Nagarkurnool
-
ఏటీఎంపై చోరీల నిఘా..! 8 నిమిషాల్లో పని పూర్తి..!!
మహబూబ్నగర్: ‘కొన్నిరోజుల నుంచి రెక్కీ నిర్వహించారు.. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేదు.. తెల్లవారుజామున సరైన పెట్రోలింగ్ ఉండటం లేద’ని గుర్తించి.. ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు పథకం రచించి.. పక్కాగా అమలు చేసి సఫలమయ్యారు. ఏటీఎం మిషన్కే ఎత్తుకెళ్లడం పాలమూరులో తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెలంగాణ చౌరస్తాలో ఎస్బీఐ ఏటీఎంను మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రాబరీ చేశారు. మొదట ఒక వ్యక్తి పరిసర ప్రాంతాలు పరిశీలించడానికి అక్కడికి చేరుకొని.. చుట్టు పక్కలతోపాటు రోడ్డు మార్గాన్ని పూర్తిగా గమనించిన తర్వాత మరో ఇద్దరికి సమాచారం ఇచ్చాడు.బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు పక్క సందు రోడ్డులో నుంచి అక్కడికి చేరుకున్నారు. క్షణాల్లో వాహనం రివర్స్ చేసి ఏటీఎం దగ్గరకు పెట్టి ఆ తర్వాత గ్యాస్ కట్టర్తో మొత్తం కట్ చేసి.. వంద కేజీల బరువు కలిగిన ఏటీఎం మిషన్ను పట్టా సహాయంతో వాహనం లోపలికి ఎక్కించారు. అక్కడి నుంచి వేగంగా బోయపల్లి గేట్ మీదుగా టంకర గ్రామ శివారులో వ్యవసాయ పొలంలోకి చేరుకున్నారు. అక్కడ వాహనంలో నుంచి మిషన్ కిందకు దించి కట్టర్తో మిషన్ను కట్ చేసి లోపల ఉన్న రూ.2,37,500 నగదు ఎత్తుకెళ్లారు.ఘటనా స్థలాన్ని ఎస్పీ జానకి, ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. దొంగల ముఠా గాలింపు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఏటీఎం రాబరీ కేసులో టూటౌన్ పోలీస్ స్టేషన్లో 331–క్లాజ్ 4, 305 బీఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు.షాద్నగర్లో విఫలయత్నం..మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో ఎస్బీఐ ఏటీఎం దొంగతనం చేసిన ముఠానే ఈ నెల 23న షాద్నగర్లో ఒక ఏటీఎంలో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. దీంతోపాటు ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో ఒక ఏటీఎం దోచేశారు. అదే తరహాలో మహబూబ్నగర్లో చేసి విజయవంతం అయ్యారు.చివరగా ఐదేళ్ల కిందట..2019లో వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో బిస్లారి గేట్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. అప్పట్లో రూ.6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఏటీఎంల దగ్గర రాత్రివేళలలో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో దొంగతనాలు చేయడానికి సులువుగా ఉంటుంది. నగరంలో ప్రధాన బ్యాంకులకు సంబంధించి దాదాపు 50 వరకు ఏటీఎంలు ఉంటాయి. ఏ ఒక్క దగ్గర కూడా సెక్యూరిటీ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.8 నిమిషాల్లో పూర్తి..ఎస్బీఐ ఏటీఎం దొంగతనం చేయడానికి వచ్చిన ఈ ముఠా కేవలం 8 నిమిషాల్లో పని చేసుకొని అక్కడి నుంచి పరార్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గంలో వాహనదారులు కూడా గుర్తించలేకపోయారు. ఏటీఎం దొంగతనం చేసిన దృశ్యాలు మొత్తం ఎదురుగా ఉన్న గురురాఘవేంద్ర సూపర్ మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు పుటేజీని పరిశీలించారు. అలాగే తెలంగాణ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, సింధు హోటల్ ఏరియాలో ఉన్న లాడ్జిలలో దొంగలు బస చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. -
బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యం
కొల్లాపూర్: బహుజన రాజ్యాధికార సాధనే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్లో ఆయన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కొన్ని రోజులుగా మహిళలపై జ రుగుతున్న వేధింపులు, దాడులు, అత్యాచార ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ ఆగడాల ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నా రు. మహిళల గౌరవాన్ని కాపాడేలా, వారికి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బహుజనుల రాజకీయ సాధికారత, సామాజిక న్యా యం, సమానత్వం కోసం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కొల్లాపూర్తో పాటు ఉమ్మడి పాలమూరులో పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామకృష్ణ, యేసేపు, బండి పృథ్వీరాజు, మిద్దె మహేశ్, కళ్యాణ్, బోనాసి రాంచందర్, మునిస్వామి, విష్ణు, బాలకృష్ణ పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం
వాతావరణం ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నా.. ఉక్కపోత పెరుగుతోంది. సాయంత్రం చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కందనూలు/కొల్లాపూర్/కోడేరు: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అను బంధ పనులు, పంప్హౌజ్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహించం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రాజెక్టు పనుల పరిశీలన.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–1, 2, 3 పనులతో పాటు కోడేరు మండలంలోని తీగలపల్లిలో కొనసాగుతున్న పంపుహౌజ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ తూము, హెడ్ రెగ్యులేటరీలను పరిశీలించారు. తీగలపల్లిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వారి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, ఎస్సీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఆర్డీఓ బన్సీలాల్, ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ఈఈ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. కబడ్డీ.. కబడ్డీ జిల్లా కబడ్డీ జట్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో విజేతలుగా నిలిచేందుకు కబడ్డీ అసోసియేషన్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. –8లో uఒక పంపు నుంచి నీటిని వదిలి పూర్తయిందనిపించారు.. పాలమూరు ప్రాజెక్టులో నాలుగు మోటార్లు మాత్రమే ఏర్పాటుచేశారని.. మరో ఐదు మోటార్ల ఏర్పాటు పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని మంత్రి జూపల్లి అన్నారు. ఇక ఉదండాపూర్ వరకు ప్రధాన కాల్వ పనులే పూర్తి కాలేదన్నారు. కానీ బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాలమూరు ప్రాజెక్టు పనులను 90శాతం పూర్తిచేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పంపు నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని వదిలి, మొత్తం ప్రాజెక్టు అయిపోయినట్లు చెబుతున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 80కోట్లు ఖర్చవుతుందని చెప్పిన గత ప్రభుత్వం.. రూ. 38వేల కోట్లు మంజూరుచేసి, రూ. 23వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. త్వరలోనే ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తిచేసి 12లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అదే విధంగా కేఎల్ఐ మోటార్లకు మరమ్మతులు పూర్తిచేస్తామన్నారు. వారం రోజుల్లో భూసేకరణ పనులను పూర్తిచేయాలి త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రాజోళి/గట్టు: లంచం తీసుకుంటూ ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడిన ఘటన వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకలకు చెందిన ఓ రైతు తనకున్న 4.14 ఎకరాల భూమిని సర్వే చేయాలని సర్వేయర్ బ్రహ్మయ్యను సంప్రదించారు. ఇందుకు గాను సర్వేయర్ ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. విసిగిపోయిన రైతు మహబూబ్నగర్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం శాంతినగర్ తహసీల్దార్ కార్యాలయంలో సదరు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు గట్టులోని సర్వేయర్ బ్రహ్మయ్య ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు నేరుగా గట్టులోని బ్రహ్మ య్య ఇంటికి చేరుకుని తనిఖీలు చేశారు. -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మహిళాశక్తి సూపర్ బజార్లు, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, పెట్రో ల్ బంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో రూ.14 కోట్ల వడ్డిలేని రుణాలు అందించామని వివరించారు. అదే విధంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెల్దండ మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్కుమార్, బాలజీ సింగ్, ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, కమిషనర్ మహమూద్, తహసీల్దార్ ఉమ, షాన్వాజ్ఖాన్, విజయ్కుమార్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, పూల్సింగ్, వెంకటయ్యగౌడ్, హరికిషన్ పాల్గొన్నారు. -
బాల్యవివాహాలను నిర్మూలిద్దాం
అచ్చపేట(బల్మూర్): బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అమ్మా యిలకు 18ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయా లని సూచించారు. ఎవరైనా బాల్యవివాహాన్ని ప్రో త్సహించినా, జరిపించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సామాజిక దురాచారంతో బాలలు తమ హక్కులను కోల్పోవడమే కాకుండా.. వారి భవిష్యత్, ఆరోగ్యం దెబ్బతింటాయన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సామాజిక బాధ్యతగా డయల్ 1098 లేదా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనలో అంగన్వాడీ టీచర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. అదే విధంగా గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీడీపీఓ దమయంతి, ఎంపీడీఓ రాఘవులు, పోష ణ అభియాన్ కో–ఆర్డినేటర్ పార్వతి, చైల్డ్ హెల్ప్లైన్ అధికారి యశ్వంత్, మల్లేష్, కో–ఆర్డినేటర్ వెంకటమ్మ, సూపర్వైజర్ సునీత పాల్గొన్నారు. -
పోలీసు ప్రజావాణికి 11 ఫిర్యాదులు
కందనూలు: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భూమికి సంబంధించినవి 3, భార్యభర్తల గొడవపై 2, తగున్యాయం చేయాలని 6 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. -
రైతులకు అండగా ఉంటాం
● మిల్లులకు ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహించొద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్ రూరల్: ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి జిల్లాకేంద్రంలోని సత్యసాయి రైస్మిల్లుతో పాటు చందుబట్ల వెంకటేశ్వర్లు ఆగ్రో ఇండస్ట్రీస్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల వద్ద వరిధాన్యం వాహనాలు భారీగా నిలిచిపోవడాన్ని గమనించిన మంత్రి.. మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో అన్లోడ్ చేయకుండా ఆలస్యం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోతుండగా.. రైస్మిల్లుల వద్ద సమన్వయం లేక సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే గోదాంల వద్ద పోలీ సు నిఘా ఏర్పాటుచేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు ఉన్నారు. -
గాలివాన బీభత్సం
● హైదరాబాద్–శ్రీశైలం రహదారిపై విరిగిపడిన చెట్లు ● వాహనాల రాకపోకలకు అంతరాయం కల్వకుర్తి: జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వెల్దండ పోలీస్స్టేషన్ సమీపంలో హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు శ్రమించి రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను గ్రామస్తులు తొలగించారు. అదే విధంగా వెల్దండ బస్టాండ్లో చెట్లు విరిగిపడ్డాయి. 13వ వార్డులో విద్యుత్ స్తంభం విరిగి ఓ ఇంటిపై పడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. బీసీ వసతిగృహంలోని భారీ వృక్షాలు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో తెగిపోయాయి. సింగల్విండో కార్యాలయానికి మొక్కజొన్నల లోడ్తో వచ్చిన ట్రాక్టర్లపై చెట్టు విరిగిపడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 100 బస్తాల మొక్కజొన్న తడిసిపోయింది. చెర్కూర్లోనూ విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వెల్దండ శివారులో 33కేవీ లైన్ స్తంభాలు విరిగిపోవడంతో బొల్లంపల్లి, భైరాపూర్ సబ్స్టేషన్లకు సరఫరా నిలిచిపోయింది. కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలో మల్లేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న వేప చెట్టు, విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడటంతో అక్కడ నిలిపి ఉంచిన రెండు ట్రాక్టర్లు దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెట్టు తొలగింపు పనులు చేపట్టారు. -
ఆ ఒక్కటే అడ్డంకి..
‘సూపర్’ సేవలకు ‘ఫోరం’ విఘాతం 2016లో అడుగులు.. 2023లో పనులు.. మహబూబ్నగర్లోని ఎదిరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆర్టీసీ బస్స్టాండ్ ఎదుట ఉన్న పాత కలెక్టరేట్ స్థానంలో 1,000 పడకల సామర్థ్యంతో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2016లో మొత్తం రూ.450 కోట్లతో గత బీఆర్ఎస్ హయాంలో అడుగులు పడ్డాయి. ఇందులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.270 కోట్లు కేటాయించారు. 2022 డిసెంబర్లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత కలెక్టరేట్లోని సామగ్రిని కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలోకి మార్చేందుకు రెండున్నర నెలల సమయం పట్టింది. 2023లో ఆస్పత్రి భవన నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. 4 బ్లాక్లు పూర్తి.. ఈ–బ్లాక్ పనులు షురూ.. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాక్లుగా విభజించి బీఆర్ఎస్ హయాంలోనే నిర్మాణం ప్రారంభించారు. తొలి నాలుగు బ్లాక్ల (ఏ, బీ, సీ, డీ) నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఈ–బ్లాక్ నిర్మించాల్సిన స్థలంలో ఈవీఎంల గోదాం ఉండగా.. ఈ అంశం కోర్టులో పెండింగ్లో పడింది. మూడు నెలల కిత్రం కోర్టు ఆదేశాలతో ఈవీఎంలను కొత్త కలెక్టరేట్కు తరలించడంతో సమస్య పరిష్కారం కాగా.. ఈ–బ్లాక్ పనులు ప్రారంభమయ్యాయి. చివరి దశలో పరికరాల బిగింపు.. మహబూబ్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి తరహాలో అధునాతన హాస్పిటల్ థియేటర్లు(ఎంఓటీ) ఐదు, ఆక్సిజన్ పైప్లైన్ వర్క్స్, ఫైర్ ఫైటింగ్ ట్యాంక్లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, పవర్, పవర్ బ్యాక్ అప్ సిస్టం, నాలుగు బ్లాక్లలో డొమెస్టిక్ పంప్లు, అంబులెన్స్ గ్యారేజీతో పాటు మెడికల్ గ్యాస్ పైప్లైన్లు, భారీ సామర్థ్యం గల రెండు వాటర్ ట్యాంక్లు, తొమ్మిది లిఫ్ట్లు, తొమ్మిది కౌంటర్లు, కేథల్యాబ్స్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్కు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీ పనులు సైతం పూర్తయ్యాయి. అదేవిధంగా గుండె, మూత్రపిండాలు, కంటి, న్యూరో, ఆర్థో, ఈఎన్టీ వంటి మొత్తం 35 వైద్య విభాగాలకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల వ్యయంతో అధునాతన వైద్యసేవలందించేలా వైద్య పరికరాలు అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ–బ్లాక్ అయితేనే వైద్య పరికరాల బిగింపు.. ఈవీఎంల సమస్య తీరడంతో ఆలస్యంగా ప్రారంభించిన ఈ–బ్లాక్లో మొత్తం ఐదు స్లాబ్లు నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండు అంతస్తుల స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయింది. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే అధునాతన వైద్య పరికరాలను అన్ని బ్లాక్లలో అమర్చనున్నారు. ఆక్సిజన్, ఫైర్ ఫైటింగ్ వంటివి అనుసంధానంగా ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆయా పనులను ఒకేసారి చేయాల్సి వస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరులో పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందించాలనే లక్ష్యంతో మహబూబ్నగర్లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఈవీఎంల గోడౌన్ సమస్య పరిష్కారమై పనులు తుది దశకు చేరుకున్నా.. వినియోగదారుల ఫోరం కేంద్రం తరలింపుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వాహనాల పార్కింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు. ఫలితంగా వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత కాలం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘అధికార’ యంత్రాంగంలో కొరవడిన చిత్తశుద్ధి, ప్రణాళిక లేమి, పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కొనసాగుతున్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఈ–బ్లాక్ నిర్మాణ పనులుజిల్లాకేంద్రంలోని 650 పడకల సామర్థ్యం గల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 165 మంది వైద్యులు ఉన్నారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు ఉన్నాయి. అయినా.. ఆయా జిల్లాల నుంచి ఎక్కువ శాతం మంది రోగులు మహబూబ్నగర్లోని జీజీహెచ్కే వస్తున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సగటున 1,800 నుంచి 2,000 వరకు ఓపీ ఉంటోంది. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జీజీహెచ్పై భారం తగ్గనుండగా.. వైద్యుల సంఖ్య రెట్టింపు కావడంతో పాటు పేదరోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందనున్నాయి. వినియోగదారుల కేంద్రంపై వీడని అనిశ్చితే కారణం స్పందిస్తే త్వరలో అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఈవీఎంల గోదాం తరలింపుతో చురుగ్గా సాగుతున్న ఈ–బ్లాక్ పనులు అత్యాధునిక వైద్యం కోసం నాలుగేళ్లుగా పేద రోగుల ఎదురుచూపులు ఈవీఎంల అడ్డంకి తొలగినా.. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలంలో ఉన్న వినియోగదారుల ఫోరం కేంద్రంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీన్ని న్యూటౌన్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి మార్చాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరి కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాలను సైతం పరిశీలించారు. కానీ.. ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం.. వినియోగదారుల ఫోరం కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతుండడంతో ఇంటర్నల్ రోడ్లు, స్ట్రీట్ లైన్ల ఏర్పాటు పూర్తయినా.. వాహనాల పార్కింగ్ పనులు ప్రారంభం కాలేదు. దీన్ని తరలిస్తే ఒక వైపు ఈ బ్లాక్.. మరోవైపు చివరి దశలో ఉన్న వైద్య పరికరాల బిగింపుతో పాటు వాహనాల పార్కింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తేనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు పేద రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఆస్పత్రిని పలు పర్యాయాలు పరిశీలించారు. ఈ నెల మొదటి వారంలో ఆస్పత్రిని సందర్శించిన క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ లోపు పనుల పూర్తి గగనమేనని తెలుస్తోంది. -
అకాల వర్షం.. రైతన్నకు నష్టం
జీడిపల్లిలో వర్షానికి తడిసిన ధాన్యం కల్వకుర్తి రూరల్: మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జీడిపల్లి గ్రామంలోని రైస్మిల్లు ఆవరణలో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. మొత్తం 8మంది రైతులు దాదాపు 200 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబోయగా.. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి రైతులు ధాన్యాన్ని కుప్పగా పోసి కవర్లు కప్పే సమయం కూడా లేకపోయింది. మిల్లు రేకుల నుంచి ధారాళంగా వచ్చిన నీళ్లతో పాటు వర్షపునీటిలో దాదాపు 100 క్వింటాళ్ల ధాన్యం తడిసిందని రైతులు వాపోయారు. -
బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కల్వకుర్తి రూరల్: క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తాయని.. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా.. 150మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ విభాగాల్లో బాలబాలికలకు రన్నింగ్, షాట్ఫుట్ తదితర పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11, 12 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించే 12వ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు బిక్షపతి యాదవ్, బాలు నాయక్, ప్రసాద్, బాలయ్య, భీమయ్య, జాఫర్, ఝాన్సీ, నిరంజనమ్మ, శోభ పాల్గొన్నారు. -
కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో మరింత విస్త్రృతంగా..
