Nagarkurnool
-
కొల్లాపూర్లో కార్మికుల కొరత
కొల్లాపూర్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధాన కూడళ్లలో తిరుగుతున్న చెత్త సేకరణ వాహనాలు శివారు ప్రాంతాల్లోకి సకాలంలో రాకపోవడంతో ప్రజలు చెత్తను రోడ్లపై పారవేస్తున్నారనే ప్రచారం ఉంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. పట్టణంలో 16 వార్డులకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. మున్సిపల్ అనుబంధ గ్రామాల్లో 4 వార్డులు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో రోజూ 8 టన్నుల మేరకు చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారు. వీటిలో వీటిలో పొడి చెత్త 3.1 టన్నులు, తడి చెత్త 1.8 టన్నులు, మిక్స్డ్ చెత్త 3.9 టన్నుల మేర ఉంటోంది. పొడి చెత్తను 1వ వార్డు, తడి చెత్తను ఈదమ్మబావి వద్ద ఉన్న కంపోస్టు యార్డు, మిక్స్డ్ చెత్తను అమరగిరి వెళ్లే దారిలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే వరిదేల చెరువు కట్టపై, చుక్కాయిపల్లి చెరువుకట్ట సమీపంలో, చౌటబెట్లకు వెళ్లేదారిలో రోడ్డు పక్కనే మున్సిపల్ సిబ్బంది చెత్తను పారబోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్వహణపై దృష్టిసారించాలి కొల్లాపూర్లో చెత్త సేకరణపై అధికారులు దృష్టి సారించాలి. పెంట్లవెల్లికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మురుగుతోపాటు చెత్త మొత్తం రోడ్ల పక్కనే పడుతోంది. ఆ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టిపెట్టి సమస్యకు పరిష్కారం చూపాలి. – వెంకటనర్సింహరెడ్డి, కొల్లాపూర్ ● -
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్ యార్డులు నామమాత్రంగా మారాయి. ప్రధానంగా జిల్లాకేంద్రమైన నాగర్కర్నూల్లో చెత్త సేకరిస్తున్న అధికారులు యథావిధిగా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో పారబోస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి నిర్వహణ చ
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సీబీఎం కళాశాల వెనక భాగంలో రూ.3 కోట్లకు పైగా నిధులతో డీఆర్సీసీ ఏర్పాటు చేసి చెత్తను వేర్వేరుగా రీసైక్లింగ్ చేస్తున్నారు. చెత్త రీసైక్లింగ్ పక్రియను పట్టణంలోని ఎస్హెచ్జీ సభ్యులు చేపడుతున్నారు. మున్సిపాలిటీలోని 11 ఆటోలు, 3 ట్రాక్టర్లు సేకరించిన చెత్తనంతా డీఆర్సీసీకి చేరవేస్తారు. అక్కడ వారంతా చెత్తను రీసైక్లింగ్ చేసి, డబ్బులు సంపాదిస్తూ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పట్టణంలోని 22 వార్డుల నుంచి ప్రతిరోజు 15 మె.ట., చెత్త సేకరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు. చెత్తను రీసైక్లింగ్ చేయడం వల్ల ఎస్హెచ్జీ సభ్యులకు ఒక ఆదాయ మార్గంగా మారింది. చెత్తను ఎక్కడా నిర్లక్ష్యంగా వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతో రీసైక్లింగ్ సైతం సులభంగా ఉంటుంది. భవిష్యత్లో చెత్త ఎక్కువగా వస్తుందన్న ముందు జాగ్రత్తతో అందుకు తగినట్లుగా డీఆర్సీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. – లక్ష్మి, డీఆర్సీసీ సభ్యురాలు, కల్వకుర్తి ఆదాయ మార్గంగా మారింది మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. -
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్ యార్డులు నామమాత్రంగా మారాయి. ప్రధానంగా జిల్లాకేంద్రమైన నాగర్కర్నూల్లో చెత్త సేకరిస్తున్న అధికారులు యథావిధిగా తీసుకెళ్లి డంపింగ్ యార్డులో పారబోస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి నిర్వహణ చ
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సీబీఎం కళాశాల వెనక భాగంలో రూ.3 కోట్లకు పైగా నిధులతో డీఆర్సీసీ ఏర్పాటు చేసి చెత్తను వేర్వేరుగా రీసైక్లింగ్ చేస్తున్నారు. చెత్త రీసైక్లింగ్ పక్రియను పట్టణంలోని ఎస్హెచ్జీ సభ్యులు చేపడుతున్నారు. మున్సిపాలిటీలోని 11 ఆటోలు, 3 ట్రాక్టర్లు సేకరించిన చెత్తనంతా డీఆర్సీసీకి చేరవేస్తారు. అక్కడ వారంతా చెత్తను రీసైక్లింగ్ చేసి, డబ్బులు సంపాదిస్తూ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. పట్టణంలోని 22 వార్డుల నుంచి ప్రతిరోజు 15 మె.ట., చెత్త సేకరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు. చెత్తను రీసైక్లింగ్ చేయడం వల్ల ఎస్హెచ్జీ సభ్యులకు ఒక ఆదాయ మార్గంగా మారింది. చెత్తను ఎక్కడా నిర్లక్ష్యంగా వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంతో రీసైక్లింగ్ సైతం సులభంగా ఉంటుంది. భవిష్యత్లో చెత్త ఎక్కువగా వస్తుందన్న ముందు జాగ్రత్తతో అందుకు తగినట్లుగా డీఆర్సీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. – లక్ష్మి, డీఆర్సీసీ సభ్యురాలు, కల్వకుర్తి ఆదాయ మార్గంగా మారింది మహిళా సంఘాల ఆధ్వర్యంలో.. -
చెత్త‘శుద్ధి’ కరువు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతగానే నిర్వహణ ● తడి, పొడి చెత్తను వేరు చేయడంలో వీడని నిర్లక్ష్యం ● నామమాత్రంగా మారిన డంపింగ్ యార్డులు ● శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా కాల్చివేత ● ఆదాయం కోల్పోతున్న పురపాలికలు నాగర్కర్నూల్ శివారు డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ డబ్బాలు అచ్చంపేట రూరల్: పట్టణం విస్తరిస్తోంది. జనాభా పెరుగుతోంది.. ప్రజల అవసరాలు పెరిగి.. చెత్త, వ్యర్థాల లభ్యత అధికమైంది. కానీ, అందుకు తగ్గట్టుగా డంపింగ్ యార్డు సామర్థ్యం మాత్రం పెరగడం లేదు. అచ్చంపేట నగర పంచాయతీగా ఉన్నప్పుడే పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చౌటపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. పట్టణం నుంచి సుమారు 7 టన్నుల చెత్త 9 మినీ ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరించి చౌటపల్లి శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే తడి, పొడి చెత్త కలిపి సేకరిస్తుండగా.. ఎరువుగా మార్చే ప్రక్రియ చేపట్టడం లేదు. పైగా చెత్తను కాల్చివేస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తడి చెత్తను వర్మీ, విండ్రో కంపోస్టు ఎరువుగా మార్చి మున్సిపల్ పరిధిలో పెంచుతున్న ప్రకృతి వనాల్లో మొక్కలకు ఎరువుగా వినియోగించవచ్చు. కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అమలు కావడం లేదు. అలాగే స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నా... కిందిస్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. అచ్చంపేట మున్సిపాలిటీలో స్థానిక అధికారులు, సిబ్బంది ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఒక దశలో అధికారులకే ఎదురు ప్రశ్నలు వేస్తుండటంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నా.. జరిమానాలు విధించిన దాఖలాలు లేవు. పట్టణ జనాభాకు అనుగుణంగా చెత్త సేకరణకు ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు అన్ని కాలనీల్లో చెత్త సేకరణ చేసి తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు పంపుతున్నాం. ప్రతిరోజు సుమారు 7 క్వింటాళ్లకు పైగా తడి, పొడి చెత్త వస్తుంది. కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నాం. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేటఅచ్చంపేట డంపింగ్ యార్డులో నిల్వ ఉంచిన చెత్త -
నేరుగా డంపింగ్ యార్డుకే..
నాగర్కర్నూల్: జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ బాగానే ఉన్నా.. డంపింగ్ యార్డు నిర్వహణలో మాత్రం అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకేంద్రం శివారులోని చందాయపల్లి శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో ఉదయం, సాయంత్రం 9 ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా ఇంటింటి తిరగడంతోపాటు ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల నుంచి రోజువారిగా దాదాపు 40– 50 క్వింటాళ్ల చెత్త సేకరిస్తున్నారు. ఈ చెత్తను చందాయపల్లి శివారులో ఉన్న డంపింగ్ యార్డు తరలిస్తారు. అయితే ప్లాస్టిక్ కూడా కలిపి ఒకేచోట డంపింగ్ చేస్తున్నారు. మిషన్ లేకపోవడంతో.. మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ కాల్చి వేయకుండా రీ సైక్లింగ్ చేయాల్సి ఉంది. కానీ, రీసైక్లింగ్ మిషన్ లేకపోవడంతో ప్లాస్టిక్ను సైతం అలాగే వదిలేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ఏరుకునే వారు తీసుకుపోగా.. మిగిలింది అక్కడే కాల్చేస్తున్నారు. మున్సిపల్లో రీ సైక్లింగ్కు నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రీ సైక్లింగ్ చేస్తే దాని ద్వారా కూడా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా.. దీనిపై అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదు. యార్డులోనే వదిలేస్తున్నాం.. ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసే మిషన్ మన దగ్గర అందుబాటులో లేదు. ఒకవేళ రీ సైక్లింగ్ చేయాలంటే దీనికి ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసి అనంతరం మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్లాస్టిక్ను డంపింగ్ యార్డులోనే వదిలేస్తున్నాం. చెత్తను ఏరుకునేవారు, మున్సిపల్ సిబ్బంది వాటిని తీసుకెళ్తున్నారు. మున్సిపాలిటీలో నిధుల కొరతతో రీ సైక్లింగ్ మిషన్ ఏర్పాటు చేయలేదు. – నరేష్బాబు, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్ -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
చారకొండ/ తిమ్మాజిపేట: వచ్చే వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. సోమవారం చారకొండ, జూపల్లిలోని జెడ్పీహెచ్ఎస్, తిమ్మాజిపేటలోని కేజీబీవీలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. బాలిక విద్య బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే కేజీబీవీల్లో బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో కాదు, మీ లక్ష్యం ఎంత గొప్పదో దాని కోసం ఎంత కృషి చేస్తున్నారో అదే నిజమైన విజయాన్ని నిర్దేశిస్తుందన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు హాల్టికెట్లు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అంతకు ముందు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు నేర్చుకునే ఎఫ్ఎల్ఎన్, ఎక్సెల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్ను డీఈఓ సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో చారకొండ ఎంఈఓ ఝాన్సీరాణి, ఏఎంఓ షర్ఫుద్దీన్, చారకొండ హెచ్ఎం భగవాన్రెడ్డి, తిమ్మాజిపేట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శోభారాణి, జిల్లా టెస్టుబుక్ మేనేజర్ నర్సింహ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటుతాం
కందనూలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాదగోని శ్రీనివాస్గౌడ్, సహ రిటర్నింగ్ అధికారులు బుసిరెడ్డి సుధాకర్రెడ్డి, మొగిలి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి కోసం దొడ్ల రాజవర్ధన్రెడ్డి, వేముల నరేందర్రావు, రాఘవేందర్గౌడ్, పొల్దాస్ రాము, బల్మూరి జానకి తదితరులు నామినేషన్లు అందజేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మొగిలి దుర్గాప్రసాద్, మాయని శ్రీశైలం, మొక్తాల రేణయ్య, సందు రమేష్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పార్టీ నియమాల ప్రకారం జిల్లా అధ్యక్షుడి ఎంపిక చేయడం కోసం నామినేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు. బీజేపీ జిల్లాలో సంస్థాగతంగా బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై త్వరలో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నరేందర్రావు సాక్షి, నాగర్కర్నూల్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్రావును పార్టీ అధిష్టానం సోమవారం నియమించింది. జిల్లాలోని ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన నరేందర్రావు హైదరాబాద్లో అడ్వకేట్గా పనిచేస్తూ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమించింది. ఇందులో నాగర్కర్నూల్ నుంచి మాయని శ్రీశైలం, అచ్చంపేట నుంచి ఎం.రేణయ్య, కల్వకుర్తి నుంచి దుర్గాప్రసాద్, కొల్లాపూర్ నుంచి సందు రమేష్లకు చోటు కల్పించినట్లు రాష్ట్ర రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ వెల్లడించారు. -
విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ
తాడూరు: ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకొని సమాజంలో రాణించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, కేజీబీవీ విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రీయ స్వస్త్ కార్యక్రమంలో భాగంగా రెండు విడతలుగా జిల్లాలోని 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 50,780 విద్యార్థులను పరీక్షలు చేసి.. 18,093 మంది విద్యార్థిని, విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను రెండో విడత జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేటలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్య నిపుణులచే మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో జిల్లాకు మొదటి విడతగా 8,091 కంటి అద్దాలు వచ్చాయని, వీటిని ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీంల ద్వారా పాఠశాలలకు పంపించి విద్యార్థులకు అందజేస్తామన్నారు. తాడూరు ఉన్నత పాఠశాలలో 19, కేజీబీవీ పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందజేశామన్నారు. కంటి అద్దాలను వాడే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు సంతోష్ అభిరామ్, సిబ్బంది వెంకటస్వామి, విజయ్కుమార్, బాలాజీ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘గుర్రంగడ్డ’ పనుల్లో కదలిక
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వ హయాంలో 2015లో రూ.12కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో గత ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారులు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. నూతన ఏజెన్సీకి బ్రిడ్జి నిర్మాణ పనులు కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు ఏడాదిలో పనులు పూర్తి చేస్తాం 2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – రహీముద్దీన్, ఇన్చార్జ్ ఎస్ఈ -
ముగిసిన వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన ఎదుర్కోళ్లు, స్వామివారి కల్యాణం, చతురస్త్రార్చన వంటి కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు చతురస్త్రార్చన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రాతారాధన, సేవాకాలం, రాజభోగం, పూర్ణాహుతి, నవ కలశ స్నపన చక్రతీర్థం అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణ, అర్చకులు శ్రీకర్, శేషసాయి, రంగనాథ్, ప్రసాద్, నర్సింహచార్యులు, నవీన్, తివారీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వారం రోజులపాటు సాగిన బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అవస్థల ప్రయాణం
అంతర్ జిల్లాల దారిలో.. మహబూబ్నగర్– శ్రీశైలం, పెబ్బేరు– జడ్చర్ల మధ్య పెరిగిన రాకపోకలు ●కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ అచ్చంపేట: అంతర్ జిల్లాల రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఒకవైపు గుంతలు, మరోవైపు ప్రమాదకర మలుపులతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల రద్దీకి అనుగుణంగా అంతర్ జిల్లాల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలనే ప్రతిపాదనలు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు రెండు వరుసల రహదారులే దిక్కవుతున్నాయి. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి బిజినేపల్లి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం మీదుగా అచ్చంపేట, మన్ననూర్ వరకు.. పెబ్బేరు నుంచి వనపర్తి జిల్లాకేంద్రం, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల వరకు రెండు వరుసల రహదారులు ఉన్నాయి. వీటిని జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉండగా.. కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు అలంపూర్ చౌరస్తా నుంచి డిండి, నల్లగొండ వరకు మరో జాతీయ రహదారి కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబ్నగర్తోపాటు గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల ప్రజలు శ్రీశైలం– హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డుపై ప్రయాణించాలి. ఉమ్మడి జిల్లావాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రెండు వరుసల రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కనీస వేగంతో ఈ రోడ్డుపై ప్రయాణించడం కష్టతరంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు తిరిగే అంతర్ జిల్లాల రోడ్డును జాతీయ రహదారిగా మారిస్తే ప్రయాణికులు, వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది. వీటితో అనుసంధానిస్తే.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఎన్హెచ్–44, 167, 765 ఉన్నాయి. వీటికి అదనంగా భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ మీదుగా చించోలి వరకు ఎన్హెచ్–167ఎన్, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఎన్హెచ్–167కే, కర్నూలు నుంచి షోలాపూర్ వరకు ఎన్హెచ్–150సీ జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. అలాగే భూత్పూర్ నుంచి ఎన్హెచ్–44, చించోలి 167–ఎన్ రహదారులను అనుసంధానిస్తూ.. మన్ననూర్ (శ్రీశైలం ఎన్హెచ్–765) వరకు 104 కి.మీ., రోడ్డును పొడిగించాలనే డిమాండ్ ఉంది. పెబ్బేరు ఎన్హెచ్– 44 నుంచి వనపర్తి, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల ఎన్హెచ్–167 వరకు 74 కి.మీ., పుల్లూరు ఎన్హెచ్–44 నుంచి అలంపూర్, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట మీదుగా డిండి ఎన్హెచ్–765 వరకు, వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా మంత్రాలయం వరకు 110 కి.మీ., ఎర్రవల్లి ఎన్హెచ్–44 నుంచి గద్వాల మీదుగా రాయచూర్ వరకు 67 కి.మీ., మరికల్ నుంచి నారాయణపేట మీదుగా రామసముద్రం ఎన్హెచ్–150 వరకు 63 కి.మీ., రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి జాతీయ రహదారులుగా మారితే ఆయా గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిసారిస్తే జాతీయ రహదారుల దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలను కలుపుతూ.. గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో ఉమ్మడి జిల్లా ఎంతో ప్రగతి సాధించింది. అంతర్ జిల్లాల రోడ్లు జాతీయ రహదారులుగా మారితే పర్యాటకంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రజల రాకపోకలు, సరుకుల రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందినవారు శ్రీశైలానికి రావాలంటే మహబూబ్నగర్– అచ్చంపేట రోడ్డే దిక్కు. శ్రీశైలం, మద్దిమడుగు ఆంజనేయస్వామి, ఉమామహేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, సలేశ్వరం పుణ్యక్షేత్రాలు, పర్యాటకంగా విరాజిల్లుతున్న నల్లమల ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇలా రాకపోకలు సాగించే వాహనాలకు మహబూబ్నగర్–అచ్చంపేట, పెబ్బేరు– జడ్చర్ల్ల మధ్య ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు మార్గాల్లో రోడ్ల సామర్థ్యానికి మించి వాహనాలు నడుస్తున్నాయి. ఫలితంగా వాహనాలు తక్కువ వేగంతో వెళ్లాల్సి వస్తుండటంతో కొద్ది దూరానికే ఎక్కువ సమయం గడిచిపోతోంది. వీటిని జాతీయ రహదారులుగా మార్చాల్సిన అవసరం ఉంది. వాహనాల రద్దీకి అనుగుణంగా లేని రోడ్డు సౌకర్యం ప్రతిపాదనలకే పరిమితమైన జాతీయ రహదారి డిమాండ్ దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
చంద్రగఢ్ కోట అభివృద్ధికి కృషి
అమరచింత: చంద్రగఢ్ కోట చరిత్రను అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ప్రాచీన చంద్రగఢ్ కోటను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. కోట లోపల ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాతి కొలనులు, కోటను పరిశీలించి మాట్లాడారు. కోట, ఆలయ ప్రాచుర్యం, చరిత్రను వెలికి తీసేందుకు కృషి చేస్తామని.. కోట వద్ద మౌలిక సౌకర్యాల కల్పనకు ముందస్తుగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో కోటపై భాగానికి వెళ్లడానికి సీసీ రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉందని.. అక్కడి పర్యాటకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కోటను చూడటానికి వస్తుంటారని, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పురావస్తుశాఖ అధికారులను పంపించి చరిత్రను గుర్తించి కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, ఎస్ఐ సురేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షలు మంజూరు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
నాగర్కర్నూల్ క్రైం: కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ సర్వే నిర్వహించాలని సూచించారు. సమాజంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించి.. సత్వరమే చికిత్స అందించడంతో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి సంవత్సరం ఎల్సీడీసీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమన్నారు. కాగా, ఎల్సీడీసీ సర్వేకు సంబంధించిన డబ్బులు వచ్చాయని.. సర్వేను విజయవంతంగా నిర్వహించిన వెంటనే సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. రోజు వారీగా సర్వే రిపోర్టును సంబంధిత అధికారులకు మధ్యాహ్నం 12 గంటలలోగా సమర్పించాలని సూచించారు. ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష వెల్దండ: మండలంలోని గుండాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆదివారం విద్యార్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 60 సీట్లు ఉండగా.. 394 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ పర్దీప్కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షకు 344 మంది హాజరు కాగా.. 50 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలి కల్వకుర్తి రూరల్: ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీల్లో అధిక జనాభా ఉన్న మాదిగలకు 70 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు వచ్చాక కూడా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయాలని చూడటం దారుణమన్నారు. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో పెడతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. శిబిరంలో డప్పు వాయించి నిరసన తెలిపారు. పరశురాం, వీరస్వామి, మాజీ కౌన్సిలర్ రామరాజు, భాస్కర్, జంగయ్య, కిరణ్, లాలయ్య, కృష్ణ, శేఖర్, మల్లేష్ పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు సమష్టి పోరాటాలు నాగర్కర్నూల్ రూరల్: రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్నివర్గాలు సమష్టి పోరాటాలకు సిద్ధం కావాలని ఆవాజ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన, విధ్వేష రాజకీయాలు పెంచి పోషించడం తగదన్నారు. సమావేశంలో నాయకులు అబ్దుల్లా ఖాన్, నిజాం, అమీద్, సలీం, అనీష్, వహీద్, జమాలుద్దీన్, పాషా, రహీం ఉన్నారు. -
సంపూర్ణ టీకాకరణే లక్ష్యం
తెలకపల్లి: మానవాళికి వ్యాధినిరోధక టీకాలే ప్రాణరక్ష అని.. ప్రతి గర్భిణి, శిశువుకు సంపూర్ణ టీకాకరణే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని జిల్లా టీకాల అధికారి డా.రవికుమార్ నాయక్ అన్నారు. ఆదివారం జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించారు. గర్భిణులు, రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి చిన్నారికి 12 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు టీకాకరణ చేస్తున్నామన్నారు. టీకా తయారీ నుంచి లబ్ధిదారుకు అందే వరకు శీతలీకరణ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఐఎల్ఆర్డీఎఫ్ ఫ్రిజర్స్, వ్యాక్సిన్ క్యారియర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలోని వ్యాక్సిన్ సెంటర్లలో ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణులకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఆరు రకాల క్యాటగిరీకి చెందిన వారందరికీ అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమంతో పాటు మహిళల్లో గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ, 12–17 ఏళ్లలోపు బాలికల్లో వ్యాధినిరోధక శక్తి పెంపొందించేందుకు అవసరమైన టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నీరజ్ కుమార్, సూపర్వైజర్ పసియొద్దీన్, ఆరోగ్య కార్యకర్త యాదగిరి, రవీందర్రావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నాగర్కర్నూల్ రూరల్/తెలకపల్లి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ మండలం పెద్దాపూర్, తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. గట్టు నెల్లికుదురు గ్రామంలో రూ. 50లక్షలతో సీసీరోడ్డు, బస్టాండ్, డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతుభరోసా, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా, గట్టునెల్లికుదురులో బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్ బాల్రాం, మాజీ ఉపసర్పంచ్ తిరుపతయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సుందరయ్య, మాజీ వార్డు మెంబర్లు మధుసూదన్రెడ్డి, నాగమల్లయ్య, కాశన్న, తిరుపతయ్య తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మండల ప్రత్యేకాధికారి రాంలాల్, హౌసింగ్ అధికారి హరినాయక్, ఎంపీడీఓ శ్రీనివాసులు, సింగిల్విండో వైస్చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, వినోద్, శారద పాల్గొన్నారు. -
ఉత్సాహంగా వృషభరాజాల బల ప్రదర్శన
ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం అంతర్రాష్ట్రస్థాయి వృషభరాజాల బల ప్రదర్శన (బండలాగుడు) పోటీలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గం, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి పోటీలను ప్రారంభించగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదు జతల ఎద్దులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోరులో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా పల్కన్దొడ్డకు చెందిన ఖాజా హుస్సేన్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలవగా.. మాజీ ఎంపీటీసీ గోపిరెడ్డి అనురాధ, రఘుపతిరెడ్డి రూ. 50వేల నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కర్నూల్ జిల్లా నంద్యాల బేతంచర్ల ఉస్సేనాపూర్కు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఎద్దులకు రూ. 40వేల బహుమతిని మాజీ ఎంపీపీ తిప్పర్తి అరుణ, నర్సింహారెడ్డి అందజేశారు. అదే విధంగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచిన ఎద్దుల యజమానులకు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంగుల నర్సింహారెడ్డి, కొత్త మధుసూదన్రావు, మోహన్గౌడ్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వేముల నర్సింహారావు, ఈఓ నర్సింహులు, కమిటీ సభ్యులు గణేశ్గౌడ్, స్వరూప, నాయకులు అనంతరెడ్డి, అనంత ప్రతాప్రెడ్డి, ఇంద్రారెడ్డి, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్ల్లో 80 సీట్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్లకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 (ఎస్సీ 2, ఎస్టీ 2, బీసీ 5, ఓసీ 1) సీట్లు కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లాలో మైనార్టీ గురుకుల కళాశాలలు, సీట్లు ఇలా.. జిల్లా బాలురు బాలికలు సీట్లు మహబూబ్నగర్ 6 4 800 నాగర్కర్నూల్ 2 2 320 వనపర్తి 1 1 160 నారాయణపేట 1 1 160 గద్వాల – 2 160 ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
SLBC: రోబోలతో సెర్చ్ ఆపరేషన్.. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి ఇదే
సాక్షి, మహబూబ్నగర్ జిల్లా: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 23 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం అయింది. మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది.రోబోల వినియోగంతో సహాయక చర్యలు ముమ్మరం అవుతాయని భావిస్తున్నా ఇంకా రోబోల పని ప్రారంభం కాలేదు. అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోలు మూడింటిని వినియోగించనున్నారు. ఒక్కో మిషన్ నిమిషానికి వెయ్యి క్యూబిక్ మీటర్ల సామర్ద్యం గల బురద, మట్టిని తొలగిస్తోంది. మానవుల కంటే 15 రెట్లు అధికంగా ఈ రోబోల పని చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు.రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిత్యం ఉదయం, సాయంత్రం సహయ బృందాల హెడ్స్తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు.గడిచిన 23 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారీగా ఊరుతున్న సీపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపిస్తున్నారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊట నీరుతో సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. -
ప్రాధాన్యం ఇస్తున్నాం..
యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్ స్కాలర్ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్ హబ్గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ● -
రమణీయంగా లక్ష్మీనర్సింహుడి రథోత్సవం
ఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగి తరించారు. అనంతరం శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, నిత్యహోమాలు, బలిహరణం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయ ఆవరణలో ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు, ఈఓ నర్సింహులు, పాలకవర్గ సభ్యులు గణేష్గౌడ్, స్వరూప, కృష్ణయ్య, ప్రదీప్ప్రసాద్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
ఆవిష్కరణలకు గుర్తింపు
పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు ● ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు ● డిజైన్ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి, పరిశీలనలలో మరొకటి ● గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్ రైట్స్ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్ రైట్ రావడంతో టీచర్స్ అసోసియేట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫెల్లోషిప్ అధ్యాపకులు చంద్రకిరణ్ ఎంపికయ్యారు. మ్యాథ్స్ విభాగంలో అధ్యాపకులు రిమోట్ కంట్రోల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారీ, రోలర్ స్టాంప్ తయారీకి డిజైన్ విభాగంలో పేటెంట్ రాగా.. స్ట్రెచింగ్ షీట్పై కాసన్ నానోఫ్లూయిడ్స్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రిడెక్టర్ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్● రోలర్ స్టాంప్ పరికరాన్ని మ్యాథ్స్ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్ రైట్ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది. ● రసాయన శాస్త్రంలో కెమికల్స్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, బయో మెడికల్ ఇంజినీరింగ్ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్ షీట్పై కానస్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్ రైట్ పరిశీలనలో ఉన్నాయి. -
రిమోట్ కంట్రోల్తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
ఇంటర్ పరీక్షలకు 141 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. శనివారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 5,063 మంది విద్యార్థులకు గాను 4,922 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,756 మందికి గాను 3,638, ఒకేషనల్ విభాగంలో 1,307 మందికి గాను 1,284 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో మొత్తం 141 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఐఈఓ వెంకటరమణ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నేడు ప్రవేశ పరీక్ష వెల్దండ: మండలంలోని గుండాల గ్రామం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పర్దీప్కుమార్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఒకే పాఠశాల ఉండగా 394 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆదివారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. 6వ తరగతి ప్రవేశానికి 60 సీట్లు మాత్రమే ఉండటంతో అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేద్రానికి హాజరుకావాలని ప్రిన్సిపల్ సూచించారు. శనేశ్వరుడికి శాస్త్రోక్త పూజలు బిజినేపల్లి: జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడికి మండలంలో నందివడ్డెమాన్ గ్రామంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలినాటి శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని తిలతైలాభిషేకాలతో తమ గోత్రనామార్చనలతో పూజలు జరిపారు. బ్రహ్మసూత్ర పరమ శివుడిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. రేపు శిర్సనగండ్లలో వేలం పాట చారకొండ: మండలంలోని శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో కొబ్బరికాయలు, కొబ్బరి ముక్కలు, తలానీలాలు, లడ్డు, పులిహోరా ప్రసాదాలకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో వేలం పాట కొనసాగుతుందన్నారు. ఔత్సాహికులు కొబ్బరికాయలకు రూ.5 లక్షలు, తలనీలాలకు రూ.లక్ష, కొబ్బరి ముక్కలకు రూ.50 వేలు, లడ్డు, పులిహోర ప్రసాదాలకు రూ.లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించాలని సూచించారు. సోమశిల ఆలయంలో.. కొల్లాపూర్: మండలంలోని సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయంలో టెంకాయలు, లడ్డూ ప్రసాద విక్రయాల కోసం సోమవారం వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.50 వేలు డిపాజిట్ చెల్లించి ముందస్తుగా తమ పేర్లు ఆలయ కమిటీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. వేలం దక్కించుకున్న వారు ఏడాదిపాటు ఆలయంలో టెంకాయలు, లడ్డు ప్రసాదాలు విక్రయించాల్సి ఉంటుందన్నారు. -
సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వమే కాంగ్రెస్ ధ్యేయం
మంత్రి జూపల్లి కృష్ణారావునాగర్కర్నూల్ క్రైం: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ చరిత్రను కాపాడుకుందామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఎంపీ మల్లురవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సమాజంలోని ప్రజల మధ్య ఐక్యత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. ముస్లింల తల్లిదండ్రులు తమ పిల్లలను మంచిగా చదివించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించాలన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రూ.6 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మరో రూ.2 వేల కోట్లను కేటాయించి బ్యాంకుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేలను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గద్వాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్ ఉర్ రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా బురద తొలగింపు
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగతా ఏడుగురు కార్మికుల జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదస్థలంలో చివరి 40 మీటర్లలో తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండగా, ఇందుకోసం రోబోలతో ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సొరంగంలోకి ఆటోమేటివ్ స్లడ్జ్ రిమూవల్ రోబో మిషినరీని తీసుకెళ్లారు. శనివారం దానికి అనుసంధానంగా పనిచేసే వ్యాక్యూమ్ ట్యాంక్ను సొరంగంలోకి తరలించారు. దీని ద్వారా వేగంగా బురద, మట్టిని కన్వేయర్ బెల్టు మీదుగా బయటకు తరలించవచ్చని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో ఆదివారం ప్రారంభమవుతాయని చెబుతున్నారు. డీ1 వద్ద తవ్వకాలు పూర్తయితేనే.. ఇప్పటికే కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 ప్రాంతంలో పూర్తిస్థాయిలో తవ్వకాలు చేపట్టారు. అక్కడ గురుప్రీత్సింగ్ మృతదేహం లభించగా, మిగతా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మరో పాయింట్ డీ1 వద్ద సింగరేణి, ర్యాట్హోల్ మైనర్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. డీ1 వద్ద 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగిస్తేనే మిగతా కార్మికుల జాడ తెలిసే అవకాశం ఉంది. డీ1 వద్ద టీబీఎంలో సెగ్మెంట్ ఎరెక్టర్ ఉండే చోట కార్మికులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో తవ్వకాలు పూర్తికావచ్చని, అప్పుడే కార్మికుల జాడ తెలిసే వీలుందని తెలుస్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
కిలోకు వంద గ్రాములు తరుగు..
నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాల్లో పెద్దఎత్తును మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మాంసం విక్రయదారులు సిండికేట్గా ఏర్పడి ధరలను నిర్ణయించడమే కాకుండా తాము చెప్పినట్లు, తాము తూకం వేసిందే సబబు అన్నట్లుగా దౌర్జాన్యాలు సాగిస్తున్నారు. కిలోకు సరాసరిగా వంద గ్రాముల చొప్పున తరుగు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు మారు మాట్లాడకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వినియోగదారలు మున్సిపల్లో గాని, సంబంధిత శాఖ అధికారులకు గాని ఫిర్యాదు చేసినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పట్టించుకోవడం లేదు.. మాంసం విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. మటన్ మార్కెట్లో గొర్రె మాంసంను పొట్టేలు మాంసంగా చిత్రీకరించి అమ్ముతున్నారు. ఇంతే కాకుండా అనారోగ్యం కలిగిన మేకలు, గొర్రెలను కోసి వినియోగదారులకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఏటిగడ్డ శ్రీనివాసులు, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్లో చేపల విక్రయం -
నాణ్యతపై గొంతు విప్పండి
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంమనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రైం/నాగర్కర్నూల్● ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి ● జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు ● ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది. వినియోగదారుల ఫోరం కోర్టు వినియోగదారుల్లో చైతన్యం రావాలి జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్కు ఫోన్ చేయాలి. – సృజన్కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ ●మారిన చట్టం.. 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్లైన్లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్లైన్ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు. -
వైభవంగా ఎదుర్కోళ్ల ఉత్సవం
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం స్వామివారి ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల మూడోరోజు ప్రాతారాధన, చతుస్థానార్చన, సేవాకాలం, బాలభోగ నివేదన, పూర్ణాహుతి, బలిప్రదానం, ఉత్సవ మూర్తులకు నవకళశ స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరిపారు. అనంతరం అనంతరం స్వామివారికి ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తర్వాత హనుమద్వాహన సేవతో పూజ పూర్తి చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణం ఉంటుందని, ఈ కార్యక్రమం కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణాచార్యులు తెలిపారు. కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి, శశాంక్ స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహాహోమం నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అరవిందరావు, చంద్రశేఖర్రావు, ధీరేంద్రదాసు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో 1,018 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 187 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 126 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం అమరచింత: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకుడు కె.సూర్యం ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో ఉమ్మడి మండలాల మాస్లైన్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక చట్టాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం అదాని, అంబానీలాంటి కార్పొరేట్ యాజమానులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి వ్యవస్థలు నడుపుకోవడానికి రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్కు అప్పజెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని.. ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని నెరవేర్చలేకపోతోందని ఆరోపించారు. -
ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ
3, 4, 5 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ’ బోధన● నేటినుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 స్కూళ్లలో నిర్వహణ ● గత నెల 25నే నారాయణపేటలో ప్రారంభం ● సత్ఫలితాలు ఇవ్వడంతో అన్నిచోట్ల అమలుకు చర్యలు ● కంప్యూటర్ ల్యాబ్లు ఇతర పరికరాల ఏర్పాటు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల ద్వారా సాగుతుండగా.. విద్యార్థి అక్షర పరిజ్ఞానం, అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి.. వాటిని మదింపు చేయడం అనుకున్నంత మెరుగ్గా జరగడం లేదు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు చదువులో వెనకబడి పోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో విద్యార్థి విద్యా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈకే స్టెఫ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంతో కీలకంగా మారింది. దీని సేవలను పాఠశాలలో వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద నారాయణపేటలో 10 పాఠశాలల్లో గత నెల 25న ప్రారంభించారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన మరో 56 పాఠశాలల్లో శుక్రవారం నుంచి అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఇందుకోసం ఎంపిక చేశారు. హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ప్రతి జిల్లాలో నలుగురు రీసోర్సుపర్సన్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. వారు ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబ్ల ఏర్పాటుకు దాదాపు అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు వచ్చినా ఇందులో టేబుళ్లు, కుర్చీలు, హెడ్ఫోన్స్, ఇంటర్నెట్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. ఈ విధానం బాగుంది.. కంప్యూటర్ ద్వారా బోధన ప్రారంభించిన తర్వాత తెలుగు, ఆంగ్లంలో పదాలను అర్థం చేసుకుని బాగా పలుకుతున్నాం. గణితంలోనూ కూడికలు, తీసివేతలు తదితర వాటిని చక్కగా చేయగలుగుతున్నాం. మొదట్లో టీచర్లు ఎంత చెప్పినా నెత్తికి ఎక్కేది కాదు. ప్రస్తుత విధానం బాగుంది. – విజయలక్ష్మి, 4వ తరగతి, కొల్లంపల్లి, నారాయణపేట ●ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. మరో 56 పాఠశాలల్లో.. స్థాయిని బట్టి బోధన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా చిన్నారులను ఆకట్టుకునేలా ఏఐ బోధన ఉంటుంది. ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల వారిని ఐదుగురిని ఒక బ్యాచ్గా విభజించి.. ఒక్కో బ్యాచ్కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తుంది. ఆ విద్యార్థి అర్థం చేసుకున్నాడా.. లేదా.. అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో మళ్లీ బోధన అందిస్తుంది. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడానికి నివేదిక రూపొందిస్తాం. – రమేష్కుమార్, డీఈఓ, నాగర్కర్నూల్ సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట సామర్థ్యాల మదింపు.. ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు వెనకబడి ఉండే విద్యార్థులను గుర్తించి కంప్యూటర్ ముందు కూర్బోబెడతారు. ఇందులో ప్రధానంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థి అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించాల్సి ఉంది. ముందుగా విద్యార్థికి కేటాయించిన పెన్ నంబర్ (పర్మనెంటర్ ఎడ్యుకేషన్ నంబర్) ద్వారా ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఎంటర్ చేసిన ప్రతిసారి విద్యార్థి గత కొన్ని రోజులుగా చేస్తున్న పర్ఫామెన్స్, డెవలప్మెంట్, నేర్చుకున్న అంశాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. -
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ను వినియోగిస్తున్నారు.దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు.టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, నిన్న (శుక్రవారం) మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. -
టన్నెల్లో రోబో రెస్క్యూకు రూ. 4కోట్లు
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్ బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటన జరగని పక్షంలో రెండేళ్లలో సొరంగం పూర్తయ్యే దన్నారు. ప్రమాదం జరిగిన దగ్గరనున్న 40 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, అందుకే రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. టీబీఎం లోపల తవ్వకాలు..టన్నెల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, శుక్రవారం మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్ను మరోసారి టన్నెల్లోకి తీసుకెళ్లారు. మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.మేడిగడ్డ బరాజ్పై ఎన్డీఎస్ఏ నివేదిక వారంలోగామేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లో పగుళ్లు రావడానికి సంబంధించి వారం పది రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక వస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బరాజ్లో నీరు నిల్వ చేసి వినియోగించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఓ విలేకరి మంత్రి దృష్టికి తీసుకుని రాగా..నీరు నిల్వ చేస్తే.. డ్యామ్ కొట్టుకొని పోయి దిగువన ఉన్న సీతారామ ప్రాజెక్టుతో సహా 44 వేల గ్రామాలు, భద్రాచలం కొట్టుకొనిపోవాలని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. డ్యామ్ల రక్షణపై నివేదికలు ఇవ్వడంలో ఎన్డీఎస్ఏ సుప్రీం అని.. దాని సూచనలు పాటిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు. -
వైభవంగా వట్టెం వెంకన్న పల్లకీసేవ
బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఉదయాన్నే హోమశాలలో ప్రత్యేక యజ్ఞం అనంతరం గరుడ పతాక ధ్వజారోహణం జరిపారు. అలాగే సంతాన ప్రాప్తి కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్త దంపతులు ఉపవాస నిష్టతో పల్లకీసేవ అనంతరం పవిత్ర గరుడ ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్రెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, భాస్కరాచారి, కృష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 355 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,201 మంది విద్యార్థులకు గాను 5,846 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,454 మందికి గాను 4,228 మంది, ఒకేషనల్ విభాగంలో 1,747 మందికి గాను 1,618 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో మొత్తం 355 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. వేరుశనగ @ రూ.6,929 కల్వకుర్తి రూరల్/జడ్చర్ల: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ పంటకు గురువారం అత్యధికంగా రూ.6,929 ధర లభించింది. కనిష్టంగా రూ.5,010 రాగా.. సరాసరిగా రూ.6,370 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్కు 551 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. ● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262, కనిష్టంగా రూ.7,222 ధరలు లభించాయి. ఉచిత శిక్షణకు దరఖాస్తులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టు వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ ద్వారా చదివే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి వార్షిక పరీక్షలు ఉంటాయని డీఈఓ ఎ.ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి సంబంధించి వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో విద్యార్థులందరూ తప్పక హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. పీఏసీఎస్ను సందర్శించిన డీసీసీబీ చైర్మన్ ఉప్పునుంతల: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)ను గురువారం డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి సందర్శించారు. పీఏసీఎస్ ద్వార సంఘం సభ్యులకు ఇస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తంరావు, ఏజీఎం భూపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్తు భూపారావు అచ్చంపేట, కొండనాగుల, అంబట్పల్లి పీఏసీఎస్ల చైర్మన్లు రాజిరెడ్డి, జబ్బు నర్సయ్య, హన్మంత్రెడ్డి, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరిలో కిడ్నీల పనితీరు ముఖ్యం
నాగర్కర్నూల్ క్రైం: ప్రతి మనిషి జీవించి ఉండాలంటే కిడ్నీలు ఆరోగ్యవంతంగా ఉండాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జనరల్ ఆస్పత్రి డయాలసిస్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన అవసరమని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందరికీ కిడ్నీలు కేవలం వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అనుకుంటారని, మానవ శరీరంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయని, కిడ్నీలు దెబ్బతింటే జీవన విధానం మారిపోతుందన్నారు. ఆరోగ్యంగా జీవించడం చాలా కష్టంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు రవిశంకర్, అజిమ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ ద్వారా విద్యా బోధన
పెద్దకొత్తపల్లి: జిల్లాలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా విద్యా బోధన చేపట్టబోతున్నట్లు డీఈఓ రమేష్కుమార్ తెలిపారు. ఏఐ ద్వారా విద్యా బోధన కోసం మండలంలోని చంద్రకల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐ ద్వారా విద్యార్థులకు గణితం, తెలుగు పాఠాలు బోధించనున్నట్లు వివరించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా కంప్యూటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని చంద్రకల్తోపాటు గంట్రావుపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం అమలు చేస్తున్నామన్నారు. డీఈఓ వెంట జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంఉప్పునుంతల: మండలంలోని మామిళ్లపల్లిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఉదయం స్వామివారికి హోమం, బలిహరణం, ఆర్జిత సేవలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపు సేవ, మోహినిసేవ, గరుడవాహన సేవలు, ఎదుర్కోళ్లు కార్యక్రమం చేపట్టారు. అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతును జరిపించారు. స్వామివారి కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు, ఈఓ నర్సింహులు, నాయకులు అనంతరెడ్డి, తిప్పర్తి నర్సింహ్మారెడ్డి, రఘుపతిరెడ్డి, అనంతప్రతాప్రెడ్డి, గంగుల నర్సింహ్మారెడ్డి, గోవర్ధన్రెడ్డి, ఇంద్రారెడ్డి, ఆలయ పాలకవర్గం కమిటీ సభ్యులు గణేష్గౌడ్, స్వరూప, కృష్ణయ్య, ప్రదీప్ప్రసాద్, శ్రీనివాస్గౌడ్ పరిసర గ్రామా ల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు పాల్గొన్నారు. నేడు రాత్రి రథోత్సవం.. మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహరావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. -
ఇంటర్ పరీక్షలకు 355 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,201 మంది విద్యార్థులకు గాను 5,846 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,454 మందికి గాను 4,228 మంది, ఒకేషనల్ విభాగంలో 1,747 మందికి గాను 1,618 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో మొత్తం 355 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. వేరుశనగ @ రూ.6,929 కల్వకుర్తి రూరల్/జడ్చర్ల: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ పంటకు గురువారం అత్యధికంగా రూ.6,929 ధర లభించింది. కనిష్టంగా రూ.5,010 రాగా.. సరాసరిగా రూ.6,370 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్కు 551 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. ● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262, కనిష్టంగా రూ.7,222 ధరలు లభించాయి. ఉచిత శిక్షణకు దరఖాస్తులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టు వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ ద్వారా చదివే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి వార్షిక పరీక్షలు ఉంటాయని డీఈఓ ఎ.ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి సంబంధించి వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో విద్యార్థులందరూ తప్పక హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు. పీఏసీఎస్ను సందర్శించిన డీసీసీబీ చైర్మన్ ఉప్పునుంతల: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)ను గురువారం డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి సందర్శించారు. పీఏసీఎస్ ద్వార సంఘం సభ్యులకు ఇస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తంరావు, ఏజీఎం భూపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్తు భూపారావు అచ్చంపేట, కొండనాగుల, అంబట్పల్లి పీఏసీఎస్ల చైర్మన్లు రాజిరెడ్డి, జబ్బు నర్సయ్య, హన్మంత్రెడ్డి, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆక్సిజన్ కొరతకు చెక్
