Nagarkurnool
-
రైతులకు ఇబ్బందులు రానివ్వం
● ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు ● ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తాం ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి కందనూలు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి ఆయన జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్యార్డులో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీబ్యాగుల సేకరణ, ధాన్యం కాంటా, గోదాంలకు తరలింపు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పంటలకు నిర్ణయించిన మద్దతు ధర పూర్తిస్థాయిలో ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ పంటను మార్కెట్యార్డుకు తీసుకొచ్చిన వెంటనే టోకెన్ల ఆధారంగా నమోదుచేసి.. ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ అన్నారు. అదే విధంగా రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తేమశాతం, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ.. కొనుగోళ్లు చేపడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో వ్యవహరించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే సిబ్బంది సంఖ్య పెంచి రైతులకు ఏ సమస్య లేకుండా ధాన్యం సేకరించాలని సూచించారు. విద్యతోనే సమాజాభివృద్ధి.. విద్యతోనే సమాజాబివృద్ధి సాధ్యమని ఎంపీ మల్లు రవి అన్నారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి బుధవారం జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సౌజన్యంతో కలెక్టరేట్ వద్ద నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని కుమ్మెర, పెద్దాపూర్, గన్యాగుల, మంతటి, గగ్గలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే 130 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువు కొనసాగించడంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో రవాణా సౌకర్యం ఒకటి అని అన్నారు. విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవాలనే ఆలోచనతో సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కుర్మయ్య, జిందాల్ సంస్థ ప్రతినిధి రెడ్డి నాయక్, విద్యాశాఖ అధికారి వెంకట్శెట్టి పాల్గొన్నారు. -
‘రామన్పాడ్’ తగ్గుముఖం
● రిజర్వాయర్లో ఏడు మీటర్లు తగ్గిన నీటిమట్టం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలని వినతి అచ్చంపేట: టీజీ జెన్కోలో వెలువడిన బదిలీల ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ భూగర్భ కేంద్రం ఇంజినీర్లు బుధవారం కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా ఉత్తర్వులలో పేర్కొన్న విధానాన్ని అమలు చేయాలని సీఈకి విన్నవించారు. పదేళ్లుగా జెన్కోలో పనిచేస్తున్న వారికి బదిలీలో ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏఈలు, ఏడీఈలు, డీఈలు ఉన్నారు. మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్ జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తా గునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్పాడు రిజర్వాయర్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్పాడు రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. రామన్పాడు రిజర్వాయర్లో ప్రస్తుత నీటిమట్టం శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
బహిరంగ సభను విజయవంతం చేయాలి
అచ్చంపేట: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవిష్యత్తు మార్చబోయే ఈ బహిరంగ సభ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు అమర్ నాధ్, సోలాంకి శ్రీనివాస్ నాయక్, మంగ్యానాయక్, రేణయ్య తదితరులు ఉన్నారు. -
ప్రజల భద్రతకు ప్రాధాన్యం..
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల భద్రత, సౌకర్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. రాబోయే రోజుల్లో మరిన్ని ముఖ్య కూడళ్ల వద్ద కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా మరిన్ని సదుపాయాలు ఏర్పాటుచేస్తామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరిస్తూ ప్రయాణించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్చైర్మన్ బాదం రమేశ్, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎస్ఐలు గోవర్ధన్, కళ్యాణ్ పాల్గొన్నారు. -
ఎంతో ప్రయోజనం..
జిల్లాకేంద్రంలో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారుల అవస్థలు తీరుతాయి. వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడపకుండా నెమ్మదిగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్తో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. – శివాచారి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేశాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను నడపాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – నోముల వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ ● -
మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కల్వకుర్తి రూరల్: మొక్కజొన్న ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా గోదాముల వద్ద రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై పలువురు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలోని మొక్కజొన్న గోదాంను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో సమస్యలను తెలుసుకున్నారు. గోదాంలో మొక్కజొన్న బస్తాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని గోదాంకు తరలించేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే.. వెంటనే జిల్లా అధికారులకు ఫోన్చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాంత్రెడ్డి, గోలి సురేందర్రెడ్డి, శ్రీపురం హరీశ్రెడ్డి, సీఐ నాగార్జున ఉన్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,328 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. ఽఅలాగే రైతులు 4,803 బస్తాల మొక్కజొన్న మార్కెట్కు వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్రకం క్వింటా గరిష్టంగా రూ.2,499, కనిష్టంగా రూ.1,601, వేరుశనగకు గరిష్టంగా రూ.7,762, కనిష్టంగా రూ.6,199, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,254,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,845, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.2,065, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,758గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
తీరనున్న ట్రాఫికర్!
జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు ● వాహనాల రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు ● రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు ● ట్రాఫిక్ సిగ్నల్స్తో వాహనదారులకు తప్పనున్న వెతలు జిల్లా జనరల్ ఆస్పత్రి రోడ్డువైపు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ నాగర్కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలో రోజురోజుకూ వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ.. వాహనదారులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఊరట కలిగించేందుకు జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శ్రీపురం రోడ్డు చౌరస్తాలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను బుధవారం అందుబాటులోకి తీసుకురావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మరిన్ని.. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రస్తుతం శ్రీపురం చౌరస్తా, బస్టాండ్ వద్ద, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. వీటికి మరిన్ని బ్లింక్లర్స్ ఏర్పాటుచేస్తూ.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అదే విధంగా రద్దీ ప్రాంతాల్లో మరిన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ.. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్తో రోడ్డు ప్రమాదాలను కొంతమేర నివారించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా వాహనదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమయ్యేవారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం లాంటివి చేస్తుండేవారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కెమెరాల ఏర్పాటుతో ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారుల్లో కొంతమేర మార్పు వచ్చి రోడ్డు నిబంధనలు పాటించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం సరికాదని.. తూకం చేసిన వెంటనే రైస్మిల్లులకు తరలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును పార్టీ నాయకుల బృందంతో కలిసి సందర్శించారు. ఐకేపీ, సింగిల్విండో ద్వారా కొనసాగుతున్న కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే పూర్తిచేసి తరలించాలని కోరారు. లారీల కొరతతో తూకం చేసిన ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందన్నారు. మిల్లు యజమానులు ధాన్యం దించుకునే సమయంలో సమస్యలు సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్రెడ్డి, జీఎస్ గోపి, మండ్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాల్యానాయక్, ఆంజనేయులు, ఆసీఫ్, కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతం పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దన్ పర్వతాలు విమర్శించారు. తాజాగా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కట్టెలపొయ్యి ఏర్పాటుచేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతుండటంతో ప్రజల జీవన ప్రమాణాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. కమర్షియల్ వంటగ్యాస్ ధర ఏకంగా రూ.వెయ్యి పెంచి.. చిన్నచిన్న హోటళ్లు నడుపుకొని జీవిస్తున్న వారిపై పెనుభారం మోపడం సరైంది కాదన్నారు. దేశ ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యి వాడే స్థితికి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికై నా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కందికొండ గీత, పొదిల రామయ్య, సత్యనారాయణ, మల్లిఖార్జున్, బంగారయ్య, లక్ష్మయ్య, ఖాజా, నర్సింహ, సిద్దూ, శిరీష, లక్ష్మి, పార్వతమ్మ పాల్గొన్నారు. -
‘నేతన్నకు పొదుపు’ జాడేది?
అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ -
సాంఘికశాస్త్రంతో సామాజిక అవగాహన
కందనూలు: సాంఘిక శాస్త్రంతో సామాజిక అవగాహన పెంపొందుతుందని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. మంగళవారం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల వేదిక, క్లాస్మెట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 100/100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఓ అద్దంలా సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుందన్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలో 100/100 మార్కులు సాధించడం కఠినంతో కూడిన విషయమని.. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని అన్నారు. సాంఘిక శాస్త్రంలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న క్లాస్మెట్ క్లబ్ సభ్యులతో పాటు, సోషల్ ఫోరం సభ్యులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేందర్, కృష్ణమోహన్, తీగల జనార్దన్, డా.ప్రపుల్చంద్రారెడ్డి, సౌజన్య కిషోర్ పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మన్ననూర్: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవికుమార్ సూచించారు. మంగళవారం మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని స్టోర్రూంలో నిల్వ ఉన్న మందులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పీహెచ్సీలో మధ్యాహ్నం తర్వాత సేవలు సక్రమంగా అందడం లేదనే సమాచారంపై ఆయన వివరణ అడిగారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి సమీపాన పీహెచ్సీ ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న ఆశ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆశావర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఈఎంఓ చారి, ఏపీఎంఓ మధుమోహన్, డా.సుధాకర్, లోక్యానాయక్ ఉన్నారు. -
ఆయిల్పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
అచ్చంపేట రూరల్: ఆయిల్పాం సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయిల్పాం సాగుతో కలిగే లాభాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కృషి ధన్ ధన్య యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతులు లాభసాటి పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, సిద్దప్ప, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీసంక్షేమ ఫలాలు
కందనూలు: ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బక్రీద్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి నాగర్కర్నూల్ క్రైం: రాబోయే బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో సీఐ అశోక్రెడ్డి ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ప్రతి అధికారి, ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టంచేశారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లోని వివిధ విభాగాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయం 10:38 గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేయగా.. ఆ సమయానికి కూడా సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం, అప్పటికే వివిధ పనులపై పిటిషనర్లు, రిటైర్డ్ పెన్షనర్లు కార్యాలయంలో వేచి ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయానికి ప్రజలే ముందుగా వచ్చి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తంచేస్తూ.. సంబంధిత అధికారులను వివరణ కోరారు. అయితే ట్రెజరీ అధికారి సెలవులో ఉన్నారని తెలియజేయగా.. సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి లోపం ఉండకూడదని కలెక్టర్ స్పష్టంచేశారు. రోజు ఉదయం 10 గంటలలోగా ప్రతి అధికారి, సిబ్బంది కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి హాజరుకాని సిబ్బందిపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. బాధ్యతారహిత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సకాలంలో విధులకు హాజరుకాని ట్రెజరీశాఖ సిబ్బందిపై ఆగ్రహం ఈవీఎం గోదాం తనిఖీ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. అందులో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు తదితర ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీసీ నిఘా పెంచడంతో పాటు పరికరాల నిర్వహణ సకాలంలో చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. -
పోలీసు సేవల్ని వినియోగించుకోండి
నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన 10 అర్జీలలో భూమికి సంబంధించి 5, తగు న్యాయం కోసం 5 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపించినట్లు చెప్పారు. -
62 రేడియల్ క్రస్టు గేట్లు
జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 రేడియల్ క్రస్టు గేట్లు ఉన్నాయి. ఇందులో 4, 8, 12, 19, 21, 25, 27, 31, 41, 45, 51 గేట్ల రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడినట్లు 20 19లోనే అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి మరమ్మతులపై ప్రతిపాదనలు పంపినా ప్ర భుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. మరమ్మత్తులు పూర్తిచేస్తాం.... జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ ● -
తైబజార్ పేరిట దోపిడీ
● ఉన్న రేటు కంటే మూడింతలు అధికంగా వసూళ్లు ● ఇదేమిటని అడిగితే బెదిరింపులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు కందనూలు: జిల్లాకేంద్రంలో మామిడి వ్యాపారులు, రైతుల వద్ద కొందరు తైబజారు పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు, రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను తైబజార్ పేరుతో దోపిడీ చేస్తున్నారని.. ఒక్కో గంప, ట్రేకు మున్సిపాలిటీ నిర్ణయించిన రేటు రూ.28 కాగా.. నిబంధనలు ఉల్లంఘించి ఒక్కొక్క గంప, ట్రేకు రూ.100 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఉన్న రేటు కంటే మూడింతలు అధికంగా వసూలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా రేపటి నుంచి మీరు ఇక్కడ అమ్మడానికి వీలు లేదని బెదిరిస్తున్నారని, తీసుకున్న రుసుంకు రసీదు అడిగితే ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని ఎందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడిగితే మున్సిపాలిటీ వాళ్లకు మేం కూడా ఎక్కువగా చెల్లిస్తున్నాం.. కాబట్టి మీరు కూడా అడిగినంత ఇవ్వాలని దబాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సరైన ధరలు లేక తీసుకొచ్చిన సరుకు ఆటోల కిరాయి, ఇతర ఖర్చులు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని, తైబజారు పేరుతో రసీదు లేకుండా అక్రమ వసూళ్లు చేయడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజలకు, పండ్లు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఎట్టకేలకు మరమ్మతు
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాలకు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపులు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపు లు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇను ప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏ ర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రా ష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మ తు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు.. జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్లో ఉంచారు. టెండర్ ప్రక్రియ పూర్తి.. జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మంత్రి పర్యటనతో.. జూరాల గేట్లకు రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడటంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ సందర్భంలోనే గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో చేపడుతామని, అదేవిధంగా డ్యాంపై పరిమితికి మించి వాహనాలు లోడ్తో వెళ్లడం ప్రమాదమని గుర్తించినట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం రూ.4.30 కోట్లు మంజూరు చేసింది. జూరాల డ్యాం గేట్ల రిపేరుకు రూ.4.30 కోట్లు నిధులు తాజాగా 42 ఇనుప రోపులపునరుద్ధరణ ఇదివరకే 10 రోపులకు కొనసాగుతున్న పనులు ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు -
జీడిపల్లిలో అక్రమంగా బ్లాస్టింగ్
● రేయింబవళ్లు తేడా లేకుండా పేలుళ్లు ● ఆందోళన చెందుతున్న అన్నదాతలు కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్లు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. మండలంలోని జీడిపల్లి శివారులో విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న బ్లాస్టింగ్తో రైతులు ఆందోళన చెందుతున్నారు. 12 అడుగుల వెడల్పు 18 అడుగుల ఎత్తులో పిల్లర్ల నిర్మాణానికి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖల అధికారుల అనుమతులు లేకుండానే పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని సమీపంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అవినీతి అధికారుల మద్దతుతో ఇష్టానుసారంగా రేయింబవళ్లు తేడా లేకుండా జరుగుతున్న పేలుళ్లతో సమీపంలో ఉన్న బోరుబావులు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం బ్లాస్టింగ్ కారణంగా సమీపంలోని భూములు కంపించి, బోరు బావుల్లో కుదుపు రావడంతోపాటు పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్తో రైతులకు మేలు చేసే క్రిములు చనిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ శాఖల అధికారుల అనుమతులు లేకుండానే వీరికి పేలుడు పదార్థాలు ఎలా వస్తున్నాయి అని పలువురు చర్చించుకుంటున్నారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల షాపులు ఏర్పాటు చేయాలంటే ఎంతోమంది అధికారుల అనుమతులు తనిఖీలు ఉంటాయి. అలాంటిది బాంబులు పెట్టి పేలుళ్లు చేస్తుంటే ఎవరికి పట్టకపోవడంతో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఉండి బ్లాస్టింగ్ చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. ఏదీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతుండడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబులను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులంటున్నారు. విచారణ జరుపుతాం.. జీడిపల్లి సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్లకు అనుమతులు ఏమైనా ఉన్నాయా అని ఆర్డీఓ జనార్దన్రెడ్డి కోరగా.. తనకు ఎలాంటి సమా చారం లేదని ఇంతకు ముందు ఎవరైనా అనుమతులు ఇచ్చారో తెలియదన్నారు. దీనిపై విచారణ జరుపుతామని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని వివరించారు. -
జనరల్ ఫండ్ పెంపొందించుకోవడంలో మున్సిపాలిటీల విఫలం
● ఆదాయ, వ్యయాలకు సరితూగని నిధులు ● చాలాచోట్ల కార్మికుల వేతనాలకే సరిపోని దుస్థితి ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాసులే ఆధారం ● జిల్లాలోని పురపాలికల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం అచ్చంపేట: మున్సిపల్ జనరల్ ఫండ్ అనేది స్థానిక ప్రభుత్వానికి ప్రాథమిక నిర్వహణ నిధి. ఇది రోజువారి కార్యకలాపాలు, సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రజా భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఉద్యాన వనాలు, సాధారణ పరిపాలన వంటి ముఖ్యమైన సేవలకు వినియోగిస్తూ ఆదాయ, వ్యయాలలో సమతుల్యత సాధించాలి. ఆస్తి, నీటిపన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, అడ్వర్టైజ్మెంట్ పన్నులు, రుసుంలు, వివిధ రకాలుగా వచ్చే ఆదాయాలను ఏకీకృతం చేసి బ్యాలెన్సును పెంచుకోవాలి. అయితే జిల్లాలో మున్సిపాలిటీలు ఏర్పడి దశాబ్దకాలం గడుస్తున్నా జనరల్ ఫండ్ కార్మికుల వేతనాలకే సరిపోని పరిస్థితి. దీంతో రోజువారీ నిర్వహణలో వెనుకబాటు తప్పట్లేదు. స్వయం సమృద్ధి సాధించలేక పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఫల్యం ఎక్కడా.. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నిర్ధారణ సరైనా పద్ధతిలో జరగడం లేదనే విమర్శలున్నాయి. భవనాలకు సంబంధించి కొలతలలో సరైన అంచనాలు చేపట్టకుండా రెవెన్యూ విభాగం అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగం అధికారులు తమ జేబులు నింపుకోవడమే తప్పితే మున్సిపల్ ఆదాయం పెంపుపై దృష్టిసారించడం లేదనే అపవాదు వస్తుంది. రెసిడెన్సియల్ అనుమతులు తీసుకొచ్చి కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినా, భవనాల కింద సెల్లార్లు నిర్మిస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించడం వెనక మామూళ్లే కారణమనేది బహిరంగ రహస్యం. లీజు భూముల ఆదాయం ప్రతి మూడేళ్లకోసారి సవరించి పెంచాల్సి ఉండగా.. నేటికీ ఏళ్లనాడు నిర్ధారించిన పన్నులనే వసూలు చేయడం గమనార్హం. మిషన్ భగీరథ నల్లాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు పన్నులు నిర్ధారించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రెండు మున్సిపాలిటీలే.. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీలు మాత్రమే ఇంటి పన్నుల వసూళ్లలో ముందంజలో ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు అవకాశం లభించింది. అలాగే నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 2024– 25 కంటే రూ.40 లక్షలు ఎక్కువ నిధులు వసూలు చేసినా 2025– 26లో 15వ ఆర్థిక సంవత్సరం నిధులకు అర్హత సాధించలేదు. కల్వకుర్తి మున్సిపాలిటీ నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. గృహాలు, ప్రైవేట్ దుకాణాల సముదాయాల వారు కొంత మేర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోగా.. అధికారుల చుట్టూ తిరిగి నోటీసులు ఇస్తున్నా పట్టింపు లేదు. -
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కందనూలు: ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ ప్రజల నుంచి 35 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలకు పరిష్కారం చూపుతారనే ఆశతో ప్రజలు ప్రజావాణికి వస్తారని అధికారులు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులపై దృష్టిసారించాలి తాడూరు: గ్రామీణ ప్రాంతాల రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్రావు అన్నారు. సోమవారం ప్రజా ప్రభుత్వం– ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో క్లస్టర్ రైతువేదికల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వాడకం, సహజ వ్యవసాయం, వరిలో ప్రాధాన్యత రకాలు, మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. అలాగే మండలంలోని ఇంద్రకల్ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమానికి వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్ పద్మహర్షతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, సహాయ సంచాలకుల పూర్ణశేఖర్ హాజరయ్యా రు. రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగులో అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడి సాధించేలా ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్రెడ్డి, ఉద్యాన శాఖా ధికారి జగన్, ఉపసర్పంచ్ పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఫలితాలు
కందనూలు: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పనితీరుకు నిదర్శనం ఫలితాలు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ కూడలిలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పునాది పశ్చిమబెంగాల్లో పుట్టిందని, అక్కడ పుట్టిన నాయకుడే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన ఆశయ సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షాతోపాటు అనేక మంది నాయకులు దేశంలో చేస్తున్న నిస్వార్థ సేవలకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయానికి కారణమన్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అంత్యోదయ సిద్ధాంతం అమలు కార్యక్రమాలను ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన అందించినందుకే ప్రజలు ఆత్మవిశ్వాసంతో బీజేపీని గెలిపించారన్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రజాతీర్పునకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశంలో 370 ఆర్టికల్, రామ జన్మభూమి, త్రిపుల్ తలాక్, ఒక దేశం– ఒకే చట్టం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్గౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రమోద్కుమార్, కార్యాలయ కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
వెల్దండ: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కొట్రలో ఆదివారం కంఠ మహేశ్వరస్వామి దేవాలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీసింగ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డిలు వేర్వేరుగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, నాయకులు భూపతిరెడ్డి, ఆనంద్కుమార్ సంజీవ్కుమార్, బచ్చు రామకృష్ణ, హరికిషన్నాయక్, సురేందర్రెడ్డి, బీజేపీ నాయకులు శేఖర్రెడ్డి, బాలస్వామి, గౌడ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. -
ఈతకు వెతలు!
