Nagarkurnool
-
డబ్బులు రాలేదు..
ఈ ఏడాదిలో పనులు ప్రారంభించినప్పటి నుంచి ఉపాధి పనికి వెళ్తున్నాం. కానీ, ఇప్పటి వరకు రూ.2,500 మాత్రమే వచ్చాయి. ఇంకా ఐదు వారాలకు సంబంధించిన డబ్బులు రాలేదు. కనీసం 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రోజు ఎంత కూలి పడుతుందో కూడా తెలియడం లేదు. – లక్ష్మమ్మ, మర్రిపల్లి, ఉప్పునుంతల మండలం పకడ్బందీగా చేపడుతాం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హా మీ కింద పనులు నిర్వహిస్తున్నాం. పను లు సక్రమంగా చేపట్టేలా, వేతనాలు వచ్చేందుకు వీలుగా నిబంధనలు పాటించేలా చూస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. పేమెంట్స్ వచ్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ ● -
దివ్యాంగులకు ఆ పార్టీలు చేసిందేమీ లేదు
కొల్లాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. మంగళవారం కొల్లాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనర్హులకు పింఛన్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని, దాని తర్వాత పింఛన్లను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ త్వరలోనే రాబోతుందన్నారు. దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చే పథకాన్ని మొదట ప్రారంభించింది.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీలు దివ్యాంగులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో దివ్యాంగులకు స్థానం కల్పించాలని, 5 శాతం ఇళ్లు దివ్యాంగులకు కేటాయించాలని, కొల్లాపూర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో రిజర్వేషన్ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించేలా చూడాలని స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు వీరయ్యకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వైస్చైర్మన్ రహీంపాష మాట్లాడుతూ మున్సిపల్ దుకాణాల్లో దివ్యాంగులకు కూడా ప్రత్యేక కోటా కల్పించేందుకు పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరీష్కుమార్, రాజేందర్, ఆశన్న, రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!
●పట్టించుకోవడం లేదు.. ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పుస్తకాలకు మంగళం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి రూ.35– 50 వేల వరకు.. స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం,షూ పేరుతో నిలువుదోపిడి పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు -
ఎరువులు పారదర్శకంగా అందించాలి
కందనూలు: రైతులకు యూరియా, ఎరువులు పారదర్శకంగా అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని గ్రోమోర్ పురుగు మందుల విక్రయ కేంద్రం, పీఏసీఎస్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలు, ఆన్లైన్ పంపిణీ విధానాన్ని, అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ పరిమాణం, రైతుల అవసరాలు, రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్కు అనుగుణంగా నిల్వల నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దుకాణంలో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, మున్సిపల్ అనుమతులు, నానో యూరియా, నానో డీఏపీ వంటి ఉత్పత్తుల లభ్యతపై వివరాలు సేకరించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు నిరంతరాయంగా ఎరువులు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్ సందర్శించిన కలెక్టర్ అక్కడ రైతులకు ఆన్లైన్ విధానంలో జరుగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. రైతుల ఆధార్ ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల ద్వారా జరుగుతున్న విక్రయాల విధానాన్ని పరిశీలించి, ప్రతి రైతుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంపిణీ కేంద్రంలో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల నమోదు, రోజువారీ లావాదేవీల వివరాలను కూడా తనిఖీ చేసి.. ఎరువుల సరఫరా విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి రఘునాథ్రావు, ఆర్డీఓ సురేష్బాబు, వ్యవసాయ అధికారి పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీలపై నిరంతర పర్యవేక్షణ అంగన్వాడీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీసీ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతోపాటు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల ఆరోగ్య స్థితిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. జాతీయ బాల ఆరోగ్య రక్ష బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నల్లమల ఏజెన్సీ ప్రాంత అంగన్వాడీ కేంద్రాలపై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. -
జిల్లా పరిధిలో ఇలా..
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ఈసారి వేసవికాలంలో వీబీ జీ రామ్జీ (ఉపాధి హామీ) పనులు ఊపందుకున్నాయి. గడిచిన మూడు నెలల కాలంలోనే జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలకు 10,59,663 పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు 40 వేలకుపైగా కూలీలు పనులకు హాజరవుతుండటం గమనార్హం. మరోవైపు ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) అమలు చేస్తుండగా.. ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ గతేడాదికి మించి ఈసారి ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య పెరిగింది. 68 శాతం లక్ష్యం పూర్తి.. జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈసారి పనిదినాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 16 లక్షల పనిదినాలను కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 10.60 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించారు. మొత్తంగా 68 శాతం వరకు లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇంకా మిగతా రోజుల్లోనూ పనిదినాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సకాలంలో అందని కూలి.. జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల హాజరు నమోదు పెరుగుతుండగా.. కూలీలకు డబ్బుల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం కొనసాగుతోంది. వారాలు గడిచినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కేంద్రం గత నెల నుంచి ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 1,91,768 జాబ్కా ర్డులు ఉండగా, వీరిలో 97,565 మంది కూలీలు పనులకు హాజరవుతున్నాయి. ఇందులో సుమారు 40 నుంచి 43 వేల మంది వరకు నిత్యం పనులకు వస్తున్నారు. వీరికి రోజువారీ కూలి కనీసం రూ.250– 307 వరకు చెల్లించాల్సి ఉండగా.. జిల్లాలో సగటున రూ.274 వరకు అందుతోంది. అయితే పనులు పూర్తిచేసి నాలుగు, ఐదు వారాలు గడిచినా డబ్బులు రాకపోవడంతో కూలీలు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం కనీసం రెండు వారాలకు ఒకసారి డబ్బులు జమచేయాలని కూలీలు కోరుతున్నారు. పనులకు హాజరవుతున్నవారు 97,565 సగటున నిత్యం వస్తున్నవారు 40,45 వేలు ఈ ఏడాది పనిదినాల లక్ష్యం 16 లక్షలు జిల్లాలో సగటు దినసరి వేతనం రూ.279 10.60 లక్షలు మే నెలలో అత్యధికంగాపనిదినాలు కల్పించిన అధికారులు ఈసారి వేసవిలో పెరిగిన కూలీల హాజరు ఎన్ఎంఎంఎస్ యాప్ హాజరు అమలుతో ఇబ్బందులు ఐదు వారాలు దాటినా డబ్బులు రాక నిరాశ మొత్తం జాబ్కార్డులు 1,91,768 ఉపాధి కూలీలు 1,55,554 -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. సోమవారం ఆయన వెల్దండలోని ఎమ్మార్సీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఆవరణలో ఉన్న సరస్వతిదేవి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్బుక్స్ అందజేశారు. డీఈఓ వెంట ఎంఈఓ చంద్రుడు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. -
విద్యార్థుల్లారా.. స్వాగతం
జిల్లాలో ఘనంగా పునఃప్రారంభమైన విద్యాసంస్థలు కందనూలు/ అచ్చంపేట రూరల్/ వెల్దండ: జిల్లావ్యాప్తంగా సోమవారం విద్యా సంస్థలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఉత్సాహంగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులను ఆకట్టుకునేలా ఉపాధ్యాయులు పాఠశాలలను మామిడితోరణాలు, బెలూన్లతో ముస్తాబు చేసి.. విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పుస్తకాలు, నోట్బుక్స్ విద్యార్థులకు అందజేశారు. 42 వేల మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా. ఇందులో సుమారు 42 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే మొదటిరోజు జిల్లాలో 9,450 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. విద్యార్థులు పాఠశాలకు చేరుకునే సమయంలో టీచర్లు, ప్రజాప్రతినిధులు గేటు నుంచి విద్యార్థులకు పూలు చల్లుతూ.. వారి వెంబడి నడుస్తూ తరగతి గదిలోకి తీసుకెళ్లి వారిని కూర్చోబెట్టారు. తొలిరోజు ఆటపాటలతో ఆనందపరుస్తూ.. విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు. అచ్చంపేట మండలం చౌటపల్లి పాఠశాలలో కూలిన తరగతి గది మామిడితోరణాలు, బెలూన్స్తో పాఠశాలల ముస్తాబు విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేసిన ప్రజాప్రతినిధులు మొదటిరోజు అంతంతమాత్రంగానే విద్యార్థుల హాజరు -
పెట్టుబడి కాలం.. తప్పని ఆర్థిక భారం
అచ్చంపేట: జూన్ రాగానే చాలా కుటుంబాల నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతుంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు సంబంధించిన ఖర్చులు మీదపడుతుండగా.. మరోవైపు వానాకాలం నేపథ్యంలో రైతులు పంటల సాగుకు సంబంధించి.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ రెండూ రూ.వేలకు వేలు ఖర్చుతో కూడుకున్నవే కావడంతో ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయని ఇటు సామాన్య ప్రజలు, అటు అన్నదాతలు వాపోతున్నారు. విద్యార్థుల ఖర్చులే అధికం.. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, షూస్, బ్యాగులు ఇలా అన్నీ మళ్లీ కొనాల్సిందే. వీటి కోసం తరగతులను బట్టి రూ.వేల నుంచి రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, యూనిఫాంలకే కనీసం ఒక్కొక్కరికి కనీసం రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవి కాకుండా మొదటి టర్మ్ ఫీజులూ అదనం. ఒకవేళ బడిని మార్చి.. కొత్త స్కూల్కు పంపిస్తే మళ్లీ అక్కడ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి పరిస్థితి దాపురిస్తోంది. రైతులకు రెండింతలు.. వర్షాకాలం ప్రారంభం కావడంతోనే పొల్లాల్లో సాగు పనులు మొదలవుతాయి. ఇందుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ల అద్దె, కూలీల ఖర్చులు ఒకేసారి రావడంతో రైతులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. యాసంగి పంటలను ఇప్పుడిప్పుడే అమ్మేస్తున్నారు. ఇంకా జిల్లాలో కొన్ని గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న మిగిలే ఉన్నాయి. వీటి డబ్బులు చేతికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఇటు సాగు పనులు, అటు పిల్లల చదువులకు అంటే.. తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. విద్యార్థుల ఫీజులువ్యవసాయ పెట్టుబడిఅదనపు భారం.. జూన్లో ప్రారంభయ్యే వర్షాకాలం సీజన్లో పిల్లల చదువులు, సాగు పనులే కాదు.. ఇళ్ల మరమ్మతు, పైకప్పుల లీకేజీల నివారణ, రెయిన్ కోట్లు, గొడుగులు, వర్షాకాలానికి అవసరమైన ఇతర వస్తువులు కొనుగోళ్లు ఉంటాయి. మరోవైపు కూరగాయలు, పా లు, గ్యాస్, విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజి ల్, రవాణా ఖర్చులు వంటి నిత్యావసర వ్య యాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కుటుంబ బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఒకవైపు పాఠశాలలు ప్రారంభం.. మరోవైపు వానాకాలం పనులు విద్యార్థుల కోసం పేదల ‘బడ్జెట్’ తిప్పలు ఎరువులు, విత్తనాల కోసం రైతన్నల పాట్లు సామాన్యుల ఆర్థిక స్థితిని తలకిందులు చేస్తున్న జూన్ మాసం -
భూసేకరణలో చలనం
ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం ● నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ● ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తిచేసేలా అధికారుల కసరత్తు ● ఆర్అండ్ఆర్లో పూర్తిస్థాయి సదుపాయాల కల్పనకు చర్యలు క్షేత్రస్థాయి పర్యటనతో.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. ● నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ● 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. ● 7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా గరిష్టంగా ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. దీంతో రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్ కోసం 567 ఎకరాలు సేకరించాల్సి ఉంది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంవేగవంతం చేస్తున్నాం.. జిల్లాలో నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో రైతులు పరిహారం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు రైతులు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే నెట్టెంపాడు పరిధిలో 200 ఎకరాలకుపైగా భూమి సేకరణ పూర్తయింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 45 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రిజ్వాన్బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. దాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. -
ప్రజావాణి ఫిర్యాదులుపరిష్కరించాలి
కందనూలు: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి ప్రజల నుంచి 68 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9.. కందనూలు: ప్రజలు నిర్భంయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఎస్పీ 9 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 5 భూమికి సంబంధించినవి, 4 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దివ్యాంగులకు అండగా ఉంటాం కందనూలు: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతోపాటు వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, మోటార్ వెహికిల్ తదితర వాటిని అందించడానికి సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంఘం నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డీఎంకు షోకాజ్ నోటీసులు కందనూలు: జిల్లాస్థాయి మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవడంతో నాగర్కర్నూల్ బస్ డిపో మేనేజర్ యాదయ్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను సోమవారం ఆదేశించారు. విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని, నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదని సూచించారు. భారీ ఈదురుగాలులకు రైస్ మిల్లు ధ్వంసం ● మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం నీటిపాలు ● దాదాపు రూ.8కోట్ల మేర నష్టం నాగర్కర్నూల్ రూరల్: నాగర్కర్నూల్ జిల్లా గుడిపల్లిలో భారీ ఈదురుగాలులకు శ్రీ సీతారామాంజనేయ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు ధ్వంసమైంది. యజమానులు బిల్లకంటి రాజ్యలక్ష్మి, రవికుమార్ కథనం ప్రకారం.. సోమవారం 5 గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా సుడిగాలి చుట్టుకోవడంతో రైస్ మిల్లుపై భాగంలోని కప్పు, ఇతర యంత్రాలకు సంబంధించిన భారీ పైపులతోపాటు మిషనరీ, రైస్ మిల్లు షెడ్డు కుప్పకూలిపోయింది. దీంతో పాటు రైస్ మిల్లులో ప్రాసెసింగ్లో ఉన్న వడ్లు, బియ్యం వర్షానికి తడిసి ముద్దయింది. దాదాపు రూ.8 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని మిల్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సుడిగాలితో కూడిన వర్షం రైస్ మిల్లును చుట్టుముట్టిన సమయంలో నిర్వాహకులు వెంటనే కార్మికులను అప్రమత్తం చేసి ఒక చోటికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. -
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
అసౌకర్యాల మధ్యనే..
ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం సైతం అరకొర సౌకర్యాల మధ్యే ప్రారంభమైంది. పలుచోట్ల తొలిరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆదరాబాదరగా వచ్చి పాఠశాలలను తెరిచారు. పాఠశాలలకు అక్కడక్కడ పదుల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. కొన్నిచోట్ల విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్యనే అధికంగా కనిపించింది. ఈ క్రమంలో అచ్చంపేట మండలంలోని చౌటపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల మూడు గదులు కూలిపోయాయి. దీంతో మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే జిల్లావ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిల గదుల్లోనే కొనసాగుతుండగా.. మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం మరమ్మతులకు నోచుకోక అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. మరికొన్నిచోట్ల అసంపూర్తి గదులు, అరకొర నిర్మాణాలే విద్యార్థులకు దర్శనమిచ్చాయి. -
భూ సేకరణ వేగవంతం చేయండి
కొల్లాపూర్: అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. సోమవారం ఆయన కొల్లాపూర్లోని 4, 9 వార్డుల్లో పర్యటించి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పెండింగ్లో ఉన్న పనుల గురించి మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్చైర్మన్ షేక్ రహీంపాషతో చర్చించారు. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అవసరమైన స్థలాల కోసం సోమశిలకు వెళ్లే దారిలోని భూములను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను భూ సేకరణ ద్వారా సేకరించాలని ఆర్డీఓ భన్సీలాల్ను ఆదేశించారు. భూసేకరణలో జాప్యం చేయవద్దన్నారు. ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు ద్వారా కొల్లాపూర్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన వివరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ యాదగిరి, రెవెన్యూ అధికారులు తదితరులున్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలతో కేటీఆర్ -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
కల్వకుర్తి రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు భాషమోని ఆంజనేయులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాసమ్మ అధ్యక్షతన నిర్వహించిన తాలూకాస్థాయి సీఐటీయూ అనుబంధ రంగాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దుచేసి.. తీరని అన్యాయం చేసిందన్నారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన తదితర రంగాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్గర్ జిల్లాలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాలుగో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 20న నిర్వహించే బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో శివరాములు, ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, పద్మ, రాజు, యాదయ్య, దేవయ్య, అలివేల, రఫీకా సుల్తానా, రాఘవేందర్, రామార్జున్ తదితరులు ఉన్నారు. -
శ్రీశైలం దారిలో
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ●డీపీఆర్ పూర్తయింది.. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు తాజాగా ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్రెడ్డి కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. -
అన్ని వసతులు కల్పించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలి. ముఖ్యంగా తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి. ఈసారి యూనిఫాం అందించడంలో ఆలస్యం కావడం బాధాకరం. – బాలపీరు, నాగర్కర్నూల్ ఏర్పాట్లు పూర్తి.. పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రభుత్వ బడుల్లో కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతాం. ఇందుకు ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఏకరూప దుస్తులకు సంబంధించిన వస్త్రం రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. 15 రోజుల్లో కుట్టించి, విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – రమేశ్కుమార్, డీఈఓ ● -
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు..
● సినీనటుడు విజయ్ దేవరకొండ పిలుపు ● 188 మంది విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ చెక్కుల పంపిణీ బల్మూర్: తల్లిదండ్రుల్లోని మంచి నడవడికనే పిల్లల క్రమశిక్షణకు దోహదపడుతుందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆదివారం ఆయన స్వగ్రామం తుమ్మెన్పేటలో స్కాలర్షిప్స్ చెక్కులను ఆయన సతీమణి రష్మిక, కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈఓ రమేష్కుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. దీని వెనక ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రస్తుతం విద్య కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమించి రూ.వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో చదివి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా పుట్టిన ఊరిపై మమకారంతో పేద విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ నిజమైన శ్రీమంతుడు అని ఎమ్మెల్యే వంశీకృష్ణ కొనియాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయడానికి.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటేలా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో గుర్తుండిపోయేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యే విజయ్ దేవరకొండను కోరారు. -
ధాన్యం తరలింపులో జాప్యం చేయొద్దు
ఉప్పునుంతల: వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని.. ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చేయొద్దని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, తూకం ప్రక్రియ, హమాలీలు, రవాణా, రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేంద్రాల్లోని ధాన్యం పరిస్థితిని స్వయంగా చూసిన కలెక్టర్.. తడిసిన బస్తాలను వెంటనే సమీపంలో ఉన్న బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తరలించడానికి అవసరమైన రవాణా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్, ఐకేపీ, మెప్మా అధికారులను ఆదేశించారు. వర్షాలకు ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం చేయడంతోనే వర్షానికి ధాన్యం తడిసిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ నెల 17 వరకు వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురాకుండా, పంట పొలాల్లోనే జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కాగా, గతేడాది యూరియా కోసం పడిన ఇబ్బందులను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ఈ ఏడాది ప్రణాళిక ప్రకారం జిల్లాకు అవసరమున్న యూరియా సకాలంలో రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్లైన్ విధానంలో యూరియా పంపిణీ పక్కాగా జరిగేలా వ్యవసాయశాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందేలా చూస్తామన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారావు, తహసీల్దార్ సునీత, డీటీ రమేశ్, ఏఓ కొర్ర రమేశ్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు, ఐకేపీ ఏపీఎం బాలచంద్రుడు, నాయకులు అనంతరెడ్డి, రవీందర్రావు ఉన్నారు. -
రైతుల కష్టాలుపట్టని ప్రభుత్వం
నాగర్కర్నూల్ రూరల్: కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు అనేక కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సాగు ప్రారంభమైనా ప్రభుత్వం రైతుభరోసా ఊసెత్తకపోవడం దారుణమన్నారు. మరోవైపు నెలరోజుల క్రితం రైతుల నుంచి కొనుగోలుచేసిన మొక్కజొన్నల డబ్బులను కూడా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి రైతుభరోసా నిధులు విడుదల చేయడంతో పాటు ధాన్యం డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, ఆర్.శ్రీనివాసులు, ఆంజనేయులు, దేశ్యానాయక్, పొదిల రామయ్య, నర్సింహ, ఎం.శ్రీనివాసులు, శంకర్ నాయక్, శివవర్మ, బాలస్వామి, అశోక్, అంతటి కాశన్న, నాగరాజు, సైదులు, హనుమంతు ఉన్నారు. పాలమూరు రెడ్క్రాస్కు మొదటి బహుమతి పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్నగర్ ఇండియన్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్నగర్ రెడ్క్రాస్ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్ వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్రాజా ఈఎస్ఎస్సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్ మేనేజర్ ఆనంద్కుమార్ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికిల్ సర్వీస్, ఏసీ టెక్నీషియన్ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు. -
బడికి వేళాయె..
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం ● పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధం ● యూనిఫాం వస్త్రం సరఫరాలో జాప్యం ● మొదటి రోజు విద్యార్థులకు కొత్త దుస్తులు లేనట్టే.. కందనూలు: వేసవి సెలవులు ముగిశాయి. దాదాపు నెలన్నర రోజులపాటు ఇళ్ల వద్ద కాలక్షేపం చేసిన విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్లి చదువుకునే విధంగా తల్లిదండ్రులు మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులను ఉన్నత లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లాలనే ఉత్సాహం నెలకొంది. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇలా.. సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు 2021–22 81,129 40,179 2022–23 72,237 41,015 2023–24 63,291 47,406 2024–25 58,133 50,505 2025–26 54,666 47,504 -
పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి..
కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
అరక సాగింది
వాన కురిసింది.. శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వర్షాలు ● నల్లమలలో అత్యధికంగా 81.8 మి.మీ., వర్షపాతం నమోదు ● పొంగిపొర్లిన చంద్రవాగు, చెంచుపల్గుతండా మార్గం ● అచ్చంపేట తుమ్మలకుంటలో నీట మునిగిన 33/11 కేవీ సబ్స్టేషన్ ● జిల్లాలో ఊపందుకోనున్న వ్యవసాయ పనులు బల్మూర్ మండలం మైలారంలో పత్తి విత్తనాలు విత్తుతున్న మహిళలు అచ్చంపేటలోని తుమ్మలకుంటలో నీట మునిగిన సబ్స్టేషన్ పొంగిపొర్లుతున్న చంద్రవాగు ఉప్పునుంతల మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగులు పారాయి. ఉప్పునుంతల మహాసముద్రం చెరువు, వెల్టూరు చెరువు, కాంసానిపల్లి మర్యాద సముద్రం చెరువు, చీకటివాగు తదితర చెరువులు, కుంటలు అలుగులు పారాయి. ఉప్పునుంతల– అచ్చంపేట రహదారిలో మల్లప్పవాగు ప్రాంతంలో వరదనీరు రోడ్డుపై పారుతుంది. దీంతో ప్రజలు అలుగులు పారిన నీటిలో చేపలు పడుతూ కనిపించారు. అచ్చంపేట/ ఉప్పునుంతల/ తాడూరు: జిల్లాలో తొలకరి వర్షాలు పలకరించడంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి నల్లమలలో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు అరకలు, ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుక్కులు దున్నిన రైతులు పత్తి గింజలు వేస్తున్నారు. సాగుకు అనుకూలనమైన వర్షాలు పడటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అదును కోసం ఎదురుచూసిన రైతన్నలు వర్షం రాకతో వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయ్యారు. ఇప్పటికే కొంతమంది రైతులు కురిసిన కొద్దిపాటి వర్షానికి విత్తనాలు నాటుకోగా.. వర్షం అనుకూలంగా ఉండటంతో మొలకలు ఇబ్బందిలేకుండా మొలుస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఉప్పొంగిన చంద్రవాగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి నల్లమలలో కురిసిన భారీ వర్షానికి చంద్రవాగు పొంగిపొర్లుతుంది. దీంతో చంద్రసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతుంది. ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నల్లమలలో సగటున 81.8 మి.మీ., వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా ఉప్పునుంతల మండలం వెల్టూరులో 105.8 మి.మీ., వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో ఇప్పటికే రైతులు విత్తిన విత్తనాలు నీట మునిగి కొట్టుకుపోయాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న చంద్రవాగు వెంట ఉన్న లో లెవల్ వంతెనలను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఈ వాగు వల్ల చౌటపల్లి, బాణాల, బిల్లకల్లు, చెంచుగూడెంలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైలెవల్ వంతెన మంజూరు చేయాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను ఎమ్మెల్యే ఫోన్లో కోరారు. అలాగే అచ్చంపేట పట్టణంలోని తుమ్మలకుంటకు భారీగా నీరు వచ్చి చేరడంతో అచ్చంపేట– చౌటపల్లి రోడ్డులో తుమ్మలకుంట శిఖం భూమిలో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ నీట మునిగింది. తాడూరు మండలం గుంతకోడూరు శివారులో అరక దున్నుతున్న రైతు వర్షాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఎరువులతోపాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనుల సందడి మొదలైంది. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. వ్యాపారుల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయాధికారి -
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
● 3 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక దృష్టి ● మహబూబ్నగర్ ఆర్ఎం సంతోష్కుమార్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిగతా డిమాండ్లపై కార్మిక సంఘాలతో టీజీఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎప్పటిలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు. -
ప్రేమలో వేరై... చావులో ఒక్కటై!