కొల్లాపూర్ మండలంలోని కృష్ణాతీరంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది కార్మికులు ఉన్నారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న కాటన్, రైస్ మిల్లుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పెద్ద ఎత్తున గంజాయి సులువుగా ఇక్కడికి చేరుతోంది. కొల్లాపూర్లో గంజాయి వినియోగించే యువకులు చైన్ నెట్వర్క్గా ఏర్పడి మరీ దందా సాగించడం గమనార్హం. కొల్లాపూర్ పట్టణానికే చెందిన యువకులు సుమారు 30 మంది వరకు గంజాయి వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. -
రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
కందనూలు: నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘రాజీవ్ యువవికాసం’పై నిర్లక్ష్యం తగదు నాగర్కర్నూల్ రూరల్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివశంకర్, మధు అన్నారు. ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకం ద్వారా యువతకు రాయితీపై రుణాలు అందిస్తామని చెప్పి.. కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిరుద్యోగ యువతను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 2న రాజీవ వికాసం లబ్ధిదారులను ప్రకంటించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అందులో భాగంగా ఈ నెల 27, 28 తేదీల్లో మండలకేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్మయ్య, సహాయ కార్యదర్శి బాలునాయక్, భీముడు, మహేశ్, శివరాం ఉన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి చారకొండ: హిందూ ధర్మ విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరముందని ఆధ్యాత్మికవేత్త రాధామోహన్దాస్ స్వామిజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం చారకొండలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ఆయనతో పాటు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. హిందువులంతా సంఘటితమై హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ధర్మాన్ని కాపాడే పౌరులుగా కంకణబద్దులు కావాలన్నారు. అనంతరం నిర్వహించిన కళాదార్మిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. హిందూ సమ్మేళనం మండల ఇన్చార్జి రవిచారి, గిరిజనమోర్చా జిల్లా అధ్యక్షుడు రవి నాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు చలమోని కృష్ణ, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, లక్ష్మణ్ శర్మ, ప్రశాంత్ శర్మ, వేణుగోపాల్ శర్మ పాల్గొన్నారు. 28,681 బస్తాల ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ఆదివారం 28,681 బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో 25,481 బస్తాల ఆర్ఎన్ఆర్ రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,853, కనిష్టంగా రూ.2,773 ధర లభించింది. 3 వేల బస్తాల 1010 రకం రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,860, కనిష్టంగా రూ.1,741 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. నేటి నుంచి డీఎడ్ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఏసీజీఈ గణేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జాతర మైదానంలో ప్రత్యేకంగా తయారుచేసిన పచ్చిపులుసు అన్నంతో మైసమ్మకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నాగర్కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. భక్తులకు సరిపడా షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంచినీటి కోసం అవస్థలు.. నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో మంచినీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు మినీ వాటర్ట్యాంకుపైకి ఎక్కి మరీ నీటిని తెచ్చుకున్నారు. జాతర మైదానంలో ఓవర్హెడ్ వాటర్ట్యాంకు నిరుపయోగంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. భక్తులకు నీటి సమస్య లేకుండా చూడాలని పలువురు కోరారు. -
జూరాల పూడి‘నది’
● 2.30 టీఎంసీల మేర పేరుకుపోయిన బురద ● పలుమార్లు సర్వేలు.. రూ.312.77 కోట్ల అంచనా వ్యయం ● నివేదిక అందజేసిన సాగునీటి పారుదల శాఖ ● అంతర్గత చర్చలో అసాధ్యమనే అధికారుల అభిప్రాయం గద్వాల: కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్సాగర్తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూరాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపోయింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్లో సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్కలు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. 1,045 అడుగులు.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది. 2012 నాటికే.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు, ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరిపడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు.. జూరాల జలాశయంలో సుమారు 2 టీఎంసీలకుపైగా పేరుకుపోయిన బురదను ప్రభుత్వమే సొంతంగా తీయాలంటే పదేళ్లలో సుమారు రూ.70 వేల కోట్లు వ్యయం అవుతున్నట్లు సర్వే చేసిన ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో బురదను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం వైపు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించిన అనంతరం వచ్చే ఇసుక క్వాంటిటీని సైతం లెక్కకట్టారు. 2 టీఎంసీల బురదను తొలగిస్తే జలాశయంలో మొత్తంగా 7.4 శాతం (సుమారు 76 లక్షల క్యూబిక్ మీటర్ల) ఇసుక అందుబాటులోకి వస్తుందని అధికారులు లెక్కతేల్చారు. ఇది కూడా పదేళ్ల కాలపరిమితితో తొలగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జలాశయంలో లభ్యమైన ఇసుకను విక్రయించగా వచ్చే డబ్బుల్లో ప్రభుత్వానికి రూ.312 కోట్లు చెల్లించాలని అధికారులు నివేదిక రూపొందించి.. మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – జుబేర్, జూరాల డ్యాం ఈఈ సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమారు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్లో ఈఎన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు, ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరిపడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఆదివారం ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పంట అవశేషాలను పొలాల్లో కాల్చకుండా అవగాహన కల్పించాలన్నారు. ఈనెలాఖరు నాటికి ధాన్యం కొనుగోళ్లు వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వరిధాన్యం సేకరణ కోసం 200 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఎలా ంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు. అకాల వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసినా.. రైతులకు నష్టం కలుగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట
● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. శనివారం అచ్చంపేటలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రూ. 21వేల కోట్లతో రైతులందరి పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు రైతుభరోసాతో పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. భూసార పరీక్షలకు అనుగుణంగా రైతులు లాభసాటి పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ అంచనాలకు మించి పంట దిగుబడులు రావడం.. సరైన నివేదికలు లేని కారణంగా కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రానున్న కాలంలో ప్రతి మండలం నుంచి ఇద్దరు ఆదర్శ రైతులను ఎంపికచేసి.. జిల్లాస్థాయిలో అవార్డులు అందజేస్తామని, వారితో పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. పంటల సాగుకు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో యాసంగిలో వరి, మొక్కజొన్న దిగుబడులు పెరిగాయన్నారు. ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 48లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ. 9,850 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. మాజీ ఎంపీపీ రామనాథం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.గోపాల్రెడ్డి, అంతటి మల్లేష్, బుచ్చిరాములు, రాంబాబు నాయక్, చింతల రాజ్గోపాల్ ఉన్నారు. -
పాలిసెట్లో ఇద్దరికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరికి రాష్ట్ర మొది ర్యాంక్ వచ్చింది. మహబూబ్నగర్లోని షాషాబ్గుట్టకు చెందిన కోట్ల మురళీధర్, శ్రీలతల కుమార్తె కోట్ల అపూర్వ ఎంపీసీ, ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటిర్యాంక్ సాధించింది. అలాగే నాగర్కర్నూల్కు చెందిన వాన్మయ్రెడ్డి సైతం రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించండం విశేషం. ‘రాష్ట్రస్థాయిలో మొదటిర్యాంక్ సాధించడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. తాను డాక్టర్ కావడమే లక్ష్యమని, అందుకోసం కష్టపడి చదువుతాను.’అని అపూర్వ పేర్కొన్నారు. పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మనాన్నల ప్రోత్సాహం, మా పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ ర్యాంకు సాధించాను.పదో తరగతి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సేకరించి ఇంటి వద్దనే ప్రిపరేషన్ కొనసాగించా. భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని నా కోరిక. – వాన్మయ్రెడ్డి, నాగర్కర్నూల్ -
భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి
కందనూలు: సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రాజెక్టుల ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా భూసేకరణ వివరాలను తెలుసుకున్నారు. భూసేకరణలో జరుగుతున్న ఆలస్యానికి గల కారణాలు, రైతుల అభ్యంతరాలు, కోర్టు కేసులు, పరిహారం చెల్లింపుల స్థితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా పనులు వేగవంతం చేయాలన్నారు. ఏ చిన్నపాటి ఆలస్యం జరిగినా మొత్తం ప్రాజెక్టు పనులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రతి మండల స్థాయిలో ప్రత్యేక సమన్వయ బృందాలను ఏర్పాటుచేసి.. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. రైతులతో సానుకూల చర్చల ద్వారా భూసేకరణను వేగవంతం చేయాలని, వారికి చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిని మరింత వేగవంతం చేయడానికి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వారం ప్రాజెక్టుల పురోగతి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈలు పార్థసారథి, సత్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ తదితరులు ఉన్నారు. భూభారతి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ అన్నారు. హైదరాబాద్ నుంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేశ్ కుమార్, రెవెన్యూశాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హనుమంత్ వీసీ నిర్వహించగా.. అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ వాల్యూ అప్డేషన్, భూభారతి ఐజీఆర్ఎస్ పోర్టల్లో ఫామ్ 1, 2, 3, 4లకు సంబంధించిన అప్డేషన్ ప్రక్రియపై సమీక్షించారు. -
వనపర్తి 41.5 26.9
నారాయణపేట 39.8 26.3 ● కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి, మొక్కజొన్న ధాన్యం ● పిడుగుపాటుతో ఓ వ్యక్తితో పాటు మూగజీవాల మృత్యువాత మామిడి మధురం ఉమ్మడి పాలమూరులో మామిడికాయలకు ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్ నియోజకవర్గంలో 50కిపైగా రకాల వైరెటీలు అందుబాటులో ఉండి.. ఇట్టే ఆకర్షిస్తాయి. –8లో uఅకాలం.. ఆగమాగం సాక్షి, నాగర్కర్నూల్/కొల్లాపూర్/అచ్చంపేట రూరల్/బల్మూర్/లింగాల: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం కురిసిన అకాల వర్షం అతలాకుతలం చేసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో కొల్లాపూర్, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డులతో పాటు బల్మూర్ మండలం కొండనాగుల, లింగాల కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. అచ్చంపేట మార్కెట్యార్డులో డోజర్ సహాయంతో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్పలుగా పోశారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో మార్కెట్యార్డులోనే ఉంచారు. అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దకావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మార్కెట్యార్డును తహసీల్దార్ సైదులు పరిశీలించారు. ధాన్యం కాపాడే విషయంలో స్థానిక పోలీసులు రైతులకు సహకరించారు. వర్షంతో పాటు ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగు పాటుకు గురై గొర్రెలకాపరి మల్లయ్య (36) మృతిచెందాడు. పిడుగు ధాటికి అతడి జేబులోని సెల్ఫోన్ సైతం పేలిపోయింది. బల్మూర్లో వంజ సుకుమార్రెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు అంటుకొని దగ్ధమైంది. అచ్చంపేట మండలం బుడ్డతండాకు చెందిన రైతు మోత్యానాయక్ రెండు ఆవులు, బల్మూర్ మండలం రామాజిపల్లిలో రైతు గోరెంట్ల రాజుకు చెందిన ఓ గేదెతో పాటు దూడ పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాయి. తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో రేకుల ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. బిజినేపల్లి మండలం పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కాగా, అచ్చంపేట మండలంలో అత్యధికంగా 7.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగాల మండలంలో 7.5, ఉప్పునుంతలలో 6.3, నాగర్కర్నూల్ 4.0, కల్వకుర్తి, పదర మండలాల్లో 0.5 మి.మీ. వర్షం కురిసింది. -
సద్వినియోగం చేసుకోవాలి..
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ జీఓ 131ని జారీ చేసింది. అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలి. తమ దరఖాస్తు వివరాలతో మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలి. నిబంధనల ప్రకారం ఉన్న ప్లాట్లను విధిగా క్రమబద్ధీకరిస్తాం. తద్వారా యజమానులకు ప్లాట్లపై హక్కు లభించడంతో పాటు మున్సిపాలిటీ నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సులభంగా పొందవచ్చు. – డి.మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
జీల్దార్తిప్పలు తప్పేనా..?
● కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల పక్కనే ఉన్నా అందని సాగునీరు ● నీటి తరలింపునకు రెండుసార్లు శంకుస్థాపన ● ఏళ్లతరబడిగా మొదలుకాని పనులు కృష్ణా నీటికి నోచుకోని మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాల రైతులు కొల్లాపూర్: కృష్ణానది నీటిని జీల్దార్తిప్ప చెరువుకు తరలించే పనులు జరుగుతాయో.. లేదో అనే సందిగ్ధం నెలకొంది. కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు కూతవేటు దూరంలోనే ఉన్న జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానదీ నీటిని తరలించే ప్రక్రియ ఏళ్ల తరబడి ప్రకటనలు, శిలాఫలకాలకే పరిమితమవుతోంది. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం గ్రామాలు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు సమీపంలోనే ఉంటాయి. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు పక్కనే ఉన్నా ఆ గ్రామాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు. ఇందుకోసం నిధులు మంజూ రుచేసి, శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కృష్ణానది నీటిని మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్లతో కృష్ణా బ్యాక్వాటర్పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామ పొలాలకు సాగునీరు మళ్లించాలనే అంశం తెరపైకి వచ్చింది. 2019లో కేఎల్ఐ నుంచి జీల్దార్తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించగా.. అదే సంవత్సరం మార్చిలో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే సాకుతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్లతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి జీల్దార్తిప్పకు వెళ్లే మార్గంలో పెద్దవాగు, ఉడుములు వాగు, చిన్నవాగులు ప్రవహిస్తుంటాయి. వీటిమీదుగా కాల్వల నిర్మాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా కాల్వల కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ఇక్కడి రైతులు పైప్లైన్ ద్వారా నీటిని తరలించాలని కోరుతున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా పైప్లైన్ నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తరలించవచ్చని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో జీల్దార్తిప్ప చెరువు అంశంపై కూడా చర్చించారు. కాల్వల తవ్వకాలకు ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు మంత్రికి వివరించారు. కేఎల్ఐ ప్రాజెక్టులోని డీ–5 కాల్వకు అనుసంధానంగా కాల్వలు తవ్వాలని గతంలో అధికారులు నిర్ణయించారు. డీ–5 కాల్వ పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్లో మునిగిపోతోంది. దీంతో ఇప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్కు అనుసంధానంగానే నీటి తరలింపు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాల్వలు తవ్వేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కాల్వలకు బదులుగా ప్రెజర్మెయిన్స్ ఏర్పాటు చేసి.. పైప్లైన్లతో నీటిని జీల్దార్తిప్ప చెరువుకు తరలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనిపై నివేదిక అందజేసిన అధికారులు తర్వాత ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ–5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో స్లూయిస్ ఏర్పాటు చేశారు. అక్కడే 318 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో పైప్లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములుకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి. – వెంకట్రెడ్డి, గ్రామాభ్యుదయ సేవా సంస్థ నిర్వాహకుడు, ఎల్లూరు -
తపాలశాఖలో కలవరం!
సీబీఐ ఎఫ్ఐఆర్లో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పేరు ● బదిలీ వేటు వేసి పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు ● పూర్తి వివరాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు ● బిల్లుల చెల్లింపులపై సృష్టత కరువు వనపర్తిటౌన్: బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవహారంలో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమన్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న, పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం. – ఎన్.వెంకటేశ్వర్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్, వనపర్తి ●వనపర్తి తపాల ప్రధాన కార్యాలయంలో అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగుల బిల్లుల చెల్లింపుల జాప్యం సీబీఐ వరకు చేరింది. 2023 నుంచి 2026 వరకు బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్సేవక్లు లేని శాఖల్లో ఉన్న సిబ్బంది అదనపు బాధ్యతలు నిర్వర్తించేలా తపాలాశాఖ చర్యలు చేపట్టింది. వీరికి రెగ్యులర్ వేతనంతో పాటు అదనపు విధులకు సంబంధించిన బిల్లులను తపాలాశాఖ చెల్లిస్తుంది. అదనపు విధులు నిర్వర్తించిన సుమారు 192 మంది ఉద్యోగుల బిల్లులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో గతేడాది చివరిలో బిల్లులు చెల్లింపునకుగాను పోస్టల్ సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు దస్త్రం సమర్పించారు. ఇందుకు అనుమతిస్తున్నట్లు ప్రతి దస్త్రం అందజేసిన నాలుగు నెలల తర్వాత నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ దశలోనే అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులు లంచం ఇస్తే ఎలాగైనా బిల్లులు జారీ చేస్తామని పోస్టల్ ఇన్స్పెక్టర్ పట్టుబట్టడంతో ఓ బీపీఎం సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు ఈ నెల 8న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోస్టల్ సూపరింటెండెంట్ పేరు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదు కావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బిల్లుల చెల్లింపుతో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వచ్చే ఉద్యోగులు ఉన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఆమోదం తెలిపారా? లేక తిరస్కరించారా అనేది బయటడటం లేదు. కొందరు అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపు ప్రక్రియ చేపట్టినట్లు చెబుతున్నా అధికారికంగా ధ్రువీకరించేందుకు ఇష్టపడటం లేదు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కందనూలు: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమావేశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. పాలమూరు ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఈ ప్రాంత రైతుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలంటే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలకమని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పనులు నెమ్మదించాయని, తాము దీనిని పూర్తిచేసి తీరుతామని చెప్పారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి సూచనల మేరకు జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న సుమారు 5 వేల ఫైళ్లను రానున్న 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు వారధిగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాభివృద్ధి కోసం కృషిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతాధికారుల పరిశీలనలో..
జీల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించడం జరిగింది. కానీ, కాల్వలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్లైన్ ఏర్పాటు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వారి ఆదేశాల తర్వాతనే పనులు ప్రారంభం అవుతాయి. – అమర్సింగ్, నీటిపారుదల శాఖ డీఈ మా గ్రామాలకు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చాలాసార్లు చెప్పినా పనులు మాత్రం ప్రారంభించడం లేదు. మొదట్లో కాల్వల ద్వారా నీటిని తరలిస్తామని, ఇప్పుడు పైప్లైన్ల ద్వారా అంటున్నారు. త్వరగా పనులు చేపట్టి రైతులకు మేలు చేయాలి. – గోవిందు, రైతు, మొలచింతలపల్లి గ్రామం ● -
చారిత్రక కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత
కొల్లాపూర్ రూరల్: చారిత్రక కట్టడాల పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని సోమశిల గ్రామంలో ఉన్న పురాతన, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి గ్రామ సమీపంలో నుంచి సోమేశ్వరాలయం వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల గ్రామానికి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని, గ్రామంలో పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, మన సంపదను కాపాడుకోవాల్సి బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు లలితా సోమేశ్వరాలయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ మద్దిలేటి, పురాతన శాఖ పర్యవేక్షకుడు కుర్మయ్య, నాయకులు కాటం వెంకటస్వామి, నారాయణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
భానుడి భగభగ
పాలమూరు: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేడి గాలులు అధికంగా వీస్తుండడంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి పాలమూరులో అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లపల్లిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్కర్నూల్ (వెల్దండ)మహబూబ్నగర్ (బాలానగర్) 43.6 గద్వాల (ఉండవెల్లి) 43.3 నారాయణపేట (దామరగిద్ద) గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా.. -
ట్రాక్టర్లతో పడిగాపులు..
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నెల 6న అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లను ప్రారంభించగా.. గోనె సంచులు లేకపోవడంతో 10 రోజుల తర్వాత తూకం వేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,193 మంది రైతుల నుంచి 1,46,025 బస్తాల మొక్కజొన్న కొనుగోలు చేసి.. 65,657 బస్తాలను మాత్రమే తరలించారు. ఇంకా 80,368 బస్తాలు తరలించాల్సి ఉండగా.. మరో 20 వేల బస్తాల మక్కలు తూకం వేయాల్సి ఉంది. ఇప్పటికే మార్కెట్లో ధాన్యం కుప్పులు పేరుకుపోవడంతో.. స్థలం సరిపోక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు సుమారుగా 20 రోజులుగా ట్రాక్టర్లతో మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు. -
మక్తల్ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
● జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కందనూలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఇంటర్ విద్య ఎంతో కీలకం. దీంతో చాలామంది విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ అభ్యసించడానికి పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే కార్పొరేట్ విద్య నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు సహకారం కల్పిస్తోంది. కార్పొరేట్ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి రూ.35 వేలు, పాకెట్ మనీగా రూ.3వేలు చెల్లిస్తుంది. దీని కోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ పరిగణలోకి తీసుకొని 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాలకు ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు జూన్ 5వ తేది వరకు ఉంది. ఇవీ అర్హతలు.. జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీలు, నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు మించకూడదు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ, ధ్రువపత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలను జతపరచాలి. పదో తరగతిలో 400కిపైగా మార్కులు సాధించిన వారిని ప్రవేశాలకు అధికారులు ఎంపిక చేస్తారు. అలాగే మీసేవ కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్లో telanganaepass.cgg.gov.in దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కార్పొరేట్ విద్యా పథకం ద్వారా జిల్లాలోని పేద విద్యార్థులకు అవకాశం కల్పించింది. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఉమాపతి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, నాగర్కర్నూల్ -
ఇసుక రవాణాలో పారదర్శకతకు పెద్దపీట
కందనూలు: ఇసుక తవ్వకాలు, రవాణాలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేస్తున్నామని, నిబంధనల అతిక్రమణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అవకాశం లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త ఆస్పత్రులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర ప్రభుత్వ రంగ నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రజలకు నిరంతరం ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఏ ఇసుక రీచ్ నుంచి సరఫరా చేయాలనే అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘మన ఇసుక– మన వాహనం’ పోర్టల్లో నమోదు చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు. బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి ప్రతి రాజకీయ పార్టీ బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ అన్నారు. ఓటర్ల సవరణ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) షెడ్యూల్ను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరంగా తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక కార్యక్రమాలు, బూత్ల మ్యాపింగ్, బీఎల్ఓలకు శిక్షణ ఇస్తామన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటిి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు, అనంతరం సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వివరించారు. ఇంటింటి సర్వే, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, డబుల్ ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. -
డీసీసీబీలో యూపీఐ సేవలు
● ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సులభంగా లావాదేవీలు ● నగదు రహిత చెల్లింపులకు ముందడుగు మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) డిజిటల్ బ్యాంకింగ్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్ సేవలను వినియోగి స్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్ సేవలు పొందే అవకాశం ఏర్పడింది. 24 గంటల పాటు.. ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. చెల్లింపులపై అవగాహన.. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి డీసీసీబీ రూ.2,500 కోట్ల టర్నోవర్ను అధిగమించడం బ్యాంక్ ప్రగతికి నిదర్శనంగా భావిస్తున్నారు. సహకార రంగంలో విశ్వసనీయ సేవలతోపాటు ఆధునిక సాంకేతిక సేవలను అందిస్తూ డీసీసీబీ ముందుకు సాగుతుండటంపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మన బ్యాంక్తో స్మార్ట్ బ్యాంకింగ్ను ఆస్వాదించండి’ అనే నినాదంతో యూపీఐ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంక్ యాజమాన్యం ఖాతాదారులను కోరుతుంది. -
మక్కతిప్పలు
● మందకొడిగా సాగుతున్న మొక్కజొన్న కొనుగోళ్లు ● లారీలు, హమాలీల కొరతతో తరలింపులో తీవ్రజాప్యం ● కొనుగోలు కేంద్రాల వద్దే రైతుల పడిగాపులు ● అకాల వర్షాల భయంతో అన్నదాతల ఆందోళన –8లో uగత నెల 30న 280 బస్తాల మక్కలను అచ్చంపేట కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాను. ఈ నెల 4న కాంటా పెట్టి వదిలేశారు. ప్రతిరోజు కాపలా ఉంటున్నా తప్ప ఇంత వరకు బస్తాలను తరలించలేదు. ఇంత వరకు ఒక్క పైసా కూడా అకౌంట్లో జమ కాలేదు. – సైదులు, కంసానిపల్లి గ్రామం, ఉప్పునుంతల మండలం మార్కెట్కు తెచ్చిన మక్కలను ఈ నెల 12న కాంటా వేశారు. మక్కలు తరలించే వరకు మమ్మల్నే కాపలా ఉండాలని చెప్పారు. రోజూ రాత్రి, పగలు ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. లారీలు వస్తే తప్ప తరలించే పరిస్థితి లేదు. లారీలు ఎప్పుడొస్తాయో ఎవరూ చెప్పడం లేదు. – చంద్రయ్య, కొత్తరాంనగర్ గ్రామం, ఉప్పునుంతల మండలం కొనుగోలు చేసిన మక్కలను తరలించేందకు లారీలు వస్తలేవు. లారీల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. లారీలు వస్తేనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తాం. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. మార్కెట్లో స్థలం లేకపోవడంతో ఇప్పుడే ధాన్యం తేవొద్దని రైతులకు సూచించాం. – ఎల్లయ్య, సీఈఓ, పీఏసీఎస్, అచ్చంపేట అచ్చంపేట: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రెండు వారాల్లో వానాకాలం ముంచుకు రానుండగా కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న కుప్పలు పేరుకుపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మక్కలను కాంటా చేసేవారు లేక కొన్ని రోజులు.. తూకం వేసిన బస్తాలను ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితిలో కొన్ని రోజులు, వాహనాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు ఇలా నెలల తరబడి కేంద్రాల్లోనే మక్క రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. మక్కలు తెచ్చి నెలరోజులు దాటినా తూకాలు పూర్తి కాకపోవడం, తరలింపు వేగవంతం చేయక ఆందో ళన చెందిన రైతులు పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు పొంచి ఉండటంతో ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. బీహార్, బెంగాల్ హమాలీలకు తోడు స్థానిక హమాలీలు పనిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.50– 60 వరకు చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ కూలీ గిట్టుబాటు అవుతుందని వలస హమాలీలు సైతం కొనుగోలు కేంద్రాలకే మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి లోడ్తో వచ్చిన లారీలను అన్లోడ్ చేయడానికి సరిపోను హమాలీలు లేరు. తూకం వేసి ధాన్యం తరలించడానికి సకాలంలో లారీలు కావడం లేదు. లారీలు రాక రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. కొనుగోలు జరిపిన వెంటనే తరలిస్తామని అధికారులు చెబుతున్నా జాప్యం జరుగుతోంది. దీంతో కొనుగోళ్లలో జాప్యం, అధికంగా డబ్బుల వసూళ్లు, అమ్మిన మొక్కలకు డబ్బులు ఆలస్యంగా చెల్లింపుల వంటి కారణాలతో చాలామంది రైతులు మక్కలను తక్కువ ధరకు రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇంకా చాలా వరకు మొక్కల కొనుగోలు చేపట్టాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొన్నది గోరంత.. కొనాల్సింది కొండంత -
అన్నదాత.. గుండెకోత
తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎండా కాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కేవలం 2,89 లక్షల మెట్రిక్ టన్నులే.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు. లారీకి 30 బస్తాల చొప్పున హాంఫట్.. ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తాలు, బస్తా బరువు పేరిట కిలోన్నర వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల రెండు కిలోల చొప్పున కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 41.150 కిలోగ్రాముల చొప్పున బస్తా ధాన్యం తూకం వేసి.. రైతులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని లారీలు తదితర వాహనాల్లో కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లదే హవా నడుస్తుండగా.. రైతుల నడ్డి విరుస్తున్నారు. సెంటర్లలో తూకం వేసినప్పటికీ.. తూకం తక్కువగా వచ్చిందంటూ బస్తాకు అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల కోత పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లారీకి సుమారు 30 బస్తాల చొప్పున (దాదాపు రూ.29 వేలు) కోత పెడుతూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మిల్లులన్నింటిలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మె.టన్నుల్లో).. క్వింటాల్కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వ్యవహారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు లారీ డ్రైవర్ల పేరు చెబుతూ పొంతనలేని సమాధానాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా నత్తనడకనే క్రయవిక్రయాలు తూతూమంత్రపు పరిశీలనలకే అధికారుల పరిమితం ఈ ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్ షీట్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్లో భీమయ్యయాదవ్తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.. ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించలేదు. తాడూరు మండలకేంద్రంలో ఇంకా ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి. తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. – బాలస్వామి, రైతు, అల్లాపూర్, తాడూరు మండలం తాలు పేరిట 25 క్వింటాళ్లు దోచుకున్నారు.. రాత్రింబవళ్లు కష్టపడితే 514 క్వింటాళ్ల ధాన్యం పండింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లో కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని గాయత్రి మిల్లుకు తీసుకెళ్లాం. అక్కడ మిల్లు నిర్వాహకులు తాలు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. క్వింటాల్కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే అన్లోడ్ చేస్తామని మొండికేశారు. నిబంధనల ప్రకారం క్వింటాల్కు కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వాహన అద్దె భారం మోయలేక.. చేసేదేమీ లేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. దాదాపు 25 క్వింటాళ్ల పైగా ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలైంది. మా ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదు. – రాజు, అజ్జకొల్లు, మదనాపురం, వనపర్తి . కుమ్మక్కుతో దందా.. సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
నిధులు పక్కదారి..!