కొల్లాపూర్: వేసవి సెలవు దినాల్లో ఈత నేర్చుకోవడం చిన్నారులకు గగనంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లేకపోవడంతో ఎంజీకేఎల్ఐ కాల్వలు, బావులను ఆశ్రయిస్తున్నారు. అయితే వాటి లోతు ఎక్కువగా ఉండటం.. జమ్ము, ముళ్లపొదలు కాళ్లకు చుట్టుకోవడం వంటి కారణాలతో ఏటా చిన్నారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఈత నేర్చుకునే క్రమంలో పలువురు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రమాదాల నివారణకు క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుచేసి.. చిన్నారులకు ఈత నేర్చుకునే వెసులుబాటు కల్పించడమే ఉత్తమ మార్గమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొల్లాపూర్లో అసంపూర్తిగా పనులు.. కొల్లాపూర్లోని మినీ స్టేడియంలో 2017లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పట్లో పంచాయతీరాజ్శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు యువజన, క్రీడాశాఖ ద్వారా రూ. 1.80కోట్లు మంజూరు చేయించారు. మినీస్టేడియం నిర్మించిన గుత్తేదారుకే పనులు అప్పగించగా.. పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్శాఖ అధికారులకు కట్టబెట్టారు. ఆరు నెలల్లో పనులు పూర్తిచేయాలని అప్పట్లో జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. అయితే నిధులలేమి కారణంగా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయితే కొన్ని నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు స్విమ్మింగ్ పూల్ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. త్వరగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అయితే ఈ వేసవిలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభమవుతుందని అంతా భావించారు. కానీ పనులు ఇప్పుడు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. వేసవిలో ఈత నేర్చుకునేందుకు బావులు, కాల్వలే దిక్కు ఏటా ప్రమాదాల బారినపడుతున్న చిన్నారులు జిల్లాలో ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్కు డిమాండ్ క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించాలని ప్రజల వేడుకలు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి.. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో కూడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుచేయాలి. చిన్నపిల్లలు ఈత నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. బావులు, కాల్వల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటే పరిష్కార మార్గం. మార్నింగ్ వాకర్లు, యువతకు కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగపడతాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. – ఎర్రమోని యాదగిరి, కొల్లాపూర్ అసంపూర్తి పనులపై దృష్టి.. కొల్లాపూర్లో అసంపూర్తిగా ఉన్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల పురోగతి కొన్ని నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. అచ్చంపేటలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్పూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేస్తున్నాం. ఈత కోసం బావులు, కాల్వలకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సీతారాం, డీవైఎస్ఓ -
సన్నాలకే మొగ్గు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. -
కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
సౌకర్యాలు లేక రైతుల ఇబ్బందులు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్యానాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఎం బృందం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. అమ్మకానికి తెచ్చి ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ఉండి పోతుందని, సకాలంలో తూకం వేయక పోవడం, తూకం వేసిన ధాన్యాన్ని తరలించక పోవడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. యార్డులో కనీస సౌకర్యాలు కల్పించకపోతే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీపీ ఎం నాయకులు వెంకటయ్య, పర్వతాలు, వాల్యానాయక్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
● జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష ● 11.30 గంటల వరకే అనుమతించిన అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో నీట్ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. సీపీఐ పోరాటంతోనేపనిగంటల తగ్గింపు పెద్దకొత్తపల్లి: సీపీఐ పోరాట ఫలితంగానే ప్రభుత్వం కార్మికులకు పనిగంటలను తగ్గించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పెద్దకొత్తపల్లి మండలం నక్కపల్లిలో సీపీఐ పార్టీ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్రెడ్డి, శ్రీనివాసులు, మల్లయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాన ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాట దక్కడంలేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. బస్సును ఢీకొన్న కారు ● ఇద్దరి దుర్మరణం ● హెదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం -
చట్టసభల్లో మహిళల భాగస్వామ్యమే బీజేపీ లక్ష్యం
కందనూలు: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతోపాటు ఇండియా కూటమి సభ్యులు అడ్డుకోవడం మహిళలను అవమానపరచడమేనని ఆరోపించారు. వామపక్షాలతోపాటు కుటుంబ పార్టీలు తమ స్వలాభం కోసం మహిళా బిల్లును అడ్డుకోవడం తగదని విమర్శించారు. ఎప్పటికై నా మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడమే బీజేపీ ధ్యేయమన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకొని మహిళలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ నెల 10న హైదరాబాద్లో నిర్వహించే ‘జన మహిళా ఆగ్రహ సభ’కు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారని.. జిల్లా నుంచి మహిళలు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మీడియా ఇన్చార్జి తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్రం, రాము తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీకి ముగింపేది?
● నెలక్రితం టన్నుకు రూ.1.50 లక్షలు, నేడు రూ.30 వేలే ● రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించని వ్యాపారులు ● ఆశించిన దిగుబడి రాక నష్టాల ఊబిలోకి.. ● జిల్లాలో 17 వేల ఎకరాల్లో సాగు రూ.60 లక్షలు వెచ్చించి వివిధ గ్రామాల్లో 10 తోటలు కౌలుకు తీసుకున్నా. ఇప్పటికీ మామిడి కాయలు విక్రయిస్తే రూ.15 లక్షలు కూడా రాలే. మూడు రోజుల క్రితం ఈదురు గాలులతో 5 టన్నుల కాయలు నేలరాలగా వాటిని విక్రయిస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా సరిపోలే. ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, దళారుల దోపిడీని అరికట్టాలి. – పెబ్బేటి మహేష్, మామిడి కౌలు రైతు, వీపనగండ్ల ప్రతి ఏటా మామిడి రైతులు కొనుగోలుదారుల చేతుల్లో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. – దొడ్ల కవిత, సర్పంచ్, గోపల్దిన్నె నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి మా మిడి కాయలు కొనుగోలు చేసి ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేయిస్తాం. – విజయభాస్కర్రెడ్డి, జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి, వనపర్తి బహిరంగ మార్కెట్లో తరుగు, కమీషన్ పేరుతో మామిడి రైతులు విలవిల వీపనగండ్ల: ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల నిలువు దోపిడీ వెరిసి మామిడి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అరివి అన్న చందంగా మారింది వారి పరిస్థితి. మామిడి చెట్లకు వేసే ఎరువులు, పూత దశలో పిచికారీ చేసే రసాయనిక మందులకు రూ.వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడు అవుతుంది. తీరా పంట దిగుబడి వచ్చాక మామిడి కాయలు అమ్ముదామని పోతే బహిరంగ మార్కెట్లో దళారులు తరుగు, కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలడంతో దిగుబడి దారుణంగా పడిపోయింది. మిగిలిన పంటను అయినా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు. స్పందించాల్సిన ఉద్యాన శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం జిల్లాలో పెబ్బేరు, కడుకుంట్ల గ్రామాల వద్ద కొందరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీపనగండ్ల మండలంలో మండల మహిళా సమైక్య ద్వారా మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభించి కాయ సైజు 250 గ్రాముల నుంచి 450 గ్రాముల మధ్యే ఉండాలన్న నిబంధనను విధించి, రోజు రెండు టన్నుల కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కవర్ కట్టిన కాయలు తీసుకోవడం లేదు. హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అక్కడ నిబంధనలను పాటించడం లేదు. 4 శాతం తరుగు తీయాల్సి ఉండగా.. హమాలీ తరుగు, కాయలు నాణ్యతగా లేవని సాకు చూపి 18 శాతం తరుగును తీస్తున్నారు. నెల క్రితం టన్ను కాయలు రూ.1.50 లక్షలు పలకగా నేడు టన్నుకు రూ.30 చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వేలం సమయంలో గుత్తేదారు తన అనుచరులనే నలుగురిని నియమించుకొని వేలం పాడుతున్నట్లు నటించి తను అనుకున్నట్లుగా రైతులకు తక్కువ రేటు చెల్లిస్తున్నాడు. రశీదు కూడా ఇవ్వరు. నగదు చెల్లింపులో కూడా ఆలస్యం చేస్తున్నారు. చీడపీడల నివారణ, కాయలు తెంపేందుకు కూలీల రేట్లు, ట్రాన్స్పోర్ట్, తరుగు మొత్తంగా ఎకరాకు రూ.80 వేలు ఖర్చు వస్తే విక్రయించిన తర్వాత రూ.20 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
సంఘర్షణ నిర్మూలన కోసం..
అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. -
బీసీ గురుకులంలో ప్రవేశాలు
కందనూలు: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026– 27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇంటర్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి.. అత్యుత్తమ బోధన, పోటీ పరీక్షలపై ఉచిత శిక్షణ, నాణ్యమైన భోజనం, అవసరమయ్యే నోట్ పుస్తకాల నుంచి క్రీడా పరికరాలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరం లాంటిదని చెప్పవచ్చు. వివిధ కోర్సుల్లో సీట్లు.. జిల్లావ్యాప్తంగా 10 బీసీ గురుకుల కళాశాలలున్నాయి. అందులో ఆరు మహిళా కళాశాలలు, నాలుగు బాలుర కళాశాలలు ఉండగా.. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, కోర్సుల్లో కలిపి మొత్తం 960 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఈ ఏడాది వెలువడిన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 85.80 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 90.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కల్వకుర్తి బాలికల కళాశాల, బిజినేపల్లి బాలుర కళాశాలల్లో జేఈఈ, నీట్, ఎప్సెట్, ఎన్ఐటీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూనివర్శిటీలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. 12లోగా దరఖాస్తు చేసుకోవాలి.. బీసీ గురుకులాల్లో చేరే విద్యార్థులు అడ్మిషన్ కోసం https//mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 12లోగా రూ.200 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పదో తరగతి మెరిట్ ప్రకారం విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. -
గన్నీ బ్యాగుల కొరతకు ప్రత్యామ్నాయ చర్యలు
కందనూలు: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నా గన్నీ బ్యాగుల కొరత ప్రధాన సమస్యగా మారిందని, దీన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందని కలెక్టర్ హేమంత్కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు సుమారు 68 వేల మె.ట., కొనుగోలు చేశామన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయడానికి ఇంకా 30 లక్షల గన్నీ సంచులు అవసరమని అధికారులు అంచనా వేశారన్నారు. ప్రస్తుతం మార్కెట్లో సరఫరా తగ్గడం, లభ్యతలో అంతరాయం ఏర్పడటంతో గన్నీ సంచుల కొరత తలెత్తిందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. అలాగే రైతులు గన్నీ సంచులను స్వయంగా సమకూర్చుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతులు తీసుకువచ్చే గన్నీ సంచులను నాణ్యతా ప్రమాణాల మేరకు పరిశీలించి.. ప్రతి గన్నీ సంచికి ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో గన్నీ సంచుల ధరలను స్పష్టంగా ప్రదర్శించడంతోపాటు, రికార్డులను జిల్లా స్థాయిలో నిరంతరం తనిఖీ చేయనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఇందిరా మహిళా శక్తి కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి ఇందిరమ్మ క్యాంటీన్ను శనివారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీచేశారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాంటీన్ పనితీరును ప్రత్యక్షంగా సమీక్షించారు. క్యాంటీన్లో వంటకాలు తయారు చేసే విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నాణ్యతను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. -
తెలంగాణ కోసమే పార్టీ మారాను
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి కొల్లాపూర్: ‘విద్యార్థుల ఆత్మబలిదానాలు చూసి చలించిపోయా.. సకలజనుల సమ్మె తర్వాత తెలంగాణ ఉద్యమం ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి.. అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి, మరో పెద్దమనిషి ఉద్యమాన్ని ఎద్దేవా చేసేలా మాట్లాడారు.. పదవులు లేకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉండలేరని విమర్శించారు.. అందుకే మంత్రి పదవులు త్యజించి ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీలో చేరా.. తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియంతృత్వ పోకడలను తలపించాయి.. అడ్డగోలుగా దోపిడీ జరిగింది.. ఇవన్నీ మీరు కూడా చూశారు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని’ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఆర్డీఓ బన్సీలాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్ని అప్పులున్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని మంత్రి వివరించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లాపూర్ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందని, వీటిలో 3,117 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, వందల సంఖ్యలో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. సమావేశంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. పెంట్లవెల్లి మండలంలోని మాధవస్వామినగర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మొక్కజొన్న కొనుగోలు చేసిన వెంటనే రవాణా జరిగేలా చూడాలని లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జటప్రోల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పరిశీలించారు. అలాగే గ్రామంలోని మధనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. -
జీవనోపాధి కావాలి..
ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ ● -
22 రోజలుగా పడిగాపులు..
నెల్లికొండ మార్కెట్లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి 22 రోజుల క్రితం 320 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చాను. కొనుగోలు చేశారు కానీ ఈ రోజు వరకు లారీ రావడం లేదు. ఇంటి వద్ద అన్ని పనులు వదిలేసి ఇక్కడే పడిగాపులు కాస్తున్నా. – రామకృష్ణ, రైతు, తూడుకుర్తి, నాగర్కర్నూల్ మండలం రైతులు అనేక కష్టాలు పడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. 200 బస్తాల మొక్కజొన్న తెచ్చి 10రోజులు అవుతుంది. లారీల కొరత, లేబరు కొరత అని అధికారులు చెబుతున్నారు. సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నాం. ఇంకా ఎన్ని రోజులవుతుందో తెలుస్తలేదు. మా బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. – రాంరెడ్డి, రైతు, దేశిటిక్యాల, నాగర్కర్నూల్ మండలం నేను 260 బస్తాల ధాన్యం మార్కెట్కు తెచ్చి 25 రోజులవుతుంది. ఇప్పటి వరకు ధాన్యాన్ని లారీలకు ఎత్తడం లేదు. అధికారులను ఎన్ని సార్లు అడిగినా లారీలు ఈ రోజు వస్తాయి.. రేపు వస్తాయని అంటున్నారు. రైతుల గోస ఎవరికీ పట్టడం లేదు. – వెంకటయ్య, రైతు, రాయిపాకుల, తెలకపల్లి మండలం ● -
పీహెచ్సీలకు పైసల్లేవ్..!
ఎస్జీఎఫ్ చాంపియన్ ఢిల్లీ ● తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఘన విజయం ● వాకోవర్తో మూడోస్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ ● క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి చాటారు : డీఈఓ ప్రవీణ్కుమార్ – జడ్చర్ల టౌన్ వివరాలు 8లో..పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ భారంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రతి పీహెచ్సీకి హెచ్డీఎఫ్ (హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రాక వసతులు సమకూర్చుకోలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు పీహెచ్సీ అభివృద్ధి కమిటీకి ఎంపీపీలు అధ్యక్షులుగా ఉండి విడుదలయ్యే నిధులపై పర్యవేక్షిస్తుండేవారు. వారి పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తుండటంతో వీటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సరైన వసతుల కల్పన లేకపోవడంతో చాలా వరకు వైద్యాధికారులు పీహెచ్సీల వైపు చూడటం లేదు. చివరగా 2023 మార్చిలో.. మహబూబ్నగర్ జిల్లాలోని 17 పీహెచ్సీలు, ఆరు యూపీహెచ్సీలకు, మూడు సీహెచ్సీలకు గత మూడేళ్లుగా నిధుల కేటాయింపు లేవు. చివరగా 2023 మార్చిలో రూ.59.46 లక్షల నిధులు విడుదల కాగా.. దీంట్లో రూ.37.14 లక్షలు ఖర్చు చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద కేవలం 9 పీహెచ్సీలకు కలిపి రూ.6 లక్షలు విడుదల చేయగా దీంట్లో ఒక్కో పీహెచ్సీకి రూ.50 వేల చొప్పున.. ఒక్క రాజాపూర్ పీహెచ్సీకి మాత్రం రూ.2 లక్షలు విడుదల చేశారు. గద్వాల జిల్లాలో గత మూడేళ్లు నిధులు లేకపోవడంతో పీహెచ్సీల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఈ ఏడాది మార్చిలో కాయకల్ప కింద ఆరు పీహెచ్సీకు రూ.6.35 లక్షలు విడుదలైన నిధులు తప్పా ఇతర బడ్జెట్ రాలేదు. వనపర్తి జిల్లాలో కేవలం హెచ్డీఎస్ కింద 2023– 24 ఏడాదిలో మొత్తం 13 పీహెచ్సీలలో ఒక్కోదానికి రూ.1.39 లక్షలు విడుదల చేయగా.. 2024– 25లో ఒక్కో పీహెచ్సీకి రూ.61,579 విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి నిధుల కేటాయింపులకు నోచుకోలేదు. నారాయణపేట జిల్లాలో 11 పీహెచ్సీలు ఉండగా 2023 అక్టోబర్ నుంచి హెచ్డీఎస్ నుంచి కానీ కాయకల్ప విభాగం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 69ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నేషనల్ హెల్త్ హెల్త్ మిషన్ కింద ప్రతి ఏటా ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద ఒక్కో పీహెచ్సీకి రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యేవి. వీటి ద్వారా ఆయా పీహెచ్సీల్లో అభివృద్ధి కమిటీ తీర్మానం మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేవారు. అయితే గత మూడేళ్లుగా నిధులు మంజూరు ఊసేలేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా కనీస సౌకర్యాలు లేక పీహెచ్సీకి వచ్చిన రోగులతోపాటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువులు మరమ్మతుకు గురైనా వాటిని బాగు చేయించే పరిస్థితి లేక సిబ్బంది సతమతమవుతున్నారు. అవసరాలు తీరేదెలా? బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పీహెచ్సీల్లో అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ భవనంలో చిన్నపాటి మరమ్మతు, పరిసరాలు శుభ్రం చేయడానికి వర్కర్లకు కూలీ, చిన్నపాటి పరికరాలు, బ్లడ్గ్రూప్ టెస్ట్ కిట్ల కొనుగోలు, విద్యుద్దీపాలు, టాయిలెట్స్ నిర్వహణ, రిజిస్టర్లు కొనుగోలు ఇలా ప్రతీది సమస్యగా మారింది. ప్రధానంగా పీహెచ్సీ పరిధిలోని గర్భిణులతోపాటు దీర్ఘకాలిక రోగులు ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటే తప్పక ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. దీనికి ఏటా రూ.6 వేల వరకు ఖర్చు అవుతుంది. వీటికి కూడా నిధులు లేకపోవడంతో పలుచోట్ల వైద్యాధికారులే సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. గత మూడేళ్లుగా విడుదల కాని హెచ్డీఎస్, కాయకల్ప బడ్జెట్ నిర్వహణకు సైతం అవస్థలు.. పేరుకుపోతున్న సమస్యలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా కనికరించని ప్రభుత్వం నెట్ సదుపాయం కోసం సొంతంగా చెల్లిస్తున్న వైద్యాధికారులు ఇటీవలే ప్రభుత్వానికి బడ్జెట్ విషయంపై పలుమార్లు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతమైతే కలెక్టర్ దగ్గర అదనపు నిధులు తీసుకున్నాం. వాటిలో నుంచి పీహెచ్సీల నిర్వహణ కోసం కొంత ఖర్చు చేస్తున్నాం. చిన్నపాటి నిర్వహణ ఖర్చులు మెడికల్ ఆఫీసర్లు భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు త్వరలో వస్తాయని అనుకుంటున్నాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి -
అన్నదాతల అరిగోస
మొక్కజొన్న అమ్ముకునేందుకు అష్టకష్టాలు ● కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు ● లారీలు, హమాలీల కొరతతో పేరుకుపోతున్న నిల్వలు ● అకాల వర్షాలతో రైతుల ఆందోళన జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్యార్డు కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం బస్తాలు కందనూలు: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్నను విక్రయించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం.. ప్రారంభించిన చోట నామమాత్రంగా కొనుగోళ్లు సాగడంతో రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు కొనుగోలుచేసిన ధాన్యాన్ని సైతం సకాలంలో తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కొందరు రైతులు రహదారులు, పొలాలు, మైదాన ప్రాంతాల్లోనే ఇంకా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు, ఏ సమయంలో వర్షం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు చేసేదిలేక ఎంతకో అంతకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ధాన్యం తరలించడంలో జాప్యం.. రైతులు మక్కజొన్నను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం ఒక ఎత్తయితే.. ధాన్యాన్ని అమ్మడం, అమ్మిన బస్తాల వద్ద కాపలా కాయడం మరో ఎత్తుగా మారింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గోదాముల వద్ద లారీల నుంచి బస్తాలను అన్లోడ్ చేసేందుకు హమాలీల కొరత ఉండటంతో కేంద్రాల వద్ద తూకం వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. హమాలీల చేతివాటం.. మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్ల బాధ్యతను పీఏసీఎస్లకు అప్పగించింది. అయితే కొందరు హమాలీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక బస్తా ధాన్యం నింపి, లోడింగ్ చేయడానికి రూ. 30 నుంచి రూ. 40 వసూలు చేస్తున్నారు. కొంచెం లారీ దూరంగా ఉన్నట్లయితే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 2లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేయగా.. ధాన్యం సేకరణ కోసం 15 కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 3లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఉండగా.. ఇప్పటివరకు 68వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రోజుకు 16 లారీల చొప్పున ధాన్యాన్ని తరలిస్తున్నట్లు మార్కెఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం. ఒకే సారి రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తేవడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. లారీలు, హమాలీల సమస్యతోనూ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యను అధిగమిస్తున్నాం. 2, 3 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – తహమినీ, జిల్లా మార్క్ఫెడ్ అధికారి -
విద్యాప్రమాణాల మెరుగుకు కృషి
వంగూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. వంగూరు మండల కేంద్రంతోపాటు పోల్కంపల్లిలో రూ. 30కోట్లతో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పనులను శుక్రవారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు చేస్తోందన్నారు. పాఠశాల భవనాల్లో విశాలమైన తరగతి గదులతో పాటు లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు తదితర సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ వరంలాంటివని.. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ, త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లాలో మొదటగా ఈ రెండు పాఠశాలలనే ఎంపిక చేయడం జరిగిందని.. గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
3నెలలకోసారి ఉద్యోగ మేళాలు
● రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ● మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ● ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు అభ్యర్థులకు ఇంటర్వ్యూ
కందనూలు: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పుర కమిషనర్ నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఆన్లైన్ దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్, రేషన్కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ఫొటో తీసుకురావాలని ఆయన సూచించారు. ఇరిగేషన్ సీఈగా సత్యనారాయణరెడ్డి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నీటి పారుదల శాఖ సీఈగా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈయన నీటి పారుదల శాఖ ఎస్ఈగా ఉన్నారు. అలాగే మహబూబ్నగర్ డీఈగా ఉన్న ప్రభాకర్రెడ్డికి ఈఈగా పదోన్నతి లభించింది. సర్కిల్–2 డీఈగా ఉన్న ఈయన్ను పదోన్నతిపై సర్కిల్–4 ఈఈగా నియమించారు. అలాగే పెబ్బేరు సర్కిల్ ఈఈగా ఉన్న కేశవరావుకు అదే సర్కిల్–6కు ఈఈగా నియమించారు. ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు తిమ్మాజిపేట: ఉపాధిహామీ పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఓ చిన్న ఓబులేషు హెచ్చరించారు. గురువారం తిమ్మాజిపేట మండల కేంద్రంతోపాటు గుమ్మకొండ, ఎదిరేపల్లి గ్రామాల్లో ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎదిరేపల్లిలో కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఫీల్డ్ అసిస్టెంట్పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున కూలీలు ఉదయం 6గంటల్లోగా పనులకు రావాలని సూచించారు. అనంతరం తిమ్మాజిపేటలో నర్సరీని పరిశీలించారు. నర్సరీలో కొన్ని మొక్కలు ఎండిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ ఉన్నారు. మెగా జాబ్మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లుజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు మంత్రుల రాక.. మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళా కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు. -
టూరిజం హబ్గా సోమశిల
● పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కొల్లాపూర్ రూరల్: సోమశిలను టూరిజం హబ్గా తీర్చిదిద్ది.. ప్రకృతి సోయగాల కేంద్రంగా గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన సోమశిలను సందర్శించి.. అక్కడ కొనసాగుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టు, హెలీ టూరిజం పనులతో పాటు పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి సోయగాలు కలిగిన సోమశిలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధిచేసి, పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో ప్రముఖ టూరిజం హబ్గా మారే అవకాశముందన్నారు. పర్యాటకరంగ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందన్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సోమశిల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నల్లమల కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, అడవి పచ్చదనం వంటి సహజ సౌందర్యాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా పర్యాటకులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని.. అధికారులు కూడా అదే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 167కే జాతీయ రహదారిలో భాగంగా కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానం మరింత మెరుగుపడటమే కాకుండా, సోమశిలకు పర్యాటకుల రాకపోకలు గణనీయంగా పెరిగే ఆవకాశముందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ బన్సీలాల్, జిల్లా టూరిజం అధికారి నర్సింహ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
ఉమామహేశ్వరాలయ అభివృద్ధికి కృషి
అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రం ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు కట్టా సుధాకర్రెడ్డి అన్నారు. శ్రీశైలంలో గిరిప్రదక్షిణ సందర్భంగా గురువారం ఉమామహేశ్వర ఆలయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 27నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన గిరిప్రదక్షిణ సందర్భంగా శ్రీశైలానికి నాలుగు ముఖద్వారాలైన త్రిపురాంతకం, జ్యోతి సిద్ధపటం, అలంపూర్ జోగుళాంబ, ఉమామహేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదం పంచే ఉమహేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని.. ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీశైల ఆలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఏపీఆర్ఓ శేఖర్రెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, అర్చకుడు వీరయ్యశాసీ్త్ర పాల్గొన్నారు. -
ఇంటికే పోషకాహారం
3 నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ● పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు ● లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందించాలని ఆదేశం ●వేసవిని దృష్టిలో ఉంచుకొని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. పోషకాహార సరుకులు లబ్ధిదారుల ఇంటికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి సరిపడా సరుకులు పంపిణీ చేస్తాం. – రాజేశ్వరి, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి కందనూలు: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పౌష్టికాహారం తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. చాలా వరకు అంగన్వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా సరిగా ఉండకపోవడంతో చిన్నారులు, గర్భిణులు వచ్చేందుకు నిరాసక్తి చూపుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మే 3 నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించింది. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పౌష్టికాహారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సమయాల్లో మార్పు.. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం ఇప్పటికే సవరించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. సెలవుల కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించే భోజనానికి అంతరాయం కలగకుండా ప్రభుత్వం టేక్ హోమ్ రేషన్ విధానాన్ని అమలుచేస్తోంది. మే నెలకు సరిపడా సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. క్షేత్ర స్థాయిలో టీచర్లకు బాధ్యతలు.. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఉన్నప్పటికీ టీచర్లు, ఆయాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. చిన్నారులు, గర్భిణుల ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించడంతో పాటు పౌష్టికాహారం పంపిణీ చేయాలి. శారీరక, మానసిక ఎదుగుదల లోపించిన పిల్లలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలుచేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. బాలింతలు, గర్భిణులకు మే నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె, పాల పాకెట్లను అందజేస్తారు. 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు బియ్యం, పప్పు, నూనె, కురుకురే పాకెట్లను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 20 మండలాల పరిధిలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. నాగర్కర్నూల్, కల్వకుర్తి, బల్మూర్, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాజెక్టుల పరిధిలో 1132 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు 21,912 మంది, 3ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు వారు 13,010 మంది, గర్బిణులు, బాలింతలు కలిపి 7,927 మంది ఉన్నారు. -
నేడు మేడే వేడుకలు
కందనూలు: కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్, కార్మికశాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ లేబర్ అధికారి రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రాథమిక దశలోనే లోపాలను గుర్తించాలి కందనూలు: చిన్నారుల శారీరక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.రవికుమార్ సూచించారు. గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో బాలభరోసా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారుల్లో శారీరక, మా నసిక అభివృద్ధిలో లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం చిన్నారుల సేవలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
భానుడి విలయతాండవం
ఉమ్మడి పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్నగర్ ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్నగర్ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు -
ఎస్సెస్సీలో టాప్–2
వార్షిక పరీక్షల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు ●మాది నిరుపేద కుటుంబం. ఎస్సెస్సీలో నాకు 580 మార్కులు వచ్చాయి. భవిష్యత్లో కలెక్టర్ కావాలని ఉంది. పేద ప్రజలకు సేవ చేయాలన్నదే నా ధ్యేయం. అందుకు నిరంతరం కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా. – మానస, బీసీ బాలికల గురుకులం, ఉయ్యాలవాడ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పట్టుదలతో చదవాను. అనుకున్న లక్ష్యం మేరకు 578 మార్కులు సాధించా ను. ఇందుకోసం పట్టుదల తో చదివాను. భవిష్యత్లో సాఫ్ట్వేర్ కావాలన్నదే నా లక్ష్యం. – వందన, కేజీబీవీ, ఊర్కొండ పదో తరగతి పరీక్షల్లో 576 మార్కులు రావడం, జిల్లా సెకండ్ టాపర్గా నిలవ డం సంతోషంగా ఉంది. మొదటి నుంచి ప్రణాళిక తో చదివాను. భవిష్యత్లో ఎరోనాటికల్ ఇంజినీర్ కావాలనుకుంటున్నా. – రుత్విందర్, బీసీ బాలుర గురుకులం, తెలకపల్లి కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బుధవారం విడుదలైన ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచెయ్యి సాధించారు. జిల్లావ్యాప్తంగా 10,641 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 10,538 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో 5,258 మంది బాలురకు గాను 5,192 మంది, 5,383 మంది బాలికలకు గాను 5,346 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 98.74 శాతం, బాలికలు 99.31శాతం ఉత్తీర్ణత సాధించారు. పెరిగిన ర్యాంకు.. 2024–25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 96.83 ఉండగా.. 2025–26లో 99.03 శాతానికి చేరింది. అంటే 3 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 13వ స్థానం ఉండగా.. ఈసారి 2వ స్థానానికి చేరింది. జిల్లాలోని 208 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో ప్రభుత్వ మేనేజ్మెంట్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు 113 ఉండగా.. రెసిడెన్షియల్ స్కూల్స్ 36, ప్రైవేటు పాఠశాలలు 59 ఉన్నాయి. జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన విద్యాశాఖ అధికారులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. రీకౌంటిగ్, రీవేరిఫికేషన్కు అవకాశం.. విద్యార్థులు తమ జవాబు పత్రాలను రీవేరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్కు రూ. 500, రీవేరిఫికేషన్కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని సూచించింది. ఈ నెల 30 నుంచి మే 14వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ రాసేందుకు మే 14వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో 13 నుంచి 2వ స్థానానికి చేరిన జిల్లా స్థానం 208 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పదో తరగతిలో 574 మార్కులు సాధించా. అత్యుత్తమ ఫలితాలతో జిల్లాలోనే మూడవ స్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటర్లో ఎంపీసీ గ్రూపు తీసుకుంటా. భవిష్యత్లో ఇంజినీర్ కావాలని ఉంది. – జ్ఞానేశ్వర్, బీసీ బాలుర గురుకులం, తెలకపల్లి -
నాగర్కర్నూల్
లీగ్ మ్యాచుల్లో హోరాహోరీ ఎస్జీఎఫ్ జాతీయ అండర్–17 బాలుర క్రికెట్ చాంపియన్షిప్ టోర్నీలో మ్యాచ్లు సోమవారం హోరాహోరీగా సాగాయి. మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uకోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ● -
ప్రచండ భానుడు..
● జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ● ఉదయం నుంచే దంచికొడుతున్న ఎండలు కల్వకుర్తి టౌన్: ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఎండల తీవ్రతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. భరించలేనంత ఉక్కపోత.. వేడి సెగలకు బెంబేలెత్తున్నారు. మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల ధాటికి చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో రెండు రోజులుగా 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా పెంట్లవెల్లి మండలంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కోడేరులో 42.8, కల్వకుర్తిలో 42.6, ఊర్కొండలో 42.4, పెద్దకొత్తపల్లిలో 42.2, తెలకపల్లిలో 42.1, నాగర్కర్నూల్లో 41.8, తిమ్మాజిపేటలో 41.7, బిజినేపల్లిలో 41.5, తాడూర్లో 41.4, వంగూర్లో 41.2, అచ్చంపేటలో 40.9, కొల్లాపూర్లో 40.6, బల్మూర్లో 40.4, చారకొండలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత్తలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లే శ్రమజీవులు సతమతమవుతున్నారు. ఏప్రిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, మేలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజలు వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెద్దకొత్తపల్లి: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పెద్దకొత్తపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడంలేదని ఉందని చెప్పడంతో ఆయన వెంటనే మార్కెఫెడ్ డీఎంతో ఫోన్లో మాట్లాడారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చిన వెంటనే తూకం వేయాలని.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో పరిసర గ్రామాల రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. దళారుల బెడద లేకుండా రైతుకు మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దండు నర్సింహ, లక్ష్మయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును ప్రారంభించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ఉద్యానవిద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉండగా.. మరో యూనివర్సిటీలో అదే కోర్సు ప్రవేశపెట్టడంతో ఉద్యాన విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని, ఈ నిర్ణయంతో అకాడమిక్ వ్యవస్థలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
క్రీడలతో మానసికోల్లాసం
వీపనగండ్ల: క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం లభించడమేగాక క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని కల్వరాలలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బండారి రాముడు, ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, జీహెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఈటీ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు వెంకటరాజయ్య, మండ్ల సురేష్, భాస్కర్, శివుడు, వెంకట్, గోపాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మామిడీలా..!
మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు ● టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 45వేలకు మాత్రమే కొనుగోలు ● కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ● ఆందోళనలో మామిడి రైతులు ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ మార్కెట్ ఏర్పాటుచేయాలి.. కొల్లాపూర్లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే సమస్య.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, జీవీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ఆయ న ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 33 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. కందనూలు: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి యాసంగి సీజన్కు సంబంధించిన మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వెనువెంటనే ధాన్యం సేకరించాలని సూచించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు లేకుండా చూడాలన్నారు. తూకం ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే సహించమన్నారు. అదే విధంగా రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తేమశాతం విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 4.71లక్షల ఎకరాల్లో పంటసాగు జరిగిందని, అందులో 2,4,621 ఎకరాల్లో మొక్కజొన్న, 1.81 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగినట్లు డీఏఓ యశ్వంత్రావు కలెక్టర్కు వివరించారు. 7.16 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, 4.37లక్షల క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కేంద్రాల్లో వడ్లు ఎండబెట్టేందుకు స్థలం, తాగునీటి సదుపాయం, తాత్కాలిక గోదాములు వంటి మౌలి క వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. వర్షాల కారణంగా ధాన్యం నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, జిల్లాస్థాయి సమీక్షకు మార్కెటింగ్శాఖ అధికారి సన్ప్రీత్ సింగ్ గైర్హాజరు కావడంతో షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మార్క్ఫెడ్ ఎండీ తమీన, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహారావు, సివిల్ సప్లయ్ అధికారి రాజేందర్ ఉన్నారు. స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి.. స్వీయ జనగణనను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్ వీసీ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 20 మండలాల్లో 460 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 86 వార్డుల్లో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు జరుగుతున్న మొదటి దశ స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు వందశాతం భాగస్వామ్యం కావా లని పిలుపునిచ్చారు. http://se.census.gov.in ద్వారా ఎవరికి వారు స్వయంగా తమ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో జనగణనకు 2,500 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వీయ గణన చేసుకోని వారి వివరాలను జనగణన అధికారి ఇంటికి వచ్చినప్పుడు నమోదు చేస్తారన్నారు. స్వీయ గణనలో ఏదైనా తప్పులు నమోదు చేసుకుంటే అధికా రి సరిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డు, ఓటరు గుర్తింపు కార్డులకు జనగణనతో సంబంధం లేదన్నారు. సర్వేలో నమోదయ్యే వివరాలు జనగణన సంస్థ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు ప్రజలు సరైన సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి సన్ప్రీత్ సింగ్కు షోకాజ్ నోటీసు -
భవిష్యత్ కోసమే స్వచ్ఛందంగా పునరావాసం
అచ్చంపేట: మెరుగైన జీవనం కోసం తాము అమ్రాబాద్ టైగర్ రిజర్వు నుంచి స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా.. కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పునరావాస గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం అమ్రాబాద్ మండలం సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాలపెంట, వటవర్లపల్లి గ్రామాల ప్రజలు అచ్చంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంరతం డీఎఫ్ఓ రేవంత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇటీవల కొందరు చెంచు గిరిజనులను అటవీశాఖ అధికారులు బలవంతంగా అడవుల నుంచి పంపిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. తమ పిల్లల భవిష్యత్, మెరుగైన జీవన ప్రమాణాల కోసం తాము స్వచ్ఛందంగా పునరావాసాన్ని కోరుకుంటున్నామని వెల్లడించారు. అధికారులు కాని, రాజకీయ నాయకులు కాని తమపై ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు, బలవంతం చేయడం లేదని తెలిపారు. అడవుల మధ్య నివసించడం వల్ల విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, అత్యవసర సేవలు వంటి మౌలిక వసతులు పొందడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. వర్షాకాలంలో రహదారులు దెబ్బతినడం, అనారోగ్యానికి గురైతే సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోవడం, పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితులు తమ జీవితాలను కష్టతరం చేస్తున్నాయన్నారు. పునరావాసంతో ప్రజలతో పాటు వన్యప్రాణులకు కూడా విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. స్వచ్ఛంద పునరావాసం ప్రజల అభివృద్ధి, ప్రకతి సంరక్షణకు ఒక ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని అటవీశాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఉడతనూరి బుచ్చయ్య, మండ్లి బౌరమ్మ, మడ్లి అంజయ్య, మల్లేష్, చిర్రరాములు తదితరులు పాల్గొన్నారు. -
పోటీ లేకుండా ‘సహకారం’
● పీఏసీఎస్ పదవులు ఇక ‘నామినేటెడ్’ ● నూతన సంస్కర ణలా..? రాజకీయ వ్యూహమా..? ● ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు ● డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గా లను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. పోటీ లేకుండా పదవులు? ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగించేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరులో 76 సొసైటీలుంటే.. నాగర్కర్నూల్లో 23, వనపర్తి 15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్నగర్ 17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పక్షం నేతలు పీఏసీఎస్లను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. -
మూడోరోజు.. నిరసనల జోరు
కందనూలు: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరింది. జిల్లాకేంద్రంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కట్లకు గురయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక స్థోమత కలిగిన వారు కార్లలో వెళ్లగా.. సాధారణ ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదిలేదని భీష్మించారు. ఉదయం బస్ డిపో నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా బయలుదేరి ప్రధానరోడ్డు మీదుగా బస్టాండ్ వరకు చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించి.. ప్రభత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలని నినదించారు. అనంతరం నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన కండక్టర్ శంకర్గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. తాత్కాలిక సిబ్బందితో సర్వీసులు.. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులు నడిపించారు. హైదరాబాద్, మహబూబ్నగర్, వనపర్తి రూట్లతో సర్వీసులు పాక్షికంగా రాకపోకలు సాగాయి. 8 ఆర్టీసీ, 29 ప్రైవేట్ బస్సులు నడిపినట్లు డీఎం యాదయ్య వెల్లడించారు. 37 బస్సులు రోడ్డెక్కితే ఇందులో 24 మంది కండక్టర్లతో మాత్రమే నడిపించారు. మిగతా బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మక్కల కొనుగోలులో వేగం పెంచాలి నాగర్కర్నూల్ రూరల్: జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన మొక్కజొన్న కొనుగోలులో వేగం పెంచాలని బీఆర్ఎస్ నేత నాగం శశిధర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రం నెల్లికొండ చౌరస్తాలోని మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వీడి.. సేకరణలో వేగం పెంచి రైతులకు తగు న్యాయం చేయాలని కోరారు. గడిచిన 15 రోజుల క్రితం తూకాలు వేసిన సంచులను నేటికీ గోదాంలకు తరలించకపోవడం దుర్మార్గం అన్నారు. ఫలితంగా గన్నీ బ్యాగుల కొరత ఏర్పడి కొనుగోలులో జాప్యం జరుగుతుందన్నారు. అకాల వర్షాల ముప్పు, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు అర్థం రవి, బాలగౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పథకాల అమలులో జాప్యం వద్దు
కందనూలు: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యానికి తావులేకుండా ప్రజలకు అందేలా చూడాలని ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దిశా సమావేశానికి నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, శ్యాంప్రసాద్లాల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల అమలులో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ (పీఎంఈజీపీ) పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందులో ప్రతి బ్యాంకు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యతనిస్తూ రుణాల మంజూరులో వేగం పెంచాలన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారికి తక్షణమే రుణాలు అందించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఆమోదం పొందిన రుణ దరఖాస్తులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందించకపోవడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, లబ్ధిదారులు తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యాంకర్లు కేవలం రుణాల మంజూరుకు మాత్రమే పరిమితం కాకుండా, లబ్ధిదారులకు మార్గదర్శకత్వం కూడా అందించాలని సూచించారు. వ్యాపార ప్రణాళికలు రూపొందించడం, రుణ వినియోగం, తిరిగి చెల్లింపు విధానాలపై అవగాహన కల్పించడం ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కస్తూరా్భా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, ఫలితాలు, మౌలిక సదుపాయాలపై ఎంపీ సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతోపాటు, వసతి, ఆహారం, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల వసతి గృహాలపై కూడా ప్రత్యేకంగా చర్చిస్తూ.. అక్కడి పరిస్థితులను తరచుగా పర్యవేక్షించాలని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై సమీక్షిస్తూ ఎస్సీ, బీసీ కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమ శాఖల పనితీరును పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా, సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎంఈజీపీ ద్వారా యువతకు స్వయంఉపాధి అవకాశాలు బ్యాంకర్లు రుణాల మంజూరులో వేగం పెంచాలి శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలి దిశ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి -
పురపొచ్చాలు..
● తాము చెప్పినట్లుగా నడుచుకోవాలని ఓ నేత అజమాయిషీ ● ఉద్యోగి ఎవరైనా సరే చెప్పినట్టు చేయాల్సిందేనని హుకూం ● మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తామని బెదిరింపులు ● వేధింపులు తాళలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు ఓ అధికారి ప్రయత్నం మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులకు మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు గడవక ముందే అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని వార్డు ఆఫీసర్లు ఒకరికొకరు చెప్పుకొంటూ ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. మున్సిపాలిటీ పాలన వ్యవహారాలు చూసే మరో అధికారిని అనధికార ప్రజాప్రతినిధి తనదైన రీతిలో ఇబ్బందులకు గురిచేయడంతో సదరు అధికారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతోంది. మున్సిపాలిటీలో జరిగే కొన్ని వ్యవహారాలలో తాము చెప్పినట్టు చేయాలే తప్పా.. మీకు తోచినట్టుగా మాకు సలహాలు ఇస్తే కుదరదని చెబుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య నిశ్శబ్ద కోల్డ్ వార్ సాగుతోంది. -
వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శారీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడలతో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, పీఎంఎస్కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్కుమార్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 44 వాహనాలు, డిగ్రీ విద్యార్థులకు 17 ల్యాప్టాప్లు, 2 సెల్ఫోన్లు అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఉపకరణాలను అందజేస్తుందని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రవాణా సౌకర్యార్థం విధులకు హాజరయ్యే ప్రైవేటు డ్రైవర్లకు, కండక్టర్లకు పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తారని, ప్రతి డిపో పరిధిలో బస్సు రూట్లలో పోలీస్ పెట్రోలింగ్ ఉంటుందన్నారు. విధుల్లో ఉన్న డ్రైవర్లను అడ్డుకోవడం, భయబ్రాంతులకు గురిచేస్తూ చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లతోపాటు బస్ డిపోల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్ యాదయ్య తదితరులున్నారు. -
భగీరథుడి పట్టుదల స్ఫూర్తిదాయకం
కందనూలు: భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథుడి చిత్రపటానికి కలెక్టర్తోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యంపై అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చని భగీరథుడి జీవితం యువతకు గొప్ప సందేశం ఇస్తుందన్నారు. భగీరథుని ఆశయాలకు అనుగుణంగా సమాజంలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. భగీరథుడు భూమిపైకి గంగను తెచ్చిన మహనీయుడని, వారి త్యాగనిరతి, పట్టుదల ఆదర్శనీయమని ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా సగర కుల సంఘాల ప్రతిపాదనలపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కౌన్సిలర్ చంద్రకళ, నాయకులు రాముడు, సాయిలు, బాలయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు లింగ నిర్ధారణ చట్టం నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ బదావత్ సంతోష్ చేశారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమాజంలో బాలికలపై వివక్షను నివారించడమే లింగ నిర్ధారణ చట్టం ప్రధాన లక్ష్యం అన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు అనుమతులు పూర్తిగా నిబంధనల ప్రకారమే మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ రవికుమార్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ జిల్లా ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
మక్కలు.. తిప్పలు..
