మ్యాప్ను పరిశీలించారు. కాల్వ గండికి వేగంగా మరమ్మతు చేయించి.. ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. వారి వెంట కేఎల్ఐ చీఫ్ ఇంజినీరు విజయ్కుమార్, ఎస్ఈ పార్థసారధి, ఈఈ శ్రీకాంత్, డీఈఈలు దేవన్న, బుచ్చిబాబు తదితరులు ఉన్నారు. -
యూరియా.. ఏదయా?
వాతావరణం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు మండలాల్లో రైతులకు ఎరువుల కష్టాలు ● పీఏసీఎస్ల్లో ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ ● పంటలకు సరిపడా లభించక రైతుల ఆందోళన ● ఈ నెలలో 10వేల మె.టన్నులకు గాను 8,790 మె.టన్నులు మాత్రమే అందుబాటులో.. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని పలుచోట్ల యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, పత్తి పంటలను రైతులు విస్తృతంగా సాగుచేయగా.. 15 రోజులుగా వరినాట్లు ఊపందుకున్నాయి. పంటలకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేసేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు వస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టాదారు పాసుబుక్కులు, ఆధార్కార్డులతో వచ్చే రైతులకు ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాల యూరియాను మాత్రమే అధికారులు అందిస్తున్నారు. సాగుచేస్తున్న పంటల విస్తీర్ణంతో సంబంధం లేకుండా కేవలం రెండు బస్తాలను మాత్రమే ఇస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వినియోగమూ కారణమే.. వరితో పాటు మొక్కజొన్న ఇతర పంటల సాగులో యూరియా వినియోగం ఏటా పెరుగుతోంది. రైతులు అవసరానికి మించి యూరియాను వినియోగిస్తున్నారని.. ఇది భవిష్యత్లోనూ పంటలకు, భూ సారానికి ప్రమాదకరమని అధికారులు అంటున్నారు. ఎకరాకు ఒక బస్తాకన్నా ఎక్కువగా యూరియాను వినియోగించొద్దని సూచిస్తున్నారు. అయితే జిల్లాలో ఐదేళ్లుగా యూరియా వినియోగం గణనీయంగా పెరిగింది. 2020లో 25వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తే.. ఈ ఏడాది 70,384 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుందని అధికారులు అంచనా వేశారు. పంటలకు యూరియా వినియోగం పెరుగుతుండటం.. సాగువిస్తీర్ణం పెరగడం.. సాగు సీజన్లో రైతులంతా ఒకేసారి ఎరువుల కోసం బారులు తీరుతుండటంతో యూరియాకు కటకట ఏర్పడుతోంది. సీజన్కు ముందుగానే యూరియాను స్టాక్ ఉంచి.. రైతుల అవసరాలను తీర్చాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. యూరియా కొరత ఉందన్న భావనతో రైతులు అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో యూరియా కొనుగోలు చేసుకుని స్టాక్ పెట్టుకుంటుండటంతోనూ కొరత పెరుగుతోంది. ప్రైవేటు డీలర్ల వద్ద సైతం యూరియా లభించక, కొన్నిచోట్ల ఎమ్మార్పీకి మించిన ధరలకు విక్రయిస్తుండటంతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ సైతం అవసరమైన యూరియా లభించక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకేసారి వరినాట్లతో ఎరువులకు డిమాండ్.. వానాకాలం పంటల సాగు అంచనాకు అనుగుణంగా ముందుగానే యూరియా స్టాక్ రావాల్సి ఉంది. ఏటా మే, జూన్లోనే జిల్లాకు యూరియా రాగా.. ఈసారి ఆలస్యమైంది. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రతినెలా కనీసం 10వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ నెలలో జిల్లావ్యాప్తంగా కేవలం 8,790 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా అవసరమైన యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. జిల్లాలో కృత్రిమ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. జలాశయాలకు జలకళ ఉమ్మడి జిల్లాలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకోవడంతో పాటు దిగువకు పారుతున్నాయి. –8లో u -
సరిపోవడం లేదు..
నేను ఈసారి 4 ఎకరాల్లో వరితో పాటు 16 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేశాను. పంటలకు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వచ్చాను. ఇక్కడ ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ బస్తాలు ఏమాత్రం సరిపోవడం లేదు. పంటలకు సరిపడా యూరియా పంపిణీ చేయాలి. – కృష్ణయ్య, రైతు, రాచూరు, వెల్దండ మండలం కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు.. జిల్లాలోని ఎరువుల దుకాణాలు, స్టాక్ పాయింట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. డీలర్లు ఎరువులను ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించినా, కృత్రిమంగా కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా చర్యలు తీసుకుంటాం. డీలర్ల లైసెన్స్లను రద్దుచేస్తాం. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
కేఎల్ఐ డీ–82 కాల్వకు గండి
చారకొండ: మండలంలోని జూపల్లి శివారులో కేఎల్ఐ డీ–82 ప్రధాన కాల్వ బుధవారం కోతకు గురైంది. కాల్వ నీరంతా సమీపంలో సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను ముంచెత్తింది. సమాచారం అందుకున్న కేఎల్ఐ అధికారులు కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. డీఈ సమ్మయ్య అక్కడికి చేరుకొని కాల్వ గండిని పరీశీలించారు. కాల్వలో నీటి ప్రవాహం పెరగడంతోనే గండి పడినట్లు పేర్కొన్నారు. అయితే ప్రతి ఏటా డీ–82 కాల్వ ఎక్కడో చోట తెగిపోతుండటంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. అధికారులు కాల్వల నిర్వహణను గాలికి వదిలేయడంతోనే కోతకు గురవుతుందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, డీ–82 కాల్వకు గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టడంతోనే పూర్తిగా కోతకు గురైందని కేఎల్ఐ అధికారులు చారకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకట్రెడ్డి, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ షంషోద్దీన్ కాల్వ గండి ప్రదేశాన్ని పరిశీలించారు. కాల్వ గండికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు లకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా, కాల్వకు త్వరగా మరమ్మతు చేయించి సాగునీటి విడుదలను పునరుద్ధరిస్తామని కేఎల్ఐ ఎస్ఈ పార్థసారధి తెలిపారు. -
పంద్రాగస్టు వేడుకలకు ప్లానింగ్ బోర్డు వైస్చైర్మన్
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీఓ జారీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. జిల్లా ప్రగతిని వివరించనున్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి కందనూలు: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. డ్రగ్స్ విక్రయించినా, కొనుగోలు చేసిన వారిపై టోల్ఫ్రీ నంబర్ 14446కు సమాచారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, అధ్యాపకులు అంజయ్య, ఉమాదేవి, కోదండరాములు, డీహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్వేత, జెండర్ స్పెషలిస్ట్ సునీత పాల్గొన్నారు. అన్నవరానికి ప్రత్యేక బస్సు కందనూలు: నాగర్కర్నూల్ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న రాత్రి 8గంటలకు జిల్లా కేంద్రం నుంచి బస్సు బయలుదేరి.. 20న అన్నవరం చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడ సత్యనారాయణస్వామి వ్రతం అనంతరం పిఠాపురం, ద్రాక్షారామం దర్శనాలు చేసుకొని ద్వారకా తిరుమలలో రాత్రి బస ఉంటుందన్నారు. 21న విజయవాడ, మంగళగిరిలో దర్శనాలు చేసు కొని జిల్లాకేంద్రానికి చేరుకుంటుందని డీఎం తెలిపారు. ఈ యాత్రకు బస్సు చార్జీ రూ. 2,800 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధపైఉపాధ్యాయులకు శిక్షణ కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం కృత్రిమ మేధ (ఏఐ)పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కాంప్లెక్స్ నుంచి గణిత ఉపాధ్యాయులు ఇద్దరు చొప్పున 114 మందికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఇన్చార్జి ఏఎంఓ కిరణ్కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు డిజిటల్ బోధనపై నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్రెడ్డి, రిసోర్స్పర్సన్లు లక్ష్మీనరసింహారావు, ఆంజనేయులు, దీప, విజయలక్ష్మి, కరుణాకర్ పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలపెంపునకు కృషి చేయాలి తిమ్మాజిపేట: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధనా పద్ధతులు అవలంబించి విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని డీఈఓ రమేశ్కుమార్ సూచించారు. బుధవారం తిమ్మాజిపేట కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక విద్య దశలోనే బలమైన బోధన జరిగితే విద్యార్థులు ఉన్నతస్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తారన్నారు. తరగతుల వారీగా విద్యార్థుల ఆసక్తులను గుర్తించి ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఉత్సాహాన్నీ పెంచే బోధనశైలి అవలంబించాలన్నారు. అదే విధంగా విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. కాగా, కేజీబీవీలో మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అంతకుముందు మరికల్ పాఠశాలను డీఈఓ పరిశీలించారు. -
వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు
నాగర్కర్నూల్ క్రైం/పెద్దకొత్తపల్లి/పెంట్లవెల్లి: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అన్నారు. బుధవారం నాగర్కర్నూల్ మండలం పెద్దముద్దునూరు పీహెచ్సీతో పాటు పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మందుల స్టాక్ను పరిశీలించారు. పీహెచ్సీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు అందుబాటులో ఉంటూ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పీహెచ్సీల్లో కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం పలు గ్రామాల్లో వాగులు పారుతున్నందున అత్యవసర సమయంలో గర్భిణుల తరలింపునకు ఆటంకం ఏర్పడుతుందని.. ముందుగానే గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్పించాలని సిబ్బందికి సూచించారు. ఏదేని గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కాగా, పెద్దకొత్తపల్లి పీహెచ్సీలో చిన్నారులకు డీఎంహెచ్ఓ వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయ్కుమార్, డా.నారాయణ, శ్రీనివాసులు, డా.నరేంద్రనాథ్, సీహెచ్ఓ సంపూర్ణమ్మ, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
నాగర్కర్నూల్ క్రైం: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో బాల్యవివాహాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడ పిల్లలకు చిన్న వయసులో వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పుట్టబోయే పిల్లల్లోనూ మానసిక, శారీరక ఎదుగుదల ఉండదన్నారు. ఎవరైనా బాల్యవివాహం చేసేందుకు యత్నిస్తే పోలీసులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ● జిల్లా కేంద్రంలోని సబ్జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వారికి న్యాయ సేవాధికార సంస్థ తరఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో సబ్జైలు సూపరింటెండెంట్ గుణశేఖర్ నాయుడు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్ తబితారాణి, చైల్డ్ కమిటీ చైర్మన్ లక్ష్మణరావు, శ్రీశైలం పాల్గొన్నారు. -
కదిలిస్తే కన్నీరే..
వీరందరూ వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో ముంపు గ్రామమైన బండరాయిపాకులకు చెందిన సామాన్య, మధ్య తరగతికి చెందిన ప్రజలు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఏదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవసాయ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారాన్ని ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు గద్దలా తన్నుకుపోవడంతో గుండెలు బాదుకుంటున్నారు. నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశ నిండా ముంచడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాము చెల్లించిన డబ్బులను ఇవ్వాలని ఐదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ..ఇలా మోసపోయింది ఈ ఒక్క గ్రామస్తులే కాదు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 50 గ్రామాలకు చెందిన పీఆర్ఎల్ఐ నిర్వాసితులు 2,500 మంది ఉన్నట్లు అంచనా. డబ్బులు వస్తలేవనే మనోవేదనతో ఇప్పటికే పలువురు బలవన్మరణాలకు పాల్పడగా.. కొందరు గుండెనొప్పితో తనువు చాలించారు. ఈ నేపథ్యంలో బాధిత నిర్వాసితులను ‘సాక్షి’ పలకరించగా.. కన్నీళ్లే మిగిలాయి. అనారోగ్య కారణాలతో మంచమెక్కిన వారు.. వైద్య చికిత్సలకు డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లు కట్టుకోలేక, సంతానాన్ని పోషించలేక, చదివించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ కాగా.. వారి ఆవేదన వారి మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఎవరైనా పెడితేనే తింటున్న.. నేను పని చేయలేను కాబట్టి నెలనెలా మిత్తి వస్తే ఖర్చులకు సరిపోతాయి.. బతకొచ్చు అనుకుని వచ్చిన డబ్బులను నా పేరు మీద రూ.5 లక్షలు ఫైనాన్స్లో పెట్టాను. నా కూతుళ్లు లక్ష్మీ రూ.5 లక్షలు, రుక్మమ్మ రూ.6 లక్షలు.. మొత్తం రూ.16 లక్షలు పెట్టాం. మొదట్లో మిత్తి డబ్బులు 2 నెలలు ఇచ్చాడు. ఆ తర్వాత మిత్తి లేదు.. అసలు లేదు నాకు ప్రస్తుతం అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఎవరైనా బయట పెడితే తింటున్న.. గుడిసెలో వెళ్లి పడుకుంటున్నా. – భగవంతు, బాధితుడు క్యాన్సర్ పేషంట్ను..గోలీలకూ డబ్బుల్లేవు.. పాత బండరాయిపాకులలో మాకు ఐదెకరాల భూమి ఉండేది. పాలమూరు ప్రాజెక్ట్తో ఉన్నది పోయింది. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చాక సాయిరాం ఫైనాన్స్ వాళ్లు నా కొడుకును కలిసిండ్రు. మిత్తి ఎక్కువగా వస్తుందని మాయమాటలు చెప్పి బాగా నమ్మించిండ్రు. దీంతో నా కొడుకు రాములు పేరిట రూ.10 లక్షలు, నా కోడలు గోపాల శివశీల పేరిట రూ.5 లక్షలు, నేను దాచుకున్న రూ.1.50 లక్షలు.. మొత్తం రూ.16.50 లక్షలను 2021లో ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశాం. ఒకసారి రూ.60 వేలు, మరోసారి రూ.30 వేలు వడ్డీ కింద ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదని డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. మళ్లీ ఆస్పత్రికి వెళ్లేందుకు, గోలీలకు డబ్బుల్లేవ్. ఫికరుతో ఎప్పుడు సచ్చిపోతనో నాకే తెలుస్తలేదు. – గోపాల బొజ్జమ్మ, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం.. నా భార్య పేరు మీద రూ.11 లక్షలు, నా పేరు మీద రూ.2 లక్షలు.. మొత్తం రూ.13 లక్షలు ఫైనాన్స్లో పెట్టాం. మాకు నలుగురు కూతుళ్లు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం మమ్మల్ని ఎవరూ చూడనీకే రావడం లేదు. నా భార్యకు చేయి విరిగింది. డబ్బుల్లేక మందులు తెచ్చుకోలేకపోతున్నాం. మా డబ్బులు మాకివ్వమని ఎవర్ని అడగాలో తెలియడం లేదు. మా మీద కనికరం చూపించి డబ్బులు ఇప్పించాలి. – బింగి లింగయ్య, పాపమ్మ దంపతులు కిరాయి ఇంట్లో ఉంటున్నాం.. తెలిసిన వాళ్లు మిత్తి వస్తుందని చెబితే.. మాకు పునరావాసం కోసం వచ్చిన డబ్బులు మొత్తం రూ.24 లక్షలను ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో నాలుగేళ్ల క్రితం పెట్టాం. ఇప్పటివరకు మాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేదు. కిరాయికి వేరొకరి ఇంట్లో ఉంటున్నాం. నేనూ మా ఆయన ఇద్దరం కూలీ చేసుకుని బతుకుతున్నాం. మా పరిస్థితి ఇలా ఉంటే.. దుడ్డు మల్లయ్య అనే వాళ్లతో రూ.2.60 లక్షలు కట్టించాను. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వాలని నన్ను టార్చర్ పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – గోపాల పార్వతమ్మ, బాధితురాలు నాన్న దూరమయ్యాడు.. కుటుంబం రోడ్డున పడింది.. మా నాన్న రాంచంద్రయ్య ఓం శ్రీ సాయిరాం చిట్ఫండ్లో రూ.13 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఫైనాన్సోళ్లను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోయేసరికి మనోవేదనతో మంచానపడ్డాడు. దీంతో వైద్య ఖర్చులకు ఆయనపై ఉన్న ప్లాటు అమ్మాల్సి వచ్చింది. ఈ క్రమంలో మా నాన్న గుండెపోటు వచ్చి మరణించాడు. ఇప్పుడు మాకు ఇల్లులేదు. డబ్బుల కోసం నా భార్యకు నాకు గొడవ జరిగింది. వీళ్లతో డబ్బులు పెట్టడం వల్ల మా నాన్న నాకు దూరమాయ్యాడు. నా కుటుంబం రోడ్డున పడింది. ప్రస్తుతం ఉండేందుకు ఇంటి స్థలం కూడా లేదు. – కుర్మయ్య, బాధితుడు అతికష్టం మీద బతుకుతున్నాం.. నా పేరు, నా భర్త మీద రూ.6 లక్షలను 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో పెట్టాం. మాకు నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు మరణించారు. ఒక్క కొడుకు మాత్రమే ఉన్నాడు. మాతో డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని ఎవరూ చూసుకోవడం లేదు. ఉన్న కొడుకు కూడా విడిగా ఉంటున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది. ఒక కన్ను సరిగా కనిపించడం లేదు. అతికష్టం మీద బతుకుతున్నాం. డబ్బులు అనవసరంగా ఎవరికో ఇచ్చి ఇలా చేశారని కొడుకు, కోడలు నిత్యం తిడుతూనే ఉన్నారు. మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. – మిద్దె నాగమ్మ, బాధితురాలు ఫైనాన్స్ మోసంతో పీఆర్ఎల్ఐ నిర్వాసితుల విలవిల ఇప్పటికే కొందరి బలవన్మరణం..గుండెనొప్పితో తనువు చాలించిన మరికొందరు.. వైద్య చికిత్సలకు డబ్బుల్లేక మంచానికే పరిమితమైన ఇంకొందరు.. ఇళ్లు కట్టుకోలేక..పిల్లలను చదివించలేనిదుస్థితిలో పలువురు.. ఆలనాపాలన కరువై ఆదుకునే వారి కోసం వృద్ధుల ఎదురుచూపులు.. -
అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
కొల్లాపూర్/కందనూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపికచేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. నాల్గో వార్డులో స్థానికుల సమక్షంలో 20మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లను మంత్రి చదివి వినిపించారు. వారిలో నలుగురు అనర్హులని స్థానికులు చెప్పడంతో.. వారి పేర్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ గురుకుల పాఠశాలను మంత్రి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు. కుటుంబంపై బెంగ పెట్టుకున్న విద్యార్థుల కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడించారు. చదువు ఆవశ్యకతను ఆయన విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ● జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం–327 ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలని కోరారు. అనర్హులను ఎంపికచేస్తే చర్యలు తప్పవు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం
నాగర్కర్నూల్: పాలమూరు –రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో భూ సేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చివరి దశలో ఉన్న భూ సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు సర్వేల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, నీటిపారుదల ప్రాజెక్టుల సీఈ విజయభాస్కర్రెడ్డి, ఈఈ మురళి ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి కలెక్టర్లతో వీసీ నిర్వహించగా.. సమీకృత కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా కమాండ్ కంట్రోల్ రూంను కలెక్టరేట్లో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూం నంబర్ 98667 56825 నంబర్ను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,633 చెరువులు, కుంటలు తెగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా నదీ తీరం, లోతట్టు ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల్లో తరగతులు నిర్వహించరాదన్నారు. వర్షాల కారణంగా సమస్య తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఘనంగా ఆదివాసీ దినోత్సవం అచ్చంపేట రూరల్: అచ్చంపేట పట్టణంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొనగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఓ ఫంక్షన్హాల్ వరకు ఆదివాసీలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో వారు మాట్లాడారు. త్వరలోనే మన్ననూర్ ఐటీడీఏ పీఓను నియమిస్తామన్నారు. అర్హులైన ఆదివాసీ చెంచులకు పోడు పట్టాలు అందజేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. చెంచులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం చెంచు ఉద్యోగులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడి, నాయకులు నాగయ్య, శ్రీనివాసులు, శంకరయ్య, ప్రసాద్, పద్మ పాల్గొన్నారు. -
కానరాని పురోగతి!
గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న అమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పు డు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యత లు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కొనసా..గుతున్న ‘పాలమూరు’ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్లో కొనసాగుతున్నాయి. ● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. ● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్లుగా మరమ్మతుకు నోచుకోని ర్యాలంపాడు రిజర్వాయర్ నేడు సమీక్ష.. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్లో మహబూబ్నగర్ పార్ల మెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు మంత్రుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష -
చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం
వెల్దండ: కేఎల్ఐ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ సమీపంలో కోతకు గురైన కేఎల్ఐ డీ–82 కాల్వను సోమవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కోతకు గురైన డీ–82 కాల్వకు వేగంగా మరమ్మతు చేయించి.. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎవరైనా కావాలని ధ్వంసం చేస్తే సహించమన్నారు. కాల్వలో నీరు ప్రవహించే సమయంలో అధికారులు, పోలీసులు పర్యవేక్షించాల ని సూచించారు. ఎమ్మెల్యే వెంట కేఎల్ఐ ఎస్ఈ పార్థసారధి, ఈఈ శ్రీకాంత్, డీఈఈలు దేవన్న, బుచ్చిబాబు, ఏఈలు ప్రభాకర్, మాల్య, కాంగ్రెస్ నాయకులు విజయ్కుమార్రెడ్డి, మోతీలాల్ నాయక్, భూపతిరెడ్డి, పర్వత్రెడ్డి, సంజీవ్కుమార్, వెంకటయ్యగౌ డ్, ఆనంద్కుమార్, రషీద్ ఉన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి నాగర్కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 22 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. కా ర్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పోలీసు ప్రజవాణికి 8 అర్జీలు.. నాగర్కర్నూల్ క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 8 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఫిర్యాదుదారుల సమస్యలను డీసీఆర్బీ డీఎస్పీ సత్యనారాయణ తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లు అచ్చంపేట రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమామహేశ్వరం కొండపై నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో భక్తులకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం ఆలయం వద్ద కొండపై నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని వారు పరిశీలించారు. ప్రస్తుతానికి నిత్యాన్నదానం నిలిపివేశామని.. వరద తాకిడి తగ్గాక యథావిధిగా కొనసాగుతుందన్నారు. అనంతరం ఘాట్రోడ్డును పరిశీలించా రు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. వచ్చేనెల 3న సీఎం రేవంత్రెడ్డి రాక అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. మూసాపేట లో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం వాటిని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు. -
అలుగు పారిన కేసరి సముద్రం
జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నీటితో నిండి అలుగులు పారుతున్నాయి. సోమవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువుకు ఎగువన ఉన్న ఉయ్యాలవాడ, నల్లవెల్లి గ్రామాల నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో అలుగు పారింది. అదే విధంగా నాగనూలు, తిరుమలాపూర్ గ్రామాల్లోని చెరువుల అలుగులు రహదారులపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొల్లాపూర్, వనపట్ల, గుడిపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. – కందనూలు -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కొల్లాపూర్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ముందుగా వార్డుల వారీగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అప్పులపాలుజేశారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్రావు, నాయకులు నర్సింహారావు, మేకల రమ్య, శ్రీదేవిగౌతంగౌడ్, నాగరాజు, రహీంపాషా, ఖాదర్ పాషా, వేణుగోపాల్యాదవ్, డా.రాముడు పాల్గొన్నారు. -
అప్పుల రాష్ట్రంగా మార్చారు..
● ఆర్థిక సంక్షోభం నెలకొన్నా పథకాల అమలు ● ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం ● రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అచ్చంపేట/బల్మూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఓవైపు ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూనే, మరోవైపు అప్పులు తిరిగి చెల్లిస్తున్నారని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం అచ్చంపేటలో రూ. 3కోట్లతో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యేలు డా.చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడమే కాకుండా.. రేషన్ దుకాణాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అచ్చంపేట అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. టీయూఎఫ్డీసీ నుంచి మరో రూ. 16కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మేలుచేసే విధంగా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. కాగా, మున్సిపల్ చైర్మన్ చాంబర్ను కలెక్టర్ సంతోష్, మున్సిపల్ కమిషనర్ చాంబర్ను ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి ప్రారంభించారు. ● బల్మూర్ మండలం కొండనాగులలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గార్లపాడు శ్రీనివాసులు, కమిషనర్ మురళి, ఆర్డీఓ మాధవి, తహసీల్థార్ సైదులు, జిల్లా గ్రంథాయాల సంస్థ చైర్మన్ జి.రాజేందర్, గిరివర్ధన్గౌడ్, మున్సిపల్ వైస్చైర్పర్సన్ సరిత, కౌన్సిలర్లు గోపిశెట్టి శివ, రమేశ్రావు, ఆకుల లావణ్య, సునీత, నాయకులు మల్రెడ్డి వెంకట్రెడ్డి, కాశన్నయాదవ్, మాజీ ఎంపీపీ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
నులిపురుగుల నివారణతోనే మెరుగైన ఆరోగ్యం
అచ్చంపేట: చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులిపురుగులను నిర్మూలించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. 1నుంచి 19ఏళ్లలోపు చిన్నారులు, యువతలో నులిపురుగుల కారణంగా ఎదుగుదల మందగించడం, నీరసం, రక్తహీనత, చదువులో ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధపడతారన్నారు. వీటిని నివారించేందుకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. అపరిశుభ్రత వల్లే నులిపురుగులు సంక్రమిస్తాయని.. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 2,03,259 మందికి ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. అనంతరం గురుకులంలో వంటశాల, నిత్యవసర వస్తువులు కూరగాయల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. ఆహారం నాణ్యత, వసతి సౌకర్యాలపై విద్యార్థులతో ఆరా తీశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బియ్యం, ఇతర వస్తువులు భద్రపరచడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.తారాసింగ్, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు. తెగిన కేఎల్ఐ పాటుకాల్వ కోడేరు: మండల కేంద్రంలోని పిల్లిగుట్ట సమీపంలో ఉన్న కేఎల్ఐ మైనర్–3 కాల్వ సోమవారం కోతకు గురైంది. ఈ కాల్వ కింద దాదాపు 70ఎకరాల ఆయకట్టు ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాల్వ తెగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు కాల్వకు సాగునీటి విడుదలను నిలిపివేశారు. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతు చేయించి రైతులకు సాగునీరు అందిస్తామని ఏఈ లక్ష్మి తెలిపారు. -
నాగర్కర్నూల్
భూములు కోల్పోయి.. మోసపోయి.. గుండె పగిలిపోయి..ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ సర్వీసులు నడిపిన ఆర్టీసీ టికెట్పై 30 శాతం చార్జీలు పెంచారు. మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: ఆరుగాలం కష్టించి జీవనోపాధి పొందుతున్న వ్యవసాయ భూములతో పాటు ఉంటున్న ఇళ్లు, జ్ఞాపకాలన్నీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణంలో పోయాయి. ఆ తర్వాత వచ్చిన అరకొర పరిహారంతోనైనా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాలన్న వారి ఆశలను బోగస్ ఫైనాన్స్ కంపెనీ గండి కొట్టింది. అధిక వడ్డీ చెల్లిస్తామనే పేరిట నిర్వాసితుల నుంచి భారీగా డబ్బులు సేకరించి.. చివరకు బోర్డు తిప్పేసింది. ఈ క్రమంలో రైతులు అంతకుముందు నుంచే అంటే నాలుగేళ్లుగా వారి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. బాధితుల్లో ఇప్పటివరకు పలువురు ఆత్మహత్య చేసుకోగా.. హార్ట్ అటాక్తో సుమారు 20 మంది.. కిడ్నీ ఇతర ఆరోగ్య కారణాలతో మరో 120 మంది వరకు మృత్యు కౌగిలికి చేరారు. ఇంకా కొందరు చికిత్సకు డబ్బులు లేక మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. 14 మందిపై కేసు.. రూ.50 కోట్ల ఆస్తి జప్తు డిపాజిట్ల అనంతరం కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్ నిర్వాహకులు సక్రమంగా వడ్డీ చెల్లించకపోవడంతో నిర్వాసితులు నాగర్కర్నూల్ మార్కెట్ సెంటర్లోని ఫైనాన్స్ కార్యాలయం వద్దకు క్యూకట్టారు. ఇలా 2020 నుంచి 2023 వరకు చక్కర్లు కొట్టారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబు, అతడి కుటుంబ సభ్యులు మాయమాటలు చెబుతూ చివరకు కంపెనీని ఎత్తివేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 13న బాధితులు నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఇందులో ఇత్యాల సాయిబాబు (ఏ–1)తో పాటు ధనుంజయ్ (ఏ–2), బాలేశ్వర్ (ఏ–3), ఇత్యాల రజిత (ఏ–4), యామిని (ఏ–5), శారద (ఏ–6), సాయిదివ్య (ఏ–7), సాయి దీక్షిత్ (ఏ–8) అనుపటి శ్రీనివాసులు, తాడూరు మాజీ సర్పంచ్(ఏ–9), ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి (ఏ–10), జానకీ రాంరెడ్డి (ఏ–11), కరుణాకర్రెడ్డి (ఏ–12), గువ్వ వెంకటేశ్వర్లు (ఏ–13), ఉర్సు హుస్సేన్ (ఏ–14)పై కేసు నమోదైంది. వీరిలో సాయిబాబు, సాయిదీక్షిత్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, హుస్సేన్ను అరెస్ట్ చేశారు. మిగిలిన వారు ముందస్తు బెయిల్ పొందారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సాయిబాబు కుటుంబసభ్యుల ఆస్తులను జప్తు చేయాలని.. ఈ ఏడాది జూన్ 17న జీఓ నంబర్ 562ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ మార్కెట్ వాల్యు ప్రకారం ఇప్పటివరకు సదరు ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులకు సంబంధించి రూ.50 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. 2 వేల మంది.. సుమారు రూ.180 కోట్ల డిపాజిట్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వం పరిహారం అందజేసింది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సుమారు 50 గ్రామాలు ముంపునకు గురి కాగా.. నిర్వాసితులకు సంబంధించి ఎకరా పట్టా భూమికి రూ.5.50 లక్షలు, లావణి పట్టా భూమికి రూ.3.50 లక్షలు.. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.12.50లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది. అయితే ముంపు గ్రామమైన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్కు చెందిన సాయిబాబా తన కుటుంబసభ్యులతో కలిసి నాగర్కర్నూల్ మార్కెట్ యార్డు సమీపంలో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ పేరుతో 1995 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ను నడిపిస్తున్నాడు. మొదట రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో రైతులకు ఒక్కసారిగా వచ్చిన నష్ట పరిహారంపై అతడి కన్ను పడింది. రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్త్తామని.. మీరు భూములు, ప్లాట్లు కొన్నప్పుడు 15 రోజుల ముందు చెబితే మీ డబ్బులు మీకు ఇస్తామని నమ్మబలికి 2018 నుంచి 2020 వరకు డిపాజిట్ చేయించుకున్నాడు. తొలుత వడ్డీ సక్రమంగా చెల్లిస్తూ రాగా.. సుమారు 2,500 మంది దాదాపు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకు సదరు ఫైనాన్స్ కంపెనీలో నిర్వాసితులు పరిహారం డబ్బులను జమ చేశారు. ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత వడ్డీ ఆశతో వచ్చిన పరిహారం డబ్బులుఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్లో జమ వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో సుమారు 2,500 మంది బాధితులు రూ.180 కోట్ల మేర కంపెనీలో డిపాజిట్.. బోర్డు తిప్పేయడంతో రైతుల గగ్గోలు మోసంతో చితికిన కుటుంబాలు.. అనారోగ్యంతో మంచం పాలు ఇప్పటికే ఒకరు ఆత్మహత్య.. హార్ట్ ఎటాక్తో 20 మంది వరకు మృతి వివిధ ఆరోగ్య కారణాలతో మరో 120 మంది కూడా.. -
కేఎల్ఐ కాల్వకు గండి
వెల్దండ: మండలంలోని లక్ష్మాపూర్ చెరువు కట్ట సమీపంలో ఉన్న కేఎల్ఐ డీ–82 కాల్వకు ఆదివారం గండి పడింది. రెండు రోజుల క్రితం కేఎల్ఐ కాల్వ ద్వారా వెల్దండ శివారు వరకు సాగునీరు చేరింది. అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికం కావడంతో కోతకు గురై నీరంతా వృథాగా పారింది. కేఎల్ఐ నుంచి సాగునీరు వచ్చే సమయంలో కాల్వకు గండి పడటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి ఏటా డీ–82 కాల్వ కోతకు గురవుతుండటంతో సాగునీటి కోసం కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. గతేడాది పంటలకు సకాలంలో నీరందక ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలకు సరైన మరమ్మతులు లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని అంటున్నారు. బ్రిడ్జిల వద్ద కాల్వకు లైనింగ్ నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. రామన్పాడుకు కొనసాగుతున్న వరద మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయానికి ఆదివారం శంకరసమ్రుదం నుంచి 1,500 క్యూసెక్కులు, ఊకచెట్టు వాగు నుంచి 300 క్యూసెక్కుల వరద చేరుతున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. దీంతో రెండు గేట్లు పైకెత్తి 1,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 75 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజారోగ్యానికి భరోసా
అచ్చంపేట: నల్లమల ప్రాంతంలో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకే మెగా హెల్త్, సర్జికల్ క్యాంపు ఏర్పాటుచేసినట్లు ఎమ్మెల్యే డా.చిక్కడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట ఏరియా అస్పత్రిలో మూడో విడత మెగా హెల్త్, సర్జికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అచ్చంపేటలో మెగా సర్జికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్యాంపులో 570మంది పేర్లు నమోదు చేసుకున్నారని.. వీరందరికీ విడతల వారీగా సర్జరీలు చేస్తామన్నారు. ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ అవసరమైన క్యాడర్ స్టెంత్, బ్లడ్బ్యాంక్, సెంట్రల్ ఆక్సిజన్, పారా మెడికల్ సిబ్బంది, డాక్టర్లను నియమిస్తామన్నారు. గత రెండు విడతల్లో ప్రభుత్వ పరంగా మెడికల్ సర్జికల్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించి.. ఎంతో మంది రోగులకు శాశ్వత చికిత్సలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవినాయక్, సూపరింటెండెంట్ ప్రభు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.తారాసింగ్ ఆర్ఎంఓ ప్రదీప్రాజ్, డా.మహేశ్, డా.పగడాల శ్రీనివాస్, డా.బిక్కులాల్ పాల్గొన్నారు. -
‘నులి’మేద్దాం..
అచ్చంపేట: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రతి ఏటా ఆగస్టు 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం చేపడుతోంది. ఈ మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా 1నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. పక్కా ప్రణాళిక.. జిల్లావ్యాప్తంగా 1నుంచి 19ఏళ్లలోపు వారు 2,03,252 మంది ఉన్నారు. వీరిలో 1,131 అంగన్వాడీ కేంద్రాల్లో 46,444 మంది చిన్నారులు, 1,147 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో 1,56,808 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గతంలో ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేవారు. 2020లో కరోనా మహమ్మారి తర్వాత ఆగస్టులో మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నెల 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో గుర్తించిన పిల్లందరికీ అల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలతో పాటు మిగిలిన వారికి ఈ నెల 18న మాత్రలు వేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తప్పనిసరి వేయించాలి.. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 1నుంచి 19ఏళ్లలోపు వారందరికీ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేయించాలి. మాత్రల పంపిణీ కార్యక్రమంలో 861మంది ఆశావర్కర్లు, 299మంది ఏఎన్ఎంలు, 81మంది సూపర్వైజర్లతో పాటు అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 1,150 మంది పాల్గొననున్నారు. – రవినాయక్, డీఎంహెచ్ఓ సమస్యలు.. జాగ్రత్తలు నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. అనారోగ్యంతో నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలం పాటు ఇవి ఉన్నప్పటికీ వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మలవిసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతో పాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు. అయితే రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర వేయాలని వైద్యులు చెబుతున్నారు. మాత్రలు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. వైద్యసిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే వేయాలని సూచిస్తున్నారు. నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం 1నుంచి 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జిల్లాలో 2,03,252 మందికి మాత్రలు వేసేందుకు ప్రణాళిక -
‘పోడు’ పట్టాల లొల్లి!