జిల్లా పంచాయతీరాజ్ శాఖలో అక్రమాలు ● వాహనాల అలవెన్సు పేరుతో నిధులు కాజేస్తున్న వైనం ● మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు సైతం బదిలీ ● ఫోర్జరీ సంతకాలతో నెలల తరబడి సాగుతున్న తతంగం ● ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం ఒత్తిడి చేస్తున్నారు.. గతంలో చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు పొందారు. మళ్లీ ఇటీవల పనులు చేసినట్టు తప్పుడు బిల్లులు పెట్టి సంతకం పెట్టాలని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. పనులు చేపట్టకుండా తప్పుడు బిల్లులకు ఎలా సంతకం చేయాలి? కార్మికుల జీతాలను పక్కదారి పట్టించిన తీరుపై ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. ఇందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – గన్నోజు రామ్మోహన్, ఉపసర్పంచ్, మారేడుమాన్దిన్నె, పెద్దకొత్తపల్లి మండలం సమగ్ర విచారణ చేపడతాం.. జిల్లాలో పంచాయతీల నిధులు, ఖాతాలపై పకడ్బందీగా పర్యవేక్షణ చేపడుతున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తున్నాం. మాకు అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాములు, డీపీఓ గ్రామ పంచాయతీ కార్యాలయంసాక్షి, నాగర్కర్నూల్: జిల్లా పంచాయతీరాజ్ శాఖలో గుట్టుగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీ నిధులను ఆయా గ్రామాల అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించాల్సి ఉండగా.. కొందరు పక్కదారి పట్టిస్తూ, అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఉదాసీనత వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు అక్రమాలపై ఫిర్యాదులు అందుతున్నా స్పందించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. కార్మికుల జీతాలనూ వదలని వైనం.. జిల్లాలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల కక్కుర్తికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలో వారు సఫాయి కార్మికుల జీతభత్యాలను సైతం కాజేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్దిన్నెలో సఫాయి కార్మికుల జీతాలు ఇవ్వకుండా.. ప్రైవేటు ఖాతాకు మళ్లించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కార్మికుల సంతకాలను ఫోర్జరీ చేసి, 2024 ఏప్రిల్ 20న రూ. 5వేలు, ఆగస్టు 19న రూ. 66వేలు, 2025 జూలై 11న రూ. 85,500 చొప్పున పంచాయతీ నిధులు ఓ ప్రైవేటు ఖాతాలోకి మళ్లించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, సొమ్ము రికవరీ చేయాలని బాధితులు కలెక్టరేట్ను ఆశ్రయించారు. సొంత ఖాతాల్లోకి.. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నర్సరీలు, వైకుంఠధామాలు, వనమహోత్సవం, పల్లెప్రగతి తదితర పనుల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను ప్రభుత్వం మండల పంచాయతీ అధికారులకు అప్పగించింది. ఇందుకోసం వినియోగించే వాహనాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో.. ఆయా జీపీల నిధుల నుంచి నెలకు రూ. 20వేల చొప్పున వాహన అలవెన్సు తీసుకునే వెసులుబాటును గతంలో కల్పించింది. అయితే కేవలం ఆరు నెలలపాటే కొనసాగించిన ఈ వెసులుబాటును ఆ తర్వాత రద్దు చేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల కళ్లుగప్పి మరో ఏడాదిపాటు వాహనాల అలవెన్సు పేరుతో ఆయా గ్రామాల నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. జీపీ నిధుల నుంచి ఆయా గ్రామాల మల్టీపర్పస్ వర్కర్ల ఖాతాల్లోకి జీతాలను బదిలీ చేయాల్సి ఉండగా.. వారితో పాటు అదనంగా మండలస్థాయి పంచాయతీ అధికారి తన వ్యక్తిగత ఖాతాలోకి జీతాలను మళ్లించడం ఈ శాఖలో కొనసాగుతున్న అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. -
పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు
కందనూలు: జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు కోర్ ప్రాంత గ్రామాల పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం డీఎఫ్ఓ రేవంత్చంద్రతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ పరిధిలో ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రహదారులు, తాగునీటి వసతి, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవలు, పరిశుభ్రత వంటి సదుపాయాలు సమగ్రంగా అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయించడంతో పాటు, పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. రాబోయే 30 రోజుల్లోగా లబ్ధిదారుల పేర్లపై భూ పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ● ఉపాధి హామీ పనులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేంమత కేశవ్ పాటిల్ అన్నారు. ఉపాధి హామీ పథకం, చేయూత పథకం అమలుపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, కమిషనర్ దివ్య రంగరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్, దేవసహాయంతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు సమర్థవంతంగా, క్రమబద్ధంగా కొనసాగుతున్నాయన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు రోజూ ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. వీసీలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 30 రోజుల్లోగా లబ్ధిదారుల పేర్లపై భూ పట్టాల పంపిణీ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ -
ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి కృషి
మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అమ్రాబాద్ మండలం మల్లాపూర్ చెంచుపెంటలో చెంచులకు తేనెటీగల పెంపకానికి అవసరమైన బాక్స్లను అందజేశారు. అనంతరం మన్ననూర్ లింగమయ్య కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆదివాసీ చెంచులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో సొంతిల్లు లేని ప్రతి చెంచు గిరిజన కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో 1,060 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నిరుపేదలైన చెంచులు ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేని కారణంగా ప్రభుత్వమే ఓ సంస్థకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత అప్పగించిందని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మంజుల రాజారాం, కోటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, సింగిల్విండో చైర్మన్ పోశం గణేశ్, ఉపసర్పంచ్ రమణగౌడ్, నాయకులు వెంకటయ్య, హరినారాయణ, బాలింగంగౌడ్, వెంకటరమణ, శ్రీనివాసులు, రవి, వెంకటేశ్వర్లు, సంతోష్, సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, బయ్యన్న, బాలు పాల్గొన్నారు. -
నిప్పుల కుంపటి
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది. జోగుళాంబ గద్వాలలో అత్యధికం.. ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ము ప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వే యకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకో వాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు బయటకు వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు -
సాగునీరు పారేలా...!
అమరచింత: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వల్లో నీటిసరఫరా నిలిచిపోవడంతో రోజు ఉపాధి కూలీలతో పూడికతీతతో పాటు ముళ్లపొదల తొలగింపు పనులు కొనసాగుతోంది. యాసంగిలో ప్రధాన ఎడమకాల్వ ద్వారా కేవలం రామన్పాడు రిజర్వాయర్ వరకు 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడంతో మిగిలిన ఆయకట్టు కాల్వలు నీటి ప్రవాహం లేక ఎండుముఖం పట్టాయి. ఈసారి వేసవిలో కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన పీజేపీ అధికారులు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాల్లోని నీటిపారుదలశాఖ ఏఈలు ఎంపీడీఓలను సంప్రదించి కాల్వల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరడంతో సమీప గ్రామాల కూలీలతో పనులు చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో సాగునీరు సాఫీగా ముందుకు పారే విధంగా ప్రధాన, పిల్ల కాల్వల్లో సైతం పూడిక తొలగించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. 85వేల ఎకరాల ఆయకట్టు.. జూరాల ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించి ఉంది. మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గోపాల్దిన్నె రిజర్వాయర్కు సైతం ఇదే కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుండటంతో అత్యధికంగా జిల్లా ప్రజలకే లబ్ధి చేకూరుతుంది. ఎనిమిదేళ్లుగా కేవలం వానాకాలంలోనే ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందిస్తున్న అధికారులు, యాసంగిలో మాత్రం వారబందీ విధానంలో ఆయకట్టు కుదించి నీటిని వదులుతున్నారు. ప్రతిసారి వేసవిలో మరమ్మతుల కారణంగా కాల్వలో పూడికతీత పనులు ముందుకు సాగకపోయేవి. ప్రస్తుత వేసవిలో కాల్వ మరమ్మతు లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. జూరాల ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత నీటిపారుదలశాఖ సిఫార్సులతో ఉపాధిహామీ పథకంలో.. ఎంపీడీఓల పర్యవేక్షణలో ఊపందుకున్న పనులు వేసవిలో మరమ్మతులు లేకపోవడంతోనే.. -
ప్రతి గర్భిణికి హెచ్ఐవీ స్క్రీనింగ్
కందనూలు: ఎయిడ్స్పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ప్రతి గర్భిణికి విధిగా హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డా.రవికుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఐసీటీసీ కేంద్రాలకు వచ్చే ప్రతి వ్యక్తికి గోప్యతతో కూడిన కౌన్సెలింగ్, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. అదే విధంగా గర్భిణుల్లో హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తించిన వెంటనే మహబూబ్నగర్ ఏఆర్టీ కేంద్రానికి పంపించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు నాణ్యమైన పరీక్షలు నిర్వహించి.. నివేదికలను సకాలంలో అందించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు హైరిస్క్ గ్రూపుల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. యువతలో ఎయిడ్స్పై అపోహలు తొలగించేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో దిశ మేనేజర్ రమేశ్, డీడీఎం సాయికుమార్, ఐసీటీసీ కేంద్రాల కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. ‘పాలమూరు’పై వివక్ష కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం మేరకు పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన 10 శాతం పనుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొన్ని చోట్ల కాల్వల టెండర్లను రద్దు చేసిందన్నారు. ఇప్పటికే పనులు పూర్తిచేసి ఉంటే.. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లలో కనీసం 40 టీఎంసీల మేరకు నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉండేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పాలమూరు బిడ్డను అని చెబుకునే సీఎం రేవంత్రెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైన తర్వాత ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం శోచనీయమన్నారు. పాదయాత్రలో పాలమూరు జిల్లా ప్రజలు, రైతులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా కొనసాగాయి. మంగళవారం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,006 మందికి గాను 1,843 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,887 మందికి గాను 1,755 మంది, ఒకేషనల్ విభాగంలో 119 మందికి గాను 88 మంది హాజరై పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 746 మందికి గాను 687 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 648 మందికి గాను 605 మంది, ఒకేషనల్ విభాగంలో 98 మందికి గాను 82 మంది హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 163 మంది, ద్వితీయ సంవత్సరంలో 59 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. -
ఎఫ్ఆర్ఎస్ తర్వాతే కొత్త పింఛన్లు..
ప్రస్తుతం కొత్త పింఛన్లు ఇస్తారని చెబుతున్నా.. ఎప్పటి నుంచి అనేది ప్రకటించలేదు. జిల్లాలో అనర్హులతో పాటు చనిపోయిన వారి పింఛన్లు తొలగిస్తే.. కొత్త వారికి చోటు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మృతల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా వారిని గుర్తించి తొలగిస్తే.. కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటికే జిల్లాలో చాలా మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరించారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో నాలుగేళ్లుగా పింఛన్ల కోసం దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప.. మంజూరు కావడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పింఛన్ లబ్ధిదారుల ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ముఖ గుర్తింపు విధానం)చేపడుతున్నాం. ఆధార్ నంబర్ సహా లబ్ధిదారుల లైవ్ ఫొటోను నమోదు చేస్తారు. దీనిపై ఇప్పటికే జిల్లాకేంద్రంలో విడతల వారీగా పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. కొన్ని మండలాల్లో కార్యక్రమం మొదలైంది. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ ● -
తాగునీటి కొరత లేకుండా చర్యలు
● డిండి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలి ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పైప్లైన్ లీకేజీలు, మోటార్ల పనితీరు, నిల్వ ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. బిజినేపల్లి, కోడేరు, వెల్దండ, కొల్లాపూర్ మండలాల్లో నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. డిండి రిజర్వాయర్ నుంచి అచ్చంపేట, సర్వాయిపల్లి, కొల్లాపూర్, ఎల్లూరు గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రావు, మిషన్ భగీరథ ఈఈలు సుధాకర్ సింగ్, విజయ్శ్రీ ఉన్నారు. ● సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతులు అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతిని, దీర్ఘకాలంలో పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. పంటల సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించి.. సమతుల్య ఎరువులు, సూక్ష్మ పోషకాలు, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గ్రామస్థాయిలో ఏఈఓలు రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువుల దుకాణదారులు అనవసర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఏఓ యశ్వంత్రావు, జిల్లా కోఆపరేటివ్ అధికారి రఘునాథ్రావు, మార్క్ఫెడ్ డీఎం తమీన ఉన్నారు. పారదర్శకంగాధాన్యం కొనుగోలు.. కోడేరు: ధాన్యం కొనుగోలులో పారదర్శకత ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కోడేరు మండలం పస్పులలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో 3,21,045 మంది రైతులు ఉండగా.. ఇప్పటివరకు 2,18,890 మంది రైతుల వివరాలు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ పంపుహౌజ్తో పాటు జనగణన సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ సుల్తానమ్మ, ఈఈ సుధాకర్సింగ్, విజయ్, డీఈ మలేశ్వర్రావు, ఎంపీడీఓ శ్రావణ్కుమార్, తహసీల్దార్ జమీల్ ఉన్నారు. -
అంతా మా ఇష్టం!
అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీలో పాలకవర్గం పదవీకాలం ముగియగానే ఉద్యోగులు, సిబ్బంది అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వార్డు అఫీసర్కు మేనేజర్ హోదా కల్పించి.. కుర్చీలో కూర్చోబెట్టడం పట్టణంలో చర్చనీయాంశమైంది. మున్సిపల్ కమిషనర్ అర్హత లేని సిబ్బందిని అందలం ఎక్కిస్తూ.. తనకు నచ్చిన వారికి ఇష్టం వచ్చిన స్థానాలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మేనేజర్గా పనిచేసిన రమేశ్నాయక్ ఉద్యోగుల విధులు, బాద్యతలపై కఠినంగా ఉండటంతో.. అతడిపై ప్రజాప్రతినిధులకు లేనిపోని మాటలు చెప్పి డిప్యుటేషన్పై వెళ్లేలా చేశారు. దీంతో ఇక్కడ మేనేజన్ పోస్టు ఖాళీగా ఉంది. అయితే మేనేజర్ స్థాయి కలిగిన ఉద్యోగులు లేదా ఏఈ, ఎస్ఐ, టీపీఓలకు ఈ పోస్టుకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అదీ కూడా సీడీఎంఏ విధివిధానాలను అనుసరించి నడుచుకోవాల్సి ఉండగా.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే వార్డు ఆఫీసర్ను మేనేజర్ చాంబర్లోని సీటులో కూర్చోబెట్టడం వెనుక మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ ఒంటెద్దుపోకడతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాసులు తెచ్చి ఇచ్చే వ్యక్తులకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ.. వారిని వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బందిపై దురుసుగా వ్యవహరించిన వార్డు ఆఫీసర్కు మేనేజర్ హోదా కల్పించడంపై కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఈ విషయంపై కమిషనర్ మురళిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాట్సప్ ద్వారా మేసేజ్ చేసినా స్పందించలేదు. అచ్చంపేట మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ కుర్చీలో కూర్చున్న వార్డు ఆఫీసర్ మున్సిపల్ కార్యాలయంలో దర్జాగా టేబుల్పై కాళ్లు వేసి కూర్చున్న సిబ్బంది మున్సిపల్ మేనేజర్ హోదాలో వార్డు ఆఫీసర్ అచ్చంపేటలో చర్చనీయాంశంగామారిన వైనం మున్సిపల్ కమిషనర్ తీరుపై సర్వత్రా విమర్శలు -
పూర్తి ‘భరోసా’ ఏది?