కొల్లాపూర్ రూరల్: వారిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డుచెప్పారు. యువతిని మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆమె.. ప్రేమించిన యువకుడు ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఎల్లూరుకు చెందిన తెలుగు శ్రీను కుమారుడు శివ (25), అదే గ్రామానికి చెందిన గొల్ల కర్రెన్న కూతురు రేణుక (21) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇరువురి కుటుంబాలకు తెలియడంతో పలుమార్లు మందలించారు. రెండేళ్ల క్రితం రేణుకను కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన సమీప బంధువు గొల్ల కృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. శివకు పెళ్లి కాలేదు. ఏడాది క్రితం రేణుకకు కూతురు జన్మించింది. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకోవడంతో కొంతకాలం హైదరాబాద్కు వలస వెళ్లారు. ఇటీవలే ముక్కిడిగుండం గ్రామానికి వచ్చారు. ఈక్రమంలోనే వారం రోజుల క్రితం రేణుక ఎల్లూరుకు వచ్చింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రించాక ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు గ్రామ సమీపంలోని మామిడి తోటలో రేణుక, శివ ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎన్నటికో..?!
త్వరలోనే ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పర్యాటకుల కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేశాం. టాయిలెట్స్ నిర్మించాం. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ కొల్లాపూర్: పర్యాటక ప్రియులను ఆకర్షించేలా.. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన ఈ పార్కులో వ్యూ పాయింట్ సైతం అందుబాటులో ఉంది. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. అయితే అన్నిరకాల పనులు పూర్తయ్యాయి అని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ పార్కు అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వ్యూ పాయింట్ ఇదే.. సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కృష్ణానది, నల్లమల అందాలు తిలకించేలా వ్యూ పాయింట్ నిర్మాణం ఇప్పటికే రోడ్డు నిర్మాణం, వసతుల కల్పన పూర్తి రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి -
నిధులున్నా.. నత్తనడకే!
●రైల్వే పనులతోనే ఆలస్యం.. రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్లైన్ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. – వరప్రసాద్, ఏఈ, రామన్పాడ్ జలాశయం అగ్రిమెంట్ పూర్తి కాలేదు.. అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ, ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్ ప్రధాన పైప్లైన్, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్ పైప్లైన్ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైప్ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత ఎత్తిపోతల.. అమరచింత ఎత్తిపోతల పథకాన్ని 1999–2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఎత్తిపోతల ఆయకట్టు 2,200 ఎకరాలు ఉండగా.. ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో రైతులు వరి, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. 24 ఏళ్లుగా సాగునీటిని పంపింగ్ చేస్తున్న సెక్షన్ పైపులు తుప్పు పడుతుండటంతో వీటిని మార్చేందుకు ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసింది. ఐదు సెక్షన్ పైపులను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేసి వానాకాలంలో రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్కు ముందుకు రాకపోవడంతో ఆలస్యమవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎత్తిపోతల ఆయకట్టు కింద మూలమళ్ల, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. 1,099 మంది రైతుల భాగస్వామ్యంతో ఎత్తిపోతల నిర్వహణ కొనసాగుతోంది. చిన్న చిన్న మరమ్మతులు తప్ప చెప్పుకోదగిన పనులు ఏవీ లేవని.. సెక్షన్ పైపులు మాత్రమే త్వరగా మార్చేస్తే సాగునీరు సకాలంలో రైతులకు అందించవచ్చని ఆయకట్టుదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చెబుతున్నారు. ముందుకుసాగని ఎత్తిపోతల మరమ్మతు సరళాసాగర్ ప్రధాన పైప్లైన్.. ‘అమరచింత’ సెక్షన్ పైపులఏర్పాటులో ఆలస్యం మొదలైన వానాకాలం పంటల సాగు పనులు పూర్తయితేనే ఆయకట్టుకు నీటి విడుదల సరళాసాగర్లో ఇలా.. సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్లైన్ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘సర్’ పై అప్రమత్తంగాఉండండి
కొల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సర్పై అవగాహన కోసం డీసీసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు. సర్ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. మతం పేరుతో ఓట్లు తొలగించేందుకు ఇదో రకమైన కుట్ర అన్నారు. బూత్ స్థాయిలో ఉండేవారు ఓటరు జాబితాను జాగ్రత్తగా గమనించాలని, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి వివరాలు రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మేలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంతోపాటు పలు అంశాల్లో ఇదే జరుగుతోందన్నారు. విపక్షాల ఓటుబ్యాంకును తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ శ్రేణులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ బూత్స్థాయిలో ఓటరు జాబితా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఓటుబ్యాంకును తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బస్సు యాత్ర ప్రారంభం.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించేందుకు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం కొల్లాపూర్లో ప్రారంభమైంది. యాత్రను డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గతంలో చేసిన పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్చైర్మన్ రహీంపాష, నాయకులు హన్మంతునాయక్, నర్సింహ, ఎక్బాల్, ధర్మతేజ, సూర్యప్రతాప్గౌడ్, దండు నర్సింహ, రామన్గౌడ్, నర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన -
కార్మికుల సమస్యలుపరిష్కరించాలి
నాగర్కర్నూల్ రూరల్: మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, జీఓ 51 సవరించి గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీఓ శ్రీరామ్కు అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ యూనియన్ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీరిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి పనిచేసినా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై తే జీవితకాలం పెన్షన్ తీసుకుంటూ రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకుంటే నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రామయ్య, శంకర్నాయక్, కాశన్న, నాగరాజు, వెంకటేశ్వర్లు, లింగస్వామి, పరశురాములు, రామకృష్ణ, హుస్సేన్, బాలస్వామి, భిక్షపతి, యాదయ్య, వెంకటమ్మ, లింగమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యరంగాలపరిరక్షణకు ఉద్యమాలు పాన్గల్: పేదలకు ప్రభుత్వ విద్య, వైద్యరంగాలు ప్రాథమిక హక్కులని.. వాటి పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గంధం భగత్ అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్య అనేది సామాజిక అభివృద్ధికి మూలస్తంభమని.. గ్రామీణ పేదలు, దళితులు, బడుగు బలహీనవర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలే ఆశా కిరణాలన్నారు. రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి మండల కేంద్రాల్లో 4 వేల పాఠశాలలు నెలకొల్పాలని సీఎం స్వయంగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందకపోతే సామాజిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది, మందులు, పరికరాల కొరత నెలకొందని.. పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
కొల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్పై అవగాహన కోసం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి నిరంజన్రెడ్డితోపాటు నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, వాటన్నింటికీ ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పదేపదే గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నష్టం జరి గిందని మంత్రి జూపల్లి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అందులో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉంటున్నారని, గత ప్రభు త్వాల పాలనలో ఆయన పాత్ర కూడా ఉందనేది గుర్తించుకోవాలన్నారు. నేను ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిచి వనపర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా చే శా.. మెడికల్, ఫిషరీస్ కాలేజీలు తీసుకువచ్చా. జిల్లా రూపురేఖలు మార్చా. ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన మీరు కొల్లాపూర్ను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ పాలనను గతంలో జూపల్లి ప్రశంసిస్తూ మాట్లాడిన వీడియోలను ఆయన సమావేశంలో ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రజలు సీఎంలను ఎన్నికల్లో ఓడ గొడుతున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్లో అదే జరిగింది. రేపు కొడంగల్ కూడా అదే జరగొ చ్చు. రేవంత్రెడ్డి ఓడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి మాట్లాడు తూ నియోజకవర్గంలో అధికార పార్టీ వేధింపులు పరాకాష్టకు చేరాయని, ఇక సహించేది లేదన్నారు. అక్రమ కేసులు, వేధింపులు, భూకబ్జాలపై పోరా టాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి అల్లీపూర్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు రఘువర్ధన్రెడ్డి, నరే ందర్రెడ్డి, న్యాయవాది రవికుమార్, జంబులయ్య, బండల వెంకటస్వామి, రాంచందర్యాదవ్, సురేందర్రావు, గోపాల్యాదవ్, శంకర్నాయక్, సాయిరాంయాదవ్, జగదీష్రెడ్డి, భాస్కర్రావు, నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడొద్దు : మాజీమంత్రి నిరంజన్రెడ్డి -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
కందనూలు: జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, ఉపకేంద్రాల్లో అందిస్తున్న సేవలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మాతాశిశు ఆరోగ్యంపై అధికారులు దృష్టిసారించాలని, గర్భిణుల నమోదు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ప్రసవానికి ముందు, తర్వాత అవసరమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను ముందుగానే అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యా ల సాధనలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సి బ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కృష్ణ, ఇ మ్యూనైజేషన్ అధికారి రవికుమార్ పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలి
లింగాల: సమాజంలో బాలకార్మిక వ్యవస్థ అనేది పేరుకుపోయిందని, దీని నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలంగౌడు అన్నారు. మండలంలోని రాంపూర్లో శుక్రవారం యాక్సెస్ టు జస్టిస్, కోనేరు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా లైంగిక వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా హోటళ్లు, మోటారు మెకానిక్ పాయింట్లు, కిరాణం దుకాణాలు ఇతరత్రా వ్యాపార కేంద్రాలలో బాలకార్మికులు అధికంగా ఉంటారని, అలాంటి ప్రదేశాల్లో బాల, బాలికలు పనులు చేస్తుంటే నిర్మూలించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచు కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి పాండునాయక్, మాజీ సర్పంచు సుధీర్గౌడు, జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కోఆర్డినేటర్ సునీత, కోనేరు సంస్థ ఏరియా కోఆర్డినేటర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం పంచాయితీ
రాజధానికి చేరిన రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు ● కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం ● తూతూమంత్రంగా జిల్లాస్థాయి అధికారుల చర్యలు ● చేసేది లేక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ●వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపా లు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం.కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయి లో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు చేయాలంటే కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ బాండ్లు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని కొందరు మిల్లర్లపై అధికారులు ఉదాసీనత కనబరుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసిన నాచారంపేట శివారులోని మిల్లు యజమాని కేవలం రూ.10 లక్షల బ్యాంకు గ్యారంటీ చెల్లిస్తే రూ.కోటి విలువ చేసే ధాన్యం మాత్రమే ఇవ్వాలి. కానీ అధికారులు సుమారు 6.50 కోట్ల ధాన్యం కేటాయింపులు చేయడం ఆరోపణలకు బలం చేకూరినట్లుగా భావించాల్సి వస్తుంది. ధాన్యం కేటాయింపు లు, కొన్ని మిల్లుల్లో ని ల్వలు లేకపోవడం తదితర అంశాలపై కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికాగానే విచారణ చేపడతాం. అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు. బ్యాంకు గ్యారంటీ విలువ ఆధారంగానే ధాన్యం కేటాయింపులు చేయాలనే నిబంధన ఉంది. కొనుగోలు కేంద్రాలకు అత్యధికంగా ధాన్యం రావడంతో కొన్నిసార్లు ఎక్కువ మోతాదులో కేటాయింపులు చేయాల్సి వచ్చింది. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలానికి చెందిన ఓ మిల్లర్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.120 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకున్నారు. అందులో కనీసం పదిశాతం బియ్యం కూడా ఇవ్వలేదు. ఆయనకే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం తరలింపు కాంట్రాక్టును అధికారులు అప్పగించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నాయకులు పలుమార్లు విమర్శలు చేసినా.. కనీసం విచారణ చేపట్టకపోవడం గమనార్హం. -
పెట్రోల్ బంక్ యజమానిపై దాడి
● నగదు, బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడు ● పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఘటన అమరచింత: పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో కొంతమంది నిందితులు పెట్రోల్ బంక్ యాజమానిపై దాడిచేసి రూ.2.50లక్షలు, రెండున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన ఘటన పట్టణంలో కళకళం రేపింది. అమరచింత పట్టణానికి చెందిన బిలకంటి రామ్మోహన్శెట్టి తన పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి వర్కర్స్ నుంచి కలెక్షన్కు సంబంధించి రూ.2.50లక్షల నగదును తీసుకుని కారులో ఇంటికి బయలుదేరాడు. రామ్మోహన్ శెట్టి ఇంటికి వస్తున్నాడనే సమాచారంతో అదే గ్రామానికి చెందిన డీసీ.రాజశేఖర్ తన తమ్ముళ్లను వెంటపెట్టుకుని కాపు కాశా డు. కారు ఇంటి వద్దకు రాగానే డీసీ రాజశేఖర్ రాడ్డు, కత్తితో అకస్మాత్తుగా రామ్మోహన్శెట్టిపై దాడి చేసి గాయపర్చాడు. బ్యాగ్లో ఉన్న రూ.2.5లక్షల నగదుతోపాటు రెండు తులాల బంగారు గొ లుసు ను లాకెళ్లాడని బాధితుడు రాత్రికిరాత్రే పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. రామ్మోహన్శెట్టి ఇంటికి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరమే ఉన్నా.. నిందితులు ఇ లా మారణాయుధాలతో దాడి చేయడం పట్టణంలో కళకళం రేపింది. ఈ ఘటనపై బాధితుడు రామ్మోహన్శెట్టి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కొనుగోలు చే యనని రాజశేఖర్కు తెలుపగా.. రేషన్ బియ్యం మీ రైస్మిల్లులో ఉంచి నీపై కేసు అయ్యేటట్లు చేస్తానని పలుమార్లు బెదిరించాడని తెలిపారు. ఇదే తరహాలో రాయచూరు, అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, దేవరకద్ర, కొత్తకోటలోని రైస్మిల్ల యాజమానులపై బ్లాక్ మెయిల్ చేస్తూ తనను కూడా బ్లాక్ మె యిల్ చేశాడని ఆరోపించారు. తన రైస్మిల్లో రేషన్ బియ్యం దందా చేయనని పలుమార్లు చెప్పినా.. నిందితుడు రాజశేఖర్ దందా చేయకుంటే తనకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వ ని పక్షంలో పలుమార్లు తన ఇంటిపై రాత్రిపూ ట రా ళ్లు రువ్వి భయపెట్టినా పట్టించుకోకపోవడంతో ఇలా కత్తితో దాడిచేసినట్లు ఆరోపించారు. డీసీ రాజశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు విలేకరులకు తెలిపారు.ఈ వ్యవహారంలో డీసీ రాజశేఖర్ పట్టణంలో రియల్ఎస్టేట్ వ్యాపా రి కాడ్గి గణేష్ ద్వారా తాము కొనుగో లు చేసిన ప్లాట్ల వ్యవహారంలో నష్టపోయామని తమకు రూ.36లక్షలు ఇవ్వాలని పలుమార్లు డీసీ రాజశేఖర్ తనను బెదిరించినట్లు పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై పోలీసులను అడుగగా.. ఫిర్యాదు అందిందని విచారిస్తున్నామని ఎస్ఐ స్వాతి తెలిపారు. -
వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న లారీ
● అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి.. ● ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఊరుగొండ వద్ద ఘటన దామెర: వాటర్ ట్యాంకర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఐకేపీనుంచి పాతవడ్లు తరలింపు!
పాన్గల్: మండలంలోని మాందాపూర్లో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం నుంచి పాత ధాన్యం లోడ్తో శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రైసుమిల్లుకు తరలించగా.. మిల్లు యజమాని పరిశీలించి పాత వడ్లు ఉన్నట్లు గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచార ణకు ఆదేశించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్తీక్రావు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ఆంజనేయులు, టెక్నికల్ అధికారులు మాందాపూర్లోని ఇషాన్ రైస్ మిల్లుకు చేరుకొని లారీలో లోడ్ చేసిన ధాన్యం, రైస్మిల్లులో నిల్వ ఉ న్న ధాన్యం ఒక్కటేనా అనే విషయాలను పరిశీలించి ధాన్యం శాంపిల్ తీసుకొని విచారణ చేస్తున్నామ ని పూర్తి నివేదికను జిల్లా అధికారులకు నివేదిస్తామ ని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి మాందాపూ ర్ నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలో ని కేతేపల్లి రైస్మిల్లు, లేకుంటే గద్వాల రైస్మిల్లు కు పంపాల్సి ఉండగా శ్రీరంగాపూర్ రైస్ మిల్లుకు పంపడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ట్రక్ షీట్లో ధాన్యం కొనుగోలు చేసే కమి టీ సభ్యుల సంతకాలు లేకుండా పంపించడం కూ డా అనుమానాలకు తెరలేపింది.ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యంపై ఐకేపీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తించిన మిల్లు యజమాని, జిల్లా అధికారులకు సమాచారం విచారణ చేపట్టాలని తహసీల్దార్కు ఆదేశం మిల్లును సందర్శించిన రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు -
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
కోడేరు: మండలకేంద్రంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి గురువారం ఎత్తం శివారులోని మాలవాగు సమీపంలో శవమై కనిపించాడు. ఎస్ఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. కోడేరుకు వట్టెల రాములు (35) ఈ నెల 7న ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై సింగోటం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మాలవాగు సమీపంలో మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్లపొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో రాములు మతిస్థిమితం లేకుండా పడిపోయాడు. అదే రోజు రాత్రి 8గంటల ప్రాంతంలో ఆయన సెల్ఫోన్ నుంచి తెలిసిన వారికి ఫోన్చేసి దాహం వేస్తుంది.. నీరు తేవాలని కోరాడు. అంతలోనే ఫోన్ స్విచాఫ్ కావడంతో కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ విషయంపై అతడి సోదరుడు రాంచంద్రయ్య కోడేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం అటుగా వెళ్తున్న వారు మాలవాగు వద్ద దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని చూడగా.. మిస్సింగ్ అయిన వ్యక్తి రాములు అని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. ప్రస్తుతం అతడు కూడా చనిపోవడంతో తన ఐదేళ్ల కూతురు అనాథగా మారింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బుద్దారం గండిలో మృతదేహం లభ్యం గోపాల్పేట: అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించిన ఘటనలో మండలంలో గు రువారం చోటుచేసుకుంది.పోలీసులు, బాధిత కు టుంబ సభ్యుల వివరా ల మేరకు.. మండలంలోని ఏదుట్లకు చెందిన దొబ్బల శాంతయ్య (58) రెండు నెలల క్రితం కూలి పనులు చేసుకునేందుకు ఏపీలోని శ్రీకాకుళం వెళ్లాడు. మే 19న గ్రామానికి వచ్చినా.. ఇంటికి వెళ్లలేదు. విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెతికి నా ఆచూకీ లభించకపోవడంతో జూన్ 4న గో పాల్పేట పోలీస్స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం బుద్దారం గండి స మీపంలోని చెట్లల్లో కుళ్లిన స్థితి ఒక మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శశిధర్ సిబ్బంది తో కలిసి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. ఏదుట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా అను మానించి కుటుంబ సభ్యులను పిలిపించి చూి పంచగా దొబ్బల శాంతయ్య అని నిర్దారించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి,కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డబ్బు ఇవ్వలేదని బలవన్మరణం పాన్గల్: ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పా ల్పడిన ఘటన గురువా రం మండలంలో చోటు చేసుకుంది.కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కదిరెపాడుకు చెందిన కాసాని వెంకటేష్ (32) కు మూడేళ్ల క్రితం భార్య పద్మతో విడాకులయింది. ఈ క్రమంలో మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరగా.. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై గ్రామ శివారులోని కేఎల్ఐ కాల్వ పక్కన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ కుర్మయ్య పేర్కొన్నాడు. ఉత్తీర్ణత సాధించలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య మహబూబ్నగర్ క్రైం: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్ ఏరియాకు చెందిన హాబీబ్ ఉమేద్(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు. ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మక్సూద్కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్ ఉమేద్ ఉన్నారు. -
విత్తన శుద్ధితోనే అధిక దిగుబడి
అలంపూర్: ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతాయి. పెరుగుతున్న విత్తన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. విత్తనాల కొనుగోలు, పురుగు, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో విత్తన శుద్ధితో పంటసాగులో ఎదురయ్యే సమస్యలను కొంత వరకు అధికమించడానికి అవకాశం ఉందని ఏఓ నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. విత్తన శుద్ధి చేయకపోతే పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి మొక్కల సాంద్రతను, దిగుబడిని గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉంది. ఖరీఫ్లో పంటసాగు చేస్తున్న రైతులకు విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. లాభాలు: విత్తన శుద్ధితో మొలక శాతం పెరిగి సాంద్రత సిఫా ర్సు మేరకు ఉంటుంది. తొలి దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుతుంది. దీంతో మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. చీడపీడల ఉధృతిని తగ్గించి, తర్వాత దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాక వాతవరణ కాలుష్యం తగ్గి మిత్ర పురుగులు రక్షించబతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన శుద్ధిలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి సరైన మందులు ఎంపిక చే సుకోవాలి. విత్తనంలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. సరైన మోతాదు మందులు వాడాలి. విత్తనం పై పొర ఊడిపోకుండా చూసుకోవాలి. అయితే విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువుల దాణాగా వాడకూడదు. వివిధ పంటల విత్తన శుద్ధి : విత్తన శుద్ధికి ఒక్కొక్క పంటకు ఒక విధానం ఉంటుంది. వాటిని గమనించి రైతులు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. వరి: ఒక కిలో వరి విత్తనంలో ఒక గ్రామ్ కార్టింజమ్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ఒక రోజు నానబెట్టాలి. ఒక రోజు మండె కట్టి నారు మడిలో చల్లడం వలన అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగుళ్లను అదుపు చేయవచ్చు. మొక్కజొన్న: ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్ కలిపి శుద్ధి చేస్తే ఎండు తెగులు, కాటక తెగులు, మచ్చ తెగుళ్లను అదుపు చేయవచ్చును. వేరుశనగ: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజేబ్తో శుద్ధి చేస్తే తిక్కాకు, ఆకుమచ్చ, తుప్పు, కాంత కాళ్ల తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. పత్తి: బ్యాక్టీరియా వల్ల నల్లమచ్చ ఆశించే ప్రాంతాల్లో లీటర్ నీటిలో 100 మిల్లీ గ్రాముల వైంసన్ లేదా ప్లాంటామైసిన్ గాని, ఒక గ్రామ్ బ్లైటాన్స్ కలిపిన ద్రావణంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 నుంచి 8 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టుకొని విత్తుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిరప : మిరపలోని వైరస్ తెగుళ్ల నివారణకు ఒక లీటర్ నీటిలో 150 గ్రాముల ట్రై సోడియం, ఆర్థ ఫాస్సేట్లో ఒక కిలో మిరప విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి తర్వాత చల్లటి నీటిలో కడిగి విత్తుకోవాలి. దీంతో మంచి దిగుబడి సాధించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు మంచిది చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా.. వాటిని ముందుగానే విత్తన శుద్ధితో అదుపు చేసుకోవాలి. దీని వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా అధిక దిగుబడి సాధించి ఆదాయం పొందవచ్చు పాడి–పంట -
ఎడమ కాల్వ వెలవెల.. సమాంతర కాల్వ కళకళ
నీటితో కళకళలాడుతున్న సమాంతర కాల్వ సాగునీరు లేక వెలవెలబోతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ కాల్వతో పాటు సమాంతర కాల్వలకు సాగునీటిని పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కాల్వల షట్టర్లను మూసివేశారు. అయితే సమాంతర కాల్వ ప్రధాన షట్టర్ లీకేజీ కారణంగా నీరు పారుతూ కళకళలాడుతోంది. మరోవైపు ప్రధాన ఎడమ కాల్వ మాత్రం నీరు లేక వెలవెలబోతోంది. అతి సమీపంలో ఉన్న రెండు కాల్వలను చూస్తున్న రైతులు ఎంత తేడా.. ఇది ఎంత తేడా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – అమరచింత -
అనుమానాస్పదంగా యువతి బలవన్మరణం
చిన్నచింతకుంట: అనుమానాస్పదంగా యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చి న్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంటకు చెందిన తేజశ్విని (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. బుధవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యు లు నిద్రిస్తుండగా ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొ ని మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూ ర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన
● శ్రీశైలం రోడ్డుపై బైఠాయించి శాలివాహనుల ధర్నా ● ఆలయం హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ ఉప్పునుంతల: మండలంలోని లత్తీపూర్ శివారు పరిధి డిండి ప్రాజెక్టు వద్ద కట్ట మైసమ్మ ఆలయం వద్ద గురువారం లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొంతసేపు ఆలయం ముందున్న శ్రీశైలం–హైదరాబాద్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 1947లో డిండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైసమ్మ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి తాము పూజారులుగా వ్యవహరిస్తుండగా ఇటీవల ఆలయ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆలయ కమిటీలో కూడా తమకు సరైన స్థానం కల్పించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద రాజకీయం చేస్తూ మమ్ములను ఆలయం వద్దకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా కుమ్మర కులస్తులను నియమించాలని, ఆలయం వద్ద పూజారులతోపాటు అన్ని హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్ చేశారు. నిరసనలో రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు, గౌరవ సలహాదార్లు రామచంద్రయ్య, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, వీరయ్య, సహాయ కార్యదర్శి శంకరయ్య, జిల్లా సంఘం అధ్యక్షుడు రఘుబాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షులు సుల్తాన్, జంగయ్య, మండల సీనియర్ నాయకులు బాలయ్య, మల్లయ్య, రమేష్, అంజి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. కుమ్మరి కులస్తులపై కేసు నమోదు కట్ట మైసమ్మ ఆలయం వద్ద అన్ని హక్కులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బంది కల్గించినందున లత్తీపూర్కు చెందిన కుమ్మరి కులస్తులు దేవర్ల మల్లయ్య, రమేష్, రవి, వెంకటేష్, అంజనమ్మ తదితర మొత్తం 12మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నర్వ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘట న నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పబ్బ తి రమేశ్ వివరాల మేరకు.. చిత్తనూర్కు చెందిన బండ రాంరెడ్డి (50) తన బైక్లో పెట్రోల్ పోయించుకునేందు కు రాంపూర్ గేట్ సమీపంలో ఉన్న బంక్కు వెళ్తుండగా.. పత్తి మిల్లు వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 అంబులెన్స్లో మరికల్కు, అటు నుంచి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు హర్షవర్ధన్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బస్సు యాత్రతో పథకాలపై అవగాహన