జనరల్ ఆస్పత్రిలో 10వేల కిలోల ప్లాంటు ఏర్పాటు ఇబ్బందులు రానివ్వం.. జనరల్ ఆస్పత్రికి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు ఆక్సిజన్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం 10 వేల కిలోల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక పైప్లైన్ ద్వారా 135 పడకలకు ఆక్సిజన్ పాయింట్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంటును ఆన్లైన్ విధానం ద్వారా పర్యవేక్షణ చేయనున్నాం. – రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ● ప్రత్యేక పైప్లైన్ ద్వారా 135 పడకలకు సదుపాయం ● వినియోగంపై ఆన్లైన్ విధానంలో పర్యవేక్షణ ● జిల్లావ్యాప్తంగా రోగులు వస్తుండటంతో పెరిగిన డిమాండ్ ● సివిల్ ఆస్పత్రుల్లోనూ ఏర్పాటుకు వేడుకోలు నాగర్కర్నూల్ క్రైం: అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరే రోగులకు ఆక్సిజన్ ఎంతో అవసరం ఉంటుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా జనరల్ ఆస్పత్రిలో నాణ్యమైన ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ ప్రాధాన్యత ఎంతగానో అవసరం ఉండటంతో జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఐదేళ్లు సేవలు అందించినప్పటికీ కొద్దిరోజులుగా ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతుకు గురవడంతోపాటు విద్యుత్ నిర్వహణ భారం ఎక్కువగా కావడంతో వాటి స్థానంలో 10 వేల కిలోల భారీ ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి సేవలను వినియోగంలోకి తీసుకురానున్నారు. 330 పడకల సామర్థ్యం జనరల్ ఆస్పత్రిలో కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ వినియోగంలో లేకపోవడంతో రోగులకు సేవలు అందించేందుకు ప్రైవేటు సంస్థల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే అందులో నాణ్యత ఉండకపోవడంతో ప్రత్యామ్నాయంగా జనరల్ ఆస్పత్రి ఆవరణలోనే 10 వేల కిలోల ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ను తీసుకువచ్చి ట్యాంక్లో నింపి రోగులకు అందించనున్నారు. ఈ క్రమంలో 330 పడకల సామర్థ్యం కలిగిన జనరల్ ఆస్పత్రిలో ఐసీయూ, జనరల్ వార్డు, ఆర్థోపెడిక్ వార్డు, గర్భిణుల వార్డుతోపాటు చిల్డ్రన్స్ వార్డులకు ప్రత్యేక పైప్లైన్ ద్వారా 135 ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సేవలు అందించనున్నారు. అదేవిధంగా 10 వేల కిలోల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్లో ఆక్సిజన్ నిల్వలతోపాటు వినియోగాన్ని ఆన్లైన్ విధానం ద్వారా పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సివిల్ ఆస్పత్రుల్లోనూ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో లేకపోవడంతో సిలిండర్ల ద్వారానే రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంటు పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సేవలు అందించేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరంతరం అందుబాటులో ఉండటంతో జిల్లాలోని సివిల్, కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి అత్యవసర సేవల కోసం జనరల్ ఆస్పత్రికి వస్తుండటంతో ఆక్సిజన్ వినియోగం పెద్దమొత్తంలో అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో కల్వకుర్తి, అచ్చంపేట సివిల్ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకువస్తే రోగులకు ఇబ్బంది ఉండదని, స్థానికంగానే మెరుగైన వైద్యసేవలు అందుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దైవచింతనతో మెలగాలి
కల్వకుర్తి రూరల్: సమాజంలోని ప్రతి ఒక్కరూ దైవచింతనతో మెలగాలని త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. కల్వకుర్తి మండలం యంగంపల్లి శ్రీసీతారామ, ఆంజనేయ, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగి 41 రోజులైన సందర్భంగా బుధవారం ప్రత్యేకంగా హోమాలు, పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నజీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో భక్తిభావం పెరిగిందన్నారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించడం, నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సమాజంలోని ప్రజలందరూ కులాలకు అతీతంగా దైవభక్తి కలిగి ఉండాలని సూచించారు. అనంతరం భక్తులు చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
వైభవంగా వట్టెం వెంకన్న బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ప్రాతారాధన, సుప్రభాతం, అర్చన, సేవాకాలం, బాలభోగ నివేదన, హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి.. రాజభోగ నివేదన చేశారు. సాయంత్రం మత్స్యంగ్రహణం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్రెడ్డి, నర్సింహారెడ్డి, రాంచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, రాజశేఖర్, వలంటీర్లు భాస్కరాచారి, చెన్నకృష్ణారెడ్డి, భరత్కుమార్ పాల్గొన్నారు. -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నల్లమలలోని చెంచు పెంటల్లో త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా బుధవారం ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, డీఎఫ్ఓ రోహిత్రెడ్డితో కలిసి దోమలపెంటలోని వన మయూరి అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచు పెంటల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చెంచు గూడాలు, పెంటల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పక్కా గృహాలు, తాగునీరు, రోడ్డు సౌకర్యం వంటి కనీస అవసరాలను మెరుగు పరిచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అప్పాపూర్ గ్రామ పంచాయతీలోని పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల తదితర పెంటల్లో నివాసం ఉంటున్న చెంచులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా చెక్డ్యాంలు, తాగునీటి బావులు తవ్వించాలని సూచించారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, కరెంటు, విద్యార్థులు తరగతి గదిలో కూర్చునేందుకు బేంచీలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా చెంచు పెంటల్లోని ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ డీఈ హేమలత, ఆర్డబ్ల్యూఎస్, గిరిజన కార్పొరేషన్ మేనేజర్ సంతోష్కుమార్, డీటీడీఓ ఫిరంగి తదితరులు ఉన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
సా..గుతున్న పనులు
కల్వకుర్తి మున్సిపాలిటీలో మూడేళ్ల క్రితం రూ. 5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 25శాతం పనులు కూడా పూర్తికాలేదు. మరోవైపు బస్టాండ్ సమీపంలో రూ. 55లక్షలతో వీధి వ్యాపారుల కోసం నిర్మించినా షెడ్ల కేటాయింపు జరగకపోవడంతో ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంత రోడ్లపైనే సాగుతోంది. సంతలో సరైన వసతులు లేక క్రయ, విక్రయదారులు అవస్థలు పడుతున్నారు. త్వరగా నిర్మించాలి.. మున్సిపాలిటీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను త్వరగా పూర్తిచేసి కూరగాయల వ్యాపారంపైనే ఆధారపడిన మాలాంటి వారికి అందించాలి. గతంలో రోడ్లపై కూరగాయలు అమ్మవద్దని.. షెడ్లను ఏర్పాటు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు. – శాంతమ్మ, తుర్కలపల్లి -
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
● రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వంగూరు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం వంగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులంతా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడం, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశాలపై ఉపాధ్యాయులతో ఆరా తీశారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ కమిషన్ సభ్యులు జ్యోత్స్న శివారెడ్డి, విశ్వేశ్వర్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు ఉన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు నాగర్కర్నూల్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే అసలైన అభివృద్ధి అని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి మాట్లాడుతూ.. మహిళల సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ప్రతి ఇంట్లో ఆడ, మగ పిల్లలను సమానంగా చదివించాలని సూచించారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో మహిళలకు తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, డీఎంహెచ్ఓ స్వరాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
టన్నెల్లో రోబోలతో రెస్క్యూ షురూ
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాద స్థలం వద్ద మట్టి, శిథిలాలు, బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రో బోను సొరంగం లోపలకు తీసుకెళ్లారు. రాళ్లను క్రష్ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు ఒకటి చొప్పున మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఆటో మేటెడ్ స్లడ్జ్ రిమూవల్ రోబోæ సొరంగంలో పను లు మొదలుపెట్టింది. పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్ హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ రోబోకు ముందుభాగంలో ఉన్న గ్రైండర్ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్ చేస్తూ ము క్కలుగా చేయడంతోపాటు బురదను వ్యాక్యూమ్ సక్కర్ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్ బెల్టుపై వేస్తుంది. గంటకు వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు.ప్రమాద స్థలంలో ఏఐ ఆధారిత రోబో సాయంతో తవ్వకాలు, మట్టి తొలగింపు చేపడుతుండగా, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్ ఆపరేటింగ్ ద్వారా రోబోలను పర్యవేక్షించనున్నారు. సొరంగం ఇన్లెట్ వద్ద ఉండే మాస్టర్ రోబో మిగతా రోబోలతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆల్ఇండియా రోబోటిక్ అసోసియేషన్ ఈ ఆపరేషన్కు సహకారం అందిస్తోంది. చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న 13.85 కి.మీ. పాయింట్ వద్ద చివరి 20 మీటర్ల స్థలంలో సొరంగం పైకప్పు వదులుగా ఉండటంతో మళ్లీ కూలే అవకాశాలు ఉన్నాయని, అక్కడ పనిచేసే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదకరమని జియోలాజికల్ సర్వే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చివరి 20 మీటర్ల ప్రదేశంలో రోబోల ద్వారా రెస్క్యూ చేపడుతున్నారు. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య ట్రెంచ్ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే టీబీఎం మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ స్థలంలోనే మిగతా కార్మికులు ఉంటారని భావిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా మట్టి, శిథిలాలతో కూరుకుపోయి ఉంది. మట్టి, బురద, శిథిలాలను తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. -
క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం
బల్మూర్: క్రీడా పోటీలతో విద్యార్థుల ఆరోగ్య సామర్థ్యాలు పెరిగి శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని ఐటీడీఏ అధికారి శంకర్ అన్నారు. మండలంలోని బాణాల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగో తరగతి విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 24 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారికి ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగు, మెడిసిన్ బాల్త్రో, ఫ్లయింగ్ రన్స్, స్టాండింగ్ బాడీ జంపు తదితర తొమ్మిది రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభకనబర్చిన బాలురు 10 మంది, బాలికలు 10 మందిని ఈ నెల 21న హైదరాబాద్లోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏసీఎంఓ తిరుపతయ్య, స్సోర్ట్స్ ప్రత్యేకాధికారి భీమ్లానాయక్, హెచ్ఎంలు చంద్రశేఖర్, బయన్న, రాములు, పీడీలు నరేష్, ఆంజనేయులు, రాజు, జ్యోతి, పెద్దయ్య, అంజి, జానకిరాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్లో అస్తవ్యస్తం
కొల్లాపూర్: మున్సిపాలిటీలో మురుగు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలోని చాలా కాలనీల్లో సైడ్ డ్రెయిన్లు లేక మురుగు రోడ్లపైనే పారుతోంది. 16వ వార్డులో అన్నపూర్ణ లాడ్జి నుంచి వరిదేల చెరువు వరకు ప్రధాన మురుగు కాల్వ ఉండగా.. కేఎల్ఐ గెస్ట్హౌజ్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాల ముందుగా పారుతుంది. దీన్ని ఆధునీకరించేందుకు గత ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసింది. టెండర్లు సైతం పూర్తి చేసినా పనులు మొదలుపెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ టెండర్లు నిర్వహించారు. గతేడాది నవంబర్లో సీఎం రేవంత్రెడ్డి కొల్లాపూర్ పర్యటన నేపథ్యంలో కాల్వ ఆధునీకరణ కోసం అధికారులు గతంలో నిర్మించిన గోడలను కూల్చివేసి, కాల్వ వెంట నిర్మాణాలు, డబ్బాలు తొలగించారు. అయినప్పటికీ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో కాల్వ నిండా మురుగు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. అలాగే 13వ వార్డులో ఎస్సీ హాస్టల్ నుంచి గోమతి స్కూల్ వరకు మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో పెంట్లవెల్లికి వెళ్లే ప్రధాన రహదారి మొత్తం మురుగు పారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, 1, 5, 8, 17 వార్డుల్లో పలుచోట్ల మురుగు కాల్వలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
నేటినుంచి వట్టెం వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: ప్రకృతి రమణీయమైన కోవెలగా పేరొందిన వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి సోమవారం వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. 6 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో స్వామి వారం అలంకారం, రాజభోగ నివేదన, తిరుచ్చిసేవ, సంతానార్థులకు గరుడ ప్రసాద పంపిణీ, స్వామివారి ఉత్సవమూర్తులకు నవకలశ స్నపన తిరుమంజనం, ఎదుర్కోళ్లు, గరుడ వాహన సేవ, కల్పవృక్ష వాహన సేవ, నవకలశ స్నపనం, అశ్వవాహన సేవ, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, తీర్థ ప్రసాద వితరణ పల్లకీసేవ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆలయ 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 452 మంది గైర్హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 7,528 మంది విద్యార్థులకు గాను 7,076 మంది హాజరవగా.. 452 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,830 మందికి గాను 5,499 మంది, ఒకేషనల్ విభాగంలో 1,698 మందికి గాను 1,577 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 331 మంది, ఒకేషనల్ విభాగంలో 121 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం అచ్చంపేట రూరల్: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంచుదామని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని సింగారం శివారులో కృష్ణయ్య అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత వ్యవసాయంపై గో సేవా విభాగం, గ్రామ భారతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు అధిక మోతాదులో వాడటం వల్ల భూమిలో సారం నశించిపోతుందన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు అవలంభించడం వల్ల పంటల అధిక దిగుబడిని సాధించవచ్చన్నారు. నీటి వినియోగం ఎక్కువ, తక్కువ అయినా కూడా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారం పంటకు నీరు ఎక్కువ కావడం వల్ల దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల మొక్కజొన్న విస్తీర్ణం పెరిగిందని, ఒక పంటకు దాదాపు 9 సంచుల యూరియా వాడినట్లు వెళ్లడైందన్నారు. ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తుందని, భవిష్యత్లో జిల్లాలో 15 క్లస్టర్లలో 500 ఎకరాలలో ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రాలను పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత లోకసాని పద్మారెడ్డి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు వాసు, మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య, 12 క్లస్టర్ల ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. పీయూలో వర్క్షాప్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం
బల్మూర్: క్రీడా పోటీలతో విద్యార్థుల ఆరోగ్య సామర్థ్యాలు పెరిగి శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని ఐటీడీఏ అధికారి శంకర్ అన్నారు. మండలంలోని బాణాల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగో తరగతి విద్యార్థులకు క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 24 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారికి ఎత్తు, బరువు, 30 మీటర్ల పరుగు, మెడిసిన్ బాల్త్రో, ఫ్లయింగ్ రన్స్, స్టాండింగ్ బాడీ జంపు తదితర తొమ్మిది రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభకనబర్చిన బాలురు 10 మంది, బాలికలు 10 మందిని ఈ నెల 21న హైదరాబాద్లోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏసీఎంఓ తిరుపతయ్య, స్సోర్ట్స్ ప్రత్యేకాధికారి భీమ్లానాయక్, హెచ్ఎంలు చంద్రశేఖర్, బయన్న, రాములు, పీడీలు నరేష్, ఆంజనేయులు, రాజు, జ్యోతి, పెద్దయ్య, అంజి, జానకిరాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అడ్రస్ లేని అండర్ గ్రౌండ్
పేరుకేమో పట్టణాలు– మున్సిపాలిటీలు.. పెద్ద పెద్ద భవంతులు.. విశాలమైన రోడ్లు.. పైకి మాత్రమే కనిపించే సోపుటాపులు ఇవి. కానీ, కొద్దిగా గల్లీల్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది ఆసలు బాగోతం.. అచ్చం పల్లెటూర్ల మాదిరిగానే రోడ్లపైనే పారుతున్న మురుగు.. వాటిలో పందుల స్వైరవిహారం, దోమల విజృంభణ షరామామూలుగానే కనిపిస్తాయి. జిల్లాకేంద్రం మినహా.. జిల్లాలోని మిగతా మూడు మున్సిపాలిటీలైన కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తిలో ఇదే దుస్థితి ఎదురవుతుంది. ఎక్కడా భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాకేంద్రమైన నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్యలకు దారితీస్తోంది. ● జిల్లాకేంద్రం మినహా మిగతా విలీన గ్రామాల్లో అధ్వానం ● రోడ్లపైనే పారుతున్న మురుగుతో తప్పని అవస్థలు ● దోమలు, పందుల స్వైరవిహారంతో రోగాల వ్యాప్తి ● వర్షాకాలంలో తీవ్రమైన సమస్యలు కొల్లాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆధునికీకరణకు నోచుకోని మురుగు కాల్వలఇళ్ల మధ్యనే మురుగు కల్వకుర్తి రూరల్: రోజురోజుకూ విస్తరిస్తున్న కాలనీలతో కల్వకుర్తి మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాలనీలు విస్తరిస్తున్నా.. అందుకు అనుగుణంగా మున్సిపాలిటీ సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని 22 వార్డుల పరిధిలో కొత్తగా కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. అయితే చాలాచోట్ల మురుగు పారేందుకు సరైన కాల్వలు లేవు. శ్రీశైలం– హైదరాబాద్ హైవే సమీపంలో ఇళ్ల మధ్యనే మురుగు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుంది. ఇక్కడికి సమీపంలోనే పాఠశాల కొనసాగుతున్నా అధికారులకు పట్టడం లేదు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేస్తే దుర్గంధం తొలగడంతోపాటు, దోమల సమస్య తీరుతుంది. సుభాష్నగర్కాలనీ, మార్గదర్శికాలనీ, జింజర్ హోటల్ సమీపంలో, విద్యానగర్, తిలక్నగర్, కల్యాణ్నగర్– 1, 2, పద్మశ్రీనగర్, వాసవీనగర్ తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిధులు కేటాయిస్తాం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ అత్యవసరంగా మురుగు కా ల్వల నిర్మాణం అవసరం ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి పన్నులు చెల్లిస్తున్నాం.. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తేనే దుర్గంధం తొలగిపోయి.. దోమల బాధ తగ్గుతుంది. పెరుగుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పన్నులు చెల్లిస్తున్నా.. సదుపాయాల కల్పన అంతంత మాత్రమే ఉంది. – మురళి, వాసవీనగర్, కల్వకుర్తి ● -
విలీన గ్రామాలపై చిన్నచూపు
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఎండబెట్ల, ఉయ్యాలవాడ, దేశిఇటిక్యాల, నాగనూల్ గ్రామాలను విలీనం చేశారు. అయితే ఆయా గ్రామాలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం అయిన తర్వాత పక్కా ప్రణాళికతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేయడంతో మురుగు ప్రవాహం నిలిచిపోయింది. అయితే విలీనమైన వార్డుల్లో ఎలాంటి పనులు చేపట్టకపోవడం, ఆయా వార్డులను మున్సిపల్ సిబ్బంది పట్టించుకోపోవడంతో పారుశుద్ధ్యం లోపించింది. కనీసం ఓపెన్ డ్రెయినేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై మురుగు పారుతూ.. కాలనీలు కంపు కొడుతున్నాయి. దీంతో వార్డుల్లో ప్రజలు దోమలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఓపెన్ డ్రెయినేజీలు ధ్వంసం కావడంతో మురుగు ప్రవాహానికి ఆటంకం కలుగుతోంది. పట్టణంతో సమానంగా ఇంటి పన్నులు కడుతున్న తమకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని విలీన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఆ భూములు గిరిజనులకే దక్కాలి
ఊర్కొండ: గిరిజనులకు సంబంధించిన భూములు వారికే దక్కాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. మండలంలోని గునగుండ్లపల్లి పంచాయతీ రెడ్యాతండా సమీపంలోని ఊర్కొండపేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నం.186లో గల 109 ఎకరాల అసైన్డ్ భూమి తరతరాల నుంచి గిరిజనుల స్వాధీనంలో ఉందని, ఆ భూమిని ప్రస్తుతం ఇతరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో తండావాసులు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రెడ్యాతండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సందర్శించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసైన్ భూములు గిరిజనులకు దక్కే విధంగా చూస్తామని, అదేవిధంగా తండా ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ వారు ఏనాడు కూడా ఇక్కడ సేద్యం చేయలేదని, అలాంటి వారు ఇప్పుడు గిరిజనులను మా భూములు మాకే చెందుతాయని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. గిరిజనులకు సంబంధించిన భూములను గిరిజనులకు చెందేలా తనవంతు కృషిచేస్తానన్నారు. అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అసైన్డ్ భూములు నిరుపేద గిరిజనులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని, గిరిజన నాయకులు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక్కడ కొందరు కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు వాస్తవాలను నెల రోజుల్లో తెలియజేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ రామకోటి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ ఎస్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు రాజునాయక్, తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రేమ్నాయక్, నాయకులు జనార్దన్రెడ్డి, రమేష్నాయక్, దుర్గాప్రసాద్, రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ -
విద్యతోనే దివ్యాంగుల్లో ప్రగతి సాధ్యం