పాన్గల్: తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూ ములకు పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకోకపోగా అటవీ అధికారులు భూములను అక్రమించి అక్రమ కేసులు నమోదు చేశారంటూ జిల్లాలోని పాన్గల్ మండలం కిష్టాపూర్తండా గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి కథనం మేరకు.. గ్రామశివారులోని సర్వేనంబర్ 34లో 12 ఎకరాల పోడు భూమి ఉండగా సుమారు 50 ఏళ్లు గా 25 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. పనికిరాని భూములను సైతం చదును చేసి యోగ్యంగా మలుచుకోవడంతో పాటు ఆయా భూముల్లో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములకు గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన రెవె న్యూ అధికారులు ధరణి వచ్చిన తర్వాత కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హ యాంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గిరిజ న రైతులకు పోడు పట్టాలిచ్చినా ఇక్కడి రైతులకు మాత్రం పంపిణీ చేయలేదు. కాగా కొందరు రైతు లు బతుకుదెరువు కోసం భూములు వదిలి ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్లగా అటవీశా ఖ అధికారులు వారికి తెలియకుండా మొక్కలు నాటి ఆక్రమించే చర్యలు పూనుకున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో చేసేది లేక భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేయడంతో ఈ నెల 5న అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 మంది గిరిజన రైతులపై కేసులు నమోదయ్యాయి. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటూ రైతులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న పోడు భూములపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యా యం చేయాలని.. లేనిచో ఆత్మహత్యే శరణ్యమని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ పరిధిలోని భూమిలో ఉన్న చెట్లను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో జిల్లా అధికారుల ఆదేశానుసారం గిరిజన రైతులపై కేసులు నమోదు చేశాం. రైతులు సాగు చేయని అటవీ భూముల్లో ఉపాధిహామీ పథకంలో నాటిన మొక్కలను కూడా తొలగించారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా అధికారులను కలిసి భూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ అటవీ భూమిలోని చెట్లను ధ్వంసం చేయడం, అక్రమించడం నేరమే అవుతుంది. – బాలకిష్టమ్మ, డిప్యూటీ రేంజ్ అధికారి, ఖాసీంనగర్ సెక్షన్, వనపర్తి మేము ఎన్నో సంవత్సరాల క్రితం బీడు భూములను మంచిగా చేసి సాగుకు అనువుగా మార్చుకున్నాం. అందులో బోర్లు కూడా వేసుకున్నాం. మాకు ఈ భూమి తప్ప వేరే భూమి లేదు, ఇదే అధారం. కొంత కాలం పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళితే అందులో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటి అవి అటవీశాఖకు చెందినవిగా చిత్రీకరిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. భూమి దక్కే వరకు పోరాడుతాం. – బొజ్జమ్మ, మహిళా రైతు, కిష్టాపూర్తండా సాగు భూమిని ఆక్రమించారంటూ గిరిజన రైతుల ఆందోళన అటవీశాఖ స్థలంలో చెట్లు తొలగించారని కేసుల నమోదు పాన్గల్ మండలం కిష్టాపూర్తండాలో ఘటన విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకోలు -
కేఎల్ఐ.. రికార్డు బ్రేక్!
ప్రాజెక్టు ప్రారంభం నుంచి నీటి ఎత్తిపోతలు ఇలా.. ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్ ● గత సీజన్లో 50 టీఎంసీల నీటి ఎత్తిపోతలు ● మూడు మోటార్లతోనే కొనసాగుతున్న లిఫ్టింగ్ ● భారం పడుతున్నా.. తప్పడం లేదంటున్న అధికారులు కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు. పనితీరు ఇలా.. కేఎల్ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. రెగ్యులర్గా పంపింగ్.. వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. – లోకిలాల్ నాయక్, డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం మోటార్లపై భారం.. ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి. 2016 నుంచి నీటి పంపింగ్ శాతం భారీగా పెరుగుతూ వచ్చింది. మూడు మోటార్లతోనే రికార్డు స్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరోవైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కోతిగుండు వద్ద నుంచి కృష్ణా బ్యాక్వాటర్ను వినియోగించుకునేలా కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారు. 1998లో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేపట్టారు. 2003లో పనులు ప్రారంభమయ్యాయి. 2.50లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో ఈ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్హౌజ్లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తున్నారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు. మిషన్ భగీరథకు సైతం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. సీజన్ ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో) 2011–12 0.00864 2012–13 1.9062432 2013–14 1.351552 2014–15 1.7842464 2015–16 2.5099632 2016–17 14.01715 2017–18 27.35148 2018–19 35.97796 2019–20 49.99874 2020–21 30.29203 2021–22 31.71288 2022–23 37.50358 2023–24 30.38209 2024–25 50.72208 2025 జూన్ 1నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీలు ఎత్తిపోశారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా డీసీహెచ్ రమేశ్చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో పాలమూరు యూనివర్సిటీలోని సింథటిక్ మైదానంలో నిర్వహించే 11వ రాష్ట్ర జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు, సంయుక్త కార్యదర్శి పరుశురాం, భిక్షపతి, నిర్మల, సుభాషిణి, బాలశ్రీ, జ్యోతి, బాలు, బాలయ్య, రాణా, రాజేందర్ పాల్గొన్నారు. -
నేడు మెగా సర్జికల్ క్యాంపు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆదివారం మూడవ మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ చెప్పారు. శనివారం ఆస్పత్రిలో సర్జికల్ క్యాంపు ఏర్పాట్లపై వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సర్జికల్ క్యాంపులో ఉచితంగా 12 రకాల శస్త్రచికిత్సలు చేస్తామని.. నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు ఉన్నారు. -
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. అధునాతన సౌకర్యాలతో.. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో నూత న వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునికీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు. మహబూబ్నగర్లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు.. -
శనేశ్వరుడికి తైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం బిజినేపల్లి: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం భక్తులు సామూహికంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కురవి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్, అర్చకులు జయంత్, చక్రపాణి, సిబ్బంది పురుషోత్తం, బాబయ్య పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కందనూలు/అచ్చంపేట రూరల్: జిల్లా కేంద్రంలోని సబ్స్టేషన్లో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసులు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. హౌసింగ్బోర్డు, బీసీ కాలనీ, ఈశ్వర్కాలనీ, రాఘవేంద్రకాలనీ, మున్నూర్కాపు ఫంక్షన్హాల్, కొల్లాపూర్ క్రాస్రోడ్, శ్రీపురం రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ● కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు 132/33 కేవీ సబ్స్టేషన్కు రెండవ లైన్ ఏర్పాటు చేస్తున్నందున అచ్చంపేటతో పాటు ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, లింగాల, బల్మూర్ మండలాలకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ శ్రీధర్శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. -
కాల్వల నిర్వహణ గాలికి..
●● ప్రతి ఏటా తెగుతున్న కేఎల్ఐ కాల్వలు ● పంటపొలాలు నీటమునిగి నష్టపోతున్న రైతులు ● కాల్వలకు లైనింగ్ నిర్మించాలని వేడుకోలు రెండెకరాల్లో పంటనష్టం.. గతేడాది నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగుచేశా. కేఎల్ఐ కాల్వ తెగిపోవడంతో నీరంతా పత్తి పంటలోకి చేరుకుని పత్తికాయ మొత్తం మునిగిపోయింది. పంట మొత్తం ఎర్రబారిపోయింది. రెండెకరాల్లో పంటనష్టం వాటిల్లింది. రూ.లక్షకు పైగా నష్టపోయాను. అధికారులు వివరాలు తీసుకెళ్లారు కానీ.. నష్టపరిహారం చెల్లించలేదు. – శ్రీశైలం, గుంతకోడూరు, తాడూరు మండలం ప్రతిపాదనలు పంిపించాం.. కేఎల్ఐ కాల్వల లైనింగ్ పనులకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏమీ మంజూరుకాలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తయ్యాకే లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిపాదనలు పంపించడం జరిగింది. – విజయభాస్కర్, ఎస్ఈ, జలవనరులశాఖ నాగర్కర్నూల్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. వాటి నాణ్యత, నిర్వహణపై శీతకన్ను వేస్తోంది. ఫలితంగా కాల్వల భద్రత గాల్లో దీపంలా మారింది. ఏమాత్రం నీటి ఒత్తిడి అధికమైనా కాల్వలకు గండ్లు పడి పంట పొలాలు మునిగిపోయే దుస్థిఽతి నెలకొంది. ఏటా వేసవిలో ప్రాజెక్టుల కాల్వలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటి మరమ్మతుకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయకపోవడంతో నిర్వహణ కొరవడటంతో అధ్వానంగా మారాయి. దీంతో సాగునీరు వచ్చే సమయంలో సంతోషపడాల్సిన రైతుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇందుకు కాల్వలకు లైనింగ్ లేకపోవడం, నాసిరకం పనులే కారణమని రైతులు పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు.. ● గతేడాది తాడూరు మండలం తుమ్మల సుగూరు వద్ద కేఎల్ఐ కాల్వ తెగిపోవడంతో దాదాపు 100 ఎకరాల వరకు పంటలు నీటమునిగాయి. అంతేకాకుండా నీటి తాకిడికి తుమ్మలసుగూరు కుంటకట్ట కూడా తెగిపోయింది. ● కోడేరు మండలం ఎత్తం శివారులో ఉన్న కేఎల్ఐ కాల్వకు గండి పడటంతో దాదాపు 30 ఎకరాల్లో పంట నీటమునిగింది. కాల్వకు ఒక మోటారు ద్వారా నీరు వస్తేనే తెగిపోతుందని.. మరిన్ని మోటార్లు అందుబాటులోకి వస్తే కాల్వ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● వట్టెం శివారులోని కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండి పడటంతో దాదాపు 40 ఎకరాల పత్తిపంట నీటమునిగింది. ● తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో కాల్వ కట్ట తెగిపోవడంతో 70 ఎకరాల్లో పత్తిపంటను రైతులు నష్టపోయారు. ● తాడూరు మండలం చర్ల ఇటిక్యాల వద్ద కాల్వ కట్టకు గండి పడి దాదాపు 60 ఎకరాల పంట నీటమునిగింది. ఇదే మండలంలోని బలాన్పల్లి, కొమ్ముగుట్ట వద్ద కూడా కాల్వలు తెగిపోయాయి. ● ఊర్కొండ మండలం గుడిగానిపల్లి, కల్వకుర్తి మండలం కుర్మిద్ద వద్ద ప్రధాన కాల్వ తెగిపోవడంతో 20 ఎకరాల పంట నీటమునిగింది. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు. -
తనిఖీలు ముమ్మరం..
నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ సంతోష్ ●ప్రజలు ఇబ్బందులు పడొద్దు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అందాలి. అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి కోసం పనిచేయడంలోనే సంతృప్తి ఉంటుంది. విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు కల్పించడం.. ప్రజలకు సకాలంలో వైద్యసేవ లు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. – బదావత్ సంతోష్, కలెక్టర్ -
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
వాలీబాల్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ అకాడమీకి ఎంపికై నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎస్జీఎఫ్ అండర్– 14, అండర్– 14 రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది సీఎం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా ద్వితీయ స్థానం వచ్చింది. భవిష్యత్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. – ప్రశాంత్, పల్లెగడ్డ, మహబూబ్నగర్ రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ మొదటిసారి వాలీబాల్ అకాడమీకి ఎంపికయ్యాను. రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ చేస్తున్న. సిద్ధిపేట, మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్కు వెళ్లాను. ఈ రెండింట్లో కూడా ఎంపికయ్యాను. కానీ, మహబూబ్నగర్ అకాడమీలో చేరాను. ఇక్కడ వసతులు బాగున్నాయి. అటాకర్గా శిక్షణ తీసుకుంటున్న. – నరేష్, ఇప్పలపల్లి, రంగారెడ్డి -
విస్తరణ వేగవంతం
కల్వకుర్తి–నంద్యాల ఎన్హెచ్–167కే పనుల్లో పురోగతి మారనున్న రూపురేఖలు.. ఇప్పటికే కల్వకుర్తి నుంచి తాడూరు వరకు నాలుగు వరుసల రహదారి పనులు పూర్తయ్యాయి. తాడూరు నుంచి నాగర్కర్నూల్ సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వరకు పనులు పెండింగ్లో ఉండగా, నాగర్కర్నూల్ నుంచి పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్ వరకు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం చౌరస్తా నుంచి కృష్ణా తీరంలోని సోమశిల వరకు రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. మరో ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సోమశిల వద్ద ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం కొత్తరూపు సంతరించుకోనుంది. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణతో ఆయా ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న కల్వకుర్తి–నంద్యాల జాతీయ రహదారి 167కే పనుల్లో వేగం పుంజుకుంది. కల్వకుర్తి మండలం కొట్ర చౌరస్తా నుంచి కొల్లాపూర్ వరకు వివిధ దశల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. కల్వకుర్తి నుంచి నాగర్కర్నూల్ వరకు రహదారి విస్తరణ దాదాపు పూర్తి కావస్తుండగా, నాగర్కర్నూల్ నుంచి కొల్లాపూర్ మధ్యలో కొన్నిచోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామాల వద్ద రెయిలింగ్, పేవ్మెంట్లు, వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి రహదారి నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి–నంద్యాల, జడ్చర్ల–కోదాడ, మహబూబ్నగర్ బైపాస్ జాతీయ రహదారుల నిర్మాణాలతో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనుంది. ఐకానిక్ వంతెనకు టెండర్లు.. కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి 167కే పనుల్లో భాగంగా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టాల్సిఉంది. ఈ వంతెన నిర్మాణానికి నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని జాతీయ రహదారులశాఖ అధికారులు చెబుతు న్నారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. 11 కి.మీ. మేర మహబూబ్నగర్ బైపాస్.. మహబూబ్నగర్ బైపాస్ నిర్మాణానికి ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. మహబూబ్నగర్ శివారులోని అప్పన్నపల్లి వద్దనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి జాతీయ రహదారి వరకు అనుసంధానం చేసేందుకు బైపాస్ రహదారి నిర్మించనున్నారు. సుమారు 11 కి.మీ. మేర రహదారి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. జనవరి నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ వచ్చే నెలలో సోమశిల వంతెన నిర్మాణానికి టెండర్లు రెండేళ్ల సమయం పట్టొచ్చని అంచనా -
కార్యకర్తల సంకల్పం గొప్పది
● అచ్చంపేట పార్టీ శ్రేణులే రాష్ట్రానికి ఆదర్శం ●● మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 28న అచ్చంపేటలో కేటీఆర్ సభ ఈ నెల 28న అచ్చంపేటలో కేటీఆర్ బహిరంగ సభ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా కార్యకర్తలను కలుస్తామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి బీఆర్ఎస్ మీద దండయాత్ర చేస్తున్న సమయంలో గువ్వల పార్టీని వీడి కార్యకర్తలకు అన్యాయం చేశారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. బంగారు తెలంగాణగా మార్చిన కేసీఆర్ను చూసి పార్టీలోకి వచ్చానని.. నా మీద గువ్వల ఎందుకు నిందలు వేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్ హర్షవర్ధన్రెడ్డి, సీనియర్ నాయకులు పోకల మనోహర్, అభిలాష్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్లు కె.తులసీరాం, నర్సింహగౌడ్, మాజీ ఎంపీపీలు పర్వతాలు, కరుణాకర్రెడ్డి, కట్టా గోపాల్రెడ్డి, శ్రీకాంత్ భీమా, అమీనోద్దీన్, రమేష్రావు, అంతటి శివ తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓట్లు వేయలేదని.. ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓట్లేసి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనం నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన జరగగా ఆయనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు కేసీఆర్కు అండగా ఉన్నారని, ఇందుకు నిదర్శనం అచ్చంపేటలో నాయకుడు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలేనని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు రెండునెలల ముందుగా ప్రాజెక్టులకు నీళ్లొచ్చినా.. రైతులకు సాగునీరు వదలకుండా సముద్రంలోకి వదిలారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సంఘటితంగా ఉండి పార్టీ అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకొని సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. నాయకుడు పార్టీ మారాలంటే భయపడే పరిస్థితిని అచ్చంపేట కార్యకర్తలు కల్పించారన్నారు. హామీలు విస్మరించి అబద్ధాలతో పాలన.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వారికే దక్కుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలు, భూములు, ప్లాట్ల ధరలు భారీగా పడిపోయావని.. అవసరానికి భూములు అమ్ముదామన్నా కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి.. అబద్దాలతో పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కేసులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కరుడుగట్టిన కార్యకర్తల ఆదరణ ఉన్నా.. గువ్వల బాలరాజు లాంటి నాయకుడు పార్టీ మారడం అవివేకమని, ఓ రకంగా ఆయన పతనానికి ఆయనే కారణమయ్యారని తెలిపారు. మాజీ మంత్రి డా. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గువ్వల పార్టీ మారడం దురదృష్టకరమని, నాయకుడు కార్యకర్తలకు భరోసా కల్పించేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ పాలనేనని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమన్నారు. -
ప్రజా ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు
నాగర్కర్నూల్: సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ముందుందని ఎమ్మెల్యే డా. రాజేష్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి నియోజకవర్గంలోని నాగర్కర్నూల్, తెలకపల్లి, తాడూర్, బిజినేపల్లి, తిమ్మాజీపేట మండలాల లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేసి మాట్లాడారు. దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లాలో అర్హులైన పేదలకు ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే జిల్లాకేంద్ర అభివృద్ధికి రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సన్న బియాన్ని కొందరు డీలర్లు అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదు అందాయని.. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ● జిల్లాలోనే మొదటి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశాన్ని శుక్రవారం తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లిలో నిర్వహించినట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ల పాలనలో పేదలకు రేషన్కార్డులు జారీ చేయకపోవడంతో సంక్షేమ పథకాలు అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను వినియోగించుకోలేక పోయారన్నారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 6,600 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అలాగే పాత రేషన్ కార్డుల్లో అదనంగా 16 వేల మంది పేర్లను నమోదు చేశామన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని.. మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే వెంటనే రేషన్ కార్డును జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నరసింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆర్డీఓ సురేష్బాబు, తహసీల్దార్లు తబితారాణి, జాకీర్ అలీ, మునీరుద్దీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐదు మండలాల లబ్ధిదారులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు అన్ని ఏర్పాట్లు
నాగర్కర్నూల్: పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి ప్రసంగం కోసం ఆయా శాఖల ప్రగతి నివేదికలను జిల్లా ప్రణాళిక అధికారికి పంపించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల ప్రగతిని ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఈఓ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఉత్తమ ఉద్యోగుల వివరాలను కలెక్టరేట్కు పంపించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి.. వేడుకలను విజయవంతం చేయాలన్నారు. పిల్లల్లో నులిపురుగులను నిర్మూలిద్దాం జిల్లాలో ఈ నెల 11న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1నుంచి 19ఏళ్లలోపు వయసు గల వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లాలోని 1,191 అంగన్వాడీ కేంద్రాలు, 1,147 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 2,03,259 మందికి ఆల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలు వేయాలన్నారు. 11నుంచి 18వ తేదీ వరకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.రవికుమార్, డీఈఓ రమేశ్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి తదితరులు ఉన్నారు. ఎరువుల వివరాలు పక్కాగా ఉండాలి.. కల్వకుర్తి టౌన్/కల్వకుర్తి రూరల్: రైతులకు విక్రయించే ప్రతి ఎరువుకు సంబంధించిన వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కల్వకుర్తిలోని పీఏసీఎస్ గోదాములో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పీఏసీఎస్కు 405 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగా.. 395 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే రైతులకు అధిక మొత్తంలో యూరియాను అందించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రికార్డుల నిర్వహణ సైతం సక్రమంగా లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రైతులు సాగుచేసే పంటల ఆధారంగా యూరియా అందించాలని ఆదేశించినా ఎందుకు పాటించటం లేదని అధికారులను ప్రశ్నించారు. ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్ వివరాలను బోర్డులపై ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట పీఏసీఎస్ సీఈఓ వెంకట్రెడ్డి ఉన్నారు. ● కల్వకుర్తి బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ముందుగా పాఠశాలలో స్టోర్రూం, కిచెన్, డైనింగ్ హాల్, బాత్రూంలు, లైబ్రరీలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతగా మధ్యాహ్న భోజనం అందించాలని.. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అన్ని శాఖల ప్రగతి నివేదికలను ప్రణాళిక అధికారికి పంపించాలి అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి -
పాలమూరుకు ఆటుపోట్లు
ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు. నార్లాపూర్లో నీటి నిల్వ ఇలా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు జలాశయంలో ఇప్పటికే నాలుగు టీఎంసీల నీటి నిల్వ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు -
ఉల్లాస్పై శిక్షణ
కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉల్లాస్పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయి వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీలోగా వీఓఏలు అన్ని గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేయాలన్నారు. మండల రిసోర్స్పర్సన్లు అక్షర వికాసం పుస్తకంపై వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. మధ్యలోనే బడి మానివేసిన విద్యార్థులు టాస్క్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సీ పూర్తి చేయించాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి అకాడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్కుమార్, ఎంఈఓ భాస్కర్రెడ్డి, రిసోర్స్పర్సన్స్ లక్ష్మీనరసింహారావు, శోభన్ బాబు, రాజేందర్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు టెండర్లు చిన్నచింతకుంట: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహోత్సవాలను పురస్కరించుకొని వివిధ రకాల వ్యాపారాలు చేపట్టేందుకు ఈ నెల 20న ఆలయం వద్ద బహిరంగ టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర ప్రసాదాలు, పూజ సామగ్రి విక్రయాలు, తలనీలాలు, కొబ్బరి చిప్పలు సేకరించడానికి, లైటింగ్ వసతి, రంగుల రాట్నాలు ఏర్పాటు చేసుకోవడానికి వేలం పాటలు నిర్వహిస్తామన్నారు. వేలం పాటలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు కొబ్బరికాయలకు రూ.5 లక్షలు, లడ్డు, పులిహోర రూ.5 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.5 లక్షలు, పూజా సామగ్రికి రూ.2 లక్షలు, టెంకాయ చిప్పలు రూ.2 లక్షలు, లైటింగ్ వసతికి రూ.2 లక్షలు, రంగుల రాట్నంకు రూ.2 లక్షలు డిపాటిట్ చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు కురుమూర్తి స్వామి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 725 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతోంది. రామన్పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
బీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాం
అచ్చంపేట: పార్టీలోకి వ్యక్తులు వస్తుంటారు.. పో తుంటారు.. పార్టీనే శాశ్వతమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్కు రాజీనా మా చేసిన నేపథ్యంలో గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. శుక్రవారం అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుందని, నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త హాజరుకావాలని కోరారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ రవుతారని తెలిపారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు శాశ్వత ఇన్చార్జిని ప్రకటించే వరకు తాను అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని.. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు పోకల మనోహర్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు రమేశ్రావు, అంతటి శివ, పీఏసీఎస్ చైర్మన్లు నర్స య్యయాదవ్, భూపాల్రావు, కట్టా గోపాల్రెడ్డి, కరుణాకర్రావు, కేటీ తిరుపతయ్య ఉన్నారు. -
జిల్లావ్యాప్తంగా జోరువాన
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. అత్యధికంగా తెలకపల్లి మండలంలో 53.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఉప్పునుంతల మండలంలో 4.5 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటికే రైతులు పత్తి తదితర పంటలను సాగుచేయగా.. వారం రోజులుగా సరిపడా వర్షం లేకపోవడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం కురవడంతో పంటలకు ఉపశమనం కలిగినట్టయ్యింది. నాగర్కర్నూల్ మండలంలో 51.5 మి.మీ., పదరలో 49, బల్మూరులో 47.8, అమ్రాబాద్లో 40.5, అచ్చంపేటలో 35, బిజినేపల్లిలో 31.8, వెల్దండలో 31.3, చారకొండలో 23.5, వంగూరులో 22.3, కల్వకుర్తిలో 21.3, తాడూరులో 20, తిమ్మాజిపేటలో 18.5, లింగాలలో 9.8, ఊర్కొండలో 6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరో రెండు రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలకపల్లి మండలంలో అత్యధికంగా 53.5 మి.మీ. వర్షపాతం నమోదు -
ఉత్సాహంగా విలువిద్య పోటీలు
మన్ననూర్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చెంచు ఐక్యవేదిక, అటవీ హక్కుల సాధన కమిటీ, పీసా గ్రామసభల సాధారణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మన్ననూర్ పీటీజీ పాఠశాల ఆవరణలో విలువిద్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట మండలాలకు చెందిన 50 మంది చెంచు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిమ్మల చిన్నబయ్యన్న (మొల్కమామిడి), తోకల గురువయ్య (మేడిమల్కల), మెండ్లి పెద్ద లింగయ్య (బీకే ఉప్పునుంతల) అత్యుత్తమ ప్రతిభకనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ సందర్భంగా చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్ మాట్లాడుతూ.. నైపుణ్యం వెలికితీసేందుకు పోటీలు దోహదం చేస్తాయన్నారు. విలువిద్యలో చెంచు యువకులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెంచుల ప్రావీణ్యత, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని కోరారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్నాయుడును కలిశారు. ఈ క్రమంలో డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. రూ.11 వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి -
జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
నాగర్కర్నూల్ రూరల్: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.5వేల కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక లక్ష్మణాచారి భవనంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా రైతాంగానికి సాగునీటి వసతి కల్పించేందుకు ఎంజీకేఎల్ఐ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక జిల్లాగా ఏర్పడిన నాగర్కర్నూల్ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా కల్వకుర్తిలో నిర్వహించిన జిల్లా మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు కేశవులుగౌడ్, హెచ్.ఆనంద్జీ, బండి లక్ష్మీపతి, గోపిచారి, కొట్ర శేఖర్, మారెడు శివశంకర్ ఉన్నారు. -
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం.. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు చోట్లే పక్కా భవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. వసతులు లేక అవస్థలు.. జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ వాహనాల పార్కింగ్కూ స్థలం కరువు అవస్థలు పడుతున్న క్రయవిక్రయదారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
ప్రొ.జయశంకర్ ఆశయ సాధనకు కృషి
నాగర్కర్నూల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు కూచుకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధననే శ్వాసగా భావించి చివరి వరకు పోరాడిన వీరుడు జయశంకర్ అని కొనియాడారు. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు, యువత, ప్రజలతో అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యమ జ్వాలను ప్రగతిపథంలో నిలిపారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఖాజానాజిమ్ అలీ అప్సర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆంజనేయస్వామి పవిత్రోత్సవాలు
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగులో వెలిసిన పబ్బతీ ఆంజనేయస్వామి పవిత్రోత్సవాలు రెండో రోజు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకుడు వీరయ్య శర్మ బృందం వేదమంత్రాలతో స్వామివారికి గవ్యాంతర పూజ లు, వేదికార్చన, మండలార్చన, యాగశాలలో పట్టు పవిత్రముల ప్రతిష్ఠ, మూల మంత్రహోమా లు, పవిత్ర అధివాహనం, నంపాతహోమం, లఘు పూర్ణాహుతి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్, ఎన్ఓసీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబులో పెట్టుకున్న కాసేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్తో పాటు వన్టౌన్ ఏరియాలో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేదని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.3వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం -
‘ఆదివాసీల ఐక్యతను చాటుదాం’
నాగర్కర్నూల్: గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో ఇన్చార్జీ పీఓ ఐటీడీఏ రోహిత్ గోపిడి, డీఆర్డీఏ చిన్న ఓబులేష్, సంబంధిత అధికారులు, చెంచు నాయకులతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అచ్చంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు చెంచులు, ప్రజలు, ఉద్యోగులు కలిపి సుమారు 1000 మందితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను సన్మానించడంతో పాటు ఆదివాసీ సంఘాల సమన్వయంతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చెంచు సంఘాల నాయకులు గురువయ్య, శ్రీనివాసులు, పెద్దిరాజు, నాగరాజు, పద్మ, రాములు, వెంకటస్వామి, లింగస్వామి, హనుమయ్య, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్లు, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్, సోలార్ విద్యుదీకరణ, మిషన్ భగీరథ వంటి రంగాల్లో పనుల వారీగా పురోగతి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి భూపాల్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ దేశనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించొద్దు బిజినేపల్లి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్టే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. మండల వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీని, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘంలోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏఓ కమల్కుమార్, పీహెచ్సీ వైద్యాధికారి డా.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడిట్ నిర్వహిస్తున్నాం
జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సాధారణ, సిజేరియన్ ఆపరేషన్లపై ఆడిట్ నిర్వహిస్తున్నాం. సిజేరియన్ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. అత్యవసరం అయితే తప్పా గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేయొద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇద్దరు గర్భిణులు మృతిచెందిన ఘటనపై యాజమాన్యానికి నోటీసులు అందజేశాం. – డా.రవికుమార్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ, నాగర్కర్నూల్ -
ఇన్చార్జి డీఎంహెచ్ఓగా డా.రవికుమార్
నాగర్కర్నూల్ క్రైం: ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డా.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ బాదావత్సంతోష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి కూకట్పల్లికి డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై వెళ్లారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ మట్లాడుతూ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలులో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటామనని తెలిపారు.మన్ననూర్లోఎఫ్డీఓ కార్యాలయంమన్ననూర్: స్థానిక అటవీశాఖ చెక్పోస్టు సమీపంలోని అటవీ శాఖ విశ్రాంతి గృహం ఆవరణలో ఆ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ (ఎఫ్డీఓ) కార్యాలయానన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించారు. గతంలో ఇది అచ్చంపేటలో క్యాంపు కార్యాలయంగా కొనసాగుతుండేది. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్య స్థావరం మన్ననూర్ నుంచి కొనసాగుతుండడంతో ఎఫ్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ డీఎఫ్ఓ రోహిత్రెడ్డి, ఫ్లైయింగ్ ఎఫ్డీఓ రామ్మోహన్, ఎఫ్ఆర్ఓలు గురుప్రసాద్, వీరేష్, ఈశ్వర్ పాల్గొన్నారు.శ్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలివెల్దండ: మహిళా సంఘాల సభ్యులు శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను బ్యాంకుల్లో సకాలంలో చెల్లించాలని డీఆర్డీఓ ఓబులేష్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చెర్కూర్ గ్రామ మహిళా సంఘాల సభ్యులను కలిసి పెండింగ్లో రుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని 31 చిన్న సంఘాల సభ్యులు దాదాపుగా రూ.8లక్షల వరకు రుణాలను తీసుకున్నట్లు వివరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో దాదాపుగా రూ.కోటి వరకు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. గ్రామా ల్లో ఎంపీఎం, సీసీలు, సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి రుణాలు సకాలంలో చెల్లించే విధంగా చూడాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీదేవి, సీసీ గెల్వమ్మ, వీఓఏ వనిత ఉన్నారు.‘బీఆర్ఎస్ వీడం.. గువ్వల వెంట నడవం’అచ్చంపేట/అచ్చంపేట రూరల్: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతమని, మేమందరం పార్టీలోనే కొనసాగుతామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోకల మనోహర్ స్పష్టం చేశారు. బుధవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గువ్వలకే తెలియాలని, నియోకవర్గ బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగదాలు లేవని, సమిష్టితో పనిచేస్తున్నారన్నారు. ఆయన నిర్ణ యం వల్ల పార్టీని నమ్ముకొన్న వారికి అన్యా యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గువ్వల పార్టీని వీడటం కార్యకర్తలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరు కుంటున్నారని, రానున్న రోజుల్లో పార్టీ మంచి భవిష్యత్ ఉందని జోస్యం చెప్పారు. వారం రోజుల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుతో నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీ నుంచి ఎవరు పోయిన నష్టం లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి పూర్వ వైభవం తీసుకొద్దా మని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు కె.తులసీరాం, నర్సింహాగౌ డ్, మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, మా జీ ఎంపీపీలు పర్వతాలు, కర్ణాకర్రావు, కేటీ తిరుపతయ్య, కౌన్సిలర్లు అంతటి శివ, రమేష్రావు, కట్టా గోపాల్రెడ్డి, రవీందర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నర్సయ్యయాదవ్ పొల్గొన్నారు. -
ప్రాణం తీసిన పందుల పంచాయితీ
వెల్దండ: పందులను చోరీ చేశారంటూ రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. కల్వకుర్తి మున్సిపాలిటీలోని విద్యానగర్కు చెందిన బెల్లంకొండ రాములు (45), కొర్రెడ్డి నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేశ్తో పాటు మరో 10మంది పందులను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వెల్దండకు వచ్చారు. అయితే కొన్ని రోజులుగా వీరి పందులు చోరీకి గురవుతున్నాయి. అయితే చోరీకి గురైన పందులు వెల్దండ మండలం పోతేపల్లికి వెళ్లే దారిలో ఉన్నాయని కొందరు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు అక్కడికి వెళ్లి షెడ్లో ఉన్న పందులను చూస్తున్న క్రమంలో మరో వర్గానికి చెందిన మానపాటి వెంకటమ్మ, పవన్కుమార్, శివ, అన్వేశ్, దుద్రాక్షల కృష్ణ వారిపై దాడికి దిగారు. కర్రలు, కొడవళ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడటంతో రాములుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నిరంజన్, రామచంద్రి, వెంకటయ్య, మహేశ్లకు తీవ్రగాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాములు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన వారికి కల్వకుర్తిలోనే చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పందుల చోరీ ఘటనపై కల్వకుర్తి, వెల్దండ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశామని.. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. -
వైభవంగా అంజన్న పవిత్రోత్సవాలు
అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజేయస్వామి పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ బృందం వేదమంత్రాలతో శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, దీక్షాధారణ, వాస్తు శాంతి, తీర్థ ప్రసాద వితరణ గావించారు. సాయంత్రం యాగశాల ప్రవేశం, మృత్శంగ్రహణం, అంకురార్పణ, యాగశాలలో కళష స్థాపన, అగ్ని ప్రతిష్ట చేశారు. ఉత్సవాల్లో ఈఓ రంగాచారి, ప్రధాన అర్చకులు వీరయ్యశర్మ, సిబ్బంది విశ్వేశ్వరరెడ్డి, నాగరాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
రాములు దారెటో..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ను వీడుతూ బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉదంతం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా పైగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల అనూహ్యంగా పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో వారంతా అయోమయంలో ఉన్నారు. అయితే పార్టీ మార్పుపై వదంతుల వ్యాప్తి ఉధృతంగా మారిన క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ తాము పార్టీ వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. గువ్వల బీజేపీలో చేరుతుండటంతో బీఆర్ఎస్తో పాటు బీజేపీలోని నేతలను సైతం కలవరపెడుతుండటం గమనార్హం. భరత్ భవితవ్యంపై బెంగ.. సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి రాములు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్ప్రసాద్ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలో చేరి.. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. రానున్న కాలంలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో ఉన్నారు. అయితే గులాబీ పార్టీలో గువ్వలలో అంతర్గత పోరులో భాగంగా బీజేపీలో చేరితే.. ఇప్పుడు మళ్లీ గువ్వల రూపంలోనే పోటీ ఎదురవుతోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన రాములు కార్యక్షేత్రంపైనే ఆయన తనయుడు భరత్ ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్లో ఉండగా జెడ్పీ చైర్మన్ పదవి, అచ్చంపేట ఎమ్మెల్యే సీటు, నాగర్కర్నూల్ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ప్రధానంగా గులాబీ పార్టీలో గువ్వల బాలరాజు ప్రభావంతో తమకు అవకాశాలు దక్కలేదని భరత్ప్రసాద్ భావించారు. ఈ కారణాలతోనే రాములు సైతం కుమారుడితో కలసి పార్టీని వీడి అనూహ్యంగా బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు గువ్వల సైతం బీజేపీలోనే చేరుతుండటంతో భరత్ప్రసాద్ భవితవ్యంపై వారి అనుచరులు బెంగ పెట్టుకుంటున్నారు. గువ్వల వెంట వెళ్లేందుకుకేడర్ విముఖత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తన ముఖ్య అనుచరులు, కేడర్గా ముందుగానే చెప్పారు. వారి నుంచి సహకారం కావాలని, తనతో పాటుగా బీజేపీకి రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్లో బీజేపీతో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కన్నా ముందే తాము బీజేపీలో చేరితే గౌరవం నిలబడుతుందని కేడర్తో చెబుతున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేయవచ్చని అంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు, జాతీయవాదాన్ని ఆచరించే పార్టీతో పని చేస్తానని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనతో వెళ్లేందుకు బీఆర్ఎస్ కేడర్ విముఖంగా ఉందని తెలుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, అనుచరులు గువ్వల పాటు బీజేపీకి వెళ్లేందుకు నిరాసక్తతను కనబరుస్తున్నారు. ఇప్పటికే గువ్వల పార్టీ మారుతున్న ప్రచారం మొదలైన క్రమంలోనే సోమవారం సీఎం రేవంత్ సమక్షంలో పదర మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, గువ్వల ముఖ్య అనుచరుడు రాంబాబునాయక్ కాంగ్రెస్లో చేరారు. ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం తక్కువగా ఉండటం, బీజేపీ కన్నా బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందన్న భావన నేపథ్యంలో ఎక్కువ మంది అనుచరులు బీజేపీలో చేరడానికి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్లో టికెట్ దక్కక కమలం గూటికెళ్లిన మాజీ ఎంపీ బీజేపీలోకి గువ్వల రాక నేపథ్యంలో మళ్లీ అలజడి కుమారుడి భవితవ్యంపై ఆందోళన గువ్వల బాటలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. తప్పని పోరు.. బీఆర్ఎస్లో గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ రాములు మధ్య సుదీర్ఘంగా కాలం పాటు సాగిన వర్గపోరు ఇప్పుడు పార్టీ మారినా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గులాబీ పార్టీలో గువ్వల ఆధిపత్యం నేపథ్యంలో రాములు కారు దిగి.. కమలం గూటికి చేరారు. రానున్న కాలంలో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా తమ కుమారుడిని దింపి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న తలంపుతో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ గువ్వల రంగప్రవేశంతో ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన నెలకొంది. -
వ్యాపారం చేస్తున్నారు..
ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మేం ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, టై, బెల్టులు వి ద్యార్థులకు అవసరమైనవి విక్రయిస్తూ వ్యాపా రం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఫిర్యాదు చేస్తే.. ప్రైవేట్ పాఠశాలల్లో నోటుబుక్స్, ఇతర సామగ్రి వంటివి విక్రయించరాదు. స్కూల్ నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు తప్పనిసరిగా ఉండాలి. అధిక ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – రమేష్కుమార్, డీఈఓ ● -
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం తగదు
నాగర్కర్నూల్: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం తగదని, అలా చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మాజీమంత్రి హరీశ్రావు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కాళేశ్వరంపై వీడియో ప్రజెంటేషన్ నిర్వహించగా జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, హర్షవర్ధన్రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు గోదావరిపై అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితుల్లో కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం పూర్తి చేస్తే సస్యశ్యామలం అయిందన్నారు. రేవంత్రెడ్డి రెండేళ్ల పాలన గాలి మోటార్లు ఎక్కి గాలి ముచ్చట్లు చెప్పడానికే సరిపోయిందన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం పాలన పక్కకు పెట్టి రాజకీయ కక్ష్య సాధింపులే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు. రేవంత్ పాలన ఒక టీవీ సీరియల్లా నడుస్తోందని దుయ్యబట్టారు. మొన్నటి వరకు ఫార్ములా–1 కేసు, నిన్న ఫోన్ ట్యాపింగ్ అన్నారు అందులో ఏం చేయలేకపోయే సరికి ఇప్పుడు కాళేశ్వరం మీద పడ్డారని ఎద్దేవా చేశారు. చివరి అడుగూ కేసీఆర్తోనే.. ఎమ్మెల్యేగా తొలి అడుగు కేసీఆర్తో ప్రారంభమైందని చివరి అడుగు వరకు ఆయనతోనే ఉంటానని మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్న గువ్వల బాలరాజును సముదాయించేందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా తనపై దష్ప్రచారం చేసిందన్నారు. రాజకీయంగా తెలిసీ తెలియక మొదట టీడీపీ నుంచి పోటీ చేశానని, తర్వాత బీఆర్ఎస్లో చేరానన్నారు. పదేళ్లపాటు దేవుడిగా ఉన్న కేసీఆర్ పోడిపోతే దెయ్యం అవుతాడా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ తాను జీవితంలో ఎన్నో పదవులు అనుభవించానని, ఇక పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఎవరికీ లేదని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నాగర్కర్నూల్ క్రైం: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, డీఈఓ రమేష్కుమార్, బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ప్రశాంతి మంగళవారం జిల్లాకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంటిగదితోపాటు పాఠశాల పరిస రాలు అపరిశుభ్రంగా ఈగలు, దోమలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రకా ల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర అసంతృపి్త్ వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. -
ఉపాధి కొత్త నిబంధనలు
అచ్చంపేట: ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కూలీల డబ్బులు దోచుకోవడం, మరికొందరు పరికి రాకున్నా అటెండెన్స్ వేయించుకుంటున్నారు. దీంతో ఇకపై పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధి హామీ కూలీల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీలో పనిచేసేందుకు వచ్చిన కూలీల ఫొటోలను రెండు పూటలా తీయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని 20 మండలాల పరిధిలో అధికారులు గత నెల 14 నుంచి గ్రామాల వారీగా శాంపిళ్లను తీస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు షరతులు పనులు మంజూరు లేకుండా ఎలాంటి వర్క్ మొదలు పెట్టకూడదు. డిమాండ్ చేసి మస్టర్ మేట్కు ఇచ్చిన తర్వాతనే పని ప్రారంభించాలి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్కు రెండు, మూడు గ్రామ పంచాయతీలు ఉంటే.. ఒకే గ్రామ పంచాయతీలో పని ప్రారంభించాలి. పని మంజూరు లేకుండా పనిచేస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిగే నష్టం ఏమిటంటే ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరికై నా పనిప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్కు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పకడ్బందీగా పర్యవేక్షణ ఎన్ఎంఎంఎస్ యాప్లో మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వెరిఫై చేసి రిపోర్టును ఎంపీడీఓలకు పంపించాల్సి ఉంది. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20 శాతం ఫొటోలు లేదంటే గ్రామానికి రెండు ఫొటోల చొప్పున ఎంపీడీఓ కార్యాలయంలోని ఏపీఓ, కాంట్రాక్టు స్టాప్, పర్మనెంట్ స్టాప్ అదేరోజు వెరిఫై చేసి రిపోర్ట్ను కలెక్టర్, డీఆర్డీఓలకు పంపించాలి. జిల్లాస్థాయిలో ముందు రోజు క్యాప్చర్ చేసిన ఫొటోల్లో కనీసం 30 ఫొటోలను కలెక్టర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. డీఆర్డీఓ కాంట్రాక్ట్, పర్మనెంట్ స్టాప్ ఒక్కొక్కరు జిల్లావ్యాప్తంగా వచ్చిన మొత్తంలో రోజుకు10 శాతం లేదా 200 ఫొటోలను వెరిఫై చేయాలి. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రోజుకు 20 ఫొటోలను వెరిపై చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇకపై రెండు ఫొటోలు దిగితేనే వేతనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే కూలీ మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే అన్నిస్థాయిల్లో శాంపిల్గా ఫొటోల పరిశీలన అవకతవకలకు చెక్ పెట్టేలా కఠిన చర్యలు ఫొటో ఉంటేనే హాజరు.. కూలీలు పనులు చేసే ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా రెండు ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే వారికి వేతనం వస్తుంది. ఫొటో ఉంటేనే హాజరుగా పరిగణలోకి తీసుకుంటారు. ఫొటోలు అప్లోడ్ చేయకపోతే కూలీలకు వేతనం రాదు. ఈజీఎస్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల 14 నుంచి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. – ఓబులేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
ప్రైవేట్లో ఫీజులుం
● నిబంధనలకు విరుద్ధంగా పెంపు, వసూళ్లు ● పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అదనపు వ్యాపారం ● సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ● నియంత్రణలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు కందనూలు: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అంతులేకుండా పోతోంది. తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత మూలాలు ఉన్న జిల్లాలో రూ.వేలల్లో ఫీజులు ఉండటం నివ్వెరపరుస్తోంది. ఒక స్కూల్ మించి మరో స్కూల్ పోటీ పడి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడికి ప్రైవేట్ బడి భారమవుతోంది. ముఖ్యంగా కార్పొరేట్, ఐఐటీ, సీబీఎస్ఈ సిలబస్ అని ఏటా 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో.. జిల్లాలో మొత్తం ప్రైవేట్ పాఠశాలలు 161 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 8, ప్రాథమికోన్నత 79, ఉన్నత పాఠశాలలు 74 ఉండగా.. సుమారు 45 వేల మంది వరకు చదువుకుంటున్నారు. అయితే ఎల్కేజీ విద్యార్థులకు రూ.20 వేలు మొదలుకొని పదో తరగతి విద్యార్థులకు రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా ఐఐటీ, నీట్ పేరుతో మరికొంత ఫీజులు వసూలు చేయడం గమనార్హం. వీటికి తోడు అడ్మిషన్ ఫీజులు సైతం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ కొందరు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. అధిక ఫీజుల విషయంలో విద్యార్థి సంఘా లు, తల్లిదండ్రులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న విద్యాధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. యథేచ్ఛగా దోపిడి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను అదేబడిలో తీసుకోవాల్సిందే. లేకపోతే యాజమాన్యాలు సూచించిన చోట మాత్రమే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. యాజమాన్యాలు సూచించిన చోటుకు వెళ్తే వారు చెప్పిందే రేటు.. లేదంటే మీ ఇష్టం అనే ధోరణిలో షాపుల యజమానులు వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల విద్యాహక్కు చట్టం నిబంధనలు ఉల్లంఘించేలా తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య ఉంటోంది. జిల్లాకేంద్రంలో అయితే మరీ దారుణంగా పాఠశాల ఒక దగ్గర ఉంటే.. తరగతులు ఇంకోచోట నిర్వహించడం, ఇతర పేర్లతో బోర్డు పెట్టి నడిపిస్తుండటం గమనార్హం. వసతులు అంతంతే.. ముక్కుపిండి రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.. అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. చాలా పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు రాని పరిస్థితి. కనీసం ఆడుకోవడానికి మైదానాలు సైతం ఇవన్నీ తెలిసి కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది అంతుచిక్కడం లేదు. నిబంధనలకు తూట్లు.. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ప్రైవేట్లోనూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు టీటీసీ పూర్తి చేసి టెట్ క్వాలీఫై అయ్యి ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో బో ధించే ఉపాధ్యాయులు బీఈడీ పూర్తి చేసి టెట్ క్వా లీఫై కావాల్సి ఉంటుంది. కానీ, కొన్ని పాఠశాలల్లో అవేమి పట్టనట్లుగా యాజమాన్యాలు డిగ్రీ పూర్తి చేసిన వారితో బోధన చేయించడం జరుగుతుంది. -
ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
నాగర్కర్నూల్: మున్సిపాలిటీలోని దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. పట్టణంలో లైసెన్స్ తీసుకొని దుకాణాలను కమిషనర్ నాగిరెడ్డి మంగళవారం మూసి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని దుకాణ యజమానులు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దుకాణాలను మూసి వేస్తామని హెచ్చరించారు. నేటినుంచి స్పాట్ అడ్మిషన్లకు అవకాశం మన్ననూర్: స్థానిక ప్రభుత్వ ఆర్ఐటీఐ/ఏటీసీ మన్ననూర్ కళాశాలలో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి బుధవారం నుంచి ఈ నెల 28 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్కు హాజరై అడ్మిషన్ పొందవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎస్ఎస్సీ, కులం, బోనోఫైడ్/ స్థానిక, బదిలీ, సర్టిఫికెట్లతోపాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో స్కాన్ చేసి https://iti telangana.gov.in అనే వెబ్సైట్లో మొబైల్ నంబర్/Emailid తో రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. 1– 2 దశల్లో దరఖాస్తు చేసుకొని సీటు పొందని అభ్యర్థులు మళ్లీ చేసుకోనవసరం లేదని, ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ప్రింటెడ్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావొచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్ నంబర్లు 85004 61013, 85004 61022లను సంప్రదించాలని సూచించారు. గడువు పొడిగింపు కందనూలు: తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పొడిగించడం జరిగిందని జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో చెల్లించాలని, అపరాధ రుసుంతో ఈ నెల 28 వరకు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ‘అత్యాచార ఘటనలను అరికట్టడంలో విఫలం’ వీపనగండ్ల: మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్రా మహిళా సంఘం) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ఆరోపించారు. జిల్లాకేంద్రంలో ఈ నెల 30, 31న నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అవసరమైన నిధుల కోసం మంగళవారం మండల కేంద్రంలో విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుల దురాహంకార హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస సమాజాన్ని సవాల్ చేస్తున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు మద్దతు పలుకుతూ సామాన్య ప్రజలు, మహిళల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆస్పత్రుల్లో వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షురాలు శాంతమ్మ, జిల్లా కార్యవర్గసభ్యురాలు లలిత తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
అచ్చంపేట రూరల్: అచ్చంపేట మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్రెడ్డిని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. గతంలో నల్లమల పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి రూ.100 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు అందించామని, మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు మున్సిపల్ చైర్మన్ వివరించారు. నిధులు మంజూరు కాగానే పట్టణంలో అవసరం ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, సీసీరోడ్లతోపాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతున్నామని, భవిష్యత్లోనూ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్లో చేరిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అమ్రాబాద్: బీఆర్ఎస్ నేత, పదర జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాంబాబునాయక్ సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాంబాబునాయక్తోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు నర్సింహ, వెంకటయ్య, రామ్మూర్తి తదితరులున్నారు. -
నేటి నుంచి పబ్బతి అంజన్న పవిత్రోత్సవాలు
అమ్రాబాద్: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 5న ఉదయం 10గంటల నుంచి మహాగణపతి పూజ, పుణ్యహవచనం, పంచగవ్యం, దీక్షారాధన, వాస్తు శాంతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 6గంటల నుంచి యాగశాల ప్రవేశం, అంకురార్పణ, యాగశాలలో కలశ స్థాపన, అగ్నిప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6న గవ్యాంతర పూజలు, వేధికార్చన, మండలార్చన, యాగశాలలో పట్టు పవిత్రాల అలంకరణ, మూలమంత్ర హోమాలు, నంపాత హోమం, లఘు పూర్ణాహుతి, 7న గవ్యాంతర పూజలు, యాగశాలలో కలశ దేవతలకు ఆరాధన, మూలమంత్ర హోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కుంభములతో ఆలయ ప్రవేశం, స్వామివారికి కుంభ జలాలతో అభిషేకం, విశేష ఆరాధన, పట్టు పవిత్ర సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవి
నాగర్కర్నూల్ క్రైం: శిశువు పుట్టిన వెంటనే తల్లి నుంచి వచ్చే ముర్రుపాలు పట్టడం వల్ల శిశువులో రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రి గైనిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలతోపాటు రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవని, పుట్టిన శిశువు నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. బిడ్డకు పాలిచ్చే తల్లులకు అండాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు దరిచేరవన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు, మానసిక రోగులుగా మారిన వారికి జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, గైనిక్ హెచ్ఓడీ నీలిమ, వైద్యులు సుప్రియ, సౌమ్య, కవిత, రవిశంకర్, అంబుజ, హెల్ప్డెస్క్ ఇన్చార్జ్ యాదగిరి పాల్గొన్నారు. -
రాజకీయ కలకలం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత తేలదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు కారు పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు -
ప్రజావాణికి 38 ఫిర్యాదులు
నాగర్కర్నూల్: ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అదనపు కలెక్టర్కు వినతులను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ప్రతి అర్జీదారుడు సమస్య పరిష్కారం కో సం తిరిగి అదే సమస్య విన్నవించకుండా జిల్లా అధికారులు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ప్రజావాణికి 38 ద రఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, ఆయా విభాగా ల సూపరింటెండెంట్లు రవికుమార్, వెంకట్, శోభ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 10.. నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్ గ్రీవెన్స్కు మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 8 భూ తగాదా, 2 న్యాయం చేయాలని ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దరఖాస్తుల ఆహ్వానం బల్మూర్: మండలంలోని ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ బోధించడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పరంగి రవి సోమవారం ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ జనరల్, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో నేరుగా వచ్చి తమ దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ఇంటర్వ్యూ నిర్వహించి అదే రోజు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రేపు జాబ్ మేళా కందనూలు: జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, శిక్షణ శాఖాధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ కేటగిరీల్లో వంద ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని యువతీ, యువకులు 10వ తరగతి, డిగ్రీ, ఫార్మసీ, పాసై 18–35 ఏళ్లలోపు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నం.97012 00819 సంప్రదించాలని కోరారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి కొల్లాపూర్: జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్లోని కేఎల్ఐ అతిథి గృహంలో నిర్వహించిన సీపీఐ పార్టీ మండల సమావేశాని కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొల్లాపూర్ పట్టణానికి చెందిన ఫయాజ్ ఇటీవలే సీపీఐ జిల్లా కార్యదర్శిగా నియామకం కావడంతో ఆయనను పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాగర్కర్నూల్ లో వేలాదిగా లంబాడీలు, చెంచులు ఉన్నారన్నారు. వారి జనాభా ఆధారంగా జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. నల్లమలలోని వనరులను వినియోగించుకునే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. నల్లమల పరిసర ప్రాంతాలను ఏజెన్సీ కారిడార్గా ప్రకటించాలని కోరారు. కొల్లాపూర్లో మామిడి మార్కెట్, ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ స్థాపించాలన్నారు. మొలచింతలపల్లి, అసద్పూర్ శివార్లలో ఉన్న రాజవంశస్థుల భూములను సీలింగ్ యాక్టు ప్రకారం పేదలకు పంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో నాయకులు శివుడు, ఇందిర, యూసుఫ్, కుర్మయ్య, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్లో క్రీడాకారుల ప్రతిభ
కందనూలు: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి సౌత్జోన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు, వెండి పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు సోమవారం తెలిపారు. సౌత్ జోన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–18 బాలుర విభాగంలో ఉదయ్కిరణ్ హైజంప్ సిల్వర్ మెడల్, అండర్–20 బాలుర విభాగంలో కాట్రావత్ శ్రీను గోల్డ్ మెడల్, ఉమెన్ విభాగంలో కొడావత్ స్వప్న స్టీపుల్ చేజ్లో గోల్డ్ మెడల్, చైతన్య సిల్వర్ మెడల్, రాజేశ్వరి గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్యాదవ్, క్రీడాకారుల తల్లిదండ్రులు, మాజీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
ఫలించిన ఆపరేషన్ ముస్కాన్
నాగర్కర్నూల్: వివిధ కారణాలతో చదువులు మానేసి బాలకార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో ఆపరేషన్ ముస్కాన్ వెలుగులు నింపుతోంది. హోటళ్లు, వస్త్ర, కిరాణ దుకాణాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షెడ్లలో పనులు చేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారిని వెట్టి నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ అనే కార్యక్రమాలను చేపట్టింది. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తుంది. మహిళా, శిశు సంక్షేమం, పోలీస్, కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతారు. ఈ క్రమంలోనే గత నెలలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 33 మంది బాలకార్మికులకు వెట్టి నుంచి విముక్తి కలిగించి సదరు పిల్లలను వారి పరిధిలోని పాఠశాలల్లో చేర్పించారు. అలాగే వీరిని పనిలో పెట్టుకున్న 27 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 591 మంది.. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాలు 2014లో ప్రారంభమైనా నాగర్కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2018 జనవరి నుంచి నిర్వహించారు. ఈ క్రమంలో 2018 నుంచి 2025 జూన్ వరకు గడిచిన ఎనిమిదేళ్లలో జిల్లాలో 591 మంది బాలకార్మికులను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించారు. 2018 జనవరిలో 23, జూలైలో 76, 2019 జనవరిలో 29, జూలైలో 46, 2020 జనవరిలో 104, 2021 జనవరిలో 48 మంది బాలకార్మికులను గుర్తించి వెట్టి నుంచి విముక్తి కల్పించారు. 2020, 2021 జూలైలో కరోనా ప్రభావంతో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించలేదు. ఆ తర్వాత 2022 జనవరిలో 34, 2022 జూలైలో 23, 2023 జనవరిలో 16, 2023 జూలైలో 18, 2024 జనవరిలో 10, 2024 జూలైలో 23 మంది, 2025 జనవరిలో 108, 2025 జూలైలో 33 మందికి విముక్తి కల్పించారు. 2018 నుంచి బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై అధికారులు లేబర్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు. మూడు టీంల ఏర్పాటు.. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కోసం జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించేందుకు మొత్తం మూడు టీంలను ఏర్పాటు చేశారు. అచ్చంపేటకు ఒక టీం, కల్వకుర్తికి ఒక టీం, నాగర్కర్నూల్, కొల్లాపూర్కు కలిపి ఒక టీం ఏర్పాటు చేశారు. మొత్తం నెలరోజులపాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో 33 మంది పిల్లలను కాపాడారు. కాగా.. పిల్లలతోని పని చేయిస్తున్న యజమానులపైనే 27 మందిపై కేసులు నమోదు చేయగా మిగతా వారికి జరిమానాలు విధించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 1 నుంచి 31 వరకు కొనసాగిన ప్రత్యేక తనిఖీలు జిల్లాలో 33 మంది బాల కార్మికులకు విముక్తి 27 మంది యజమానులపై కేసులు నమోదు విముక్తి పొందిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించిన అధికారులు -
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