● ఇప్పటి వరకు 2 ఎకరాలకే పరిమితం ● నీరుగారుతున్న రైతుభరోసా లక్ష్యం ● నిరాశలో అన్నదాతలు నాకు నాలుగున్నరెకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగికి సంబంధించి పెట్టుబడి సాయం కింద రూ. 27వేలు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రెండెకరాల వరకే రూ. 12వేలు జమ అయ్యాయి. వానాకాలం సమీపిస్తున్నందున త్వరగా సాయాన్ని అందించాలి. వానాకాలంలో కూడా పెట్టుబడి సాయాన్ని సకాలంలో విడుదల చేయాలి. – తిరుపతయ్య, రైతు, తిర్మలాపురం (బీకే), అమ్రాబాద్ మండలం నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 12వేలు మాత్రమే వచ్చాయి. పెట్టుబడి సాయం పంటల సీజన్ ప్రారంభంలోనే చెల్లిస్తే ఎరువులు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఆలస్యం కావడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. – జల్ల వెంకటయ్య, రైతు, మర్రిపల్లి, ఉప్పునుంతల మండలం రైతులకు సాగు పెట్టుబడి సాయంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అర్హులకు రైతుభరోసా అందిస్తుంది. ఎవరికై నా బ్యాంకు ఖాతాల వివరాల్లో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఏకకాలంలో పెట్టుబడి సాయం విడుదల చేస్తారు. – యశ్వంత్రావు, డీఏఓ అచ్చంపేట: యాసంగి పంటల సీజన్ ముగింపు దశకు వచ్చినా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైతుభరోసా అందలేదు. రెండెకరాలలోపు రైతులకే పెట్టుబడి సాయం పరిమితమైంది. మిగిలిన రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు వర్షాకాలం ముంచుకొస్తోంది. పంటల సాగుకు రైతులు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. పంటసాగు పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రైతుభరోసా పథకం వచ్చాక రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం కొంత తగ్గింది. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతోంది. దీంతో అన్నదాతలు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు అవేదన వ్యక్తంచేస్తున్నారు. యాసంగి రైతుభరోసానే పూర్తి స్థాయిలో అందకపోవడంతో.. ఇక వచ్చే వానాకాలం పెట్టుబడి సాయం ఉంటుందో ఉండదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పూర్తిస్థాయిలో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అసంపూర్తిగా యాసంగి సాగు పెట్టుబడి సాయం జిల్లాలో 3,18,960 మంది రైతులు ఉన్నారు.అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.426.88 కోట్ల నిధులు అవసరం. సాధారణంగా యాసంగికి సంబంధించి రైతుభరోసా నిధులను డిసెంబర్, జనవరి నెలల్లో విడుదల చేస్తారు. కానీ ఈసారి మార్చి 22న మొదటి విడత రూ. 157.45 కోట్ల నిధులు విడుదల చేశారు. ఎకరం వరకు పెట్టుబడి సాయాన్ని అందరు రైతుల ఖాతాలలో జమ చేశారు. గత నెల 20న రెండో విడతలో రెండెకరాల లోపు రైతులకు రూ. 109.78 కోట్ల సాయం అందించారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలోని రైతులకు రూ. 267.23 కోట్ల నిధులు మాత్రమే జమ అయ్యాయి. ఇంకా రూ. 159.65 కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. మిగతా నిధులు ఎప్పుడు విడదల చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. అయితే గత వానాకాలంలో రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. కానీ యాసంగికి వచ్చే సరికి పథకం అమలులో జాప్యం జరుగుతోంది. -
పోలీసు ప్రజావాణికి 5 ఫిర్యాదులు
నాగర్కర్నూల్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్న ఆయన.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ తగాదాకు సంబంధించి 2, తగు న్యాయం చేయాలని 2, భార్యాభర్తల గొడవపై 1 ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఇంటర్ సప్లిమెంటరీకి 190మంది గైర్హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో భౌతికశాస్త్రం, ఆర్థికశాస్త్రం పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,111 మందికి గాను 1,963 మంది హాజరైయ్యారు. జనరల్ విభాగంలో 1,725 మందికి గాను 1,599 మంది, ఒకేషనల్ విభాగంలో 386 మందికి గాను 364 మంది హాజరై పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరంలో 754 మందికి గాను 712 మంది హాజరైయ్యారు. జనరల్ విభాగంలో 571 మందికి గాను 534 మంది, ఒకేషనల్ విభాగంలో 712 మంది హాజరై పరీక్ష పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరంలో 148 మంది, ద్వితీయ సంవత్సరంలో 42 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. మక్కలు కొనడంలేదని రైతన్న ఆగ్రహం అచ్చంపేట రూరల్: మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు.. సోమవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డు ప్రధాన గేటుకు తాళంవేసి ఆందోళనకు దిగారు. 20 రోజుల క్రితం వివిధ గ్రామాల నుంచి రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని మార్కెట్యార్డులోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ధాన్యం కుప్పల వద్దే కాపలా ఉంటున్నారు. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడల్లా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అధికారులతో సమీక్షించి.. మొక్కజొన్న కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. మక్కలు కొనాలని అధికారులకు ఫోన్ చేసినా ఎత్తడం లేదని.. తమ సమస్య ఎవరికి చెబుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్కు తీసుకొచ్చిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న తహసీల్దార్ సైదులు మార్కెట్యార్డుకు చేరుకొని గేటుకు తాళం తీయించారు. సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంతరాలు లేని సమాజ స్థాపనే లక్ష్యం నాగర్కర్నూల్ రూరల్: అంతరాలు లేని సమసమాజ స్థాపనే తెలంగాణ ప్రజా నాట్యమండలి లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా నాట్యమండలి జల్లా నాలుగో మహాసభలకు వారు హాజరై మాట్లాడారు. 1943లో పురుడు పోసుకున్న ప్రజా నాట్యమండలి.. దేశ స్వాంతంత్రోద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. మూఢ నమ్మకాలు, వివక్షత, మతోన్మాదం, కులమతాలకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, గోపాల్, ప్రేమ్కుమార్, సలేశ్వరం, చందు, యాదగిరి, రామస్వామి, లింగేశ్వర్, శ్రీనివాస్, సురేశ్, కుర్మయ్య పాల్గొన్నారు. -
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా
కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొల్లాపూర్లోని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్డీఓ కార్యాలయం నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కళావతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18వేలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను రాష్ట్రంలో కూడా అమలు చేయడంతో పాటు ప్రతినెలా ఒకటో తేదీనే ఆశావర్కర్లకు వేతనం అందించాలన్నారు. అదే విధంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని, పరీక్షల డ్యూటీలకు అదనపు పారితోషికం నిర్ణయించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా సౌకర్యం, రిటైర్డ్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పెబ్బేటి శంకర్, సలీం, బత్తిని రాజు, చెన్నమ్మ, శివలీల, సుజాత, విజయలక్ష్మి, జ్యోతి, శారద, వెంకటమ్మ, వరలక్ష్మి, జయమ్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
● 22న జరిగే జిల్లాస్థాయి సభను విజయవంతం చేయాలి ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి జిల్లాస్థాయి ప్రజాపాలన సభ నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22న జిల్లాకేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన జిల్లాస్థాయి సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత చేరువ చేయడం.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కార మార్గాలు చేపట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు సభకు హాజరయ్యేలా ఆహ్వానాలు అందించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా అన్నిశాఖల జిల్లాస్థాయి, డివిజన్, మండలస్థాయి అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం.. లబ్ధిదారుల హాజరు తదితర అంశాలపై కలెక్టర్ శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్, ఆర్డీఓ సురేశ్బాబు ఉన్నారు. ఆధునిక జీవనశైలిలో క్రీడలు తప్పనిసరి.. ఆధునిక జీవనశైలిలో వ్యాయామం, క్రీడలు, యోగా వంటి వాటిని అలవర్చుకోవాల్సిన అవసరముందని కలెక్టర్ అన్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి నిర్వహించిన ‘ఫిట్ అండ్ యాక్టివ్ 2కే రన్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మినీ ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన 2కే రన్లో కలెక్టర్తో పాటు యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, యువత శక్తి, క్రీడా సంస్కృతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ సీతారాం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్డీఓ సురేశ్బాబు పాల్గొన్నారు. ప్రతి అధికారి హాజరుకావాలి.. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి జిల్లాస్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ పిల్లలు ఆస్తులను తీసుకుని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ, ప్రజావాణికి వచ్చిన వృద్ధుల వద్దకు స్వయంగా కలెక్టర్ వెళ్లి వినతిపత్రాలను స్వీకరించారు. వారికి ధైర్యం చెప్పి.. తగిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ప్రజావాణికి 35 దరఖాస్తులు వచ్చాయని.. వీటికి సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
హిందూ ధర్మాన్ని పాటిద్దాం
కందనూలు: హిందూ సమాజం సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రాంనూతల శశిధర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి బస్తీలో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయడం అందరి బాధ్యతని అన్నారు. హిందూ సమాజంపై గౌరవభావం, ఏకాత్మకతా భావన, స్వధర్మంపై అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఓం భారత్ శక్తిపీఠం వ్యవస్థాపకులు భారతనంద మహారాజ్, ఉత్సవ సమితి అధ్యక్షుడు భానుప్రకాశ్, కార్యదర్శి రమేశ్, కౌన్సిలర్లు పాండు, కొత్త గంగాధర్ పాల్గొన్నారు. -
దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 81 మంది దివ్యాంగ విద్యార్థులకు 14 రకాల 108 ఉపకరణాలు, సహాయక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు అన్నివిధాలుగా అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. విద్య, ఉపాధి, వైద్యం, పునరావాసం వంటి రంగాల్లో ప్రత్యేక పథకాల ద్వారా దివ్యాంగులకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగ పిల్లలకు కూడా మెరుగైన విద్య, అవసరమైన సహాయక ఉపకరణాలు అందించేందుకు కృషిచేస్తానని తెలిపారు. డీఈఓ రమేశ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ‘‘నా విద్య’’ కార్యక్రమం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫిజియోథెరపీ, ప్రత్యేక శిక్షణతో పాటు అవసరమైన సహాయక ఉపకరణాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి సాధారణ విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, వెంకటేశ్వరశెట్టి పాల్గొన్నారు. -
విత్తనాలు సిద్ధం..
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్నగర్ -
ఆధ్యాత్మికం
ఆహ్లాదం.. ● పర్యాటకులను ఆకర్షిస్తున్న నల్లమల అందాలు ● నేటి నుంచి యువజన, క్రీడలు, పర్యాటక వారోత్సవాలు అచ్చంపేట: కనుచూపు మేర పచ్చని చెట్లు.. చల్లని గాలులు.. పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. ఆధ్మాత్మిక క్షేత్రాలు.. పరవళ్లు తొక్కుతూ సాగిపోయే కృష్ణమ్మ అందాలతో ప్రకృతి రమణీయతకు నిలయం నల్లమల. కుటుంబ సమేతంగా నల్లమల, కృష్ణానదిలో ప్రయాణిస్తే మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుని రావొచ్చు. పర్యాకులు నల్లమల అడవి, కృష్ణానది అందాలను ఆస్వాదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం రూపకల్పన చేసింది. అయితే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు యువజన, క్రీడలు, పర్యాటక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. నల్లమల ప్రాంతంలో రాష్ట్ర చారిత్రక వారస్వత సంపద, సంస్కృతి, ఎకో టూరిజం ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడం.. పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించేలా చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తి, దేహదారుఢ్యం, సామాజిక చైతన్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని సంబంధిత అధికారులు తెలిపారు. అడవిలో ఒక రోజు పాటు పూర్తిగా గడపాలనుకునే ప్రకృతి ప్రేమికులకు మన్ననూర్ జంగిల్ రిసార్ట్, టైగర్ స్టే ప్యాకేజీ (ఫర్హాబాద్ టూరిజం ప్యాకేజీ)తో పాటు అక్కమదేవి– దోమలపెంట టూర్ స్టే ప్యాకేజీలు అమలు చేస్తోంది. దట్టమైన అడవిలో సుమారు 20 కి.మీ. దూరం టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ.. వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించవచ్చు. టైగర్ స్టే ప్యాకేజీ కోసం పర్యాటకులు amrabadtigerreserve.comలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
ఆగుతూ.. సాగుతూ!
నత్తనడకన సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ● పూర్తికాని భూసేకరణ ప్రక్రియ ● రూ.147.7కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం పనులకు శ్రీకారం ● కెనాల్ పూర్తయితే 34వేల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్: సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కెనాల్ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. భూ సేకరణలో జాప్యం కారణంగా నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఈ కెనాల్పై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. కెనాల్ నిర్మాణం పూర్తయితే వారికి సాగునీటి సమస్య తీరనుంది. శాశ్వత పరిష్కారం కోసం.. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్లో సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా డిజైన్ రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయించగా.. 2022లో విడుదలయ్యాయి. రూ. 147.7కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు 2023లో వేగంగా జరిగాయి. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం.. భూసేకరణ సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి. 5 కి.మీ. మాత్రమే నిర్మాణం.. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్ వరకు 22.5 కి.మీ. మేరకు కెనాల్ నిర్మించాల్సి ఉంది. ఇందులో వనపర్తి జిల్లా పరిఽధిలో 18 కి.మీ., నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 4.5 కి.మీ., కాల్వ తవ్వాలి. అయితే వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. భూ నిర్వాసితులకు ఎకరా రూ. 5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత పరిహారాన్ని రూ. 6లక్షలకు పెంచారు. కానీ రైతులు రూ. 20లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని మొండికేయడంతో కాల్వ తవ్వకాలు రెండేళ్ల క్రితం నిలిచిపోయాయి. గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి దాదాపు 5 కి.మీ. మేరకు మాత్రమే కాల్వ తవ్వకాలు చేపట్టారు. సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్తో వీపనగండ్ల, చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం పాన్గల్ మండలంలో కొంత మేరకు సాగునీరు అందుతోంది. లింక్ కెనాల్కు తూములు ఏర్పాటుచేసి.. సమీపంలోని చెరువులు, కుంటలకు నీరు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల ఎడమ కాల్వ కింద ఉన్న 24,500 ఎకరాల ఆయకట్టు భూములతో పాటు రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. అదే విధంగా వేసవిలో పలు గ్రామాలకు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణంపై నీటిపారుదలశాఖ అఽధికారులతో సమీక్షించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. పనుల పూర్తికోసం సంబంధిత కాంట్రాక్టు కంపెనీతో మాట్లాడారు. ఏడాది క్రితం కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూ సేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ. 25కోట్ల మేరకు నిధులు ఉండటంతో రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆయన సూచించారు. కానీ భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇటీవల మంత్రి జూపల్లి మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులను ఒప్పించి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా రైతులతో మాట్లాడతానని ఆయన వారికి సూచించారు. ఈ మేరకు రైతులతో మంత్రి స్వయం మాట్లాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తానాభివృద్ధి సంస్థ ● ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు ● ఇప్పటికే నారాయణపేట, పాలమూరు జిల్లాలకు సరఫరా ● పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. వనపర్తిలోని విత్తనశుద్ధి కర్మాగారంలో సిద్ధంగా ఉన్న విత్తనాలు జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. -
భూసేకరణ ప్రక్రియ సాగుతోంది..
లింక్ కెనాల్ నిర్మాణానికి దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. గ్రామాల వారీగా రైతులతో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు రెగ్యులర్గా కెనాల్ పనులపై ఆరా తీస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు కొంతమేరకు కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయి. చాలా చోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ ● -
ప్రతి గింజనూ కొంటాం
అమ్రాబాద్: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొంటుందని.. ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అమ్రాబాద్ మార్కెట్యార్డులో మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మా ట్లాడారు. అమ్రాబాద్ సబ్యార్డులో అన్ని వసతులు కల్పించి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా మల్లేష్, వైస్చైర్మన్ వెంకటయ్య, పీఏసీఎస్ వైస్చైర్పర్సన్ మంగమ్మ, సర్పంచ్ కోటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీం, హరినారాయణగౌ డ్, మోహన్గౌడ్, బాలింగంగౌడ్ పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలి ● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కందనూలు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై శనివారం కలెక్టరేట్ వీసీ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల లభ్యత, వైద్యసిబ్బంది హాజరు, అత్యవసర సేవలు, ప్రసూతి, పరీక్షలు, పారిశుద్ధ్యం పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్యసిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వీసీలో జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డీఎంహెచ్ఓ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చర్యలు.. ఓటరు జాబితాలో తప్పులకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు జాబితా పరిశీలన, బూత్ల వారీగా వివరాల సేకరణ, సిబ్బంది సమన్వయం వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టిసారించినట్లు వివరించారు. వీసీలో ఆర్డీఓలు సురేశ్బాబు, యాదగిరి, బన్సీలాల్, రవికుమార్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ
కందనూలు: జిల్లాలో ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,191 మందికి గాను 2,066 మంది హాజరై పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 1,881 మందికి గాను 1,775 మంది, ఒకేషనల్ విభాగంలో 310 మందికి గాను 291 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 653 మందికి గాను 624 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 503 మందికి గాను 480 మంది, ఒకేషనల్ విభాగంలో 150 మందికి గాను 144 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 125 మంది, ద్వితీయ సంవత్సరంలో 29 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ఆదివాసీల ఆర్థిక స్వావలంబనకు కృషి అమ్రాబాద్: ఆదివాసీల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ అన్నారు. శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ రైతువేదికలో మహిళా సమాఖ్య సభ్యులు, వీఓఏలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు నిర్వహిస్తున్న సమ్మిళిత జీవనోపాధుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. నిరుపేద కుటుంబాలకు రుణాలు అందించి.. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మన్ననూర్లో ఇటీవల మరణించిన పంబలి తిరుమలయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. సమావేశంలో ఏపీఓ సైదులు ఉన్నారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయా పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పిండి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా పనిచేస్తుందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేవలం వాహనదారులకు మాత్రమే కాకుండా.. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని.. పేదలు, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరిగి పంటల సాగు భారంగా మారిందన్నారు. మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగించకుండా ఎకై ్సజ్ సుంకాలు పెంచడం దారుణమన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు, తద్వారా ప్రపంచస్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఈ మధ్య కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. అంతలోపు ఈ సెలవుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కుటుంబసమేతంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల సమయం కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్నగర్ – వివరాలు 8లో.. -
కార్పొరేట్కు ఽధీటుగా సర్కారు వైద్యం
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వం వైద్యసేవలు అందిస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్ సెంటర్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. అదే విధంగా ఎంసీహెచ్, డయాలసిస్ సెంటర్తో పాటు వంద పడకల ఆస్పత్రికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2018లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. త్వరలోనే పనులను పూర్తిచేసి ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రి భవనంలో వసతుల కల్పనకు రూ.కోటి నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. కొల్లాపూర్లోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎంసీహెచ్, డయాలసిస్ సెంటర్, వంద పడకల ఆస్పత్రులకు రోగులను తరలించేందుకు నాలుగు, ఐదు ఈవీ వాహనాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అంశాలు తన దృష్టిలో ఉన్నాయని.. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వస్తారని.. ఆయనకు సమస్యలను తెలియజేసి పూర్తిస్థాయి సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు రెగ్యులర్గా ఆస్పత్రిని పర్యవేక్షించాలని సూచించారు. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అంబేడ్కర్ కళాభవన్ పనులను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ షేక్ రహీంపాషా తదితరులు ఉన్నారు. -
పాలమూరు కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ మొదటి వారంలో... చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్కుమార్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం తదితర రంగాల వారీగా సైతం.. పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ జూన్లో పాదయాత్రకు సన్నాహాలు నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు.. తొలి రోజు కేటీఆర్, మధ్యలో హరీశ్రావు హాజరు చివరి రోజు భారీ బహిరంగ సభ ‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి.. పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి తొలి దశలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలు
కందనూలు: గ్రంథాలయాలు విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విద్యా వ్యవస్థలో జ్ఞాన కేంద్రాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల్లో పఠన అలవాటును పెంపొందించడం ద్వారా వారి సృజనాత్మకత, విశ్లేషణా సామర్థ్యం, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. పుస్తకాలు మనకు నిజమైన మార్గదర్శకాలు అన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని మరింత విస్తరించాలంటే గ్రంథాలయ పఠనం అత్యంత అవసరమని సూచించారు. ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తకాల ద్వారా లభించే లోతైన జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కురుమయ్య, జిల్లా ఏఎంఓ కిరణ్ కుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పేదలందరికీ సంక్షేమం
నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల లబ్ధిదారుకలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్, యార రమేష్, బండ పర్వతాలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 213 మంది గైర్హాజరు కందనూలు: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 213 మంది విద్యార్థులు గైర్హాజ రయ్యారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో గణితం, వృక్షశాస్త్రం, రాజనీతిశాస్త్రం పరీక్ష నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,876 మందికి గాను 2,715 మంది హాజరయ్యారు. అలాగే జనరల్ విభాగంలో 2,579 మందికి గాను 2,436 మంది, ఓకేషనల్ విభాగంలో 297 మందికిగాను 279 మంది పరీక్ష రాశారు. ద్వితీయ సంవత్సరంలో 917 మందికి గాను 865 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 822 మందికి గాను 785 మంది, ఓకేషనల్ విభాగంలో 95 మందికి గాను 80 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 161 మంది, ద్వితీయ సంవత్సరంలో 52 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ తెలిపారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు చారకొండ: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించడంతో పాటు పంటమార్పిడి చేస్తే అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పల్లవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఏఓ తనూజరాజ్ ఆధ్వర్యంలో ‘రైతు ముగింట్లో శాస్త్రవేతలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా సాగు ఖర్చులు తగ్గి, లాభాలు వస్తాయన్నారు. విత్తనాల ఎంపికలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ పంట కాల పరిమితి, దిగుబడి తదితర అంశాలపై వివరించారు. అనంతరం వ్యవసాయ సాగు పద్ధతుల కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ గుర్వయ్య గౌడ్, డైరెక్టర్ జగన్మోహన్, ఏఈఓలు వంశీ, అనూష రైతులు ఉన్నారు. -
ఆదివాసీల అభ్యున్నతికి ‘ఇన్క్లూజివ్ లైలీహుడ్’
మన్ననూర్: ఆదివాసిల్లో అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇన్క్లూజివ్ లైలీహుడ్’ ప్రోగ్రామ్ రూపకల్పన చేస్తుందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో మల్లాపూర్ చెంచుపెంటను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చెంచుల జీవన విధానం, ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. మన్ననూర్కు ఆమ్లేట్ విలేజ్గా ఉన్న మల్లాపూర్ పెంటలోని 34 చెంచు కుటుంబాల స్థితిగతులను పరిశీలించి, వారితో సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందట్లేదు.. ఆర్డీటీ అధికారులు కట్టించిన ఇళ్లే మాకు దిక్కని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెంచులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి రోడ్డు, అంగన్వాడీ, చౌకధరల దుకాణం, తాగునీటికి శాశ్వత పరిష్కారం, పంటలు సాగు చేసుకోవడం కోసం ఎద్దులు, వన్యప్రాణుల నుంచి పంటలు కాపాడుకోవడం సోలార్ ఫెన్సింగ్ అందించాలని కోరారు. ఉపాధి పనులు చేస్తున్నా మస్టర్లో పేర్లు లేవనే సాకుతే తమకు డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. వేలి ముద్రలు తీసుకోకపోవడంతో అకౌంట్లలో డబ్బులు తీసుకోవడానికి వీలు కావడంలేదు. మహిళా సమాఖ్యల ద్వారా లోన్ తీసుకుని వ్యవసాయం, మేకల పెంపకం తదితర వాటికి పెట్టుబడి పెడితే వాటికి తగిన రక్షణ లేక నష్టపోతున్నామని మహిళలు వాపోయారు. అంతకు ముందు అడవిలో దొరికే సహజమైన అడవి పూలు, కాయలతో పాటూ చెంచు సాంప్రదాయ నృత్యాలతో చెంచులు కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం వారం రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చిగుర్ల చిన్న గంగయ్య పూరి గుడిసె శిథిలాలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అధివృద్ధి సంస్థ పీడీ చిన్న ఓబులేష్, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, సర్పంచ్ మంజుల రాజారాం, ఉప సర్పంచ్ రమణగౌడ్, ఎంపీడీఓ లింగయ్య, ఈజీఎస్ ఏపీఓ రఘు, కార్యదర్శి భీముడు తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి కల్పించాలి దశాబ్దాల కాలంగా అటవీ ప్రాంతాన్నే నమ్ముకుని బతుకుతున్న చెంచులకు జీవనోపాధి కల్పించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ప్రభుత్వం తరుఫున కొత్త కార్యచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులకు సూచించారు. పశుపోషణ, కోళ్లపెంపకం, చిరు వ్యాపారాలు, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, వ్యవసాయ అనుభంధ రంగాల్లో శిక్షణ ఇచ్చి చెంచుల ఆదాయ వనరులు పెంచాలన్నారు. మళ్లీ 20వ తేదీన ఇక్కడి వస్తానని, అప్పటి వరకు మహిళల ఆర్థిక సాధికారతకు అవసరమైన ప్రత్యేక పథకాలకు రూపకల్పన చేయాలన్నారు. -
కరువైన నిఘా..
జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలు, పరిసర గ్రామాల్లో వన్యప్రాణుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా పదర మండలంలోని చిట్లంకుంట, బాపన్పాడు, పెట్రాల్చేను, ఉడిమిళ్ల, బల్మూర్ మండలం బాణాల, బిళ్లకల్, కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, ముక్కిడిగుండం, లింగాల మండలంలోని అప్పాయిపల్లి, చెన్నంపల్లి, పద్మనపల్లి, పాత రాయవరం గ్రామాల్లో ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ కోర్ ఏరియాలో అటవీశాఖ అధికారులు పటిష్టంగా సంరక్షణ చేపడుతున్నా.. పరిసర మండలాలు, గ్రామాల్లో మాత్రం నిఘా కరువైంది. ఇదే అదనుగా వేటగాళ్లు పంజా విసురుతున్నారు. -
ఉచ్చులతో ఉసురు..
వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలవుతున్న వన్యప్రాణులు –8లో uసాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకు మణిహారంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అనేక రకాల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 34 వరకు పెద్ద పులులు, వందకు పైగా చిరుతలు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, సాంబార్డీర్, ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయి. కానీ వేటగాళ్ల రూపంలో వన్యప్రాణులకు, అరుదైన జంతుజాలానికి పెనుముప్పు పొంచి ఉంది. వన్యప్రాణుల మాంసం, విక్రయాల కోసం తరచుగా నల్లమలలో వేట కొనసాగుతూనే ఉంది. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తున్నా వేటగాళ్లలో మార్పు రావడం లేదు. జిల్లాలో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు. మాటు వేసి.. గుట్టుగా తరలింపు.. నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పరిసర గ్రామాలు, శివారు ప్రాంతాల్లో తరచుగా వన్యప్రాణులను వేటాడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వేటగాళ్లు రోజుల తరబడి ప్రణాళికతో ఉచ్చు బిగించి వన్యప్రాణులను బలి తీసుకుంటున్నారు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి శివారు ప్రాంతంలో సాంబార్డీర్ (కణతి)ను వేటాడి కళేబరాన్ని కారులో తరలిస్తున్న మొలచింతలపల్లికి చెందిన బేరి శ్రీనివాసులు, పెబ్బేటి శివ, వట్టిపల్లికి చెందిన అనమోని బాబు, శివ అదుపులోకి తీసుకున్నారు. కణితి మాంసం, కారును స్వాధీనం చేసుకుని వారిని అచ్చంపేట ఎఫ్డీఓ కార్యాలయానికి తరలించారు. బలి తీసుకుంటున్న కరెంట్.. నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ పెనవేసుకుని ఉన్న గ్రామాలు, శివారు ప్రాంతాల్లో వ్యవసాయ, పోడు, కంచె భూముల్లో వన్యప్రాణులకు కరెంట్ పెడుతుండటం కలవరపెడుతోంది. కొందరు రైతులు తమ పంటలను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు కరెంట్ వైర్లను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు వేట కోసమే కరెంట్ వైర్లు బిగిస్తున్నారు. అడవి పందులు, సాంబార్డీర్, జింకలే లక్ష్యంగా కరెంట్ వైర్లు, ఉచ్చులను పెడుతున్నారు. ఈ క్రమంలో అదే దారిన వెళ్తున్న రైతులు, ఇతర వ్యక్తులు సైతం విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. లింగాల మండలం పాతరాయవరంలో రెండేళ్ల కిందట కరెంట్ వైర్కు తగిలి రైతు బలయ్యాడు. కఠిన చర్యలు తీసుకుంటాం వన్యప్రాణులను వేటాడితే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి సమీపంలో సాంబార్ డీర్ను వేటాడిన నిందితులను పట్టుకున్నాం. ఇందుకు సంబంధించిన నలుగురిని అరెస్ట్చేసి జైలుకు పంపించాం. వన్యప్రాణుల సంరక్షణకు మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. నల్లమల పరిసరాల్లో నిఘా పెంచుతాం. – చంద్రశేఖర్, ఎఫ్డీఓ, అచ్చంపేట నల్లమల పరిసరాల్లో కొనసాగుతున్న వేట అమ్రాబాద్, పదర, లింగాల, కొల్లాపూర్, బల్మూర్ మండలాల్లో అధికం జిల్లాలోని సంతల్లో యథేచ్చగా అమ్మకాలు కఠిన చట్టాలున్నా ఆగని తీరు -
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
పెద్దకొత్తపల్లి: నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకొచ్చినా కాంటా చేయడం లేదని ఆగ్రహించిన రైతులు శుక్రవారం పెద్దకొత్తపల్లి బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో దేవునితిర్మలాపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా.. కొనుగోలు చేపట్టలేదని మండిపడ్డారు. సింగిల్ విండో సీఈఓ సీరాజ్ద్దీన్ రైతులకు ఎంత నచ్చచెప్పినా రైతులు శాంతించలేదు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ సతీష్ ధర్నా వద్దకు చేరుకొని ఫోన్ ద్వారా అదనపు కలెక్టర్ అమరేందర్తో మాట్లాడి వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం తహసీల్దార్, ఎస్ఐ మండల కేంద్రంలో ఉన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వెళ్లి నిల్వలను పరిశీలించారు. ధాన్యం బస్తాలను కేంద్రం నుంచి తరలించడానికి లారీలు రాకపోవడంతో కొనుగోలులో జాప్యం జరుగుతుందని నిర్వాహకులు వారి దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృత్తం కాకుండా రైతుల నుంచి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని సింగిల్ విండో సిబ్బందికి సూచించారు. -
పెట్రోల్ మంట.. డీజిల్ సెగ
పాలమూరు/నాగర్కర్నూల్: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చముర కొరత వల్ల పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం మహబూబ్నగర్లో పెట్రోల్ లీటర్ రూ.108.41 ఉండగా.. ప్రస్తుతం రూ.111.80కి పెరిగింది. డీజిల్ రూ.96.59లు ఉండగా... ప్రస్తుతం రూ.99.85కి పెరిగింది. ఈ లెక్క ప్రకారం పెట్రోల్ రూ.3.39, డీజిల్ 3.26 చొప్పున పెరిగాయి. ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు సగటున 15 లక్షల లీటర్ల పెట్రోల్, 70 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. 44వ నంబర్జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. పెరిగిన ధరలతో ప్రతిరోజూ వాహనదారులపై దాదాపు రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. పేదలపై భారం మోపొద్దు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలు పెరగకుండా నియంత్రించాలి. పేదలు, సామాన్యులపై భారం మోపొద్దు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై ఆ ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలి. అలాగే పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. – మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ యుద్ధ ప్రభావంతో.. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన సంక్షోభంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రుభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే చాలా దేశాలు ఇంధన వినియోగంపై ఆంక్షలు విధించాయి. కానీ బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్లు ఆ నష్టాలను భరిస్తూ వచ్చింది. కానీ యుద్ద ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మొదటగా స్వీయ నియంత్రణ పాటించిన తర్వాతే ధరలు పెంచేందుకు మొగ్గు చూపారు. అందుకే ప్రధాని ఈవీ వెహికిల్స్కు అధిక ప్రాధాన్యత ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. – నరేందర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ వాహనదారుల జేబుకు చిల్లు పాలమూరులో పెట్రోల్పై రూ.3.39, డీజిల్పై 3.26 పెంపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ రూ.3కోట్ల అదనపు భారం -
మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన
కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్మాణ్ సంస్థ, జిల్లా ఎంప్లాయిమెంట్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఇన్ఫోసిస్ ఆర్థిక సహకారంతో, నిర్మాణ్ సంస్థ, క్వీన్ క్రాప్ భాగస్వామ్యంతో 15 పైగా కంపెనీలు పాల్గొన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులు 200మందికి పైగా అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి.. అర్హులైన వారికి కంపెనీల ఆఫర్ లెటర్లు అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారిణి డా.దీపిక, ఎంప్లాయిమెంట్ అధికారి రాఘవేంద్ర సింగ్, అధ్యాపకులు కృష్ణయ్య, ధర్మ, రవీందర్ పాల్గొన్నారు. అమర్నాఽథ్ యాత్రికులకు వైద్యపరీక్షలు నాగర్కర్నూల్ క్రైం: జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి యాత్రికులకు పలు సూచనలు చేశారు. యాత్రలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వైద్యపరీక్షలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆమె అందజేశారు. కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మోనాదేవి, డా.నిఖిత, సహాయ సంచాలకులు సీజే వసంత్ కుమార్, ఆర్ఎంఓ డా.ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల, పద్మ, హెల్ప్డెస్క్ ఇన్చార్జి టి.యాదగిరి పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి 92మంది గైర్హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా కొనసాగాయి. రెండో రోజు జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో ఆంగ్లం పరీక్ష నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 1,160 మందికి గాను 1,091 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 970 మందికి గాను 916 మంది, ఒకేషనల్ విభాగంలో 190 మందికి గాను 175 మంది హాజరై పరీక్ష రాశారు. అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 216 మందికి గాను 203 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 124 మందికి గాను 117 మంది, ఒకేషనల్ విభాగంలో 92 మందికి గాను 86 మంది హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 69 మంది, ద్వితీయ సంవత్సరంలో 23 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. కూలీలకు అన్ని వసతులు కల్పించాలి కోడేరు: ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపాధిహామీ పథకం పనులు చేపట్టే ప్రదేశాల్లో కూలీలకు నీడ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించడంతో పాటు మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు సూచించారు. గురువారం కోడేరు మండలం నాగులపల్లిలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పలు సూచనలు చేశారు. ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 6 గంటలకే పనులకు వచ్చి.. మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ సిబ్బంది తప్పనిసరిగా కూలీల హాజరును ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఈసీ సరిత ఉన్నారు. -
పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములు కావాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పూర్వవిద్యార్థులు యూనివర్సిటీలో భాగస్వాములుకావాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం పీయూలో విద్యావారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీయూలో చదివి వివిధ స్థాయిల్లో విద్యార్థులు పనిచేయడం గొప్ప విషయమని, జీవితంలో ముందుకు వెళ్తున్న యూనివర్సిటీతో అనుబంధం కొనసాగించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల అనుభవాలు, విజయాలు ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మార్గదర్శనం కావాలన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు చదువు ఒక్కటే కాదని, దానితో పాటు స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కుమారస్వామి, అనురాధారెడ్డి, మాళవి, కరుణాకర్రెడ్డి, నూర్జహాన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
నాగర్కర్నూల్ క్రైం: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డితో కలిసి స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి నిర్మాణంతో వైద్యరంగం మరింత అభివృద్ధి చెందుతుందని.. పేదలు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించే జనరల్ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతో పాటు మెడికల్ విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్చైర్మన్ బాదం రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉషారాణి పాల్గొన్నారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
కోడేరు: నిరంతర పోరాటాలతోనే కర్షక, కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దన్ పర్వతాలు అన్నారు. గురువారం కోడేరు మండలం తీగలపల్లిలో సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. భూ నిర్వాసితులందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశానాయక్, శ్రీనివాసులు, శివవర్మ, తారాసింగ్, మండల కార్యదర్శి రవి, శివశంకర్, వరప్రసాద్, వెంకటయ్య, రాజాపూర్ బిచ్చన్న పాల్గొన్నారు. -
సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం
ఉప్పునుంతల: సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన హిందూ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ జాతిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్న నేపథ్యంలో హిందువులందరూ అప్రమత్తమై జాతి సంరక్షణకు నడుం బిగించాలన్నారు. హిందూ దేవాలయాలు, పురాతన సంస్కృతిని కాపాడుకుందామని అన్నారు. అందులో భాగంగా ఊరూరా హిందూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. అందరిని సంఘటితం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఉమ్మడి పాలమూరు విభాగ్ చాలక్ శ్రీనివాస్రెడ్డి, స్థానిక సర్పంచ్ మోహన్గౌడ్, బీజేపీ నాయకులు రమేశ్, మహేశ్ యాదవ్, శ్రీనివాస్రెడ్డి, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
తాగునీటి కటకట..!
అచ్చంపేటలో మిషన్ భగీరథ లీకేజీలమయం ●వాళ్ల ఇష్టం వచ్చిన సమయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం, సాయంత్రం, రాత్రిపూట నల్లాలు వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలో కంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్మన్ను అడిగితే పైపులైన్ లీకేజీ ఉందని, పైనుంచి నీరు రావడం లేదని, ప్రైజర్ తక్కువగా ఉందని చెబుతున్నారు. – బుద్దుల రామాంజనేయులు, ఇందిరానగర్ కాలనీ, అచ్చంపేట మా కాలనీకి మూడు, నాలుగు రోజులకు ఒకసారి నల్లాల ద్వారా నీరు వస్తోంది. అది కూడా 30 నిమిషాలకే బంద్ అవుతుంది. దీంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాం. పైపులైన్ల లీకేజీతో నల్లాల ద్వారా మురుగునీరు వస్తోంది. ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు స్పందించాలి. – నరేశ్, కుమ్మరివాడ, అచ్చంపేట పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాం. లీకేజీలు ఏర్పడకుండా, నీరు వృథాగా పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. నీటి ఇబ్బంది ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. అమృత్ 2.0 పథకంలో భాగంగా పైపులైన్తో పాటు మరో మూడు ట్యాంక్ల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా రూ. 16కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వస్తే తప్ప నీటి సమస్య తీరదు. – రాజానాయక్, మున్సిపల్ ఏఈ, అచ్చంపేట అచ్చంపేట పట్టణ జనాభా: 37,506 వార్డులు: 20 పైపులైన్ పొడవు: 132 కి.మీ. బ్యాలెన్సింగ్ ఓవర్హెడ్ ట్యాంకు: 1 బోరుమోటార్లు 80 వాటర్ డిమాండ్: 5 ఎంఎల్డీ సరఫరా అవుతున్న నీరు 3 ఎంఎల్డీ అచ్చంపేట: వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. అచ్చంపేట మున్సిపాలిటీలో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినప్పటికీ నీటి ఎద్దడి తీరడం లేదు. పట్టణం వేగంగా విస్తరిస్తున్నా నల్లా కనెక్షన్ల సంఖ్య మాత్రం అంతంతగానే ఉంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పవర్ బోర్లపై పట్టింపు కరువైంది. అవి తరచుగా కాలిపోవడం, మరమ్మతుకు గురికావడం వంటి సమస్యలు తలెత్తున్నాయి. మరోవైపు రోజు ఏదో ఒక ప్రాంతంలో తాగునీటి పైపులైన్ లీకేజీలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో చాలీచాలని నీటిని సరఫరా చేస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. అచ్చంపేట పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. పట్టణంలో మూడు రోజులకోసారి నీటి సరఫరా శివారు కాలనీల్లో తీవ్ర సమస్య వేసవి యాక్షన్ ప్లాన్ ఉన్నా తీరని తాగునీటి ఎద్దడి -
భీమా కాల్వ గండి పూడ్చాల్సిందే..
● సాగునీటి విషయంలో అలసత్వం వహిస్తే సహించం ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ రూరల్: వీపనగండ్ల మండలం నాగార్లబండ తండా సమీపంలో తెగిపోయిన రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ–16 ప్రధాన కాల్వకు సత్వరమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. నాగార్లబండ తండా సమీపంలో 62.25 కి.మీ. వద్ద భీమా కాల్వకు 2019 జూలై 23న గండి ఏర్పడగా.. నేటికీ శాశ్వత మరమ్మతులు పూర్తికాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఈపీసీ ఒప్పందం మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇంకా అధికారికంగా ముగియలేదని.. ఈ క్రమంలో గండిని పూడ్చడంతో పాటు ఇతర పెండింగ్ పనులను పూర్తిచేయాల్పిన బాధ్యత సంబంధిత గుత్తేదారుదేనని ఆయన స్పష్టం చేశారు. మరమ్మతు పనుల్లో ఆలస్యం కావడానికి గల కారణాలు.. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విషయంలో రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ నమస్యపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదలశాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు ఆయన వెల్లడించారు. భీమా కాల్వ మరమ్మతుకు అవసరమైన పరిపాలనా అనుమతులను త్వరలోనే ఇప్పిస్తామన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలుగకుండా యుద్దప్రాతిపదికన కాల్వ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈలు వెంకట్రెడ్డి, చంద్రశేఖర్, భీమా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేశవరావు, డీఈ మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి ● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కందనూలు: గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం ఊర్కొండ మండలం రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ఆయన పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం మంజూరుచేసిన ఇళ్లను త్వరగా నిర్మించుకొని గృహప్రవేశాలు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీరోడ్ల నిర్మాణాలు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా పైప్లైన్ వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సీసీరోడ్ల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. అభివృద్ధి పనుల నాణ్యతా విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని.. ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. రాచాలపల్లి గ్రామంలో వరిధాన్యాన్ని ఆరబెట్టిన రైతుల వద్దకు కలెక్టర్ వెళ్లి పంట దిగుబడి, ధాన్యం నాణ్యత, కొనుగోలు కేంద్రానికి తరలింపు ఏర్పాట్లపై ఆరా తీశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కలెక్టర్.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం, హౌసింగ్ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, తహసీల్దార్ యూసుఫ్ అలీ తదితరులు ఉన్నారు. -
మాడు మండుతోంది..!
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. నాలుగు రోజులుగా 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల ప్రభావంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వడగాల్పులతో మరింత వేడి.. జిల్లావ్యాప్తంగా అధిక ఎండలతో పాటు మధ్యాహ్నం వేళ వడగాల్పుల ప్రభావంతో వేడి రెట్టింపవుతోంది. ఇళ్లలో ఫ్యాన్ కింద ఉంటున్నా ఉక్కబోత, అధిక వే డితో జనం సతమతమవుతున్నా రు. ఇక ఎండలో పనిచేస్తున్న కా ర్మికులు, వ్యవసాయ కూ లీలు, వీధి వ్యాపారులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలరోజులపాటు నిప్పులకుంపటే.. ఈ వేసవిలో మరో నెలరోజులపాటు ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉండనున్నట్టు వాతావరణశాఖ అంచనావేసింది. ఈనెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరిగి నిప్పుల కుంపటిని తలపించనుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండ ప్రభావం దినసరి కూలీలు, రైతులు, ఉపాధి కూలీలు, చిరువ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. ఎండలో బయటకు వెళ్లే వారు దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. మండలం గరిష్ట ఉష్ణోగ్రత వెల్దండ 42.9 కల్వకుర్తి 41.4 లింగాల 41.4 పెంట్లవెల్లి 41.0 ఊర్కొండ 40.7 పెద్దకొత్తపల్లి 40.6 కొల్లాపూర్ 40.2 బల్మూర్ 40.1 తిమ్మాజిపేట 39.9 ఉప్పునుంతల 39.7 నాగర్కర్నూల్ 39.7 బిజినేపల్లి 39.7 వంగూర్ 39.6 తాడూరు 39.5 వృద్ధులు, చిన్నారులు జాగ్రత్త.. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులతో పాటు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. మధ్యా హ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దు. దాహం లేకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి నీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. – డా.రాజేశ్గౌడ్, పిల్లల వైద్యనిపుణులు, నాగర్కర్నూల్ జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి మధ్యాహ్నవేళ బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం ఇబ్బందులు పడుతున్న కూలీలు, వీధి వ్యాపారులు మరో మూడు రోజుల్లో 43 డిగ్రీలకు మించనున్న ఉష్ణోగ్రతలు జిల్లాలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల్లో).. -
మక్కల కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వం
● రెండు, మూడు రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం ● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటివ్ కందనూలు: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి ఆయన పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం తూకం విధానం, నాణ్యతా ప్రమాణాలు, నిల్వ ఏర్పాట్లు, రవాణా సదుపాయాలపై అధికారులతో ఆరా తీశారు. అదే విధంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ధాన్యం అమ్మకంలో ఆలస్యం, తూకం ప్రక్రియలో పారదర్శకత, చెల్లింపుల జాప్యం వంటి అంశాలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రెండు, మూడు రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు తమ పంటను మార్కెట్యార్డుకు తీసుకొచ్చిన వెంటనే తూకం ప్రక్రియ పూర్తి చేయాలని, అనవసర ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. అదే విధంగా రైతులకు చెల్లింపులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అమరేందర్ మార్క్ఫెడ్ డీఎం తమీనా, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, ఆర్డీఓ సురేశ్బాబు ఉన్నారు. పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సర్పంచ్, వార్డు సభ్యుడు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తరచుగా సందర్శించి.. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్కుమార్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఎంఈఓ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలి
వీపనగండ్ల: సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని బొల్లారం గ్రామంలో భూ సేకరణపై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల విలువ కంటే మూడింతల ధరను భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా చెల్లిస్తామని.. అందుకు అవసరమైన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే వీపనగండ్ల, చిన్నంబావి, కోడేరు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ప్రభుత్వ భూములున్న రైతులకు కూడా పూర్తిస్థాయి పరిహారం అందిస్తామని తెలిపారు. భూ సేకరణ సత్వరమే పూర్తిచేసి సాగునీరు అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో జిల్లా భూ సేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, సర్పంచ్లు సుదర్శన్రెడ్డి, రామన్గౌడ్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, చిన్నారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 1, 5 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జిల్లావాసులై, వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు మించరాదన్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. అదే విధంగా హైదరాబాద్లోని బేగంపేట, రామంతాపూర్ పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 2019 జూన్ 1 నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 98485 28161 నంబర్ను సంప్రదించాలని కోరారు. ● హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి ప్రవేశానికి జిల్లాలోని గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఫిరంగి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు 2019 జూన్ 1నుంచి 2020 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోగా జిల్లా గిరిజనాభివృద్ధిశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 22న లాటరీ పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకోండి మన్ననూర్: స్థానిక ఐటీఐ/ఏటీసీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం పలు కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 8వ తేదీలోగా http://iti.telanga na.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 85004 61013, 85004 61022 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ప్రశాంతంగా పాలిసెట్ కందనూలు: జిల్లాలో బుధవారం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 2,912 మంది విద్యార్థులకు గాను 2,727 మంది హాజరయ్యారు. మరో 185 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్మోహన్ తెలిపారు. 93.64 హాజరుశాతం నమోదైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు కొల్లాపూర్: జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు మిషన్ భగీరథ సీఈ లలిత, ఎస్ఈ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు బుధవారం కొల్లాపూర్ పట్టణంలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ షేక్ రహీంపాషా సమీక్షించారు. అనంతరం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ పంప్హౌజ్ను పరిశీలించారు. నీటినిల్వ, పంపింగ్కు సంబంధించిన అంశాలపై చర్చించారు. వేసవి ముగిసే వరకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. వారి వెంట ఈఈ సుధాకర్సింగ్ తదితరులు ఉన్నారు. నిలకడగా ఉల్లి ధరలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు. -
పైసలిస్తేనే పని..
ప్రభుత్వ కార్యాలయాల్లో పలుచోట్ల లంచావతారులు ● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు ● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు ● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కిన వైనం సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. చేయి తడిపితేనే పని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వంగూరు లైన్మెన్ నాగేందర్(ఫైల్) సమాచారం ఇస్తే తక్షణమే స్పందిస్తున్నాం.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. – సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్నగర్ -
ప్రతి అంశంలో పారదర్శకత ఉండాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: బాధితులకు సకాలంలో న్యాయం జరిగే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన బాధ్యత అని.. జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పెండింగ్ కేసులు లేకుండా వేగంగా విచారణ జరపాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ మోసాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, డయల్ 100, సీసీ కెమెరాల నిర్వహణ, ప్రజా ఫిర్యాదులపై స్పందన, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రీఫండ్, చోరీ కేసులు, మర్డర్, అనుమానాస్పద మృతి కేసుల్లో దర్యాప్తు పురోగతి మొదలైన అంశాలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, సీఐలు ఉన్నారు. -
అన్ని శాఖల్లోనూ ఇదే తీరు..
ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
గడువులోగా జనగణన పూర్తిచేయండి
అమ్రాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి.. గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర గణాంకాధికారి దయానంద్ సూచించారు. అమ్రాబాద్, పదర మండలాల్లో బుధవారం చేపట్టిన ఇళ్ల లెక్కింపు సర్వేను రాష్ట్ర అదనపు డైరెక్టర్ అర్థనారిస్వామి, ఎస్ఓ నర్సింహస్వామి, ఎంపీఎస్ఓ ఆంజనేయులుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల లెక్కింపు సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ప్రతి ఇంటికెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. జనగణన నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్లు వెంకటేశ్వర్రెడ్డి, సురేశ్బాబు, ఆర్ఐ కృష్ణ ఉన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీకి 125మంది గైర్హాజరు
కందనూలు: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో తెలుగు పరీక్ష నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 1,065 మందికి గాను 965 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 909 మందికి గాను 828 మంది, ఒకేషనల్ విభాగంలో 156 మందికి గాను 137 మంది హాజరై పరీక్ష రాశారు. అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 266 మందికి గాను 241 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 223 మందికి గాను 204 మంది, ఒకేషనల్ విభాగంలో 43 మందికి గాను 37 మంది హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 100 మంది, ద్వితీయ సంవత్సరంలో 25 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. -
రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ (పీఎంఓ) నోడల్ అధికారి రఘు అన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన కేవలం గణాంకాలు, లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా.. రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, నేల ఆరోగ్య సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, కొండేరు, జింకలపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి.. రైతుల చేపల చెరువులను పరిశీలించారు. బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్పామ్ నర్సరీని సందర్శించి, జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం, రైతులకు లభిస్తున్న ఆదాయం వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా కొండేరు శివారులో సాగుచేసిన కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంత మౌలిక వసతులు, తదితర విషయాలపై రైతులతో ఆరా తీశారు. కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీకాంత్, డీఏఓ వీరప్ప, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్, ఆయిల్ఫెడ్ ఏడీఏ శివనాగిరెడ్డి, డివిజినల్ ఉద్యానశాఖ అధికారులు రాజశేఖర్, ఇమ్రానా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
కొల్లాపూర్: ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల సౌకర్యార్థం హైదరాబాద్కు చెందిన గుడ్ యూనివర్స్, ఆర్సేసియం సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఈవీ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. కొద్ది దూరం వాహనాన్ని స్వయంగా నడిపారు. అంతకు ముందు వైద్యసిబ్బందితో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అదే విధంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై మంత్రి ఆరా తీశారు. ● రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. కొల్లాపూర్లోని క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్న ఆయన.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో ధాన్యం కొనుగోళ్లను వివరించారు. మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్చైర్మన్ రహీంపాషా, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు అనుష్క, వంశీ పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
మొక్కజొన్న, వరి కొనుగోళ్లు వేగవంతం
● రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు ● కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కందనూలు: జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని.. ఇప్పటికే మొక్కజొన్న సేకరణ 60శాతం పూర్తిచేశామని, రానున్న పది రోజుల్లో 90శాతం పూర్తిచేస్తామని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వెల్లడించారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస మద్దతు ధరలతో పంట కొనుగోలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. జిల్లావ్యాప్తంగా 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందన్నారు. అయితే గోదాముల్లో నిల్వ, హమాలీల సమస్య కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. వాటిని అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రానున్న వారం, పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెప్పారు. మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి.. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు సకాలంలో తరలించేందుకు అవసరమైన హమాలీలను సమకూర్చడంతో పాటు రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా లారీలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పరీక్షలు, తూకం ప్రక్రియ, చెల్లింపుల వ్యవస్థ వంటి అంశాల్లోనూ పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
నాగర్కర్నూల్ క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని.. తద్వారా ఆపదలో ఉండే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు. తెలంగాణ నర్సింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపత్కాలంలో అవసరమైన రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్ సింధుజ, తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జానకీదేవి, కార్యదర్శి ఆనంద్, జనరల్ ఫిజీషియన్ ప్రొ.సూర్యనారాయణ, ఆర్ఎంఓలు డా.రవిశంకర్, డా.రోహిత్కుమార్, జిల్లా రెడ్క్రాస్ అధ్యక్షుడు సాయిబాబా పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కల్వకుర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ/ఏటీసీలలోని వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కల్వకుర్తి ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్వకుర్తిలోని ఏటీసీలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సోలార్ టెక్నీషియన్తో పాటు నూతన అడ్వాన్స్డ్ కోర్సులు మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, వర్చ్యూవల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్లలో మొదటి విడత సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పదో తరగతి మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు బోనఫైడ్, కుల ధ్రువపత్రం, ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఫోటోతో జూన్ 8వ తేదీలోగా https://iti.tela ngana.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.100 చెలించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఐటీఐ కళాశాలలో లేదా 85004 61186, 85004 61220, 86887 60187 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు వెల్దండ: పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు విజయలక్ష్మి, యం. పల్లవి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చెర్కూర్ గ్రామంలోని రైతువేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. సర్పంచ్ శ్రీనివాసులు, ఉపసర్పంచ్ కొండల్, ఏఈఓ ప్రసన్న, కార్యదర్శి హరిణి తదితరులు ఉన్నారు. స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హౌస్ వైరింగ్, బైక్ మెకానిక్ రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 99633 69361, 98481 42489లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం జడ్చర్ల: జడ్చర్లలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, హోం అప్లియెన్సెస్ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 35 ఏళ్లలోపు మైనార్టీ ముస్లిం యువతీ, యువకులు మాత్రమే ఆధార్, 10వ తరగతి సర్టిఫికెట్, రెండు ఫొటోలతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
మక్కల కొనుగొల్లు!
జిల్లాలో మొక్కజొన్న రైతులకు తప్పని తిప్పలు●కందనూలు: ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్లలో ఆలస్యంతో కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గన్నీబ్యాగులు, హమాలీలు, రవాణా కష్టాలతో అసలు మక్కలను అమ్ముకుంటామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. మక్కల కుప్పలతో కేంద్రాలు నిండిపోగా.. వాతావరణ మార్పులతో ఆందోళనకు గురవుతున్నారు. సాగు కష్టాలు దాటుకొని పండించిన పంటను విక్రయించడానికి తీసుకొస్తే.. నేడు, రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు సమస్య కొలిక్కి రాకపోవడంతో రైతులు చేసేదేమీ లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అకాల వర్షాలతో బెంబేలు.. ఓవైపు మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం.. మరోవైపు అకాల వర్షాలు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ విపరీతంగా కొట్టి.. సాయంత్రానికి మబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం జిల్లాకేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో మార్కెట్లో మక్కలు తడవడంతో పాటు కొంతమేర కొట్టుకుపోయాయి. తడిసిన మక్కలను రైతులు మళ్లీ ఎండబెట్టి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. తక్కువ ధరకు అమ్ముకున్నా.. నేను 70 క్వింటాళ్ల మక్కలను రూ. 1,750 ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నా. ఇంకా 50 క్వింటాళ్లు ఉన్నాయి. అవి కూడా వారికే అమ్ముతాను. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. ఇంటి వద్ద గొర్రెలు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లే వారు ఎవరు లేరు. చేసేదేమి లేక ప్రైవేటు వారికి అమ్ముకున్నాను. – మల్లేష్, రైతు దేశిటిక్యాల, నాగర్కర్నూల్ 15రోజులు అవుతుంది.. నేను ఐదెకరాల్లో మక్కలు వేశాను. 177 క్వింటాళ్లు తూకం వేసి సంచుల్లో నింపి 15 రోజులు అవుతుంది. అధికారులను అడిగితే లా రీలు వచ్చిన వెంటనే పంపిస్తామని అంటున్నారు. ఏ సమయంలో వర్షం పడుతుందోనని దిక్కుతోచని స్థితిలో ఉన్నా. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. – సుగుణయ్య, రైతు, బొందలపల్లి నాగర్కర్నూల్ రెండు, మూడు రోజుల్లో పూర్తిచేస్తాం.. ప్రస్తుతం మార్కెట్యార్డు కొనుగోలు కేంద్రంలో 60వేల బ్యాగులు ఉన్నాయి. జిల్లాలోని అన్ని గోదాములు నిండి ఉన్నాయి. దీంతో మార్కెట్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో షిప్టుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను పూర్తిచేస్తాం. – తహమీనా, జిల్లా మార్క్ఫెడ్ అధికారి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు దాటినా కొలిక్కిరాని వైనం రోజుల తరబడి పడిగాపులు వెంటాడుతున్న అకాల వర్షాలు చేసేది లేక ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు -
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు పూర్తి
● జిల్లాలో 18 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 6,557మంది విద్యార్థులు కందనూలు: జిల్లాలో బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,380 మంది, ద్వితీయ సంవత్సరం 1,727 మందితో కలిపి మొత్తం 6,557మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 18 మంది సీఎస్లు 18 మంది డీఓలను నియమించడంతో పాటు 1 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సకాలంలో చేరుకోవాలి.. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలని. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు. జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. – వెంకటరమణ, డీఐఈఓ -
సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేయాలి
అచ్చంపేట: 2002 ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుత ఓటర్లు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీఓ యాదగిరి కోరారు. మంగళవారం అచ్చంపేటలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్–2002లో భాగంగా అచ్చంపేట మున్సిపల్ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లు, స్పెషల్ టీం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకరించాలన్నారు. 2002 ఓటరు జాబితా ప్రకారం గుర్తించి మ్యాపింగ్ చేశామన్నారు. అచ్చంపేట తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ మురళి, డిప్యూటీ తహసీల్దార్లు బీష్వ, లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
ఆత్మబంధువులు
ఆస్పత్రుల్లో అభాగ్యులకు అండగా నిలుస్తున్న నర్సులు ● పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్లో 59, సెకండియర్లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్హెచ్ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. ● నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో కీలక విధుల నిర్వహణ నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా జడ్జి రమాకాంత్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని కోర్టు కార్యాలయంలో జిల్లా జడ్జిని కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందిచారు. అనంతరం జరిగిన సమావేశంలో న్యాయ వ్యవస్థ, జిల్లా అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో చేపట్టాల్సిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు వేగవంతమైన న్యాయసేవలు అందించడం, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాల్లో సమన్వయం పెంపొందించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో పరస్పర సహకారం వంటి అంశాలు చర్చించారు. ఫిర్యాదులు వేగంగాపరిష్కరించాలి కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణిలో 39 దరఖాస్తులు వచ్చాయని, వీటిని వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 6 అర్జీలు నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రయేమం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఎస్పీ 6 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 1 భూమి పంచాయతీ, 5 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు. పాలిసెట్కుపక్కాగా ఏర్పాట్లు కందనూలు: జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే పాలిసెట్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పాలిసెట్ జిల్లా కన్వీనర్ మదన్మోహన్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సీఎస్, డీఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,911 మంది విద్యార్థులు పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్ష కేంద్రాలను జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా సులభంగా గుర్తించి పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చన్నారు. ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నె ల 16, 18 కౌన్సెలింగ్ నిర్వహించిన భర్తీ చేస్తా మన్నారు. ధర్మాపూర్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్లో కౌన్సెలింగ్ ఉంటుందని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312 సంప్రదించాలని సూచించారు. -
స్పందన అంతంతే..
మున్సిపాలిటీలకు కలిసిరాని ‘ఎర్లీబర్డ్’ స్కీం ● జిల్లాలో రాయితీపై కరువైన ప్రచారం ● ఆసక్తిచూపని పట్టణవాసులు.. ముగిసిన గడువు ● ముందస్తుగా చెల్లించింది రూ.3.66 కోట్లే ............. బకాయిలు పేరుకుపోకుండా.. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోకుండా ఉండటంతోపాటు ఆదాయం సమకూర్చుకునేలా ప్రభుత్వం ముందస్తు పన్ను వసూళ్ల కోసం ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించింది. గత నెల 1 నుంచి 30 వరకు పన్ను చెల్లింపునకు గడువు విధించింది. మున్సిపల్ అధికారులు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు వసూలు కోసం 6 ప్రత్యేక బృందాలు (బిల్ కలెక్టర్, అసిస్టెంట్ బిల్ కలెక్టర్) ఏర్పాటు చేశారు. వీరితోపాటు మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు స్వయంగా రంగంలోకి దిగి పలువురు వ్యాపారులకు అవగాహన కల్పించారు. వీరు ఉదయం, సాయంత్రం తమకు కేటాయించిన వార్డుల్లో తిరుగుతూ పన్నుల వసూళ్లకు యత్నించగా.. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో రూ.3.66 కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోల్చితే కేవలం రూ.5 లక్షలు మాత్రమే అదనంగా వచ్చాయి. అచ్చంపేట: మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుపై ఇచ్చిన రాయితీకి ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్శాఖ ముందస్తుగా పన్ను డిమాండ్ చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వర్తింపజేసింది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పాత బకాయిలు లేని వారిని ఈ రాయితీకి అర్హులుగా ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేసిన ఈ స్కీం గడువు అదే 30తో ముగిసింది. ఏటా నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ స్కీం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుదారులు కొందరు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 6,888 అసెస్మెంట్లకు సంబంధించి యజమానులు పన్ను రూ.3.66 కోట్లు చెల్లించడంతో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరినట్లయింది. ఈ స్కీం గడువుపై క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రచారం లేకపోవడంతో పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతేడాది మున్సిపల్ కార్యాలయాలతోపాటు పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే మైక్తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. కానీ, ఈసారి అలాంటివి ఏమీ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కాలేదని తెలుస్తోంది. పట్టింపు లేని కారణంగానే.. -
రైతు శ్రేయస్సే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
● రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు ● సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూల్ క్రైం: రైతు కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాలో రైతులు, కొనుగోలుదారులు, రైస్మిల్లర్లు పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకుండా.. వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా చేపట్టేలా అందరూ సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మంత్రితోపాటు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాని అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వరి కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, రవాణా కాంట్రాక్టర్లు సమయానికి లారీలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి పంట వివరాలను ముందస్తుగానే నమోదు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణ గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, నిల్వల వద్ద ఆలస్యం జరగకుండా వేగంగా తరలించాలన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి మండలానికి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అందులో కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలను వెల్లడిస్తే వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాటిని పరిష్కరించేలా కృషిచేస్తారన్నారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని మంత్రి కలెక్టర్ను ఆదేశించారు. సమన్వయంతో ముందుకు.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు ఎక్కడైనా సమస్యలను ఎదుర్కొంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా, మొక్కజొన్న కొనుగోలు చేసి అందుకు అవసరమైన గోదాంలు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో పొద్దు తిరుగుడు పంట దిగుబడి ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గ పరిధిలో ఈ సీజన్లో 3 లక్షల మె.ట., మొక్కజొన్న దిగుబడి వచ్చిందన్నారు. కొనుగోలు ప్రక్రియ ముందుగానే మంత్రి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి రైతులకు మేలు జరిగేలా చేయడం సంతోషంగా ఉందన్నారు. -
ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం
మహబూబ్నగర్ క్రైం: పాలకొండ బైపాస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్ రైడర్ అతివేగం వల్ల రెండు నగరంలో రెండు కుటుంబాల్లో తీవ్ర విషా దం నింపింది. న్యూ ప్రేమ్నగర్కు చెందిన మహ్మద్ బాసిద్ భార్య సారాబేగం ఇద్దరు పిల్లలతో పాటు రబియా మజీద్ ఏరియాకు చెందిన సారాబేగం తల్లి గౌసియా బేగం ఆమె కొడలు రేష్మా ఖాతూమ్, ఇద్దరు మనవలతో కలిసి యూబీ గార్డెన్లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ రెండు కుటుంబాలు శుభకార్యం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో బైకర్ రూపంలో వచ్చిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ప్రేమ్నగర్తో పాటు రబియా మజీద్ ఏరియా(మర్లు)లో తీవ్ర విషాదం నింపింది. అటు మహ్మద్ బాసిద్ కుటుంబంలో బాసిత్తో పాటు అతని ఏడేళ్ల కొడుకు మహ్మద్ జైద్ గాయపడ్డారు. భార్య సారా బేగం(30), కొడుకు హుజేఫా(9) మృతి చెందారు. ఇటు గౌషియా బేగం, ఆమె కొడలు రేష్మా ఖాతూ మ్, నాలుగేళ్ల మనవడు మహ్మద్ జమాద్ద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండేళ్ల మనవడు మహ్మద్ హమ్మర్ మృతి చెందాడు. ఇటీవల దుబాయ్ వెళ్లిన హమ్మర్ తండ్రి మహ్మద్ ఇమ్రాన్ వెంటనే ఇండియాకు బయల్దేరాడు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సోమవారం జనరల్ ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. ఇద్దరూ స్నేహితులే.. ఈ ఘటనలో మృతి చెందిన బైకర్లు హైదరాబాద్లోని చార్మినార్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఒవైజ్(30), మెహదీపట్నంకు చెందిన ఎండీ యాకూబ్ అబ్జల్(26) ఇద్దరూ స్నేహితులే. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లోని మెట్రో ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి మరికొంతమంది స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ బైక్లపై మహబూబ్నగర్కు వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్ రిజిస్ట్రేషన్ మాత్రం హర్యాన పాసింగ్ ఉండటం విశేషం. వీరితో పాటు వచ్చిన ఇతర బైకర్లు ఎవరు? ప్రమాదం జరిగిన తర్వాత వారు ఎటూ వెళ్లారు అనేది మహబూబ్నగర్ పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన తీరుతో పాటు ఇతర అంశాలను అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీసీఎస్ సీఐ కృష్ణ, రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ పర్యవేక్షించి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. బైపాస్పై రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ప్రేమ్నగర్, రబియా మజీద్ ఏరియాలో విషాదం -
ఇంటింటికి వెళ్లి.. జనగణన
అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన కోసం ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జనగణనలో భాగంగా మొదటి విడత ఇళ్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుండగా.. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ లకు వెళ్లి ఇళ్లను లెక్కించనున్నారు. నెలరోజులపా టు కొనసాగనున్న ఈ ప్రక్రియ ఆధారంగా 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు ప్రకటించనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సెల్ప్ ఎన్యుమరేషన్కు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. జిల్లాలో 4,636 మంది తమ వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ప్రజలకు స్వీయ గణనపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు దీనిని వినియోగించుకోలేదని తెలుస్తోంది. రెండు దశల్లో ప్రక్రియ.. జనగణన–2027 కోసం జిల్లా యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదట ఇళ్ల లెక్కింపు, తర్వాత జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. రెండు దశల్లో జరగనున్న జనగణన కోసం ఇప్పటికే 1,567 ఎన్యుమరేటర్లు, 274 మంది సూపర్వైజర్లకు శిక్షణ పూర్తయ్యింది. వీరు సోమవారం నుంచి జూన్ 9 వరకు వారికి కేటాయించిన ప్రదేశాల్లో స్వీయ గణన చేసుకొని గృహాల గుర్తింపు చేయనున్నారు. మొదట ఎన్యుమరేటర్లు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ), కుటుంబాల వివరాలను 30 రోజుల్లో సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి 150 నుంచి 200 నివాసాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున నియమించారు. ఇప్పటికే బీఎల్ఓలు బ్లాకులుగా విభజించి మ్యాపింగ్ తయారు చేశారు. ఇళ్లు, కట్టడాలతోపాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ● రెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. జననాలను మార్చి ఒకటి నుంచి కటాఫ్గా తీసుకుని నమోదు చేయనున్నారు. 34 అంశాలతో కూడిన ప్రశ్నావళిని ఎన్యుమరేటర్లు జిల్లాలో ప్రతి ఇంటి నుంచి వివరాలు తీసుకోనున్నారు. ఇంటి రకం నుంచి మొదలు సౌకర్యాలు, సామాజిక స్థితి ప్రతిబింబించేలా పలు ప్రశ్నలతో కూడిన అంశాలను అడిగి నమోదు చేస్తారు. 2011 లెక్కల ఆధారంగా.. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో చేపట్టిన జనాభా లెక్కలే ఇప్పటికీ జిల్లా జనాభాకు ప్రామాణికంగా మారాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతోనూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ– రాజకీయ కుల సర్వే (ఎస్ఈఈఈపీసీ– 2024) చేపట్టింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశాభివృద్ధి, లోటుపాట్లపై ప్రణాళికలు రూపొందించాలంటే జనాభా స్పష్టత ఉండాలి. అలాగే ఆయా వర్గాల్లో అర్హులకు ప్రయోజనాలు దక్కాలన్నా ఈ జనాభా వివరాలే కీలకం కానుంది. జిల్లా విస్తీర్ణం 7,447.42 చ.కి.మీ., మండలాలు 20 గ్రామ పంచాయతీలు 461 రెవెన్యూ గ్రామాలు 339 మున్సిపాలిటీలు 4 జనాభా 8,61,766 నివాస గృహాలు 1,96,261 సాగుదారులు 1,49,066 వ్యవసాయ కూలీలు 1,55,713 మొత్తం బ్లాక్లు 1,724 ఎన్యుమరేటర్లు 1,567 సూపర్వైజర్లు 274 టోల్ ఫ్రీ నంబరు 1855 నేటినుంచి సమగ్ర జనాభా లెక్కల నమోదు ముగిసిన సెల్ప్ ఎన్యుమరేషన్.. 4,636 మంది నమోదు జిల్లాలో హౌస్లిస్టింగ్ సెన్సస్కు సర్వం సిద్ధం జిల్లా వివరాలు ఇలా.. -
సర్కారు బడికి వెళ్లేలా..!