నాగర్కర్నూల్: దివ్యాంగ విద్యార్థుల ప్రగతి విద్య ద్వారానే సాధ్యమని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సఖి కేంద్ర ఆవరణలో జిల్లా విద్యా శాఖ సమగ్ర శిక్ష అభియాన్, అలింకో సంస్థ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఈఓ రమేష్కుమార్ దివ్యాంగులకు మంగళవారం ఉచితంగా సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 ఏళ్లలోపు వివిధ లోపాలతో బాధపడుతున్న వారిని గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించి 102 మంది దివ్యాగులకు రూ.12 లక్షల వ్యయంతో 233 పరికరాలు పంపిణీ చేశామన్నారు. ఇందులో 78 వినికిడి, 22 చక్రాల కుర్చీలు, 36 సీపీ కుర్చీలు, 16 రొలేటర్స్, 20 చంక కుర్చీలు, 5 బ్రెయిలీ కిట్స్, 2 సుకన్య కేన్ కిట్స్, 93 ఎంఎస్ఐ ఈడీ కిట్స్, 9 ఫుట్ ఆర్థోన్లు ఉన్నాయన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు మంచి విద్యను అందిస్తే వారి భవిష్యత్ బంగారుమయం అవుతుందని, ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 3 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని దివ్యాంగ విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించేందుకు తల్లిదండ్రులతోపాటు ప్రత్యేక అవసరాల ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. డీఈఓ రమేష్కుమార్ మాట్లాడుతూ ప్రతి భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన ఉపాధ్యాయులతో విద్య అందించడంతోపాటు, ప్రతి శనివారం దివ్యాంగ విద్యార్థుల ఇంటి దగ్గరే ఫిజియోథెరపీ నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ వెంకటయ్య, సఖి కోఆర్డినేటర్ సునీత, ప్రత్యేక అవసరాలు ఉపాధ్యాయులు ప్రకాష్, రాఘవేందర్, శ్యామ్, శ్రీలత, రేనమ్మ, వసంత, విజయలక్ష్మి, విజయ, జయప్రకాష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
రంగంలోకి రోబోలు
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత రోబోలను బుధవారం నుంచి రంగంలోకి దింపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన ఎన్వీ రోబో టిక్స్ బృందం మంగళవారం సొరంగం వద్దకు చేరుకుంది. మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. వాటిని ఆప రేట్ చేసే మాస్టర్ రోబోను సొరంగం వద్దకు తీసుకొచ్చారు. రోబోటిక్ నిపుణులు విజయ్, అక్షయ్ నేతృత్వంలో రోబోల అనుసంధానం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముమ్మరంగా గాలింపు సొరంగంలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే వెలికి తీయగా, మిగతా ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2 నుంచి డీ1 స్పాట్ల మధ్యలో ట్రెంచ్ను తవ్వుతున్నారు. టీబీఎం కట్టర్ హెడ్ భాగానికి వెనుకవైపు నుంచి డీ1 వరకు సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో ప్రతీ 10 మీటర్లకు ఒక చోట తవ్వకాలు జరుపుతూ గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా చోట్ల మళ్లీ కడావర్ డాగ్స్తో గాలింపు చేపడుతున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మనుషుల కన్నా 15 రెట్ల వేగం సొరంగం లోపల 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా.. చివరి 20 మీటర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పైకప్పు వదులుగా ఉండి మళ్లీ కూలే అవకాశం ఉండటంతో రోబోల ద్వారా రెస్క్యూ పనులను చేపట్టనున్నారు. సొరంగంలోని పెద్ద రాళ్లను, శిథిలాలను తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు ఒకటి, బురదను తొలగించేందుకు మరొక రోబోను వినియోగించనున్నారు. సొరంగం చివరన 200 మీటర్ల విస్తీర్ణంలో సుమారు 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి, బురద పేరుకుని ఉంది. రోబోల ద్వారా మూడు రోజుల్లో మొత్తం మట్టి, శిథిలాలను తొలగించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. రోబోల రెస్క్యూ ఆపరేషన్ను సొరంగంలోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ఇందుకోసం ఇన్డెప్త్ ఏఐ కెమెరా, లైటర్ టెక్నాలజీ వినియోగించనున్నారు. -
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు
నాగర్కర్నూల్: ఎండాకాలంలో వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలతో కలిగే అనారోగ్యాల నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎండలతో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వయోవృద్ధులు అనారోగ్యానికి గురవుతారని, వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఎండాకాలంలో దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని, దీంతో డీహైడ్రేషన్కు గురికాకుండా ఉంటామన్నారు. బయటికి వెళ్లేటప్పుడు తమ వెంట తప్పకుండా తాగునీరు తీసుకెళ్లాలని, ఇంట్లో ఉండే మజ్జిగ, నిమ్మరసం, అంబలి వంటివి తరుచుగా తీసుకోవాలన్నారు. వీలైతే సీజనల్ ఫ్రూట్స్ పుచ్చకాయ, కర్భూజ, ఆరేంజ్, దోసకాయ లాంటి పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటికి వెళ్లకూడదన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనికి వెళ్లేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ అన్ని ఆరోగ్య, పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది, ఆశాల దగ్గర ఓఆర్ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచామన్నారు. ఆల్కహాల్, టీ, కాఫీ, శీతలపానియాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానియాలు తీసుకోరాదని, చెప్పులు లేకుండా బయటకు వెళ్లవద్దన్నారు. ఎవరికై నా ఎండవలన తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీపీఓ రేనయ్య, ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, వైద్యులు రాజశేఖర్, ప్రదీప్, శివ, ఎపిడమాలజిస్టు ప్రవలిక, పర్యవేక్షణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పాల బిల్లులు చెల్లించాలని రాస్తారోకో
వెల్దండ: తమకు రావాల్సిన పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించాలని పాడి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్లో హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ గతంలో పాల బిల్లులు 15 రోజులకు ఒకసారి చెల్లించేవారని, ప్రస్తుతం నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారని ఆరోపించారు. పెద్దాపూర్ విజయ డెయిరీ వారికి దాదాపుగా 5 బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గ్రామంలోని రెండు పాల కేంద్రాలకు దాదాపు రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. ఎప్పుడూ లేని విధంగా పాల బిల్లుల కోసం పాడిరైతులు రోడ్డు ఎక్కుతున్నారని వాపోయారు. పాల బిల్లులు చెల్లించాలని వెల్దండ బీఎంసీయూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దాదాపు గంటపాటు రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న వెల్దండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాడిరైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో పాడి రైతులు వెంకట్రెడ్డి, శంకర్నాయక్, వీరారెడ్డి, శేఖర్, ఆంజనేయులు, పర్వతాలు, అయ్యన్న, అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’కి 30 అర్జీలు
నాగర్కర్నూల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 6.. నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 6 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 3 తగు న్యాయం చేయాలని, 2 భూమి పంచాయతీ, 1 భార్యాభర్తల గొడవకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎస్సీ బాలికల గురుకులం తనిఖీ కొల్లాపూర్: పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకులాన్ని జోనల్ అధికారి ఫ్లారెన్స్రాణి సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, సౌకర్యాల గురించి ఆరాతీశారు. విర్థినులకు వడ్డించే భోజనాలను రుచి చూశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలోని టాయిలెట్లను పరిశీలించి.. పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పదో తరగతి పరీక్షలు బాగా రాసి.. మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఆమె వెంట పాఠశాల ఉపాధ్యాయురాళ్లు తదితరులున్నారు. ‘108’ సేవలను వినియోగించుకోండి కల్వకుర్తి రూరల్: ప్రతిఒక్కరు అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్స్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్లో వివిధ రకాల పరికరాలు, వాటి పనితీరు, మందులు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ కాల్ సెంటర్ నుంచి ఎమర్జెన్సీ కేస్ వచ్చిన వెంటనే బయలుదేరి బాధితులను ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తరలించాలని సూచించారు. తాము అందిస్తున్న అంబులెన్స్ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటీవ్ శ్రీనివాస్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వరప్రసాద్, మహేష్, గణేష్, మారుతి, పైలట్ అశోక్, భీమయ్య, సాయిబాబు పాల్గొన్నారు. నేటినుంచి కాచిగూడ డెమో రైలు పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,061 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.4,691 ధరలు లబించాయి. అదేవిదంగా కందులు గరిష్టంగా రూ.6,851, కనిష్టంగా రూ.5,400, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,361, కనిష్టంగా రూ.2,001, పెబ్బర్లు రూ.6,500, జొన్నలు రూ.3,601, మినుములు రూ.7.417 ధరలు లభించాయి. -
చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి
అచ్చంపేట రూరల్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దోమలపెంట ఎస్ఎల్బీసీ క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ బదావత్ సంతోష్ ఈ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సాగునీటి కొరత రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, ఎక్కడా పంటలు ఎండి పోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ వివరిస్తూ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులకు తగు సూచనలు, సలహాలు అందిస్తూ మండల వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. వరిపంట సాగునీరు అందించేందుకు వేసవిని దృష్టిలో పెట్టుకొని నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించామన్నారు. కాల్వలను సందర్శించాలని, నీరు వృథా కాకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పొదుపుగా వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు సాగునీటి సరఫరాపై ముఖ్యంగా నీటి నిర్వహణ, మోటార్లకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలన్నారు. -
పాడిపంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలి
తిమ్మాజిపేట: పచ్చని పంటలతో అధిక దిగుబడి సాధించి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాజిపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర, వాల్మీకి మహర్షి ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. స్థానికంగా ప్రజలు అడగక ముందే గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. ఒక్కొక్కటిగా పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు యాగశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమ ర్పించారు. వాల్మీకి, సీతారామచంద్రులను దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. అప్పాజిపల్లి గ్రామంలో ఈ నెల 8 నుంచి నిర్వహించిన దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయస్వామి, వాల్మీకి విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను పూజారి గంగాధరశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు వివేక్రెడ్డి వాల్మీకి ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి రూ.25 వేలు అందజేశారు. మూడు రోజులపాటు స్వప్న– యశ్వంత్, స్వాతి– నర్సింహస్వామి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. వాల్మీకి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
‘పది’ ప్రశ్నపత్రాల తరలింపు
కందనూలు: ఈ నెల 21 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో జిల్లాలోని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్స్టేషన్లకు తరలించారు. సోమవారం ఉదయం సెట్–2 పదో తరగతి ప్రశ్నపత్రాల బండిళ్లు డీఈఓ రమేషకుమార్ పర్యవేక్షణలో విద్యా శాఖ అధికారులు ప్రత్యేక వాహనాల్లో జిల్లాలోని 59 పరీక్ష కేంద్రాల పరిధిలో ఉన్న 18 పోలీస్స్టేషన్లకు 6 రూట్లలో అత్యంత పకడ్బందీగా తరలించడం జరిగింది. ఈ నెల 12న సెట్–1 ప్రశ్నపత్రాలు జిల్లాకేంద్రానికి రానున్నాయని డీఈఓ చెప్పారు. ప్రశ్నపత్రాల తరలింపులో జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్రావు, ఎంఈఓలు శంకర్నాయక్, బాలకిషన్, భాస్కర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రఘునందన్శర్మ, శ్రీనివాస్రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు జాతీయ కమిషన్ సభ్యుడి రాక నాగర్కర్నూల్: జిల్లా కేంద్రానికి జాతీయ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ మంగళవారం వస్తున్నారని కలెక్టరేట్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
● అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దకొత్తపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పెద్దకొత్తపల్లి మండలంలోని వెనచెర్ల నుంచి గన్యాగుల వరకు బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నక్కలపల్లి, ముష్టిపల్లి గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. పాత యాపట్లలో రూ. 2.95కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి, చంద్రబండ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సాతాపూర్లో 200 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాగా.. అందుకు సంబంధించిన పత్రాలను మంత్రి అందజేశారు. అదే విధంగా జగన్నాథపురంలో ఆంజనేయస్వామి నూతన ఆలయంలో దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా పన మహోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికే పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కాగా, సాతాపూర్కు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, మైసమ్మ ఆలయ చైర్మన్ శ్రీనివాసు లు, దండు నర్సింహ, గోపాల్రావు, శివకుమార్రావు, వెంకటేశ్వర్రావు, రమేష్రావు, రాజు, రవి కుమార్, బాలస్వామి, చంద్రయ్య, సత్యం, లక్ష్మణ్రావు, విష్ణు, వెంకటేశ్వర్రెడ్డి, కొండల్గౌడ్ పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి కృషి అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతులు కల్పించి.. మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
‘భవిత’కు భరోసా..
విలీన విద్యావనరుల కేంద్రాలకు నిధులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా.. భవిత కేంద్రాల్లోని పిల్లల విద్యాభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా చాలా ఏళ్ల తర్వాత నిధులు మంజూరు చేసింది. భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఐఈఆర్పీలతో విద్య అందిస్తున్నారు. ఫిజియోథెరపీ, తదితర చికిత్సలు అందిస్తూ.. వారిలో మార్పునకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 5 కేంద్రాలకు రూ. 10లక్షల విలువైన సామగ్రి అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలు, ఐఈఆర్పీలకు కుర్చీలు, చికిత్స అందించేందుకు అనుకూలంగా టేబళ్లు, మసాజ్ బాల్, డంబుల్స్, రౌండ్ టేబుల్, అల్మారాలు, తదితర 115 రకాల వాటిని సమకూర్చేలా ఉన్నతాధికారులు మార్గనిర్దేశం చేశారు. ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, భవిత కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న పాఠశాల హెచ్ఎంల కమిటీ నేతృత్వంలో అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటారు. అచ్చంపేట రూరల్: విలీన విద్యావనరుల (భవిత) కేంద్రాలకు నిధులు మంజూరయ్యా యి. కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన సామగ్రి, వసతుల కల్పన కోసం ఒక్కో కేంద్రానికి రూ. 2లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తూ.. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 10 – 12 ఏళ్ల తర్వాత భవిత కేంద్రాలకు నిధులు మంజూరు కావడం గమనార్హం. ప్రత్యేక అవసరాలు కలిగిన 18 ఏళ్లలోపు వారికి ఆటపాటలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భవిత కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాఠశాల స్థాయి వయసు కలిగిన వారికి భవిత కేంద్రాల్లో.. 15 ఏళ్లు పైబడిన వారికి కళాశాలల్లో ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, మాట్లాడించడం, నడిపించడం వంటి వాటి కోసం ప్రత్యేకంగా నిపుణులను నియమించారు. గతంలో ఉమ్మడి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున కేటాయించగా.. ఇటీవల కొత్తగా ఏర్పడిన మండలాల్లోనూ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి, తదితర సౌకర్యాలను సమకూర్చారు. అయితే సొంత భవనాలు కలిగిన కేంద్రాల్లో వివిధ పరికరాల ఏర్పాటు కోసం నిధులను వినియోగించనున్నారు. అవసరమైన సామగ్రి కొనుగోలుకు అవకాశం ఆటపాటలతో అందనున్న విద్య ఐదు సెంటర్లకు మంజూరు.. జిల్లాలో సొంత భవనాలు ఉన్న ఐదు భవిత కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో వివిధ రకాల సామగ్రిని కొనుగోలు చేస్తాం. విలీన విద్యావనరుల కేంద్రంలోని విద్యార్థుల విద్యాభ్యున్నతి కోసం అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలిస్తున్నాం. – వెంకటయ్య, జిల్లా విలీన విద్య సమన్వయకర్త -
రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
వెల్దండ: మండలంలోని గుండాలలో శ్రీఅంబా రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించి.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు శివపార్వతులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు శివకుమార్ శర్మ, నరహరి శర్మ, సంతోష్ శర్మ, సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి నాగర్కర్నూల్రూరల్: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎంఎస్ఎంఏఈ ద్వారా కుట్టు శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఆదివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్ కొత్త శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జీపీ కార్మికులకు రూ.26వేల వేతనం ఇవ్వాలి చారకొండ: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెల శుభ్రత కోసం కార్మికులు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్నా.. ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ మండల కార్యదర్శి బాలస్వామి, గెల్వయ్య, మల్లయ్య, వెంకటేశ్, మొగులమ్మ, శేఖర్, రాంకోటి తదితరులు ఉన్నారు. వేరుశనగ @ 6,969 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం 113 మంది రైతులు 2,026 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 6,969, కనిష్టంగా రూ. 5,206, సరాసరి రూ. 6,312 ధరలు వచ్చాయి. అదే విధంగా 14 మంది రైతులు 112 బస్తాల కందులను అమ్మకానికి తీసుకురాగా.. రూ. 6,999 ధర పలికింది. -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమా రు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు.. ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం. – మహమ్మద్ రషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు●వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది.. మేం మొత్తం 24 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది. – ఖలీల్ ఖరేషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు 24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. -
SLBC: ఒక మృతదేహం వెలికితీత
నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. -
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
SLBC: కాంక్రీట్లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్లు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్వెస్లీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జబ్బార్, రాజు, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, మధన్, బాలస్వామి, గట్టయ్య, రాములు, శ్రీను, బాలరాజు, రాబర్ట్, మద్దిలేటి, మన్యం, సాయిలీల పాల్గొన్నారు. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రపస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని పనులకే పరిమితం
ఉప్పునుంతల: జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏయే పనులు చేసుకోవచ్చు.. ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చనే.. కనీస అవగాహన లేక ప్రతిఏటా చేసిన ఆ ఐదారు రకాల పనులే చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆయా పనులపై రైతులకు, కూలీలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికార యంత్రాంగం. ఈ పథకంలో దాదాపుగా 266 రకాల పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్నా అందులో పట్టుమని పదికి మించి పనులు చేపట్టడం లేదు. 2006లో ఈజీఎస్ పథకం ప్రారంభమై దాదాపుగా 19 ఏళ్లు కావొస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపచెట్లు తొలగించడం, భూమి చదును చేసుకోవడం వంటి నామమాత్రపు పనులే ప్రధానంగా కనపిస్తున్నాయి తప్పా ఇతర పనులతో ప్రయోజనం పొందడం లేదు. పనుల ఎంపికపై ఏడాదిలో ఒక్కరోజు గ్రామసభలు నిర్వహించి.. రైతులు, కూలీల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం అందుకు కారణమవుతుంది. దీంతో పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్ వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. గత రెండు వారాలుగా కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే పలు రకాల పనులు ఉన్నాయి. కంపోస్టు ఎరువు గుంత, వ్యవసాయ పొలాల్లో పంట నూర్పిడి కళ్లాలు, వ్యవసాయ పొలాల్లోకి రోడ్లు వేసుకోవడం, భూ ఉపరితల నీటి కుంటలు, కొత్త సేద్యపు బావుల తవ్వకం, వర్మీ కంపోస్టు పిట్లు, కొత్తగా పంట కాల్వల ఏర్పాటు, ఉమ్మడి భూముల్లో పశువుల నీటి కోసం కుంటల నిర్మాణం, పశువులు, జీవాల తాగునీటి తొట్టీల నిర్మాణాలు, పశువులు, మేకల పాకలు, కోళ్ల ఫారం నిర్మాణాలు, గడ్డి పెంపకం, భూమి సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వడం, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణాలు, శ్మశాన వాటికల స్థలాల అభివృద్ధి, శ్మశాన వాటికల వద్దకు రోడ్లను వేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో రహదారుల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, రైతుల పంట పొలాల గట్లపై మొక్కల పెంపకం, తాటి వనాల పెంపకం వంటి పలు రకాల పనులను చేపట్టి రైతులు వ్యక్తిగతం గాను, సామూహికంగా ఈజీఎస్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు పూర్తిస్థాయిలో ఈజీఎస్లో చేసుకునే అవకాశం ఉన్న పనులపై రైతులు, కూలీలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది పనిదినాల లక్ష్యం 38.30 లక్షలు గ్రామసభల్లో వివరిస్తున్నాం.. ఈజీఎస్లో పనుల ఎంపిక కోసం అక్టోబర్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి పూర్తిగా పనుల వివరాలను వివరిస్తున్నాం. పథకంలో నిర్దేశించిన పనులు చేసుకోవడానికి ముందుకు వచ్చే రైతుల పొలాల్లో పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. జాబు కార్డు కలిగి ఉండి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్నకారు రైతులు తాము చేయించుకోదలిచిన పనులను గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా దరఖాస్తు చేసుకుంటే పనులు చేయిస్తాం. జాబ్కార్డులేని కూలీలు దరఖాస్తు చేసుకుంటే జాబ్కార్డులు అందజేసి పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పశువుల మేతగా అజోలా పెంపకం, సేంద్రియ ఎరువుల తయారీ, పశువుల పాక నిర్మాణం వంటివి ఈజీఎస్లో ప్రోత్సహిస్తున్నాం. – సుదర్శన్గౌడ్, ఈజీఎస్ ఏపీఓ, ఉప్పునుంతల మండలం అవగాహన లేకనే.. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎన్నో రకాల పనులు చేసుకునే అవకాశం ఉన్నా మాకు తెలియకపోవడంతో ప్రయోజనం పొందలేకపోతున్నాం. గ్రామాలు, తండాల్లో వారం రోజులు గ్రామసభలు నిర్వహించి ఈజీఎస్లో చేసుకునే అవకాశం ఉన్న పనులపై అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఇన్నేళ్లు గడిచినా ఈజీఎస్తో మేం ఏమాత్రం ప్రయోజనం పొందలేదు. ఇప్పటికై నా మాలో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే వాటిని ఉపయోగించుకుంటాం. – పూల్యానాయక్, రైతు, గుట్టమీదితండా, ఉప్పునుంతల మండలం ●ప్రయోజనం చేకూర్చే పనులెన్నో.. యాక్టివ్గా ఉన్నవి 1,10,095 మొత్తం జాబ్ కార్డులు 1,94,725 గ్రామాల్లో ఈజీఎస్పై కొరవడిన అవగాహన ప్రయోజనం చేకూర్చేలా 266 రకాల పనులు ఐదారింటితోనే సరిపెట్టుకుంటున్న రైతులు, కూలీలు పట్టింపులేని అధికారులు, ప్రజాప్రతినిధులుపనిచేస్తున్న కూలీలు 1,81,605 -
రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం
నాగర్కర్నూల్ క్రైం: కక్షిదారులు ఎవరైనా రాజీమార్గం ద్వారా కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి రాజేష్బాబు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ కక్షిదారులకు ఒక మంచి అవకాశం అని, ఏళ్లతరబడిగా కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో శనివారం జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 33,582 కేసులు పరిష్కరించామని, రూ.66,18,763 నగదు వసూలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, సెకండ్ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి టౌన్: కక్షిదారుల రాజీమార్గంతోనే చాలా కేసులు పరిష్కారమవుతాయని కల్వకుర్తి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీదేవి అన్నారు. శనివారం కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో కల్వకుర్తి కోర్టు పరిధిలో 189 కేసులలో కక్షిదారులు రాజీపడ్డారన్నారు. సీనియర్ సివిల్ కోర్టులో రెండు ఓఎస్ కేసులు పరిష్కారం కాగా, మార్నింగ్ కోర్టులో 84 అడ్మిషన్ కేసులు పరిష్కారం కాగా, వాటికి సంబంధించి రూ.43,800 జరిమానాలు విధించారు. జూనియర్ సివిల్ కోర్టులో 103 కేసులకు పరిష్కారం లభించగా వాటిలో అడ్మిషన్ కేసులు 81 పరిష్కారమవ్వగా, రూ.2.3 లక్షల జరిమానా విధించారు. 21 లోక్ అదాలత్ కేసులలో రాజీకుదరగా, ఒక సివిల్ కేసులో కక్షిదారులు పరిష్కారమయ్యారని జడ్జిలు చెప్పారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కావ్య, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు పరిధిలోని పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు. టెండర్ల ఆహ్వానం నాగర్కర్నూల్ క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయానికి కావాల్సిన ఫర్నిచర్తోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి ఆసక్తి ఉన్నవారు టెండర్ వేయవచ్చని జిల్లా జడ్జి రాజేష్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ నెల 12 వరకు సీల్డ్ కవర్లో కొటేషన్ వే యాలన్నారు. రెండు కంప్యూటర్లతోపాటు మూ డు ప్రింటర్లు, ఒక వెబ్ కెమెరా, నాలుగు ఆఫీస్ టేబుళ్లు, రెండు అల్మారాలు, ఒక ఎయిర్ కూల ర్, వాటర్ డిస్పెన్సర్కు టెండర్ వేయాలన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి నాగర్కర్నూల్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ మేరకు వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి అన్నారు. సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రథమ కార్యవర్గ సమావేశానికి సంఘం మురళి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు సంఘ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం పర్వత్రెడ్డి మాట్లాడుతూ బకాయి డీఏలను ప్రకటించి, పీఆర్సీ నివేదిక తెప్పించాలన్నారు. అలాగే 2008 డీఎస్సీలో ఎంపికై ఇటీవల ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఉపాధ్యాయులను సంఘంలోకి ఆహ్వానించి సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హన్మంతురెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్, అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మారావు, రమేశ్, కన్వీనర్లు అనిల్కుమార్రెడ్డి, ప్రభాకర్, రఘు రాంరెడ్డి, జమీల్ అహ్మద్, వరప్రసాద్, మధుసూదన్రెడ్డి, బాల స్వామి, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. -
‘కమర్షియల్’పై దృష్టి
మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన బహుళ అంతస్థుల భవనాల పన్నులు ● పన్ను వసూలుకు పుర అధికారుల ప్రత్యేక కార్యాచరణ ● భవనాల ముందు డప్పు కొట్టడం, సీజ్ చేస్తున్న వైనం ● జిల్లాలో రూ.18.67 కోట్లకు గాను రూ.8.21 కోట్లు మాత్రమే రాబడి ● మరో 22 రోజుల్లో ముగియనున్న గడువురాజకీయ ఒత్తిళ్లతో.. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఇళ్లకు సంబంధించి పన్నులు వసూలు బాగానే ఉన్నా.. కమర్షియల్ భవనాలకు సంబంధించి వసూలు మాత్రం జరగడం లేదు. గత కొన్నేళ్లుగా పన్నులు కట్టకుండా ఉండడం, కొంత రాజకీయం ఒత్తిళ్లు కూడా ఉండడంతో అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో చూసీచూడనట్లుగా వదిలేశారు. అయితే ప్రస్తుతం అధికారులపై కూడా పన్నుల వసూళ్లు చేయాలని ఒత్తిళ్లు వస్తుండటంతో కమర్షియల్ భవనాలపై ప్రత్యే శ్రద్ధ చూపుతున్నారు. ఎక్కువ మొత్తంలో పెండింగ్లో ఉన్న ఫంక్షన్ హాళ్లు, ఇతర షట్టర్లకు నోటీసులు ఇవ్వడంతోపాటు కొన్నిచోట్ల వాటికి తాళం కూడా వేస్తున్నారు. ఇటీవల కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ ఫంక్షన్హాల్తోపాటు కొన్ని కమర్షియల్ భవనాలను సైతం సీజ్ చేయడం గమనార్హం. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో పెండింగ్లో ఉన్న కమర్షియల్ భవనాల ముందు డప్పు చాటింపు వేసి పన్నులు కట్టేలా అవగాహన కల్పిస్తూ వినూత్న రీతిలో పన్నులు వసూలు చేస్తున్నారు. మరో 22 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ఆయా మున్సిపల్ కమిషనర్లు వందశాతం వసూలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. మున్సిపాలిటీల్లో భవనాల పన్నులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇలా.. -
‘భరోసా’గా షీటీం
● అత్యాచార, పోక్సో బాధితులకు అండగా నిలుస్తున్న కేంద్రం ● న్యాయ, వైద్యపరమైన సేవలు అందిస్తున్న సిబ్బంది ● షీటీంతో కలిసి సమన్వయంతో ముందుకు.. ● ఏడాది కాలంలో 89 కేసుల పరిష్కారం నాగర్కర్నూల్ క్రైం: సమాజంలో ప్రతిరోజు మైనర్లతోపాటు మహిళల పట్ల ఎక్కడో ఒకచోట వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. వేధింపులకు గురైన చాలామంది తమ బాధను బయటకు చెప్పుకోలేక మదనపడుతుంటే.. మరికొందరు ధైర్యం చేసి ముందుకు వచ్చి వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో జిల్లా పోలీస్ శాఖలోని షీటీం, భరోసా కేంద్రం వారికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూస్తుంది. ముఖ్యంగా అత్యాచార ఘటనల్లో బాధితులకు వెంటనే న్యాయం చేయడంతోపాటు సంబంధిత వివరాలు బయటకు రాకుండా.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా భరోసా కేంద్రం కృషిచేస్తుంది. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులపై సత్వరమే స్పందించేందకు గతేడాది ఫిబ్రవరిలో భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. షీటీంను సంప్రదించిన వారికి భరోసా కేంద్రం ద్వారా న్యాయం జరిగేలా చూస్తున్నారు. వివరాలు గోప్యంగా.. జిల్లాకేంద్రలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు 90 కేసులను పరిష్కరించారు. ఇందులో చిన్నారులపై జరిగిన 76 పోక్సో, 9 అత్యాచార, 5 ఇతర కేసులు ఉన్నాయి. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులతోపాటు మహిళల వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు బాధితులను పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్లకుండా భరోసా కేంద్రంలోనే వివరాలు సేకరించి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. వైద్య సేవలను సైతం అందిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 6న ప్రారంభించిన భరోసా కేంద్రం ద్వారా లైంగిక వేధింపులతోపాటు మహిళలపై జరిగే దాడుల నుంచి రక్షణ పొందేలా 43 అవగాహన సదస్సులు నిర్వహించారు. భరోసా కేంద్రం నిధుల నుంచి పలువురు బాధితులకు ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. నిరంతరం అందుబాటులో.. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు భరోసా కేంద్రలో సేవలు అందించి న్యాయం అందించేందుకు ఏడుగురు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందులో ఒక మహిళా ఎస్ఐ, భరోసా కోఆర్డినేటర్, ముగ్గురు లీగల్ సపోర్ట్ పర్సన్లు, ఏఎన్ఎం, రిసెప్షనిస్టు పనిచేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు.. మహిళలకు అండగా షీటీం నిరంతరం పనిచేస్తుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేధింపులను అడ్డుకునేందుకు బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలల్లో నిఘా ఉంచుతున్నారు. జిల్లాలో ఎక్కువగా షీటీంను సంప్రదిస్తున్న కేసుల్లో వేధింపులవే ఉంటున్నాయి. వేధింపులకు గురైన వారు నేరుగా షీటీంను సంప్రదిస్తే నిందితులపై కేసులు నమోదు చేయడంతోపాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. షీటీంకు గతేడాది 166 ఫిర్యాదులు రాగా.. 59 ఎఫ్ఐఆర్లు, 22 ఈ–పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే 163 అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 34 ఫిర్యాదులు రాగా.. 10 ఎఫ్ఐఆర్లు, 2 ఈ–పెట్టీ కేసులు నమోదు చేయడంతోపాటు 37 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. సత్వరం స్పందిస్తాం.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు సత్వరమే న్యాయం జరిగేందుకు భరోసా కేంద్రం కృషి చేస్తుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన భరోసా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 90 మందికి న్యాయం జరిగేలా చూసాం. ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే న్యాయం కోసం డయల్ 100, 1098, 181ను సంప్రదించాలి. – గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ -
దుందుభీ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం
తాడూరు: మండలంలోని శిర్సవాడ అనుసరించి పారుతున్న దుందుభీ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇక్కడ బ్రిడ్జి లేకపోవడంతో ఏటా వానాకాలంలో నాగర్కర్నూల్, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్రెడ్డి గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.20.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. ఈ మేరకు నిధుల మంజూరుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గాలకు మధ్య రాకపోకల కష్టాలు తీరనున్నాయి. త్వరలో పనులు చేపట్టి బ్రిడ్జిని వీలైనంత తొందరగా అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలోనూ ఇక్కడ ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో పలు కథనాలు సైతం వెలువడ్డాయి. -
No Headline
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. -
అన్నిరంగాల్లో మహిళల ముందంజ
నాగర్కర్నూల్ క్రైం: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని జిల్లా జడ్జి రాజేష్బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారని, ప్రతి పురుషుడి విజయం వెనక సీ్త్ర కృషి ఉంటుందన్నారు. పూర్వపు రోజుల్లో సీ్త్రలు ఇంటికే పరిమితం అయ్యేవారని, ప్రస్తుతం మహిళలు చదువులోనే కాకుండా రాజకీయాలు, వ్యాపారం, ఇతర అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా ముందడుగు వేస్తున్నారని కొనియాడారు. సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ సీ్త్రలు అన్నిరంగాల్లో రాణించాలంటే కుటుంబ సభ్యుల సహకారం అందించాలన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్నిరకాల హక్కులు కల్పించడం జరిగిందన్నారు. మహిళలు నిర్భయంగా వారికి నచ్చిన రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి పిలుపునిచ్చారు. అనంతరం న్యాయ శాఖ మహిళా ఉద్యోగులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ జూనియర్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి పర్వత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
కోడేరు: ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని పస్పుల బ్రాంచ్ కెనాల్ కాల్వ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రిజర్వాయర్ వద్ద ఉన్న ఐదు మోటార్లు పనిచేయడం లేదని, ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. అందుకు మెయిన్ కెనాల్కు నీరు తక్కువగా రావడంతో వివిధ మండలాలకు వెళ్లే నీరు రైతులకు అందడం లేదన్నారు. నీటి సామర్థ్యం పెంచడంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. కోడేరు, పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఈఈ రవీందర్, డీఈ లింగన్న, సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ రాంమోహన్రావు తదితరులు పాల్గొన్నారు. 10న ఇంటర్వ్యూ నాగర్కర్నూల్ క్రైం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన నియమించేందుకు సోమవారం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 3 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. -
శెభాష్.. నారాయణమ్మ
పాడి పరిశ్రమతో రాణింపు ● మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ముందుకు..నారాయణపేట: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన.. కేవలం వంటింటికే పరిమితం కాకూడదన్న తలంపు.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశయం ముందు కష్టాలు, అలసట పటాపంచలు అయ్యాయి. ఫలితంగా తనతో పాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నారాయణపేటకు చెందిన కాకర్ల నారాయణమ్మ. పట్టణంలోని సింగార్బేష్కు చెందిన కాకర్ల నారాయణమ్మ 1983లో భర్త కాకర్ల భీమయ్య ప్రోత్సాహంతో రూ.5 వేల పెట్టుబడితో రెండు గేదెలను కొనుగోలు చేసి పాల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంతింతై.. వటుడింతై’ అన్న చందంగా ఆ వ్యాపారం ప్రస్తుతం 30 గేదెలతో నెలకు రూ.1.20 లక్షలు ఆదాయం సంపాదిస్తూ.. ఆదర్శంగా నిలిచింది. నిత్యం కష్టజీవిగా పరితపిస్తూ 42 ఏళ్లుగా గేదెలతో చిన్నపాటి కుటీర పరిశ్రమగా మార్చుకుంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తానూ సంపాదించాలనే తాపత్రయంతో పాల వ్యాపారంలో రాణిస్తోంది. తనతోపాటు ఆరుగురికి ఉపాధిని కల్పిస్తోంది. గేదెల నుంచి పాల దిగుబడితో రోజుకు రూ.4వేల ఆదాయం ఆర్జిస్తోంది. ఆమె ఉత్తమ పాడి రైతు అవార్డును సైతం అందుకుంది. రుణం ఇవ్వకపోయినా.. పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, ఆ ఆర్థిక సహాయానికి కాకర్ల నారాయణమ్మ ఇంత వరకు నోచుకోలేదు. ఆమె తమ స్వయం కష్టార్జితంతోనే పాడి పరిశ్రమను అంచెలంచెలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారే తప్ప ఏ బ్యాంకు రుణ సదుపాయం అందిస్తామని ముందుకు రాలేదు. ఎంతో శ్రమిస్తున్న ఈ మహిళకు పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, బ్యాంకర్లు ఆర్ధిక సహాయం అందించి మరింత చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళల సమస్యల పరిష్కార వేదికలు కొడుకు పేరిట ట్రస్టు ప్రతిఏటా నిరుపేద జంటలకు బంగారు పుస్తె, మెట్టెలు అందిస్తూ.. వృద్ధులకు చీరలు ఉచితంగా పంపిణీ చేస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది నారాయణమ్మ. ఈమె కుమారుడు కాకర్ల సురేష్ హఠాన్మరణంతో కలత చెందారు. ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ పాడిపరిశ్రమలోఎంతో శ్రమించేవాడు. కొడుకు జ్ఞాపకార్థం సురేష్ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తోంది. అలాగే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కౌన్సిలర్గా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తోంది. ప్రతిఏటా వేసవిలో జిల్లాకేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తోంది. ఫ్యామిలీ కోర్టు, మహిళా న్యాయ స్థానం, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా పోలీస్ స్టేషన్, సఖి కేంద్రం, భరోసా కేంద్రం -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్సింగ్తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్గన్తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఆపరేషన్ ‘కడావర్ డాగ్స్’
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించింది. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను గురువారం సాయంత్రానికి దోమలపెంటకు రప్పించింది. నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్సింగ్తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలించనుంది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.కొనసాగుతున్న టీబీఎం భాగాల తొలగింపు..సొరంగం లోపల 13.650 కి.మీ. పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) భాగాలు చెల్లాచెదురై టన్నెల్ మార్గానికి అడ్డుగా ఉండటం తెలిసిందే. దీంతో ఆయా భాగాలను ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి సుమారు 150 మీటర్ల వరకు టీబీఎం భాగాలు ఉండగా వాటి మధ్యలోనే కార్మికులు చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి టీబీఎం భాగాలను కట్ చేస్తూ, మట్టిని తొలగిస్తూ కార్మికుల కోసం అన్వేషిస్తున్నారు.కన్వేయర్ బెల్టును ప్రమాదస్థలం వరకు కొనసాగించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ఫౌండేషన్, జాయింట్ మెషీన్, కమిషన్ పనులు పూర్తవగా ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయానికి కన్వేయర్ బెల్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని చెబుతున్నారు.నేడు రంగంలోకి టన్నెల్ ప్రత్యేక నిపుణులు..సొరంగంలో ప్రమాద స్థలంలో చిక్కుకున్న కార్మికుల వెలికితీత కోసం కొనసాగుతున్న సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఐఐటీ చెన్నైకి చెందిన టన్నెల్ నిపుణులు శుక్రవారం దోమలపెంటకు రానున్నారు. ఇప్పటికే ఎన్వీ రోబోటిక్స్కు చెందిన నిపుణులు ప్రమాదస్థలానికి పరిశీలించారు. ప్రత్యేక పరికరాలు లేదా ఏఐ రోబోల ద్వారా కార్మికుల వెలికితీత సాధ్యమవుతుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎన్జీఆర్ఐ, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీకి చెందిన నిపుణులు అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని సొరంగం పైభాగంలో భూమి పరిస్థితులపై సర్వే పనులను కొనసాగిస్తున్నారు.13 రోజులుగా శిథిలాల కిందే..ఎస్ఎల్బీసీ సొరంగం కుంగిన ప్రమాదంలో 8 మంది కారి్మకులు, ఇంజనీర్లు గత 13 రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో 12 ఏజెన్సీలు, సంస్థలు సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకుండానే 14 కి.మీ. వరకు ఏకధాటిగా టీబీఎం ద్వారా సొరంగం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రమాదస్థలంలో రెస్క్యూ బృందాలకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. టన్నులకొద్దీ పేరుకుపోయిన మట్టి, శిథిలాలను బయటకు తరలించేందుకు రోజుల సమయం పడుతోంది. దీంతో ఈ తరహా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమ వారి ఆచూకీ నేటికీ లభించకపోవడంతో బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. -
అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ
అచ్చంపేట: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే అంగన్వాడీల్లో ఖాళీలుంటే నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడం కష్టసాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో పదవీ విరమణకు అర్హత సాధించినవారు, పదోన్నతికి అర్హత ఉన్నవారితోపాటు కేటగిరిల వారీగా ఖాళీలను లెక్కించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 14,236 ఖాళీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల్లోని అన్ని ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి గత నెల 22న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఈ ఫైల్పై సంతకం చేసిన వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ పోస్టులను భర్తీ చేసినప్పటికీ వందల సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పోస్టుల భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఆటపాటలతో.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు రోజు మధ్యాహ్న భోజనం, పాలు, ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇస్తున్నారు. రెండున్నర సంవతర్సాల వయస్సు కలిగిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు మధ్యాహ్న భోజనంతోపాటు ఆటపాటల ద్వారా ప్రీ ప్రైమరీ విద్యను బోధిస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు కేంద్రాలు జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 46,229 మంది చిన్నారులు, 5,745 మంది గర్భిణులు, 3,772 బాలింతలు ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విభాగంలో మొత్తం 601 పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 167 టీచర్లు, హెల్పర్లు 434 ఖాళీగా ఉన్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడతాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఒక్కొక్కరికి రెండు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేంద్రాల్లో హైల్పర్లు లేకపోవడం వల్ల పనిభారం మొత్తం టీచర్లపై పడుతోంది. వారే కేంద్రాలను శుభ్రం చేసుకోవడంతోపాటు గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి చిన్నారులను కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో లబ్ధిదారులకు మెరుగైన సేవలందడం లేదు. ఇప్పటికే అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున నోటిఫికేషన్ జిల్లాలో 167 టీచర్లు, 434 ఆయాల పోస్టులు ఖాళీ -
అందుబాటులో ఉండాలి..
సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
ఉప్పునుంతల: ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని ఎంచుకొని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శ్రద్ధగా చదువుకుంటూ ముందుకెళ్లాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. గురువారం స్థానిక జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, బాలికల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో డీఈఓ విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రగతిని పరిశీలించారు. విద్యార్థులు ప్రతిరోజు పుస్తక పఠనం చేయడం ద్వారా విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. దీంతోపాటు కీలకమైన ఆలోచన సామర్థ్యాలు, జ్ఞాపకశక్తి పెంపొందడం జరుగుతుందన్నారు. మంచి పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పదో తరగతి విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదువుకొని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేజీబీవీలో బాలికలు నిర్వహిస్తున్న కరాటే శిక్షణను డీఈఓ పరిశీలించారు. అలాగే బాలికల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థి స్థాయి నుంచే వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్ఎంలు బిచ్చానాయక్, కేజీబీవీ స్పెషలాఫీసర్ సైదా, జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మట్టి తరలింపులో ఇబ్బందులు..
సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. -
కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పసియొద్దీన్ అన్నారు. గురువారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన కాంట్రాక్టు సంస్థ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరితే అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. ప్రతినెలా పీఎఫ్ కట్ చేయాల్సి ఉన్న 3 సంవత్సరాలు పీఎఫ్ కట్ చేయకుండా కార్మికుల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య, కార్మికులు బాలకృష్ణమ్మ, రాధ, రేణుక, లక్ష్మి, సంతోష, శ్రీదేవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమైపోయారో..
నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్ రేంజ్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు. ● సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోం అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రస్తుతం టీబీఎంను కొద్దికొద్దిగా కట్ చేస్తూ కార్మికులను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కన్వేయర్ బెల్ట్ మళ్లీ ప్రారంభం కావడంతో మట్టిని బయటికి తరలించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు. అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ గుర్తింపు కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు అరవింద్కుమార్ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. కుటుంబ సభ్యులు పడిగాపులు.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్ డాగ్స్ ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
మోక్షమెప్పుడో..?