నాగర్కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 3,489 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం 5 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశం ఉన్నందున అదనపు ఎరువులు కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ కార్యాలయానికి నివేదిక పంపిస్తామన్నారు. గతేడాది ఆగస్టులో 8,500 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామని, ఈసారి 10 వేల టన్నుల ఎరువులు అవసరం కావొచ్చని అభిప్రాయపడ్డారు. డీలర్లు రైతులకు ఎమ్మార్పీకి మించి ఎరువులు అమ్మినా, యూరియాకు వేరే ఎరువులు లింక్ చేసి అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
యోగా పోటీలలో విద్యార్థుల ప్రతిభ
కందనూలు: జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన యోగా పోటీలలో విద్యార్థులు వివిధ రకాల ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. వీరిని ఈ నెల చివరి వారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాదం నరేందర్, యోగా గురువు శివానంద స్వామి, జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ శివప్రసాద్, శంకర్ గౌడ్, శివకుమార్, సునంద, సాగర్, యాదగిరిరావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఉపాధ్యాయ పదోన్నతులు
కందనూలు: జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సీనియార్టీ జాబితా మేరకు జిల్లాలో 39మంది జీహెచ్ఎంలుగా, 109 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, 22 మంది పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందనున్నారని తెలిపారు. ముందుగా 36 జిల్లా పరిషత్, 3 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న జీహెచ్ఎంల పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించేందుకు గాను సీనియార్టీ జాబితాను ప్రాంతీయ విద్యా సంచాలకులకు పంపించామని.. వారి పదోన్నతుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని డీఈఓ వివరించారు. ఇక అర్హులైన ఎస్జీటీల సీనియార్టీ జాబితా ప్రకారం 138 మంది ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. లోకల్ బాడీ పాఠశాలల్లో ఖాళీల వారీగా హెచ్ఎంగా (ఎల్ఎఫ్ఎల్) 22మంది, గణితంలో 11మంది, భౌతిక శాస్త్రంలో ఇద్దరు, జీవశాస్త్రంలో 16మంది, సాంఘిక శాస్త్రంలో 25 మంది, హిందీలో 10 మంది, తెలుగులో 8 మంది, ఇంగ్లిష్లో 8 మంది, ఫిజికల్ డైరెక్టర్గా ఒకరికి, లోకల్ బాడీ ఉర్దూ మీడియం గణితంలో ఒకరికి, బయోసైన్స్లో ఒకరికి, సోషల్లో ఇద్దరికి, ఉర్దూ లాంగ్వేజ్లో ముగ్గురికి, స్పెషల్ ఎడ్యుకేషన్లో 15 మందికి పదోన్నతులు లభించనున్నాయని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో గణితం సబ్జెక్టులో ఒకరికి, ఫిజికల్ సైన్స్లో ఇద్దరికి, బయో సైన్స్లో ఒకరికి, ఇంగ్లిష్లో ఇద్దరికి, సోషల్లో ఒకరికి పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం పదోన్నతుల ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు సీనియర్ హెచ్ఎంలు, ఎంఈఓలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయ సీనియార్టీ జాబితాను ఆన్లైన్లో పొందుపరిచామని.. మంగళవారం సబ్జెక్టుల వారీగా పాఠశాలల ఖాళీల వివరాలతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతుల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు డీఈఓ తెలిపారు. -
విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు
అచ్చంపేట రూరల్: నల్లమల ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను ప్రభు త్వం కల్పిస్తుందన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలి : సీపీఐ కల్వకుర్తిరూరల్: తెలకపల్లి మండలం జిన్కుంటలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్కుంటలో లెదర్ పార్క్ కోసం 23 ఎకరాలు కేటాయించినప్పటికీ.. ఫలితం లేకుండా పోతుందన్నారు. లెదర్పార్క్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టడంతో పాటు రుకారం చెరువును పునరుద్ధరించాలన్నారు. పాలెం సమీపంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మత్స్య సంపద నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలన్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లో విస్తారంగా సాగుచేసిన మామిడికి దళారుల బెడద నివారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యాభివృద్ధి కోసం నియోజకవర్గానికి ఒక ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. కేఎల్ఐ ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని పెంచి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంతో పాటు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో కేశవులుగౌడ్, నర్సింహ, పరుశరాములు, శ్రీనివాసులు, ఫయాజ్, యూసూప్, దార దాసు ఉన్నారు. కోయిల్సాగర్లో నిలకడగా నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో గడిచిన వారం నుంచి నీటిమట్టం నిలకడగా ఉంది. జూరాల ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితో సమానంగా ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తుండటంతో హెచ్చుతగ్గులు లేకుండాపోతోంది. గత నెల 15 నుంచి వానాకాలం పంటలకు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరకు 26 అడుగుల నీటిమట్టం ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతలలో భాగంగా జూరాల సమీపంలోని ఉంద్యాల ఫేస్–1 పంప్హౌస్ నుంచి ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి నీరు రాక ముందు 11 అడుగులు ఉన్న నీటిమట్టం 15 అడుగులు పెరిగింది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 0.6 అడుగుల నీరు చేరాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి గేట్ల లెవల్ 32.6 అడుగులు ఉండగా మరో 6.6 అడుగుల నీరు చేరితే పూర్తిగా నిండుతుంది. -
ఆస్పత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు
●బయోమెట్రిక్ విధానానికి స్వస్తి ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం స్థానంలో ఆధార్ ఆధారిత హాజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు, సిబ్బంది విధిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – శివరాం, సూపరింటెండెంట్, కల్వకుర్తి సీహెచ్సీ ● వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు ● ఈ నెల నుంచి నూతన హాజరు విధానం అమలు కల్వకుర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆధార్ ఆధారిత హాజరు విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరును నిత్యం పర్యవేక్షించేందుకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలుచేసేది. అయితే కొన్నిచోట్ల వైద్యుల హాజరు నమోదులో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం.. ఇదే సాకుతో కొందరు వైద్యులు, సిబ్బంది విధులకు గైర్హాజరు కావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటిని అధిగమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానానికి స్వస్తి పలికి.. ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పారదర్శకత లేకపోవడంతో.. బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్యులు సమయానికి ఆస్పత్రికి వచ్చి హాజరు నమోదు చేసుకొని.. ఆ తర్వాత కొందరు వైద్యులు వ్యక్తిగత పనులపై బయటికి వెళ్లిపోవడం.. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తీరిక దొరికిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రికి రావడం వంటివి జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల బయోమెట్రిక్ యంత్రం చెడిపోయేలా చేయడం.. అసలు మిషన్ పనిచేయకుండా చేసిన ఘటనలు ఉన్నాయి. బయోమెట్రిక్ యంత్రం మరమ్మతుకు నోచుకోకపోవడం ద్వారా సాధారణ పద్ధతిలో హాజరు వేసేందుకు వీలుండటంతో అధికారులు కూడా పట్టించుకునే వారు కాదు. వాటిని మరమ్మతు చేయించకుండా తాత్సారం చేసే వారు. దీంతో ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రులను నడుపుకొనేందుకు వీలుపడింది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఈ నెల నుంచి ఆధార్ ఆధారిత హాజరును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే జిల్లాలోని కొన్ని ఆస్పత్రుల్లో ఒకటో తేదీ నుంచే ఈ విధానం అమలులోకి రాగా.. మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఆధార్ ఆధారిత హాజరు అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఆస్పత్రుల్లో.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు విధానం అమలు చేయనున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, ఉప్పునుంతలలో సీహెచ్సీలు ఉండగా.. 20 మండలాలల్లో పీహెచ్సీలు ఉన్నాయి. చాలా వరకు సీహెచ్సీలు, పీహెచ్సీలలో పలు విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరకుండా తాత్సారం చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వినియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టుబుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యు త్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
పేదలకు అండగా మోదీ ప్రభుత్వం
తిమ్మాజిపేట: పేదల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలు అమలుచేస్తూ అండగా నిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ అన్నారు. తిమ్మాజిపేట మండలం మరికల్లో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి కేంద్ర పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పేదలకు ప్రతినెలా ఉచితంగా రేషన్ బియ్యం, రైతులకు పంట పెట్టుబడుల కోసం కిసాన్ సమ్మాన్నిధి, సబ్సిడీపై ఎరువులు, స్ప్రింక్లర్లు అందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు చాలా వరకు కేంద్ర నిధులతోనే చేపడతున్నట్లు వివరించారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందన్నారు. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. -
పాలమూరు వెనుకబాటుకు పాలకులే కారణం
అచ్చంపేట రూరల్: పాలమూరు ఉమ్మడి జిల్లా వెనుకబాటుకు పాలకులే కారణమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన రిటైర్డ్ ఎంఈఓ పడాల బాలజంగయ్య మూడవ వర్ధంతి సభకు ప్రొఫెసర్లు హరగోపాల్, లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. ప్రకృతిని ప్రేమించని వారు మనిషిని ప్రేమించలేరన్నారు. మానవ సంబంధాలు బాగుండాలంటే మానవీయ కోణం అవసరమన్నారు. మనిషి స్వార్థపరుడని.. స్వార్థంగానే బతకాలనే వాదన, సిద్ధాంతం ముందుకొచ్చిందన్నారు. పెట్టుబడిదారి విధానం ప్రజల మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసిందన్నారు. భూస్వామ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణలో అనేక పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. పాలమూరు విశ్వవిద్యాలయం 20మంది ప్రొఫెసర్లతో కొనసాగుతుందని.. జిల్లా వెనుకబాటుపై చర్చించాల్సిన అవసరముందన్నారు. గతంలో భూమి విక్రయించాలంటే రైతులు ఏడ్చేవారని.. ఇప్పుడు అంగడి సరుకై ందని అన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, నారాయణ, మనోహర, బాలస్వామి, లక్ష్మణ్నాయక్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్, శ్రీనునాయక్, రామస్వామి, విష్ణుమూర్తి, చందునాయక్, గోపాల్, రఘుపతిరావు పాల్గొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ -
సృజనాత్మకత వెలికితీయొచ్చు..
పీఎంశ్రీ పాఠశాలల్లో సంగీత పాఠాలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయొచ్చు. ఇప్పటికే పాఠశాలకు నాలుగు రకాల వాయిద్య పరికరాలు అందాయి. త్వరగా శిక్షకులను నియ మిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడ లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – గోపాల్, హెచ్ఎం, అచ్చంపేట ఉన్నత పాఠశాల మార్గదర్శకాలు రాలే.. జిల్లాలో ఎంపికై న ఎనిమిది పీఎంశ్రీ పాఠశాలలకు వాయిద్య పరికరాలు చేరాయి. తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. ఆదేశాలు అందగానే జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. త్వరలోనే ప్రత్యేక టీచర్ల నియామకం జరగనుంది. – షర్పొద్దీన్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ● -
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
కల్వకుర్తి రూరల్: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అసమానతలు, కార్మికులపై దాడులు, రైతుల దోపిడీ, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజా పోరాటాలే శరణ్యం అని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. కల్వకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో సీపీఐ జిల్లా మహాసభలు జిల్లా కార్యదర్శి బాల్నర్సింహ అధ్యక్షతన శనివారం రెండోరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్ర జెండా పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దేశంలో కొంతమంది చేతిలోనే రూ.కోట్ల సంపద ఉండిపోయిందని దుయ్యబట్టారు. అసమానతలు, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఎరజ్రెండా నీడన పోరుబాటకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వామపక్ష శక్తులుగా, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం సాగించే పార్టీగా సీపీఐ అగ్రభాగాన ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్జి, ఫయాజ్, కేశవులుగౌడ్, అనిల్కుమార్, నర్సింహ, విజయుడు, ఇందిరమ్మ, చంద్రమౌళి, భరత్, పరశురాములు, శీను తదితరులు పాల్గొన్నారు. -
‘వందరోజుల’ ప్రణాళిక పక్కాగా చేపట్టాలి
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో చేపడుతున్న ‘వంద రోజుల’ ప్రత్యేక ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ సంధ్య అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్న తీరుపై పట్టణమంతా పలుచోట్ల పర్యటించి పరిశీలించారు. పట్టణాల్లో రోజు పోగయ్యే చెత్తను తడి, పొడి చెత్తగా విభజించి చెత్త సేకరణ ఆటోలకు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా మెప్మా సిబ్బంది ప్రతిరోజు అవగాహన కల్పించాలన్నారు. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ గురించి మున్సిపల్ సిబ్బందితో ఆరాతీశారు. తడి, పొడి చెత్తపై కరపత్రాలు, ఆటోల ద్వారా మైక్ అనౌన్స్మెంట్, ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. పట్టణంలోని డీఆర్ఎసీసీ సెంటర్ను పరిశీలించి సేకరించిన చెత్త రీసైక్లింగ్ ప్రక్రియపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ రోడ్డులో ఉన్న బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో చెట్లను నాటి నీరు పోశారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థినులకు 100 రోజుల ప్రణాళిక– స్వచ్ఛ భారత్ అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వార్డు ఆఫీస ర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయి లు వసూలు చేయడంతోపాటు 100 శాతం పన్ను లు వసూలయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో భూత్పూర్ ఏఆర్ఐ
భూత్పూర్: మండల అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఏఆర్ఐ) బాలసుబ్రమణ్యం రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కప్పెట గ్రామానికి చెందిన వ్యక్తి సాకలి ఆంజనేయులు తన చెల్లికి ఇటీవల పెళ్లి చేశాడు. అయితే కల్యాణలక్ష్మి పత్రాల ఎంకై ్వరీ కోసం ఎంఆర్ఐ బాలసుబ్రమణ్యం మొదట రూ.8 వేల లంచం డిమాండ్ చేసి.. తర్వాత రూ.4 వేలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం ఏఆర్ఐ బాలసుబ్రమణ్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తూ.. మార్గమధ్యంలో సాకలి ఆంజనేయులు నుంచి రూ.4 వేలు డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ఏఆర్ఐ బాలసుబ్రమణ్యంను తీసుకొచ్చి విచారించారు. అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. రూ.4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం -
ప్రజారోగ్యం పట్టదా..?
అచ్చంపేట రూరల్: మున్సిపాలిటీల్లో సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులను నయం చేసుకోవడానికి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అచ్చంపేట పట్టణంలో 20 వార్డులు ఉండగా పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు మొక్కుబడి చర్యలు చేపడుతున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికితోడు మున్సిపల్ పరిధిలో ప్రజారోగ్యానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆయా కాలనీల ప్రజలు జ్వరాలతోపాటు వివిధ రకాల జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నా.. బ్లీచింగ్ పౌడర్ చల్లినా.. కనీసం వాసన కూడా రావడం లేదంటున్నారు. దీంతో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. నామమాత్రంగా ఫాగింగ్.. మున్సిపల్ పరిధిలో రెండు ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో కాలనీల్లో దోమల నివారణ కోసం ఫాంగింగ్ చేపట్టాల్సి ఉండగా.. ఒక్క యంత్రంతోనే నెట్టుకొస్తున్నారు. అదికూడా నామమాత్రంగానే ఫాగింగ్ చేస్తున్నారని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ముసురు వర్షానికి దోమలు వృద్ధి చెంది ఇళ్లలోకి వస్తున్నాయని, దీంతో దోమకాటు వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం జ్వరాల తీవ్రత పెరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. చాలా ఏళ్ల కిందట ఫాగింగ్ యంత్రాలను కొనుగోలు చేయడం, ఆధునిక సాంకేతిక పద్ధతులపై మున్సిపల్ అధికారులు ఆలోచన చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో పెరిగిన జనాభా దృష్ట్యా మరికొన్ని యంత్రాలను కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయా కాలనీల ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫోన్లు చేస్తేనే ఫాగింగ్ చేస్తున్నారని, బాధ్య తగా పని చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత.. ప్రజారోగ్యానికి కొంత నిధులను వెచ్చిస్తున్నా.. ఆ స్థాయిలో వసతులు సమకూర్చడం లేదు. ఫలితంగా నిధులు వృథా అవుతున్నాయి. ఫాగింగ్ చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది అంటూ లేరు. పారిశుద్ధ్య పనులు చేయించే వారితోనే ఫాగింగ్ చేయిస్తున్నారు. దీనికితోడు దోమల నిర్మూలన కోసం ప్రస్తుతం ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ వంటి సంప్రదాయ పద్ధతులనే అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏఐ ఆధారిత సెన్సార్లతో దోమల ఉత్పత్తి, సాంధ్రతను గుర్తించి డ్రోన్ల సాయంతో మందు పిచికారీ చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజారోగ్యం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు చేపడతాం.. అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో రెండు ఫాగింగ్ యంత్రాలు ఉండగా.. ఒకటి మరమ్మతుకు గురైంది. దీంతో ఒక్క యంత్రంతోనే ఆయా కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నాం. అలాగే పట్టణంలోని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఆ దిశగా చర్యలు చేపడుతాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న పట్టణ ప్రజలు దోమల విజృంభణతో ఇబ్బందులు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్న యంత్రాంగం ఆధునిక సాంకేతిక పద్ధతులపై దృష్టిసారించని అధికారులు -
10 నుంచి మెగా సర్జికల్ క్యాంపు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ నెల 10 నుంచి మూడో విడత మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించనున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపులో భాగంగా 12 రకాల శస్త్రచికిత్సలు చేస్తామని, నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. క్యాంపు ఈ నెల 6 నుంచి నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాలతో మార్పు చేశామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు, పేర్లు నమోదు చేసుకోవడానికి వైద్యులు మహేష్ (95539 96060), శార్లీ ఆంటోని (86399 71676)లను సంప్రదించాలని సూచించారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 1,250 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 841 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వ కు 1,080 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 763 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ , రిజిస్ట్రార్ రమేష్బాబు, మధుసూదన్రెడ్డి, అర్జున్కుమార్, జావిద్ఖాన్, నాగసుధ, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు కొల్లాపూర్లో డిప్యూటీ సీఎం పర్యటన
నాగర్కర్నూల్/ కొల్లాపూర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కొల్లాపూర్లో పర్యటించి.. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ చేపడుతారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ముందుగా ఉదయం 8 గంటలకు భట్టి విక్రమార్క హైదరాబాద్ బేగంపేటలో ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావికి చేరుకుంటారన్నారు. అక్కడ 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించి.. 11.30 గంటలకు వెల్టూరు గ్రామానికి చేరుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం 12.15 గంటలకు కొల్లాపూర్కు చేరుకొని పాన్గల్, జమ్మాపూర్, మైలారం, వెన్నచెర్ల, మరికల్, మాచుపల్లి, పస్పులలో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాల శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. అలాగే పలువురు రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, రేషన్కార్డులు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి సోమశిలలో బసచేస్తారు. అక్కడే నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా కొల్లాపూర్లోని రాజా బంగ్లా వద్ద కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సభా వేదిక ఏర్పాట్లను స్థానిక నాయకులు పర్యవేక్షించారు. -
టీచర్లకు తీపికబురు
●నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం నిలిచిన డిప్యూటేషన్లు.. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్నగర్లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. వివరాలు సేకరిస్తున్నాం.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. మండల విద్యా శాఖ నుంచి వివిధ కేటగిరీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది సేకరించి పరిశీలిస్తున్నాం. సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేసి ప్రకటిస్తాం. చాలామంది పదవీ విరమణ పొందారు. ఆ వివరాలు సేకరించడంలో కొంత ఆలస్యమవుతుంది. సీనియారిటీతోపాటు ఖాళీలను గుర్తిస్తున్నాం. – రమేష్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ అచ్చంపేట: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 వరకు.. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 -
పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు..
మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట బిల్లు అడిగితే స్పందించడం లేదు.. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు. – గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట ● -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన వడ్డేమాన్ రామకృష్ణకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో అధికారులు వచ్చి ఫొటోలు తీసుకొని వెళ్లారు. తీరా బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేసి స్లాబ్ వేయగా.. బిల్లు మాత్రం రాలేదు. అధికారులను సంప్రదిస్తే 600 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఇంటి నిర్మాణం ఉండటంతో బిల్లు రావడం లేదని చెప్పారు. దీంతో చేసేది లేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశారు. ప్రభుత్వం తనకు బిల్లు మంజూరు చేయాలని రామకృష్ణ వేడుకుంటున్నారు. ● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం -
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
కిరాయిదారుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ తర్వాత అర్హుల లెక్క తేల్చేందుకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పూర్తిస్థాయిలో వడపోసింది. విచారణ అనంతరం ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాను రూపొందించింది. మొదటి దశలో సొంతస్థలాలు ఉన్న దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. అయితే పక్కా భవనంలో అద్దెకుంటున్న వారిని లబ్ధిదారులుగా గుర్తించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇల్లు లేకనే అద్దెకు ఉంటున్నామని.. మేం ఎలా అర్హులం కాదో చెప్పాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అర్హుల జాబితాలో చేర్చి.. చివరలో మొండిచేయి చూపడంతో పలువురు నానాతంటాలు పడుతున్నారు. ఎలాగూ వస్తుందని భావించి ఇళ్లు కూల్చుకున్న వారు నరకయాతన అనుభవిస్తున్నారు. అటు రద్దు.. ఇటు లేఖలు.. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో 600కు మించి ఎక్కువ ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్న పలువురి ప్రొసీడింగ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని చోట్ల పునాది వరకు 600 ఎస్ఎఫ్టీలకు మించి ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టినా.. స్లాబ్లెవల్ 600కు మించకుండా చూస్తామని లబ్ధిదారుల నుంచి రాత పూర్వక లేఖలు తీసుకున్నారు. ఇందులో కొందరికి మొదటి విడత బిల్లులు చెల్లించగా.. మరికొందరికి రాలేదు. ఉమ్మడి పాలమూరులో ఒక్కో జిల్లాకు ఒక్కో రీతిలో అధికారులు వ్యవహరిసుండడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందనే ఆలోచనతో చాలా మంది నిర్మాణాలు చేపట్టకుండా వేచిచూస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
ఉల్లాస్తో ఉజ్వల భవిష్యత్
అచ్చంపేట రూరల్: జిల్లాలో గ్రామీణ జనాభే అధికం. అయితే వీరందరిని అక్షరాస్యులుగా మార్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కార్యాచరణ అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించే పనిలో గ్రామీణాభివృద్ధి, విద్య, వయోజన విద్య శాఖలు నిమగ్నమయ్యాయి. మొదట పల్లెలు, పట్టణాల్లో వివరాలను వీఓఏలు, ఆర్పీల ద్వారా సేకరించి.. సమాచారాన్ని ఉల్లాస్ యాప్లో పొందుపరుస్తారు. 14 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల వయస్సు, చిరునామా, బ్యాంకు అకౌంట్, సెల్ నంబర్లు, సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వివరాలను సేకరించి యాప్లో పొందుపరిచేందుకు మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వలంటీర్లతో వారందరికీ చదువు నేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా చర్యలు మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులను గుర్తిస్తున్న అధికారులు ప్రత్యేకంగా యాప్ రూపొందించిన ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్న గ్రామీణ అభివృద్ధి, విద్య, వయోజన విద్య శాఖలు జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన శిక్షణ తరగతులు చెంచుపెంటలు, తండాలపై దృష్టి.. గ్రామాలు, పట్టణాల్లో 14 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నాం. వారి సమాచారాన్ని ఉల్లాస్ యాప్లో పొందుపరిచేందుకు, విద్య నేర్పించేందుకు వలంటీర్లను నియమించాం. కార్యాచరణ మొదలు పెట్టి అందరిని అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రత్యేకంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన చెంచుపెంటలు, గిరిజన తండాల్లో ఐటీడీఏ సహకారంతో ప్రత్యేక దృష్టిసారించి.. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో పకడ్బందీగా అమలు చేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, వయోజన విద్య శాఖ ఉపసంచాలకులు, ఉమ్మడి మహబూబ్నగర్ -
అక్కమహాదేవి గుహలకు టూరిజం బోట్లు తిప్పాలి
దోమలపెంట: బ్రహ్మగిరి (దోమలపెంట) దిగువన ఇన్క్లైండ్ టన్నెల్ ప్రాంతం నుంచి కృష్ణానదిలోని అక్కమహాదేవి గుహలకు సందర్శకులు రాకపోకలు సాగించడం కోసం టూరిజం బోట్లు తిప్పేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీశైలంలో జరుగుతున్న వెలమ సంఘం సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారావును గురువారం బ్రహ్మగిరి ప్రాంతంలో ఉన్న పర్యాటక శాఖ అతిథి గృహం హిల్టాప్ వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు మోయిజ్, సిరాజ్, రసూల్, జోషి తదితరులు కలిసి బోట్లు తిప్పాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ పక్క రాష్ట్రం ఏపీ వారు బోట్లు తిప్పుతుంటే మీరెందుకు ఆపారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వెంటనే బోట్లు తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానిక నాయకులు మంత్రి జూపల్లితో పాటు వచ్చిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారావును ఘనంగా సన్మానించారు. -
రహదారులకు మహర్దశ
ఉమ్మడి జిల్లాలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కీలకమైన రహదారులకు మహర్దశ పట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీటి విస్తరణ కోసం పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. మహబూబ్నగర్, వనపర్తి సర్కిళ్ల వారిగా ఉమ్మడి జిల్లాలోని మొత్తం 41 రోడ్ల విస్తరణ, బలోపేతం చేసేందుకు రోడ్డు, భవనాల శాఖ నిధులు కేటాయించింది. ప్రధానంగా జిల్లాలను అనుసంధానం చేస్తూ కొనసాగుతున్న రహదారులతోపాటు మండలాలు, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్లను విస్తరించనున్నారు. మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం 380.85 కి.మీ., మేర రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.434.19 కోట్లు కేటాయించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో 15 రోడ్లను ప్రభుత్వం డబుల్ రోడ్లుగా విస్తరించనుంది. మొత్తం 279.16 కి.మీ., మేర రహదారులను విస్తరించాల్సి ఉండగా ఇందుకోసం రూ.399.34 కోట్లు మంజూరు చేసింది. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో.. జోగుళాంబ గద్వాలలోని ఎర్రిగెర– అయిజ– అలంపూర్ రోడ్డు (బల్గెర, మిట్టిదొడ్డి, తుమ్మపల్లి, శాంతినగర్, కౌకుంట్ల, శ్రీనగర్, కొరివిపాడు, బొంకూర్)ను విస్తరించారు. అలాగే గద్వాల– రంగాపూర్ రోడ్డు, తుంగభద్ర బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, గద్వాల– అయిజ రోడ్డు (బింగిదొడ్డి, అయిజ) రోడ్లను మెరుగుపరచనున్నారు. ● మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి– జడ్చర్ల వయా బిజినేపల్లి రోడ్డు, మహబూబ్నగర్– మంగనూర్ రోడ్డు, మహబూబ్నగర్– నవాబుపేట రోడ్డు, వేపూర్ జెడ్పీ రోడ్డు నుంచి కొమ్మిరెడ్డిపల్లి వయా షేక్పల్లి, కురుమూర్తిరాయ టెంపుల్ రోడ్డు, గుడిబండ– తిరుమలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ రోడ్డు వయా మల్కాపూర్, మణికొండ రోడ్డు, జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్తమొల్గర రోడ్డు, రాజాపూర్– తిరుమలాపూర్, మరికల్– మిన్సాపూర్ రోడ్డు, మక్తల్– నారాయణపేట వయా లింగంపల్లి రోడ్లను పునరుద్ధరించనున్నారు. వనపర్తి సర్కిల్ పరిధిలో.. వనపర్తి– జడ్చర్ల వయా వట్టెం, తిమ్మాజిపేట రోడ్డు, బల్మూరు– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్, అచ్చంపేట– రాకొండ వయా ఉప్పునుంతల రోడ్డు, పెంట్లవెల్లి– వనపర్తి వయా శ్రీరంగాపూర్, అమ్రాబాద్– ఇప్పలపల్లి రోడ్డు, వనపర్తి– ఆత్మకూర్, ఆత్మకూర్– మరికల్ రోడ్డు, వనపర్తి– బుద్దారం రోడ్డు, చిన్నంబావి– చెల్లెపాడు రోడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. అలాగే బల్మూర్– నాగర్కర్నూల్ వయా గోదల్, తుమ్మన్పేట్ రోడ్డు, అచ్చంపేట– రాకొండ, పెంట్లవెల్లి– వనపర్తి రోడ్లను డబుల్గా విస్తరించనున్నారు. నిధులు మంజూరయ్యాయి.. ఉమ్మడి జిల్లాలోని రెండు ఆర్అండ్బీ సర్కిళ్ల పరిధిలో రోడ్ల విస్తరణ, బలోపేతం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైబ్రిడ్ ఆన్యూటీ పద్ధతిలో ఈ పనులను త్వరగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రధానమైన రోడ్లకు డబుల్ లేన్లు, మిగతా రోడ్లను బలోపేతం చేసేందుకు త్వరలోనే పనులు మొదలవుతాయి. – దేశ్యానాయక్, ఆర్అండ్బీ ఈఈ, నాగర్కర్నూల్ మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో 380.85 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి రూ.434 కోట్లు వనపర్తి సర్కిల్లో 15 రోడ్ల నిర్మాణానికి రూ.399.34 కోట్లు మంజూరు హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో పనులు చేపట్టేందుకు చర్యలు జిల్లాలు, మండలాలు, గ్రామాల కనెక్టింగ్ రోడ్లకు ప్రాధాన్యం -
‘లక్ష్యం మేరకు మొక్కలు నాటండి’
చారకొండ: వన మహోత్సవం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టి మండలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని డీఆర్డీఓ చిన్న ఓబులేసు అన్నారు. మండలంలోని జూపల్లిలో బుధవారం పర్యటించిన ఆయన వృద్ధ్యాప పెన్షన్లు అందిస్తున్న పోస్టాఫీను తనిఖీ చేశారు. పోస్టాఫీస్ సేవలు పునరుద్ధరణ సందర్భంగా లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. గతంలో వేలిముద్రతో పింఛన్ పొందే వృద్ధులకు మరింత సులభతరంగా ఐరిస్ ద్వారా సేవలు అందుతున్నాయని తెలిపారు. నూతన సాఫ్ట్వేర్ పనిచేసే విధానంపై బీపీఎంను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి, రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో నర్సరీని, రహదారి వెంట, కమ్యూనిటీ స్థలాల్లో నాటిన మొక్కలను ఏపీఓ, ఉపాధి అధికారులతో కలిసి పరిశీలించారు. మొత్తం 60 వేల మొక్కలు నాటడంతో పాటు ఇళ్లకు 30 వేల మొక్కలు అందించాలని తెలపారు. కార్యక్రమంలో ఏపీఓ లక్ష్మయ్య, బీపీఎం దేవేందర్, ప్రాథమిక ఉపకేంద్రం వైద్యురాలు ప్రియాంక, ఉపాధి అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
‘రంగసముద్రం’ నీటిని వదలాలి
వనపర్తి రూరల్: రంగసముద్రం రిజర్వాయర్ నుంచి భీమా కాల్వ ద్వారా వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. సాగునీరు విడుదల చేయడం లేదని ఆయా మండలాల రైతులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో బుధవారం ఆయన శ్రీరంగాపురంలోని రంగ సముద్రం జలాశయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ సాగునీరు ఎందుకు వదలడం లేదని అధికారులను ప్రశ్నించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని.. రోజువారీగా ఎంత నీరు విడుదల చేస్తున్నారో లాగ్బుక్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈ కేశవరావు, డీఈలు కిరణ్కుమార్, రాజ్కుమార్, ఏఈఈ వినయ్కుమార్, ఏఈ అక్షయ్కుమార్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం..
ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. -
వసతుల లేమితో కాన్పులు చేయలేకపోతున్నాం..
వెల్దండ: మండల కేంద్రంలో తాత్కాలికంగా కొనసాగుతున్న పీహెచ్సీ భవనంలో వసతులు సరిగా లేకపోవడంతో కాన్పులు చేయలేకపోతున్నామని వైద్యులు డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మికి వివరించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని బుధవారం డీఎంహెచ్ఓ పరిశీలించారు. పీహెచ్సీ భవనం శిథిలావస్థ చేరడంతో మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.40లక్షలు కేటాయించడంతో పనులను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా.. పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశాకార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్, డాక్టర్ సింధు, మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు. -
డీడీగా సత్యనారాయణ
కల్వకుర్తి రూరల్: పాడి పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా సత్యనారాయణయాదవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ధనరాజ్ బదిలీపై హెడ్ ఆఫీస్కు వెళ్లారు. సత్యనారాయణ డీడీ గతంలో ఐదేళ్ల పాటు విధులు నిర్వహించి జనగాం కు బదిలీపై వెళ్లారు. అక్కడ ఏడాది పాటు బాధ్యతలు నిర్వహించి తిరిగి నాగర్కర్నూల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు ఆయనను సన్మానించారు. పాల శీతలీకరణ కేంద్రం మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు సమస్య లేకుండా చూడడంతో పాటు వారికి మేలు చేసే చర్యలు చేపట్టాలని కోరారు. -
పెండింగ్లో ఉన్నవాటికి మోక్షం..
ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారుల విస్తరణ, మరమ్మతు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు మాత్రమే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలను ఒక దానితో మరొకటి అనుసంధానిస్తూ ఉన్న ఆర్అండ్బీ రోడ్లు, మండల కేంద్రాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్ల విస్తరణతోపాటు మరమ్మతుకు సైతం నోచుకోవడం లేదు. సుమారు ఐదేళ్లకుపైగా ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు లేకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే కనెక్టింగ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిని, కంకర తేలి దర్శనమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆర్అండ్బీ రోడ్ల విస్తరణ, మరమ్మతుకు నిధులను మంజూరు చేయడంతో ఈ రోడ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. -
డీడీగా సత్యనారాయణ
కల్వకుర్తి రూరల్: పాడి పరిశ్రమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా సత్యనారాయణయాదవ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ధనరాజ్ బదిలీపై హెడ్ ఆఫీస్కు వెళ్లారు. సత్యనారాయణ డీడీ గతంలో ఐదేళ్ల పాటు విధులు నిర్వహించి జనగాం కు బదిలీపై వెళ్లారు. అక్కడ ఏడాది పాటు బాధ్యతలు నిర్వహించి తిరిగి నాగర్కర్నూల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు ఆయనను సన్మానించారు. పాల శీతలీకరణ కేంద్రం మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు సమస్య లేకుండా చూడడంతో పాటు వారికి మేలు చేసే చర్యలు చేపట్టాలని కోరారు. -
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
ఉప్పునుంతల: వైద్యులు ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం చేసే వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. బుధవారం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదగా మెలగాలని సూచించారు. మందుల స్టాక్ వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్వప్న, శివలీల, నర్సింగ్ ఆఫీసర్ ఉఫత్, నిర్మల, ఫార్మసిస్టు కుమారచారి ఉన్నారు. పీఏసీఎస్ తనిఖీ ఉప్పునుంతల: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)ను బుధవారం నాబార్డు అధికారులు శ్రీనివాస్రావు, స్వప్నిల్ తనిఖీ చేశారు. 2025 మార్చి 31వ తేదీ వరకు గత ఆర్థిక సంవత్సరంలో కొనసాగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. అదేవిధంగా వడ్డీ రిబేట్కు సంబంధించి రైతుల ఖాతాలో జమచేసిన అంశాలను పరిశీలించారు. పంట, దీర్ఘకాలిక, ఇతర రుణాలు, రికవరీకి సంబంధించిన రికార్డులను చూశారు. పీఏసీఎస్లోని రికార్డు గది, లాకర్ రూం, ఎరువుల నిల్వ గోదాంలను వారు పరిశీలించారు. సంబంధించిన వివరాలను పీఏసీఎస్ చైర్మన్ సత్తు భూపాల్రావు, సీఈఓ రవీందర్రావుల ను అడిగి తెలుసుకున్నారు. నాబార్డు అధికారులు, డీసీసీబీ ఏజీఎంలు దయాకర్రెడ్డి, భూపా ల్రెడ్డి, మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు. ‘వన్య ప్రాణులకుహాని తలపెట్టొద్దు’ మన్ననూర్: వన్యప్రాణుల బారిన పడి మృత్యువాత పడిన పశువుల యజమానులకు అటవీశాఖ తరుఫున ప్రతి ఏటా నష్ట పరిహారం చెల్లిస్తున్నామని మన్ననూర్ అటవీశాఖ అధికారి (ఎఫ్ఆర్ఓ) వీరేశం తెలిపారు. అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం పూర్తిగా వన్య ప్రాణులకు ఆవాసాలుగా గుర్తించినట్లు తెలిపారు. అయినప్పటికీ దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలోని అటవీ సమీప గ్రామాల్లో నివాసం ఉంటున్న రైతులు పాడి పశువులను మేత కోసం అడవిలోకి వెళ్తుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ పరిసర ప్రాంతంలో పెద్ద పులులు, చిరుతలు పశువుల మీద దాడి చేసి చంపేసి తింటాయి. ఈ క్రమంలో పశువుల యజమానులకు నష్ట పరిహారంగా 2020–21లో 30 మందికి, 2022–23లో 50 మందికి, 2023–24లో 77 మందికి 2024–25లో ఇప్పటి వరకు 43 మందికి నష్ట పరిహారంగా డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. పశువులను నష్టపోయిన వారికి పరిహారం అందజేస్తున్నామని, ఎట్టి పరిస్థితిలో వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా ఉండాలని ఆయన రైతులకు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరులోని ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థా యి అండర్–11 విభాగం బాలబాలికల బ్యా డ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ఎంపికల్లో గెలుపొంది న వారికి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్ మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొంంటారని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ గోపాల్, సీనియర్ క్రీడాకారుడు సయ్యద్ పాల్గొన్నారు. కాగా..బాలుర సింగిల్స్లో అర్విన్ భాస్కర్ (ప్రథమ), విహాన్ (ద్వితీయ), బాలికల్లో డి.శ్రీహాస (ప్రథమ), లాస్యశ్రీ (ద్వితీయ), బాలుర డబుల్స్లో ఎస్.విహాన్–విశ్వతేజ, బాలికల డబుల్స్లో ఆద్య–అనుశ్రీలను ఎంపిక చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి
కందనూలు: రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో జరుగుతున్న విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాగర్కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ గురుకుల పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ శనివారం రాత్రి మహాత్మాజ్యోతిరావూ పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్ కారణంగా 110 విద్యార్థులు అస్వస్థతకు గురైతే అధికారులు గాని, ప్రభుత్వం గాని ఎలాంటి విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో 94 మంది విద్యార్థులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనకు తరలించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, పాలమూరు విభాగ్ కన్వీనర్ నరేష్ తేజ, రాష్ట్ర కార్యసమితి సభ్యులు సౌమ్య, అర్జున్, శివశంకర్, బంగారుబాబు, శంతన్, ప్రశాంత్, కల్వకుర్తి నగర కార్యదర్శి వంశీ, అనిల్, సాయి, భరత్, మల్లేష్ యాదవ్, ప్రసాద్ కుమార్, భాను, కీర్తన, కృష్ణవేణి, గాయత్రి, పల్లవి పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం నిండా ముంచేస్తోంది!
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కృష్ణానది పరివాహక ప్రాంతాలు, వాగులు, వంక ల్లో నీటి ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. వర్షా లతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్రఘునాథ్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కొంద రు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షాలతో నాగర్కర్నూ ల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాల వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వా టిని దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రజలుప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కల్వకుర్తి మండలంలో దుందుభీ నది వాగు దాటేందుకు ప్రయత్నిస్తూ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన చోటుచేసుకుంది. పట్టించుకోని వాహనదారులు వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు వాహనదారులు వాటి దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహం మరి ఎక్కువగా ఉన్నపుడు నదులు, వాగులు దాటొద్దని అఽధికారులు సూచిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రయాణిస్తూ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. పోలీసు నిఘా పెంచాలి ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో కృష్ణానది నిండుకుండలా మారింది. శ్రీశైలం ఆనకట్ట గేట్లు ఎత్తి దిగువనకు నీటిని వదులుతుండటంతో నదితీర అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. శని, ఆదివారాల్లో శ్రీశైలం దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు పర్యాటకులు వస్తుండటంతో వాహనాలను శ్రీశైలం డ్యాం వద్ద పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు నిఘాను పెంచాలని పలువురు కోరుతున్నారు. సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, అమరగిరి నదితీర ప్రాంతాల్లో నీటి ప్రవాహంలో పర్యాటకులు సెల్ఫీ మోజులో, మర పడవల్లో ప్రమాదకర ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు ఇటీవల దుందుభీ నది దాటుతూవ్యక్తి మృతి నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగాఉండాలంటున్న పోలీసులు -
ఎమ్మార్పీకేఎరువులు విక్రయించాలి
నాగర్కర్నూల్: ఎరువులు ఎమ్మార్పీ ధరలకు మంచి అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన ఆస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 2,100 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, మార్క్ఫెడ్ వద్ద మరో 770 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులు మొక్కజొన్నకు ఎకరాకు 5 బస్తాలకు మించి యూరియా వాడకూడదని కోరారు. డీలర్లు యూరియాకు వేరే ఎరువులు లింక్ చేసి అమ్మినా.. కృత్రిమ కొరత సష్టించాలని చూసినా కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజూ పీఏసీఎస్లను తనిఖీ చేయాలని, యూరియా నిల్వలు ఉన్న అన్ని దుకాణాలను ఎరువుల చట్టం పరిధిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల్లో నాగర్కర్నూల్ ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ రాజు తదితరులు పాల్గొన్నారు. నేడు స్పాట్ అడ్మిషన్లు మన్ననూర్: స్థానిక (మన్ననూర్) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో మొద టి సంవత్సరంలో ప్రవేశాల కోసం స్పాట్ అ డ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రూపాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ ఎంపీసీ, బైపీసీలో మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు గురువా రం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు విద్యార్థులు హాజరు కావాలని కోరారు. అర్హత ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి మెమో, గ్రేడ్ (మెరిట్) పరిగణలోకి తీసుకొని ఎంపికై న విద్యార్థులకు అదే రోజు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు 2025 విద్యా సంవత్సరంలో ఒకటే ప్రయత్నంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు. -
రేపు స్పాట్ అడ్మిషన్లు
బిజినేపల్లి/ పెద్దకొత్తపల్లి/ వెల్దండ/ తెలకపల్లి: జిల్లాలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, వెల్దండ, తెలకపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి గురువారం స్పాట్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు సుమతి, అకుల్, స్వర్ణరత్నం, లక్ష్మి మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామన్నారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో పేరు నమోదు చేసుకొని అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో వచ్చి స్పాట్ అడ్మిషన్ పొందాలని సూచించారు. శాంతిభద్రతలపరిరక్షణకే కార్డెన్ సెర్చ్ అచ్చంపేట రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని ఇంద్రానగర్కాలనీలో కార్డెన్సెర్చ్ చేపట్టి.. 71 వాహనాలు సీజ్ చేశామని, ఇందులో 19 వాహనాలు నంబర్ ప్లేట్లు కూడా లేవన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణ అందరి బాధ్యత అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు నాగరాజు, శంకర్, ఎస్ఐలు విజయభాస్కర్, వెంకట్రెడ్డి, గిరిమనోహర్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అసౌకర్యాల ‘వసతి’
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని సంక్షేమ గురుకుల పాఠశాలలు విద్యార్థులకు కాకుండా అసౌకర్యాలకు వసతి కల్పిస్తున్నట్లుగా మారాయి. విద్యార్థులకు కనీసం మెనూ ప్రకారం భోజనం కూడా అందకపోవడం అస్తవ్యస్త నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. మంగళవారం ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ, సాంబర్ బదులుగా చాలాచోట్ల లెమన్ రైస్, కిచిడీ వడ్డిస్తున్నారు. దీనికితోడు నాసిరకం సరుకులతో వంట చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన పరిశీలనలో దుర్భర పరిస్థితులు వెలుగుచూశాయి. జిల్లాలో అస్తవ్యస్తంగా సంక్షేమ గురుకుల హాస్టళ్ల నిర్వహణ ● మెనూ నిర్వహణలో కనిపించని సమయపాలన ● నాసిరకం సరుకులతో వంటలు.. వంట గదుల్లో పరిశుభ్రత కరువు ● టాయిలెట్లు, దుప్పట్లు లేక విద్యార్థుల ఇబ్బందులు ● అధికారుల తీరులో మార్పు తేని ఉయ్యాలవాడ ఘటన ● ‘సాక్షి’ విజిట్లో బయటపడిన దుర్భర పరిస్థితులు -
టాయిలెట్లు సరిపోవడం లేదు..
బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు లేవు. తరగతి గదులు సైతం సరిపోవడం లేదు. ఆటలు ఆడుకునేందుకు ఆటస్థలం కరువైంది. పాఠశాల సొంత భవనాన్ని త్వరగా నిర్మించాలి. – సిద్ధార్థ, 9వ తరగతి, పెద్దకొత్తపల్లి నిత్యం తనిఖీలు చేస్తాం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా మెనూ అమలయ్యేలా చూస్తాం. భోజనం, సౌకర్యాలను మెరుగుపర్చి విద్యార్థులకు ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం నిత్యం పాఠశాలల్లో తనిఖీలు చేపడతాం. ఎప్పటికప్పడు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తాం. – రమేశ్కుమార్, డీఈఓ ● -
గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలి : డీఎంహెచ్ఓ
బిజినేపల్లి: జ్వరం కేసులు ఎక్కువగా నమోదైన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ముందుల నిల్వల గది, ల్యాబ్ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి సహకారంతో దోమల పెరుగుదలను అరికట్టాలని, నీరు నిల్వ లేకుండా చేయాలని, అవసరమైన చోట ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ఇందుకు ఇతర శాఖల సహకారం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీకా నియంత్రణ అధికారి రవికుమార్, వైద్యాధికారి ప్రియాంక, డీపీఓ రేణయ్య, ఎంపీహెచ్ఐఓ రాజేష్, ఎల్సిదాయా తదితరులు పాల్గొన్నారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా దానిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 13లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చెంచులకు అందుబాటులో పోస్టల్ సేవలు మన్ననూర్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని ఆదివాసీ చెంచులకు పోస్టల్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న తెలిపారు. మంగళవారం నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్, భౌరాపూర్, రాంపూర్, పుల్లాయిపల్లి, ఈర్లపెంట, మేడిమల్కల తదితర పెంటలను సందర్శించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులకు పోస్టల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో విచారణ కోసం పంపించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో సుమారు 3 వేల జనాభా కు ఒక బ్రాంచ్ ఆఫీస్ కొనసాగించడానికి అవ కాశం ఉంటుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి చెంచు గ్రామాలు, పెంటలు, గూడేలలో 1,500 జనాభా ఉంటే బ్రాంచ్ ఆఫీస్ కొనసాగించే అవకాశం ఉన్నందున ఈ పెంటలను పరిశీలించామని చెప్పారు. ఈ క్రమంలో లోతట్టు పెంటలను కలుపుకొని అప్పాపూర్లో బ్రాంచ్ పోస్టాఫీసు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ రవికుమార్, బీపీఎం నిరంజన్, మాజీ సర్పంచ్ బాలగురువయ్య, జానకిరాం, చెంచు యువకులు తదితరులు పాల్గొన్నారు. -
పులుల మనుగడతోనే అడవుల సంరక్షణ
మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు డివిజన్ ఆధ్వర్యంలో మన్ననూర్లోని ఎఫ్డీఓ కార్యాలయం అధికారుల సమక్షంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట డివిజన్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పెద్దపులి బ్యానర్ ప్రదర్శిస్తూ గ్రామంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా అడవులను రక్షంచుకుందాం.. పులుల మనుగడతోనే సంరక్షణ.. పుడమికి ఆధారం అనే నినాదాలతో సఫారీ వాహనాలతో ప్రధాన రహదారి వెంట దుర్వాసుల చెరువు చెక్పోస్టు వద్దకు ర్యాలీగా వెళ్లారు. అంతకు ముందు తుర్కపల్లి బేస్ క్యాంపు వద్ద మొక్కలు నాటారు. నీటి ఆధారిత ప్రాంతాలతోపాటు ప్రధాన రహదారి వెంట దుర్వాసుల చెరువు నుంచి వటువర్లపల్లి, దోమలపెంట వరకు వన్యప్రాణులకు అతి ప్రమాదకరమైన ప్లాస్టిక్ను సేకరించారు. అలాగే ఏడాది కాలంగా విధుల నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించి అడవులు, వన్యప్రాణుల అభివృద్ధి, ప్లాస్టిక్ నివారణకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎఫ్డీఓ రామ్మోహన్, ఎఫ్ఆర్ఓలు వీరేష్, దేవరాజ్, గురుప్రసాద్, మక్బూల్, మహేందర్, ఎఫ్ఎస్ఓలు, బీఎఫ్ఓలు, వాచర్లు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలకు అవార్డు లింగాల: అటవీ సంరక్షణ, పులుల రక్షణలో చేసిన ఉత్తమ సేవలకు గాను లింగాల అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ ఖాదర్పాష ప్రత్యేక అవార్డు అందుకున్నారు. గ్లోబల్ టైగర్ డే–2025 సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ బీట్ ఆఫీసర్కు అవార్డు ప్రదానం చేశారు. ఎఫ్ఆర్వో ఈశ్వర్, సహచర ఉద్యోగులు అవార్డు అందుకున్న బీట్ ఆఫీసర్ను అభినందించారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
నాగర్కర్నూల్: గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో పీఎంశ్రీ పథకంలో ఉత్తమ పాఠశాల ఎన్నిక కాబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశానికి హెచ్ఎం శ్రీలత అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని విద్యాహబ్గా మారుస్తానన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో అధ్యాపకుల పాత్ర, కృషి ఎంతో ఉంటుందన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తనకు ఘన స్వాగతం పలికే సందర్భం చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని వారిని అభినందించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని కోరారు. పాఠశాలల బలోపేతంతోపాటు ఉపాధ్యాయుల కొరత తీర్చడంతోపాటు పదోన్నతులు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, డీఈఓ రమేష్బాబు, డీఐఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలి..
మాకు సర్వే నంబర్ 85/7లో మూడెకరాల లావుణి పట్టా భూమి ఉంది. భూమిని అక్రమంగా మరొకరు పట్టా చేసుకున్నారు. ఇప్పుడు భూమి మాదేనని అంటున్నారు. మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. – సురవేణి భాగ్యమ్మ, కోనేటిపూర్, వంగూరు మండలం ఫైళ్లు లేవు.. కోనేటిపురంలో అసైన్డ్ ల్యాండ్పై కొత్త పట్టాపాసుపుస్తకాలు పొందినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై ఎలాంటి సమాచారం, ఫైళ్లు అందుబాటులో లేవు. ఉన్నతాధికారులకు నివేదించాం. దీనిపై విచారణ చేపట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – మురళీకృష్ణ, తహసీల్దార్, వంగూరు మండలం ● -
బీజేపీలో రగడ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 నుంచీ కోల్డ్వార్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది. అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2019 ఏప్రిల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెతోపాటు శాంతికుమార్ టికెట్ ఆశించారు. బీజేపీని గెలిపించాలని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఆమె ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇక 2024 ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గు చూపగా.. ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్కు టికెట్ వచ్చినట్లే వచ్చి చివరలో చేజారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో జరిగిన పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు శాంతికుమార్ కుట్ర చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి పనిచేయకుండా రాజీనామా చేసిన వారిని ఆయన సమావేశానికి తీసుకొచ్చారని.. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. తాము ఎవరి వర్గం కాదని.. పార్టీకి రాజీనామా చేసిన వారు సమావేశానికి రావడంతో ప్రశ్నించినట్లు కొందరు చెబుతున్నారు. ఇదే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్, గద్వాలలో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో విసిగి ఇద్దరు, ముగ్గురు ముఖ్య నేతలు పార్టీని వీడారని ఆరోపిస్తున్నారు. పాలమూరులో బీజేపీ బలోపేతానికి శాంతికుమార్ ఎంతో కష్టపడ్డారని.. ఆయనకు రెండు సార్లు ఎంపీ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని.. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన సమక్షంలో జరిగిన ఈ ఘటనను ఖండించకపోవడం.. తన ప్రసంగంలో శాంతికుమార్ పేరును ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్లో బీజేపీ ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన ఎంపీ డీకే అరుణ, శాంతికుమార్ అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఎదుటే బాహాబాహీకి దిగారు. శాంతికుమార్ను వేదికపై రాకుండా డీకే వర్గం యత్నించడంతోపాటు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా శాంతికుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన అనుచరులు నినదించారు. ఈ క్రమంలో పలువురు నాయకులు కలుగుజేసుకుని గొడవ సద్దుమణిగించారు. ఆ తర్వాత డీకే అరుణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఓడించేందుకు పనిచేశారని.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పరోక్షంగా శాంతికుమార్ను ప్రస్తావిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు. ఈ పరిణామాలతో శాంతికుమార్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. అరుణ శాంతికుమార్ బీసీ సంఘాల ఆగ్రహం..బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్ను డీకే అరుణ అవమానించారని.. ఇది తగదంటూ పలు సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ మేధావుల సంఘం, మున్నూరు కాపు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. శ్రేణుల్లో భిన్న స్వరాలు.. గో బ్యాక్ నినాదాలు.. మాటల తూటాలు సీనియర్ల మండిపాటు.. పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత రాంచందర్రావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బహిరంగ సమావేశంలో రచ్చకెక్కడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆదిలోనే కట్టడి చేయాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని.. పార్టీ అధిష్టానం దృష్టిసారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరుతున్నారు. నేతల మధ్య రచ్చకెక్కిన అంతర్గత పోరు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనే బహిర్గతం చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ‘స్థానిక’ ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన -
ఎక్కడా యూరియా కొరత లేదు..
పట్టా మార్పిడికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ పెద్దకొత్తపల్లి: వానాకాలం పంటసాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని.. ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి సింగిల్విండో భవనంలో యూరియా నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మన గ్రోమర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని.. ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పెద్దకొత్తపల్లి మండలంలో 75 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎరువులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డుతో పాటు సాగుచేసిన పంటల వివరాలను నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. రైతులు మోతాదుకు మించి యూరియా వినియోగించొద్దని సూచించారు. డీఏఓ వెంట ఏఓ శిరీష, సహకార సంఘం ఇన్చార్జి రాములు తదితరులు ఉన్నారు.