అచ్చంపేట: జిల్లాలో పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మౌలిక వసతులపై దృష్టిసారించిన యంత్రాంగం కార్పొరేట్ స్థాయి పాఠశాలల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బడుల పునఃప్రారంభానికి ముందుగానే సర్వం సిద్ధం చేస్తోంది. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు ‘విద్యా వారోత్సవాలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 2026– 27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల పెంపుపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తూ.. ప్రతి పాఠశాలకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించింది. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించేందుకు విద్యాశాఖతో కలిసి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టాలని, బోధనలో నాణ్యత, పాఠశాలలో వసతులు, పరిశుభ్రత, డిజిటల్ క్లాస్రూంల ఏర్పాటు, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు లక్ష్యంగా వారం రోజులపాటు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా ప్రజలకు వివరించి ప్రతి పాఠశాల నిర్ధేశిత లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని ఎంఈఓలు, హెచ్ఎంలను ఆదేశించింది. సర్పంచ్లతో విద్యాభివృద్ధికి చర్యలు.. 13న నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించనున్నారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. బడిబాటతో చైతన్యం.. 14న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించనున్నారు. గ్రామాలు, వార్డుల్లో ర్యాలీలు చేపట్టి విద్యపై అవగాహన కల్పించనున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, మధ్యాహ్న భోజన కార్మికులకు వంట పోటీలు నిర్వహిస్తారు. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయనున్నారు. గ్రంథాలయాలపై అవగాహన 15న గ్రంథాలయ దినోత్సవం నిర్వహించనున్నారు. ‘గ్రంథాలయాలు– జ్ఞాన హృదయం’ నినాదంతో పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా ఉత్తమ పాఠకులకు గుర్తింపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. సాంస్కృతిక సందడి.. 16న కళా వైభవం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దినోత్సవం నిర్వహించనున్నారు. జవహర్ బాలభవన్, పీఎంశ్రీ పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. కోలాటం, తోలు బొమ్మలాట, పేరిణి శివతాండవం, ఒగ్గు కథ వంటి జానపద కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి. రాష్ట్రస్థాయి ప్రదర్శన కోసం ఉత్తమ చిత్రపటాలు, శిల్పాలను ఎంపిక చేయనున్నారు. శిథిల భవనాలపై.. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను గుర్తించనున్నారు. వాటిని ఇక విద్యా కార్యకలాపాలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం వాటిని కూల్చివేయడం, వేలం వేసి ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు చర్యలు చేపడుతారు. జిల్లాలో నేటినుంచి విద్యా వారోత్సవాలు 99 రోజుల ప్రణాళికలో ప్రత్యేక కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభ వికాసం, పాఠశాలల అభివృద్ధే లక్ష్యం ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం పునఃప్రారంభానికి ముందే సర్వం సిద్ధం చేసేలా చర్యలు 17న విద్యా విజయోత్సవం నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో జిల్లాస్థాయి లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యా ర్థులకు రూ.10 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. విద్యలో అ త్యుత్తమ ప్రతిభ వేడుకగా జరుపుకోవడం అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం పునాది దినోత్సవం జరపనున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించడంతోపాటు ఇంకా ప్రారంభం కాని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేరోజు పీఎంశ్రీ బడుల్లో వేసవి శిబిరాలు ప్రారంభించనున్నారు. కోడింగ్, ఆర్ట్స్, యోగా, క్రీడల వంటి విభాగాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 103 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఈ నెల 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రెమెడియల్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. నాగర్కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులకు నాగర్కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాల, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల విద్యార్థుల కోసం కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అదేరోజు ఇంటర్మీడియట్ రెమెడియల్ క్యాంపుల ముగింపు చేపట్టనున్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు..
జిల్లాలో సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేయనున్నారు. ఒక్కో బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ను నియమించాం. ప్రతిరోజు ఎన్యుమరేటర్ సేకరించే సమాచారం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. 6 నుంచి 7 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటారు. జనగణన సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలాల్లో తహసీల్దార్, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు చార్ట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ ● -
అభివృద్ధి వైపు.. పీయూ
యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పలు అభివృద్ధి పనులకు అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ అంతర్గత నిధులు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతంగా ఏకంగా రూ.113.63 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పలు నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పలు భవనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజినీరింగ్ కళాశాలల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో పీయూ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తుండటంతో విద్యార్థులకు వసతి సమస్య తీరనుంది. దక్షిణ తెలంగాణకు రీసెర్చ్ హబ్గా.. పీఎం ఉషా స్కీం ద్వారా రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని రూ.13.50 కోట్లతో నిర్మించారు. ఇది దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద రీసెర్చి హబ్గా అవతరించనుంది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. దీని ద్వారా పీయూలోని అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కో రీసెర్చ్ ల్యాబ్ను కేటాయించనున్నారు. ముఖ్యంగా సైన్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉషా స్కీం నుంచి రూ.కోట్లు వెచ్చించి మైక్రోస్కోప్, స్పెక్రోస్కోప్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలుకు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచారు. పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇలా.. నిధులు (రూ.కోట్లలో..) బాలుర హాస్టల్ 12.50 రీసెర్చి ఫెసిలిటీ భవనం 13.50ఎస్టీ బాలుర హాస్టల్ 10 బాలికల హాస్టల్ 12.50 ఎస్టీ బాలికల హాస్టల్ 10ఇంజినీరింగ్ కళాశాల 35 సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 సింథటిక్ ట్రాక్లో టైల్స్వర్స్ 0.53సింథటిక్ ట్రాక్ గ్యాలరీ 4.60 పీయూలో సాధారణ భవనాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీయూలో హాస్టళ్లు, ఆఫీస్ల నుంచి వృథాగా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో ఫిల్టర్ చేసి తిరిగి వినియోగించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి ఎద్దడి, డ్రెయినేజీ సమస్య కూడా తీరనుంది. న్యాక్ గ్రేడింగ్లో కూడా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఏకై క సింథటిక్ ట్రాక్ పీయూలో మాత్రమే అందుబాటులో ఉండగా దానికి గ్యాలరీ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. దీని నిర్మాణం కోసం అధికారులు రూ.4.60 కోట్లు వెచ్చించారు. శరవేగంగా నూతన భవనాల నిర్మాణాలు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రీసెర్చ్ ఫెసిలిటీ భవనం సీవేజ్ వాటర్ ట్రీట్మెట్ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ ప్రారంభమైన లా, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వార్ల వెంకటయ్య అన్నారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు సరిగా జరపడం లేదన్నారు. రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష ఎకరాలకు పైగా సాగైన మొక్కజొన్న సగానికి పైగా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. దళారులు, కమీషన్ ఏజెంట్లు మార్కెట్ అధికారులతో కుమ్మకై ్క రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పరశురాములు, అశోక్, తిరుపతయ్య, చంద్రయ్య పాల్గొన్నారు. -
ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
గద్వాల: మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
గొంతెండుతోంది!
జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో తాగునీటికి కటకట ● మున్సిపాలిటీ శివారు కాలనీలకు పక్షం రోజులకోసారి సరఫరా ● నల్లా కనెక్షన్ ఉన్నా.. అందని మిషన్ భగీరథ నీరు ● పైప్లైన్ లీకేజీలను సైతం అరికట్టని వైనం ● వేసవిలోనూ కనిపించని ప్రత్యామ్నాయ చర్యలు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట ఏర్పడుతోంది. వేసవికి ముందే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. వేసవిలో పలుచోట్ల ప్రైవేటు బోర్లు అడుగంటడం, మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తాగడానికి, ఇతర అవసరాలకు నీరు సరిపోక జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకేంద్రంలో వారానికోసారి నీరు.. వేసవిలో నీటి ఎద్దడి కారణంగా జిల్లాకేంద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, సగానికి మించి కాలనీల్లో సరఫరా సవ్యంగా సాగడం లేదు. ప్రధానంగా దత్తాత్రేయకాలనీ, బీసీ కాలనీ, శ్రీపురం రోడ్డు, హౌసింగ్బోర్డు కాలనీ, ఈశ్వర్ కాలనీల్లో భగీరథ నీరు రావడం లేదు. మిగతా చోట్ల వారం రోజులకు ఒకసారి, శివారు కాలనీలకు పక్షంరోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. మరమ్మతు కరువు.. జిల్లాకేంద్రంతోపాటు మిగతా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. రోజుల తరబడి తాగునీరు వృథాగా పారుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. గతంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ, మరమ్మతు సంబంధిత అధికారులే నిర్వర్తించేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో మరమ్మతు చేపట్టాలంటే అధికారులు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టాల్సి వస్తుండటంతో ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఎగువ ప్రాంతాలకు నీటి సరఫరా అందడం లేదు. -
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్కై నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్నగర్ -
అటకెక్కిన ఈ–పాలన
అచ్చంపేట రూరల్: పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీకి శ్రీకారం చుట్టింది. పంచాయతీల ద్వారా పౌర సేవలు అందించాలని 2015లో కంప్యూటర్లను పంపిణీ చేయగా.. ప్రస్తుతం వృథాగా మారాయి. టీఫైబర్ ద్వారా పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినా.. పర్యవేక్షణ కొరవడి లక్ష్యం నీరుగారుతోంది. ఫలితంగా ప్రజలకు సేవలు అందని పరిస్థితి నెలకొంది. మండల కార్యాలయానికే పరుగులు.. పంచాయతీ భవనాలకు తెలంగాణ ఫైబర్ నెట్ సంస్థ ఓఎఫ్సీ, బీఎస్ఎన్ఎల్ లైన్ వేసి నెట్ సదుపాయం కల్పించింది. సర్వర్ ప్యానల్ బాక్సులు, సోలార్ ఎనర్జీ పాయింట్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవి పని చేయకపోవడంతో ప్రజలు ఏ చిన్న పని కోసమైనా మండల కార్యాలయాలకే పరుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. జనన, మరణ ధ్రువపత్రాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. మృతిచెందిన వారి ధ్రువీకరణపత్రాల కోసం కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో వీటిని పొందేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేటర్లు లేక.. జిల్లావ్యాప్తంగా 460 గ్రామాలు ఉండగా.. అన్నిచోట్ల ఈ–పంచాయతీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ తదితర సామగ్రిని పంపిణీ చేసినా.. ఆపరేటర్లను నియమించకపోవడంతో అవి పని చేయడం లేదు. జనన, మరణ ధ్రువపత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీ, వసూలు చేసిన ఆస్తి పన్నుల రసీదులు, అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధుల వ్యయం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్ సదుపాయం లేక కార్యదర్శులే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అప్లోడ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో 51 మంది ఆపరేటర్లు పని చేస్తున్నారు. గతంలో మంజూరైన కంప్యూటర్లతోనే కాలం గడుపుతున్నారు. మొరాయిస్తే వాటినే రిపేర్లు చేసి నడిపిస్తున్నారు. అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం పల్లె ప్రజలకు పౌర సేవలు దూరం పంచాయతీల్లో ప్రజలకు తప్పని తిప్పలు జిల్లాలోని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 460 గ్రామాలు ఈ–పంచాయతీలుగానే ఉన్నా యి. జనన, మరణ ధ్రువపత్రాల కోసం లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. మండల కేంద్రాల్లో వాటిని పొందుతున్నారు. ఆయా మండల కేంద్రాల్లో 51 మంది ఆపరేటర్లు అందుబాటులో ఉన్నారు. – శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి -
సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్
ప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
ప్రధాని బహిరంగ సభకు తరలిరండి
నాగర్కర్నూల్ క్రైం: ఈ నెల 10న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అగ్ర నాయకత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని వివరించారు. ఇందులో భాగంగానే చేపడుతున్న ప్రధాని బహిరంగ సభకు జిల్లా నుంచి 125 బస్సుల్లో కార్యకర్తలు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రగౌడ్, నాయకులు తిరపతయ్య, చంద్రకళ, చందు పాల్గొన్నారు. -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్కర్నూల్ -
అమ్మనే ఆదర్శం..
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్కర్నూల్/ పాలమూరు/గద్వాల ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. నేడు మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. -
తపాలాశాఖలో సీబీఐ కలకలం
● తోటి ఉద్యోగుల నుంచి లంచం ఆశించిన పోస్టల్ ఇన్స్పెక్టర్ ● సుదీర్ఘ విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న అధికారులు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న గోపీనాథ్ తోటి ఉద్యోగుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 7 వరకు అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్లకు అదనపు విధులు కేటాయిస్తారు. ఇందుకుగాను అదనంగా డబ్బులు చెల్లిస్తారు. 2023 నుంచి 2026 వరకు అదనపు విధుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో మంజూరుకు పోస్టల్ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరికి వచ్చే డబ్బుల నుంచి కొంత శాతం తనకు చెల్లించాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కొందరు బీపీఎం, ఏబీపీఎం, డాక్సేవక్లు చెల్లించగా.. ఒకరిద్దరు సీబీఐ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కార్యాలయానికి సీబీఐ అధికారులు చేరుకోగా.. విషయం తెలుసుకున్న గోపీనాథ్ పరారయ్యారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సెల్ఫోన్ ట్రేసింగ్ ద్వారా గుర్తించిన సీబీఐ అధికారులు పట్టుకొని పోస్టల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, కార్యాలయ ట్రెజరీలో కొంత నగదుకు సంబంధించి లెక్కలు చూపడంలో విఫలం కావడంతో గురువారం రాత్రంతా అక్కడే ఉంచారు. విధులు ముగించుకొని ఇంటికెళ్లిన మిగతా ఉద్యోగులను రాత్రి 10.30 గంటలకు కార్యాలయానికి పిలిపించి బీపీఎంలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో జాప్యం, కార్యాలయ ట్రెజరీలో అదనంగా నిల్వ ఉన్న డబ్బులపై ఆరా తీసినట్లు తెలిసింది. అన్ని వివరాలను లిఖితపూర్వకంగా ధ్రువీకరించుకొని నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 వరకు కార్యాలయంలోనే ఉండి సుదీర్ఘ విచారణ అనంతరం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి వనపర్తి ప్రధాన పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న అంగీకరించారు. -
రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
కల్వకుర్తి రూరల్: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్లను ప్రారంభించామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. తమది రైతు ప్రభుత్వమని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధ ం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ యాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ షానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాంత్రెడ్డి, కౌన్సిలర్ రాజు పాల్గొన్నారు. పశుపోషణతో అదనపు ఆదాయం నారాయణపేట: పశుపోషణతో సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆదాయంతో పాటు జీవనోపాధి లభిస్తుందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డా. బి.సుబ్బారాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని పశువైద్యశాల, జిల్లా పశుసంవర్ధక అధికారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు, పశు సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు దూడల సంరక్షణలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస సాగుపై రైతులు దృష్టి సారించాలని, వేసవిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ కుటుంబ పోషణకు పాడి పరిశ్రమను కొనసాగించడం ఆదర్శనీయమని గుర్తుచేస్తూ అభినందించారు. జిల్లా పశు వైద్యాధికారి డా. బి.ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో చాలామంది గొర్రెల పెంపకం చేపడుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పాడిపశువుల పెంపకంపై ఆసక్తి కనబర్చాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాకేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. పాడి రైతులు, మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, పుర చైర్పర్సన్ కొండ శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ సత్యమ్మ, బీకేఎస్ నాయకులు వెంకోబ, విశ్వనాథ్రెడ్డి, అనంతరెడ్డి, పశు వైద్యాధికారులు డా. బి.వెంకటేశ్వర్లు, డా. అనిరుధ్ ఆచార్య, డా. రాఘవేందర్గౌడ్, డా. రోహిత, డా. శ్రీనివాస్, సిబ్బంది గోపాలమిత్రులు పాల్గొన్నారు. -
లాభాల పంట..!
జిల్లాలో పెరుగుతున్న ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం ● రైతుల అనుమానాలకు తెర ● గెలల అమ్మకానికి నియోజకవర్గ కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలు ● టన్నుకు రూ.23వేలకు పైగా ధర ● సాగుపై మరింత ఆసక్తి చూపుతున్న రైతులు –8లో u●మొదట్లో ఆయిల్పామ్ సాగుపై రైతులు పెద్దగా ఇష్టం చూపలేదు. ఇప్పుడు వారిలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు కారణం ఆయిల్పామ్ ధరలు స్థిరంగా ఉండటమే. చాలామంది రైతుల తోటల్లో పంట దిగుబడి ప్రారంభమైంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో కొనుగోలు కేంద్రం ఉంది. రైతులు అక్కడికి పంటను తీసుకొచ్చి మద్దతు ధర ప్రకారం అమ్ముకుంటున్నారు. ఇందులో దళారీ వ్యవస్థ లేదు. రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అవుతాయి. కొనుగోలు కేంద్రాన్ని మేమే పర్యవేక్షిస్తున్నాం. – లక్ష్మణ్, ఉద్యానశాఖ డివిజన్ అధికారి, కొల్లాపూర్ కొల్లాపూర్: ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకంగా మారుతోంది. పంటసాగు ప్రారంభించిన తొలినాళ్లలో ఆయిల్పామ్ దిగుబడి, కొనుగోలు అంశాలపై రైతులు కొంత కలవరపడ్డారు. అధికారులు చెప్పినట్లుగా లబ్ధి చేకూరుతుందో లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే ఇప్పుడు వారి అనుమానాలకు తెరదించుతూ ఆయిల్పామ్ పంట లాభాలు తెచ్చిపెడుతోంది. సాగుపై రైతుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. పంట దిగుబడి వచ్చాక విక్రయాలకు కూడా ఇబ్బందులు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రారంభమైన దిగుబడులు.. ఆయిల్పామ్ సాగు ప్రారంభంలో కేవలం 58 మంది రైతులు మాత్రమే ముందుకొచ్చారు. తొలి ఏడాది 221 ఎకరాల్లో పంటసాగు చేపట్టారు. నాలుగేళ్ల తర్వాత ఆయిల్పామ్ దిగుబడి ప్రారంభమైంది. పదేళ్లలోపు వయసు గల ఆయిల్పామ్ చెట్ల నుంచి ప్రతి సంవత్సరం 6 టన్నుల వరకు పంట వస్తుంది. ఆ తర్వాత ఏడాదికి 10 టన్నుల వరకు పంట చేతికందుతుంది. ఏడాదంతా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. నెలకోమారు గెలలు కత్తిరించాలి. డిమాండ్ ప్రకారం కొనుగోలు ధరల్లో కొంతమేరకు హెచ్చుతగ్గులు ఉంటాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. గతేడాది వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ఆయిల్పామ్ గెలల కొనుగోలు జరిగేది. ఈ ఏడాది నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ. 23వేలకు పైగా పలుకుతోంది. నాలుగేళ్ల క్రితం టన్ను ధర రూ. 12వేల వరకు స్థిరంగా ఉండేది. క్రమంగా ఆయిల్పామ్ పంటకు మద్దతు ధర పెరుగుతూ వస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఉద్యానశాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 2019–20 సంవత్సరం ఆయిల్పామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. పంటసాగు కోసం ప్రభుత్వం రాయితీలు అందించింది. నాలుగేళ్లు పైలెట్ ప్రాజెక్టుగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా సాగుకు సంబంధించిన రాయితీలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,158 మంది రైతులు 8,119 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేస్తున్నారు. -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
మైనర్ డ్రైవింగ్ కట్టడి కోసం ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు పెంచుతాం. మైనర్లకు వాహనాలు ఇస్తే సదరు వాహన యజమానిపై సెక్షన్ 180 ప్రకారం కేసు నమోదవుతుంది. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బైపాస్లపై రాత్రివేళ రాష్ డ్రైవింగ్లపై కూడా దృష్టిపెడుతాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మైనర్లు, చిన్నారులకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనెల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు 42 కేసులు నమోదు కాగా.. రూ.63 వేల జరిమానా విధించారు. గద్వాల జిల్లాలో కేసులు నమోదు కాలేదు. కానీ, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను మందలించారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 102 కేసులు నమోదు కాగా.. రూ.51 వేల జరిమానా విధించారు. వనపర్తి జిల్లాలో మైనర్ డ్రైవింగ్కు సంబంధించి 3 కేసులు నమోదు కాగా.. రూ.1,500 జరిమానా విధించారు. నాగర్కర్నూల్ జిల్లాలో 48 కేసులు నమోదు కాగా.. రూ.60 వేల జరిమానా విధించారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్లు రాష్గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవుల నేపథ్యంలో రోడ్లపై బైక్లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరులో రెండు బైపాస్ రోడ్లపై రేస్ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం పిల్లలు వాహనాలు నడుపుతూ రవాణా శాఖ, పోలీసులు తనిఖీలు చేసే సందర్భంలో పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చు. మోటారు వాహన చట్టం, పోలీస్ శాఖ న్యాయ సంబంధిత సెక్షన్స్ కింద కేసు పెడితే వాహన యజమానికి కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. బాలబాలికలు వాహనాలు నడిపిన సమయంలో ప్రమాదానికి గురైతే యజమానిపై కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. కోర్టులో నేరం రుజువు అయితే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. మైనర్లు వాహనాలు నడిపిన సందర్భంలో సెక్షన్–181 ఆఫ్ ఎంవీఐ యాక్ట్తోపాటు రూ.1,500 జరిమానా విధిస్తారు. -
‘మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం’
చిన్నంబావి: మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలకేంద్రంలో మొక్కజొన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షానికి పంట తడిసిందని.. గన్నీ బ్యాగుల కొరత ఉండటంతో బహిరంగ మార్కెట్లో రూ.40 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు రైతులు వివరించారు. వెంటనే ఆయన కలెక్టర్కు ఫోన్చేసి పరిస్థితి వివరించారు. తడిసిన పంటను సైతం కొనుగోలు చేయాలని, గన్నీ బ్యాగుల సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పాలనలో మొక్కజొన్న, పప్పుశనగలు, వరి ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని.. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా రైతు ప్రశాంతంగా ఉన్నది లేదని విమర్శించారు. మంత్రి జూపల్లి సొంత మండలంలోనే ఈ పరిస్థితి ఉందంటే.. జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిన్నంబావిలో పుప్పుశనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టకపోవడంలో ఆంతర్యమేమిటో మంత్రి రైతులకు వివరించాలని కోరారు. ఆయన వెంట చెల్లపాడు సర్పంచ్ పెద్దనర్సింహ, రంజిత్కుమార్, మహేశ్వర్రెడ్డి, డేగ శేఖర్, రామకృష్ణ, సంపంగి మద్దిలేటి, తగరం నర్సింహ, సుధాకర్, జేవీకే నాయుడు, మహిచంద్ర, బాలగౌడు తదితరులు ఉన్నారు. -
పూర్వ కలెక్టర్ సంతోష్కు ఆత్మీయ వీడ్కోలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కలెక్టర్గా రెండేళ్లపాటు సేవలందించి.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా బదిలీ అయిన బదావత్ సంతోష్కు శుక్రవారం వివిధ శాఖల అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆయనను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కలెక్టర్గా ఆయన పరిపాలనా దక్షత, ప్రజలపై చూపిన సేవాభావం, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. అనంతరం బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ జిల్లాలో పనిచేసిన కాలం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేశారని.. అందరి కృషితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. విద్య, వైద్యంపై అధికారుల చిత్తశుద్ధితోనే పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానానికి రావడం జరిగిందన్నారు. వైద్యసేవలను గ్రామీణ స్థాయిలో విస్తరించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీరు వంటి అంశాల్లో జిల్లా ముందంజలో నిలవడానికి ప్రతి శాఖ కృషి చేసిందన్నారు. జిల్లా ప్రజలు తనపై చూపిన ఆదరణ, ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. -
జనగణనపై ఎలాంటి అపోహ వద్దు
● ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా పాల్గొనాలి ● అదనపు కలెక్టర్ అమరేందర్ నాగర్కర్నూల్ క్రైం: జనగణనపై ఎలాంటి అపోహ అవసరంలేదని.. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేయించుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అమరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ముఖ్య ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన దేశాభివృద్ధికి పునాది వంటిదన్నారు. ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనగణనతో ప్రజల జీవన పరిస్థితులు, విద్య, ఉపాధి, గృహ వసతులు, సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ గణాంకాల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేస్తాయని చెప్పారు. జనగణన ద్వారా సేకరించిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుందని.. కేవలం ప్రభుత్వ ప్రణాళికల రూపకల్పన కోసమే ఉపయోగించబడుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి.. జనగణన విజయవంతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిణి సుజాత, డీఎంహెచ్ఓ డా.రవికుమార్, డీఈఓ రమేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. తలసేమియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం తలసేమియా రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ కోరారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశా మైదానం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం రక్త పరీక్ష ద్వారా తలసేమియాను గుర్తించవచ్చని తెలిపారు. వ్యాధి తీవ్రత మేరకు కొందరికి తరచుగా రక్తమార్పిడి అవసరం కూడా ఏర్పడుతుందన్నారు. తలసేమియా బాధితులు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవికుమార్, ప్రోగ్రాం అధికారి డా.కృష్ణమోహన్, డా.ప్రదీప్కుమార్, వైద్యాధికారి డా.వాణి, డా.సృజన పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలో ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 18 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,830 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,727 మంది పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, గాలి, వెలుతురు స్పష్టంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, డీఈఓ రమేశ్కుమార్ ఉన్నారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వం
● ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా చర్యలు ● ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తాం ● నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి కందనూలు: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి ఆయన జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్యార్డులో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీబ్యాగుల సేకరణ, ధాన్యం కాంటా, గోదాంలకు తరలింపు తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పంటలకు నిర్ణయించిన మద్దతు ధర పూర్తిస్థాయిలో ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ పంటను మార్కెట్యార్డుకు తీసుకొచ్చిన వెంటనే టోకెన్ల ఆధారంగా నమోదుచేసి.. ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ అన్నారు. అదే విధంగా రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తేమశాతం, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ.. కొనుగోళ్లు చేపడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో వ్యవహరించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే సిబ్బంది సంఖ్య పెంచి రైతులకు ఏ సమస్య లేకుండా ధాన్యం సేకరించాలని సూచించారు. విద్యతోనే సమాజాభివృద్ధి.. విద్యతోనే సమాజాబివృద్ధి సాధ్యమని ఎంపీ మల్లు రవి అన్నారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి బుధవారం జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సౌజన్యంతో కలెక్టరేట్ వద్ద నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని కుమ్మెర, పెద్దాపూర్, గన్యాగుల, మంతటి, గగ్గలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే 130 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువు కొనసాగించడంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో రవాణా సౌకర్యం ఒకటి అని అన్నారు. విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవాలనే ఆలోచనతో సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి కుర్మయ్య, జిందాల్ సంస్థ ప్రతినిధి రెడ్డి నాయక్, విద్యాశాఖ అధికారి వెంకట్శెట్టి పాల్గొన్నారు. -
‘రామన్పాడ్’ తగ్గుముఖం
● రిజర్వాయర్లో ఏడు మీటర్లు తగ్గిన నీటిమట్టం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలని వినతి అచ్చంపేట: టీజీ జెన్కోలో వెలువడిన బదిలీల ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ భూగర్భ కేంద్రం ఇంజినీర్లు బుధవారం కేంద్రం సీఈ కేవీవీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా ఉత్తర్వులలో పేర్కొన్న విధానాన్ని అమలు చేయాలని సీఈకి విన్నవించారు. పదేళ్లుగా జెన్కోలో పనిచేస్తున్న వారికి బదిలీలో ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏఈలు, ఏడీఈలు, డీఈలు ఉన్నారు. మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్ జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తా గునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్పాడు రిజర్వాయర్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్పాడు రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. రామన్పాడు రిజర్వాయర్లో ప్రస్తుత నీటిమట్టం శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
బహిరంగ సభను విజయవంతం చేయాలి
అచ్చంపేట: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవిష్యత్తు మార్చబోయే ఈ బహిరంగ సభ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోందన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు అమర్ నాధ్, సోలాంకి శ్రీనివాస్ నాయక్, మంగ్యానాయక్, రేణయ్య తదితరులు ఉన్నారు. -
ప్రజల భద్రతకు ప్రాధాన్యం..