తిమ్మాజిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను బస్సు యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన, ప్రగతి నివేదిక బస్సు యాత్ర గురువారం తిమ్మాజిపేటకు చేరుకోవడంతో మండల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వివేక్రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివాస్, నాయకులు ఉస్మాన్, లక్ష్మీనారాయణ, దేవస్వామి, మాధవులు, సురేందర్, వెంకటయ్య, రాము, రాజు, బాలకృష్ణ, రాఘవేందర్, పలు గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడూరు: పార్లమెంట్ సభ్యుడు ఎంపీ మల్లురవి చేపట్టిన ప్రజా పాలన సంక్షేమ పథకాల అమలుపై చేపట్టిన బస్సుయాత్ర మండల కేంద్రానికి చేరుకుంది. ఆయా గ్రామాల కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణరావు, సర్పంచ్మల్లయ్య, అధ్యక్షుడు రమేష్, రాంచంద్రారెడ్డి, యూత్ జిల్లా అధ్యక్షుడు వినోద్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్రెడ్డి -
ఆర్థిక స్వావలంబన సాధించాలి
అచ్చంపేట రూరల్: చేతివృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని హస్తకళల డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల అన్నారు. గురువారం పట్టణంలోని శాలివాహన భవనంలో జిల్లాలోని వెదురు ద్వారా వస్తువులు తయారు చేస్తున్న హస్త కళాకారులకు మాతృభూమి సంస్థ ఆధ్వర్యంలో పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సువర్చల, ఏపీపీసీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయసాగర్రెడ్డి మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, హస్తకళల డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సమాజంలో ప్రకృతి సిద్ధంగా లభించే చెట్లు, మట్టి, రాళ్లు, లోహాలు, ధారాలతో హస్తకళల ద్వారా వస్తువులు తయారు చేసేవారిని ప్రోత్సహించి, తయారు చేసిన వస్తువులు మార్కెట్లో అమ్ముకుని వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారిని ఆర్థిక స్వావలంబన వైపు వెళ్లే విధంగా హస్తకళలో శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 50 మంది వెదురు హస్త కళాకారులకు సుమారు రూ.5 లక్షల విలువైన 13 రకాల పరికరాలను అందజేశామన్నారు. వీటిని హస్త కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హస్త కళాకారులు చేసినటువంటి వస్తువులను ప్రభుత్వమే ఎగ్జిబిషన్ల ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి వారికి ప్రయాణ ఖర్చులతోపాటు, ప్రతిరోజు భోజన ఖర్చులు, వసతి సదుపాయం కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో హస్తకళల కళాకారులకు శిక్షణ శిబిరాలు, స్టడీ టూర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో హస్త కళాకారుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకునే విధంగా సహకరిస్తామన్నారు. -
సేవలు విసర్తిసాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
మొలకెత్తిన ధాన్యంతో రైతుల నిరసన
పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో లారీలు రాక తూకం చేసిన వరి ధాన్యం బస్తాలతో పాటు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి బస్తాల్లోని ధాన్యం మొలకెత్తడంతో గురువారం రైతులు నిరసన తెలిపారు. వారికి సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ మాట్లాడారు. కేంద్రంలో 60 మంది రైతులకు చెందిన 6 వేలకుపైగా ధాన్యం బస్తాలు లారీలు రాక 50 రోజులుగా నిల్వ ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 100కు పైగా బస్తాల్లోని ధాన్యం మొలకెత్తినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్తో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం చేస్తామని, ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చినా.. చాలా కేంద్రాల్లో నేటికీ ధాన్యం, బస్తాల నిల్వలు పేరుకుపోయాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం బస్తాలను తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
కందనూలు: క్రీడలతోనే మానసికోల్లాసం ఉంటుందని డీవైఎఫ్ఓ సీతారాం అన్నారు. గురువారం నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 రోజులుగా కొనసాగుతున్న ఖోఖో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిస కాకుండా క్రీడా పోటీలకు హాజరై క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడం శుభాపరిణామమన్నారు. వేసవి శిబిరాల ద్వారా విద్యార్థులు తన క్రీడాంశాలను పెంపొందించుకొని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నీతివంతమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అంజయ్య, కృష్ణమోహన్, ప్రసాద్, వెంకట్, శిబిరం కోచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫస్టియర్లో 58.0, సెకండియర్లో 43.0 ● ఇంటర్ సప్లిమెంటరీఫలితాలు విడుదల కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గురువారం వెలువడిన అడ్వాన్స్డ్ ఫలితాల్లో జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.0 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43.0 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1,684 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 734 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 938 మందికి గాను 374 మంది, బాలికలు 746 మందికి గాను 360 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 3,337 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,960 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 1,390 మందికి గాను 610 మంది, బాలికలు 1,947 మందికి గాను 1,350 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్లో 459 మందికి గాను 287 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 643 మందికి గాను 449 మంది ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,388 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటి పంపింగ్ను చేస్తున్నారు. రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, క్యూసెక్కులు ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు మొత్తం 1,543 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. -
నులి పురుగుల నిర్మూలనపై అవగాహన
కందనూలు: నీళ్ల విరేచనాల నియంత్రణ, నులిపురుగుల నిర్మూలన, పల్స్ పోలియో కార్యక్రమాలపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పీహెచ్సీల పరిధిలోని ఆశా వర్కర్లతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో 17 శాతం డయేరియా వల్లే సంభవిస్తాయని, వాటిని అరికట్టడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఈ నెల 16 నుంచి 31 వరకు డయారియా క్యాంప్ నిర్వహించాలని సూచించారు. అలాగే ఈ నెల 28, 29 ,30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో 1–19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోలు మాత్రలు వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రవికుమార్, సురేష్బాబు, డీపీఓ రేనయ్య, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగానే.. యథేచ్ఛగా
‘మన ఇసుక వాహనం’ ద్వారా సక్రమంగా సాగని సరఫరా విచ్చలవిడిగా దందా.. జిల్లాలోని దుందుభీ వాగు తీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఇసుక రవాణా సక్రమంగా చేపట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, కేసీతండా, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి, వంగూరు మండలం ఉల్పర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ సరఫరా కన్నా రెట్టింపు స్థాయిలో అక్రమ రవాణా సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇందిరమ్మ ఇళ్లకూ కొరతే.. జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరా సక్రమంగా అమలుకాక ఇళ్ల నిర్మాణదారులకు తీవ్రమైన ఇసుక కొరత నెలకొంది. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టారీతిగా ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తామని చెబుతుండగా ఎక్కడా అమలుకావడం లేదు. సంబంధిత తహసీల్దార్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో సమయానికి ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక సరఫరా సక్రమంగా సాగడం లేదు. ఈసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక సరఫరాను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఇసుక సరఫరా కోసం ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తే ఎన్ని రోజులైనా బుకింగ్ దొరకడం లేదు. మరోవైపు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను సంప్రదిస్తే మాత్రం క్షణాల్లో ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అందుబాటులో ఆరు రీచులు.. జిల్లాలోని దుందుభీ వాగు పొడవునా ఇసుక సమృద్ధిగా అందుబాటులో ఉంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 17 వరకు రీచుల నుంచి ఇసుక సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలులో మాత్రం ఆరు రీచుల్లోనే ఇసుక సేకరణకు ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు. ఇందు లో కల్వకుర్తి మండలం లింగసానిపల్లి, వంగూరు మ ండలం పోతిరెడ్డిపల్లి, ఉల్పర, తాడూరు మండలం ఏటిదారిపల్లి, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామాల్లో ఇసుక రీచ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇసుక సేకరణతోపాటు సరఫరాలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ప్రభుత్వ ఇసుక కోసం రోజుల తరబడి ఎదురుచూపులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు మరోవైపు అక్రమార్కుల ద్వారా పెద్దఎత్తున తరలుతున్న వైనం అక్రమ రవాణాను అరికడితేనే ప్రభుత్వానికి ఆదాయం -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
కల్వకుర్తి టౌన్: ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సంక్షేమ సేవలు అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాణిజ్య సముదాయం ద్వారా స్థానిక యువత, చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు విస్తరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దుకాణాలను కార్పొరేషన్ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించి ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. క్యాటిల్ మార్కెట్ను సందర్శించిన కలెక్టర్ అక్కడి సదుపాయాలను పరిశీలించి, పశువుల కొనుగోలు, విక్రయాల కోసం వచ్చే రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, నిర్మాణానికి అవసరమైన సామగ్రి, సాంకేతిక సహకారం లబ్ధిదారులకు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కౌన్సిలర్లు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
నాగర్కర్నూల్కు పీజీ కళాశాల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు పాాలమూరు యూనివర్సిటీ తన పరిధిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసిన యూనివర్సిటీ తాజాగా నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోనూ పీజీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు అక్కడి పీజీ కళాశాల ఏర్పాటుపై యూనివర్సిటీ అధికారులు ప్రతిపాదలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీంతో మొదటి దశలో కీలకమైన కళాశాల ఏర్పాటుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆమోదం తెలపగా.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వస్తే ప్రభుత్వం త్వరలో జీఓ విడుదల చేసే అవకాశం ఉంది. వనపర్తి పీజీ కళాశాలకు.. వనపర్తిలో పీజీ కళాశాల ప్రారంభించాక భవనం మాత్రమే నిర్మించిన అధికారులు.. బాల, బాలికలకు హాస్టళ్లు ఇప్పటికీ నిర్మించలేదు. దీంతో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీంతో అధికారులు హాస్టల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న కొంత భూమిలో బాలికల హాస్టల్ నిర్మించనుండగా.. బాలుర హాస్టల్ కోసం స్థలం లేకపోవడంతో కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వీసీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విన్నవించగా 35 గుంటల భూమిని కేటాయిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. మొదట 5 కోర్సులతో.. నాగర్కర్నూల్ జిల్లాలో కళాశాల ఏర్పాటు ప్రతిపాదనల్లో భాగంగా మొదట భూమికి సంబంధించి 2 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ రెండు ఎకరాల భూమిని యూనివర్సిటీ పీజీ కళాశాలకు అధికారులు కేటాయించనున్నారు. ఇందులో పీజీ కళాశాల భవనం, బాల, బాలికల హాస్టళ్లు నిర్మించనున్నారు. దీంతోపాటు మొత్తం 5 కోర్సులతో కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంఏ సైకాలజీ వంటి కోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సబ్జెక్టులో కూడా సుమారు 40 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వానికి పాలమూరు యూనివర్సిటీ ప్రతిపాదనలు ఆమోదం తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యామండలి 5 కోర్సులతో ఏర్పాటుకు త్వరలో చర్యలు 2 ఎకరాల భూమి కేటాయించే అవకాశం వనపర్తి పీజీ కళాశాలలో హాస్టల్స్ నిర్మాణానికి భూమి కేటాయింపు -
ప్రాణాల రక్షణ కోసమే ‘అరైవ్ అలైవ్’
● జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎర్రవల్లి: ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలో సర్పంచ్ అనితా కృష్ణసాగర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి భావోద్వేగాలను ప్రత్యక్షంగా వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రోజు 70 నుంచి 80 వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుడగా.. 20 నుంచి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఇద్దరికి మాత్రమే అనుమతించిన వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి అలవాట్లు ప్రాణాలకు తీవ్ర ముప్పును కలిగిస్తాయని ఆయన వివరించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు స్వయంగా హెల్మెట్ ధరింపజేశారు. పదవ పటాలం కమాండెంట్ జయరాజు, డీటీఓ రాధిక, డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. -
మహేంద్రనాథ్ ఆశయ సాధనకు కృషి
కందనూలు: çÜ…çœ$ çÜ…çÜPÆý‡¢, Ð]l*i Ð]l$…{† ç³#rt-´ëVýS Ð]l$õßæ…-{§ýl¯é£Šl BÔèæÄ¶æ$ Ýë«§ýl¯]lMýS$ MýS–íÙ ^ólĶæ*ÌS° GÐðl$Ã-ÌôæÅË$ MýS*^èl$-MýS$âýæÏ Æ>gôæ-ÔŒæ-Æð‡yìlz, Ð]l…Ö-MýS–çÙ~ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° »êº$ fXjÐ]l-¯ŒS-Æ>ÐŒl$ ¿ýæÐ]l-¯ŒSÌZ Ð]l$õßæ…{§ýl-¯é£Šl Ôèæ™èl fĶæ$…† Ðólyýl$-MýSÌS¯]l$ çœ$¯]l…V> °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ñ{VýS-à-°MìS ç³NÌS-Ð]l*-ÌSË$ ÐólíÜ °Ðé-â¶æ$-ÌS-Ç-µ…-^éÆý‡$. A¯]l…-™èlÆý‡… ÐéÆý‡$ Ð]l*sêÏyýl$-™èl*.. ÝëÐ]l*hMýS ¯éÅĶæ$…, Ððl¯]lMýSºyìl¯]l Ð]lÆ>YÌS A¿¶æ$ů]l²-†MìS ÑÔóæçÙ MýS–íÙ ^ólíܯ]l Vöç³µ Ð]l$çßæ-±-Ķæ¬yýl$ Ð]l$õßæ…-{§ýl-¯é£Šl A° Mö°-Ķæ*-yéÆý‡$. ️B-Ķæ$¯]l BÔèæ-Ķæ*Ë$ ¯ólsìæ ™èlÆ>-°MìS B§ýlÆý‡Ø-{´ë-Ķæ$-Ð]l$-°.. çÜÐ]l*f AÀ-Ð]l–-¨®MìS ^ólíܯ]l õÜÐ]lË$ _Æý‡çÜÃ-Æý‡-×îæÄ¶æ$Ð]l$° A¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ M>…{VðS‹Ü ´ëÈt ¯éĶæ$-MýS$Ë$, {ç³gê-{ç³-†-°-«§ýl$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, డూప్లికేట్ ఎంట్రీల తొలగించడం వంటి అంశాలపై బీఎల్ఏలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితా మ్యాపింగ్తో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని వారు సూచించారు. మహేంద్రనాథ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ -
రుణ ప్రణాళిక ఖరారు
2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.9,768 కోట్లు –8లో uజిల్లా ఆర్థికాభివృద్ధి వేగవంతం కావాలంటే బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని.. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మహిళా సంఘాలు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు విస్తృత స్థాయిలో రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ రంగం జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని.. రైతులు వ్యవసాయ అవసరాలకు సకాలంలో రుణాలు పొందేలా బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రైతులకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ తదితర రంగాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ రంగంలో మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించడమే కాకుండా వాటిని అధిగమించే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు. కందనూలు: జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధికి దిశానిర్దేశం చేసే 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో రుణ ప్రణాళికను రూపొందించారు. మొత్తం 2,77,772 ఖాతాదారులకు వివిధ రంగాల్లో రూ.9,768 కోట్లతో రుణాలు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మొత్తంలో ప్రాధాన్య రంగాలకు 88.42 శాతం వాటా కేటాయించగా.. ప్రాధాన్యేతర రంగాలకు 11.58 శాతం కేటాయింపులు చేశారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర క్రెడిట్ ప్లాన్ ద్వారా వ్యవసాయం, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్య, పునరుత్పాదక ఇంధనం, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన రుణాలు విస్తృతంగా అందనున్నాయి. వ్యవసాయ రంగానికి రూ.8,637 కోట్లు.. జిల్లా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగం కీలక పాత్ర పోషిస్తోంది. రుణ ప్రణాళికలో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. మొత్తం వ్యవసాయరంగ రుణలక్ష్యాన్ని రూ.8,637 కోట్లుగా నిర్ణయించారు. పంటల సాగు, ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సాగునీటి వసతులు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణాలు అందించనున్నారు. అదే విధంగా వ్యవసాయ టర్మ్ లోన్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.6,870 కోట్లు కేటాయించారు. ఫార్మ్ క్రెడిట్ కింద రూ. 2,310.07కోట్లు అందించనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ, పాల ఉత్పత్తి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.129.81 కోట్లు కేటాయించారు. అదనంగా ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.174.24 కోట్లు మంజూరు చేయనున్నారు. పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి రూ.1,014 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. యువ పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి యూనిట్లు, చిన్న వ్యాపార సంస్థలు, గ్రామీణ పరిశ్రమలకు అవసరమైన మూలధనాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్న పరిశ్రమలకు రూ.249.86 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.260 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపన, స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి అవకాశాల సృష్టి, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా జిల్లాలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 37.90 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా 236 మంది విద్యార్థులకు రుణ సదుపాయం లభించనుంది. ఉన్నత విద్య, వృత్తిపరమైన కోర్సులు, సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది. సొంతింటి కలను సాకారం చేసుకునే కుటుంబాలకు గృహ రుణాల రూపంలో రూ.316.25 కోట్లు కేటాయించారు. మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు గృహనిర్మాణం, గృహ విస్తరణ, గృహ కొనుగోలు అవసరాలకు ఈ రుణాలు తోడ్పడనున్నాయి. సామాజిక మౌలిక వసతులు – పునరుత్పాదక ఇంధనానికి మద్దతు, జిల్లాలో సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.5.11 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యేతర రంగానికి మొత్తం రూ.1,131 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. 2,77,772 ఖాతాదారులకు రుణ సదుపాయం ప్రాధాన్య రంగాలకు 88.42 శాతం వాటా కేటాయింపు డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో రుణ లక్ష్యం నిర్దేశం -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● పూరిగుడిసె, మట్టి మిద్దెల్లో నివాసముండే వారికి మొదటి ప్రాధాన్యం ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్/కోడేరు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం, పెంట్లవెల్లి, కోడేరు మండల కేంద్రాల్లోని రైతువేదికలు, పెద్దకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు వివరాలపై ఆరా తీశారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, వాటిలో నిర్మాణాలు పూర్తయినవి, నిర్మాణ దశలో ఉన్నవి, ఇంకా ప్రారంభంకాని ఇళ్ల వివరాలను అధికారులతో తెలుసుకున్నారు. పెంట్లవెల్లి మండలానికి దాదాపు 180 ఇళ్లు మంజూరుచేస్తే.. అందులో 50శాతం ఇళ్లు మాత్రమే నిర్మాణాలు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇళ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభంకాని వాటిని గుర్తించాలని.. లబ్ధిదారులతో స్థానిక నాయకులు, అధికారులు మాట్లాడి, వారు వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. పూరిగుడిసె, మట్టి మిద్దెల్లో నివాసముండే వారికి మొదటి ప్రాధాన్యంగా ఇళ్లు మంజూరు చేశామని.. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గవ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం కూడా పక్కా గృహాల నిర్మాణానికి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్ దేవసహాయం, హౌసింగ్ పీడీ గోపాల్నాయక్, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్లు మాఽ దవి, శ్రీనివాసులు, ఎంపీడీఓలు వెంకట్రావ్, వెంకటేశ్వర్లు, కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ రహీంపాషా, నాయ ్డకులు హన్మంతునాయక్, ప్రతాప్గౌడ్, దండు నర్సింహ, రామన్గౌడ్, పిడమర్తి రవి, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, నక్క వేణుగోపాల్రావు ఉన్నారు. కొల్లాపూర్లో టూరిజం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ కిషన్రావు, ఎన్ఐటీహెచ్ఎంఏ చైర్మన్ వెంకటరమణ, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ బుధవారం కొల్లాపూర్లో మంత్రి జూపల్లిని కలిశారు. అనంతరం కొల్లాపూర్, సోమశిల, జటప్రోల్లోని పర్యాటక ప్రాంతాలను వారు తిలకించారు. పెంట్లవెల్లిలో హార్టికల్చర్ కళాశాల నిర్మాణానికి మంత్రి స్థల పరిశీలన చేశారు. కళాశాలకు 25 – 35 ఎకరాల భూమి అవసరమని.. అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నాయకులు గోపినాయక్, రామన్గౌడ్, గోవింద్గౌడ్, కబ్బీర్, నల్లపోతుల గోపాల్, నాగిరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, నరేష్, నాగరాజు ఉన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
కందనూలు: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు డ్రగ్స్ బారినపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని.. సమాజంపై గౌరవంతో మెలిగే విధంగా పిల్లలను పెంచాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 1908కు సమాచారం అందించాలని ఆయన కోరారు. డీఎస్పీలు బుచ్చయ్య, శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ పాల్గొన్నారు. 32 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 32 మందికి నయాబ్ తహశీల్దార్లుగా(డీటీ) పదోన్నతి పొందారు. ఈ మేరకు బుధవారం సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీటీలుగా పదోన్నతి పొందిన వారిని ఆయా జిల్లాలను కూడా కేటాయించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాకు సి.క్రాంతికుమార్గౌడ్, అబ్దుల్ఖాదర్, అహ్మద్మోయియోద్దీన్, జశ్వంత్కుమార్, కర్ణయ్య ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకు నసీరోద్దీన్, కృష్ణవేణి, అంజద్అలీ, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య, రామస్వామి, మాలతీ, శ్రీను, జ్యోత్స్న, నారాయణపేట జిల్లాకు కవితాబాయి, జ్యోత్స్న, రాఘవేందర్, విజయ్కుమార్, రాధాకృష్ణ, మానస, వనపర్తి జిల్లాకు గౌస్, అరుణ, బాలరామ్, రవికుమార్, మధుసూదన్గౌడ్, రహమాన్, గద్వాల్ జిల్లాకు షఫీక్, రాములు, రాజేష్, వెంకటేశ్వర్లు, నాగరాజు, సికిందర్ను కేటాయించారు. పేదలపై పెనుభారం మోపుతున్న కేంద్రం నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచుతూ.. పేదలపై పెనుభారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. ధరల పెంపును నిరసిస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో సామాన్యం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని రోజులుగా అడ్డగోలుగా పెంచుతున్న ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారి మహమ్మద్ అలీకి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్.ఆనంద్జీ, కేశవులుగౌడ్, తన్నీరు నర్సింహ, పెబ్బేటి విజయడు, ఈర్ల చంద్రమోళి, ఇందిరా, శంకర్గౌడ్, కృష్ణాజీ, శివుడు, ఖాజా, మల్లయ్య, సాయిలు పాల్గొన్నారు. -
బాధ్యత తీసుకోవాలి..
చాలామంది చిన్నపాటి విషయాలకే మనోవేదనకు లోనవుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మేధావులు ఆత్మహత్యల ద్వారా చిన్నాభిన్నమైన కుటుంబాలు లేకుండా.. ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి దీనిపై శ్రద్ధ పెడితే.. ఆత్మన్యూనతా భావంతో.. క్షణికావేశంతో ఆసువులు బాస్తున్న వారిని రక్షించుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు.. పెరుగుతున్న మానసిక సంఘర్షణ ఆత్మహత్యలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవ సంబంధాలు బలహీనంగా మారే వాతావరణంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం.. జీవన విధానంలో పలు కారణాలతో ఏర్పడుతున్న అగాధాలను పూడ్చడం.. సామాజిక తోడ్పాటు ద్వారా ఆత్మహత్యలు పూర్తి తగ్గుతాయి. – వంగీపురం శ్రీనాథచారి, ప్రముఖ మానసిక విశ్లేషకులు ● -
అంతా శూన్యం!
ఒక్క క్షణం.. క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు.. ● బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో 16 నుంచి 40 ఏళ్ల వారే అధికం ● అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు ● కుటుంబంలో వచ్చే విభేదాలే కారణం అంటున్న నిపుణులు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన మహబూబ్నగర్ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా ఏడాది 2025 2026 మహబూబ్నగర్ 183 149 నారాయణపేట 101 43 వనపర్తి 130 41 నాగర్కర్నూల్ 181 67 జో.గద్వాల 43 24 నేను ఈ కోర్సులో రాణించలేకపోతున్నా.. నేను ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నా.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మరణాలకు సిద్ధమవుతారని అంతకు ముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండటం, ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఏడ్వడం, నేను లేకపోయినా మీరు బాగుండాలని చెబుతుండటం, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగకపోవడం, ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందని చర్చించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది. -
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఈఓ, ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరయ్యేలా అన్ని స్కూళ్లను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల ప్రారంభం నుంచి 15 రోజులపాటు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేశ్కుమార్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, నోడల్ అధికారి కుర్మయ్య, సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, వెంకటయ్య, నూరుద్దీన్ ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ యంత్రాలు ఇతర ఎన్నికల సామగ్రిని కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, సీల్ల పరిస్థితి తదితర అంశాలను సంబంధిత అధికారులతో తెలుసుకున్నారు. గోడౌన్ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని ఆయన సూచించారు. -
మైనింగ్ అనుమతులను రద్దు చేయాల్సిందే..