అరకొరగా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ● వేగం పెరగని మొక్కజొన్న కొనుగోళ్లు, రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు ● నాగర్కర్నూల్లో వారం రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేత ● ప్రైవేటు అమ్మకాలతో దక్కని మద్దతు ధర అరకొర కేంద్రాలతో అవస్థలు.. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్నగర్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటులో తక్కువ ధరతో దోపిడీ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల నేపథ్యంలో రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి పంటను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలో ఇదే అదనుగా ప్రైవేటు దళారులు తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లకు ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాలు రూ. 2,400 లభిస్తుండగా, ప్రైవేటులో ఎక్కడా క్వింటాలు రూ.1,700 దాటడం లేదు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, ప్రతీ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్ల తీరు.. జిల్లా కొనుగోలు మొక్కజొన్న సాగు కొనుగోళ్ల లక్ష్యం ఇప్పటివరకు కేంద్రాలు (ఎకరాల్లో) (మె.టన్నులు) కొనుగోళ్లు మహబూబ్నగర్ 3 30,325 50,000 760 నాగర్కర్నూల్ 13 1,80,564 1,00,000 24,000 వనపర్తి 4 15,337 30,000 1,000 జోగుళాంబ గద్వాల 7 53,482 1,00,000 8,500 నారాయణపేట 1 1,450 3,200 0 -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించనందున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే 2010 ఆగస్టు కంటే ముందు నియామకమైన ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా మే 5న ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్రెడ్డిని నియమించారు. నేడ దిశ సమావేశం కందనూలు: జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఎంపీ మల్లురవి అధ్యక్షత వహిస్తారన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి పథకాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సమావేశంలో సమగ్రంగా చర్చిస్తారని, పథకాల అమలులో పారదర్శకత, సమన్వయం పెంపొందించేందుకు అవసరమైన చర్యలను సూచిస్తారని చెప్పారు. సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు. ముగిసిన ‘పది’ మూల్యాంకనం కందనూలు: జిల్లాకేంద్రంలో నిర్వహించిన పదో తర గతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని డీఈఓ రమేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉపాధ్యాయులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సమాధాన పత్రాల మూల్యాంకనం సకాలంలో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇందులో పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి సమాధాన పత్రాన్ని నిబంధనల కు అనుగుణంగా జాగ్రత్తగా పరిశీలించడంతోపాటు మార్కుల నమోదు ప్రక్రియను కూడా సమాంతరంగా నిర్వహించినట్లు చెప్పారు. డ్రైవర్, కండక్టర్లు కావాలి స్టేషన్ మహబూబ్నగర్: టీజీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతున్న నేపథ్యంలో సమ్మెకాలంలో పనిచేసేందుకు డ్రైవర్, కండక్టర్ అభ్యర్థుల నుంచి అత్యవసరంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న డ్రైవర్లకు రోజుకు రూ.వెయ్యి, కండక్టర్లకు రూ.800 పారితోషికం ఇస్తామన్నారు. అచ్చంపేట, గద్వాల, కల్వకుర్తి, కొల్లాపూర్, కోస్గి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, షాద్నగర్, వనపర్తిల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని కోరారు. డ్రైవర్ అభ్యర్థులకు తెలుగులో రాయడం, చదవడం, హెవీ ట్రాన్స్పోర్టు వెహికల్ లైసెన్స్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ లేదా హెవీ ప్యాసింజర్ వెహికల్ లైసెన్స్, 25–50 ఏళ్లలోపు, కండక్టర్ అభ్యర్థులకు ఎస్ఎస్సీ ఉత్తీర్ణత, 21 నుంచి 58 ఏళ్లలోపు అర్హులన్నారు. -
వేసవి శిబిరాలకు వేళాయె
● నేటినుంచి జూన్ 7 వరకు నిర్వహణకు సమాయత్తం ● 14 ఏళ్లలోపు బాలబాలికలకుక్రీడల్లో శిక్షణ ● జిల్లాలో పది శిబిరాల ఏర్పాటుకు అనుమతి అచ్చంపేట: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం నుంచి జూన్ 7 వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 14 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. రూ.60 వేలు మంజూరు.. జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 వేలు మంజూరు చేసింది. ఒక్కో శిక్షకుడికి రూ.5 వేల చొప్పున 10 మందికి రూ.50 వేలు ఇవ్వనున్నారు. మిగిలిన రూ.10 వేలు ప్రథమ చికిత్స, సర్టిఫికెట్ల కోసం ఖర్చు చేయనున్నారు. శిబిరాలను జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ అధికారి నిర్వహణ బాధ్యతతోపాటు పర్యవేక్షణ చేయనున్నారు. పలు అంశాల్లో శిక్షణ వేసవి శిబిరాల్లో ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్తోపాటు కబడ్డీ తదితర క్రీడాంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిబిరాలను ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. సద్వినియోగం చేసుకోండి.. జిల్లాలో 10 శిక్షణ శిబిరాలకు అనుమతి ఉంది. ఈ శిబిరాలలో విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. అచ్చంపేట, బల్మూర్, పెద్దకొత్తపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్లో శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు 6 దరఖాస్తులు అందాయి. – సీతారాం, డీవైఎస్ఓ -
సీహెచ్సీ నిర్వహణపై కాయకల్ప బృందం సంతృప్తి
కల్వకుర్తి టౌన్: ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు సంబంధించిన బృందం కల్వకుర్తిలో పర్యటించింది. గురువారం పట్టణంలోని సీహెచ్సీ ఆస్పత్రికి వచ్చిన కాయకల్ప ఎక్స్టర్నల్ బృందం సభ్యులు అభిషేక్ జాబ్ దొండపాటితోపాటు ధరమ్, చంద్రకృష్ణ ఆస్పత్రిలో కలియదిరిగారు. ఎక్కడ ఎలాంటి వసతులను రోగులకు అందిస్తున్నారని ఆరాతీశారు. అనంతరం ఇన్పేషెంట్ రోగుల వార్డులను పరిశీలించి వారితో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్లు, ఇతర గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ విభాగం, ఆపరేషన్ థియేటర్, కాన్పుల గది, డైట్, మార్చురీ గది, బ్లడ్ స్టోరేజ్, ఆయుష్, డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించి, సిబ్బందిని అభినందించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించిన బృందం సభ్యులు పరిశుభ్రతపై పారిశుద్ధ్య సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై రోగులకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. -
అరకొరగానే సర్వీసులు
● రెండోరోజు కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ● పాక్షికంగా నడిచిన బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు ● కార్మికులకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు కందనూలు/ అచ్చంపేట రూరల్/ కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని డిపోల ఎదుట ఆందోళన నిర్వహించారు. నాగర్కర్నూల్ బస్ డిపో ఎదుట జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తక్కువ జీతాలతో ఉద్యోగాలు చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు, డబుల్ డ్యూటీల విధానంతో ఇబ్బందులు పడుతున్నామని వాటిని పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వీరికి పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా కార్మికుల సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రజలు ఆటోలు, జీపులు వంటి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా నాగర్కర్నూల్ డిపో నుంచి 33 ప్రైవేట్ బస్సులు, 2 ఆర్టీసీ బస్సులను నడిపించామని, శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ● కల్వకుర్తిలో మధ్యాహ్న సమయంలో ఉద్యోగులంతా కలిసి డిపో ఎదుట వంటావార్పు చేయడానికి సిద్ధమవ్వగా పోలీసులు అడ్డు చెప్పారు. ఎండలో నిరసన తెలియజేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణ నాయకులు అంబలి అందించారు. ● అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలోని కార్మికులంతా జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చైర్మన్గా ఏజే రెడ్డి, వైస్ చైర్మన్గా జె.గోపాల్, కన్వీనర్గా చంద్రయ్య, కోకన్వీనర్లుగా ఆర్ఎస్ నారాయణ, యాదమ్మ, శ్రీనివాసులు, కేఎస్ రెడ్డి, కోశాధికారిగా సురేష్, ప్రచార కార్యదర్శిగా రమేష్తోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. పురుష ప్రయాణికులపై వివక్ష పెద్దకొత్తపల్లి: చార్జీలు చెల్లించి ప్రయాణించే పురుషులపైనే ఆర్టీసీ వివక్ష చూపిస్తోంది. ఏకంగా ఆర్టీసీ బస్సు అద్దంపై మహిళలకు మాత్రమే బస్సు సౌకర్యం అని స్టిక్కర్ అంటించుకొని రావడంతో పురుష ప్రయాణికులు ఖంగుతిన్నారు. హైదరాబాద్ హెచ్టూ డిపోకు చెందిన బస్సు గురువారం పెద్దకొత్తపల్లికి చేరుకోగా.. బస్సు కేవలం మహిళలకు మాత్రమేనని, పురుషులకు కాదని చెప్పడంతో డ్రైవర్పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బస్సును నిలిపివేశారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్ మాట్లాడుతూ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు తాము పురుష ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవడం లేదని చెప్పారు. డబ్బులు చెల్లించి ప్రయాణించే పురుషులపైనే వివక్ష చూపించడం ఏమిటని పలువురు చర్చించుకున్నారు. -
ప్రైవేట్ బస్సులు నడిపించాం..
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా కండక్టర్లు, డ్రైవర్లను నియామకం చేసుకొని బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నాం. బుధవారం సాయంత్రం వరకు పది మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించి.. కొన్ని రూట్లలో ప్రైవేటు బస్సులు నడిపించాం. – యాదయ్య, డిపో మేనేజర్, నాగర్కర్నూల్ చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నాం. యాజమాన్యం నుంచి మాకు తీవ్రమైన ఒత్తిడి ఉంది. నూతన రిక్రూట్మెంట్ లేక ఉన్న వారితో సరిపెడుతూ మమ్మల్ని డబుల్ డ్యూటీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఆర్టీసీ కార్మికులను విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. – స్వరాజ్యలక్ష్మి, కండక్టర్, నాగర్కర్నూల్ డిపో నేను షాద్నగర్లో నా కొడుకు దగ్గరకు వెళ్లాలి. ఉదయం అచ్చంపేట నుంచి ఒక బస్సు వస్తే దానిలో వచ్చాను. నాగర్కర్నూల్కు వచ్చాక ఇక్కడ ఒక్క బస్సు లేదు. ఈ రోజు బస్సులు నడుస్తలేవు అని ముందుగా తెలియదు. జడ్చర్ల వరకు ఆటోలు వెళ్తున్నా.. వాళ్లు రూ.150 అడుగుతున్నారు. – లక్ష్మమ్మ, రామాజిపల్లి, బల్మూరు మండలం ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మేం ప్రతిరోజు కళాశాలకు బస్సుల్లో వెళ్తాం. ఇలాంటి సమయంలో బస్సులు నడవకపోవడంతో సరైన సమయంలో పరీక్షకు హాజరుకాలేకపోతున్నాం. ఆర్టీసీ అధికారులు ఆలోచించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. – శివ, డిగ్రీ విద్యార్థి ● -
నిస్సహాయుల పాలిట.. గ్రామసింహాలు
● ఒక్క మార్చిలోనే 566 కుక్క కాటు కేసులు ● తీవ్ర భయాందోళనలో చిన్నారులు, వృద్ధులు ● జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా మారిన ఎనిమల్ కేర్ సెంటర్ ● రూ.50 లక్షలు వెచ్చించినా ఉపయోగంలోకి రాని వైనం సాక్షి, నాగర్కర్నూల్/ కందనూలు: బయటికి వెళ్లాలంటే వీధి కుక్కలు బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆరుబయట కనిపిస్తే చాలు జనాలపై దాడులు చేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా తిరుగుతూ వెంబడిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా.. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా.. తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుడుతోంది. ప్రజలు ఇంట్లోంచి కిరాణా షాపులు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా వెంబడించి కరుస్తున్నాయి. ఇక రాత్రిపూట రోడ్లపై ద్విచక్రవాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని శ్రీపురం రోడ్డు, నల్లవెల్లి రోడ్డు, ఇతర కాలనీల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డు, బస్టాండ్ ఆవరణలో ఒకేరోజు ఆరుగురు ప్రయాణికులను కుక్క కరిచిన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మున్సిపాలిటీ కేంద్రాల్లో చికెన్ ఫ్రై సెంటర్లు, మటన్ షాపుల నిర్వాహకులు వ్యర్థాలను ఇష్టారాజ్యంగా షాపుల వెనకాల, రోడ్డు పక్కన పడేస్తున్నారు. దీంతో వాటి కోసం కుక్కలు అధికంగా వస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలను రోడ్డు పక్కనే వేస్తున్నారు. మాంసానికి అలవాటు పడిన కుక్కలు మాంసం లభించనప్పుడు మేకలు, గొర్రె మందలపై దాడి చేస్తున్నాయి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల నుంచి ఇంటికి వచ్చే విద్యార్థులు, అలాగే సాయంత్రం వేళల్లో పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సందర్భాల్లో, రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ద్విచక్రవాహనదారులు కిందపడి గాయపడిన ఘటనలు కోకొల్లలు. జిల్లావ్యాప్తంగా 2019 లెక్కల ప్రకారం 14,141 కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు మళ్లీ వీటి గణన చేపట్టలేదు. ప్రస్తుతం వీటి సంఖ్య రెట్టింపైనట్లు అంచనా. గత జనవరిలో 423, ఫిబ్రవరిలో 314, మార్చిలో 566 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. మార్చి నెలలో కుక్కకాటు కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఇక వచ్చే నెలలో కుక్కల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకేంద్రంలోని గగ్గలపల్లి రోడ్డులో రూ.50 లక్షలతో నిర్మించిన యానిమల్ కేర్ సెంటర్ పేరుకు మాత్రమే కనిపిస్తోంది. ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ కుక్కలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన దాఖలాలు కనిపించలేదు. ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కేంద్రం నిరుపయోగంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్కలను ఎనిమల్ కేంద్రాలకు తరలించి ప్రజలకు కుక్కల బెడద తప్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. జిల్లాలో గడిచిన పది రోజుల నుంచి 43 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి.. దాహం ఎక్కువై ఇతరులపై దాడులు చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వారిపై దాడి చేస్తున్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక ఇలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా పిల్లలపై అధికంగా ప్రతాపం చూపిస్తున్నాయి. -
కదలని ప్రగతి చక్రం
జిల్లాలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు ● ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా వ్యవస్థ ● డిపో గేట్ల ముందు బైఠాయించి కార్మికుల ధర్నా ● తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు ● అవకాశాన్ని ఆసరా చేసుకుంటున్న ప్రైవేటు వాహనదారులు కందనూలు/అచ్చంపేట రూరల్/ కల్వకుర్తి టౌన్/కొల్లాపూర్: తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో జిల్లావ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని పలు డిపోలలో తమ సమస్యలు పరిష్కరించాలని కండక్టర్లు, డ్రైవర్లు బస్ డిపోల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెతో జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలోని అనేక మార్గాల్లో బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రైవేటు వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బస్ డిపోల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్ హైర్, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు. -
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
కందనూలు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ డిపోను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిపోలో అందుబాటులో ఉన్న బస్సులు, నడుస్తున్న రూట్లు, ప్రయాణికుల రద్దీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అంచనా వేసి, ఆ మేరకు బస్సులు నడిపించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ కలిసి గూగుల్ మీట్ ద్వారా ఆర్టీఓలు, డీఎస్పీలు, ఆర్టీసీ డిపో మేనేజర్లు తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తుందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తాత్కాలికంగా నియమితులయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. -
దరఖాస్తుల ఆహ్వానం
బిజినేపల్లి: మండలానికి చెందిన మినీ గురుకులంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 1–5 తరగతుల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతిలో 3, 5వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గలవారు తమ ఆధార్, జనన, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 2 పాస్ ఫొటోలతో వచ్చేనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం మండల కేంద్రంలోని మినీ గురుకులంలో సంప్రదించాలని కోరారు. 50 శాతం సబ్సిడీపై తీగజాతి కూరగాయలు కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా ఆర్కేవీవై పథకంలో భాగంగా రైతులు తీగ జాతి కూరగాయలు సాగు చేయడానికి తీగ జాతి పందిరి నిర్మాణాల కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తుందని కొల్లాపూర్ ఉద్యాన శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50 శాతం రైతులకు చెల్లిస్తుందన్నారు. కాకర, బీర, సోర, పొట్ల, దొండ వంటి తీగ జాతి కూరగాయలు పండించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. వీటి సాగు వల్ల రెండు సంవత్సరాల వరకు దిగుబడి వచ్చి.. ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ పంటలు ఏడాదికి మూడు సార్లు సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. 24న సంసద్ ఖేల్ ముగింపు వేడుకలు మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ఖేల్ మహోత్సవానికి యువత నుంచి విశేష స్పందన లభించినట్లు ఇన్చార్జీలు ముచ్చర్ల జనార్దన్రెడ్డి, కిరణ్కుమార్, నవీన్కుమార్ తెలిపారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియం వేదికగా ఈనెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ పరిధిలోని ప్రజలు, క్రీడాభిమానులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికులపై కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులు నడపకుండా ఇబ్బందులకు గురిచేసిన ఇద్దరు కార్మికులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెలో నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు ఆటంకం కలిగించిన కొల్లాపూర్లో, కల్వకుర్తిలో ఒక్కొక్కరిపై కేసు నమోదైందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరితే వారిని ఎవరైనా ఆర్టీసీ కార్మికులు ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. – వెల్దండ తీరనున్న లోవోల్టేజీ సమస్య చివరి దశకు చేరుకున్న సబ్స్టేషన్ నిర్మాణ పనులు ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు వివరాలు 9లో.. -
భూమి సంరక్షణ అందరి బాధ్యత
కందనూలు: భూమిని సంరక్షించడం అందరి బాధ్యత అని, విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పర్యావరణాన్ని రక్షించడం అంటే మన భవిష్యత్ను రక్షించుకోవడమే’ అనే నినాదంతో విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టి ప్రజల్లో చైతన్యం కల్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సులోనే పర్యావరణ విలువలను అలవర్చుకోవాలని, వాటిని సమాజంలోకి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. భూమి తల్లి సంరక్షణ కోసం చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వనరుల సంరక్షణ వంటి చర్యలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్లో వినియోగించే ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని గుర్తు చేయాలని, ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని చెప్పారు. అనంతరం పుడమితల్లి సంరక్షణపై వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ కుర్మయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్రావు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్కుమార్, ఉపాధ్యాయుడు సుదర్శన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలకు సిద్ధం చేసుకోవాలి
వెల్దండ: ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధం చేసుకునే విధంగా లబ్ధిదారులను పురమాయించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పోతేపల్లి, ఎంజీ కాలనీతండాలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు శుక్రవారం గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులు, గ్రామంలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల వద్ద నీరు, నీడ వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కొండల్యాదవ్, దస్లీ, శిరీష, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంపీఓ లక్ష్మణ్, ఏపీఓ ఈశ్వర్జీ, ఈసీ దేవేందర్, హౌసింగ్ ఏఈ పల్లవి, కృష్ణవేణి, కార్యదర్శులు రూప్సింగ్, వాణి, తదితరులు పాల్గొన్నారు. -
మక్తల్ ఆరో వార్డులో బీజేపీ విజయం
మక్తల్: నారాయటపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఆరోవార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎర్కలి సత్యమ్మ విజయం సాధించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగాల్సి ఉండగా.. బీజేపీ అభ్యర్థి ఎర్కలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో పోలింగ్ వాయిదా పడింది. శనివారం పోలింగ్ నిర్వహించి.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఎర్కలి మహదేవప్ప బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె తన సమీప ప్రత్యర్థి ఎర్కలి మార్పైపె 37 ఓట్ల మెజారీతో విజయం సాధించారు. మొత్తం 1,453 ఓట్లకు 1,294 పోల్ అయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి సత్యమ్మకు 628 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మారెప్పకు 591 ఓట్లు, బీఆర్ఎస్కు 46, నోటాకు 4, ఓటర్లు వచ్చాయి. 25ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.గెలుపొందిన అభ్యర్థి సత్యమ్మకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
పేదలకే సంక్షేమ ఫలాలు..
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి, అనర్హులుగా ఉండి కూడా రేషన్కార్డులు పొందిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన రేషన్కార్డుల ప్రక్షాళన ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. కొంతకాలంగా అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 4,500ల దాకా అనర్హులు తెల్లరేషన్కార్డులు పొందినట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు, వాహనాలు, భూమి వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను(ఇన్కంటాక్స్) చెల్లిస్తున్న వారిపై అధికారులు దృష్టిసారించారు. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వ్యక్తులు తెల్లరేషన్కార్డు పొందేందుకు అనర్హులు. అయినప్పటికీ పలువురు ఈ సమాచారాన్ని దాచిపెట్టి కార్డులు పొందినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాంటి వారి కార్డులు తక్షణమే రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ● కార్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ చెల్లింపుదారులకూ కార్డులు ● విచారణ చేపడుతున్న రెవెన్యూ అధికారులు ● పరిశీలించి తొలగింపునకు చర్యలు అచ్చంపేట: అక్రమ రేషన్ కార్డులు పొందిన అనర్హులకు చెక్ పడనుంది. జిల్లాలో మొత్తం 2,76,590 రేషన్ కార్డులుండగా.. ప్రభుత్వం ప్రతినెలా 5,554.3 మె.ట., బియ్యం ఉచితంగా అందజేస్తోంది. అయితే పలువురు ప్రతినెలా తీసుకుంటున్న రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా దృష్టిసారించాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించి 4,500 కార్డుదారులు అనర్హులుగా ఉన్నారని కేంద్రం తేల్చి.. వీటిని తొలగించాలని ఆదేశించారు. ఆహార భద్రత 2,57,886 -
మరింత చేరువైన రక్తశుద్ధి
●పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్– ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 పడకల చొప్పున.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దూరం, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక యూనిట్ చొప్పున డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు నూతనంగా 11 కేంద్రాలు మంజూరు చేయగా.. అన్నిచోట్ల ఐదు పడకలకు ఐదు మిషన్స్ ఏర్పాటు చేసి మరో మూడు నెలల్లో సేవలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పీహెచ్సీలు లేదా సివిల్ ఆస్పత్రులు ఉన్నచోట ఒక గదిలో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించనున్నారు. ప్రతి కేంద్రం దగ్గర నీటిశుద్ధి ప్లాంటు, ఫ్రిజ్లు, వైద్య నిపుణులతో పాటు ఇద్దరు సాంకేతిక నిపుణులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉంటారు. ఈ ఐదు పడకలు ఉన్నచోట నిత్యం 20 మందికి రక్తం శుద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్న కొత్త డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి కోసం ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కిడ్నీ వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రధానంగా రోజూ తగినంత వ్యాయామం చేయడం, కావాల్సినంత నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా జీవన విధానం పాటించాలి. సరైన మోతాదులో నీరు తాగడం, బీపీ, షుగర్ నియంత్రణలో పెట్టుకోవడం చేయాలి. దీర్ఘకాలికంగా కిడ్నీలు చెడిపోయిన రోగుల్లో క్రియాటీన్, పొటాషియం శాతాల పెరుగుదల శరీరంలో అదనంగా నీరు చేరిన ఆధారంగా ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. వందలాది మంది బాధితులు.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 కేంద్రాలు అందుబాటులో ఉండగా వీటి ద్వారా వందలాది మంది బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. మహబూబ్నగర్లో 10, బాలానగర్లో 5, నారాయణపేటలో 10, మక్తల్లో 5, ఆత్మకూర్లో 5, వనపర్తిలో 10, నాగర్కర్నూల్లో 10, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 5, కల్వకుర్తిలో 5, గద్వాలలో 12, అలంపూర్లో 5 మిషన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. కొత్తగా 11 డయాలసిస్ కేంద్రాలు మంజూరు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు పాలమూరువ్యాప్తంగా 908 మంది బాధితులు కొత్తగా మంజూరైన డయాలసిస్ కేంద్రాలు ఇలా.. -
బసవేశ్వరుడి అడుగుజాడల్లో పయనిద్దాం
కందనూలు: బసవేశ్వరుడి అడుగుజాడల్లో పయనిద్దామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి హాజరై బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బసవేశ్వరుడు కుల, మతాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప అభ్యుదయ వాది అన్నారు. మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు అని, ఆయన బోధించిన అభ్యుదయవాద సంప్రదాయమే నేడు లింగాయత్ ధర్మంగా మారిందన్నారు. 12వ శతాబ్దంలోనే మహిళలకు సముచిన స్థానం కల్పించారని, బసవేశ్వరుడు చెప్పిన సిద్ధాంతాలను కేవలం మాటల్లో కాకుండా మన జీవితాల్లో ఆచరణలో పెట్టి ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే ఆయనకు మనం నిజమైన గౌరవం తెలిపినట్లవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజేష్రెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలపైన నిరంతరం పోరాటం చేసిన మహానుభావుడు బసవేశ్వరుడన్నారు. లింగాయత్ సంఘం నాయకులు జిల్లాకేంద్రంలో బసవేశ్వరుడి విగ్రహం, బసవేశ్వర భవన ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, జిల్లా గౌరవాధ్యక్షుడు సురేష్, జిల్లా ప్రెసిడెంట్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓటరు మ్యాపింగ్ వేగవంతం చేయాలి కందనూలు: జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట పరిధిలో 7,38,439 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు 4,74,767 మందిని (64.29 శాతం) గుర్తించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశామని, రానున్న పదిరోజుల్లో మిగతాది పూర్తిచేస్తామని వివరించారు. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కందనూలు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జెడ్పీసీఈఓ దేవసహాయంతో కలిసి ప్రజల నుంచి 45 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరెట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 14.. నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో ప్రజల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 4 భూమికి సంబంధించిన అర్జీలు, 8 తగు న్యాయం చేయాలని, 2 భార్యాభర్తల గొడవల ఫిర్యాదులు ఉన్నాయని, సంబంధిత పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో మాట్లాడి వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ కందనూలు: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మూడో దశ కోసం అర్హత కలిగిన యువత ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం తెలిపారు. ఇంటర్న్షిప్ కాలవ్యవధి 6 నెలలు, 9 నెలలు ఉంటుందని, దేశవ్యాప్తంగా సీఎస్ఆర్కు తోడ్పడే 2 వేల కంపెనీలు, ఇంటర్న్షిప్ ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, ఒకేసారి చెల్లించే రూ.6 వేలు గ్రాంట్ పొందుతారు. పది నుంచి పీజీ చేసిన 18– 25 ఏళ్లలోపు వారు Prime MinisterInternshipscheme పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,329 మంది విద్యార్థులకు 1,250 మంది హాజరయ్యారు. ఇక ఎస్సెస్సీలో 19 పరీక్ష కేంద్రాలు ఉంటే 836 మందికి 725 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెండు ఫ్లయింగ్స్క్వాడ్స్, 15 మంది సిట్టింగ్స్క్వాడ్స్ను నియమించారు. -
ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం
స్టేషన్ మహబూబ్నగర్: ఈనెల 22 ఉదయం మొదటి బస్సు నుంచి మొదలయ్యే ఆర్టీసీ నిరవధిక సమ్మెకు కార్మికులందరం సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జి.లక్ష్మణ్గౌడ్, విజయబాబు, సాయిరెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులతో కలిసి వారు సమ్మె సన్నాహక పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా లెక్క చేయలేదన్నారు. విధిలేని పక్షంలో తాము సమ్మెబాట పట్టామని, ప్రజలు, వివిధ సంఘాలు, మేధావులు తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బసప్ప, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి నివేదిక..
వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొత్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం. – సాయినాథ్రెడ్డి, డీఎంహెచ్ఓ, వనపర్తి వైద్యుడిని సంప్రదించాలి.. కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్డీఎఫ్ కానీ హెచ్వోఎంఎల్, హెచ్డీ, నాచ్యురల్ హెచ్బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు -
అగ్ని ప్రమాదాలపై నిర్లక్ష్యం వహించకూడదు
నాగర్కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా అగ్ని మాపకశాఖ అధికారి గిరిధర్రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతిఒక్కరు నివారణ యంత్రాలను అమర్చుకోవాలన్నారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందిస్తే ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
అచ్చంపేట: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సదుపాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో కొనసాగుతున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించి.. సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి విభాగంలో శుభ్రత పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా వంటశాలలో ఆహారం తయారీ సమయంలో నాణ్యత ప్రమాణాలు, శుభ్రతపై ఎలాంటి రాజీ పడకూడదన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం పోషక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, సరైన డైట్ ప్లాన్ అమలు చేయాలని, ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, గడువు ముగిసిన పదార్థాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులపై దృష్టిసారిస్తూ.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని మరమ్మతు చేయించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను ఆయన పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి పోటీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల గురించి ఆరా తీశారు. -
కోఆప్షన్ దక్కేదెవరికో..?
మోగిన నగారా.. మున్సిపాలిటీల్లో మరో ఎన్నిక ● నలుగురు సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ ● మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరు, అనుభవజ్ఞుల నుంచి ఇద్దరి ఎంపిక ● కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీల ప్రయత్నాలు ● మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు ఎన్నిక ప్రక్రియ ఇలా.. మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో కమిషనర్లు మార్గదర్శకాలు విడదల చేశారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో మొదటి సమావేశం జరిగి 60 రోజులకుపైగా అవుతోంది. పది రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన 7 రోజుల వ్యవధిలో పోటీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. అందిన దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో కమిషనర్ పరిశీలించి జాబితాను రూపొందించి కౌన్సిల్ ఎదుట ప్రవేశపెట్టాలి. సభ్యులతోపాటు ఎక్స్అఫీషియో సభ్యులకు ముందుస్తుగా సమాచారం అందించి ప్రత్యేక సమావేశం ఎన్నిక తేదీని ఖరారు చేయాలి. ఈ సమావేశానికి కోరం కోసం కనీసం 50 శాతం సభ్యులు హాజరుకావాలి. పోటీ ఉన్న పక్షంలో సభ్యులు చేత్తులెత్తే విధానం ద్వారా సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అత్యధిక మున్సిపాలిటీల్లో అధికార పక్ష సభ్యులు మెజార్టీ ఉండటంతో అన్ని మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ పదవులు వారే దక్కించుకునే అవకాశం ఉంది. అచ్చంపేట: మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందడి మొదలైంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ సైతం జారీ అయ్యింది. దీంతో ప్రధాన పార్టీల్లో ఆశావాహులు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యుల ఎంపిక ఏకగ్రీవమవుతుందా.. లేదా ఎన్నిక అనివార్యం కానుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రూల్స్–2020 ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నెల 24లోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు వెల్లడించారు. జిల్లాలో అచ్చంపేట మినహా నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. నూతన మున్సిపాలిటీల్లో తొలి సమావేశం జరిగిన 90 రోజుల వ్యవధిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక సమావేశం గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు జీఓ జారీ చేసింది. ఎన్నిక విధివిధానాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా మున్సిపల్ కమిషనర్లు కోఆప్షన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. -
సమ్మెకు సై..
నేటి నుంచి ‘ఆర్టీసీ’ బంద్ ● పలు డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట ● రీజియన్లోని 10 డిపోల పరిధిలో నిలిచిపోనున్న బస్సు సర్వీసులు ● అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అద్దె బస్సులు నడిపేలా చర్యలు ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ● 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలి. ● మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను క్రమం తప్పకుండా నెలనెలా ఆర్టీసీకి ఇవ్వాలి. ● ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ● రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ● అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ● రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు అన్నింటినీ చెల్లించాలి. ● మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. డిపో బస్సులు అచ్చంపేట 80 గద్వాల 108 కల్వకుర్తి 103 కొల్లాపూర్ 65 కోస్గి 27 మహబూబ్నగర్ 152 నాగర్కర్నూల్ 81 నారాయణపేట 97 షాద్నగర్ 91 వనపర్తి 121 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు. 925 బస్సులు.. 3267 మంది కార్మికులు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్ డ్రైవర్లు, 148 మంది ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, 385 మంది మెకానిక్ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు.. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా అద్దె బస్సులను నడుపుతాం. కాంట్రాక్ట్ ఉద్యోగులతో బస్సులు నడిచేలా తగిన చర్యలు చేపడుతాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ -
అన్నదాతకు అకాల కష్టం
● వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట ● తాటిచెట్టుపై పిడుగుపడి గీతా కార్మికుడికి గాయాలు వెల్దండ: అన్నదాతలను అకాల కష్టాలు చుట్టుముట్టాయి. మంగళవారం సాయంత్రం వెల్దండతోపాటు కంటోనిపల్లి, చెర్కూర్ గ్రామాల్లో అకాల వర్షం కురవడంతో మొక్కజొన్న పంట తడిసిపోయింది. మొక్కజొన్న విక్రయించడానికి వెల్దండలోని సింగిల్ విండో కార్యాలయానికి తీసుకురాగా.. వర్షం రావడంతో పంట తడిసిపోయింది. గన్నీబ్యాగులు సరఫరా చేయకపోవడంతో పంట తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మండలంలోని అజిలాపూర్ గ్రామానికి చెందిన గునగంటి వెంకటయ్యగౌడు పిడుగు పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటయ్యగౌడు గ్రామ సమీపంలోని కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కగా.. ఒక్కసారిగా ఉరుములు, మెరుపు వచ్చి అతను ఎక్కిన తాడిచెట్టుపై పిడుగు పడింది. దీంతో తాటిచెట్టు నుంచి కొంత వరకు కిందకు జారి ఆగిపోయాడు. గమనించిన రైతులు అక్కడికి చేరుకుని చెట్టు కిందకు దించి.. చికిత్స నిమిత్తం ఇర్విన్ గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఏసీబీ వలలో నారాయణపేట ఆర్డీఓ
● బర్త్ సర్టిఫికెట్ల జారీకి రూ.25 వేల లంచం డిమాండ్ ● రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నారాయణపేట: మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన నారాయణపేట ఆర్డీఓ పి.రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణయ్య వివరాల మేరకు.. జిల్లాలోని ఊట్కూర్కు చెందిన ఓ వ్యక్తి తనతో పాటు మరో నలుగురికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల కోసం గతేడాది జూలైలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ నుంచి తహసీల్దార్ లాగిన్లోకి వెళ్లిన దరఖాస్తులు.. అక్కడి నుంచి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ అయ్యాయి. అయితే దరఖాస్తు చేసుకున్న 45 రోజులలోగా విచారణ చేపట్టి, బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉండగా.. 10 నెలలు అవుతున్నా ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోయారు. వారం రోజులుగా డివిజనల్ కార్యాలయానికి తిరుగుతూ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆర్డీఓను వేడుకున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇస్తే జారీ చేస్తామని ఆర్డీఓ చెప్పినట్లు ఆ కార్యాలయంలోని సెక్షన్ అధికారి దరఖాస్తుదారుడికి చెప్పినట్లు తెలిసింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేమని రూ.5 వేల చొప్పున ఇస్తామని సదరు అధికారి ద్వారా ఆర్డీఓతో బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముందుగా బర్త్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆర్డీఓ కార్యాలయంలోకి పంపించారు. సదరు వ్యక్తి నుంచి ఆర్డీఓ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆర్డీఓకు సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేటలోని నివాసగృహంతో పాటు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని మరో ఇంట్లో, తన కుటుంబీకుల నివాసాల్లో సైతం ఏసీబీ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఆర్డీఓ కార్యాలయంలోని భూ దరఖాస్తులు, కంప్యూటర్లోని డేటా, మిగతా అంశాలపై ఆర్డీఓను విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఆర్డీఓను అరెస్టు చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
తీవ్ర పోటీ..
ఆయా మున్సిపాలిటీల్లో కోఆప్షన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పలు కారణాలతో కౌన్సిలర్గా పోటీచేసే అవకాశం రానివారు కోఆప్షన్ పదవులు ఆశిస్తున్నారు. చైర్మన్ ఎన్నికకు సరిపడా బలం లేని మున్సిపాలిటీల్లో పరోక్షంగా మద్దతు తెలిపిస వారికి గతంలో అధికార పక్షం అగ్రనేతలు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కోఆప్షన్గా ఎన్నికై న వారికి నెలనెలా గౌరవ వేతనంతోపాటు ఇతర సదుపాయాలు ఉండటంతో పదవిని ఆశించే వారి సంఖ్య అన్ని మున్సిపాలిటీల్లో పరిమితికి మించి ఉండే అవకాశం ఉంది. -
నోటిఫికేషన్ జారీ..
కోఆప్షన్ ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన వారు ఇందుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 సాయంత్రం 5 గంటలోగా మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు అందజేయాలి. నలుగురు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉండగా.. ఇద్దరు జనరల్, మరో ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందినవారు ఉంటారు. దరఖాస్తుతోపాటు అర్హతలకు సంబంధించిన పత్రాలను జతపర్చాలి. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్ -
పాలెం వెంకన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎన్.రాజేశ్వరరావు సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అలమేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం న్యాయమూర్తిని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కురవి రామానుజాచార్యులు, సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. నేడు ‘రైతుభరోసా’ జమ కందనూలు: రెండో విడత రైతుభరోసా నిధులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 2.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 103కోట్లు జమకానున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పంట పెట్టుబడి సాయం విడుదల చేయనున్న సందర్భంగా జిల్లాలోని 63 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులందరూ పాల్గొనేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాల్యవివాహాలను నిర్మూలిద్దాం అచ్చంపేట: బాల్యవివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీశైలం కోరారు. యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్టులో భాగంగా ఆదివారం కోనేరు ఎన్జీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అచ్చంపేట మండలం నడింపల్లి కేజీబీవీ విద్యార్థినులతో పాటు ఉమామహేశ్వరాలయం వద్ద భక్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో విద్యార్థినులు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులు వివాహాలు చేయాలనే ఆలోచన చేస్తారని.. అలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే 1098 నంబర్ను సంప్రదించాలని సూచించారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యవివాహంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉమామహేశ్వరాలయం వద్ద బాల్యవివాహాలు చేయకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం అచ్చంపేట చర్చిలో బాల్యవివాహాలు చేయరాదని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీపీసీ మల్లేష్, కోనేరు ఎన్జీఓ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
పాన్గల్: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో రూ.42.12 లక్షలతో అదనపు మౌలిక వసతులు, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ, రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, క్రీడా మైదానం తదితర సమస్యలున్నాయని మంత్రికి వివరించారు. పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని సర్వేచేసి నివేదిక అందించాలని తహసీల్దార్ను మంత్రి ఆదేశించారు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని.. ఆరోగ్యంగా ఉంటేనే చదవడం, ఆటలు ఆడటం సాధ్యమని చెప్పారు. చదువు సమాజాన్ని సంస్కరించేదిగా ఉండాలని.. రోజు విద్యార్థులకు మహనీయుల చరిత్రను వివరిస్తూ వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. బాలికలు పొడువుకు తగిన బరువు ఉండేలా చూడాలని.. అందుకు తగిన ఆహారం అందించాలన్నారు. మూడు నెలల తర్వాత విద్యాలయాన్ని సందర్శించినప్పుడు మార్పు కనిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి డబ్బులు వృథా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి బలోపేతానికి తోడ్పాటునందించాలని కోరారు. చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యమే.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
చేనేత ఓటరు జాబితా ప్రదర్శన
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం అమరచింత చేనేత సహకార సంఘంలో ఓటరు జాబితాను ప్రదర్శించారు. సంఘంలో మొత్తం 766 మంది ఓటర్లు ఉన్నట్లు అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్ తెలిపారు. ఓటరు జాబితాను డైరెక్టర్లతో కలిసి నోటీసు బోర్డుపై ప్రదర్శించినట్లు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటరు జాబితా ప్రదర్శించి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం మరోమారు జాబితాను రూపొందించి ఏడీ కార్యాలయంలో సమర్పిస్తామని వివరించారు. వనపర్తి, గద్వాల, నాగర్కర్నూలు జిల్లాలోని చేనేత సహకార సంఘాల్లో ఓటరు జాబితా ప్రదర్శన పూర్తిచేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని చేనేత జౌళిశాఖ ఏడీ పద్మ తెలిపారు. వచ్చే నెల 15 వరకు పూర్తిస్థాయి ఓటరు జాబితా సిద్ధం చేసి పంపనున్నట్లు వివరించారు. -
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తుందని, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని, వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చలకు రావడం లేదని ప్రశ్నించారు. విధానపరమైన సమస్యలు అంటూ ప్రజలను గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విధానపరమైన సమస్యలు అనడం సమంజసం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకురావాలని, ఆర్టీసీ కార్మి సంఘాలతో చర్చించి.. ఈ నెల 22 నుంచి జరిగే ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు జీఎల్గౌడ్, నాగేందర్, కృష్ణ, వెంకటయ్య, నాగరాజు, గోపాల్, కురుమూర్తి, సురేష్, ఖమర్అలీ, భరత్, ప్రశాంత్, రాజ్కుమార్, ప్రేమలత, నారాయణ, శివరాం పాల్గొన్నారు. -
నేటి నుంచి ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు
కందనూలు: జిల్లాలో సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఎస్సెస్సీకి సంబంధించి జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ పట్టణాల్లో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో మొత్తం 492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 7 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 87 మంది ఇన్విజిలెటర్లు, 11 మంది సీఎస్లు, 11 మంది డిపార్టుమెంట్ అధికారులను నియమించినట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివప్రసాద్ వివరించారు. హాల్ టికెట్లను తెలంగాణ ఓపెన్స్కూల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. జిల్లాలో ఓపెన్ ఎస్సె స్సీ, ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్ష రాయాలి. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. – రమేశ్కుమార్, డీఈఓ -
ఆన్లైన్లో విద్యార్థుల ప్రగతి పత్రాలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా 1నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)–2 పరీక్షలు శనివారంతో ముగిశాయి. అయితే విద్యార్థుల ప్రతిభను తెలిపే ప్రోగ్రెస్ కార్డుల విధానానికి స్వస్తి పలికిన పాఠశాల విద్యాశాఖ.. ఆన్లైన్ ద్వారా విద్యార్థుల ప్రగతి పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ వద్ద నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక (ఎస్ఏ–1) పరీక్ష ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 22లోగా ఎస్ఏ–2 పరీక్షల ఫలితాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇది వరకు నిర్వహించిన నిర్మాణాత్మక (ఎఫ్ఏ–1, 2, 3, 4), సంగ్రాహణాత్మక (ఎస్ఏ–1) మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాల అప్లోడ్ ప్రక్రియ పూర్తయింది. ఎస్ఏ–2 పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులు జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. బుధవారంలోగా ఆన్లైన్లో ఫలితాల నమోదు ప్రక్రియ పూర్తిచేసి.. గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు. వారి సమక్షంలో ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు తెలిపారు. -
భానుడి భగభగ!
అచ్చంపేట: ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఏప్రిల్లోనే ఎండలు దంచికొడుతుండటంతో, వచ్చేనెల పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. రోజు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వివిధ పనులకు వెళ్లే వారు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్నం భానుడు భగభగ మండిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వచ్చే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లలో ఉండలేక.. బయటకు రాలేక ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక.. ఉక్కపోతతో ఇంట్లో ఉండలేక ఆగమాగమవుతున్నారు. వృద్ధులు, పిల్లలు సైతం ఎండలు, ఉక్కపోతతో తల్లడిల్లుపోతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా జనాలు జంకుతున్నారు. దాహం తీర్చుకునేందుకు చల్లని శీతలపానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత మంది వడదెబ్బకు గురై అస్పత్రుల పాలవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఫ్యాన్లు, కూలర్లకు మరమ్మతు.. ఎండ తీవ్రతకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో మధ్యాహ్నం, రాత్రివేళల్లో కూలర్లతో పాటు ఫ్యాన్లతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇదివరకే మరమ్మతుకు గురైన ఫ్యాన్లు, కూలర్లను బాగు చేయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఇవీ కూడా పనిచేయకపోవడంతో ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కూలర్లు, ఏసీల రేట్లు సైతం పెరిగాయి. నియోజకవర్గం గరిష్టం కనిష్టం నాగర్కర్నూల్ 40 27 అచ్చంపేట 38 26 కొల్లాపూర్ 41 28 కల్వకుర్తి 40 27 పాటించాల్సిన జాగ్రత్తలు.. వేసవిలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీడ పట్టున ఉండాలి. ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించాలి. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ఎండలో పనులు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి. అల్కాహాల్, సిగరేట్, కార్పోనేటేడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ ద్రావణాలను తాగడం మంచిది.జిల్లావ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత్తలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎండ వేడమి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ఫ్యాన్లు, కూలర్ల చల్లదనం సరిపోక అల్లాడుతున్న ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి.. ఎండల తీవ్రత రోజూరోజుకు పెరుగుతోంది. వడదెబ్బ బారినపడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కూలీలు, వ్యవసాయదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రావణం తీసుకోవాలి. తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలి. ఓఆర్ఎస్ పాకెట్లు ఐవీ ప్లూయిడ్స్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. – డా.తారాసింగ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
తాగునీటికి ఢోకా లేనట్టే!
‘మిషన్ భగీరథశ్రీకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ● ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల నీటిమట్టం ● 800 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ● వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 820 అడుగుల మేరకు కృష్ణా బ్యాక్వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాల మేరకు ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణా బ్యాక్వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఇక ఢోకా ఉండదు. – అంజాద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ కొల్లాపూర్: శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకానికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్కీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 84 మండలాలకు తాగునీరు అందుతోంది. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. కృష్ణానదిలో కొన్ని రోజులుగా నీటిమట్టం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 820 అడుగుల మేరకు నీటిమట్టం ఉంది. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. యాసంగి సీజన్ ముగింపునకు చేరడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం మిషన్ భగీరథ కోసమే నీటిని వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. సరఫరా ఇలా.. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి.. నీటి సరఫరా చేస్తున్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
బల్మూర్/తెలకపల్లి: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని.. ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు రవీందర్ నాయక్ హెచ్చరించారు. ఆదివారం బల్మూరు, తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్యకేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ల్యాబ్, మందుల నిల్వలతో పాటు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోజువారీగా ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్ల వివరాలను వైద్యాధికారులతో తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని.. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్య తెలుసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలకు వందశాతం పూర్తిచేయాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కుక్కకాటు, పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, వైద్యులు విష్ణు, కృష్ణమోహనన్ ప్రదీప్ సురేశ్బాబు, రాజగోపాలాచారి, హెల్త్ సూపర్వైజర్ ఉమ, అసిస్టెంట్ రెడ్యానాయక్, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసులు ఉన్నారు. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు రవీందర్ నాయక్ -
రోజూ 0.02 టీఎంసీలు అవసరం
మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీల నీరు అవసరం. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒకసారి రిజర్వాయర్ను నింపితే.. దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. అయితే వేసవిలో ఎల్లూరు రిజర్వాయర్లో ఉన్న నీటి నిల్వ ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుజాగ్రత్తగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీలకు పైగా నీటిని నిల్వచేసి ఉంచారు. ఈ నీటిని మిషన్ భగీరథకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నపుతండా వద్ద రూ. 10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెగ్యులేటరీ సిస్టమ్ పనులు కూడా తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే ఇకనుంచి రెగ్యులర్గా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే మిషన్ భగీరథకు నీటిని సరఫరా చేయవచ్చు. ఇది అమలైతే కేఎల్ఐ ప్రాజెక్టుపై ఇన్నాళ్ల నుంచి పడుతున్న ఒత్తిడి తగ్గుతోంది. -
కురుమూర్తిస్వామి సేవ కోసం అమ్మాపురంలో మకాం
గోపాల్పేట: గోపాల్పేట సంస్థానం 19వ శతాబ్దంలో ఏర్పాటైంది. గోపాల్పేట సంస్థానం రాణి రంగనాయకమ్మ తన భర్త గోపాల్రావు పేరుమీద గోపాల్పేట అనే పేరు పెట్టారు. ఇక్కడి సంస్థానంతో వనపర్తి సంస్థానాధీశులకు సంబంధాలు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. గోపాల్పేట సంస్థానం పరిధిలో 12 గ్రామాలు ఉండగా.. రాణి రంగనాయకమ్మ గ్రామంలో వేలాది మందికి అన్నదానాలు చేసేవారు. చిన్నచింతకుంట: అమ్మాపురం అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చ.కి.మీ., విస్తీర్ణంలో కలిగి ఉన్న అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీద్తో పా టు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి. -
డీలిమిటేషన్ను మహిళా బిల్లుతో లింక్ పెట్టడం సరికాదు
● రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేషన్ మహబూబ్నగర్: డీలిమిటేషన్ బిల్లును మహిళా బిల్లుతో లింక్పెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచారని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్వీస్ బాదుడు..