●● అంతర్రాష్ట్ర రహదారిపై హైలెవల్ బ్రిడ్జి లేక ఇబ్బందులు ●● ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులను కలిపేలా పెద్దవాగుపై కాజ్వే నిర్మాణం ● భారీ వాహనాల రాకపోకలతో శిథిలావస్థకు చేరిన వైనం ● ఇటీవల వాహనాలను అనుమతించకుండా పోలీసులు పహారా ● కలెక్టర్ పరిశీలన.. అయినా సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు బ్రిడ్జితోనే శాశ్వత పరిష్కారం పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర సేవలందించేందుకు కర్నూలుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో నిర్మించిన కాజ్వేపై తరుచూ గుంతలు ఏర్పడడంతో రోడ్డు దాటలేని పరిస్థితి నెలకొంది. దానివలన 108 సేవలకు ఆటంకం కలుగుతుంది. హై లెవల్ బ్రిడ్జి నిర్మిస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగకుండా ఉంటుంది. – శ్రీధర్, 108 సిబ్బంది, అయిజ మండలం పహారా కాస్తున్నాం పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గతంలో నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. ఇటీవల కాజ్వేపై భారీ గుంత పడింది. అధిక లోడుతో ఉన్న వాహనాలు వెళ్లకుండా పోలీసులు కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇలా జరిగితే మరమ్మతు చేసేంత వరకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రాత్రింబవళ్లు కాపలా కాశం. – శ్రీనిసాసరావు, ఎస్ఐ, అయిజ నివేదికలు పంపించాం.. అయిజ–రాయచూర్ రోడ్డుపై అయిజ పట్టణ సమీపంలో పెద్దవాగుపై నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలమైంది. భారీ వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. కాజ్వేను తొలగించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. – దేశ్యానాయక్, ఆర్అండ్బీ ఈఈ అయిజ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలిపే కర్నూలు–రాయచూరు అంతరాష్ట్ర రహదారిపై అయిజ సమీపంలోని పెద్దవాగు వద్ద కొన్నేళ్ల క్రితం నిర్మించిన కాజ్వే పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో మూడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే భారీ వాహనాలను కాజ్వే గుండా వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కాజ్వే రక్షణ గోడలు శిథిలమై.. రంద్రాలు పడగా తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. ఇటీవల మరోసారి గోతులు పడగా మంగళవారం నుంచి భారీ వాహనాలను కాజ్వే గుండా అనుమతించడంలేదు. పోలీసులు ఆర్అండ్బీ వారికి సమాచారమిచ్చినా.. అటు అధికారులు, ఇటు పాలకులు స్పందించడం లేదు. మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఈ కాజ్వేపై మూడు రాష్ట్రాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. ప్రతి రోజు వేల సంఖ్యలో వాహనాలు ఈరోడ్డుపై వెళ్తుంటాయి. అలాంటి రోడ్డుకు అడ్డుగా అయిజ పట్టణ సమీపంలో పెద్దవాగు ఉంది. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన కాజ్వేపై వరదనీరు ఉధ్రుతంగా ప్రవహించినప్పుడు ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కడికి వాహనాలు అక్కడే నిలిచిపోవాల్సి ఉంటుంది. ఇటీవల కాజ్వేపై పెద్ద గొయ్యి ఏర్పడగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాజ్వే రక్షణ గోడలు బీటలు వారాయి. గోడకు నిర్మించిన రాళ్లు ఊడిపోతున్నాయి. విధిలేక వాహనదారులు వేరే మార్గంపై వెళ్లాలంటే 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు వెళ్లాలంటే రాయచూరు నుంచి గద్వాల మీదుగా.. అలాగే ఏపీ ప్రజలు కర్ణాటకలోని రాయచూరుకు వెళ్లాలనుకుంటే గద్వాల మీదుగా రావాల్సిందే. ఇక రాష్ట్ర ప్రజలు రాయచూరుకు వెళ్లాలన్నా చుట్టూ తిరిగి గద్వాల మీదుగా వెళ్లాల్సిందే. దీంతో ప్రయాసాలతోపాటు వెలకట్టలేని సమయం వృథా చేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. హైలెవల్ బ్రిడ్జిపైనే ఆశలు.. గతంలో కాజ్వే శిథిలావస్థకు చేరుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం కలెక్టర్ బీఎం సంతోష్ దృష్టికి వెళ్లగా.. ఆయన నేరుగా కాజ్వేను సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజ్వే పూర్తిగా శిథిలమైందని, వాహనాలు వెళ్తే ప్రమాదమని పేర్కొంటూ.. తాత్కాలికంగా కాజ్వేకు మరమత్తులు చేసి వేసవి కాలంలో కాజ్వేను కూల్చివేసి దాని స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అయినా సరే ఇప్పటి వరకు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ముందడుగు పడడంలేదు. ఇదిలాఉండగా, అత్యవసర వైద్య సేవలైన కాన్పులు, రోడ్డు ప్రమాద బాధితులను నిత్యం అయిజ నుంచి ఏపీ రాష్ట్రంలోని కర్నూలుకు అంబులెన్స్లలో తరలిస్తుంటారు. కాజ్వే పూర్తిగా శిథిలం కావడంతో అంబులెన్స్ వాహనాలు గద్వాలకు చేరుకొని అక్కడ నుంచి జాతీయ రహదారిపై కర్నూలుకు వెళ్తుండడంతో అత్యవసర సేవలు ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. -
SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్పై బుర తొలగింపునకు వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. -
తొలిరోజు ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,817 మంది విద్యార్థులకు గాను 6,449 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,172 మందికి గాను 4,924 మంది, ఒకేషనల్ విభాగంలో 1,645 మందికి గాను 1,525 మంది హాజరై పరీక్షలు రాశారు. జనరల్లో 248 మంది, ఒకేషనల్ విభాగంలో 120 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరిగాయి. కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. విద్యార్థిని తనిఖీ చేస్తున్న సిబ్బంది -
సహకార సంఘాల బలోపేతానికి కృషి
● రాష్ట్ర మార్కెటింగ్, రవాణా, సహకార శాఖల కమిషనర్ సురేంద్ర మోహన్ ఉప్పునుంతల: రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్, రవాణా, సహకార శాఖల కమిషనర్ సురేంద్ర మోహన్ అన్నారు. బుధవారం ఉప్పునుంతల సింగిల్విండో కార్యాలయా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ప్రగతి సాధించడానికి అవలంబిస్తున్న పద్దతు లు, సేవలు తదితర విషయాలను పీఏసీఎస్ చైర్మన్ భూపాల్రావు, సీఈఓ రవీందర్రావు కమిషనర్కు వివరించారు. సంఘం పనితీరు.. సభ్యులకు అందిస్తున్న పలు రకాల రుణాలతో పాటు ఎరువుల సరఫరా.. వరి, మొక్కజొన్న, వేరుశనగ కొనుగోలు వంటి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. 2008లో రూ. 63లక్షల అప్పులో ఉన్న సహకార సంఘం.. ప్రస్తుతం రూ. 4కోట్ల లాభాలతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. పీఏసీఎస్ల ద్వారా ఎలాంటి కొరత లేకుండా ఎరువులను అందిస్తున్నామని మార్క్ఫెడ్ డీఎం నర్సింహారావు తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రగతిలో ఉన్న పీఏసీఎస్ల్లో అవలంబిస్తున్న పద్ధతులు, అందిస్తున్న సేవలపై అధ్యయనం చేసి.. బలహీనంగా ఉన్న సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంచి ప్రగతిలో ఉన్న ఉప్పునుంతల పీఏసీఎస్ను సందర్శించినట్లు తెలిపారు. సంఘం పాలకవర్గం, సభ్యులు, సిబ్బంది సమష్టి కృషితో పీఏసీఎస్ ఆ ర్థికాభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. పీఏసీఎస్ ద్వారా పెట్రోల్ పంపు, మిల్క్ చిల్లింగ్ సెంటర్, గోదాముల ఏర్పాటుకు అవసరమైన చర్య లు తీసుకుంటామన్నారు. అనంతరం ఏఏసీఎస్ ఏర్పాటుచేసిన వేరుశనగ కొనగోలు కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాదరావు, జిల్లా అధికారి స్వరణ్ సింగ్, జిల్లా సహకార అధికారి రఘునాథరా వు, డీటీఓ చిన్నబాలు, మార్కెటింగ్శాఖ కార్యదర్శులు నర్సింహులు, డైరెక్టర్ రమేష్రెడ్డి, అనంతరెడ్డి, జగన్మోహన్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు నారాయణరెడ్డి, శ్రీను, సాయిబాబు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంటకు మోతాదులో నీరందించాలి
బిజినేపల్లి: ప్రస్తుతం మొక్కజొన్న పంట కంకి దశలో ఉందని.. ఎక్కువగా నీరు పారించడం వల్ల ఎండుతెగులు వ్యాపించే అవకాశం ఉంటుందని పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.శైలజ అన్నారు. బుధవారం మండలంలోని ఖానాపూర్లో సాగుచేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కజొన్నలో ఎక్కువగా ఎండు తెగులును గమనించామని తెలిపారు. ఈ తెగులు వచ్చిన మొక్కలను వేర్లతో సహా తొలగించి, కాల్చివేయాలని రైతులకు సూచించారు. మొక్కజొన్న పంటలో ఎండు తెగులును నివారించాలంటే మోతాదులో నీటిని పారించాలని రైతులకు సూచించారు. సాళ్లలో ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సేద్య విభాగం శాస్త్రవేత్త డా.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోండి కందనూలు: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ స్పోర్ట్స్ పాఠశాల, వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశానికి 9 – 11 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి ఫిరంగి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 – 26 సంవత్సరానికి గాను బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4, 5, 6, 7 తరగతులు చదువుతున్న గిరిజన బాలబాలికలు అర్హులన్నారు. జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. న్యాక్ డైరెక్టర్గా జగదీశ్వర్రెడ్డి వనపర్తి: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) రాష్ట్ర డైరెక్టర్గా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అమ్మపల్లికి చెందిన రిటైర్డ్ సీఈ బి.జగదీశ్వర్రెడ్డిని నియమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాక్లో చేరే ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలు, జీవన ప్రమాణాల పెరుగుదల కోసం కృషిచేస్తానని చెప్పారు. నిర్మాణాత్మక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చి.. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి కొల్లాపూర్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ డివిజన్ మహాసభల్లో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. హాస్టళ్ల విద్యార్థులకు మెస్చార్జీలు కూడా పెండింగ్లో ఉన్నాయని వివరించారు. గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం అందడం లేదన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డివిజన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.కార్తీక్, నాయకులు శివకుమార్, గణేశ్, భాస్కర్, అంజి, మనోజ్, శివప్రసాద్, ఆకాశ్, భరత్, ప్రదీప్ పాల్గొన్నారు. -
కారం, తొక్కులే నిత్యభోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
మరోసారి ప్రాణనష్టం జరగకుండా చర్యలు
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. సొరంగం వద్ద సహాయక చర్యలను పరిశీలించిన ఆయన.. తిరుగు ప్రయాణంలో మన్ననూర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పారు. సొరంగంలో మరో 5 మీటర్ల వరకు పేరుకుపోయిన బురద మట్టిని తొలగించాల్సి ఉందన్నారు. మంగళవారం కన్వేయర్ బెల్టును పునరుద్ధరించి 800 నుంచి 900 టన్నుల బురదను బయటికి పంపించినట్లు వివరించారు. సొరంగంలో మరోసారి ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అంతర్జాతీయ నిపుణులు లేదా రోబోలతో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు. -
సహాయక చర్యలు వేగవంతం
ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను సాధ్యమైనంత మేర వేగవంతం చేయాలని విపత్తుల నిర్వాహణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ రెస్క్యూ బృందాల ప్రతినిధులకు సూచించారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ఆయా విభాగాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ నమూనాతో టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరిక్షిత్ మెహ్ర అధికారులకు వివరించారు. టీబీఎం చివరి భాగంలోని శిథిలాలను తొలగించినట్లు తెలిపారు. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో మట్టితీత పనులు వేగంగా చేపడుతున్నట్లు వివరించారు. టీబీఎం ఎడమవైపు నుంచి వాటర్ జెట్ల ద్వారా బురదను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, హైదరాబాద్కు చెందిన ఎన్వీ రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. టన్నెల్లో లైటింట్ సదుపాయాన్ని ముందుకు పొడిగించినట్లు వివరించారు. సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ నాగిరెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లక్నో డైరెక్టర్ అయోధ్య ప్రసాద్ తప్లియాల్ తదితరులు ఉన్నారు. -
తొక్కులే ఎక్కువ తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన అనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.అమరేందర్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో డీఈఓ రమేష్ కుమార్తో కలిసి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని.. మాస్ కాపీయింగ్కు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పరీక్ష ప్రశ్న పత్రాలను పోలీస్స్టేషన్ నుంచి సరఫరా చేస్తారని.. కేంద్రాల సూపరింటెండెంట్ గదిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా నిఘాలో ప్రశ్న పత్రాలను నిర్ణీత సమయంలోనే ఓపెన్ చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ రోజుకా రోజు జవాబు పత్రాలను పోస్టాఫీస్కు పంపించాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు గాలి, వెలుతురు పుష్కలంగా ఉండాలన్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 21వ ఉత్తీర్ణత స్థానంలో జిల్లా ఉందని.. ఈసారి రాష్ట్ర స్థాయి ఉత్తీర్ణతలో 10వ స్థానంలోపే రావాలని కాంక్షించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు, నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు షర్ఫు ద్దీన్, వెంకటయ్య తదితరులు ఉన్నారు. -
12 రోజులైనా జాడే లేదు
అచ్చంపేట/అమ్రాబాద్/మన్ననూర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే బుధవారం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా లభించని ఎస్ఎల్బీసీ కార్మికుల ఆచూకీ ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. టన్నెల్ వద్ద కనిపించని అధికారుల హడావుడి మళ్లీ పని చేయని కన్వేయర్ బెల్టు లోకో ట్రైన్ ద్వారానే మట్టి, ఇతర వ్యర్థాల తరలింపు సహాయక బృందాల మధ్య కొరవడిన సమన్వయం -
నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి
నాగర్కర్నూల్: ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రజా సమూహ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో ఎల్ఆర్ఎస్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు చెల్లించిన ఫీజులో 25 శాతం రాయితీ లభిస్తుందని.. దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
కమనీయం.. లక్ష్మీచెన్నకేశవుడి కల్యాణం
అమ్రాబాద్: మండలంలోని రాయలగండి క్షేత్రంలో మంగళవారం శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. ముందుగా భజన బృందాలతో అచ్చంపేట నుంచి తలంబ్రాల రథాన్ని రాయలగండి క్షేత్రానికి తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, ఆయన సతీమణి డా.అనురాధ పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. కల్యాణ తంతును శాస్త్రోక్తంగా జరిపించారు. ఆనాయితీ ప్రకారం అచ్చంపేట మాల ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు తలంబ్రాలు తీసుకువచ్చారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి తన్మయం పొందారు. ఉత్సవాల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ మాలల ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. అనంతరం రాష్ట్రస్థాయి వాలీబాల్, కోలాటం పోటీలను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నరహరి, ఆనంద్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, బూర్గుల వెంకటేశ్వర్లు, మందాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
●● జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 13,454 మంది విద్యార్థులు ● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం సకాలంలో చేరుకోవాలి.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాం. విద్యార్థులు హడావుడిగా కాకుండా.. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయత్నించాలి. – వెంకటరమణ, డీఐఈఓ కందనూలు: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. బుధవారం నుంచి ప్రథమ సంవత్సరం, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 13,454 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,899 మంది, ఒకేషనల్ విభాగంలో 1,578 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,576 మంది, ఒకేషనల్ విభాగంలో 1,401 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. తాగునీటి సదుపాయంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని నియమించారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 25 మంది చొప్పున సీటింగ్.. పరీక్ష కేంద్రంలోని ఒక్కో గదిలో 25మంది విద్యార్థుల చొప్పున కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను నియమించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండ్ంట్, ఒక డిపార్టుమెంట్ అధికారి, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రానికి పోలీస్స్టేషన్ నుంచి తీసుకువచ్చే ప్రశ్నపత్రాల సీల్ తీయడం మొదలుకుని.. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ చేసే వరకు సీసీ కెమెరాల నిఘాలో పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్కు తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు ఉంటే తప్ప.. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. -
అమ్మకడుపు చల్లగా..
స్థాయి పెరిగితే.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 50 పడకల స్థాయి నుంచి 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకులు మారుతున్నారే తప్ప.. ఆస్పత్రి స్థాయి మాత్రం పెరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. 100 పడకల ఆస్పత్రి కోసం రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేసినా.. అందుకు సంబంధించిన పనులు నేటి వరకు ప్రారంభం కాలేదు. ఆస్పత్రి స్థాయి పెరిగితే అధునాతన పరికరాలు, అదనంగా వైద్యులు, సిబ్బంది, ఇతర వసతులు అందుబాటులోకి రావడంతో పాటు సామాన్య ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఆస్పత్రి స్థాయిని పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కల్వకుర్తి సీహెచ్సీలో పెరిగిన సాధారణ ప్రసవాలు ● ఆరు నెలల్లోనే 541 కాన్పులు ● మరో 361 సిజేరియన్లు ● ఆస్పత్రి స్థాయి పెరిగితే మరిన్ని సేవలు అందే అవకాశం కల్వకుర్తి టౌన్: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వసతులు మెరుగు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకోవాలంటే వణికే ప్రజలు.. నేడు సర్కారు దవాఖానల్లో కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోజురోజుకూ కాన్పుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో ఉన్న వైద్యుల సలహాలు, సూచనలతో గర్భిణులు ధైర్యంగా సాధారణ కాన్పు చేయించుకుంటున్నారు. కాన్పు పూర్తయిన తర్వాత తల్లీబిడ్డ ఆరోగ్యంపై వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో గర్భిణులు కాన్పు కోసం క్యూ కడుతున్నారు. ప్రతినెలా గైనకాలజీ వైద్యులతో పరీక్షలు చేయించుకుంటూ.. వారి సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. అయితే సాధారణ ప్రసవాలను చేయడంలో కల్వకుర్తి సీహెచ్సీ రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచింది. గతంలో ఇక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువగా ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేసేవారు. అయితే ఆస్పత్రిలో అధునాతన పరికరాలతో పాటు గైనకాలజీ వైద్యులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రసవాలతో పాటు సిజేరియన్లు సైతం ఇక్కడే చేస్తున్నారు. ఆరు నెలల్లో 902 కాన్పులు.. సీహెచ్సీలో ప్రతినెలా దాదాపుగా 75 వరకు సాధారణ కాన్పులు అవుతున్నాయి. మరో 50 వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. గతనెల ఒకే రోజు 11 సాధారణ కాన్పులు జరిగాయి. ఆస్పత్రి వైద్యులతో పాటు నర్సింగ్, ఇతర సిబ్బంది సమన్వయంతోనే పెద్ద మొత్తంలో కాన్పులు చేయగలుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా గైనకాలజీ వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండటంతోనే కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆస్పత్రిలో 902 కాన్పులు చేశారు. ఇందులో 541 మంది గర్భిణులకు సాధారణ కాన్పులు కాగా.. మరో 361 మందికి సిజేరియన్లు అయ్యాయి. సీహెచ్సీ స్థాయిలోనే ఇంత పెద్ద మొత్తంలో కాన్పులు కావడం విశేషంగా చెప్పవచ్చు. గత ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఆస్పత్రిలో జరిగిన కాన్పులు ఇలా.. నెల సాధారణ సిజేరియన్ ఆగస్టు 75 52 సెప్టెంబర్ 75 44 అక్టోబర్ 78 61 నవంబర్ 79 56 డిసెంబర్ 75 46 జనవరి 78 49 ఫిబ్రవరి 81 53 -
అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
కొల్లాపూర్: ెహచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ఎయిడ్స్ కంట్రోలింగ్ జిల్లా ఆఫీసర్ డా.రమేష్కుమార్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్ఐవీ, ఎయిడ్స్పై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచ్చలవిడి లైంగిక వ్యవహారాల కారణంగా ఎయి డ్స్, హెచ్ఐవీ వ్యాప్తి చెందుతాయన్నారు. వాటివల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. కౌమర దశలో యువత జాగ్రత్తగా మెలగాలని సూచించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోలింగ్ రిసోర్స్పర్సన్ సురేందర్, కళాశాల ప్రిన్పిపల్ ఉదయ్కుమార్, వైస్ప్రిన్సిపల్ వెంకటయ్య, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోండి కందనూలు: కేంద్ర కార్పొరేట్ వ్వవహారాల మంత్రిత్వశాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో దశ ప్రారంభమైందని జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు pminternship.mca.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 18001 16090 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలో విద్యుత్ లైన్ల మరమ్మతు నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మాన్యనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీపురం రోడ్డులోని హనుమాన్ దేవాలయం నుంచి రూబీ గార్డెన్స్ వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాలి బిజినేపల్లి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని వట్టెం బాలుర ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మా ట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు అన్నివిధాలా సన్నద్ధం కావాలన్నా రు. విద్యార్థులతో ప్రణాళికాబద్ధంగా చదివించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఉపాధ్యాయుల కు సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంతకుముందు పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను డీఈఓ పరిశీలించా రు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పా టించాలని సూచించారు. అదే విధంగా వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. -
వేరుశనగ క్వింటాల్ రూ.6,620
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,620, కనిష్టంగా రూ.5,191 ధరలు లభించాయి. అనుములు రూ.6,752, ఉలువలు రూ.5,610, రాగులు రూ. 3,305, కందులు గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.6,127, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,111, ఆముదాలు గరిష్టంగా రూ.6,062, కనిష్టంగా రూ.5,981 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.6,011, కనిష్టంగా రూ.5,989, కందులు గరిష్టంగా రూ.6,859గా ఒకే ధర పలికింది. -
ఆచూకీ లభించేనా.?
అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూ కీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. అందుబాటులోకి కన్వేయర్ బెల్టు.. సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్ర మే బయటికి తరలించారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లోసహాయక చర్యలు ముమ్మరం ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు -
కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో మరో ముందడుగు పడింది. సహయకచర్యలకు ఆటంకంగా ఉన్న బురద, శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహయక చర్యలు వేగవంతం కానున్నాయి. టన్నెల్లో 11 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి. త్వరలో తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ ఇలా 12 విభాగాలకు చెందిన దాదాపు 650 సభ్యులతో నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాద సమయంలో పెద్దమొత్తంలో సీపేజ్ వాటర్, మట్టి పడటంతో టన్నెల్లో బురద పేరుకుపోయి సహయక చర్యలకు ఆటంకంగా మారింది. అదే సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ధ్వంసం అయ్యింది. మిషన్కు అను సంధానంగా పనిచేసే కన్నేయర్ బెల్ట్ సైతం దెబ్బతింది.దీంతో టన్నెల్లో ఉన్న శిథిలాలు, బురద అలాగే ప్లాస్మా కట్టర్స్ ద్వారా తొలగిస్తున్న టీబీఎం మిషన్ పరికరాల తొలగింపు సమస్యగా మారింది. ఇప్పటి వరకు లోకో ట్రైన్ ద్వారా రెండు బోగీలలో వాటిని తొలగిస్తూ వచ్చారు.ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన బురద, శిథిలాలు తొలగించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సహయక చర్యలు వేగవంతం కావాలంటే కన్వేయర్ బెల్ట్ పునరద్దరణే శరణ్యమని నిర్ణయించారు. సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో వెంటనే కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇంజనీయర్లు రెండు రోజులు శ్రమించి ఇవాళ సాయంత్రం దాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం వ్యర్దాలను ఈ బెల్ట్ ద్వార బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, బురద ఉన్నట్టు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణతో తప్పిపోయిన వారి ఆచూకీ త్వరలోనే గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి సహయకచర్యలు చేపట్టడం మాత్రం రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. -
రోజుల తరబడి నీటి ఉధృతి
ముక్కిడిగుండం గ్రామానికి రెండు దిక్కులా మొలచింతలపల్లి వైపు ఉడుముల వాగు, నార్లాపూర్ వైపు పెద్దవాగు ప్రవహిస్తుంటాయి. వర్షాకాలంలో ఈ రెండు వాగులు రోజుల తరబడి పొంగిపొర్లుతాయి. ఆ సమయంలో ముక్కిడిగుండంతోపాటు అనుబంధ గ్రామమైన గేమ్యానాయక్తండాకు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి పీఆర్ శాఖ ఎస్డీఎఫ్ నిధులు రూ.9 కోట్లు మంజూరు చేయగా.. లాంఛనంగా పనులను శంకుస్థాపన చేశారు. కానీ, పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఏప్రిల్ నెల నుంచి పనులు చేపట్టగా ప్రస్తుతం తుది దశకు చేరుకొని అందుబాటులోకి రానుంది. అయితే నార్లాపూర్ నుంచి ముక్కిడిగుండం వెళ్లే దారిలో పెద్దవాగు కంటే ముందు దాని పక్కనే మాల ఓడిక (చిన్న వాగు) పారుతుంది. రెండు వాగుల మధ్య వంద మీటర్ల లోపు దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న బ్రిడ్జి పక్కనే ఉన్న ఈ వాగు కూడా ఉన్నా.. దీనిని అనుసరించి బిడ్జి నిర్మించాలనే ఆలోచన అధికారులకు తట్టలేదు. వర్షాకాలంలో ఈ వాగు సైతం ఉధృతంగానే పారుతుంది. దీంతో పెద్దవాగుపై బ్రిడ్జి ప్రారంభమైనా వర్షాకాలంలో మాల ఓడిక దాటి వెళ్లడం కష్టమేనని గ్రామస్తులు చెబుతున్నారు. -
నల్లమల వన్యప్రాణులకు స్వర్గధామం
మన్ననూర్: రాష్ట్ర అటవీ శాఖ అమ్రాబాద్ టైగర్ రిజర్వును ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చడం వల్ల నల్లమల ప్రాంతం వన్యప్రాణులకు స్వర్గధామంగా మారిందని డీఎఫ్ఓ రోహిత్రెడ్డి అన్నారు. సోమవారం మన్ననూర్లోని ఈసీ సెంటర్ వద్ద వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ, వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుగా ఉన్న ఆయా గ్రామాలు, పెంటలు, గూడేలలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. సున్నితమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి కొత్తగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నల్లమల, కృష్ణానది పరివాహక ప్రాంతాలతోపాటు శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో సైతం ప్లాస్టిక్ను నిషేధించడం శుభపరిణామం అన్నారు. అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధికి గాను రిసార్టులు, కాగితం పరిశ్రమ, జనపనార ఉత్పత్తులు వంటివి ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు తెలిపేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం పురోగతి సాధించేదిగా కూడా ఉందన్నారు. ఈ సమాచారాన్ని తెలియజేసే అంశాలను ప్రజల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
సహాయక చర్యలు వేగవంతం
సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్టు పనులు వేగవంతం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద రెస్క్యూ బృందాల ఆపరేషన్లో పాల్గొన్న సహాయక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని తొలగించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. 12 సంస్థలకు సంబంధించిన బృందాలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని, సమస్యలు ఎదురువుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకుపోతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జాడ గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టామని, దీని కోసం ప్రత్యేక యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి, మైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. -
‘చెవి స్పీకర్లతో వినికిడి కోల్పోతాం’
బిజినేపల్లి: ప్రస్తుత కాలంలో హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్ ప్రతిఒక్కరు ఎక్కువగా వినియోగిస్తున్నారని, తద్వారా వారు వినికిడి లోపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోగ్రాం అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ చెవిలో అనవసరంగా దూది పుల్లలు, కట్టె పుల్లలు వంటి వాటిని ఉపయోగించి చెవి గుమిలిని తీయడం వలన కర్ణభేరికి గాయమై వినికిడి శక్తి కోల్పోతామని, చెవులు వాటంతట అవే శుభ్రపరుచుకుంటాయని చెప్పారు. చెవిలోకి నీరు పోకుండా చూసుకోవాలని, చెవిలో చీము కారడం, చెవి నొప్పి తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది విజయ్కుమార్, రాజేష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అన్వేషణ
బురద, ఊట నీరే ప్రధాన సమస్య ● నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట ● సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు ● పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు ● రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం -
బ్రిడ్జి పనులు తుదిదశకు చేరాయి
నార్లాపూర్– ముక్కిడిగుండం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది. బ్రిడ్జికి రెండు వైపులా 20 మీటర్ల మేరకు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి, ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. అయితే వర్షాకాలంలో పెద్దవాగు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న మరో వాగు అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని గుర్తించాం. దీనిపై కూడా వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు పంపాం. కానీ, నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. – సాయిరాం, పీఆర్ఏఈ ● -
చిన్నవాగు దాటాలి
పెద్దవాగు చేరాలంటే.. రూ.9 కోట్లతో నార్లాపూర్– ముక్కిడిగుండం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం కొల్లాపూర్: ఆ గ్రామాలు అసలే నల్లమల ప్రాంతంలో మూరుమూల విసిరేసినట్టుగా ఉంటాయి. ఆయా గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలు ఇప్పుడే తీర్చడం ఇష్టం లేదో.. లేక మరోసారి వంతెన నిర్మాణం చేపట్టి ఎంతో కొంత వెనకేసుకుందాం అనుకున్నారో.. కానీ, ముక్కిడిగుండం– గేమ్యానాయక్తండాల ప్రజల వంతెన కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే ముక్కిడిగుండం– గేమ్యానాయక్తండాలకు రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి. రెండు ప్రధాన వాగులకు మధ్యలో ఈ గ్రామాలు ఉండటంతో.. తమ కష్టాలు తీర్చాలని దశాబ్దాల కాలంగా వారు ప్రభుత్వాలను కోరారు. గత ప్రభుత్వ హయాంలో వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఒక వైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా.. మరోవైపు పనులు తుదిదశకు చేరుకున్నాయి. అయితే అధికారుల అవగాహన లోపం, నిధుల మంజూరులో వ్యత్యాసాల కారణంగా పెద్దవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి అందుబాటులోకి రాబోతున్నా.. ప్రజల రాకపోకల కష్టాలు మాత్రం తీరే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న బ్రిడ్జిపై నిర్మిస్తేనే.. పెద్దవాగు బ్రిడ్జికి అనుసంధానంగా మరో వంతెన లేదా కల్వర్టు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మాల ఓడికైపె వంతెన నిర్మాణం కోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి.. ఉన్నతాధికారులకు పంపారు. మాల ఓడికైపె బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా ప్రజల రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కొల్లాపూర్ మండలంలోని మారుమూల ప్రాంతమైన ముక్కిడిగుండం– నార్లాపూర్ మధ్యలో పారుతున్న పెద్ద వాగు ఇది.. ఈ వాగుకు అటువైపు ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండాలు ఉండగా.. ఆయా గ్రామాల ప్రజలు, రైతుల రాకపోకల కోసం దశాబ్దాలపాటు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం రూ.9 కోట్లు వెచ్చించి హైలెవల్ బ్రిడ్జి నిర్మించింది. ఏళ్లతరబడిగా ఆగుతూ.. సాగిన ఈ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకోగా.. అధికారులు ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. తుది దశకు పనులు.. త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు సమీపంలోనే అడ్డంకిగా మరో చిన్నవాగు దానిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు ఇప్పట్లో ఎడతెగని వంతెన కష్టాలు ఇక్కడ కనిపిస్తున్న చిన్న వాగు సైతం అదే గ్రామాల మధ్యలో.. పెద్ద వాగుకు సమీపంలోనే పారుతుంది. ఆ పెద్ద వాగు.. చేరాలంటే ఈ చిన్నవాగు దాటాలి.. ప్రస్తుతం ఎండాకాలంలోనే ఈ వాగు పైనున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి వచ్చే ఊట నీటితో ఇలా పారుతోంది. అదే వర్షాకాలంలో అయితే ఇంకెతలా పారుతుందో ఊహించుకోవచ్చు. ఏదైతేనేం ఈ వాగుపై కూడా వంతెన నిర్మాణానికి సంబంధిత అధికారులు మరో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. -
పగుళ్లు.. ‘మామూలే’నట!
కల్వకుర్తి టౌన్: సాధారణంగా మానవునికి వడదెబ్బ సోకుతుంది. కానీ, విచిత్రంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో చల్లని శీతాకాలంలో వేసిన రోడ్లకు వడదెబ్బ తగిలిందా అన్న అనుమానం కలుగుతుంది. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. కానీ, ఇదే అర్థం వచ్చేలా మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగంతోపాటు.. క్వాలిటీ సెల్ చూసే జిల్లా స్థాయి అధికారి ఇలా చెప్పడం గమనార్హం. ప్రజల నుంచి పన్నుల రూపంలో రూ.కోట్లు వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులకు ఉన్న శ్రద్ధ.. నాణ్యత విషయంలో ఎందుకు లేకుండా పోతోందని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత విషయంలో అధికారులకు ముడుపులు ముట్టజెబుతున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాలకవర్గం ముగుస్తుండటంతో.. కల్వకుర్తి మున్సిపాలిటీలో గతేడాది కిందట సుమారు రూ.15 కోట్లతో 22 వార్డుల్లో టీయూఎఫ్ఐడీసీ, మిషన్ భగీరథ కింద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా రోడ్లకు సంబంధించి కనీసం పదేళ్లు లైఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ విషయం అటుంచితే.. కనీసం ఏడాదిపాటు వ్యాలిడిటీ లేకుండా పగుళ్లతోపాటు, పలుచోట్ల ఏకంగా గుంతలు కూడా ఏర్పడ్డాయి. ఇటీవల మున్సిపల్ పాలకవర్గం ముగుస్తుందన్న తొందరలో ఆయా వార్డుల్లో పలుచోట్ల టీయూఎఫ్ఐడీసీ కింద రూ.10 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టారు. అధికారే.. కాంట్రాక్టర్? మున్సిపాలిటీలోని రోడ్లకు సంబంధించిన పనులు త్వరితగతిన చేపట్టాలని భావించి.. ఆదరాబాదరాగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి ఏకంగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. కాంట్రాక్టర్గా తన పేరు ఉంటే ఇబ్బంది అవుతుందని, బంధువు పేరిట కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ చేసి టెండర్లు వేయించారు. బంధువుకు కల్వకుర్తిలో ఏకంగా ఒక ఇల్లు అద్దెకు ఇప్పించి, ఎలాంటి అనుమానం రాకుండా తనే సొంతంగా పనులు చేపట్టాడు. ఇలా సీసీ రోడ్లు మాత్రమే కాకుండా, మున్సిపాలిటీలో చాలా పనులను దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో సదరు అధికారి బదిలీ కావడంతో సీసీ రోడ్ల నాణ్యతా లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. రాజకీయ నాయకుల ముసుగులో మరికొందరు కాంట్రాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకొని, వారి బినామీ పేర్లపైన కాంట్రాక్టులు చేపట్టిన వారికి కూడా ఆ అధికారి అండదండలు బలంగానే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకే వత్తాసు.. మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణంలో వరుసగా నాణ్యతా లోపాలు బయటపడుతున్నా.. మున్సిపల్ అధికారులు వాటిని తేలికగా తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ క్యూసీ (క్వాలిటీ కంట్రోల్) కేవలం జనరల్ ఫండ్, ఇతరత్రా వాటికే పనిచేస్తుండటంతో.. టీయూఎఫ్ఐడీసీ కింద నిర్మాణం చేపట్టే రోడ్లకు మాత్రం పబ్లిక్ హెల్త్ క్వాలిటీ సెల్ అధికారులు నాణ్యత పరిశీలిస్తారు. అయితే ఈ అధికారులు పగుళ్లు ఏర్పడటం కామన్ అని తీరిగ్గా చెప్పుకొస్తున్నారు. అధికారులే కాంట్రాక్టర్లకు వత్తాసు పలకటం, నాణ్యతపై రాజీ కుదిరేలా వారి వ్యవహార శైలి ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. క్వాలిటీ సెల్ కాకుండా సీసీ రోడ్ల నాణ్యతపై విజిలెన్స్ విచారణ చేస్తే మరిన్ని నాణ్యతా లోపాలు బయటకు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో నెలకిందట వేసిన సీసీరోడ్లకు నెర్రెలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నాణ్యతా లోపాలు సాధారణమేనని చెబుతున్న ప్రభుత్వ క్వాలిటీ సెల్ అధికారుల తీరుతో ప్రజాధనం దుర్వినియోగం కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్కాలనీలో గత నెలలో సుమారు 400 మీటర్ల మేర నిర్మించిన సీసీ రోడ్డు ఇది. అయితే రోడ్డు వేసిన 15 రోజులకే పూర్తిగా పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక ఈ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ అధికారులు శాంపిళ్లు సేకరించారే తప్ప, పగుళ్ల గురించి పట్టించుకోలేదు. పైగా పగుళ్లు సాధారణమే అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. రూ.15 లక్షలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్డుకు అప్పుడే పగుళ్లు రావడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. క్యూసీని తీస్తున్నాం.. మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాక క్యూసీని తీస్తున్నాం. రోడ్ల పగుళ్లకు ఎండల తీవ్రత ఒక కారణం కావొచ్చు. గతేడాది కిందట వేసిన రోడ్లు పగుళ్లతోపాటు, రోడ్లు దెబ్బతిన్న విషయమై మరోమారు క్యూసీ నిర్వహిస్తాం. నాణ్యతలో లోపాలు ఉన్నట్లుగా గుర్తిస్తే వాటిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తాం. – భరత్కుమార్, పబ్లిక్ హెల్త్ క్యూసీ అధికారి -
బ్రిడ్జి పనులు తుదిదశకు చేరాయి
నార్లాపూర్– ముక్కిడిగుండం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది. బ్రిడ్జికి రెండు వైపులా 20 మీటర్ల మేరకు అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు పూర్తిచేసి, ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. అయితే వర్షాకాలంలో పెద్దవాగు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సమీపంలోనే ఉన్న మరో వాగు అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని గుర్తించాం. దీనిపై కూడా వంతెన నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు పంపాం. కానీ, నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. – సాయిరాం, పీఆర్ఏఈ ● -
‘చెవి స్పీకర్లతో వినికిడి కోల్పోతాం’
బిజినేపల్లి: ప్రస్తుత కాలంలో హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్ ప్రతిఒక్కరు ఎక్కువగా వినియోగిస్తున్నారని, తద్వారా వారు వినికిడి లోపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోగ్రాం అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ చెవిలో అనవసరంగా దూది పుల్లలు, కట్టె పుల్లలు వంటి వాటిని ఉపయోగించి చెవి గుమిలిని తీయడం వలన కర్ణభేరికి గాయమై వినికిడి శక్తి కోల్పోతామని, చెవులు వాటంతట అవే శుభ్రపరుచుకుంటాయని చెప్పారు. చెవిలోకి నీరు పోకుండా చూసుకోవాలని, చెవిలో చీము కారడం, చెవి నొప్పి తదితర సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది విజయ్కుమార్, రాజేష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. -
నీటి ఊటతో పెరుగుతున్న బురద..
టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. -
రమణీయం.. ఆది దంపతుల కల్యాణం
నాగర్కర్నూల్రూరల్: మండలంలోని కుమ్మెర గట్టుపై స్వయంభూ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుమ్మెర గట్టు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పండితుడు పట్నం సురేశ్ శర్మ ఆధ్వర్యంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి.. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు. భక్తజనంతో కుమ్మెర గట్టు కిక్కిరిసిపోయింది. స్వామివారి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్రెడ్డి పాల్గొన్నారు. -
కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం
● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచి స్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. -
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
బిజినేపల్లి: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ అన్నారు. ఆదివారం మండలంలోని మమ్మాయిపల్లి, గంగారం, లట్టుపల్లి విద్యుత్ సబ్స్టేషన్లు సందర్శించి.. స్థానిక రైతులతో సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోఓల్టేజీ కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చోట డీటీఆర్లు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సమస్య ఉంటే రైతులు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురావచ్చని తెలిపారు. డైరెక్టర్ వెంట విద్యుత్శాఖ అధికారులు శ్రీధర్, రాకేష్రెడ్డి తదితరులు ఉన్నారు. -
తీర్చుకుంటా
పాలమూరు రుణం కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభిృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాల ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. పదేళ్లు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి -
పరిస్థితి సంక్లిష్టం..
నాగర్కర్నూల్ఎస్ఎల్బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొండల నుంచి నీరు వస్తుండటంతోనే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. సీఎం పర్యటన సైడ్లైట్స్ కార్మికుల ఆచూకీ కోసం తప్పని ఎదురుచూపులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా ఉబికి వస్తున్న నీరు, బురదతో ఆటంకాలు -
మిర్చికి రూ.25వేల ధర చెల్లించాలి
కల్వకుర్తి రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చికి క్వింటాల్ రూ. 25వేల ధర చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తున్నారని చెప్పారు. రెండేళ్లుగా మిర్చికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని.. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కౌలు రైతులు ఎకరాకు రూ. 30వేల నుంచి రూ. 50వేల వరకు కౌలు చెల్లించడంతో పాటు రూ. 2లక్షల వరకు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగుచేస్తున్నారని వివరించారు. ఒకరిద్దరు రైతులకు మాత్రమే గరిష్టంగా 20 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రాగా.. చాలా మందికి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందన్నారు. పండించిన పంటకు మంచి ధర వస్తుందనుకుంటే.. మార్కెట్లో రూ. 12వేల నుంచి రూ. 13వేలకు మించి ధర లభించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తేవడంతో పాటు మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా మిర్చిని రూ. 25వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యుడు ఆంజనేయులు, నాయకులు ఆర్.శ్రీనివాస్, బాలస్వామి, ఏపీ మల్లయ్య, బాల్రెడ్డి, రామయ్య, ఆంజనేయులు, ఈశ్వర్, శివవర్మ, దశరథం, కిషోర్, నిర్మల తదితరులు ఉన్నారు. -
పాలమూరు వాసులు అమాయకులేం కాదు..
దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. -
వేరుశనగ క్వింటాల్ రూ. 7,529
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు ఆదివారం 234 మంది రైతులు 165 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 7,529 కనిష్టంగా రూ.4,001, సరాసరి రూ. 6,610 ధరలు వచ్చాయి. మరో ముగ్గురు రైతులు 18 క్వింటాళ్ల కందులను అమ్మకానికి తీసుకురాగా.. గరిష్టంగా రూ. 6,420, కనిష్టంగా రూ. 6,209 ధర పలికింది. ఇక నుంచి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్యార్డులో రెండు రోజులపాటు మాత్రమే క్రయవిక్రయాలు ఉంటాయని కార్యదర్శి శివరాజ్ తెలిపారు. ఆది, గురువారాల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. -
SLBC Tunnel: 24 గంటల్లో బయటికి!
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల్లో నలుగురిని ఆదివారం బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద స్థలంలో ఒకచోట నలుగురు, మరోచోట నలుగురు కార్మికుల ఆనవాళ్లను గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్ ) గుర్తించింది. సొరంగం పైకప్పు కూలిపడిన సుమారు 150 మీటర్ల స్థలంలో ముందు భాగంలో నలుగురు, చివరి భాగం (ఎండ్ పాయింట్)లో నలుగురు ఉన్నట్టుగా ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’ నిపుణులు అంచనా వేశారు. ముందు భాగంలో ఉన్న నలుగురిని బయటికి తీసేందుకు సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మ్యాన్యువల్గా తవ్వకాలు చేపట్టారు. కొన్ని గంటల్లోనే వీరిని వెలికితీసే అవకాశం ఉందని తెలిసింది. ఇక చివరి భాగంలో ఉన్న నలుగురు టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) హెడ్కు సుమారు 15 మీటర్ల వెనకాల చిక్కుకొని ఉన్నట్టుగా భావిస్తున్నారు. అక్కడ సుమారు 18 అడుగుల ఎత్తున మట్టి, శిథిలాలు పేరుకుని ఉండటంతో.. అక్కడున్న నలుగురిని బయటికి తీసేందుకు ఒకటి, రెండు రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. బురద, ఊట నీటితో ఆటంకం.. సొరంగం పైకప్పు కూలిన ప్రాంతంలో సుమారు 18 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు మట్టి, బురద, శిథిలాలు పేరుకుని ఉన్నాయి. అందులో కాంక్రీట్ సెగ్మెంట్లు, టీబీఎం భాగాలు, రాళ్లు, మట్టి కాకుండా అసాధారణ అవశేషాలు ఉన్న స్పాట్లను జీపీఆర్ గుర్తించింది. ఆయా చోట్ల మ్యాన్యువల్గా తవ్వకాలు చేపట్టగా.. తవి్వన కొద్దీ ఏర్పడుతున్న బురద, ఊట నీటితో ఇబ్బంది ఎదురవుతోంది. సొరంగంలో నిమిషానికి సుమారు 5 వేల లీటర్ల సీపేజీ వస్తుండటంతో పది పంపులతో డీవాటరింగ్ పనులు చేపడుతున్నారు. హైడ్రాకు చెందిన మినీ డోజర్తో బురదను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్టు మరమ్మతుకు మరో 2 రోజులు: సొరంగంలో 13 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. అక్కడి నుంచి మినీ డోజర్ ద్వారా బురద, మట్టి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందు 200 మీటర్ల వరకు చేరుకునేందుకు రెస్క్యూ సిబ్బంది సిద్ధం చేసిన ఫ్లోటింగ్ బెల్టు మీదుగా నడిచి వెళుతున్నారు. ఈ శిథిలాలు, మట్టి తొలగించేందుకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాక ఆలస్యం అవుతోంది. కన్వేయర్ బెల్టు ఎండ్ పార్ట్ వద్ద మెషీన్ పూర్తిగా ధ్వంసం కావడం, బెల్టును తిరిగి వినియోగంలోకి తేవాలంటే కొత్త ఫౌండేషన్ వేయాల్సి ఉండటంతో.. ఇందుకోసం మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. సహాయక చర్యల్లో ఆధునిక సాంకేతికతను, పరికరాలను వినియోగిస్తున్నారు. శిథిలాల్లో అవశేషాలను గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్), మానవ రక్తం ఆనవాళ్లను గుర్తించే ఆక్వా–ఐ, ప్రోబోస్కోప్, టీబీఎం విడిభాగాలు, శిథిలాలను కట్ చేసేందుకు అల్ట్రా థర్మికల్ కటింగ్ మెషీన్, ప్లాస్మా కట్టర్స్, సొరంగంలోని బురద, మట్టిని తొలగించేందుకు ఆర్మీకి చెందిన రెండు మినీ బాబ్ క్యాట్ మెషీన్లు, ఎస్కవేటర్ను వినియోగిస్తున్నారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ ఐజీ మోహ్సెన్ షహది పర్యవేక్షిస్తున్నారు. శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎన్జీఆర్ఐ నిపుణులతో సమీక్షించారు. డాక్టర్గా చెబుతున్నా.. వాళ్లు బతికుండే అవకాశం లేదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ సొరంగంలో కార్మికులు మట్టి, బురద, శిథిలాల కింద కూరుకుపోయారని.. ఒక డాక్టర్గా చెబుతున్నానని, వాళ్లు బతికి ఉండేందుకు అవకాశం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. కార్మికులను బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని.. ఒకట్రెండు రోజుల్లో బయటికి తీసే అవకాశం ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సర్వే కోసం నేడు ఎన్ఆర్ఎస్సీ బృందం.. సొరంగంలో కుప్పకూలిన ప్రాంతానికిపైన భూఉపరితలం వద్ద ‘నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)’ అధికారులు సర్వే చేపట్టారు. ఈ ప్రాంతానికి సమీపంలో మల్లెల తీర్థం జలపాతం ఉండటం, దానికి నల్లవాగు (ఏనిగే)కు మధ్యలో సుమారు 400 మీటర్ల లోతున టన్నెల్లో ప్రమాదం జరగడంతో... టన్నెల్లో భారీగా నీటి ఊటకు కారణాలపై పరిశీలన చేపట్టారు. అయితే ఎన్జీఆర్ఐ పరికరాల ద్వారా 150 మీటర్లలోతు వరకు మాత్రమే మట్టి పొరలు, రాళ్ల ఆకృతుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సొరంగం 400 మీటర్ల లోతులో ఉన్న నేపథ్యంలో... పరిశోధించేందుకు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ చెందిన నిపుణులు ఆదివారం రంగంలోకి దిగనున్నారు. వెళ్లి చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టమో తెలుస్తుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటికి తీసే చర్యల్లో పురోగతి కనిపించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం దోమలపెంట సొరంగం వద్ద మంత్రి ఉత్తమ్తో కలసి అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోపల చిక్కుకున్న కార్మికులు బతికి ఉండే అవకాశం 99శాతం లేదన్నారు.రెస్క్యూ బృందాలు ప్రమాదంలో పడొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్తగా పనులు చేపడుతున్నామని, అందుకే ఆలస్యం అవుతోందని జూపల్లి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విమర్శలు చేస్తున్నవారు ఒకసారి టన్నెల్లో ప్రమాదస్థలానికి వెళ్లి చూస్తే.. పరిస్థితి ఎంత కష్టంగా ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. -
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
నాగర్కర్నూల్/ అచ్చంపేట రూరల్: అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ నెల 31లోగా క్రమబద్ధీకరించి ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందుకోసం నాగర్కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్లో తెలియజేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 79955 15737, 94941 41708లను సంప్రదించాలని సూచించారు. ● అచ్చంపేటలోనూ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నం
నాగర్కర్నూల్: ఇంటి పన్ను అడిగేందుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై ఓ వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించడంతో సదరు వ్యక్తిపై మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో శనివారం ఉదయం వార్డు ఆఫీసర్ కుమార్ కొంతమంది సిబ్బందితో కలిసి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. అయితే కొట్ర లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి ఇంటి పన్ను అడగడంతో పన్నులేదు.. ఏమీ లేదంటూ.. మహిళా సిబ్బంది, ఇతర సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో సిబ్బంది వెనక్కి వచ్చి ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్కు జరిగిన సంఘటనను వివరించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ దాడికి ప్రయత్నించిన లక్ష్మణ్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీస్స్టేషన్లో కమిషనర్ ఫిర్యాదు -
చివరి అంకానికి..