బల్మూర్: మండలంలోని మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలని బల్మూర్, మైలారం గ్రామాల రైతులు ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం పర్యావరణశాఖ ఆధ్వర్యంలో మైనింగ్ ప్రదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. అదనపు కలెక్టర్ అమరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు ప్రజాభిప్రాయ సేకరణ సభలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్వే నంబర్ 2220లోని 7.737 హెక్టార్లలో మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని.. గతంలో మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకిస్తే కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. మళ్లీ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమపై ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మైనింగ్ అనుమతులను రద్దుచేసే వరకు తమ పోరాటం ఆగదని సర్పంచులు శిరీష, సరితతో పాటు ఆయా గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, రైతుల అభిప్రాయాలను రికార్డు చేయడం జరిగిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో మైనింగ్శాఖ అధికారి సురేశ్బాబు ఉన్నారు. ముక్తకంఠంతో నినదించిన బల్మూర్, మైలారం గ్రామాల రైతులు అదనపు కలెక్టర్ సమక్షంలోప్రజాభిప్రాయ సేకరణ -
జనరల్ ఆస్పత్రిలో భారీగా బదిలీలు
పాలమూరు: మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్ఓడీలు హైదరాబాద్కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్పీఎం హెచ్ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్పీఎం హెచ్ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది. కొత్తవారు ఎప్పుడో..? జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు. డీఎంహెచ్ఓ కృష్ణ బదిలీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్ఓగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కృష్ణ నాగర్కర్నూల్ డీఎంహెచ్ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్లు, 24 మంది ఏఎన్ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. లింగాల: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. మంగళవారం లింగాల మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ నిర్వహించి.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ను వినియోగంలోకి తీసుకొచ్చి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఫోన్ ద్వారా ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అదే విధంగా బుద్ధవనం, ఓపెన్ జీమ్ వినియోగంలోకి తీసుకురావాలని సర్పంచ్కు తెలియజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ● ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా లింగాలకు మంజూరైన రెండు ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే వంశీకృష్ణ స్వయం సహాయక మహిళా సంఘాలకు అందజేశారు. మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే కాకుండా.. వ్యాపార వేత్తలుగా, బస్సుల యజమానులుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీఓ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణగౌడు, సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ, బుడ్డయ్య, ఇందిరమ్మ పాల్గొన్నారు. 9 విభాగాల హెచ్ఓడీలు, అసోసియేట్లకు స్థానచలనం డీఎంహెచ్ఓ కృష్ణ నాగర్కర్నూల్కు.. ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్ఎంలు అందరూ బదిలీ జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు -
దుందుభీ.. లూటీ!
వాగును తోడేస్తున్న ఇసుకాసురులు రూ.వెయ్యి ఖర్చు పెట్టు.. రూ.18వేలు కొట్టు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన సాండ్ ట్యాక్సీ విధానాన్ని నీరుగారుస్తూ.. అక్రమ దందాకు తెరలేపడం విమర్శలకు దారితీస్తోంది. ప్రైవేటు సాండ్ విధానం అనుమతి పొందిన వ్యక్తులు టిప్పర్కు రూ.వెయ్యి చొప్పున ఖర్చుచేసి.. రూ. 18వేలు సంపాదిస్తున్నారు. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా.. ప్రైవేటు సాండ్ అనుమతి పొందిన వ్యక్తులు వారి క్వారీ నుంచి పగలు కాకుండా రాత్రివేళ ఇసుక నింపి పంపిస్తు్ాన్నరు. నిత్యం 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక నింపడానికి ఇటాచ్కు రూ.వెయ్యి ఖర్చు అవుతుండగా.. టిప్పర్ యజమానుల నుంచి ఇసుక మాఫియా రూ. 18వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీన్ని ప్రకారం ఇసుక రీచ్లను పొందిన వ్యక్తులు నిత్యం రూ. 1.80లక్షల నుంచి రూ. 2.70లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీరు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించడం లేదు. వీరు బహిరంగ మార్కెట్లో దూరం మేరకు రూ. 35వేల నుంచి రూ. 60వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అచ్చంపేట: జిల్లాలోని దుందుభీ వాగు తీరంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోకవర్గాలను అనుసరించి ఉన్న దుందుభీ వాగులోని ఇసుక నాణ్యతకు పెట్టింది పేరు. ఇక్కడి ఇసుకకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇదే అదునుగా వ్యాపారులు నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో వాగులో ఇసుకను తోడేస్తున్నారు. వాగు సమీపంలో భూగర్భజలాలు అడుగుంటున్నాయని ఇటీవల ఉప్పునుంతల మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేయగా.. ఆరు రోజుల క్రితం ఇదే మండలంలోని దాసర్లపల్లికి చెందిన రైతులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి దాసర్లపల్లికి చెందిన ఇసుక మాఫియా మధ్య గొడవ సైతం చోటుచేసుకుంది. ఈ ఒక్క గ్రామంలోనే రోజుకు రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల ఇసుక వ్యాపారం సాగిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఖాకీలకు కాసుల పంట.. దుందుభీ వాగు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తోంది. కొందరు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇసుక అక్రమ రవాణాలో పాలుపంచుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇసుక రవాణా రెవెన్యూ, మైనింగ్శాఖలకు సంబంధించిన అంశం.. తమకేం సంబంధం లేదని చెబుతూనే పోలీసులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ఇసుక వాహనం నుంచి నెలకు రూ. 15వేల నుంచి రూ. 25వేల వరకు దండుకుంటూ.. ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం ప్రతి పోలీస్స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరూ కిమ్మనడం లేదు. కొందరు ప్రజాప్రతినిధుల మద్దతు సైతం ఉండటంతో ఆ ఖాకీలు ఆడిందే ఆటగా వ్యవహారం సాగుతోంది. దాసర్లపల్లి సమీపంలోని దుందుభీ వాగులో ఇసుక తోడుతున్న దృశ్యం అనుమతుల మాటున అక్రమ దందా నిత్యం వందలాది వాహనాల్లో రవాణా పలు ప్రాంతాల్లో వట్టిపోతున్న వాగు మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఏడాదిలో 300 రోజులపాటు జిల్లాలోని తాడూరు, ఉప్పునుంతల, వంగూరు, అచ్చంపేట, కల్వకుర్తి మండలాల మీదుగా దుందుభీ వాగు ప్రవహిస్తోంది. వాగు పరిసర గ్రామాల సరిహద్దుల్లోనే ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. భారీ వర్షాలు పడి వాగు పొంగిపొర్లితే తప్ప.. ఇక్కడ ఇసుక రవాణా ఆగదు. ఏడాదిలో దాదాపు 300 రోజులపాటు ఇసుక తవ్వుతారు. వాగు పరిధిలో అధికార, అనధికారికంగా 20 రీచ్ల వరకు ఉన్నాయి. అయితే ఆయా మండలాల్లోని ఠాణాల్లో పోస్టింగ్ కోసం కొందరు పోలీసులు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి ఒక్కసారి వచ్చాక వదలడానికి ససేమిరా అంటున్నారనే వాదన వినిపిస్తోంది. అప్పడప్పుడు మాత్రమే కొన్ని వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు..
చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకుగాను ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడతలో 50 మంది సభ్యులున్న సంఘాలకు ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన సంఘాల ఎన్నికలు ఉన్నతాధికారుల నుంచి నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహిస్తాం. సంఘాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి సంఘాలకు పంపించాం. యాక్టివ్గా ఉన్న చేనేత సహకార సంఘాల్లో చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల జిల్లా ● -
నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
వెల్దండ: వనమహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని.. అన్నిరకాల మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి కృష్ణారావు అన్నారు. మంగళవారం వెల్దండ మండలం భర్కత్పల్లి, చెర్కూర్, పెద్దాపూర్, నారాయణపూర్, రాఘవయపల్లి, చౌదర్పల్లి, కేస్లీతండా, రాచూర్, తిమ్మినోనిపల్లి గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు.. ఏ రకమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు వచ్చే నాటికి మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి, గుంతలను తీసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణారావు, అరవింద్రెడ్డి, జీవన్ ప్రకాశ్, క్రాంతికుమార్, టీఏలు లింగస్వామి, సత్యనారాయణ, శివలీల తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ డైరెక్టర్, బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు అన్నారు. సోమవారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మాజీ సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ను 2 నుంచి 5 ఏళ్లు పెంచాలని మాజీ సైనికులు అడుగుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మాజీ సైనికుల సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సైనిక శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి నాగేశ్వర్, ఎమ్మార్కే రెడ్డి, వెంకటయ్యగౌడ్, రాములు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
కందనూలు: రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయించే వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి విత్తన దుకాణాల పర్యవేక్షణ బృందాలు, రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలను కొనుగోలుచేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు అవి ఆధారాలుగా ఉపయోగపడతాయని.. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లాలో అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ అధికారులతో, మండల స్థాయిలో సీఐ, ఎస్ఐ, తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. -
ఫిట్నెస్ లేని బస్సులపై చర్య తీసుకోవాలి
కందనూలు: జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శాంతన్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అనేక ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్, పర్మిషన్ లేని బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారన్నారు. అలాంటి బస్సులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంగనమోని బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్కుమార్, నగర సంయుక్త కార్యదర్శి శివ పాల్గొన్నారు. -
రోడ్డెక్కితే ముప్పే!
ఫిట్‘లెస్’ బస్సులు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి ఏడాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్ (ఎఫ్) తర్వాత క్లాజ్ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్, సెల్ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది. ● 60ఏళ్లు దాటిన డ్రైవర్ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ● బస్సు డ్రైవర్ను నియమించే సమయంలో అతడి లైసెన్స్ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి. ● బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి. మహబూబ్నగర్ క్రైం: పాఠశాలల పునఃప్రారంభ సమయం ఆసన్నమవుతోంది. పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూల్బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పలు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కాలం చెల్లినవి, సామర్థ్యంలేని వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ఈ నెల 15న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్నెస్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నిబంధనలకు విరుద్ధంగా.. చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నాయి. ముఖ్యంగా అటెండెంట్ లేకుండానే డ్రైవర్లతో బస్సులను తిప్పడం.. ఒక రూట్లో వెళ్లే బస్సును మరో రూట్లో నడపడం వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ధ్రువపత్రాల జారీకి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ మార్పు రావడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 1,574 విద్యాసంస్థల బస్సులు ఉండగా జూన్ 8వ తేదీ వరకు 885 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షకు వచ్చాయి. మరో 689 బస్సులు ఇంకా ఫిట్నెస్ చేయించలేదు. ఈ బస్సులకు ఫిట్నెస్ లేకుండా రోడ్లు ఎక్కితే ప్రమాదం పొంచి ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 469 స్కూల్ బస్సులు ఉండగా.. 50 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ బస్సులన్నింటికీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏటా ఆర్టీఓ వద్ద ఫిట్నెస్ పరీక్షలు జరిపి.. అనుమతి పత్రాలు పొందాల్సి ఉంది. అదే విధంగా బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణాశాాఖకు హామీపత్రం సమర్పించాలి. అయితే పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన పలు పాఠశాలల యాజమాన్యాలు.. మరమ్మతు, ఇతర కారణాలతో పూర్తిస్థాయిలో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లా బస్సులు ఫిట్నెస్ ఫిట్నెస్ ఉన్నవి లేనివి మహబూబ్నగర్ 482 317 165 నాగర్కర్నూల్ 305 194 111 వనపర్తి 253 144 109 జోగుళాంబ గద్వాల 277 166 111 నారాయణపేట 257 64 193 నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ప్రైవేటు స్కూల్ బస్సులకు గడవులోపు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్నెస్ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్, బస్సు బ్రేక్, కండీషన్ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్ పంపిస్తున్నాం. కనీసం లైట్ లేకపోయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – నర్సింహస్వామి, ఎంవీఐ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ఇలా.. బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి.. ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స బాక్స్ ఉండాలి. బస్సులో తప్పకుండా ఒక అటెండర్ను ఉంచాలి. అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి. బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్కు వారు కనిపించే విధంగా మిర్రర్ ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి. బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఉండాలి. బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు ప్రతి బస్సుకు హ్యాండ్బ్రేక్, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేయాలి. నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలపై యాజమాన్యాల నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో 1,574 బస్సులకు గాను 885కు మాత్రమే పరీక్షలు కాలం చెల్లిన, సామర్థ్యంలేని వాహనాలతో పొంచి ఉన్న ముప్పు విద్యార్థుల భద్రత పట్టని అధికారులు -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో వ్యయ, ప్రయాసలతో తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజావాణిలో 42 దరఖాస్తులు వచ్చాయని.. వీటిని వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు గ్రీవెన్స్కు 22 ఫిర్యాదులు కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూ తగాదాలకు సంబంధించినవి కాగా.. 11 తగు న్యాయం చేయాలని, 4 భార్యాభర్తల గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ తెలిపారు. డీఎంహెచ్ఓగా కృష్ణ కందనూలు: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డా.కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తానన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు
వనపర్తిటౌన్: చదరంగంతో జ్ఞాపకశక్తి, శ్రద్ధ పెంపొందుతాయని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. మురళీధర్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అండర్–9, 11, 13 విభాగాల్లో రాష్ట్రస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలను డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదరంగం మెదడుకు వ్యాయామమని, సమస్యల పరిష్కారం, సామర్థ్యాలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని చెప్పారు. పోటీల్లో 80 మంది బాలబాలికలు పోటీ పడ్డారని చెప్పారు. మొదటి, రెండో బహుమతి సాధించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అండర్–9 బాలికల విభాగంలో టి.మనస్విరెడ్డి మొదటి, అద్విత ద్వితీయ, మధుమిత మూడో బహుమతి సాధించారు. అలాగే బాలుర విభాగంలో సాజిత్ (వనపర్తి) మొదటి, అద్విక్ (నాగర్కర్నూల్) రెండు, అండర్–11 బాలికల విభాగంలో కార్తీక (వనపర్తి) మొదటి, ఆరాధ్య శ్రీ (నాగర్కర్నూల్) రెండు, పరశస్విరెడ్డి (వనపర్తి) మూడో బహుమతి సాధించినట్లు వివరించారు. బాలుర విభాగంలో రంగం యోజిత్ (మహబూబ్నగర్) మొదటి, అఖిలేష్ (నాగర్కర్నూల్) రెండు, జి.శ్రీతిక్ (వనపర్తి) మూడో బహుమతి, అండర్–13 బాలికల్లో వేముల మేధశ్రీ (నాగర్కర్నూల్) మొదటి, ఎన్.అక్షిత (వనపర్తి) రెండు, వైష్ణవి (నాగర్కర్నూల్) మూడో బహుమతి, బాలుర విభాగంలో నమ్రత్ గౌడ్ (నాగర్కర్నూల్) మొదటి, శ్రీహాన్ (వనపర్తి) రెండు, మణిదీప్ (నాగర్కర్నూల్) మూడో బహుమతి సొంత చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్నాయుడు, జిల్లా కోశాధికారి టీపీ కృష్ణయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు రవీందర్గౌడ్, అయోధ్య రాములు, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు భూషణ్, మోహన్, డీసీఏ సభ్యులు రాములు, హర్ష తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్కు దీటుగా..!
●సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు డబ్బులు వెచ్చించకుండా ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక నిధులు కేటాయించి తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు అదనంగా బోధకులు, ఆయాలను కేటాయించింది. విడతల వారీగా అన్ని గ్రామాలకు విస్తరించి వంద శాతం ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. – విద్యాసాగర్, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి, నారాయణపేట నారాయణపేట రూరల్: ఐదేళ్లలోపు చిన్నారులకు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆటపాటలతో చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించింది. చిన్నారుల మనోవికాస అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి పాఠశాల విద్యాశాఖ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. గతేడాది కార్యాచరణలో భాగంగా పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసింది. సత్ఫలితాలతో ముందుకు.. గతేడాది ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలు సత్ఫలితాలు ఇవ్వడంతో 2026–27 విద్యా సంవత్సరంలో మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్తగా మంజూరు చేసిన పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష మంజూరు చేసి సామగ్రి కొనుగోలు, పెయింటింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 94 పాఠశాలల్లో ప్రారంభించగా.. తాజాగా వాటి సంఖ్య మూడింతలు చేసి 292 పాఠశాలలకు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటి వరకు 386 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందనుంది. ప్రవేశాలు ఇలా.. వచ్చే ఏడాది ఒకటో తరగతిలో చేరడానికి అర్హులైన పిల్లలను 2026–27 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోవాలి. ఆయా చిన్నారులను పాఠశాలలకు సిద్ధం చేయడం, పూర్వ ప్రాథమిక విద్య అందించడం ముఖ్య ఉద్దేశం. వయస్సు, నివాస ధ్రువీకరణతో సహా అవసరమైన అన్ని పత్రాలను సేకరించి ప్రవేశాలు కల్పించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం అట్టడుగు వర్గాల పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను మొదట చేర్చుకుంటారు. ప్రీ ప్రైమరీ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అందులో పిల్లలకు అవసరమైన ఫర్నీచర్, వాల్ పెయింటింగ్, సామగ్రి తగిన వాటిని సమకూరుస్తారు. సరైన వెలుతురు, ఇండోర్, అవుట్ డోర్ ఆట వస్తువులు, నిద్రించడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. నారాయణపేట 44 జోగుళాంబ గద్వాల 41 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 292 పాఠశాలలు ఎంపిక తరగతి గది, సామగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు ఐదేళ్లలోపు చిన్నారులకు అవకాశం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు పక్కాగా పాఠ్య ప్రణాళిక.. పూర్తిగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తారు. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషన్ స్టేజ్తో అనుసంధానం చేసి ఉంటుంది. బోధనకు నియమించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రీ ప్రైమరీ విభాగాల్లోని పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చే అల్పాహారం సైతం అదనంగా ఇస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా పిల్లల రక్షణకు చైల్డ్ రైడ్ ప్రొడక్షన్ పాలసీని పకడ్బందీగా అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ విభాగాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ప్రతిరోజు పర్యవేక్షించాలి. పిల్లల పురోగతిని సమీక్షించడానికి క్రమం తప్పకుండా పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, ఆరోగ్యశాఖ విభాగ అధికారుల ఉమ్మడి తనిఖీలతో కలిసి ఏడాదిలో రెండుసార్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
మన్ననూర్ ఐటీడీఏ స్వరూపం..
పోస్టులు భర్తీ చేయలేదు.. మన్ననూర్ ఐటీడీఏను 2015 నుంచి ఒకే ఒక్కరితో నెట్టుకొస్తున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీని వల్ల చెంచులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అధికారులు లేకపోవడంతో సకాలంలో పనులు కావడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. – శ్రీనివాసులు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల లోతట్టు చెంచుపెంటలో చెంచుల ఆవాసాలు గిరిజన జనాభా 14,436 గ్రామాలు 173 చెంచు కుటుంబాలు 4,041 మండలాలు 25 మొత్తం పోస్టులు (అన్ని విభాగాల్లో కలిపి) 20 ప్రస్తుత ఖాళీలు (అన్ని విభాగాల్లో కలిపి) 19 -
అడ్మిషన్ల కత్తి!
కందనూలు: ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మెడపై అడ్మిషన్ల కత్తి వేలాడుతోంది. ఈ విద్యా సంవత్సరం భారీగా అడ్మిషన్లు తేవాలంటూ యాజమాన్యాలు టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్ల సంఖ్యను బట్టి సదరు సిబ్బందికి ఇంక్రిమెంట్ ఇవ్వాలా.. లేదా అనే అంశాన్ని ముడిపెడుతున్నారు. అడ్మిషన్ల సమయంలో యాజమాన్యాల ఒత్తిడి భరించలేక ప్రైవేటు టీచర్లు సతమతమవుతున్నారు. ఉద్యోగ భద్రత కరువు.. భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేటు టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనిచేసేది పాఠశాలలోనైనా సెలవనే మాటే ఉండదు. రెండవ శనివారమైనా, ఆదివారమైనా పాఠశాల పనిలోనే నిమగ్నమై ఉండాలి. ఇక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. యాజమాన్యం చెప్పినన్ని అడ్మిషన్లు చేయించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. అందుకే వేసవి సెలవుల్లోనూ ఇంటింటికి తిరుగుతూ పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించాలని.. ఫీజులో రాయితీ కూడా ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులను బతిమిలాడుతున్నారు. 5 నుంచి 25 టార్గెట్.. జిల్లాలో గతేడాది లెక్కల ప్రకారం 167 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అందులో 47,739 మంది విద్యార్థులకు 2,436 మందికి పైగా బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు 5 నుంచి 25 అడ్మిషన్లు చేయాల్సిందేనని యాజామాన్యాలు టార్గెట్ పెట్టడంతో జిల్లాకేంద్రంతో పాటు మండల పరిసర గ్రామాల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఇంటింటికీ తిరుగుతున్నారు. విద్యార్థులకు మంచి బోధనతో పాటు ఐఐటీ, నీట్, మెడికాన్ కోచింగ్ ఇస్తామంటూ బ్రోచర్లతో తల్లిదండ్రులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లావ్యాప్తంగా 70శాతం ప్రైవేటు స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది పాఠశాలల అనుమతులను రెన్యూవల్ చేసుకోవడంతో పాటు పాఠశాల భవనం ఫైర్ సేఫ్టీ, క్వాలీఫైడ్ ఫ్యాకల్టీ తదితర అంశాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బ్రోచర్లతో ఇంటింటికీ.. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన బ్రోచర్లతో బోధన, బోధనేతర సిబ్బంది ఇంటింటి బాట పట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు పల్లె, పట్టణం తేడా లేకుండా తిరుగుతున్నారు. తక్కువ ఫీజుతో మెరుగైన, సమర్థవంతమైన టీచర్లతో బోధన అందిస్తున్నామంటూ విసృత ప్రచారం చేస్తున్నారు. తమ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పిస్తే.. ఉన్నత చదువుతో పాటు ఐఐటీ, నీట్ కోచింగ్లు ఇస్తామంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ప్రైవేటు టీచర్లకు యాజమాన్యాల టార్గెట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తేనే జీతాల పెంపు ఇబ్బందులు పడుతున్న బోధన, బోధనేతర సిబ్బంది బ్రోచర్లతో ఇంటింటికీ తిరుగుతున్న వైనం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. తీవ్రమైన ఎండలో ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరుతో కాలనీలు, గ్రామాల్లో తిప్పడం మానుకోవాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చర్యలు తీసుకుంటాం.. ఉపాధ్యాయులకు టార్గెట్లు పెట్టి వేధించడం సరైంది కాదు. ఆ విధంగా ఏ పాఠశాలైనా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. – రమేశ్కుమార్, డీఈఓ -
అసమగ్ర ఐటీడీఏ
రెగ్యులర్ పోస్టులకు నోచుకోని మన్ననూర్ ప్రాజెక్టు ఐటీడీఏలో అంతర్భాగంగా.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్టు కార్యాలయం కలెక్టరేట్ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళాడేది. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్తోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 56 ప్రాథమిక పాఠశాలలు, 16 ఆశ్రమ పాఠశాలు, చెంచులకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతోపాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నా భూమిపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతీ లేదు. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న చెంచులకు భూ పంపిణీ జరగడం లేదు. ఒక్కే ఒక్కడు.. చెంచులకు అన్ని సంక్షేమ పథకాలు, అధికారులను అందుబాటులోకి తెచ్చి వారికి సేవలను విస్తృతపర్చడమే ఐటీడీఏ లక్ష్యం. సున్నిపెంట నుంచి ప్రాజెక్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తిలో ఉద్యోగులను నియమిస్తే అన్ని విభాగాల్లో కలిపి 20 పోస్టులు ఉండాలి. విలీనమైన తర్వాత రికార్డులతోపాటు సీనియర్ అసిస్టెంట్ జాఫర్ను నియమించారు. అతను ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగం, డీఎస్ఓ, మేనేజర్, సీఎస్ఓ, హెచ్ఓలు, మత్య్సశాఖ, హార్టికల్చర్, పశువైద్యం, ఇద్దరు పర్యవేక్షకులు, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయాధికారి, ఏఈఓ, కార్యాలయ సిబ్బంది పోస్టులకు గాను ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. అచ్చంపేట: ప్రభుత్వాల పట్టింపులేని ధోరణి.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. వెరసీ మన్ననూరులోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలను చక్కదిద్ది పూర్వవైభవం తెస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం (సున్నిపెంట) ఐటీడీఏలో భాగంగా ఉండి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన్ననూర్లో ఏర్పాటైంది. అయితే ఐటీడీఏగా అవతరించి పన్నెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారి, ప్రధాన పోస్టులు మంజూరు చేయలేదు. నల్లమలలోని చెంచులు, ఆదివాసీల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యకలాపాలకు పీఓనే కీలకం. అలాంటిది ఏళ్ల తరబడి ప్రాజెక్టు అధికారి, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండేళ్లు గడిచినా సిబ్బంది నియామకంలో కాలయాపన ఇన్చార్జి పీఓలతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం చెంచుల ఆర్థికాభివృద్ధి పథకాల అమలులో ఆటంకం నెరవేరని ప్రజాప్రతినిధుల హామీలు.. అధికారుల ప్రతిపాదనలు -
బుధార్పేట హనుమాన్ సన్నిధిలో జిల్లా జడ్జి
వెల్దండ: మండల కేంద్రంలోని బుధార్పేట ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి.. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భరత్గౌడ్, సతీష్, పూజారి నాగులు పాల్గొన్నారు. మైసమ్మ జాతరలో పెరిగిన భక్తుల రద్దీ పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సోమవారం మృగశిర కార్తె వస్తుండటం.. వానాకాలం సాగు పనులు, విద్యాసంస్థలు ప్రారంభించే సమయం ఆసన్నం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసింది. నాయినోనిపల్లి జాతర మైదానం నుంచి పెద్దకొత్తపల్లి వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 8 కి.మీ. దూరం ప్రయాణించేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. స్థానిక పోలీసులు పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. కాగా, జాతరలో తాగునీటి కొరతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 15వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తాడూరు: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు హెచ్చరించారు. ఆదివారం తాడూరు మండలం ఇంద్రకల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల స్టాక్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విత్తనాలు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించొద్దని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. -
అర్హత ఇలా...