● ఈ నెల మొదటి తేదీ నుంచే అమలులోకి.. ● గతంలో కన్నా ఒక్కో సర్టిఫికెట్పై 75 శాతం వరకు పెంపు ● అదనపు రుసుంతో పేదలు, రైతులపై పడనున్న భారం ●మీసేవ కేంద్రాల సేవలపై భారీగా చార్జీలు పెంచిన ప్రభుత్వం మీసేవ కేంద్రాలలో ప్రభుత్వం అమాంతం సర్వీస్ చార్జీలను పెంచడం సరికాదు. ఒక్కో సేవపై సుమారు రూ.10 పెంచిన ఇబ్బందులు ఉండేవి కావు. ఒకేసారి సర్వీస్ చార్జీలను సేవను బట్టి సుమారు 70– 80 శాతం పెంచడం మంచి పరిణామం కాదు. సర్వీస్ చార్జీల పెంపుపై ప్రభుత్వం మరోమారు పునరాలోచించాలి. – సాయిప్రసాద్, కల్వకుర్తి ప్రభుత్వం ఈ నెల మొదటి రోజు నుంచే మీసేవల ద్వారా అందించే సేవల రుసుంను పెంచింది. పెంచిన ధరల సమయంలో సర్వర్ సరిగా లేకున్నా.. ప్రస్తుతం మెరుగుపడింది. ప్రజలు కూడా పెరిగిన సర్వీస్ చార్జీలను అర్థం చేసుకొని సేవలు పొందుతున్నారు. నూతనంగా పెరిగిన రుసుంల పట్టికను కేంద్రాలలో ఏర్పాటు చేశాం. – ఆంజనేయులు, మీ సేవ నిర్వాహకుడు, కల్వకుర్తి మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు సంబంధించి రుసుంలు పెరిగాయి. పెరిగిన ధరలను ఆయా మీసేవా కేంద్రాల నిర్వాహకులు బోర్డులలో ప్రదర్శించారు. పెరిగిన ధరలకు ఏమైనా అధికంగా వసూలు చేస్తే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. – అమరేందర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కల్వకుర్తి టౌన్: కుల, ఆదాయ సర్టిఫికెట్లు కావాలంటే తప్పనిసరిగా మీ–సేవకు వెళ్తేనే పని అవుతుంది. పేదలు, రైతులకు సంబంధించి చాలా పనులకు ముడిపడి ఉన్న మీసేవ కేంద్రాల సర్వీస్ చార్జీలను ప్రభుత్వం అమాంతం పెంచింది. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సేవలకు అందించే మీసేవ కేంద్రా ల్లో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు ఈ నెల మొదటి తేదీ ను ంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన చార్జీల వల్ల రైతు లు, సామాన్య ప్రజలపై అధిక భారం పడుతోంది. జిల్లాలో 139 మీసేవ కేంద్రాలు ఉండగా.. వాటిలో ప్రతినిత్యం ఒక్కో సెంటర్ ద్వారా సుమారు 250 నుంచి 300 సేవలు వివిధ రూపాల్లో ప్రజలకు అందుతున్నాయి. ఇందులో అత్యధికంగా పేద ప్రజలకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవేకాక ప్రభుత్వం అందించే పలు పథకాల నమోదు కోసం మీసేవ కేంద్రాలను ప్రజల ఆశ్రయిస్తుంటారు. దీంతో మీసేవ చార్జీలు గణనీయంగా ఒకేసారి 75 శాతం పెంచడంతో ప్రజలకు కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. సర్వీస్ చార్జీల పెంపునకు ముందు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం రూ.45 రుసుం ఉండగా.. ప్రస్తుతం పెంచిన చార్జీలతో ఆ రుసుం రూ.80కి చేరింది. ఇదిలా ఉంటే.. గతంలో సర్వీస్ చార్జికి అదనంగా రుసుంను వసూలు చేశాయని, సంబంధిత అధికారులు మీసేవలను కొన్ని రోజులు సస్పెన్షన్లో పెట్టిన సందర్భాలు లేకపోలేదు. మీసేవ కేంద్రాలలో అందించే సేవలను ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరి సేవల కింద (పహాణి, ఈ–కేవైసీ, తక్షణ సేవలు) గతంలో కనీస చార్జి రూ.35 ఉండగా.. దానిని ప్రస్తుతం రూ.62కు పెంచారు. బీ కేటగిరి కింద మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయ్యే సేవల (కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు) చార్జీలు గతంలో రూ.45 ఉండగా దానిని ప్రస్తుతం రూ.80గా నిర్ధారించారు. ధ్రువపత్రం ప్రస్తుతం సర్వీస్ ధర (రూ.లలో..) ఆదాయం 80 కులం 80 నివాసం (రెసిడెన్సీ) 80 రేషన్ కార్డు 80 భూభారతి ఈ–కేవైసీ 80 కొత్త విద్యుత్ కనెక్షన్ 80 క్రిమీ, నాన్ క్రిమీలేయర్ 80 ఈసీ 62 ఫార్మర్ రిజిస్ట్రేషన్ 18 కోర్టు కేసు ఈ–కేవైసీ 62 బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ 62 ఈ–పాస్ బయోమెట్రిక్ 35 త్రైమాసిన పన్ను 62 లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ 62 మీసేవ కేంద్రాలలో ప్రభుత్వం పెంచిన సర్వీస్ చార్జీల పట్టిక నూతన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిత్యం అవసరం పడే రైతులకు అదనపు చార్జీల భారంతో కొంత ఇబ్బందులు ఎదురవనున్నాయి. అమాంతం ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో చార్జీలు పెంచడంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అంబేడ్కర్ యూనివర్సిటీ ఈసీ మెంబర్గా వేణుగోపాల్రెడ్డి
అచ్చంపేట/ ఉప్పునుంతల: జిల్లాలోని ఉప్పనుంతల మండలం కొరటికల్ గ్రామానికి చెందిన విద్యావంతుడు, జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు బోదనపల్లి వేణుగోపాల్రెడ్డి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యుడిగా నియామకం అయ్యారు. యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులుగా నలుగురు నియామకం కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున టీ–శాట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేణుగోపాల్రెడ్డిని ఎంపిక చేశారు. మారుమూల గ్రామమైన కొరటికల్లోని వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణుగోపాల్రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకై న పాత్ర పోషిస్తూ.. జర్నలిస్టుగా, ఉద్యమనాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నాయకత్వంలో అనుక్షణం చురుకుగా ఉంటూ ప్రజాపాలనలో భాగస్వాములవుతూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా తనను ఈసీ మెంబర్గా నియమించేందుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డికి వేణుగోపాల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వేణుగోపాల్రెడ్డి ఈసీ మెంబర్గా ఎంపిక కావడంతో గ్రామంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నేటి ప్రవేశ పరీక్షకు సకాలంలో చేరుకోవాలి నాగర్కర్నూల్ క్రైం: ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని డీఈఓ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని కోరారు. 30న కంటి వైద్య శిబిరం నాగర్కర్నూల్ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో ఈ నెల 30న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ ఆఫీసర్ కొట్ర బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పాత కలెక్టరేట్లోని రూం నం.102లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ల కోసం లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్కార్డుతోపాటు షుగర్, బీపీ పరీక్షల రిపోర్టు తీసుకురావాలని కోరారు. పూర్తి వివరాలకు సెల్ నం.94408 76556ను సంప్రదించాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు ప్రత్యేక చికిత్స వార్డు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తలుగుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 బెడ్లతో వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ఉషారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బ రోగులకు ఆస్పత్రిలో వైద్యసేవలు అందించేందుకు ఆక్సిజన్, అవసరమైన మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయని, రోగులు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనరల్ ఆస్పత్రి ఫిజీషియన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సూర్యనారాయణ, వైద్య సిబ్బంది వడదెబ్బ రోగులకు ప్రత్యేక ఆరోగ్య సేవలు అందిస్తారని ఆమె చెప్పారు. వట్టెం నవోదయలో వందశాతం ఉత్తీర్ణత కందనూలు: మండలంలోని వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపల్ బాలాజీనాయక్ తెలిపారు. శనివారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 97 శాతంపైగా మార్కులతో సింధూజరాణి విద్యాలయ మొదటి ర్యాంకు సాధించగా.. లిఖిత 96 శాతంపైగా మా ర్కులతో రెండోస్థానం సాధించిందని వివరించారు. విద్యార్థులు మెరుగైన సత్ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. -
పకడ్బందీగా సంక్షేమ వారోత్సవాల నిర్వహణ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, వసతి గృహాల వార్డెన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, కార్యక్రమాల అమలు, బాధ్యతల విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు. ప్రతి శాఖ తమ పరిధిలోని కార్యక్రమాలను సమయపాలనతో అమలు చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని, వివిధ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వార్డెన్లతో నేరుగా చర్చించినట్లు వివరించారు. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోవడం గమనించి.. అదనపు వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. ఈ నెల 20న జిల్లాస్థాయిలో సమావేశం నిర్వహించి వివిధ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. 21న వసతి గృహాల్లో చదివి వెళ్లిన పూర్వ విద్యార్థులకు మండల స్థాయిలో కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 22న వసతి గృహాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, తాగునీటి సౌకర్యం, విద్యుత్, సీసీ కెమెరాల ఏర్పాటు, పెయింటింగ్, మరుగుదొడ్ల మరమ్మతు వంటి పనులను వేగవంతంగా పూర్తిచేస్తామన్నారు. 23న సంక్షేమ గురుకుల పాఠశాలల్లో తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి, సమస్యలపై చర్చ, 24న ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, 25న జిల్లాస్థాయిలో అచ్చంపేట వద్ద వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం, 26న మండల స్థాయిలో పెద్ద గ్రామ పంచాయతీలలో బడిబాటపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, విద్యార్థుల చేరికలు పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖల అధికారులు ఉమాపతి, ఫిరంగి, యాదగిరి, డీఈఓ రమేష్కుమార్, డీపీఓ శ్రీరాములు, డీఆర్డీఓ చిన్న ఓబులేసు పాల్గొన్నారు. -
రాజసానికి చిహ్నం
కొల్లాపూర్: జటప్రోల్ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్, చంద్రమహల్, రాణిమహల్గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది. వనపర్తి రాంసాగర్ రాజమహాల్ -
జనగణన బాధ్యతగా నిర్వహించాలి
కందనూలు (తాడూరు): జిల్లాలో జనగణన సర్వేను బాధ్యతగా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో మొత్తం 36 మంది ఎన్యూమరేటర్లుగా వ్యవహరిస్తున్న అందరికీ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జనాభా సర్వే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కానీ, ఈసారి జనాభా సర్వే కొంత ఆలస్యంగా మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో సంబంధిత సిబ్బంది పూర్తి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించా రు. తహసీల్దార్ రామకృష్ణయ్య, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంఈఓ త్యాగరాజుగౌడ్ పాల్గొన్నారు. -
మట్టితో కోట నిర్మాణం..
గద్వాల: గద్వాల కోట 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. గద్వాల సంస్థానం 17వ శతాబ్దం (1663– 1670)లో నల్లసోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) పూడూరు కేంద్రంగా గద్వాల కోట నిర్మించారు. కర్ణాటక సరిహద్దులోని రాయచూరు, రాయలసీమలోని నందికొట్కూరు వరకు పాలన చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోట నిర్మాణం మొత్తం మట్టితో నిర్మించడం ప్రత్యేకత. దీని లోపల అద్భుతమైన శిల్పకళతో కూడిన చెన్నకేశవస్వామి ఆలయం, ఆలయం ఎదుట 90 అడుగుల గాలిగోపురం నిర్మించారు. కృష్ణానది, తుంగభద్ర నదుల మ ధ్య గద్వాలలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మి ంచిన కోట చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం ఉంది. ఈ కోట వలయాకారంలో నిర్మించగా.. లోపలి వైపు రాతి తో కూడిన గోడ కట్టారు. కోటలోపల కందకం, బావి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోటలో ప్రముఖ నటుడు చిరంజీవి కొండవీటిరాజా సినిమాను నిర్మించారు. -
సమస్యలు పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల ఆందోళన
కందనూలు: విశ్రాంత, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నాన్ గెజిటెడ్, విశ్రాంత ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, వేతన సవరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దుపరిచి ఓపీఎస్ అమలు వంటి ప్రధాన సమస్యలతోపాటు తదితర అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు యుగంధర్రెడ్డి, శ్రీనివాసులు, నర్సయ్య, బాలస్వామి, శ్రీనివాసులు, పాండురంగయ్య, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి నిర్మాణం నాణ్యతగా చేపట్టాలి
వెల్దండ: మండలంలోని గాన్గట్టుతండా వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిని నాణ్యతగా, గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర క్వాలిటీ పర్యవేక్షణ అధికారి షేక్ ఇమామ్ అన్నారు. శుక్రవారం ఆయన గాన్గట్టుతండా రోడ్డులో నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించి.. నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.15 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. వాగుపై వంతెన పొడవు 97.44 మీటర్లు ఉండగా ఇందులో 9 కనాలు వచ్చే విధంగా డిజైన్ చేశామని, ఇప్పటి వరకు మూడు కనాలకు స్లాబ్ వేసినట్లు అధికారులు చెప్పారు. ఐదు సంవత్సరాల వరకు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 13న మొదటి కనాలకు స్లాబ్ వేశామని, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నీటిని సక్రమంగా పట్టాలని సూచించారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న వంతెన పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక, సిమెంట్, ఇనుము ఏ సైజు రాడులను వేస్తున్నారని పూర్తి వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో కల్వకుర్తి డీఈఈ బస్వలింగం, ఏఈ సురేందర్రెడ్డి, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతులకు ప్రోత్సాహం
వనపర్తి: మామిడి రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, నాణ్యమైన ఉత్పత్తులను ప్రోత్సహించడం ‘అమ్మకందారులు.. కొనుగోలుదారులు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మామిడి పంటకు సంబంధించి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఉద్యానశాఖ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల అభివృద్ధి సంస్థ, ఎన్హెచ్బీ, ప్రసాద్ సీడ్స్ సంస్థ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన 140 మంది రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రదర్శించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వాటిని పరిశీలించి రైతులతో మాట్లాడి పండ్ల ప్రత్యేకతను తెలుసుకోవడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వ్యాపారులు మామిడి రైతుల వద్దకే వచ్చి మంచి ధరకు పండ్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి చక్కటి అవకాశమని.. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. మామిడి రైతులకు కవర్లు అందజేయడం గొప్ప విషయమని, ఇంకా ఎవరికై నా ఇవ్వకపోతే వెంటనే అందజేయాలని సూచించారు. మొత్తం 12 మంది వ్యాపారులు పాల్గొని 40 మంది రైతుల నుంచి 250 టన్నుల మామిడిపండ్ల ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఉద్యానశాఖ జేడీ బాబు, డీహెచ్ఎస్ఓ విజయభాస్కర్, ఏపీ ఎగుమతిదారుల అభివృద్ధి సంస్థ ఏపీఎం ఆర్బీ నాయుడు, ప్రసాద్ సీడ్స్ సీఈఓ విజయభాస్కర్, శాస్త్రవేత్త వెంకటలక్ష్మి, రవి, లక్ష్మి, ఏడీలు పద్మనాభం, జయరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీ, అగ్రిమెంట్ తప్పనిసరి.. మిల్లులకు ధాన్యం కేటాయించాలంటే 10 శాతం బ్యాంకు గ్యారెంటీతో పాటు అగ్రిమెంట్ తప్పనిసరి అని కలెక్టర్ ఆదర్శ సురభి మిల్లర్లకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రూ.కోట్ల వరి ధాన్యం మిల్లులకు అడ్వాన్సుగా ఇస్తుందని.. కేటాయించిన ధాన్యంలో 10 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు. -
వరిధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దు
కందనూలు: రబీ సీజన్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సేకరించడంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వరి కొనుగోళ్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ధాన్యం సేకరణ గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, నిల్వల వద్ద ఆలస్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ పంటకు న్యాయమైన ధర పొందేలా ప్రభుత్వం చేపట్టిన వరి కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలన్నారు. రవాణా ప్రక్రియ వేగవంతం చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లు నిర్దేశించిన సంఖ్యలో వాహనాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించేలా ట్రాన్స్పోర్టు వ్యవస్థను బలోపేతం, ప్రతి సెక్టార్కు 25 లారీలు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. వాహనాల కొరత కారణంగా ధాన్యం తరలింపులో జాప్యం జరిగితే సంబంధిత ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులకు వసతులు కల్పించాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గడువులోగా పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని హౌసింగ్బోర్డు కాలనీలో పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి.. పనుల్లో ఆలస్యం లేకుండా గడువులోగా పూర్తిచేయాలని, నాణ్యత, వేగం, లబ్ధిదారుల అవసరాల తీరు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించి, ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన గృహం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, హౌసి ంగ్, మున్సిపల్ శాఖల అధికారులు ఉన్నారు. -
బీసీలు 54.82%
నాగర్కర్నూల్● కులాల వారీగా జనాభా మొత్తం 37.01 లక్షలు ● ఇందులో బీసీలు 20,29,001 మంది ● బీసీల్లో ముదిరాజ్లు, ఎస్సీల్లో మాదిగలదే అగ్రస్థానం ● గద్వాల, వనపర్తిలో ప్రభావిత వర్గాలుగా వాల్మీకి బోయలు ● కందనూలులో చెంచుజనాభా 9 వేలకే పరిమితం ● రాష్ట్ర సామాజిక, ఆర్థిక, కులగణన రిపోర్ట్లో వెల్లడి తుది సమావేశం.. జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గానికి మే నెల 6న గడువు ముగియనుండగా చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026–8లో uఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో మెజార్టీ వర్గాలు ఓసీల్లో రెడ్డిలదే ఆధిపత్యం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓసీ జనాభా 2,97,406 మంది కాగా, 8.03 శాతంగా నమోదైంది. ఓసీల్లో మెజార్టీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిలో నారాయణపేటలో అత్యధికంగా 69.19 శాతం, వనపర్తిలో 66.84 శాతం, జోగుళాంబ గద్వాలలో 63.30 శాతం, నాగర్కర్నూల్లో 61.06 శాతం, మహబూబ్నగర్లో 52.40శాతం రెడ్డి జనాభా ఉంది. ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం తర్వాత వైశ్యులు ప్రభావిత వర్గంగా ఉన్నారు. ప్రధానంగా నాగర్కర్నూల్లో 15.69 శాతం, వనపర్తిలో 13.86 శాతం వైశ్యుల జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లా.. సామాజికవర్గం జనాభా మాదిగ (ఎస్సీ) 1,04,613 మాల (ఎస్సీ) 16,873 బంజార(ఎస్టీ) 1,12,127 ముదిరాజ్ (బీసీ) 1,34,794 యాదవ(బీసీ) 94,144 రెడ్డి(ఓసీ) 44,825 నాగర్కర్నూల్ జిల్లా మాదిగ (ఎస్సీ) 1,26,990 మాల (ఎస్సీ) 56,426 బంజార(ఎస్టీ) 96,053 ఎరుకల(ఎస్టీ) 8,073 చెంచు(ఎస్టీ) 8,739 ముదిరాజ్(బీసీ) 95,079 రెడ్డి(ఓసీ) 47,021 వైశ్య(ఓసీ) 12,083 వనపర్తి జిల్లా మాదిగ(ఎస్సీ) 91,157 మదాసికురువ(ఎస్సీ) 8,076 మాల(ఎస్సీ) 5,703 బంజార(ఎస్టీ) 48,978 ఎరుకల (ఎస్టీ) 5,373 వాల్మీకిబోయ(బీసీ) 79,364 ముదిరాజ్(బీసీ) 65,605 యాదవ(బీసీ) 79,140 రెడ్డి(ఓసీ) 34,319 వైశ్య(ఓసీ) 7,114 ఎస్సీల్లో 70 శాతానికి మించి మాదిగలే.. ఉమ్మడి జిల్లాలో బీసీల తర్వాత 20.09 శాతంతో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉండగా, ఇందులో సింహభాగం 70 శాతానికి మించి మాదిగలే ఉన్నారు. ఎస్సీల్లో వీరి జనాభా అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 83.13 శాతం, వనపర్తిలో 78.86 శాతం, మహబూబ్నగర్లో 71.88 శాతం, నారాయణపేటలో 71.18 శాతం, నాగర్కర్నూల్లో 62.41 శాతం ఉంది. నాగర్కర్నూల్ జిల్లాలో మాలల జనాభా అత్యధికంగా 27.73 శాతం ఉంది. ఎస్సీల్లో మాదాసికురువల జనాభా నారాయణపేటలో అత్యధికంగా 10.75 శాతం, గద్వాలలో 5.61 శాతం నమోదైంది. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఉన్న సామాజికవర్గాల జనాభా లెక్కలు తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే వివరాలను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా జనాభా 37,01,072 మంది కాగా.. అందులో అత్యధికంగా 20,29,001 మంది బీసీలు ఉండడం విశేషం. మొత్తం జనాభాలో బీసీలదే 54.82శాతం ఉన్నట్లు తేలింది. మిగిలిన వర్గాల్లో 20.09 శాతంతో 7,43,606 మంది ఎస్సీ జనాభా ఉండగా, 9.37 శాతంతో 3,42,055 మంది ఎస్టీ జనాభా ఉంది. ఓసీల జనాభా 2,97,408 మందితో 8.03 శాతం కాగా, మైనార్టీల జనాభా 2,89,004 మందితో 7.80 శాతంగా తేలింది. బీసీల్లో ముది‘రాజులు’.. ఉమ్మడి జిల్లాలోని జనాభాలో సింహభాగం బీసీలే కాగా, ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం బీసీ జనాభా 20,29,001 కాగా, వీరి శాతం మొత్తం జనాభాలో సగానికి మించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముదిరాజుల ప్రాబల్యమే ఎక్కువగా ఉండగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 36.03 శాతం ఉండటం గమనార్హం. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 22.92 శాతం, నాగర్కర్నూల్లో 20.37 శాతం, వనపర్తి జిల్లాలో 17.35 శాతం ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వాల్మీకి బోయ, కురుమ, యాదవ కులాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో కులాల వారీగా జనాభా.. జిల్లా ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం బీసీలు శాతం ఓసీలు శాతం ముస్లిం శాతం మహబూబ్నగర్ 1,45,543 15.46 1,22,358 12.99 4,76,910 50.65 85,550 9.09 1,11290 11.82 నాగర్కర్నూల్ 2,03,470 23.61 1,14,503 13.29 4,21,022 48.86 77,004 8.94 45,676 5.30 వనపర్తి 1,15,594 19.22 56,365 9.37 3,46,031 57.54 51,342 8.54 32,032 5.33 జోగుళాంబగద్వాల 1,51,075 22.66 12,141 1.82 4,11,783 61.76 41,749 6.26 49,992 9.51 నారాయణపేట 1,27,924 20.32 36,688 5.83 3,73,255 59.28 41,761 6.63 50,014 7.94 మొత్తం 7,43,606 20.09 3,42,055 9.37 20,29,001 54.82 2,97,408 8.03 2,89,004 7.80 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తేలిన లెక్కలు -
వృద్ధులకు భరోసా..
● బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ● నిర్లక్ష్యం చేస్తే వేతనం నుంచి 15 శాతం కోత ● బాధితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసేలా చట్టం ●అచ్చంపేట: కనిపెంచి.. పెద్దచేసి.. ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసిన తల్లిదండ్రుల పట్ల కొందరు సంతానం చివరాంకంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోషణ బాధ్యతల నుంచి తప్పించుకుని ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. కారణాలు ఏదైనా తల్లిదండ్రులను దూరం పెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి మెట్లు ఎక్కుతున్న ఇలాంటి బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. తమ కొడుకులు పోషించడం లేదని, మలి వయస్సులో ఆసరాగా ఉండటం లేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్టు యాక్ట్–2026(టీఈఏఎంపీఎస్) బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదించింది. ఇది పిల్లల చేత నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులకు అండగా నిలువనుంది. బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను కలిసే వెసులుబాటు కూడా కల్పించారు. తల్లిదండ్రులను పోషించే బాధ్యత పూర్తిగా పిల్లలదే. వారు పట్టించుకోకపోతే నిర్భయంగా 14567 హెల్ప్లైన్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. -
1,150 సీసీ సాసర్ల ఏర్పాటు
నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఐసీఐసీ ఫౌండేషన్ నుంచి 5 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకులను ఉచితంగా అందజేయగా కొన్ని రేంజ్ల పరిధిలో నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో అత్యధికంగా సాసర్ల ద్వారా నీటిని అందించేవారు. దీంతో ట్రాక్టర్ శబ్దానికి వన్యప్రాణులు భయపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి కొంత మేర తగ్గించి సహజ వనరులపై దృష్టి సారించారు. నిఘా ఉంచేందుకు ఒక్కో సాపర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలి
నాగర్కర్నూల్ క్రైం: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుందని, కంటిచూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం చేయగలుగుతామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్– అలైవ్ కార్యక్రమంలో జిల్లా పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఆటోడ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, ఇతర వాహనదారులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి కూడా రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కంటిచూపు సరిగా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతిఒక్కరు కంటిచూపుపై జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంటిచూపు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమని, ముఖ్యంగా వాహనదారులు ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారు కళ్లద్దాలు ఉపయోగించాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలను పాటించడం అత్యంత అవసరమని, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, వాహన వేగ నియంత్రణ, మద్యం తాగి డ్రైవింగ్ చేయకపోవడం వంటి ప్రాథమిక భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ రవికుమార్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న కొనాలని రైతుల ఆందోళన
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డులో అధికారులు మొక్కజొన్న పంట కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న అచ్చంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ విషయమై రైతులు మాట్లాడుతూ దాదాపు ఐదు రోజులుగా మార్కెట్ యార్డులోనే మొక్కజొన్న ధాన్యాన్ని పోసుకొని పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత ఉందంటూ కుంటి సాకులు చెబుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దళారులు చూపించిన వ్యక్తులకే సంచులు ఇచ్చి వారి ధాన్యాన్ని చేస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా లారీల్లోకి ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దళారులు గద్దల్లా వాలిపోయి తమ మొక్కజొన్నను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా పొలానికి మొక్కజొన్న దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ ఒక్కో ఎకరాకు తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. ఆన్లైన్ పోర్టల్ నమోదు, వ్యవసాయ శాఖ అనుమతి పత్రాలు, మార్క్ఫెడ్ వద్ద వేలిముద్రలు వంటి ప్రక్రియలతో రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. తీరా గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. వర్షపు చినుకు పడితే తమ కష్టార్జితం పూర్తిగా వర్షంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోనే మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అధికంగా మొక్కజొన్న ఉన్న గ్రామాలకు నేరుగా లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. -
హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ
జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ బెక్లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
‘చమ్మగిల్లిన’ఖాన్దొడ్డి..!
ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన ఘటనను తలుచుకుని ఆందోళన నీటికుంటలో నీరు తాగుతున్న అటవీ జంతువులు (ఫైల్)ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఈ స్థలం మాది, ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలి. మా పెద్దల నుంచి ఇప్పటి పిల్లల దాకా ఇక్కడే పుట్టి పెరిగాం. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. – ఆంజనేయులు, చమన్ఖాన్దొడ్డి మా తాతలకాలం నుంచి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాం. ఇప్పుడు ఎవరో వచ్చి.. ఈ జాగ మాది.. ఖాళీ చేయాల్సిందే అంటే మేం ఎక్కడికి పోవాలి. ఇదే జాగలో కొత్తగా ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాం. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా. మాకు న్యాయం చేయాలి. మేం ఎక్కడికి పోం. ఇక్కడే ఉంటాం. – మల్లేష్, చమన్ఖాన్దొడ్డి మల్లంపల్లి గ్రామ పంచాయతీ శివారుగా ఉన్న చమన్ఖాన్దొడ్డి సుమారు ఏడేళ్ల క్రితం పంచాయతీగా అవతరించింది. సుమారు 200 కుటుంబాలు, 450 మంది ఓటర్లు గ్రామంలో ఉన్నారు. గ్రామం మధ్యలో ఇందువాసి, బోయలగూడెం గ్రామానికి రోడ్డు వెళ్తుంది. పడమట దిక్కున ఉన్న సర్వే నం.129లో 11.02 ఎకరాల పొలంలో ఇళ్లను అక్రమంగా నిర్మించుకున్నారని, ఇది పట్టా భూమి అని భూ యజమానులు అయిన ఖాసీంసాబ్, మదర్సాబ్, నబీసాబ్లు గద్వాల సీనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు భూ యజమానులకు అనుకూలంగా వచ్చింది. అయితే ఈ భూమిలో ఇది వరకే ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంకు, నల్లా కనెక్షన్లు, సీసీ రోడ్డు, బ్రహ్మంగారి గుడి, వాల్మీకి, కనకదాసు, దర్గా, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నట్లు చమన్ఖాన్దొడ్డి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ గ్రామాన్ని వదులుకోమని తెగేసి చెబుతున్నారు. గట్టు: ఊరి కోసం ఊరంతా ఏకమయ్యారు.. ఊరిని ఖాళీ చేయించేందుకు వచ్చిన వారిని గట్టిగానే ప్రతిఘటించారు. కానీ, ఎప్పుడు ఎవరు వచ్చి తమను ఖాళీ చేయిస్తారోనని చమ్మగిల్లిన కళ్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని మండలంలోని చమన్ఖాన్దొడ్డి గ్రామస్తులు. గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది, యజమానుల తరపున వచ్చిన బంధువులను ఘటన గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి కొత్తగా ఎవరు వచ్చినా గ్రామస్తులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. బుధవారం కోర్టు ఉత్తర్వులతో కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామానికి చేరుకుని గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నించిన సంఘటన ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. గ్రామస్తులంతా కలిసి కోర్టు సిబ్బందితోపాటు భూ యజమానులుగా చెప్పుకొంటున్న బంధువులపై రాళ్లు, రప్పలు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే గ్రామంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనను తలుచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న తాము ఇప్పుడు ఉన్నదంతా వదిలి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా బతకాలని ఆందోళన చెందుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. వీడని ఉత్కంఠ కొత్తగా ఎవరు వచ్చినా ఉలిక్కిపడుతున్న వైనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరిని మాత్రం వదులుకోమని ప్రతిన పరస్పర ఫిర్యాదులతో గ్రామస్తులు.. భూ యజమాని, బంధువులపై కేసుల నమోదు కోర్టు ఉత్తర్వులతో చమన్ఖాన్దొడ్డి గ్రామానికి వెళ్లిన కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామస్తులు కొట్టడం, విధులకు ఆటంకం కలిగించడం, భయబ్రాంతులకు గురి చేసిన ఘటనపై కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చమన్ఖాన్దొడ్డి గ్రామానికి చెందిన 8 మందితోపాటు మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. తమ ఇళ్లను కూలగొట్టడానికి వచ్చిన భూమి యజమాని బంధువులపై గ్రామానికి చెందిన పూజారి భీమయ్య ఫిర్యాదు చేయగా, భూమి యజమానులతోపాటు వారి బంధువులు 8 మందితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ చెప్పారు. -
కేజీబీవీల నిర్వహణలో అలసత్వం వహించొద్దు
తిమ్మాజిపేట: జిల్లాలోని కేజీబీవీల నిర్వహణలో సిబ్బంది ఎలాంటి అలసత్వం వహించొద్దని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. గురువారం ఆయన తిమ్మాజిపేటలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాలయం నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు పనిచేయాలని పిలుపునిచ్చారు. భోజన నాణ్యతలో రాజీ లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్జేడీ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కేజీబీవీకి 10 కంప్యూటర్ టేబుళ్లను అందజేసి.. ల్యాబ్ను ప్రారంభించారు. పాఠశాలలో వసతులను పరిశీలించి.. వంట గదులను తనిఖీ చేశారు. ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం సక్రమంగా అందుతుందా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఉండే సౌకర్యాలు తాగునీరు, విద్యాబోధన, పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
మామిడి క్లస్టర్తో మేలు
మూడేళ్ల క్రితం పాలమూరును క్లస్టర్గా ఎంపిక చేసిన కేంద్రం ● ఎగుమతులకు ఉపయోగపడే మామిడి ఉత్పత్తి కోసం రూ.200 కోట్ల కేటాయింపు ● నాలుగేళ్లపాటు ప్రణాళికబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయం ● నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేస్తున్న రైతాంగం కొల్లాపూర్: నాణ్యమైన ఉత్పత్తులు.. ఎగుమతులకు అనుకూలమైన పంటల సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ విధానం మామిడి రైతులకు ఉపయోగకరంగా మారింది. మామిడి సాగుకు ప్రసిద్ధిగాంచిన గుజరాత్ రాష్ట్రంలోని కచ్, ఉత్తర్ప్రదేశ్లో లక్నో, తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలను మూడేళ్ల క్రితం కేంద్రం క్లస్టర్ జోన్లుగా గుర్తించింది. పాలమూరు క్లస్టర్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి ఉండగా.. క్లస్టర్ సేవల్లో భాగంగా జిల్లాకు రూ.200 కోట్లు కేటాయించింది. నాలుగేళ్ల పాటు ప్రణాళికాబద్ధంగా నిధుల విడుదలకు నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 62,612 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా సాగు చేపట్టారు. అత్యధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 31,728 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో పంట కాపు వచ్చే తోటలు 30 వేల ఎకరాల మేరకు ఉన్నాయి. సురభి సంస్థానాధీశుల కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే బేనిషాన్ రకం మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బేనిషాన్ రకం మామిడికి జాతీయస్థాయి గుర్తింపు కూడా ఉంది. బేనిషాన్తోపాటు హిమాయత్, దెషేరీ, కలెక్టర్, బంగారు, జహంగీర్ పసంద్, మోతిమోనీ పసంద్, చిన్నరసాలు, పెద్దరసాలు, మల్గుబా వంటి నోరూరించే మామిడి పండ్లు ఇక్కడ పండుతాయి. క్లసర్ ద్వారా ప్రోత్సాహకాలు.. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాధ్యతలను గ్రాండ్ కార్టన్ కంపెనీ, ప్రసాద్ సీడ్స్ కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మామిడి సాగు విధానాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సబ్సిడీపై పేపర్ కవర్లు ఇస్తున్నారు. కాయలు కత్తిరించేందుకు, కొమ్మలు నరికేందుకు అవసరమైన సామగ్రిని ఇస్తున్నారు. డ్రిప్ సౌకర్యం, క్లయిమింగ్ ల్యాడర్స్, దపోలి హార్వెస్టర్ పరికరాల పంపిణీ, పండ్లు మాగ బెట్టేందుకు అవసరమైన వసతులను స్థానికంగా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. క్లస్టర్ పరిధిలోని మొత్తం 62 వేల ఎకరాల రైతులందరికీ ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ పథకం కింద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ లైనింగ్ పనులు జరుగుతుండగా.. మిగతావన్నీ పూర్తయ్యాయి. దీని నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు లేదా మామిడి రైతులకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గ్రేడింగ్ వారీగా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతులు చేసేందుకు వీలుంటుంది. పెద్దకొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ బాధ్యతలను మామిడి సాగు చేస్తున్న రైతులకే అప్పగించాలి. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు రెగ్యులర్గా వివరించాలి. దీంతో ఎగుమతులకు ఉపయోగపడేలా మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. క్లస్టర్ ఏజెన్సీ ద్వారా అందుతున్న సహకారంతో నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. – శ్రీనివాసులు, మామిడి రైతు, కొల్లాపూర్ కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్రం మన ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్గా గుర్తించడం వల్ల మామిడి సాగుకు అవసరమైన వసతి, సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. మన మామిడి మంచి రంగు, రుచి, వాసన కలిగి ఉంటుంది. నాణ్యతలో ఇది బెటర్గా ఉంది. ఈ ఏడాది క్లస్టర్ ఏజెన్సీలో ఆశించిన ఫలితాలు వచ్చాయి. – లక్ష్మణ్, ఉద్యాన అధికారి, కొల్లాపూర్ -
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
నాగర్కర్నూల్ క్రైం: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్.. అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారుల గుండా అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటుందన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువత మృతి చెందుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి, రాంగ్ రూట్లో వాహనాలను నడపొద్దన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు విధిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్కుమార్, ఎస్లు గోవర్ధన్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
హిందువులందరూ జాగృతం కావాలి
కందనూలు: హిందూ సమాజం జాగృతం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఆచార్య అభినవ శంకరానందస్వామి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో ధర్మపరిరక్షణ కోసం హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి హిందువు తమ పిల్లలు, కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాగా, సమ్మేళనంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ప్రధాన వక్త భాస్కరయోగి, ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ్చాలక్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి పిడికిళ్ల జంగయ్య, పట్టణ కార్యవహ్ వేముల సురేశ్ పాల్గొన్నారు. -
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ
నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ విమర్శించారు. బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నులను పెద్దఎత్తున వసూలు చేసుకోవడంతో పాటు, ఇక్కడి సంపదను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందన్నారు. అయితే నియోజకవర్గ స్థానాల పెంపు విషయం వచ్చినప్పుడు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేయడానికి కుట్రలు పన్నుతుందన్నారు. ఏకపక్షంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం అన్యాయం జరిగినా రాజకీయాలకు అతీతంగా ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దేశ భవిష్యత్కు మంచిది కాదన్నారు. నియోజకవర్గ స్థానాల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్.ఆనంజీ, మారేడు శివశంకర్, గురప్రు కుర్మయ్య, కొత్త రామస్వామి తదితరులు ఉన్నారు. -
పథకాలను ప్రజలకు వివరించాలి
● అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు అమరేందర్, జీవీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16 నుంచి మండల కేంద్రాల్లో నిర్వహించే సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మండల, గ్రామస్థాయి వరకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని 20 మండలాల కేంద్రాల్లో గ్రామసభలను సమగ్ర ప్రణాళికలతో నిర్వహించి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇచ్చి.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మెరుగైన వసతులు కల్పించాలి.. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందిస్తున్న మెనూ అమలుపై అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందించే మెనూ ప్రకారం భోజనం అందించేందుకు అవసరమైన పదార్థాలు, వంట సామగ్రి సిబ్బంది తదితర అంశాల వారీగా నివేదికలు అందజేయాలని సూచించారు. ఎక్కడైనా మౌలిక సదుపాయాల్లో లోపాలు ఉన్నట్లయితే వెంటనే గుర్తించి.. వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా స్పష్టంచేశారు. వచ్చే విద్యా సంవత్సరం కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్యను అంచనా వేసి, వారికి సరిపడా వసతి, పడకలు, తాగునీటి సదుపాయం, తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని.. విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అదే విధంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా వైద్యపరీక్షలు నిర్వహించాలని తెలిపారు. -
ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
వెల్దండ: ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి చిన్న ఓబులేష్ అన్నారు. సోమవారం వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో 100మందికి పైగా కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం 7గంటలకే పనులకు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్లో కూలీల మస్టర్ నమోదు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ ఈశ్వర్జీ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ కల్వకుర్తి రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి మండలం తర్నికల్లో సోమవారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. ప్రమాదాలను నివారించి.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమంపై అన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నిబంధనలపై రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మి పవన్కుమార్రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అదే విధంగా ప్రధాన రహదారిపై బ్లాక్ స్పాట్లను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీఓ చిన్నబాలు, డీఎస్పీ వెంకట్రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం పాల్గొన్నారు. కందనూలు: త్వరలో చేపట్టే జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరి వీసీ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 85 మున్సిపల్ వార్డుల్లో జనగణన నిర్వహించేందుకు 1,799 మంది ఎన్యూమరేటర్లు, 263 మంది సూపర్వైజర్లును ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుంచి మే 5వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీసీలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కందనూలు: ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దేవసహాయం, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులనుద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో 102 దరఖాస్తులు వచ్చాయని.. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. నిర్భయంగా పోలీసు సేవలు పొందాలి నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపించనున్నట్లు ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఆయన సూచించారు. -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కందనూలు: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సోమవారం 60 కేంద్రాల్లో నిర్వహించిన సాంఘికశాస్త్రం పరీక్షకు 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరు కాగా.. 21మంది గైర్హాజరయ్యారు. 99.80 శాతం హాజరు నమోదైందని డీఈఓ రమేశ్కుమార్ తెలిపారు. మార్చి 14 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన పోలీసు, వైద్యారోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులకు డీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. -
సమన్వయంతో పనిచేయాలి..
ఆర్డీఎస్ అంటే గద్వాల జిల్లాకు ఆయువు. దానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. కెనాల్లో మరమ్మతు చేపట్టి చాలా ఏళ్లు అవుతుంది. ఇలాగే నెమ్మదిగా సాగితే ప్రయోజనం ఏముంటుంది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే వ్యవసాయ సీజన్లోగా మరమ్మతు పూర్తి చేసి రైతులకు సహకరించాలి. – మద్దిలేటి, రైతు, వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు.. పనులు చేసేదే రైతుల కోసం. అలాంటప్పుడు వారికి అనుకూలించేలా చేయాలి. అంతే కానీ కెనాల్లో నీరు ఉన్నప్పుడు, రైతులు సాగులో బిజీగా ఉన్నప్పుడు పనులు చేస్తామంటే దాని వల్ల రైతులకే ఇబ్బంది కలుగుతుంది. 2022లో నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలి. – వడ్డే స్వాములు, రైతు, జిల్లేడుదిన్నె -
ఇంకెన్నాళ్లు.. సాగదీత..?
రాజోళి: ‘దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది ఆర్డీఎస్ కెనాల్ పరిస్థితి. దశాబ్దాల కాలంగా ఆర్డీఎస్లో ఆధునికీకరణ పనులు చేయకపోగా.. దాన్ని ప్రతిపాదనలు పక్కకు పెట్టి మరమ్మతు చేపట్టేందుకు సిద్ధయమ్యారు. ఇందుకోసం 2022లో రూ.11 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ.. కెనాల్ మరింత బలహీనపడిపోతుండటంతో ఈ పనులు ఆర్డీఎస్కు ప్రయోజనకరంగానే మారాయి. కానీ, చేస్తున్న పనులే ఆలస్యమవుతుండటంతో చివరికి ప్రయోజనం ఉండకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కెనాల్ 65వ కి.మీ., నుంచి 145 కి.మీ., వరకు ఈ పనులు చేపట్టేలా ప్లానింగ్ చేశారు. అందులో భాగంగా సిల్ట్ రెన్యువల్, బ్యాకింగ్ వర్క్స్, సీసీ వర్క్, కాంక్రీట్ పనులు, జంగిల్ క్లియరెన్స్ లాంటివి చేయాల్సి ఉంది. కాగా చేపట్టిన పనులు వేగంగా జరగకపోగా.. చేస్తున్న సమయం అనుకూలించడం లేదని రైతులు అంటున్నారు. రూ.11 కోట్లకు గాను ఇప్పటికే రూ.7.20 కోట్ల విలువ చేసే పనులు పూర్తయ్యాయి. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్కు అనుబంధంగా ఉన్న మరో కాంట్రాక్టర్తో అదనంగా మరో రూ.3 కోట్ల పనులు చేపట్టగా.. ఇప్పటికి దాదాపు రూ.2 కోట్ల పనులు చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. చేసే పనులు కూడా వర్షాకాలంలో, పంటల సాగు సమయంలో చేస్తే ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వేసవికాలం కెనాల్లో నీరు కూడా ఉండదని, పంటలు కూడా సాగులో ఉండవని, ఈ సమయంలో పనులు వేగంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. కేవలం మరమ్మతు పనులకే నాలుగేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, ఆధునికీకరణ లాంటి పెద్ద పనులు చేయాలంటే ఇంకెన్నేళ్లు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తుంది. మిగతా పనులు ఎప్పుడు చేపడతారనేది స్పష్టత లేదనే వాదన వినిపిస్తుంది. ఫిబ్రవరి చివరలోనే కెనాల్లో నీరు తగ్గుముఖం పట్టగా.. అప్పటి నుంచే పనులు ప్రారంభించి ఉంటే.. జూన్లో వర్షాలు కురిసే సమయానికి చాలా వరకు పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉండేదని, అది వదిలేసి ఇప్పుడు పనులు చేయకుండా, మళ్లీ సీజన్ ప్రారంభమయ్యాక పనుల పేరుతో కెనాల్లో నీటిని ఆపే చర్యలు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి పనులను వేగంగా చేపట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందించడంతో పాటు పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పనుల్లో వేగం పెరుగుతుందని ఆర్డీఎస్ రైతులు అంటున్నారు. నోటీసులు ఇచ్చాం.. ఆర్డీఎస్ కెనాల్ మరమ్మతు పనులు ఇప్పటికే 65 శాతం పూర్తయ్యాయి. ఇంకా రూ.2 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంది. అయితే పనుల్లో ఆలస్యమవుతుందని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం సాగు సీజన్ కాకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తాం. – శ్రీనివాసులు, ఈఈ, ఆర్డీఎస్ 2022లో ఆర్డీఎస్ మరమ్మతుకు రూ.11 కోట్ల కేటాయింపు నేటి వరకు నత్తనడకనకొనసాగుతున్న పనులు నాలుగేళ్లు గడిచినా 60 శాతమే పూర్తి.. సీజన్ ప్రారంభానికి ముందే చేపట్టాలంటున్న రైతులు ఇప్పటికిప్పుడు మొదలుపెడితేనే పూర్తయ్యే అవకాశం -
కాస్త మెరుగు..