నాగర్కర్నూల్ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025బురద, నీటి ఊటలు.. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ● టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ ● నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా ● సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతికుమారి సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటనా స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. అదనపు మోటార్ల ఏర్పాటు.. సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కుకున్న వారి అవశేషాలు వెలికితీసేందుకు వీలవుతుంది. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం.. మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ టీం రంగంలోకి దిగింది. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. -
పటిష్ట బందోబస్తు..
సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. శనివారం ఉదయం సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్రన్ నిర్వహించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించారు. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంకార్డులు విధుల్లో పాల్గొననున్నారు. -
నేడు వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం -
మహిళల రక్షణ కోసం షీటీం కృషి
నాగర్కర్నూల్ క్రైం: మహిళల రక్షణ కోసం షీటీం నిరంతరం పనిచేస్తుందని ఏఎస్పీ రామేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో షీటీం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన పోకిరీలను గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. గత నెలలో మొత్తం 16 ఫిర్యాదులు రాగా.. అందులో 6 కేసులు నమోదు చేయడంతోపాటు 10 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, 20 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎవరైనా వేధింపులకు గురైతే డయల్ 100, సెల్ నం.87126 57676ను సంప్రదించాలని సూచించారు. -
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. నలుగురిని గుర్తించాం: మంత్రి జూపల్లి
సాక్షి, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని.. జీపీఆర్ ద్వారా నలుగురు కార్మికులను మార్క్ చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రేపు(ఆదివారం) రాత్రిలోపు వారి ఆచూకీ దొరికే అవకాశముందని.. మిగిలిన వారి జాడ తెలుసుకునేందుకు మరింత సమయం పడుతుందన్నారు. మొత్తం 8 మంది కార్మికులలో నలుగురిని గుర్తించామని, మిగతా నలుగురు టీబీఎం మిషన్ అవతలి వైపున ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ కట్టర్ల ద్వారా టీబీఎం మిషన్ మొత్తం కట్ చేశామని వెల్లడించారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి రెస్క్యూ చేస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని.. ఘటనపై ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. మరో వైపు, టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే.ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
SLBC టన్నెల్ నుంచి కొనసాగుతున్న మృతదేహాల వెలికితీత
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక.. నాగర్ కర్నూల్ నుంచి ఎనిమిది ఆంబులెన్స్లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. అక్కడి గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.మరోవైపు టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
మాస్ కాపీయింగ్కు తావివ్వొద్దు
కందనూలు: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్ పరీక్షల కన్వీనర్ వెంకటరమణ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం జిల్లాకేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాళ్లకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఇంటర్ బోర్డు ప్రతినిధిగా డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల వసతులు కల్పించాలని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూడాలని, సెల్ఫోన్ అనుమతించకూడదని సూచించారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: ప్రైవేట్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తామన్నారు. విహాన స్కానింగ్ సెంటర్, శ్రీ సత్యసాయి నర్సింగ్ హోంలోని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించిన గర్భిణుల స్కానింగ్ వివరాలు, ఫారం–ఎఫ్ల రికార్డులు, స్కానింగ్ మిషన్ వివరాలను సేకరించారు. లింగ నిర్ధారణ చట్టం గురించి తెలిపే బోర్డులను పరిశీలించి, స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు లింగ నిర్ధారణ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారు, చేయించుకున్న వారు, ప్రోత్సహించిన వారు గర్భ నిర్ధారణ నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తామని, గర్భ నిర్ధారణ నిరోధక చట్టం అమలుకు వైద్యులు ప్రజలు సహకరించాలని కోరారు. ఆమె వెంట డీపీఓ రేణయ్య, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఉన్నారు. -
కాలుష్య కారకం
కాలం చెల్లిన వాహనం.. ●15 ఏళ్లుపై బడిన వెహికిల్స్తో తీవ్రమైన కాలుష్యం ఆదేశాలు ఇచ్చాం.. ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ● ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం కలిగి ఉండటం సర్వసాధారణమైపోయింది. వాహనం ఉండటం సరే.. దాని నుంచి వచ్చే కాలుష్యమే పర్యావరణానికి హాని కలిగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటోంది. వాహనాల నుంచి మోతాదుకు మించి కాలుష్యం విడుదల కాకుండా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. డీజిల్ వాహనాల నుంచి 60 శాతానికి మించి పొగ రాకూడదు. అలాగే పెట్రోల్ వాహనాల నుంచి ద్విచక్రవాహనమైతే 3.5శాతం, కార్లు ఇతర వాహనాలైతే 4.5 శాతానికి మించరాదు. కానీ, కాలం చెల్లిన వాహనాల నుంచి అధిక మోతాదులో పొగ విడుదలవుతుంది. దేశ రాజధానిలో వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరోజు కొన్ని వాహనాలను మాత్రమే రహదారి మీదికి అనుమతిస్తున్నారు. మన పట్టణంలోనూ రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పలు గుంతల రహదారులతో పాటు వాహనాల పొగతో వెలువడే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ వాధ్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15ఏళ్లు పైబడిన అన్ని రకాల వాహనాల వివరాలు జిల్లా వాహనాలు మహబూబ్నగర్ 13,965 నాగర్కర్నూల్ 5,295 వనపర్తి 4,059 జోగుళాంబ గద్వాల 3,672 నారాయణపేట 5,190 -
అడ్డంకులు దాటుతూ..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు వివరాలు 8లో uఅచ్చంపేట/అచ్చంపేట రూరల్: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీఎం కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. కటింగ్ చేసిన విడి భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్ ద్వారా సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలలో సొరంగం బయటికి బురద, గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ జేసీబీలను వినియోగిస్తున్నారు. జేసీబీలు, బృందాలు లోపల బురదను పక్కకు తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు. సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. ● టన్నెల్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విపత్తుల విభాగం ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అదనపు బృందాల రాక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు శుక్రవారం రామగుండం, కొత్తగూడెం నుంచి అదనంగా సింగరేణి బృందాలు చేరుకున్నాయి. సింగరేణి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సింగరేణి కార్మికులు సొరంగంలో బురద మట్టిని తొలగించడానికి శాయశక్తులా పనిచేశారు. సింగరేణి కార్మికులు విడతల వారీగా సొరంగంలోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, బీఆర్ఓ, రైల్వే శాఖతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం టన్నెల్లో 11.560 కి.మీ., నుంచి 12.950 కి.మీ., వరకు వాటర్, బురద మట్టి పేరుకుపోగా.. రెండు రోజులుగా వీటిని తొలగిస్తున్నారు. అలాగే 150 మీటర్ల మేర పేరుకున్న మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు. ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు -
ముమ్మరంగా సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. దోమలపెంట జేపీ బేస్ క్యాంప్ కార్యాలయంలో సహాయక బృందాల అధికారులతో కలెక్టర్, ఎస్పీ వైభవ్, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుఖేండు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారని, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద యుద్ధ ప్రాదిపదికన సహాయక చర్యలు చేపడుతున్నా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల నుంచే ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా శవ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల సంఘటనలు జరిగినా.. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరూ కూడా పరామర్శించలేదన్నారు. ప్రతిపక్ష నాయకులు పరామర్శించడానికి వెళ్తే అడ్డుకుని అరెస్టులు చేయించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని మాట్లాడటం సరైంది కాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడేళ్లలో 25 కి.మీ., సొరంగం పనులు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేవలం 5 కి.మీ., మాత్రమే సొరంగం పనులు చేపట్టారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. -
ఎమ్మెల్యే, ఇరిగేషన్ అధికారులపై రైతుల ఫిర్యాదు
బల్మూర్: కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఉమామహేశ్వర ప్రాజెక్టు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం భూ నిర్వాసిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదును పరిశీలించిన ఎస్ఐ రమాదేవి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలోకి వస్తుందని తిరస్కరించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసిత రైతు కమిటీ నాయకులు సీతారాంరెడ్డి, తిరుపతయ్య, ఇంద్రారెడ్డి తదితరులు స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మిస్తే నాలుగు గ్రామాల రైతుల భూములు కోల్పోతామని కోర్టును ఆశ్రయించగా నిర్వాసితులకు పరిహారంతోపాటు పిసా చట్టం ప్రకారం ఏజెన్సీ గ్రామమైన బల్మూర్లో ఎస్సీ, ఎస్టీ రైతులకు పునరావాసం కల్పించి పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు. కానీ, భూ సేకరణ చేయకుండా, రైతులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే గురువారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు నిలిపి వేయకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడమని తేల్చిచెప్పారు. కోర్టు పరిధిలో తేల్చుకోవాలని తిరస్కరించిన పోలీసులు -
ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అచ్చంపేట: జిల్లాలో ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఉన్నత స్థాయి అధికారులు శుక్రవారం కలెక్టర్లతో వీసీ నిర్వహించగా.. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు సమీక్షిస్తున్న కలెక్టర్ బదావత్ సంతోష్ ఎస్ఎల్బీసీ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 13,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. వీరికోసం 33 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,477 మంది విద్యార్థులు ఉండగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది ఉన్నారన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్తో పటిష్ట నిఘా పెడతామని వివరించారు. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి కస్టోడియన్, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు పూర్తిగా మూసివేయించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచించామన్నారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు ఇతర మందులతో మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, ఆశాలు అందుబాటులో ఉంటారన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా, పరీక్ష కేంద్రాల వద్ద మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక వసతలు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి
కందనూలు: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనకు తొలిమెట్టు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని, విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఏఎంవో షర్పుద్ధీన్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతేడాది అక్టోబర్లో డీఎస్సీ ద్వారా నియామకమైన 129 నూతన ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై శిక్షణలో భాగంగా మొదటిరోజు ప్రారంభమైంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిపెట్టి సామర్థ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగర్కర్నూల్ ఎంఈఓ భాస్కర్రెడ్డి, పాఠశాల హెచ్ఎం సిద్ధిక్ అహ్మద్, రీసోర్స్పర్సన్స్ లక్ష్మీనర్సింహరావు, నెహ్రూప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చేరేందుకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాఘవేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేస్తున్నామని, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్యసేవలు బిజినేపల్లి: పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలోని వసంతాపూర్ గ్రామం పల్లె దవాఖానాను సందర్శించి, వర్చువల్ పద్ధతిలో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల అసెస్మెంట్లో పాల్గొన్నారు. పల్లె దవాఖానాల్లో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటివి పరిశీలించారు. క్షయ నిర్మూలన, దోమకాటులో వ్యాధుల నియంత్రణ, అసంక్రమిత వ్యాధుల నివారణ వంటి కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాలెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రియాంక, డీపీఓ రేణయ్య, క్యూసీ మేనేజర్ సంతోష్కుమార్, ఆశాలు పాల్గొన్నారు. వేలం పాట వాయిదా చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయంలో శనివారం ని ర్వహించే వేలం పాట అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాట తిరిగి నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. -
ఏ క్షణంలోనైనా బయటికి!
సాక్షి, నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసేందుకు చేపడుతున్న సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. టన్నెల్లో ప్రమాదం జరిగి, సుమారు 18 అడుగుల మేర మట్టి, శిథిలాలతో నిండిపోయిన ప్రాంతంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) ద్వారా స్కానింగ్ చేశారు. ఈ క్రమంలో ఐదు చోట్ల అనుమానిత అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రమాద స్థలంలో మట్టి, రాళ్లు, బురద, టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం), ఇతర పరికరాల శిథిలాలతో నిండిపోగా.. అందులో కొన్నిచోట్ల మానవ దేహాలుగా భావిస్తున్న కొన్ని సున్నితమైన వస్తువులు ఉన్నట్టుగా రాడార్ సిగ్నల్స్ ద్వారా నిర్ధారించారు.ఆ చోట్ల తవ్వకాలు చేపడుతున్నారు. దీనితో ఏ క్షణంలోనైనా కార్మికులను బయటికి తీసే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే అధునాతన క్రిటికల్ కేర్ అంబులెన్స్లు, వైద్యులు, ఆక్సిజన్ను అందుబాటు లో ఉంచారు. ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్కుమార్ గుప్తా, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్కుమార్, సింగరేణి సీఎండీ బలరాం తదితరు లు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 13.2 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్.. టన్నెల్లో కన్వేయర్ బెల్టు ఇంకా సిద్ధం కాకపోవడంతో.. సహాయక బృందాల రాకపోకలు, శిథిలాలు, మట్టి, బురద తొలగింపునకు లోకో ట్రైన్ ఒక్కటే ఆధారంగా మారింది. దానిపై రెస్క్యూ టీం సభ్యులను, బురద, మట్టి, శిథిలాలను మూడు కోచ్ల్లో తరలిస్తున్నారు. ఈ లోకోట్రాక్ 13.50 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉన్నా... చివరి 300 మీటర్ల ప్రాంతంలో 2 అడుగుల మేర మట్టి, బురద పేరుకుని ఉంది. దీనితో 13.2 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. ఇప్పుడు మిగతా ట్రాక్పై ఉన్న బురదను మినీ డోజర్తో తొలగిస్తూ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. నాలుగు షిఫ్టులుగా పనులు టన్నెల్లో మొత్తం 250 మంది రెస్క్యూ సిబ్బంది నాలుగు షిఫ్టులుగా పనిచేస్తున్నారు. శిథిలాల కింద టీబీఎం ముక్కలై పోయి 40 మీటర్ల దూరం వరకు చెదిరిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకునేందుకు అడ్డుగా ఉన్న ఈ టీబీఎం మెషీన్ భాగాలు, శిథిలాలు, పైపులు, గడ్డర్లను సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో గ్యాస్ కట్టర్స్, వెల్డర్స్ కలసి క ట్ చేసి తొలగిస్తున్నారు. ఇందుకోసం అదనంగా 200 మంది సింగరేణి కార్మికులు ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. ఇక సొరంగంలో కిందకి వంగిపోయిన ఎయిర్ బ్లోయర్ను కట్ చేసి సరిచేశారు. మొత్తం పది మోటార్లతో డీవాటరింగ్ ప్రక్రి య చేపడుతున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిలో జార్ఖండ్కు చెందిన కార్మికుల కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద దోమలపెంటకు చేరుకోగా.. పంజాబ్కు చెందిన గురుప్రీత్సింగ్ కుటుంబసభ్యులు శుక్రవారం చేరుకున్నారు.జీపీఆర్ గుర్తించింది.. కచి్చతమని చెప్పలేం: సింగరేణి సీఎండీ బలరాంసొరంగంలోని ప్రమాద స్థలంలో జీపీఆర్ స్కానింగ్లో అనుమానిత స్పాట్లను నిపుణులు గుర్తించారని.. అయితే దీనిపై కచి్చతమైన నిర్ధారణకు రాలేదని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఎస్ఎల్బీసీ వద్ద ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో కొన్ని స్పాట్లు అంచనా వేశారు. వాటిపై ఇంకా స్టడీ చేయాల్సి ఉంది. వారిని బయటికి తీసేందుకు సమయం పడుతుంది. సొరంగంలో గ్యాస్ కట్టింగ్, వెల్డింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి’’ అని బలరాం తెలిపారు.తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికుల మృతదేహాలు లభించాయంటూ వస్తున్న వార్తలు, ప్రచారాన్ని నమ్మవద్దు. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో జీపీఆర్ విధానంలో గుర్తించిన స్పాట్లు పూర్తిగా నిర్ధారణ కాలేదు. వాటిని ఇంకా నిపుణులతో పరిశీలించాల్సి ఉంది. వీలైనంత త్వరగా కార్మికులను బయటికి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ -
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
నాగర్ కర్నూల్, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో భాగంగా చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది.. ఈరోజు(శుక్రవారం) SLBC టన్నెల్లో తప్పిపోయిన 8 మంది కార్మికులు ఆచూకీ కోసం ఆపరేషన్ చేపట్టారు.. ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపట్టగా.. కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు.టీబీఎం మిషన్ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. అవి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు..ఈరోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని శకలాలు ఆచూకీ లభించింది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు.జీపీఆర్ టెక్నాలజీ ద్వారా..టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ ఆరంభించింది. దీనిలో భాగంగా భూమిలో కూరుకుపోయి ఉంటే వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ ను పూర్తిగా స్కాన్ చేశారు.మరో రెండు రోజుల్లో పడుతుంది..ఈ టన్నెల్ చిక్కుకున్న వారి సమాచారం కావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది సీఎం సింగరేణి సిఎండి బలరాం. ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారు, కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామన్నారు. అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. -
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో ఈరోజు ఏం చేస్తారంటే?
సాక్షి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చుజీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు (శుక్రవారం) విశ్లేషించనున్నారు.బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్ఫోర్స్మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. -
సొరంగంలో జీపీఆర్ పరీక్షలు
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చు. దీంతో గల్లంతైన కార్మికులు శిథిలాల కింద ఎక్కడున్నారో గురువారం రాత్రిలోగా తెలిసిపోయే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. శిథిలాల తవ్వకాలు ప్రారంభం..బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్ఫోర్స్మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.కన్వేయర్ బెల్టు మరమ్మతు కష్టమే..సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సింగరేణి నుంచి మరో 200 మందిగోదావరిఖని (రామగుండం): సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.ఈ పరికరం ఎలా పనిచేస్తుంది?జీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు శుక్రవారం విశ్లేషించనున్నారు. -
పరిశోధనలపై ఆసక్తితోనే ఉన్నత స్థాయికి..
బిజినేపల్లి: సైన్స్ను ఇష్టపడి శాస్త్రవేత్త కాలేకపోయినా.. జీవితకాలం సైన్స్ ఫ్యాకల్టీగా సైన్స్ పరిశోధనలపై ఆసక్తితోనే ప్రతాప్ కౌటిల్య ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్ అన్నారు. ప్రతాప్ కౌటిల్య 2025 సంవత్సరానికి గాను అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందుకోవడంతో గురువారం ఆయనను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ రాజేందర్సింగ్ ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్న ప్రతాప్ కౌటిల్య పరిశోధన పట్ల అభిరుచితో సైన్స్ డాట్ కామ్, సైన్స్ నేచర్ వంటి మూడు పుస్తకాలు రచించారన్నారు. ఇందుకు గాను ఆయనకు 2019 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ప్రతిభా అవార్డు, 2024లో జాతీయ పురస్కారం అందుకున్నారన్నారు. అనంతరం ప్రతాప్ కౌటిల్యకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రొఫెసర్ యాదగిరి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ అకాడమీలోప్రవేశాలు కందనూలు: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025– 26 సంవత్సరానికి మోడల్ స్పోర్ట్స్ పాఠశాల, వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 ఏళ్లలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్లాగ్ ఖాళీలు పూర్తి చేస్తూ.. ప్రస్తుతం 4, 5, 6, 7 తరగతులు చదువుతున్న గిరిజన బాల, బాలికలు అర్హులన్నారు. జిల్లా స్థాయి ఎంపికలను వచ్చే నెల 12 నుంచి 16 వరకు అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తామని చెప్పారు. జూరాలకు తగ్గిన ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో గురువారం తగ్గింది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 2,418 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. గురువారం ఉదయానికి 365 క్యూసెక్కులకు తగ్గిపోయాయి. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా.. ఇక్కడికి కేవలం 2,418 క్యూసెక్కులు 24 గంటల పాటు చేరాయి. అనంతరం పూర్తిగా ఇన్ఫ్లో తగ్గింది. తాగు, సాగు నీటికి ఈ సారి తిప్పలు తప్పేలా లేనట్లుగా కనిపిస్తోంది. ఆవిరి రూపంలో 75 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుకు 625, భీమా లిఫ్టు–1కు 550, కోయిల్సాగర్కు 220, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 375, ప్రాజెక్టు నుంచి మొత్తం 2495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4.721 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. -
రెండోరోజూ కొనసాగిన గాలింపు
● 100 ఫీట్ల మేర నీటి తోడివేత ● రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం ● లభ్యం కాని విద్యార్థి ఆచూకీ – వెల్దండ వివరాలు 8లోపక్కా భవనాలు లేక.. ● కోడేరులో పలు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. -
రెండేళ్లలో ఉమామహేశ్వరం ప్రాజెక్టు పూర్తి
బల్మూర్: ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ప్రాజెక్టు పనులను గురువారం ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2.5 టీఎంసీలకు తగ్గించామని తెలిపారు. ఫేజ్–1లో రూ.1,534 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుంద న్నారు. కార్యక్రమంలో ఎస్ఈ విజయభాస్కర్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణరెడ్డి, ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
నాగర్కర్నూల్: వచ్చేనెల 5 నుంచి 22 వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో సరిపడా ఫర్నిచర్, తాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాలో ప్రథమ సంవ్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరంలో 6,977 మంది పరీక్షకు హాజరు కానున్నారని, వీరికోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 14 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 11 మంది అదనపు సూపరింటెండెంట్లు, ఇద్దరు ఫ్లయింగ్, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఆరుగురు కస్టోడియన్లు పర్యవేక్షిస్తారన్నారు. సమావేశంలో డీఐఈఓ వెంకటరమణ, డీఈఓ రమేష్, పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్రావు తదితరులు పాల్గొన్నారు.