బాలలకు సంబంధించి పునరావాసం, దత్తత, పునరేకీకరణ, పోషణ వంటి తదితర అంశాలన్నీ జువైనల్ జస్టిస్ యాక్టు 2015 ప్రకారం జరిగి తీరాలి. దత్తత నియమావళి 2017ను కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. దత్తత కావాలనుకునే భార్యాభర్తలిద్దరి అంగీకారం ఎంతో ముఖ్యం. నియమాల ప్రకారం, ప్రమాణాలు అన్ని నెరవేర్చిన తరువాత ఒంటరి లేదా విడాకుల పొందిన వ్యక్తి కూడా దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా నివవించే మగ వ్యక్తి బాలికను దత్తత తీసుకునేందుకు అనర్హుడు. శిశుగృహ నుంచి దత్తత వెళ్లిన పిల్లలను మా సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి ఆరునెలలకోసారి పర్యవేక్షిస్తాం. దత్తత తీసుకున్న దంపతులు వారి ఆలనాపాలన సరిగా చూసుకుంటున్నారా.. లేదా.. అనేది తెలుసుకుంటాం. రెండేళ్లలో నాలుగు సార్లు పిల్లలను పర్యవేక్షిస్తాం. పిల్లలను సక్రమంగా చూసుకోకపోతే కారా చట్టం ప్రకారం దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఎదురుకాలేదు. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
జూరాలకు 4,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ అచ్చంపేట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 4,505 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 40 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.740 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టులో దాదాపు 2.5 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిగువనున్న శ్రీశైలం జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 818 అడుగుల వద్ద 39 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. -
నీట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: రాష్ట్రంలో వరి కొనుగోలు, సంక్షేమ పథకాల అమలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీట్ నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సీఎం సభ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న జరగనున్న నీట్–2026కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు బిగించాలని చెప్పారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష రోజు ప్రశ్నపత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితరవి పకడ్బందీగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 4,488 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేశామని సీఎస్ చెప్పారు. ఇప్పటి వరకు 10.58 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.13,577 కోట్లు జమ చేశామని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసి ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు ఒకటి చొప్పున 553 బస్సులను మంజూరు చేశామని, ఈ బస్సులను మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభానికి విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫామ్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పందిస్తూ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, రవాణా సంబంధిత ఏర్పాట్లు చేశామని, తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. సీఎం సభకు మహిళల తరలింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతామన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి పకడ్బందీ ఏర్పాటు చేస్తామని పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీపీఆర్ఓ నర్సింహారావు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కులకు భంగం కలిగించొద్దు
మన్ననూర్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసీల హక్కులపై అవగాహన కల్పించారు. శనివారం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్, అప్పాపూర్, భౌరాపూర్, రాంపూర్, చెంచు పెంటలలో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాదులు, ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాల గురించి చెంచులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. బడిఈడు పిల్లలను తప్పకుండా చదివించాలని సూచించారు. జీవితంలో గొప్పవారు కావాలంటే అందుకు చదువు ఒక్కటే మార్గం అని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. జీవించే క్రమంలో ఆదివాసీల హక్కులకు ఎవరూ భంగం కలిగించొద్దని, ఈ క్రమంలో న్యాయం పొందేందుకు న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితిలో లీగల్ సెల్ తరపున న్యాయవాదిని నియమించి ఉచితంగా న్యాయం పొందేలా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయా పెంటలలో చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ రామ్మూర్తి, డిప్యూటీ చీఫ్ లీగల్ సెల్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరాం ఆర్యా, పవన శేషసాయి, ఎఫ్ఆర్ఓ సవిత తదితరులు పాల్గొన్నారు. -
అనాథలుగా మారుతున్న అభాగ్యులు
నవ మాసాలు మోసి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలను ఆ తల్లులకు మనసేలా ఒప్పుతుందో తెలియదు కానీ తమ పిల్లలను పెంట కుప్పలు, రోడ్లపై పాడేసి పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఐసీడీఎస్ సిబ్బంది సహకారంతో శిశుగృహకు చేర్చుతున్నారు. వీరితో పాటు కొందరు తల్లిదండ్రులు తాము సంతనాన్ని పోషించలేమంటూ స్వచ్ఛందంగా శిశుగృహ అధికారులకు అప్పగించి వెళ్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బాలికలే ఉండడం గమనార్హం. ఆడపిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు ఆరు నెలల నుంచి ఏడాది, మగ పిల్లలను దత్తత తీసుకునేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతుంది. దత్తత సలహా, సహాయ కేంద్రాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. అనాథలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారితో వెళ్లే చిన్నారుల యోగక్షేమాలను ఈ కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. ఎక్కడైనా లోపం తలెత్తితే తదనుగుణంగా చర్యలు సైతం తీసుకుంటుంది. -
నిత్యం రోడ్లపైనే నీరు..
వానాకాలంలో జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రధాన రహదారిపై నిత్యం నీరు నిలిచి ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఉన్నా నీరంతా చెరువులోకి పోతుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా మార్గం సరిచేయాలి. – అబ్దుల్ కలీమ్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని నాలాలు, డ్రెయినేజీల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు తొలగిస్తున్నాం. నాలాలపై కల్వర్టుల వద్ద అడ్డుగా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు చేపడుతాం. మురుగునీటిని తరలించేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణం వేగవంతం చేస్తాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్ -
ఎండలకు బ్రేక్.. తెలంగాణపై వర్షాల మోత
మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న కీలక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరానికి సమీపంలో మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయిలో భారీ వాయుగుండం (మిడ్ ట్రోపోస్ఫెరిక్ వోర్టెక్స్) ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కేరళ తీరం నుంచి ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో దక్షిణ, మధ్య భారతదేశంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఏర్పడ్డాయి.ఈ ప్రభావం తెలంగాణపైనా స్పష్టంగా కనిపించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అదే సమయంలో హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక కేరళ, తీర కర్ణాటక ప్రాంతాల్లో జూన్ 10-11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అక్కడ ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా కనిపించనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు ఊరటనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. -
గాలిమోటార్లో తిరుగుతూ గాలి మాటలు
పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన, చిత్తశుద్ధి లేవన్నారు. నగరంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఎంపీ ప్రారంభించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పినా పూర్తి చేయలేదని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో నిధులు ఇచ్చింది లేదని విమర్శించారు. జిల్లా నుంచి గెలుపొందిన సీఎం రేవంత్రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై చేసింది ఏం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్పా అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకు స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో భారీగా నిర్వహించాలన్నారు. తెలంగాణ మొత్తాన్ని కాషాయమయం చేస్తామనే సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దొచుకుందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే రోజు తొందరలో వస్తుందన్నారు. రాష్ట్ర వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, పవన్కుమార్రెడ్డి, బాలరాజు, రాములు, రమేష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాదేపల్లిలో ధాన్యం ధర క్వింటాకు రూ. 3,012జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్ యార్డులో శుక్రవా రం ధాన్యానికి రికార్డు ధర దక్కింది. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాకు గరిష్టంగా రూ.3,012, కనిష్టంగా రూ.1,620 ధర లభించింది. ఈ సీజన్లో ఇంత ధర లభించడం ఇదే మొదటిసారిగా మార్కెట్ అధికారులు తెలిపారు. వరికి ఏ గ్రేడ్ మద్దతు ధర క్వింటాకు రూ.2,461 ఉంది. అయితే ఇక్కడ మద్దతు ధరను మించి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,611, వేరుశనగకు గరిష్టంగా రూ.4,699, కనిష్టంగా రూ.4,489, పొద్దుతిరుగుడుకు గరిష్టంగా రూ.6,826, కనిష్టంగా రూ.6,756 ధరలు పలికాయి. ● రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారు ● ఎంపీ డీకే అరుణ -
పాలమూరుకు మంచి రోజులు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్అండ్ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్అండ్ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. 20 లక్షల పైచిలుకు ఎకరాలు.. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎంను చూడలేదు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్ కర్నూల్ ‘ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్లోగా ఎన్ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లోని తదతర రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ప్రాజెక్ట్లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లకే ఖర్చు చేశామని రేవంత్రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్లారు. జడ్చర్ల బహిరంగ సభ వద్ద అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిజడ్చర్లలో బహిరంగసభకు హాజరైన మహిళలు పీఆర్ఎల్ఐకి 90 టీఎంసీలతో ఎన్ఓసీ తీసుకొస్తాం డిసెంబర్లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే.. కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది.. మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది.. నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా? జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ముగిసిన ప్రాజెక్ట్ల సందర్శన ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది.. ‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు. -
పెంపు సరే.. నోటిఫికేషన్లేవి..?
● జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ ● ఉద్యోగ ప్రకటనల కోసం వేలాది మంది ఎదురుచూపు కర్వెన రిజర్వాయర్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, రాజేష్రెడ్డి కందనూలు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నిరుద్యోగుల్లో కొంత ఆశలు రేకెత్తించినా.. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనే అంశంలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ‘నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి‘..? అనే ప్రశ్న నిరుద్యోగులను వెంటాడుతోంది. వయోపరిమితి పెంచిన ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ప్రకటిస్తే ఇన్నాళ్లు వేచి చూసిన నిరుద్యోగుల్లో కొంత ఉత్సాహం కలుగుతుంది. తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపన కలిగినవారు ఆ దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వయో పరిమితిని ఈ విద్యా సంవత్సరానికి మాత్రం పరిమితం చేయడంతో ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఉద్యోగ ప్రకటనలకు మాత్రమే ఈ వయో పరిమితి ఉంటుంది. దీంతోపాటు యూని ఫాం సర్వీస్లకు వర్తించదనే నిబంధనతో అనేక మంది నిరుద్యోగులు నిరాశలో పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లలో అత్యధికంగా పోలీస్ జాబ్లే ఉండే అవకాశం ఉంది. పట్టణాల్లో కోచింగ్ తీసుకొని.. వయో పరిమితి పెంపు కొంత ప్రభుత్వానికి సానుకులంగా ఉన్నా.. గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాశ అలుముకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్లు వేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని యువత కొంత అసహనంతో ఉంది. సడలింపులు ఇస్తున్నారు కానీ.. ఉద్యోగ ప్రకటనలు రావడం లేదు. చదువు పూర్తి చేసుకొని ఏళ్ల తరబడి పట్టణాల్లో కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువత కుటుంబాలకు భారం ఒకవైపు, నిరుద్యోగం మరోవైపు వెంటాడుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రతి ఏడాది జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ, దాదాపు మూడేళ్లు కావొస్తున్న ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం త్వరలో వివిధ శాఖల్లో నియామకాలు చేపడుతామని సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. అధికారికంగా ప్రకటనలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. వయోపరిమితి సడలింపు సానుకూలం కానీ, వాస్తవ ఉద్యోగ అవకాశాలే యువతకు ప్రధానం అని విద్యాభిమానులు పేర్కొంటున్నారు. హాస్టళ్లు, అద్దె గదుల్లో సతమతం హైదరాబాద్లో, జిల్లాకేంద్రాల్లో హాస్టళ్లు, గదులు అద్దెకు తీసుకొని ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలనే తపన కలిగి కోచింగ్ తీసుకుంటున్న గ్రామీణ యువత పరిస్థితి దయనీయంగా ఉంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుండగా.. ఇటు నోటిఫికేషన్లు రాక, ఉద్యోగ భరోసా కనిపించక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. డీఎస్సీ ప్రిపరేషన్ చేసేవారు కొందరైతే.. గ్రూప్స్ ప్రిపరేషన్ చేసేవారు మరికొందరు ఇలా ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగుల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలి. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నాళ్లు ఇలా వేచి చూడాలి. ప్రభుత్వానికి నిరుద్యోగుల గురించి పట్టింపులేదు. – నర్మద, నిరుద్యోగి, తెలకపల్లి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం శోచనీయం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం సరైంది కాదు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలి. – సృజన, నిరుద్యోగి, తెలకపల్లి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పదేళ్లు వయోపరిమితి పెంపు మంచిదే అయినా.. యూనిఫాం సర్వీసు ఉద్యోగాలకు 2, 3 ఏళ్లపాటు వయోపరిమితి సడలించాలి. ఒక్కసారి మాత్రమే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. – తిరుపతి, నిరుద్యోగి, నాగర్కర్నూల్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఉద్యోగ ప్రకటనలు వేస్తే.. ఇప్పుడు వయోపరిమితి పెంచాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికై నా ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రకటనలు ఎప్పుడు ఇస్తారు.. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. – సురేష్, నిరుద్యోగి, నాగర్కర్నూల్ -
ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన : ఎస్పీ
కందనూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతం చేసినట్లు ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయగా.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 950 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టామన్నారు. హెలీప్యాడ్, పంప్హౌస్ ప్రాంగణం, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజా సమావేశ ప్రదేశాలు తదితర కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్యటనను విజయవంతం చేశామన్నారు. సీఎం పర్యటన విజయవంతం కావడంలో పోలీసు శాఖతోపాటు జిల్లా యంత్రాంగం, ప్రతిఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. బందోబస్తు విధుల్లో అత్యంత అంకితభావంతో పనిచేసిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో మోస్తారు వర్షాలు కందనూలు: జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల మోస్తారుతోపాటు తేలికపాటి వర్షం కురిసింది. ఊర్కొండ మండలంలో అత్యధికంగా 19 మి.మీ., వెల్దండలో 11 మి.మీ., ఉప్పునుంతల మండలం వెల్టూరులో 9.5 మి.మీ., పదరలో 6.5 మి.మీ., తెలకపల్లి మండలం పెద్దూరులో 5.5 మి.మీ., వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు. పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి కందనూలు: పర్యావరణంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న భూతాపం, ప్లాస్టిక్ వ్యర్థాలు, జీవవైవిధ్య క్షీణత వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి నసీం సుల్తానా, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు, న్యాయవ్యాదులు తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా..
● కర్ణాటక మంత్రితో కలిసి రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థల పరిశీలన ● కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల ప్రగతిపై ఆరా ● ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్, జూరాల డ్యామ్ వీక్షణ ● గుడ్డెందొడ్డి పంప్ హౌస్ సందర్శన.. ఆ తర్వాత సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్ష ● నేడు పీఆర్ఎల్ఐ, కేఎల్ఐ పనుల పరిశీలన.. జడ్చర్ల శివారులో బహిరంగసభ ● పలు చోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల గృహనిర్బంధం పాలమూరులో తొలి రోజు ముగిసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం వడివడిగా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ఆయన ప్రత్యేక హెలీకాప్టర్లో బెంగళూరు నుంచి బయలుదేరి ముందుగా నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు బేగంపేట నుంచి మరో హెలీకాప్టర్లో, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తమ వాహనాల్లో వచ్చారు. ఆ తర్వాత వారు రోడ్డు మార్గాన మక్తల్ మండలం కాట్రేవులపల్లికి చేరుకుని కొడంగల్ – నారాయణపేట – మక్తల్ ఎత్తిపోతల పథకం పనులపై ఆరా తీశారు. తిరిగి మక్తల్కు వెళ్లి కోయిల్సాగర్తో పాటు కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ప్రతిపాదిత స్థలం, గద్వాల జిల్లా పరిధిలోని జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ధరూర్ మండలంలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గూడెందొడ్డి రిజర్వాయర్కు చేరుకున్నారు. అక్కడ పంప్ హౌస్ పనులపై ఆరా తీశారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్కు చేరుకున్నారు. విరామం అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన ప్రాజెక్ట్లపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, మేఘారెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీ చౌహాన్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురువారం ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన సీఎం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మృగవాణి రిసార్ట్లో బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన ఎల్లూరు, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్లలో ఆయా చోట్ల నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పంప్ హౌస్లలో పలు ప్యాకేజీల పనులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరనున్నారు. -
బీఆర్ఎస్లో దుమారం..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్హౌస్ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్టాపిక్గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో జూన్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాల కు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. గతంలో కాంగ్రెస్ నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన కారులో గద్వాలలోని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లగా వారు విజయుడిని సన్మానించారు. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనడం.. హైదరాబాద్లో పలు పర్యాయాలు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య లొల్లి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్ట్పై విపక్ష బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్ఎస్లోనే ఉంటారా.. కాంగ్రెస్లో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై స్పందన కోసం ఎమ్మెల్యేను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీఎంను కలవడంపై కొందరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందులో ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన అనుచరులు కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గతంలోనూ పలు పర్యాయాలు స్వయంగా కలిసిన వైనం అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ ‘గులాబీ’ల పోరుబాట క్రమంలో రేవంత్ను కలవడంపై అనుమానాలు ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా రాజకీయ పరిణామాలు -
ఆరు నెలల్లో ‘పాలమూరు’ నీరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్/సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నెలల్లో కర్వెన రిజర్వాయర్ వరకు నీరందించాలని చెప్పారు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను సత్వరంగా పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. ప్రధాన భూసేకరణను వేగవంతం చేయాలని, ఈ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ పూర్తయిన తర్వాతే ప్రాజెక్టుల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. గురువారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో అధికారులతో రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వేగంగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. నార్లాపూర్, ఏదుల, కరివెన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాగా, వీటి లింకేజీకి సంబంధించి పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. నెలవారీగా ప్రాజెక్టు పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నిధులతో పూర్తయ్యే పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. ఆరు నెలల్లోగా కరివెన రిజర్వాయర్ వరకు నీళ్లు అందించే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మరో 15 రోజుల తర్వాత ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానన్నారు. ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తొలి రోజు చకచకా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన తొలి రోజు గురువారం చకచకా సాగింది. కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి పలు ప్రాజెక్టులను సందర్శించారు. కొడంగల్– నారాయణపేట– మక్తల్ ఎత్తిపోతలు, గుడ్డెందొడ్డి పంప్హౌస్ పనుల ప్రగతిపై స్వయంగా ఆరా తీశారు. కోయిల్సాగర్, కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బరాజ్ల ప్రతిపాదిత స్థలం, జూరాల డ్యామ్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించిన అనంతరం సోమశిలలోని మృగవాణి రిసార్ట్లో రేవంత్రెడ్డి బస చేశారు. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, ఎంజీకేఎల్ఐలో భాగమైన పలు రిజర్వాయర్లు, పంప్హౌస్ పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ రోడ్లో ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. హామీల అమలుకు కట్టుబడి... మక్తల్– నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూనే నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటిపారుదల రంగాన్ని మరింత బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా పురోగతిపై రేవంత్రెడ్డి ఒక్కో ప్యాకేజీలో పెండింగ్ పనులకు గత కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ పనులు నూరు శాతం పూర్తికాగా, ఏదుల రిజర్వాయర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వట్టెం రిజర్వాయర్ కట్ట పనులు పూర్తికాగా, ప్రస్తుతం కాంక్రీట్, రివిట్మెంట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల అంచనాలను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. కీలకమైన కాల్వల నిర్మాణంపై... గరిష్ట ప్రయోజనాల కోసం కీలకమైన కాల్వల నిర్మాణం పైనే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. నిధుల అవసరాలు, కాలపరిమితులతో కూడిన వాస్తవిక గడువులను సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారన్నారు. కోర్టు కేసుల్లో ఉన్నవి, పనులపై స్టే విధించిన వాటి విషయంలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఆర్అండ్ఆర్ పనులను మొదటి ప్రాధాన్యతగా భావించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. -
జిల్లా అభివృద్ధి పట్టదా..?
కల్వకుర్తి రూరల్: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు అదనపు నిధులు ఎన్ని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. ఇంజినీరింగ్ కాలేజీ, కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఎలాంటి చొరవ చూపడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు గ్రానైట్, కాగితం పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, బాలస్వామి, భీమరాజు ఉన్నారు. -
ఆశల పల్లకీలో..
జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనపై గంపెడాశలు ● శ్రీశైలం నిర్వాసితులకు దక్కని న్యాయం ● నాలుగు దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూపులు ● ఇంజినీరింగ్ కళాశాల, పరిశ్రమల ఏర్పాటుపై హామీ దక్కేనా?సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధిపై ఇవ్వనున్న వరాలపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులతో పాటు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పగా.. ఇప్పటివరకు ఎంతో మంది ఉద్యోగంతో పాటు పరిహారానికి సైతం నోచుకోలేదు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భూ నిర్వాసితులు సీఎం రేవంత్రెడ్డిపై గంపెడాశలు పెట్టుకున్నారు. నాలుగు దశాబ్దాలైనా.. శ్రీశైలం ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం అందిస్తామనే ప్రభుత్వ ప్రకటన నీటిమూటగానే మారింది. అందుకోసం 1984లో జారీ చేసిన జీఓ 98 సైతం నేటీకీ అమలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయిన వారిలో ఇంకా 2,156 మంది ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో కొంత మంది మరణించగా.. మరికొందరు వృద్ధాప్యానికి చేరువయ్యారు. ప్రతి ఎన్నికల సమయంలో శ్రీశైలం భూనిర్వాసితుల అంశం ఎన్నికల హామీగానే మిగులుతోంది. ఈ క్రమంలో సీఎం అపాయింట్మెంట్ కోసం నిర్వాసితుల తరఫున ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించారు. అయితే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తమకు పరిహారం విషయంలో సానుకూలంగా స్పందిస్తారని ఆశలు పెట్టుకున్నారు. -
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
అచ్చంపేట రూరల్: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ.. పేద ప్రజలపై పెను భారాలు మోపుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్భాను చిబ్ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బుధవారం అచ్చంపేటలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారుల్లో ఎడ్లబండిపై తిరుగుతూ నిరసన వ్యక్తంచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో పేపర్ లీకేజీలు, అవకతవకలకు కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. దేశంలో ఉన్నత వర్గాల కోసమే బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. మూడు రోజులకోసారి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి, రాష్ట్ర, జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగానే.. ఆకాంక్ష
నాగర్కర్నూల్కేఎల్ఐతో మహర్దశ పట్టినా నామమాత్రంగానే సాగు ● భారీ సామర్థ్యం గల రిజర్వాయర్లు, కాల్వలు లేకపోవడమే కారణం ● వరప్రదాయినిగా నిలిచిన జూరాలలో పేరుకున్న పూడిక ● నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ పనులు పెండింగ్లోనే.. ● పుష్కర తెలంగాణలో సాగు నీళ్ల కోసం తప్పని నిరీక్షణ ● నేడు, రేపు సీఎం రేవంత్, మంత్రుల ప్రాజెక్ట్ల సందర్శన .. ప్లాస్టిక్ నిషేధం మహబూబ్నగర్ సమీపంలోని పర్వతాపూర్ మైసమ్మ అడవిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026–8లో uఅడుగులు పడినా పూర్తికాని ‘పాలమూరు’ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు హైదరాబాద్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో ఐదు (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పంప్ను ప్రారంభించారు. రిజర్వాయర్ల వారీగా.. నార్లాపూర్: కొల్లాపూర్ మండలంలో 8.61 టీఎంసీల సామర్థ్యం గల నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. పంప్ హౌస్ పనులు చేపట్టారు. ఇక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు కెనాల్ నిర్మించాల్సి ఉండగా.. 400 మీటర్ల మేర పనులు పెండింగ్లో ఉన్నాయి. పంప్హౌస్ కోసం 400 కేవీ సబ్ స్టేషన్ నిర్మించాల్సి ఉంది. రిజర్వాయర్ కింద సబ్ కెనాళ్లు, బ్రాంచ్ కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను డెవలప్ చేయాల్సి ఉంది. పంప్ హౌస్ వద్ద 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం రెండు మోటార్లు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో మూడింటిని ఏర్పాటు చేసింది. ఇంకా నాలుగు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వ్యూ -
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
● ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కందనూలు/కొల్లాపూర్ రూరల్: జిల్లాలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, ఇతర అధికారులతో కలిసి నార్లాపూర్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకు ముందు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–3 కాల్వల నిర్మాణం, ప్యాకేజీ–2 పరిధిలోని డెలివరీ సిస్టమ్, ప్యాకేజీ–1లోని పంపుహౌజ్ నిర్మాణాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించే ప్రదేశాలు, ఆయనకు పథకం పురోగతిని వివరించే విధానం, భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం సోమశిలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షిస్తారని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా తీర్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం స్వయంగా ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు వస్తున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్ పంప్హౌజ్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను నాగర్కర్నూల్, వనపర్తి ఎస్పీలు డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్, సునీతారెడ్డితలతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. అనంతరం కుమ్మెర గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్షించారు. అక్కడ భద్రతా ప్రమాణాలు, వాహనాల పార్కింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలపై సీఎం భద్రతా అధికారులు పలు సూచనలు చేశారు. -
విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల స్టాక్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. ముఖ్యంగా పత్తి విత్తనాలను లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు పొందాలన్నారు. విత్తన బస్తాలపై కంపెనీ పేరు, హైబ్రిడ్ రకం, లాట్ నంబర్, మొలక శాతం, స్వచ్ఛత శాతం, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. సీల్ చెదరని సంచులను మాత్రమే కొనుగోలు చేయాలని.. ప్రభుత్వ అనుమతిలేని బిజీ 111/ఏఖీఆఖీ వంటి పత్తి విత్తనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి విత్తన సంచిలో కొంత నమూనా విత్తనాన్ని భద్రపరచుకోవాలని.. విత్తే ముందు మొలక పరీక్ష నిర్వహించాలని రైతులకు సూచించారు. విత్తనాల నాణ్యతలో లోపాలు, మొలక సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. అదే విధంగా నకిలీ, లేబుల్ లేని విత్తనాల విక్రయాలు గమనిస్తే సమాచారం అందించాలని తెలిపారు. వర్షం పడి నేల పూర్తిగా తడిసిన అనంతరం, భూమిలో 9 నుంచి 12 అంగుళాల మేర తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఫర్టిలైజర్ దుకాణదారులు విధిగా విత్తన చట్టం–1966 నిబంధనలను పాటించాలని ఆదేశించారు. -
రోడు ్డప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
● మృతులిద్దరు ఒకే గ్రామానికి చెందిన సమీప బంధువులు కల్వకుర్తి రూరల్: బంధువును కారులో తన ఇంటి వద్ద వదిలి తిరిగి వస్తుండగా.. జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని తాండ్ర సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వంగూరు మండల కేంద్రానికి చెందిన బండపల్లి బాలరాజు(26), బండపల్లి ప్రవీణ్(25), బండపల్లి రాజు బంధువులు. ముగ్గురు కలసి కారులో తమ బంధువును మండలంలోని తర్నికల్లో సోమవారం రాత్రి వదిలి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, తాండ్ర, కొండారెడ్డిపల్లి సమీపంలో వస్తుండగా.. కారును గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో రోడ్డు పక్కన గుంతలో పడింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో బాలరాజు, ప్రవీణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. డ్రైవర్ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. రాజును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు ఎస్ఐ కురుమూర్తి వివరించారు. మృతులిద్దరు సమీప బంధువులు కాగా.. బండపల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వంగూరులో విషాదం వంగూరు: ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు యువకులు ఒకే ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము న కల్వకుర్తి మండలం తాండ్ర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగూరుకు యువకులు దుర్మరణం చెందగా.. మృతులిద్దరికి తండ్రులు లేకపోవడం చేతికొచ్చిన కొడుకులు అకాల మరణం పొందడంతో తల్లుల రోధనలు మిన్నంటాయి. -
అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం
విద్య, వైద్యానికి అధిక నిధులు.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్నారు. మెడికల్ కళాశాలలో వసతుల కల్పనతో పాటు టీ డయాగ్నొస్టిక్ హబ్లో ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 13,400 కాన్పులు చేసినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపికై న 751 పాఠశాలలకు రూ. 6.27కోట్లు కేటాయించినట్టు చెప్పారు. నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఇప్పటివరకు నల్లమలలో 36 పెద్దపులులు, 250 చిరుతలు, 200 పైగా పక్షుల రకాలను గుర్తించినట్లు తెలిపారు. అనంతరం పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను వారు సందర్శించి పరిశీలించారు. ‘పాలమూరు’పై ప్రత్యేక దృష్టి జిల్లాలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా చేపట్టిన 12 ప్యాకేజీల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదే విధంగా మార్కండేయ ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, కేఎల్ఐ కింద అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో మరో 15వేల ఎకరాలకు నీరు అందించేందుకు రూ. 107.20 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు పేదలు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రతి ఇంటికీ లబ్ధి.. ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందని చెప్పారు. రైతుభరోసా కింద జిల్లాలో 3.19 లక్షల మంది రైతులకు రూ. 694.11 కోట్లు చెల్లించామన్నారు. క్వింటా సన్నరకం వరిధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సుమారు 9.60లక్షల సార్లు మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడంతో రూ. 448.51లక్షల వరకు ఆదా అయ్యిందన్నారు. రూ.500కే సిలిండర్ పథకం కింద 1.18 లక్షల మంది వినియోగదారులు లబ్ధి పొందారని చెప్పారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్ను అందిస్తుండగా.. ఇప్పటివరకు 1.14 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. కొత్తగా మరో 2వేల ఇందిరమ్మ ఇళ్లు.. సొంతిల్లు లేని నిరుపేదలందరికీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 2.70 లక్షల దరఖాస్తులు రాగా.. మొదటి విడతలో 10,639 ఇళ్లను మంజూరుచేశామని చెప్పారు. ఇప్పటివరకు 8,402 ఇళ్లకు మార్కింగ్ చేయగా.. 2,100 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, 2,763 ఇళ్లు పైకప్పు స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 1,122 నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. రెండో విడతలోనూ కొత్తగా 2వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ రోగులకు పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కులగణన, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. జిల్లాలో 40,074 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పోడుభూముల కోసం సౌరగిరి జలవికాసం.. జిల్లాలో అత్యధికంగా ఉన్న పోడు భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కోసం ఇందిరా సౌరగిరి జలవికాసం పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా 2,918 మంది రైతులకు అటవీ హక్కుల చట్టం కింద భూ యాజమాన్యపు హక్కులను కల్పించినట్టు వివరించారు. విద్యుత్ సదుపాయం లేని గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో 7.5 హెచ్పీ సామర్థ్యం ఉన్న సోలార్ విద్యుత్ పంపులను ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు. రుద్రమదేవి వేషధారణలో విద్యార్థిని ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమస్ఫూర్తిని ప్రతిబింభించే నృత్య ప్రదర్శనలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులను ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అభినందించి ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేశారు. తెలంగాణ తల్లి వేషధారణలో విద్యార్థిని ప్రజా ప్రభుత్వంలో అందరికీ సామాజిక న్యాయం రైతులు, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో వేగం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి -
సీఎం ‘పాలమూరు’ పర్యటన ఖరారు
● 4, 5న ప్రాజెక్ట్ల సందర్శన..పెండింగ్ పనుల పరిశీలన ● చివరి రోజు ఉదండాపూర్లోబహిరంగ సభ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత ల పథకంతోపాటు పలు ప్రాజెక్ట్ల పెండింగ్ పనుల పరిశీలనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల (4, 5న) పర్యటన ఖరారైంది. తొలిరోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్సాగర్ ప్రాజెక్ట్ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బీమా–1 లిఫ్ట్ను సందర్శించి.. అక్కడ నిర్మించే రోడ్ కం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కర్ణాటక మంత్రి బోసురాజుతో కలిసి పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీఎం హెలీకాప్టర్లో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్కు చేరుకోనున్నారు. పరిశీలన అనంతరం హెలీకాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్కు రానున్నారు. పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి ప్యాకేజీ–2 (నారాపూర్ రిజర్వాయర్), ప్యాకేజీ–3 (కెనాల్ ) పనులను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సోమశిలలోని హరిత గెస్ట్ హౌస్కు చేరుకుని.. ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయా ప్రాజెక్ట్ల పెండింగ్ పనులపై సమీక్షించనున్నారు. 2వ రోజు ఇలా.. రెండో రోజు శుక్రవారం సోమశిల నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పీఆర్ఎల్ఐ ప్యాకేజీ–1, ఎల్లూరులోని ఎంజీకేఎల్ఐ లిఫ్ట్–1ను సందర్శించనున్నారు. అనంతరం నార్లాపూర్ నుంచి హెలీకాప్టర్లో ఉయ్యాలవాడకు చేరుకోనున్నారు. ఇరిగేషన్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో బిజినేపల్లి మండలం కుమ్మెరకు చేరుకుని పీఆర్ఎల్ఐ ప్యాకేజీ–8, వట్టెం రిజర్వాయర్కు సంబంధించి ప్యాకేజీ 9, 10, 11, స్టేజీ–3 పంప్హౌస్కు సంబంధించి ప్యాకేజీ–8 పనులను పరిశీలించనునున్నారు. ఆ తర్వాత హెలీకాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్కు చేరుకుని ప్యాకేజీ 14, 15 పనులను పరిశీలించనున్నారు. అనంతరం జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్కు చేరుకుని ప్యాకేజీ 17, 18లో కొనసాగుతున్న పనులపై ఆరా తీయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి తిరిగి హెలీకాప్టర్ హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉండనున్నారు. -
దేశానికే ఆదర్శంగా తెలంగాణ
● కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేళ్లలోనే గుణాత్మక మార్పు ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో గుణాత్మక మార్పు కనిపిస్తోందని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రక్రియ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కేంద్రం సైతం దేశవ్యాప్తంగా శాసీ్త్రయ పద్ధతితో కులగణన చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీల్లోని పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కొత్తగా మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని మల్లు రవి అన్నారు. ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు స్వయంగా ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పారు. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి నార్లాపూర్, వట్టెం, కర్వెన పంప్హౌస్, రిజర్వాయర్ల పనులను పరిశీలిస్తారని.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కౌన్సిలర్లు బాదం రమేశ్, నిజాం ఉన్నారు. -
కొత్తగా 3 రోడ్ కం బ్యారేజీలు
కర్ణాటకలో సత్ఫలితాలు ఇవ్వడంతో.. కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్ తాలూకాలోని గిరిజాపూర్ రోడ్ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్కోట్ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్ సీజన్లో రీజనరేటెడ్ వాటర్ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కుసుమర్తి–సుకుర్ లింగంపల్లి గ్రామాల మధ్య భీమా నదిపై బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు. జూరాలకు ప్రత్యామ్నాయంగా.. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, భీమా నదులపై ఏర్పాటుకు యోచన తెలంగాణలో నారాయణపేట, కర్ణాటకలో రాయచూర్ జిల్లాలకు మేలు ఉభయ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందేలా ఉమ్మడి కార్యాచరణ ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు రేపు సీఎం రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు.. నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్ లింగంపల్లితోపాటు దేవసుగూర్లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది. -
అన్నిశాఖల సమన్వయంతో జిల్లా సమగ్రాభివృద్ధి
కందనూలు: జిల్లా సమగ్రాభివృద్ధిలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తుండటంతో విశేష పురోగతి సాధిస్తున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు చేసిన ఉద్యమాలు, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి వంటి రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. పోలీసు సేవలు మరింత చేరువ : ఎస్పీ కందనూలు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. ప్రజలకు మరింత చేరువై బాధ్యతాయుతమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసుపై ఉందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సీఐ ఉపేందర్రావు, ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ శివాజీ, ఎస్ఐలు పర్వతాలు, రమేశ్, నరేశ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. మంత్రి చొరవతోనే సమస్యల పరిష్కారం వీపనగండ్ల: కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు విద్య, వైద్యరంగాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించడమేగాక రైతులు పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయించి రైస్మిల్లులకు తరలించడంతో రైతుల ఇబ్బందులు తొలగుతున్నాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ తెలిపారు. మంగళవారం మండలంలోని కల్వరాలలో సర్పంచ్ బండారు రాములుతో కలిసి లబ్ధిదారు మినిగె లక్ష్మికి సీఎం రిలీప్ఫండ్ చెక్ అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తడకల రంగమ్మ, వార్డు సభ్యులు ఆంజనేయులు, సాయప్రసాద్, సుధాకర్, కాంగ్రెస్పార్టీ నాయకులు వెంకటరాజయ్య, మల్లేష్, రమేష్, తిరుపతయ్య పాల్గొన్నారు. -
ఉద్యమ లక్ష్యం నెరవేరలే..
‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ ఆశయాల కోసం సాగిందో.. ఆ లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం అన్నివర్గాల ప్రజలు ఉద్యమాన్ని చేపట్టగా.. ఇప్పటివరకు ఈ దిశగా లక్ష్యాలను నెరవేర్చలేదు. సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉండగా, ఉద్యోగాల కల్పన పెరగలేదు. నాటి తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. ప్రస్తుతం వారంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. – ఫయాజ్, తెలంగాణ ఉద్యమకారుడు, జేఏసీ కోకన్వీనర్, నాగర్కర్నూల్ -
పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం ● 2014కు ముందు వానాకాలంలో 8.50 లక్షల ఎకరాల్లోపే.. ● ప్రస్తుతం 22.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ● యాసంగి సాగులోనూ మూడింతల వృద్ధి ● వరి, పత్తి వైపే రైతన్నల మొగ్గు తలాపునే కృష్ణమ్మ ఉన్నప్పటికీ కరువుతో అల్లాడిన ప్రాంతం.. ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు.. తాగు నీటి కోసం తండ్లాట తప్పని పల్లెలు, పట్టణాలు.. ఉపాధి దొరక్క తట్ట, బుట్ట పట్టుకుని పిల్లాజెల్లలతో సహా వలసలు.. కిక్కిరిసిన జనాలతో పుణె, బొంబై, హైదరాబాద్కు వెళ్లే బస్సులు.. విద్య, వైద్యానికి నోచుకోని దీన పరిస్థితులు.. భరోసా లేని బతుకులు ...ఇది ఒకప్పటి పాలమూరు ముఖచిత్రం. ఈ జిల్లా వెనుకబాటుతనం, దయనీయ పరిస్థితులు తెలంగాణ ఉద్యమ గళంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భావజాల వ్యాప్తికి దోహదం చేయడంతో పాటు తెలంగాణ వాదులకు సత్తువనిచ్చాయి. పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా.. అనే పాట తెలంగాణ జిల్లాల్లో జ్వాల రగిలించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ఆకాంక్ష, ‘ప్రత్యేక’ పోరుకు దిక్సూచిగా నిలిచిన పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో క్రమక్రమంగా మారుతున్నాయి. నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ యాసంగిలోనూ గణనీయంగా.. ఎండాకాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరులో గణనీయంగా మార్పు వచ్చింది. 2014లో నాలుగు లక్షల లోపే యాసంగి సాగు అయ్యేది. 2019లో ఇదే సీజన్లో 6.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా.. గత ఏడాది 13.44 లక్షల ఎకరాల్లో రైతులు వివధ పంటలు సాగు చేశారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం యాసంగి పంటల సాగు మూడింతలకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
1969 నుంచి..
స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఎన్నో పోరాటాకు నాగర్కర్నూల్ వేదికగా నిలిచింది. 1969 నాటి ఉద్యమం నుంచి 1997లో జరిగిన ప్రజాస్వామిక తెలంగాణ పోరాటం, 2001 నుంచి జరిగిన మలిదశ ఉద్యమాల్లో ఈ ప్రాంత ప్రజలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నడిపించిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని.. రాష్ట్ర ఏర్పాటయ్యే దాక మడమ తిప్పకుండా పోరాడారు. రోడ్ల దిగ్బంధం వంటి సంఘటనలెన్నో పోరాటంలో మైలురాళ్లుగా నిలిచాయి. తెలంగాణ కోసం పలువురు ఆత్మబలిదానాలు చేయగా.. విప్లవోద్యమంలోనూ ఎంతో మంది బలయ్యారు. అందరి ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర అవిర్బావించి నేటికి 12ఏళ్ల పూర్తవుతోంది. ఈపన్నెండుల్లో జిల్లాలో జరిగిన అభివృద్ది నామమాత్రగానే ఉంది. ప్రధానంగా సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగడానికి పారిశ్రమిక ప్రగతి జరగలేదు. రావాణా సౌకర్యాలు మెరుగుపడ లేదు. విద్యారంగంలో మెడికల్ కాలేజీ తప్ప మరే ఇతర కాలేజీలు ఏర్పాటు కాలేదు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు/ కొల్లాపూర్ రూరల్: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఈ నెల 4, 5న పర్యటనలో భాగంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలను సందర్శించడంతోపాటు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, హెలీప్యాడ్లు, కార్యక్రమ ప్రాంగణాలు, వీవీఐపీ మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు బస చేయనున్న సోమశిల హరిత గెస్ట్హౌస్లో భద్రత, వసతి, ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీఎఫ్ఓ రేవంత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించి సోమశిల, నార్లాపూర్ ప్రాంతాల్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ ముందస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటి సోమశిలలో హరిత గెస్ట్హౌస్ను సందర్శించిన వారు సీఎం బస చేయనున్న గదులు, సమావేశ మందిరాలు, విశ్రాంతి సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. హెలీప్యాడ్ నుంచి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రహదారుల మరమ్మతు, శుభ్రత పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అనంతరం పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ–3 పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ పార్ధసారథి, ఆర్డీఓలు భన్సీలాల్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపు లేదు..
తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నవారికి గుర్తింపు దక్కలేదు. ఆనాడు అన్నీ వదిలేసి జెండా పట్టుకుని రోడ్ల మీదకు వస్తే మమ్మల్ని చూసి నవ్వుకునేవాళ్లు. కొల్లాపూర్ కేంద్రంగా ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించాం. ఆనాటి ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తామని చెప్పినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికై నా ఉద్యమకారులను గుర్తించి సరైన విధంగా గౌరవించాలి. – శేఖర్యాదవ్, తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకుడు, కొల్లాపూర్ -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారుచేసి.. అమ్మవారికి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణల అనంతరం నైవేద్యం సమర్పించి.. మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. పెద్దకొత్తపల్లిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు కందనూలు: అధిక జ్యేష్ట మాసం శుద్ధపౌర్ణమి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులు సామూహికంగా శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించినట్లు రామాలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. స్వామివారి కృపా కటాక్షం పొందేందుకు ఉన్న ంతలో స్వామి వ్రతం ఆచరించాలని ఆయన సూ చించారు. అనంతరం రామాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశా రు. కమిటీ సభ్యులు అర్థం రవీందర్, మల్లేష్, శ్రీను, యాదగిరి, నందకిషోర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు కొల్లాపూర్: ఎన్నికలకు ముందు మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ జిల్లా కన్వీనర్ కారంగి బ్రహ్మయ్య అన్నారు. ఆదివారం కొల్లాపూర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు గొడ్డలిపెట్టుగా ఉన్న జీఓ 17 రద్దు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో కేవలం ప్రజాప్రతినిధుల అనుచర వర్గం, బంధువర్గానికే కాంట్రాక్టులు దక్కుతున్నాయని.. గత ప్రభుత్వంలో మాదిరిగా బడుగు బలహీన వర్గాలకు దక్కడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మోసపూరిత కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కొల్లాపూర్ రూరల్/భూత్పూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సందర్శించి.. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ ఉన్నారు. భూత్పూర్ మండలంలోని కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారి విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్, నరేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
కళాకారులను ప్రోత్సహిద్దాం
కల్వకుర్తి రూరల్: కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం స్వర్ణ భారతి కళానిలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. స్వర్ణభారతి కళానిలయం నిర్వాహకులు 25 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు పలు విభాగాల్లో సంప్రదాయ నృత్య శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. తమలోని కళలను వెలికి తీసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు నారోజు మోహన్ ఎమ్మెల్యేతో పాటు అతిథులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ షాన్వాజ్ ఖాన్, సురేందర్రెడ్డి, సంజీవ్ యాదవ్, వెంకటేశ్, సురేశ్, నవీన్ పాల్గొన్నారు. -
సర్వీస్ తంటాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్బుక్ల నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. పారదర్శకత పెంచేలా.. ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. నమోదులో ఇబ్బందులు.. సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్లైన్లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్లైన్లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు. కార్యాలయంలోనే ప్రక్రియ.. ప్రభుత్వం సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్కు సంబంధించిన పాస్వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్లను కాంప్లెక్స్ హెచ్ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్ను ఆన్లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు గత నెల 31 వరకే ముగిసిన గడువు మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు -
చదరంగానికి పూర్వ వైభవం
వనపర్తి టౌన్: చదరంగం క్రీడలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. ఎల్.మురళీధర్ తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7న స్విస్ లీగ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రజా వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదరంగం క్రీడ మేధస్సును పెంచడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందిస్తుందని, అందుకే విద్యార్థుల్లో ఈ క్రీడపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అండర్–9, 11, 13 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించడంతో పాటు ఆయా విభాగాల్లో ప్రఽథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వెండి పతకాలు అందిస్తామన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో కొనసాగే పోటీల్లో ఆసక్తి గల విద్యార్థులు అత్యధికంగా పాల్గొని రాష్ట్రస్థాయి జట్టులో పాలమూరు ఖ్యాతిని చాటేలా సత్తా చాటాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చెస్ పోటీలకు హాజరయ్యే బాల బాలికలకు భోజన వసతి కల్పిస్తామని, ఆసక్తిగల విద్యార్థులు 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏ క్రీడ పోటీలు జరిగినా పాలమూరు ప్రాతినిథ్యం ఉంటుందని, చెస్ పోటీల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు వనపర్తి చెస్ అసోసియేషన్ ధృఢ నిశ్చయంతో పని చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, సంయుక్త కార్యదర్శి రాములు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
జెండర్ రిసోర్స్ సెంటర్లతో మహిళలకు భద్రత
బల్మూర్: మహిళలు ఎలాంటి అసమానతలకు గురికాకుండా.. సమాజంలో ధైర్యంగా జీవించేందుకు అవసరమైన సహాయన్ని అందించేందుకు ప్రభుత్వం జెండర్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటుచేసిందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బల్మూరులోని చెంచు మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆదివారం జెండర్ రిసోర్స్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గృహహింస, వేధింపులు, ఇతరత్రా ఆకృత్యాలకు గురయ్యే మహిళలకు అండగా నిలవడంతో పాటు బాలకార్మిక, జోగిని వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి ఈ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై చెంచు మహిళా స్వయం సహాయక సంఘాలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు మహిళా సాధికారతకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. జెండర్ రిసోర్స్ సెంటర్లో బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాంప్రసాద్గౌడ్, గోపాల్రెడ్డి, చెంచు మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు సైదమ్మ, ఏపీఎం సైదులు, మాజీ ఎంపీటీసీ ఖదీర్, కల్పన, రాములమ్మ పాల్గొన్నారు. -
ఇబ్బందులు తొలగించాలి..
సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్కు సంబంధించి ఆన్లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్ల ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి. – మదన్మోహన్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గడువు పొడిగించాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి. – శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు. రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం 4, 5 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల సందర్శన రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
విద్యార్థులు సామాజిక అవగాహన పెంచుకోవాలి
కందనూలు: విద్యార్థులు సామాజిక అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాల ముగింపు వేడుకల్లో స్నేహ కిశోర బాలికలు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బాలికలు వివిధ రాజ్యాంగ పదవులైన హోం, ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి పోషించి.. మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ బాలికల్లో నాయకత్వ, సామాజిక అవగాహన వంటి లక్షణాలను పెంపొందించుకొని స్వీయ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. బాలికలు చిన్న వయస్సులోనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం భవిష్యత్ నాయకత్వానికి బలమైన పునాది అవుతుందన్నారు. బాలికలు వాక్చాతుర్యంతో నిర్భయంగా మాట్లాడడానికి ఒక వేదిక అవసరమని, ఇలాంటి వేదికల ద్వారా బాలికల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం వంటి నైపుణ్యాలు బయటపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, ఏపీడీ రాజేశ్వరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. వేగవంతంగా టీపీఎస్ పనులు వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. మండలంలోని వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న టీపీఎస్ స్కూళ్ల పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీపీఎస్లో తరగతి గదులు, లైబ్రరీ, ఆట స్థలాలు, తాగునీటి సదుపాయాలు, భోజన వసతి తదితర నిర్మాణాల గురించి.. ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ దేవసహాయం, రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, ఆర్డీఓ జనార్దన్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ రాజేశ్వరి, సర్పంచ్ వెంకటయ్య, ఉపసర్పంచ్ వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 0000709038-000001-SVS HOSPITAL 8.00x8.00 SVS HOSPITAL -
నిబంధనలు కఠినం
ప్రైవేట్ కళాశాలల్లో లోపం.. ప్రభుత్వ గుర్తింపులో జాప్యం ● గద్వాల మినహా మిగతా జిల్లాల్లోఅనుమతులు నిల్ ● అయోమయంలో పది పూర్తి చేసినవిద్యార్థులు నారాయణపేట రూరల్: పాఠశాలలకు పదేళ్లకు ఒకసారి ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉండగా.. జూనియర్ కళాశాలలు ఏటా అిఫిలియేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలలకు నామమాత్రంగా అనుమతులు ఇస్తుండగా, ప్రైవేట్ కళాశాలలకు మాత్రం అన్నిరకాల సౌకర్యాలు పరిశీలించి నిబంధనల ప్రకారం విద్యార్థుల అడ్మీషన్లు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా వాటిని మరింత కచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఇంటర్బోర్డు అదే పద్ధతిలో ముందుకుసాగుతోంది. నిబందనలు ఇలా.. వాస్తవంగా అన్నిరకాల విద్యాసంస్థలు కొత్తగా తెరిచే సమయంలో అనుమతులు తీసుకుంటారు. పాఠశాలలకు పదేళ్లకు ఓసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. కాని కళాశాలలు మాత్రం ఏటా అనుమతి తీసుకోవాలి. దీనికి అన్నిరకాల పత్రాలు సమర్పించడంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ప్రభుత్వ సెక్టార్లోని కళాశాలలకు నామమాత్రంగా నిబంధనలు వర్తింజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్అండ్బీ అధికారులు ఇచ్చే బిల్డింగ్ సౌండ్నెస్ సర్టిఫికేట్, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ వారు ఇచ్చే శానిటరీ సర్టిఫికేట్, అగ్నిమాపకశాఖ ఇచ్చే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లతో వారికి అనుమతులు ఇస్తున్నారు. ఇక ప్రైవేట్ కళాశాలల విషయంలో గతంలో కంటే ప్రస్తుతం నిబంధనలు కట్టుదిట్టం చేశారు. ప్రతి కళాశాల తప్పకుండా ఎన్ఓసీ అందిస్తూ ఆటస్థలం, గుర్తింపు పత్రం, సరిపడ అధ్యాపకులు, సిబ్బంది, సామగ్రి, ల్యాబ్, గ్రంథాలయం, రూ.4 లక్షల ఎఫ్డీ బాండ్లు, బిల్డింగ్ లీజ్ డీడ్ తదితర వివరాలు తెలియజేయాలి. ఇక అద్దె భవనం, ఆట స్థలం అయితే తప్పకుండా లీజ్ డీడ్ విద్యా సంవత్సరానికి సరిపడా సమయం ధ్రువపత్రం జత చేయాల్సి ఉంది. కళాశాల భవనంలో ఇతర వ్యాపార సంస్థలు ఉండరాదనే నిబంధన కచ్చితంగా పరిశీలిస్తున్నారు. మౌలిక వసతులు, అగ్నిమాపక అనుమతులు తప్పనిసరి చేశారు. 2026–27 సంవత్సరానికిగాను.. నిబంధనలు కఠినతరం చేయడంతో అన్ని సౌకర్యాలు లేని కళాశాలలకు 2026–27 విద్యా సంవత్సరానికిగాను గుర్తింపు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలో 71 జనరల్, 31 ఒకేషనల్ ప్రైవేట్ కళాశాలు ఉండగా.. కేవలం 13 కళాశాలలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. అవి కూడా అన్ని గద్వాల జిల్లాకు చెందినవి కావడం విశేషం. ఇక నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్లో ఏ ఒక్క కళాశాలకు కూడా అఫ్లియేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. దరఖాస్తు గడువు పూర్తయినా వివిధ కారణాలతో చాలా కళాశాలలు పెండింగ్లోనే ఉన్నాయి. కొనసాగుతున్న ప్రవేశాలు..? సోమవారం నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అయినా ప్రైవేట్ కళాశాలలకు ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అనుమతులు రాని కళాశాలలు సైతం అిఫిలియేషన్ విషయాన్ని బయటకు చెప్పకుండా కళాశాల ఫారంపై విద్యార్థుల నుంచి ప్రవేశాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ కళాశాలల్లో చేర్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ గుర్తింపు రాకపోతే వారి పరిస్థితి ఏమిటని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు. -
సరళతరం చేయాలి..