ఒకేషనల్లో 68.37 శాతం.. జిల్లాలో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 68.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం జిల్లాలో ఒకేషనల్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,372 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 938 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ప్రథమ సంవత్సరానికి సంబంధించి 1,536 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 870 మంది (56.64 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గురుకులాలు.. కేజీబీవీల్లో జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభకనబరిచారు. కల్వకుర్తి గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీ విభాగంలో శ్రీనిధి 994/1000 మార్కులు, బైపీసీ విభాగంలో అఖిల 991 మార్కులు, సీఈసీ విభాగంలో శ్రీజ 979 మార్కులు, ఎంఈసి విభాగంలో 966 మార్కులు సాధించారు. అలాగే కొల్లాపూర్ కేజీబీవీ ఎంపీసీ విభాగంలో అనూష 983 మార్కులు, చారకొండ కేజీబీవీ బైపీసీ విభాగంలో లావణ్య 986 మార్కులు, బిజినేపల్లి కేజీబీవీ సీఈసీ విభాగంలో పుష్ప 952 మార్కులు సాధించారు. కందనూలు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా నాగర్కర్నూల్ జిల్లా స్థానం కాస్త మెరుగుపడంది. ఆదివారం ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా 28వ స్థానంలో నిలిచింది. గతేడాది 31వ స్థానంలో నిలవగా ఈసారి మూడు స్థానాలు ఎగబాకింది. ఇక మొదటి సంవత్సరం ఫలితాల్లో గతేడాది 34వ స్థానంలో నిలవగా.. ఈసారి 27వ స్థానానికి పెరిగింది. మొత్తంగా ఈ సంవత్సరం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 4,500 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,982 మంది (66.27 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 830 మంది, బాలికలు 2,152 మంది ఉన్నారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 5,353 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,987 మంది (55.80 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 784 మంది, బాలికలు 2,203 మంది ఉన్నారు. అయితే ఫస్టియర్, సెకండియర్లోనూ బాలుర కంటే బాలికలే అత్యధిక మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఇంటర్ ఉత్తీర్ణత ప్రథమ సంవత్సరంలో 27.. ద్వితీయ సంవత్సరంలో 28వ స్థానం అత్యధిక ఉత్తీర్ణతతో సత్తాచాటిన బాలికలు -
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నాగర్కర్నూల్ రూరల్: సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పీఎస్ రేట్ కార్మికులకు జీఓ నం.11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయీస్ యూనియన్ ఐదు రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరాస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి రామయ్య మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కరించాలని పోరాడుతున్న స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం యాజమాన్యంతో వెంటనే చర్చలు జరిపి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు, పర్వతాలు, పసియొద్దీన్, శివ, రాములు లింగం, తిరుపతయ్య, బాలస్వామి పాల్గొన్నారు. -
కొల్లాపూర్కు రైల్వే టూరిజం తీసుకురావాలి
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్కు హెలీ టూరిజంతోపాటు రైల్వే టూరిజం కూడా తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ఆదివారం కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో రైల్వే లైన్ సాధన కోసం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడ పరిశ్రమలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు. నంద్యాల నుంచి జడ్చర్ల మీదుగా రైల్వే లైన్ వేయడానికి అవకాశం వచ్చిందో.. దానిని కొల్లాపూర్ మీదుగా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో నేషనల్ హైవే–167తోపాటు బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుందని, దీనిని మల్టీపర్పస్గా అభివృద్ధి చేస్తే ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలో ప్రస్తావించేందుకు తమ పార్టీ ఎంపీలు కృషి చేస్తారన్నారు. సీపీఐ ఎప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలు ఏమీ వృథాగా పోలేదని, కొల్లాపూర్కు రైల్వే లైన్ రావడానికి కూడా పోరాటాలు చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, నాయకులు విజయుడు, శివుడు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
పెద్దకొత్తపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోలులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కుటుంబం కోసం ఇల్లు ఉండాలని, ఇంటి కోసం అప్పు చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షలతోనే కుటుంబానికి సరిపడా ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్ను స్వాహా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులకు ప్రస్తుత తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టేది లేకుంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల భవిష్యత్ మారేదని, గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందేవన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృథా ఖర్చులను తగ్గించడంతోపాటు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సత్యం, సర్పంచ్ కుర్మయ్య, మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి నాగర్కర్నూల్ క్రైం: ఆరోగ్య నాగర్కర్నూల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయుష్ సేవలు, యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా శుక్రవారం జనరల్ ఆస్పత్రిలో ప్రపంచ హోమియోపతి– ఆయుష్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డీఎంహెచ్ఓ రవికుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను మరింత ప్రోత్సహిస్తూ అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు. హోమియోపతి వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, సహజ సిద్ధమైన, సురక్షితమైన చికిత్స విధానంగా గుర్తింపు పొందిందని, శరీరంలోని సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందన్నారు. రోగి శారీరక, మానసిక స్థితులను కూడా పరిగణలోకి తీసుకుని చికిత్స అందించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ వంటి అనేక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో హోమియోపతి ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని, దుష్ప్రభావాలు తక్కువగా ఉండటం, తక్కువ ఖర్చుతో చికిత్స, అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హోమియో సేవలను విస్తరించి ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లు, మాతాశిశు సంరక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్లు, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ గోపాల్నాయక్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి పాల్గొన్నారు. సృజనాత్మకతతో ఆలోచించాలి: వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్మెంట్లలో చదివిన విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబులు, కృష్ణయ్య, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేరుశనగ క్వింటాల్ రూ.7,249 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,249, కనిష్టంగా రూ.5,301, సరాసరిగా రూ.6,575 ధర లభించింది. 236 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్ యార్డుకు తీసుకురాగా.. రైతులకు మధ్యాహ్న భోజనం అందించామని మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. -
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
● క్రిటికల్ కేర్ సెంటర్లతో అత్యవసర వైద్యసేవలు ● ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం ● ఖాళీల భర్తీకి భారీ స్థాయిలో నియామకాలు ● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నాగర్కర్నూల్ క్రైం: రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, ఇందులో భాగంగానే మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ సమయాల్లో అత్యవసర వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో రూ.23.75 కోట్లు వెచ్చించి.. 50 బెడ్ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. హార్ట్ స్ట్రోక్ వచ్చినా, విష జ్వరాలు ప్రబలినా ఇకపై హైదరాబాద్కు పరుగులు తీయకుండా.. స్థానికంగానే మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. అలాగే వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేయడానికి భారీస్థాయిలో నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. వసతుల కల్పనకు కృషి.. వైద్య విద్యార్థులు భవిష్యత్లో సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హాస్టల్, లైబ్రరీలు, ల్యాబొరేటరీలను అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక పరికరాలు, మెరుగైన బోధన విధానాలు, క్లినికల్ ట్రైనింగ్ వంటివి అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనరల్ ఆస్పత్రిలో అవసరమైన వసతుల కల్పనకు కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.2.65 కోట్ల నిధులు అందుబాటులో ఉంచామని, వీటితో అవసరమైన వైద్య పరికరాలు నేరుగా కలెక్టర్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా కళాశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, క్లినికల్ ట్రయల్స్ కోసం విద్యార్థులు మెడికల్ కళాశాల నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కోసం మరికొన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ● ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. జనరల్ ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారం ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, డీఎంహెచ్ఓ రవినాయక్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులకు భయపడేది లేదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధితో పాటు చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు చేసిందని.. వాటిని వినియోగించుకుంటూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని మహబూబ్నగర్ ఎంపీ డీకె అరుణ అన్నారు. పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు మంజూరు చేసిందని.. పుర ఎన్నికల వేళ మంత్రి వాకిటి శ్రీహరి హడావుడిగా శంకుస్థాపన చేయడం తనను అవమానించడమేనని తెలిపారు. శుక్రవారం ఆమె పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేసేందుకు రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు, మాటల యుద్ధం కొనసాగింది. వీటన్నింటిని లెక్క చేయకుండా ఎంపీ కాంగ్రెస్ నాయకులను తోసుకుంటూ చెరువుకట్టపైకి చేరుకొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎస్ఐ స్వాతి సిబ్బందితో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి హూందాతనం మరిచి అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంపీగా రాజకీయాల్లో ఉన్నానని.. బాధ్యతలు, గౌరవం, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర నిధుల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని.. నిజమైన పేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేయడం దారుణమన్నారు. -
ఆస్తి పన్నుపై ఊరట
5 శాతం రాయితీ ప్రకటించిన మున్సిపల్ శాఖ ●కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల అభివృద్ధికి ఆస్తిపన్నులే ఎంతగానో దోహదపడతాయి. అలాంటి పన్నులను సకాలంలో వసూలు చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఆస్తిపన్ను బకాయిల చెల్లింపునకు ముందస్తు చెల్లింపులు చేసేవారికి ఎర్లీ బర్డ్ స్కీం ప్రకటించింది. నిర్ణీత సమయంలో ఆస్తిపన్ను వసూలు చేసి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మున్సిపాలిటీల బలోపేతం ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేందుకు ఉత్సాహంగా ఉన్న యజమానులకు 5 శాతం రాయితీ శుభవార్తగా మారింది. ముందస్తు పన్ను వసూలులో రెవెన్యూ పరంగా మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు. ఏటా ఆస్తిపన్ను వసూలు 100 శాతం లక్ష్యం చేరుకునేందుకు ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది. 5 శాతం రాయితీ.. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించే యజమానులకు 5 శాతం రాయితీ వర్తిస్తుంది. దీనిపై పెద్దఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచారం నిర్వహించాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా పన్నుల మేళాలను మున్సిపల్ అధికారులు నిర్వహించనున్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరిచేందుకు నేరుగా కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని మున్సిపల్ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే గత సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయలు ఉంటే, వాటిపై ఎలాంటి రాయితీ వర్తించదు. బకాయిలు పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతే ప్రస్తుత ఏడాది రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఎర్లీ బర్డ్ స్కీం కోసం ఆయా మున్సిపాలిటీలలో ప్రత్యేక కౌంటర్లను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ అసెస్మెంట్లు డిమాండ్ (రూ.కోట్లలో) కల్వకుర్తి 8,334 3.7 నాగర్కర్నూల్ 11,020 4.44 కొల్లాపూర్ 6,517 1.3 అచ్చంపేట 6,765 3.38 ఈ నెలలో చెల్లిస్తేనే వర్తించనున్న పథకం ఆదాయం పెంచాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ చెల్లింపులకు అవకాశం రిబేట్పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగం మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. మీ– సేవ కేంద్రాల ద్వారా కూడా ఆస్తిపన్ను చెల్లించవచ్చు. -
అడుగంటిన జూరాల
● కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాలకుపైనే సాగు ● ఈ నెల 15 వరకు పంటలకు సాగునీరు అందించాలి ● వేసవిలో తాగునీటి అవసరాలకు అర టీఎంసీ అవసరం ● మరోసారి కర్ణాటకను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎడీడీఎల్ స్థాయికిపైన 1.486 టీఎంసీలు ఉండగా.. లైవ్లో 0.442 టీఎంసీలు ఉన్నాయి. వేసవిలో తాగునీటి కోసం అర టీఎంసీ నీళ్లు అవసరం. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటితో తాగునీటి అవసరాలకు సరిపోతాయి. అదేవిధంగా కుడి, ఎడమ కాల్వ పరిధిలోని పంటలకు ఈ నెల 15 వరకు సాగునీటిని విడుదల చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, సాగునీటి పారుదల శాఖ జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల గద్వాల: కృష్ణా బేసిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25 వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తు తం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తా గునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది. 35 వేల ఎకరాలు సాగు.. జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు. తాగునీటికి ఎలా.. వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్సాగర్, రామన్పాడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పా టు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. -
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
● జిల్లాలోని ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు ● కలెక్టర్ బదావత్ సంతోష్ కందనూలు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, ఏఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానంలో ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జరగాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్లైన్ బుకింగ్ అనుమతించబడదని స్పష్టం చేశారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై వచ్చిన దరఖాస్తులను పర్యావరణ అనుమతుల ఆధారంగా పరిశీలించి.. తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఇసుక రవాణా జరిగేలా అనుమతులు ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్ల వద్ద అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి మురళి, డీపీఓ శ్రీరాములు, భూగర్భజలశాఖ అధికారిణి దివ్య జ్యోతి ఉన్నారు. జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదు.. జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని.. గృహ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఆయన జిల్లాలో గ్యాస్ వినియోగంపై సమీక్షించారు. జిల్లాలో వంటగ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డొమెస్టిక్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్ల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
హెచ్ఐవీ మహమ్మారిని నిర్మూలిద్దాం
నాగర్కర్నూల్ క్రైం: హెచ్ఐవీ మహమ్మారిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్న వైద్యారోగ్యశాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్ఓ డా.రవికుమార్ కోరారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో వైద్యసిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. హెచ్ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధిగ్రస్తులకు చికిత్స విధానంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎవరికై నా వ్యాధి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్యకేంద్రాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. కాగా, జిల్లా జనరల్ ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్లో 10 మంది ట్రాన్స్జెండర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సబ్ జైలులో ఉన్న ఆరుగురు ఖైదీలకు హెచ్ఐవీ, హెపటైటిస్ బి – సి, సిఫిలిస్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి, ఆర్ఎంఓ డా.రవిశంకర్, ప్రోగ్రామ్ అధికారులు డా.కృష్ణమోహన్, డా.ప్రదీప్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భరత్కుమార్ పాల్గొన్నారు. -
సర్వేను అడ్డుకున్న రైతులు
వెల్దండ: డిండి – నార్లాపూర్ ప్రాజెక్టులో భాగంగా వెల్దండ మండలం అజిలాపూర్ శివారులో నిర్మిస్తున్న ఇర్విన్ రిజర్వాయర్ ముంపు భూముల్లో గురువారం అటవీశాఖ అధికారులు చేపట్టిన సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో 92 మంది రైతులకు చెందిన 186.30 ఎకరాల భూములతో పాటు పలు రకాల చెట్లు ముంపునకు గురవుతున్నాయి. వాటి నష్టాన్ని అంచనా వేసేందుకు అటవీశాఖ అధికారులు సర్వే చేపట్టగా.. భూ నిర్వాసితులు అక్కడికి చేరుకొని తమకు ఎంతమేర నష్టపరిహారం చెల్లిస్తారో స్పష్టం చేసిన తర్వాతే సర్వే చేపట్టాలని అధికారులను అడ్డుకున్నారు. భూ నిర్వాసితులకు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనుదిగారు. ఈ సందర్భంగా తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతూ నిర్వాసితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దగోని రమేశ్గౌడ్ పాల్గొన్నారు. -
హే..కృష్ణా.!
● ప్రస్తుతం మిగిలింది 42 టీఎంసీలే ● మరో వారం, పది రోజుల్లో కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ● జూరాలలోనూ అడుగంటిన జలాలు ● వేసవిలో ఇబ్బందులు తప్పించేందుకు చర్యలు శూన్యం వేసవిలో తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో కనిష్ట నీటిమట్టానికి ముందే కేఎల్ఐ కింద రిజర్వాయర్లను నింపుతున్నాం. అవసరం మేరకు నీటినిల్వ చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఇరిగేషన్శాఖ ఈఈ, నాగర్కర్నూల్ శ్రీశైలం డ్యాంలో శరవేగంగా తగ్గుతున్న నీటిమట్టం సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం వేగంగా అడుగంటుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం పెరగడంతో, ఈ సారి వేసవి ప్రారంభంలోనే నీటినిల్వ అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైలం డ్యాం నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.408 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తితో పాటు సాగునీటి ప్రాజెక్ట్ల కోసం వినియోగిస్తుండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవి చివరి నాటికి తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం డ్యాంలో 20 రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. రెండు, మూడు రోజులకు ఒక టీఎంసీ చొప్పున నీరు అడుగంటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని కేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి విడుదల కొనసాగడం.. గత నెల 22 వరకు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో నీటిమట్టం వేగంగా తగ్గింది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువగా ఉండటంతో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. గతనెల 15వ తేదీ వరకు 75 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. ప్రస్తుతం 42 టీఎంసీలకు పడిపోయింది. వేసవికాలం ముగిసేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటం.. జూలై వరకు శ్రీశైలం ప్రాజెక్టు వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.074 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.367 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. దీంతో తాగునీటి అవసరాలకు సైతం కటకట ఏర్పడనుంది. గతేడాది సైతం జూరాలలో నీటినిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకోగా.. ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని సరఫరా చేశారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తేనే తాగునీటి ఇక్కట్లు తీరనున్నాయి. గత మార్చి ప్రారంభానికి ముందు శ్రీశైలం రిజర్వాయర్లో 92 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉండగా.. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా నీటి తరలింపు చేపట్టారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి నెలలో నీటి వినియోగం గణనీయంగా పెరిగింది. ఏపీలోని విద్యుదుత్పత్తి కేంద్రానికి నిత్యం సగటున 10వేల క్యూసెక్కులతో పాటు హంద్రీనీవా సుజలాస్రవంతి, కేసీసీ, పీఆర్పీ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేశారు. అలాగే తెలంగాణలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి సగటున 8 వేల క్యూసెక్కులతో పాటు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్ట్కు నీటి సరఫరా కొనసాగింది. -
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె
కందనూలు: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తేల్చిచెప్పింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ డివిజనల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్శాఖ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి పలు దఫాలుగా ధర్నాలు, నిరసనలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే సమ్మెలోకి దిగడం జరిగిందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయడంతో పాటు విద్యార్హతల ఆధారంగా రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ చేయాలని, పీస్రేట్ కార్మికులకు జీఓ నం.11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు పలు యూనియన్లు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ జేఏసీ సహాయ కార్యదర్శులు దశరథం, సైదులు, ఉమ్మడి జిల్లా కోచైర్మన్ రాజ్కుమార్, కోకన్వీనర్ లోకేశ్వర్, డివిజన్ జేఏసీ చైర్మన్ మిద్దె శ్రీనివాసులు, కన్వీనర్లు జయకర్, మల్లయ్య పాల్గొన్నారు. -
‘ఏదుల’ ఉండగా..‘గొల్లపల్లి’ అనవసరం
● 8 నెలల్లో తుమ్మిళ్ల పూర్తి చేసి చూపించాం ● సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ● సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు అందుబాటులోకి.. ● మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ● రైతులతో దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేతలు వనపర్తి/గోపాల్పేట: దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.నాలుగు వేల కోట్లతో నిర్మించి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని.. కాంగ్రెస్ పాలకులు ఏడు దశాబ్దాల కాలంలో కేవలం 25 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మిస్తే, కేవలం తొమ్మిదేళ్లలో 65 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మించిన ఘటన కేసీఆర్ సర్కార్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఏదుల మండలం గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ రైతులు 102 రోజులుగా రిలే దీక్షలు చేపడుతుండగా.. గురువారం ఆయన గ్రామానికి వచ్చి రైతుల దీక్షకు మద్దతు తెలిపి మీ వెంట మేముంటామంటూ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన చరిత్ర కాంగ్రెస్దేనని ఆరోపించారు. రైతులు దీక్ష చేస్తున్నదిక్ష రాజకీయాల కోసం కాదని అధికార పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ ఉండగా.. గొల్లపల్లి రిజర్వాయర్ అవసరం లేదని 2018లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కేఎల్ఐ ఆయకట్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఓటీ (తూము) ఏర్పాటు చేసేలా సప్లిమెంటరీ డిజైన్ చేశామన్నారు. పాన్గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు ఉపయోగపడే రామన్నగట్టు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా రద్దుచేసి అవసరం లేని గొల్లపల్లి రిజర్వాయర్ను కమీషన్ల కోసం రూ.1,300 కోట్లతో నిర్మించ తలపెట్టిందని ఆరోపించారు. నల్లమల పులిని అంటూ డైలాగులు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల, భీమా సాగునీటి కాాల్వల కింద యాసంగిలో క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు ఉన్నాయని.. జూరాల వద్ద మరో ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమన్నారు. వేసవిలోనూ పంపులు నడి చేందుకు నీరుండే శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రాకు వదిలేసి అతి తక్కువ సామర్థ్యం ఉన్న జూరాల వద్ద ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన ఏదుల, వట్టెం, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేశామని.. ప్రభుత్వం దృష్టి సారించి సరిగ్గా నెలరోజులు పనిచేస్తే 35 టీఎంసీల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందని మాజీ మంత్రి వివరించారు. ఇప్పటికే మూడు సీజన్లు వృథా అయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కించి కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుబంధు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ సైతం అసమగ్రంగా అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోమారు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సస్యశ్యామలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వలసలు తగ్గించేందుకు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని, కుల వృత్తులకు జీవకళ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను బెదిరింపులకు గురిచేయలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, బీరం హర్షవర్ధన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు వద్దన్నా.. గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేస్తే లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. వంద రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు దీక్షలు చేపడితే పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు.. రైతుల దీక్ష విరమింపజేసేందుకు హరీశ్రావు వస్తున్నారనగానే ఉలిక్కిపడుతున్నారన్నారు. బాలికపై అత్యాచారయత్నం, రైతుల దీక్షలపై జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణానికి రైతులను ఒప్పించేందుకు 73 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, భూములు ఇవ్వాలంటూ రైతులను ఒప్పించేందుకు కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినట్లు చెప్పారు. -
వేరుశనగ క్వింటా రూ.7,968
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,968, కనిష్టంగా రూ.5,666 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,226, కనిష్టంగా రూ.6,100, ఆముదాలు గరిష్టంగా రూ.6,370, కనిష్టంగా రూ.6,048, జొన్నలు గరిష్టంగా రూ.6,020, కనిష్టంగా రూ.4,297, చింతగింజలు రూ.2,676, ఉలువలు రూ.4,101, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,892, కనిష్టంగా రూ.1,650 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,243, కనిష్టంగా రూ.2,029, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,779, ఆముదాలు గరిష్టంగా రూ.6,139, కనిష్టంగా రూ.6,089గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
హోంగార్డులు అంకితభావంతో పనిచేయాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్లందరూ తమ విధులు అంకితభావంతో నిర్వహిస్తూ.. ప్రజల రక్షణ కోసం పనిచేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు ఆఫీసర్లందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, వెల్ఫేర్ బెనిఫిట్స్ కోసం వెల్ఫేర్ అమౌంట్ను రూ.20 నుంచి రూ.200 వరకు పెంచుకోవాలని సూచించారు. హోంగార్డులందరికీ ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాఘవరావు, ఆర్ఎస్ఐ, గౌస్ పాష, హెడ్కానిస్టేబుల్ వెంకట్నారాయణ, జిల్లా హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జంబులు తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయుల నిరసన
కందనూలు: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం చేసేవారి పారితోషికం పెంచాలని, గతేడాది బకాయిలు వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాకేంద్రంలోని మూల్యాంకణ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విరామ సమయంలో నిరసన తెలిపి.. అనంతరం డీఈఓ రమేష్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐక్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఏడేళ్ల నుంచి పదో తరగతి మూల్యాంకనం పారితోషికం పెంచలేదని ఆరోపించారు. దీంతోపాటు సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. వనపర్తి వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు వనపర్తి: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్–1లో రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ సందర్భంగా కళాశాలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలు తమ తమ విభాగాల్లో సాధించిన ఫలితాలకు గుర్తింపుగా ప్రిన్సిపాళ్లకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపాల్ డా. పి.మల్లికార్జున్, సూపరింటెండెంట్ డా.అరుణ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో కలెక్టర్ ఆదర్శ్ సురభి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘చలో వరంగల్’కు తరలిరండి రాజోళి: రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ కమిటీ పిలుపుమేరకు బుధవారం చేపట్టిన చలో వరంగల్ కార్యక్రమానికి తరలిరావాలని జోగుళాంబ గద్వాల జిల్లా జేఏసీ చైర్మన్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి దశల వారిగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్టిజన్ కార్మికులు చేపట్టే నిరవదిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు కల్పించాలని, స్పాట్ బిల్డర్లకు జీఓ 11 ప్రకారం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుధాకర్, రాముడు, అనంతరెడ్డి, సతీష్, లోకేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలభవన్లో వేసవి శిక్షణ శిబిరం గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని బాలభవన్లో ఈ నెల 24 నుంచి జూన్ 2 వరకు సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి, శాసీ్త్రయ నృత్యం, జానపద నృత్యం, గాత్ర సంగీతం, డ్రాయింగ్, వాయిద్య సంగీతం, కుట్లు, అల్లికలు తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 5 నుంచి 16 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. సాధారణ ఫీజు రూ.50 కాగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.20 మాత్రమే ఫీజు ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. శిబిరంలో చేరే విద్యార్థులు ఆధార్, విద్యార్హత ధ్రువపత్రం, ఎస్సీ, ఎస్టీ వారు కుల ధ్రువపత్రాల జిరాక్స్తోపాటు పాస్పోర్టు సైజు ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 96668 53335, 94409 81190లను సంప్రదించాలని సూచించారు.