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ విద్యా సంవత్సరం జీఓనంబర్ 29 అమలు చేయడంతో మిక్స్డ్ అక్యుపెన్సీ కళాశాలల విషయంలో ఐదేళ్ల వెసులుబాటు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సింగిల్ అక్యుపెన్సీ కాలేజీలతో పాటు మిగిలిన కళాశాలలకు జీఓను సవరించి అనుమతులు ఇవ్వాలి. కఠినంగా ఉన్న నిబంధనలు సరళీకృతం చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అనుమతి ఇవ్వాలి. – దేవేందర్రెడ్డి, ప్రైవేట్ కళాశాలల ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, నారాయణపేట ● -
సాయంత్రం కుప్పకట్టాల
●జిల్లావ్యాప్తంగా వరిధాన్యం కొనుగోళ్ల కోసం 200 కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొల్లాపూర్లో మెప్మా, మిగతా చోట్ల సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిర్ణీత తేమశాతం వచ్చిన ధాన్యాన్ని రోజువారిగా కాంటా వేస్తున్నాం. ఇప్పటి వరకు 38 వేల మె.ట., ధాన్యం కొని.. మిల్లులకు తరలిస్తున్నాం. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం మొత్తం కొంటాం. – రాజేందర్, సివిల్ సప్లయ్ డీఎం ఎండనక.. వాననక.. చలనక.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలు.. చేతికొచ్చిన దిగుబడులను అమ్ముకోవడానికి అదే రీతిలో కష్టపడుతున్నారు. దళారులకు అమ్మితే నష్టపోతామని భావించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర దక్కుతుందని ఆశపడితే.. ధాన్యం అమ్మి, గోదాంలకు తరలించే వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తేమ శాతం, తూకం వేయడం, నిల్వ కేంద్రాలకు తరలించడం ఒక ఎత్తయితే.. అకాల వర్షాల బారినుంచి పంటను కాపాడుకోవడం మరో ఎత్తవుతుంది. ఈ మధ్యలో అధికారులు పెట్టే కొర్రీలు అన్నీ ఇన్నీ కాకపోగా.. ధాన్యానికి సంబంధించి అన్నిరకాల బాధ్యతలు రైతులపైనే మోపుతుండటంతో అరిగోస పడుతున్నారు. – కొల్లాపూర్ జిల్లాలో కేఎల్ఐ ప్రాజెక్టుతోపాటు వాగులు, చెరువుల కింద రైతులు పెద్ద మొత్తంలో పంటలు సాగు చేశారు. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న ధాన్యాన్ని పండించగా.. రెండు నెలల క్రితమే ప్రభుత్వం కొనుగోలు చేపట్టింది. కానీ, ఇప్పటికీ పలుచోట్ల మొక్క జొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనిపిస్తుంది. సకాలంలో కాంటా వేయకపోవడం, కాంటా వేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డుల నుంచి ధాన్యం గోదాంలకు చేరే వరకు రైతులదే బాధ్యత అని అధికారులు చెబుతుండడంతో చేసేది లేక రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే నిరీక్షిస్తున్నారు. మరోవైపు మొక్కజొన్న ధాన్యం కొనుగోలు పూర్తికాక ముందే వరిధాన్యం కొనుగోలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్ యార్డుల్లో ఒకపక్క వరిధాన్యం, మరోపక్క మొక్కజొన్న ఆరబెట్టేందుకు కూడా స్థలాలు లేకపోవడంతో చాలా గ్రామాల్లో రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. కొనుగోలు కూడా అక్కడే జరుతున్నాయి. సగమైనా కొనలే.. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మె.ట., వరిధాన్యం పండినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకు కేవలం 41 వేల మె.ట., ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు చేరగా.. వీటిలో 38 వేల మె.ట., ధాన్యాన్ని సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఉన్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఓ వైపు ఇబ్బందులు పడుతుండగా.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించేందుకు అధికారులు కూడా అవస్థలు పడుతున్నారు. సరిపడా గోదాంలు లేకపోవడం, రవాణా కోసం లారీలు అందుబాటులో ఉండకపోవడం, హమాలీల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. పూర్తిస్థాయిలో రైతులు పండించిన వరిధాన్యం మార్కెట్కు వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దయనీయంగా మారిన అన్నదాత పరిస్థితి ధాన్యం అమ్ముకునేందుకు పడరాని పాట్లు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు మరోవైపు మార్కెట్లో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు అన్ని బాధ్యతలు రైతుల మీదే మోపుతున్న అధికార యంత్రాంగం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులను ఆదేశిస్తున్నారు. మంత్రి ముందు సరే అంటున్న అధికారులు ఆ తర్వాత తేమశాతం వచ్చే వరకు ధాన్యం కొనేది లేదని రైతులకు చెబుతున్నారు. ఈ క్రమంలో కొల్లాపూర్, నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మర్రి జనార్దన్రెడ్డి గోదాంల వద్దకు వెళ్లి తానే దగ్గర ఉండి లారీలను అన్లోడ్ చేయిస్తున్నారు. -
జాబ్మేళాకు స్పందన
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని ఏటీసీ సెంటర్లో నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా ఐటీఐ కన్వీనర్ జయమ్మ తెలిపారు. శుక్రవారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్మేళాలో పలు కంపెనీలు పాల్గొనగా.. జిల్లాలోని పలువురు నిరుద్యోగులు మేళాకు హాజరయ్యారు. జాబ్మేళాలో 102 మంది మొదటి రౌండ్లో ఉత్తీర్ణత సాధించి చివరి రౌండుకు అర్హత సాధించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ సింగ్, కోఆర్డినేటర్ చెన్నబసవ, కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు కందనూలు: జిల్లాలో ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడిబయట పిల్లల గుర్తింపు, నమోదు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి, వారికి వయస్సుకు తగిన తరగతుల్లో ప్రవేశం కల్పించాలని చెప్పారు. పాఠశాలల్లో ప్రవేశ ప్రక్రియ సులభతరం చేయడం, అవసరమైన పత్రాల సేకరణలో సహకారం అందించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేష్కుమార్, డీఐఈఓ వెంకటరమణ, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
పోక్సో.. కాస్కో
మహబూబ్నగర్ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు. గురువులు సైతం వక్ర బుద్ధి ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి. బెయిల్ దొరకడం కష్టమే.. పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి. శిక్షలు పడిన పలు కేసులు ఇలా.. మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన రమేష్ అనే యువకుడికి ఈ నెల 7న న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 జవనరి 24న జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండీ సాబిల్ ఓ బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి బలవంతంగా జడ్చర్లలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు దృశ్యాన్ని వీడియో తీసి తన మిత్రులు సయ్యద్ తాలిబ్, సయ్యద్ అల్తాప్లకు వాట్సాప్లో పంపించాడు. వారు కూడా వీడియోలు చూపించి అమ్మాయిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుల్లో ఏ1 ఎండీ సాబిల్కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా, ఏ2 సయ్యద్ తాలిబ్, ఏ3 సయ్యద్ అల్తాప్కు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మే 7న ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటనపై 2017లో కోదండపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై గద్వాల ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నాగర్కర్నూల్ జిల్లాలో 2020 నుంచి పోక్సో కేసులు ఇలా.. ఏడాది నమోదైన శిక్షపడిన కేసులు వారు 2020 60 0 2021 71 0 2022 86 0 2023 91 0 2024 105 0 2025 82 0 2026 22 1 మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ పాఠశాలతోపాటు షాసాబ్గుట్ట, వన్టౌన్ స్టేషన్ పరిధిలో వీరన్నపేట హైస్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’ 2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సో కేసులు ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్నగర్లోనే 758 కేసులు నమోదు కీచకులుగా మారుతున్న కొందరు ఉపాధ్యాయులు పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ -
‘సర్’ను పారదర్శకంగా అమలు చేస్తాం
కందనూలు: జిల్లాలో జూన్ 15 నుంచి చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్, జిల్లాలో చేపట్టనున్న ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాల ఖచ్చితత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి అత్యంత కీలకమని, జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక సవరణలో భాగంగా ఇంటింటి సర్వేలను ఖచ్చితత్వంతో నిర్వహించేందుకు బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన లేదా వలస వెళ్లిన ఓటర్ల పేర్ల తొలగింపు, డూప్లికేట్ నమోదు పరిశీలన వంటి అంశాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తామన్నారు. ఇంటింటి సర్వేలో కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాల నవీకరణను పూర్తి చేస్తామని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సర్పై వచ్చే ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించేలా చర్యలు ఉంటాయని, జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓలు సురేష్బాబు, భన్సీలాల్, యాదగిరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, తహసీల్దార్లు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడతకు రెడీ
జిల్లాకు మరో 8 వేల ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రభుత్వం మొదటి విడతలో జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టని వారికి నిర్మాణాలు చేపట్టాలని, లేని పక్షంలో రద్దు చేస్తామని నోటీసులు ఇచ్చాం. మరోసారి నోటీసులు ఇచ్చి ప్రారంభించకుంటే రద్దు చేస్తాం. – సంగప్ప, పీడీ, గృహ నిర్మాణ శాఖ అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కేబినెట్లో ఒక్కో నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాకు ఈ విడతలో మరో 8 వేల ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉంది. వీటిపై అర్హులైన నిరుపేదలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి విడతకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం గమనార్హం. చెంచులకు ప్రత్యేకంగా.. జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు కలిపి 8 వేల ఇళ్లు మంజూరు కానుండగా.. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని చెంచులకు ప్రత్యేకంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన ఈ రెండు నియోజకవర్గాలకు 5 వేల ఇళ్ల మంజూరయ్యే అవకాశం ఉంది. గతంలో మాదిరి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తే మరిన్ని కేటాయించవచ్చు. అసంపూర్తి ఇళ్లకు.. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు సైతం ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చింది. నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు కాగా.. 1,500 ఇళ్లను ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులకు గతంలో ఇచ్చిన తరహాలోనే ఇళ్ల నిర్మాణం లెవల్ బట్టి దశల వారీగా మొత్తం రూ.5 లక్షలు చెల్లించనుంది. 500 ఇళ్లను గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై వివిధ కారణాలతో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి కేటాయించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులతోపాటు ఇతర కారణాలతో అసంపూర్తిగా మిగిలి ఉంటే ఈ పథకం కింద ప్రయోజనం కల్పించనున్నారు. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున సహాయం చేయనున్నారు. ఎంపికకు క్షేత్రస్థాయి సర్వే.. జిల్లావ్యాప్తంగా 2,33,124 మంది దరఖాస్తులు చేసుకోగా 1,29,392 మంది పక్కా ఇళ్లు కలిగి ఉన్నారు. ఇంటి స్థలం కలిగి ఇళ్లు లేని (ఎల్–1) వారు 56,486 మంది, ఇంటి స్థలం, ఇళ్లు లేనివారు (ఎల్–2) 15,812 మంది, ఇతరులు (ఎల్–3) 31,434 మంది ఉన్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో ఇందులో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే చేపట్టారు. ఇందుకోసం వివిధ శాఖల మండల స్థాయి అధికారులను నియమించారు. వీరికి ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించగా.. వీరు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపడుతారు. ఇంటి నిర్మాణం వివరాలు, ప్రభుత్వ ఉద్యోగం, నెలకు వచ్చే ఆదాయం, కారు ఉందా.. లేదా.. వంటి వివరాలపై ఆరా తీస్తారు. వాటిని యాప్లో నమోదు చేసి వీటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మంజూరైనవి (ప్రొసీడింగ్స్ ఇచ్చినవి) 10,639 స్లాబ్ లెవల్ 2,772 జిల్లాకు తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ విడతలో 11,922 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 1,078 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ 4,937 ఇళ్లకు సంబంధించి కనీసం పునాదులు కూడా తీయలేదు. ఇందులో అత్యధికంగా ఆదివాసీలు, పీవీటీజీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక స్థోమత లేకపోవడం, అటవీ శాఖ పరిధిలో స్థలాలు ఉండటం, పట్టాలు లేకపోవడం వంటి కారణాలతోనే నిర్మాణానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక స్లాబ్, రెంటల్ లెవల్లో ఉన్న ఇళ్లను రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్లో గృహ ప్రవేశాలు నిర్వహించేలా హౌసింగ్ శాఖ ప్రయత్నిస్తోంది. జూన్ 2న శ్రీకారం చుట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 2 వేల చొప్పున మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న నిరుపేద లబ్ధిదారులు తొలి విడత నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయం -
కష్టాలు.. నష్టాలు.. కన్నీళ్లు
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యం, మొక్కజొన్న ● జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన పెద్దకొత్తపల్లి/ కోడేరు/ తెలకపల్లి/ లింగాల: జిల్లాలో రైతులను అకాల వర్షాలు వీడటం లేదు. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులను ధాన్యం కాపాడుకోవడానికి కష్టపెడుతూ.. తడిసిన ధాన్యంతో నష్టాలు మిగిల్చుతూ.. చివరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సైతం వివిధ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్లో రైతు వ్యవసాయ షెడ్ రేకులు గాలివానకు కొట్టుకపోయాయి. తహసీల్దార్ శ్రీనివాసులు శుక్రవారం ఉదయం చంద్రకల్, పెద్దకొత్తపల్లి, దేవల్తిర్మలాపూర్ గ్రామాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. కోడేరులో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం, భారీ ఈదురు గాలులకు ధాన్యం తడిసిపోగా.. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ప్రధాన రహదారుల వెంట భారీ చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సాయిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయి.. కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి నర్సాయిపల్లిలో తడిసిన వరిధాన్యాన్ని పరిశీలించి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలకపల్లిలోని లింగాల రోడ్డులో చెట్లు విరిగిపడగా.. పోలీసులు జేసీబీతో తొలగించారు. అలాగే ఆలేరులో రెండు గుడిసెలు, రెండు రేకుల ఇళ్లు, పెద్దూరులో వస్పరి మల్లయ్య రేకులు గాలివానకు పూర్తిగా లేచిపోయి ధ్వంసమయ్యాయి. లింగాలతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున భీకరమైన ఈదురు గాలులతో కురిసిన వర్షంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు ఏఈ అప్పలనాయుడు తెలిపారు. -
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునేలోపే విషాదం
నాగర్కర్నూల్ జిల్లా: భర్త, కుమారుడితో కలిసి ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఓ మహిళను రోడ్డుపై ఉన్న గుంత బలి తీసుకుంది. ఈ హృదయ విషాధకర ఘటన బల్మూర్ మండలంలోని అచ్చంపేట, నాగర్కర్నూల్ ప్రధాన రహదారిలోని తుమ్మెన్పేట కాజ్వే వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని తుమ్మెన్పేట గ్రామానికి చెందిన మద్దెలగండ్ల దివ్య (20), భర్త హరికృష్ణతో పాటు ఆరు నెలల కుమారుడితో కలిసి బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై అచ్చంపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు.ఈ క్రమంలో మార్గ మధ్యలోని తుమ్మెన్పేట స్టేజీ సమీపంలో ఉన్న కాజ్వే వద్ద ఎదురుగా వస్తున్న బస్సు లైట్ల ఫోకస్కు రోడ్డుపై ఉన్న గుంతలోకి బైక్ దించడంతో వెనకాల కుమారుడిని పట్టుకొని కూర్చున్న దివ్వ పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కాగా.. సృహ తప్పిపోవడంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి చింతల సురేష్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ తెలిపారు. -
ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి
కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు. గురువారం ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, జ్యోతి, గౌరమ్మ, మాధవి, శివలీల పాల్గొన్నారు. ● పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జూపల్లి అన్నారు. కొల్లాపూర్ మండలం సోమశిలకు చెందిన పుట్టపాగ కృష్ణయ్య ఏడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ నుంచి మంజూరైన రూ. 3లక్షల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఉపసర్పంచ్ ఖాదర్పాషా, రామకృష్ణ, గోరటి రామ్మోహన్, చిన్నకురుమయ్య, ఆశన్న, నర్సింహ, లింగన్న పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఏకరూప దుస్తులు ఎప్పుడో?
ఇంకా అందని స్కూల్ యూనిఫాం వస్త్రం ● మరో 14 రోజుల్లో బడులు ప్రారంభం ● క్లాత్ ఎప్పుడొస్తుందనే దానిపై అధికారుల్లో స్పష్టత కరువు ● మొదటిరోజు సివిల్ డ్రెస్లో బడికి వెళ్లక తప్పని వైనం స్పష్టత కరువు.. ప్రభుత్వం కొన్నేళ్లుగా టెస్కో ద్వారా స్కూల్ యూనిఫాం క్లాత్ను సరఫరా చేయించి.. మహిళా సంఘాల ద్వారా కుట్టించేది. అయితే ఈసారి టెస్కోకు కాకుండా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే టెస్కో ద్వారానా.. లేక మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా అనే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు సైతం స్పష్టత లేదు. మరో 14 రోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో క్లాత్ ఎప్పుడు వస్తుందో.. విద్యార్థులకు కొలతలు ఎప్పుడు తీసుకుంటారో.. కుట్టుపని ప్రారంభించేదెప్పుడో.. అనే పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 47వేల మంది విద్యార్థులు.. జిల్లాలో 749 ప్రభుత్వ పాఠశాలల్లో 47,387 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో బాలురు 25,102 మంది, బాలికలు 22,285 మంది ఉన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాంలను అందజేస్తుంది. గతేడాది 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు ఫ్రాక్, 4, 5 తరగతుల వారికి స్కర్ట్, 6 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రెస్, పైన కోట్, బాలురకు ప్యాంట్, షర్టులు అందించారు. ఈ సారి మాత్రం యూనిఫాం మోడల్స్పై ఇంకా స్పష్టత రాలేదు. కందనూలు: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల విద్యార్థులకు పంపిణీ చేసే ఏకరూప దుస్తులపై ఇప్పటికీ స్పష్టత లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజే విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తూ వస్తున్న విద్యాశాఖ.. మార్చిలోనే జిల్లాల వారీగా అవసరమైన క్లాత్ను సరఫరా చేసేది. వీటిని ఎమ్మార్సీలకు తరలించి.. ఏప్రిల్, మే నెలల్లో మహిళా సంఘాల సభ్యులతో కుట్టించే వారు. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నేటికీ జిల్లాకు అవసరమైన క్లాత్ అందలేదు. ఫలితంగా విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీలో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విద్యార్థుల దుస్తులు కుట్టి, ఉపాధి పొందుదామనుకున్న మహిళా సంఘాల సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం ఉండగా.. ఇప్పటికీ క్లాత్ చేరకపోవడంతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం లేదు.. క్లాత్ ఎప్పుడు వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇప్ప టి వరకు మాకు ఎలాంటి సమా చారం రాలే దు. క్లాత్ కోసం ఎదురుచూస్తున్నాం. క్లాత్ రాగానే సమయానికి కుట్టేలా చర్యలు తీసుకుంటాం. – రమేశ్కుమార్, డీఈఓ ● -
‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’
● 2025 డిసెంబర్ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది. మధ్య తరగతి జీవితాలతో చెలగాటమాడుతున్న అప్పులు 10 నెలల్లో సుమారు 25 మంది వరకు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖర్చులు పెరగడంతో.. ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఫైనాన్స్, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ● 2026 ఏప్రిల్ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన కర్రెమ్ సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ సూర్య, అలియాస్ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి.. ప్రస్తుత తరంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్ యాప్ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్, పాన్, ఫోన్ నంబర్ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్లైన్ లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి కుంగుబాటు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న యువతరం ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు పిల్లల నూరేళ్ల జీవితాన్ని చేజేతులా కాలరాస్తున్న వైనం 2025 ఆగస్ట్ 15: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి... అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే స్నే హితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్ తీసుకోవాలి. – డా.అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా జనరల్ ఆస్పత్రి -
‘అచ్చంపేట లిఫ్ట్’ పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట: అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తిచేసి తీరుతామని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అచ్చంపేట లిఫ్ట్కు పాలాభిషేకాలు చేసిన నాయకులే ప్రస్తుతం పనులను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు నల్లమట్టి అమ్మి రూ.కోట్ల సొమ్ము చేసుకున్న మర్రి జనార్దన్రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. తాను అక్రమ ఇసుక దందా చేస్తున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రుజువు చేయకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటావా అని సవాల్ విసిరారు. రాజకీయ కక్షతో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తనపైనే 49 కేసులు నమోదు చేశారని.. నాలుగు కేసుల్లో ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నామని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి బీఆర్ఎస్కే ఉందని.. తమ ప్రభుత్వానికి లేదన్నారు. మరో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. పోలీస్ అధికారిగా పనిచేసిన ఆయన.. పోలీసులను విమర్శించడం తగదన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్, మాజీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఎ.గోపాల్రెడ్డి, అంతటి మల్లేష్, పోశం గణేశ్, బుచ్చిరాములు, రాజ్గోపాల్ ఉన్నారు. చైర్మన్ మాధవరెడ్డి పదవీ కాలం పొడిగింపు అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారం ఉ మామహేశ్వర దేవాలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండోసారి పొడగించింది. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా నియామకపత్రాన్ని మాధవరెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో రెండోసారి చైర్మన్గా నియమించిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే సహకారంతో ఆలయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగ భద్రత కందనూలు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోనే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అదే విధంగా 2021 వేతన సవరణలో ఉన్నా తేడాలను సవరించాలని.. విలీన కమిటీలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రీజియన్ కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సుమలత, పద్మ, కృష్ణయ్య ఉన్నారు. అధిక ఫీజులను నియంత్రించాలి కందనూలు: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మొక్తాల శంతన్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి.. విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఏబీవీపీ నాయ కులు సంగనమోని బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, సంయుక్త కార్యదర్శి శివ, విష్ణు, నాయుడు ఉన్నారు. -
జాప్యం లేకుండా ధాన్యం సేకరణ
అచ్చంపేట/తెలకపల్లి: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చెన్నారం, నడింపల్లి గ్రామాల్లోని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో మొక్కజొన్న నిల్వ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మిల్లుల్లో ధాన్యం నిల్వ సామర్థ్యం, కొనుగోలు ప్రక్రియ, మిల్లింగ్ వ్యవస్థపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన వరిధాన్యం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. ధాన్యంలో తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా పరిశీలించి.. పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాలకు తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కలెక్టర్ వెంట అచ్చంపేట తహసీల్దార్ సైదులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
● మసీదులు, ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు ● పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు కందనూలు: జిల్లావ్యాప్తంగా గురువారం బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనల అనంతరం జామియా నిజామియాకు చెందిన ఈద్ ఉల్ ఆజ్వా బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. అల్లా ముస్లింలకు ప్రసాదించిన ఐదు అంశాల్లో హజ్ కూడా ప్రధానమైందన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ ఖుర్భానీ ఇవ్వాలని ఖురాన్ చెబుతోందని.. త్యాగ నీరతికి ప్రతీక అయిన బక్రీద్ నిష్టతో జరుపుకోవాలని సూచించారు. సమాజంలో అల్లా దయ ఉన్నంత వరకు మంచి చేకూరుతుందన్నారు. ● ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్చైర్మన్ బాదం రమేశ్, కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వినోద్ తదితరులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన రోజా, జకాత్, నమాజ్, ఇమాన్, హజ్ సూత్రాలను పాటిస్తూ, ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం అభినందనీయన్నారు. కాగా, బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
తాజాగా బీఆర్ఎస్ పోరుబాట..
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్ఎల్ఐ పనులు పూర్తిచేయించేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై జూన్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మధ్యలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనేలా.. చివరకు ముగింపు రోజున కేసీఆర్ పాల్గొనేలా భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు పాలమూరు ప్రాజెక్ట్ అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి. -
బక్రీద్కు ముస్తాబు
కందనూలు: జిల్లాలో బక్రీద్ పండుగ కోసం మసీదులు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రం శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు మత పెద్దలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ● ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ పండుగ మనిషిలో మానవత్వాన్ని, పరస్పర సహకారాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గొప్ప సందేశాన్ని అందిస్తుందన్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుతూ పరస్పర గౌరవభావంతో మెగాలని ఆకాంక్షించారు. సమన్వయంతో పనిచేయాలి కందనూలు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న వేడుకల కోసం ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. వేడుకల ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి అన్ని అంశాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి కందనూలు: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కరపత్రాలు విడుదల చేసి పోష్ చట్టం, షీబాక్స్ పోర్టల్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు పోష్ చట్టం చాలా ఉపయోగపడుతుందని, ప్రతి మహిళా ఉద్యోగి చట్టంలోని నిబంధనలు తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, సఖి అడ్మినిస్ట్రేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఓగా ఆర్.పాండు కందనూలు: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా ఆర్.పాండును నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి తహసీల్దార్గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై బదిలీలో భాగంగా నాగర్కర్నూల్ డీఆర్ఓగా రానున్నారు. త్వరలోనే ఈయన బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. అక్రమ కేసులకు భయపడొద్దు బల్మూర్: కాంగ్రెస్ నాయకుల అక్రమ కేసులు, దాడులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని, వారికి పార్టీ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామంలో ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపిస్తూ బుధవారం కార్యకర్తల భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోపాటు నాగర్కర్నూ ల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే లు, నాయకులు పోలీసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేయిస్తున్నారని, తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయ మని అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, నాయకులు తులసీరాం, మనోహర్, కరుణకర్రావు, పర్వతాలు, నాగరాజు, రమేష్రావు, శివ, బాలరాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్, వ్యవసాయ, రవాణా, రెవెన్యూ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నందున, ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం, హమాలీ, లోడింగ్, రవాణా వంటి అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్ పాల్గొన్నారు. జూన్ 15 నాటికి పూర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జూన్ 15 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీసీలో జిల్లాలో వరి కొనుగోళ్ల కోసం చేపట్టిన ఏర్పాట్లు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం సేకరణ పురోగతి, అకాల వర్షాల ప్రభావంతో తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని చెప్పారు. -
హమ్మయ్యా.. చల్లబడింది
మూడురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వాతావరణంలో మార్పులు కల్వకుర్తి టౌన్/ కొల్లాపూర్/ చారకొండ/ అచ్చంపేట రూరల్: జిల్లాలో తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఉపశమనం కలిగించాయి. మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో బుధవారం మొత్తం వాతావరణం పూర్తిగా చల్లబడింది. అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులతో మొదలై.. బుధవారం తెల్లవారుజాము వరకు దాదాపు 3 గంటలపాటు భారీ వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. అత్యధికంగా తిమ్మాజిపేటలో 88.8 మి.మీ., కల్వకుర్తిలో 80.2 మి.మీ.,ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా వర్షపునీరు చేరింది. దీనికితోడు నాలుగు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటల సాగులో నిమగ్నమయ్యారు. చాలాచోట్ల ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు పత్తి విత్తనాలు నాటగా.. మరికొందరు పొలాల్లో దుక్కి దున్నే పనులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం అత్యధికంగా తిమ్మాజిపేటలో 88.8 మి.మీ., వర్షపాతం ఆరుతడి పంటల సాగులో నిమగ్నమైన రైతులు -
ఏటీఎంపై చోరీల నిఘా..! 8 నిమిషాల్లో పని పూర్తి..!!
మహబూబ్నగర్: ‘కొన్నిరోజుల నుంచి రెక్కీ నిర్వహించారు.. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేదు.. తెల్లవారుజామున సరైన పెట్రోలింగ్ ఉండటం లేద’ని గుర్తించి.. ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు పథకం రచించి.. పక్కాగా అమలు చేసి సఫలమయ్యారు. ఏటీఎం మిషన్కే ఎత్తుకెళ్లడం పాలమూరులో తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెలంగాణ చౌరస్తాలో ఎస్బీఐ ఏటీఎంను మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రాబరీ చేశారు. మొదట ఒక వ్యక్తి పరిసర ప్రాంతాలు పరిశీలించడానికి అక్కడికి చేరుకొని.. చుట్టు పక్కలతోపాటు రోడ్డు మార్గాన్ని పూర్తిగా గమనించిన తర్వాత మరో ఇద్దరికి సమాచారం ఇచ్చాడు.బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు పక్క సందు రోడ్డులో నుంచి అక్కడికి చేరుకున్నారు. క్షణాల్లో వాహనం రివర్స్ చేసి ఏటీఎం దగ్గరకు పెట్టి ఆ తర్వాత గ్యాస్ కట్టర్తో మొత్తం కట్ చేసి.. వంద కేజీల బరువు కలిగిన ఏటీఎం మిషన్ను పట్టా సహాయంతో వాహనం లోపలికి ఎక్కించారు. అక్కడి నుంచి వేగంగా బోయపల్లి గేట్ మీదుగా టంకర గ్రామ శివారులో వ్యవసాయ పొలంలోకి చేరుకున్నారు. అక్కడ వాహనంలో నుంచి మిషన్ కిందకు దించి కట్టర్తో మిషన్ను కట్ చేసి లోపల ఉన్న రూ.2,37,500 నగదు ఎత్తుకెళ్లారు.ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి, ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. దొంగల ముఠా గాలింపు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఏటీఎం రాబరీ కేసులో టూటౌన్ పోలీస్ స్టేషన్లో 331–క్లాజ్ 4, 305 బీఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు.షాద్నగర్లో విఫలయత్నం..మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో ఎస్బీఐ ఏటీఎం దొంగతనం చేసిన ముఠానే ఈ నెల 23న షాద్నగర్లో ఒక ఏటీఎంలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. దీంతోపాటు ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో ఒక ఏటీఎం దోచేశారు. అదే తరహాలో మహబూబ్నగర్లో చేసి విజయవంతం అయ్యారు.చివరగా ఐదేళ్ల కిందట..2019లో వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బిస్లారి గేట్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. అప్పట్లో రూ.6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఏటీఎంల దగ్గర రాత్రివేళలలో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో దొంగతనాలు చేయడానికి సులువుగా ఉంటుంది. నగరంలో ప్రధాన బ్యాంకులకు సంబంధించి దాదాపు 50 వరకు ఏటీఎంలు ఉంటాయి. ఏ ఒక్క దగ్గర కూడా సెక్యూరిటీ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.8 నిమిషాల్లో పూర్తి..ఎస్బీఐ ఏటీఎం దొంగతనం చేయడానికి వచ్చిన ఈ ముఠా కేవలం 8 నిమిషాల్లో పని చేసుకొని అక్కడి నుంచి పరార్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు కూడా గుర్తించలేకపోయారు. ఏటీఎం దొంగతనం చేసిన దృశ్యాలు మొత్తం ఎదురుగా ఉన్న గురురాఘవేంద్ర సూపర్ మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు పుటేజీని పరిశీలించారు. అలాగే తెలంగాణ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, సింధు హోటల్ ఏరియాలో ఉన్న లాడ్జిలలో దొంగలు బస చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. -
బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం
కొల్లాపూర్: బహుజన రాజ్యాధికార సాధనే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్లో ఆయన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కొన్ని రోజులుగా మహిళలపై జ రుగుతున్న వేధింపులు, దాడులు, అత్యాచార ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ ఆగడాల ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నా రు. మహిళల గౌరవాన్ని కాపాడేలా, వారికి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బహుజనుల రాజకీయ సాధికారత, సామాజిక న్యా యం, సమానత్వం కోసం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కొల్లాపూర్తో పాటు ఉమ్మడి పాలమూరులో పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామకృష్ణ, యేసేపు, బండి పృథ్వీరాజు, మిద్దె మహేశ్, కళ్యాణ్, బోనాసి రాంచందర్, మునిస్వామి, విష్ణు, బాలకృష్ణ పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం
వాతావరణం ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నా.. ఉక్కపోత పెరుగుతోంది. సాయంత్రం చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కందనూలు/కొల్లాపూర్/కోడేరు: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అను బంధ పనులు, పంప్హౌజ్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహించం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రాజెక్టు పనుల పరిశీలన.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–1, 2, 3 పనులతో పాటు కోడేరు మండలంలోని తీగలపల్లిలో కొనసాగుతున్న పంపుహౌజ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ తూము, హెడ్ రెగ్యులేటరీలను పరిశీలించారు. తీగలపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వారి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, ఎస్సీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఆర్డీఓ బన్సీలాల్, ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ఈఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. కబడ్డీ.. కబడ్డీ జిల్లా కబడ్డీ జట్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో విజేతలుగా నిలిచేందుకు కబడ్డీ అసోసియేషన్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. –8లో uఒక పంపు నుంచి నీటిని వదిలి పూర్తయిందనిపించారు.. పాలమూరు ప్రాజెక్టులో నాలుగు మోటార్లు మాత్రమే ఏర్పాటుచేశారని.. మరో ఐదు మోటార్ల ఏర్పాటు పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని మంత్రి జూపల్లి అన్నారు. ఇక ఉదండాపూర్ వరకు ప్రధాన కాల్వ పనులే పూర్తి కాలేదన్నారు. కానీ బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాలమూరు ప్రాజెక్టు పనులను 90శాతం పూర్తిచేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పంపు నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని వదిలి, మొత్తం ప్రాజెక్టు అయిపోయినట్లు చెబుతున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 80కోట్లు ఖర్చవుతుందని చెప్పిన గత ప్రభుత్వం.. రూ. 38వేల కోట్లు మంజూరుచేసి, రూ. 23వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తిచేసి 12లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అదే విధంగా కేఎల్ఐ మోటార్లకు మరమ్మతులు పూర్తిచేస్తామన్నారు. వారం రోజుల్లో భూసేకరణ పనులను పూర్తిచేయాలి త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రాజోళి/గట్టు: లంచం తీసుకుంటూ ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడిన ఘటన వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకలకు చెందిన ఓ రైతు తనకున్న 4.14 ఎకరాల భూమిని సర్వే చేయాలని సర్వేయర్ బ్రహ్మయ్యను సంప్రదించారు. ఇందుకు గాను సర్వేయర్ ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. విసిగిపోయిన రైతు మహబూబ్నగర్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం శాంతినగర్ తహసీల్దార్ కార్యాలయంలో సదరు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు గట్టులోని సర్వేయర్ బ్రహ్మయ్య ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు నేరుగా గట్టులోని బ్రహ్మ య్య ఇంటికి చేరుకుని తనిఖీలు చేశారు. -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మహిళాశక్తి సూపర్ బజార్లు, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, పెట్రో ల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో రూ.14 కోట్ల వడ్డిలేని రుణాలు అందించామని వివరించారు. అదే విధంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెల్దండ మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్కుమార్, బాలజీ సింగ్, ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, కమిషనర్ మహమూద్, తహసీల్దార్ ఉమ, షాన్వాజ్ఖాన్, విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, పూల్సింగ్, వెంకటయ్యగౌడ్, హరికిషన్ పాల్గొన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
అచ్చపేట(బల్మూర్): బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అమ్మా యిలకు 18ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయా లని సూచించారు. ఎవరైనా బాల్యవివాహాన్ని ప్రో త్సహించినా, జరిపించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సామాజిక దురాచారంతో బాలలు తమ హక్కులను కోల్పోవడమే కాకుండా.. వారి భవిష్యత్, ఆరోగ్యం దెబ్బతింటాయన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సామాజిక బాధ్యతగా డయల్ 1098 లేదా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనలో అంగన్వాడీ టీచర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. అదే విధంగా గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీడీపీఓ దమయంతి, ఎంపీడీఓ రాఘవులు, పోష ణ అభియాన్ కో–ఆర్డినేటర్ పార్వతి, చైల్డ్ హెల్ప్లైన్ అధికారి యశ్వంత్, మల్లేష్, కో–ఆర్డినేటర్ వెంకటమ్మ, సూపర్వైజర్ సునీత పాల్గొన్నారు. -
పోలీసు ప్రజావాణికి 11 ఫిర్యాదులు
కందనూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భూమికి సంబంధించినవి 3, భార్యభర్తల గొడవపై 2, తగున్యాయం చేయాలని 6 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. -
రైతులకు అండగా ఉంటాం
● మిల్లులకు ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహించొద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్ రూరల్: ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి జిల్లాకేంద్రంలోని సత్యసాయి రైస్మిల్లుతో పాటు చందుబట్ల వెంకటేశ్వర్లు ఆగ్రో ఇండస్ట్రీస్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల వద్ద వరిధాన్యం వాహనాలు భారీగా నిలిచిపోవడాన్ని గమనించిన మంత్రి.. మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో అన్లోడ్ చేయకుండా ఆలస్యం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోతుండగా.. రైస్మిల్లుల వద్ద సమన్వయం లేక సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే గోదాంల వద్ద పోలీ సు నిఘా ఏర్పాటుచేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు ఉన్నారు. -
గాలివాన బీభత్సం
● హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై విరిగిపడిన చెట్లు ● వాహనాల రాకపోకలకు అంతరాయం కల్వకుర్తి: జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వెల్దండ పోలీస్స్టేషన్ సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు శ్రమించి రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను గ్రామస్తులు తొలగించారు. అదే విధంగా వెల్దండ బస్టాండ్లో చెట్లు విరిగిపడ్డాయి. 13వ వార్డులో విద్యుత్ స్తంభం విరిగి ఓ ఇంటిపై పడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. బీసీ వసతిగృహంలోని భారీ వృక్షాలు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో తెగిపోయాయి. సింగల్విండో కార్యాలయానికి మొక్కజొన్నల లోడ్తో వచ్చిన ట్రాక్టర్లపై చెట్టు విరిగిపడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 100 బస్తాల మొక్కజొన్న తడిసిపోయింది. చెర్కూర్లోనూ విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వెల్దండ శివారులో 33కేవీ లైన్ స్తంభాలు విరిగిపోవడంతో బొల్లంపల్లి, భైరాపూర్ సబ్స్టేషన్లకు సరఫరా నిలిచిపోయింది. కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో మల్లేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న వేప చెట్టు, విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడటంతో అక్కడ నిలిపి ఉంచిన రెండు ట్రాక్టర్లు దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెట్టు తొలగింపు పనులు చేపట్టారు. -
ఆ ఒక్కటే అడ్డంకి..
‘సూపర్’ సేవలకు ‘ఫోరం’ విఘాతం 2016లో అడుగులు.. 2023లో పనులు.. మహబూబ్నగర్లోని ఎదిరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆర్టీసీ బస్స్టాండ్ ఎదుట ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో 1,000 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2016లో మొత్తం రూ.450 కోట్లతో గత బీఆర్ఎస్ హయాంలో అడుగులు పడ్డాయి. ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.270 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత కలెక్టరేట్లోని సామగ్రిని కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలోకి మార్చేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. 2023లో ఆస్పత్రి భవన నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. 4 బ్లాక్లు పూర్తి.. ఈ–బ్లాక్ పనులు షురూ.. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాక్లుగా విభజించి బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం ప్రారంభించారు. తొలి నాలుగు బ్లాక్ల (ఏ, బీ, సీ, డీ) నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఈ–బ్లాక్ నిర్మించాల్సిన స్థలంలో ఈవీఎంల గోదాం ఉండగా.. ఈ అంశం కోర్టులో పెండింగ్లో పడింది. మూడు నెలల కిత్రం కోర్టు ఆదేశాలతో ఈవీఎంలను కొత్త కలెక్టరేట్కు తరలించడంతో సమస్య పరిష్కారం కాగా.. ఈ–బ్లాక్ పనులు ప్రారంభమయ్యాయి. చివరి దశలో పరికరాల బిగింపు.. మహబూబ్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి తరహాలో అధునాతన హాస్పిటల్ థియేటర్లు(ఎంఓటీ) ఐదు, ఆక్సిజన్ పైప్లైన్ వర్క్స్, ఫైర్ ఫైటింగ్ ట్యాంక్లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, పవర్, పవర్ బ్యాక్ అప్ సిస్టం, నాలుగు బ్లాక్లలో డొమెస్టిక్ పంప్లు, అంబులెన్స్ గ్యారేజీతో పాటు మెడికల్ గ్యాస్ పైప్లైన్లు, భారీ సామర్థ్యం గల రెండు వాటర్ ట్యాంక్లు, తొమ్మిది లిఫ్ట్లు, తొమ్మిది కౌంటర్లు, కేథల్యాబ్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్కు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ పనులు సైతం పూర్తయ్యాయి. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కంటి, న్యూరో, ఆర్థో, ఈఎన్టీ వంటి మొత్తం 35 వైద్య విభాగాలకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన వైద్యసేవలందించేలా వైద్య పరికరాలు అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ–బ్లాక్ అయితేనే వైద్య పరికరాల బిగింపు.. ఈవీఎంల సమస్య తీరడంతో ఆలస్యంగా ప్రారంభించిన ఈ–బ్లాక్లో మొత్తం ఐదు స్లాబ్లు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండు అంతస్తుల స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయింది. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే అధునాతన వైద్య పరికరాలను అన్ని బ్లాక్లలో అమర్చనున్నారు. ఆక్సిజన్, ఫైర్ ఫైటింగ్ వంటివి అనుసంధానంగా ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆయా పనులను ఒకేసారి చేయాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరులో పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో మహబూబ్నగర్లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఈవీఎంల గోడౌన్ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్నా.. వినియోగదారుల ఫోరం కేంద్రం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వాహనాల పార్కింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘అధికార’ యంత్రాంగంలో కొరవడిన చిత్తశుద్ధి, ప్రణాళిక లేమి, పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కొనసాగుతున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఈ–బ్లాక్ నిర్మాణ పనులుజిల్లాకేంద్రంలోని 650 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 165 మంది వైద్యులు ఉన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయినా.. ఆయా జిల్లాల నుంచి ఎక్కువ శాతం మంది రోగులు మహబూబ్నగర్లోని జీజీహెచ్కే వస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ ఉంటోంది. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జీజీహెచ్పై భారం తగ్గనుండగా.. వైద్యుల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు పేదరోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందనున్నాయి. వినియోగదారుల కేంద్రంపై వీడని అనిశ్చితే కారణం స్పందిస్తే త్వరలో అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈవీఎంల గోదాం తరలింపుతో చురుగ్గా సాగుతున్న ఈ–బ్లాక్ పనులు అత్యాధునిక వైద్యం కోసం నాలుగేళ్లుగా పేద రోగుల ఎదురుచూపులు ఈవీఎంల అడ్డంకి తొలగినా.. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలంలో ఉన్న వినియోగదారుల ఫోరం కేంద్రంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీన్ని న్యూటౌన్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరి కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలను సైతం పరిశీలించారు. కానీ.. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం.. వినియోగదారుల ఫోరం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతుండడంతో ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైన్ల ఏర్పాటు పూర్తయినా.. వాహనాల పార్కింగ్ పనులు ప్రారంభం కాలేదు. దీన్ని తరలిస్తే ఒక వైపు ఈ బ్లాక్.. మరోవైపు చివరి దశలో ఉన్న వైద్య పరికరాల బిగింపుతో పాటు వాహనాల పార్కింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తేనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు పేద రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఆస్పత్రిని పలు పర్యాయాలు పరిశీలించారు. ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రిని సందర్శించిన క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ లోపు పనుల పూర్తి గగనమేనని తెలుస్తోంది. -
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
జీడిపల్లిలో వర్షానికి తడిసిన ధాన్యం కల్వకుర్తి రూరల్: మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జీడిపల్లి గ్రామంలోని రైస్మిల్లు ఆవరణలో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. మొత్తం 8మంది రైతులు దాదాపు 200 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబోయగా.. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతులు ధాన్యాన్ని కుప్పగా పోసి కవర్లు కప్పే సమయం కూడా లేకపోయింది. మిల్లు రేకుల నుంచి ధారాళంగా వచ్చిన నీళ్లతో పాటు వర్షపునీటిలో దాదాపు 100 క్వింటాళ్ల ధాన్యం తడిసిందని రైతులు వాపోయారు. -
కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో మరింత విస్త్రృతంగా..
కొల్లాపూర్ మండలంలోని కృష్ణాతీరంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది కార్మికులు ఉన్నారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న కాటన్, రైస్ మిల్లుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పెద్ద ఎత్తున గంజాయి సులువుగా ఇక్కడికి చేరుతోంది. కొల్లాపూర్లో గంజాయి వినియోగించే యువకులు చైన్ నెట్వర్క్గా ఏర్పడి మరీ దందా సాగించడం గమనార్హం. కొల్లాపూర్ పట్టణానికే చెందిన యువకులు సుమారు 30 మంది వరకు గంజాయి వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. -
రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
కందనూలు: నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘రాజీవ్ యువవికాసం’పై నిర్లక్ష్యం తగదు నాగర్కర్నూల్ రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్, మధు అన్నారు. ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకం ద్వారా యువతకు రాయితీపై రుణాలు అందిస్తామని చెప్పి.. కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 2న రాజీవ వికాసం లబ్ధిదారులను ప్రకంటించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో మండలకేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్మయ్య, సహాయ కార్యదర్శి బాలునాయక్, భీముడు, మహేశ్, శివరాం ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి చారకొండ: హిందూ ధర్మ విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరముందని ఆధ్యాత్మికవేత్త రాధామోహన్దాస్ స్వామిజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం చారకొండలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయనతో పాటు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. హిందువులంతా సంఘటితమై హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ధర్మాన్ని కాపాడే పౌరులుగా కంకణబద్దులు కావాలన్నారు. అనంతరం నిర్వహించిన కళాదార్మిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హిందూ సమ్మేళనం మండల ఇన్చార్జి రవిచారి, గిరిజనమోర్చా జిల్లా అధ్యక్షుడు రవి నాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు చలమోని కృష్ణ, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, లక్ష్మణ్ శర్మ, ప్రశాంత్ శర్మ, వేణుగోపాల్ శర్మ పాల్గొన్నారు. 28,681 బస్తాల ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ఆదివారం 28,681 బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో 25,481 బస్తాల ఆర్ఎన్ఆర్ రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,853, కనిష్టంగా రూ.2,773 ధర లభించింది. 3 వేల బస్తాల 1010 రకం రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,860, కనిష్టంగా రూ.1,741 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. నేటి నుంచి డీఎడ్ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఏసీజీఈ గణేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో ప్రత్యేకంగా తయారుచేసిన పచ్చిపులుసు అన్నంతో మైసమ్మకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. భక్తులకు సరిపడా షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంచినీటి కోసం అవస్థలు.. నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో మంచినీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు మినీ వాటర్ట్యాంకుపైకి ఎక్కి మరీ నీటిని తెచ్చుకున్నారు. జాతర మైదానంలో ఓవర్హెడ్ వాటర్ట్యాంకు నిరుపయోగంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. భక్తులకు నీటి సమస్య లేకుండా చూడాలని పలువురు కోరారు. -
జూరాల పూడి‘నది’
● 2.30 టీఎంసీల మేర పేరుకుపోయిన బురద ● పలుమార్లు సర్వేలు.. రూ.312.77 కోట్ల అంచనా వ్యయం ● నివేదిక అందజేసిన సాగునీటి పారుదల శాఖ ● అంతర్గత చర్చలో అసాధ్యమనే అధికారుల అభిప్రాయం గద్వాల: కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్సాగర్తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూరాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపోయింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్లో సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్కలు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. 1,045 అడుగులు.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది. 2012 నాటికే.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు, ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరిపడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు.. జూరాల జలాశయంలో సుమారు 2 టీఎంసీలకుపైగా పేరుకుపోయిన బురదను ప్రభుత్వమే సొంతంగా తీయాలంటే పదేళ్లలో సుమారు రూ.70 వేల కోట్లు వ్యయం అవుతున్నట్లు సర్వే చేసిన ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో బురదను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం వైపు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించిన అనంతరం వచ్చే ఇసుక క్వాంటిటీని సైతం లెక్కకట్టారు. 2 టీఎంసీల బురదను తొలగిస్తే జలాశయంలో మొత్తంగా 7.4 శాతం (సుమారు 76 లక్షల క్యూబిక్ మీటర్ల) ఇసుక అందుబాటులోకి వస్తుందని అధికారులు లెక్కతేల్చారు. ఇది కూడా పదేళ్ల కాలపరిమితితో తొలగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జలాశయంలో లభ్యమైన ఇసుకను విక్రయించగా వచ్చే డబ్బుల్లో ప్రభుత్వానికి రూ.312 కోట్లు చెల్లించాలని అధికారులు నివేదిక రూపొందించి.. మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – జుబేర్, జూరాల డ్యాం ఈఈ సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమారు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్లో ఈఎన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు, ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరిపడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు.