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల భద్రత, సౌకర్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. రాబోయే రోజుల్లో మరిన్ని ముఖ్య కూడళ్ల వద్ద కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా మరిన్ని సదుపాయాలు ఏర్పాటుచేస్తామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరిస్తూ ప్రయాణించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్చైర్మన్ బాదం రమేశ్, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఎస్ఐలు గోవర్ధన్, కళ్యాణ్ పాల్గొన్నారు. -
ఎంతో ప్రయోజనం..
జిల్లాకేంద్రంలో కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారుల అవస్థలు తీరుతాయి. వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడపకుండా నెమ్మదిగా వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్తో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. – శివాచారి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేశాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను నడపాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – నోముల వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ ● -
మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కల్వకుర్తి రూరల్: మొక్కజొన్న ధాన్యం సేకరణ ప్రక్రియలో వేగం పెంచి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మొక్కజొన్న కొనుగోలు సందర్భంగా గోదాముల వద్ద రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై పలువురు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలోని మొక్కజొన్న గోదాంను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో సమస్యలను తెలుసుకున్నారు. గోదాంలో మొక్కజొన్న బస్తాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మొక్కజొన్న ధాన్యాన్ని గోదాంకు తరలించేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే.. వెంటనే జిల్లా అధికారులకు ఫోన్చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాంత్రెడ్డి, గోలి సురేందర్రెడ్డి, శ్రీపురం హరీశ్రెడ్డి, సీఐ నాగార్జున ఉన్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,328 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. ఽఅలాగే రైతులు 4,803 బస్తాల మొక్కజొన్న మార్కెట్కు వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్రకం క్వింటా గరిష్టంగా రూ.2,499, కనిష్టంగా రూ.1,601, వేరుశనగకు గరిష్టంగా రూ.7,762, కనిష్టంగా రూ.6,199, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,254,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,845, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.2,065, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,758గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
తీరనున్న ట్రాఫికర్!
జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు ● వాహనాల రద్దీ నియంత్రణకు పటిష్ట చర్యలు ● రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు ● ట్రాఫిక్ సిగ్నల్స్తో వాహనదారులకు తప్పనున్న వెతలు జిల్లా జనరల్ ఆస్పత్రి రోడ్డువైపు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ నాగర్కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలో రోజురోజుకూ వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్ నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ.. వాహనదారులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఊరట కలిగించేందుకు జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శ్రీపురం రోడ్డు చౌరస్తాలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను బుధవారం అందుబాటులోకి తీసుకురావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మరిన్ని.. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రస్తుతం శ్రీపురం చౌరస్తా, బస్టాండ్ వద్ద, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద సిగ్నల్స్ ఏర్పాటుచేశారు. వీటికి మరిన్ని బ్లింక్లర్స్ ఏర్పాటుచేస్తూ.. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అదే విధంగా రద్దీ ప్రాంతాల్లో మరిన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ.. జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్తో రోడ్డు ప్రమాదాలను కొంతమేర నివారించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా వాహనదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమయ్యేవారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం లాంటివి చేస్తుండేవారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కెమెరాల ఏర్పాటుతో ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో వాహనదారుల్లో కొంతమేర మార్పు వచ్చి రోడ్డు నిబంధనలు పాటించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం సరికాదని.. తూకం చేసిన వెంటనే రైస్మిల్లులకు తరలించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును పార్టీ నాయకుల బృందంతో కలిసి సందర్శించారు. ఐకేపీ, సింగిల్విండో ద్వారా కొనసాగుతున్న కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే పూర్తిచేసి తరలించాలని కోరారు. లారీల కొరతతో తూకం చేసిన ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందన్నారు. మిల్లు యజమానులు ధాన్యం దించుకునే సమయంలో సమస్యలు సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. తూకాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని.. రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్రెడ్డి, జీఎస్ గోపి, మండ్ల రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాల్యానాయక్, ఆంజనేయులు, ఆసీఫ్, కార్యదర్శి ఉమా తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను అమాంతం పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దన్ పర్వతాలు విమర్శించారు. తాజాగా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కట్టెలపొయ్యి ఏర్పాటుచేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతుండటంతో ప్రజల జీవన ప్రమాణాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. కమర్షియల్ వంటగ్యాస్ ధర ఏకంగా రూ.వెయ్యి పెంచి.. చిన్నచిన్న హోటళ్లు నడుపుకొని జీవిస్తున్న వారిపై పెనుభారం మోపడం సరైంది కాదన్నారు. దేశ ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యి వాడే స్థితికి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికై నా పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కందికొండ గీత, పొదిల రామయ్య, సత్యనారాయణ, మల్లిఖార్జున్, బంగారయ్య, లక్ష్మయ్య, ఖాజా, నర్సింహ, సిద్దూ, శిరీష, లక్ష్మి, పార్వతమ్మ పాల్గొన్నారు. -
‘నేతన్నకు పొదుపు’ జాడేది?
అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ -
సాంఘికశాస్త్రంతో సామాజిక అవగాహన
కందనూలు: సాంఘిక శాస్త్రంతో సామాజిక అవగాహన పెంపొందుతుందని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. మంగళవారం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల వేదిక, క్లాస్మెట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 100/100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఓ అద్దంలా సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుందన్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలో 100/100 మార్కులు సాధించడం కఠినంతో కూడిన విషయమని.. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని అన్నారు. సాంఘిక శాస్త్రంలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న క్లాస్మెట్ క్లబ్ సభ్యులతో పాటు, సోషల్ ఫోరం సభ్యులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేందర్, కృష్ణమోహన్, తీగల జనార్దన్, డా.ప్రపుల్చంద్రారెడ్డి, సౌజన్య కిషోర్ పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మన్ననూర్: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవికుమార్ సూచించారు. మంగళవారం మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని స్టోర్రూంలో నిల్వ ఉన్న మందులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పీహెచ్సీలో మధ్యాహ్నం తర్వాత సేవలు సక్రమంగా అందడం లేదనే సమాచారంపై ఆయన వివరణ అడిగారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి సమీపాన పీహెచ్సీ ఉన్నందున ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న ఆశ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆశావర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎంహెచ్ఓ వెంట డిప్యూటీ డీఈఎంఓ చారి, ఏపీఎంఓ మధుమోహన్, డా.సుధాకర్, లోక్యానాయక్ ఉన్నారు. -
ఆయిల్పాం సాగుతో దీర్ఘకాలిక ఆదాయం
అచ్చంపేట రూరల్: ఆయిల్పాం సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయిల్పాం సాగుతో కలిగే లాభాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కృషి ధన్ ధన్య యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రైతులు లాభసాటి పంటల సాగుపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, సిద్దప్ప, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీసంక్షేమ ఫలాలు
కందనూలు: ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బక్రీద్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి నాగర్కర్నూల్ క్రైం: రాబోయే బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో సీఐ అశోక్రెడ్డి ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ప్రతి అధికారి, ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టంచేశారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లోని వివిధ విభాగాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయం 10:38 గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని తనిఖీ చేయగా.. ఆ సమయానికి కూడా సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం, అప్పటికే వివిధ పనులపై పిటిషనర్లు, రిటైర్డ్ పెన్షనర్లు కార్యాలయంలో వేచి ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయానికి ప్రజలే ముందుగా వచ్చి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నించారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తంచేస్తూ.. సంబంధిత అధికారులను వివరణ కోరారు. అయితే ట్రెజరీ అధికారి సెలవులో ఉన్నారని తెలియజేయగా.. సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి లోపం ఉండకూడదని కలెక్టర్ స్పష్టంచేశారు. రోజు ఉదయం 10 గంటలలోగా ప్రతి అధికారి, సిబ్బంది కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి హాజరుకాని సిబ్బందిపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. బాధ్యతారహిత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సకాలంలో విధులకు హాజరుకాని ట్రెజరీశాఖ సిబ్బందిపై ఆగ్రహం ఈవీఎం గోదాం తనిఖీ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. అందులో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు తదితర ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీసీ నిఘా పెంచడంతో పాటు పరికరాల నిర్వహణ సకాలంలో చేపట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. -
పోలీసు సేవల్ని వినియోగించుకోండి
నాగర్కర్నూల్ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన 10 అర్జీలలో భూమికి సంబంధించి 5, తగు న్యాయం కోసం 5 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపించినట్లు చెప్పారు. -
62 రేడియల్ క్రస్టు గేట్లు
జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 రేడియల్ క్రస్టు గేట్లు ఉన్నాయి. ఇందులో 4, 8, 12, 19, 21, 25, 27, 31, 41, 45, 51 గేట్ల రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడినట్లు 20 19లోనే అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి మరమ్మతులపై ప్రతిపాదనలు పంపినా ప్ర భుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. మరమ్మత్తులు పూర్తిచేస్తాం.... జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ ● -
తైబజార్ పేరిట దోపిడీ
● ఉన్న రేటు కంటే మూడింతలు అధికంగా వసూళ్లు ● ఇదేమిటని అడిగితే బెదిరింపులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు కందనూలు: జిల్లాకేంద్రంలో మామిడి వ్యాపారులు, రైతుల వద్ద కొందరు తైబజారు పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు, రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న మామిడి రైతులను తైబజార్ పేరుతో దోపిడీ చేస్తున్నారని.. ఒక్కో గంప, ట్రేకు మున్సిపాలిటీ నిర్ణయించిన రేటు రూ.28 కాగా.. నిబంధనలు ఉల్లంఘించి ఒక్కొక్క గంప, ట్రేకు రూ.100 వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఉన్న రేటు కంటే మూడింతలు అధికంగా వసూలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించగా రేపటి నుంచి మీరు ఇక్కడ అమ్మడానికి వీలు లేదని బెదిరిస్తున్నారని, తీసుకున్న రుసుంకు రసీదు అడిగితే ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారని ఎందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడిగితే మున్సిపాలిటీ వాళ్లకు మేం కూడా ఎక్కువగా చెల్లిస్తున్నాం.. కాబట్టి మీరు కూడా అడిగినంత ఇవ్వాలని దబాయిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సరైన ధరలు లేక తీసుకొచ్చిన సరుకు ఆటోల కిరాయి, ఇతర ఖర్చులు ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని, తైబజారు పేరుతో రసీదు లేకుండా అక్రమ వసూళ్లు చేయడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రజలకు, పండ్లు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఎట్టకేలకు మరమ్మతు
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాలకు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపులు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపు లు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇను ప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏ ర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రా ష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మ తు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు.. జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్లో ఉంచారు. టెండర్ ప్రక్రియ పూర్తి.. జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మంత్రి పర్యటనతో.. జూరాల గేట్లకు రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడటంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ సందర్భంలోనే గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో చేపడుతామని, అదేవిధంగా డ్యాంపై పరిమితికి మించి వాహనాలు లోడ్తో వెళ్లడం ప్రమాదమని గుర్తించినట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం రూ.4.30 కోట్లు మంజూరు చేసింది. జూరాల డ్యాం గేట్ల రిపేరుకు రూ.4.30 కోట్లు నిధులు తాజాగా 42 ఇనుప రోపులపునరుద్ధరణ ఇదివరకే 10 రోపులకు కొనసాగుతున్న పనులు ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు -
జీడిపల్లిలో అక్రమంగా బ్లాస్టింగ్
● రేయింబవళ్లు తేడా లేకుండా పేలుళ్లు ● ఆందోళన చెందుతున్న అన్నదాతలు కల్వకుర్తి రూరల్: ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్లు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. మండలంలోని జీడిపల్లి శివారులో విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న బ్లాస్టింగ్తో రైతులు ఆందోళన చెందుతున్నారు. 12 అడుగుల వెడల్పు 18 అడుగుల ఎత్తులో పిల్లర్ల నిర్మాణానికి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్లు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖల అధికారుల అనుమతులు లేకుండానే పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని సమీపంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అవినీతి అధికారుల మద్దతుతో ఇష్టానుసారంగా రేయింబవళ్లు తేడా లేకుండా జరుగుతున్న పేలుళ్లతో సమీపంలో ఉన్న బోరుబావులు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పంటలపై తీవ్ర ప్రభావం బ్లాస్టింగ్ కారణంగా సమీపంలోని భూములు కంపించి, బోరు బావుల్లో కుదుపు రావడంతోపాటు పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్తో రైతులకు మేలు చేసే క్రిములు చనిపోయే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ శాఖల అధికారుల అనుమతులు లేకుండానే వీరికి పేలుడు పదార్థాలు ఎలా వస్తున్నాయి అని పలువురు చర్చించుకుంటున్నారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల షాపులు ఏర్పాటు చేయాలంటే ఎంతోమంది అధికారుల అనుమతులు తనిఖీలు ఉంటాయి. అలాంటిది బాంబులు పెట్టి పేలుళ్లు చేస్తుంటే ఎవరికి పట్టకపోవడంతో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఉండి బ్లాస్టింగ్ చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. ఏదీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతుండడంతో రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబులను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులంటున్నారు. విచారణ జరుపుతాం.. జీడిపల్లి సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్లకు అనుమతులు ఏమైనా ఉన్నాయా అని ఆర్డీఓ జనార్దన్రెడ్డి కోరగా.. తనకు ఎలాంటి సమా చారం లేదని ఇంతకు ముందు ఎవరైనా అనుమతులు ఇచ్చారో తెలియదన్నారు. దీనిపై విచారణ జరుపుతామని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని వివరించారు. -
జనరల్ ఫండ్ పెంపొందించుకోవడంలో మున్సిపాలిటీల విఫలం
● ఆదాయ, వ్యయాలకు సరితూగని నిధులు ● చాలాచోట్ల కార్మికుల వేతనాలకే సరిపోని దుస్థితి ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాసులే ఆధారం ● జిల్లాలోని పురపాలికల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం అచ్చంపేట: మున్సిపల్ జనరల్ ఫండ్ అనేది స్థానిక ప్రభుత్వానికి ప్రాథమిక నిర్వహణ నిధి. ఇది రోజువారి కార్యకలాపాలు, సేవలు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రజా భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఉద్యాన వనాలు, సాధారణ పరిపాలన వంటి ముఖ్యమైన సేవలకు వినియోగిస్తూ ఆదాయ, వ్యయాలలో సమతుల్యత సాధించాలి. ఆస్తి, నీటిపన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, అడ్వర్టైజ్మెంట్ పన్నులు, రుసుంలు, వివిధ రకాలుగా వచ్చే ఆదాయాలను ఏకీకృతం చేసి బ్యాలెన్సును పెంచుకోవాలి. అయితే జిల్లాలో మున్సిపాలిటీలు ఏర్పడి దశాబ్దకాలం గడుస్తున్నా జనరల్ ఫండ్ కార్మికుల వేతనాలకే సరిపోని పరిస్థితి. దీంతో రోజువారీ నిర్వహణలో వెనుకబాటు తప్పట్లేదు. స్వయం సమృద్ధి సాధించలేక పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఫల్యం ఎక్కడా.. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నిర్ధారణ సరైనా పద్ధతిలో జరగడం లేదనే విమర్శలున్నాయి. భవనాలకు సంబంధించి కొలతలలో సరైన అంచనాలు చేపట్టకుండా రెవెన్యూ విభాగం అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగం అధికారులు తమ జేబులు నింపుకోవడమే తప్పితే మున్సిపల్ ఆదాయం పెంపుపై దృష్టిసారించడం లేదనే అపవాదు వస్తుంది. రెసిడెన్సియల్ అనుమతులు తీసుకొచ్చి కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినా, భవనాల కింద సెల్లార్లు నిర్మిస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించడం వెనక మామూళ్లే కారణమనేది బహిరంగ రహస్యం. లీజు భూముల ఆదాయం ప్రతి మూడేళ్లకోసారి సవరించి పెంచాల్సి ఉండగా.. నేటికీ ఏళ్లనాడు నిర్ధారించిన పన్నులనే వసూలు చేయడం గమనార్హం. మిషన్ భగీరథ నల్లాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు పన్నులు నిర్ధారించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రెండు మున్సిపాలిటీలే.. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీలు మాత్రమే ఇంటి పన్నుల వసూళ్లలో ముందంజలో ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు అవకాశం లభించింది. అలాగే నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 2024– 25 కంటే రూ.40 లక్షలు ఎక్కువ నిధులు వసూలు చేసినా 2025– 26లో 15వ ఆర్థిక సంవత్సరం నిధులకు అర్హత సాధించలేదు. కల్వకుర్తి మున్సిపాలిటీ నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేదు. గృహాలు, ప్రైవేట్ దుకాణాల సముదాయాల వారు కొంత మేర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోగా.. అధికారుల చుట్టూ తిరిగి నోటీసులు ఇస్తున్నా పట్టింపు లేదు. -
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కందనూలు: ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్ ప్రజల నుంచి 35 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలకు పరిష్కారం చూపుతారనే ఆశతో ప్రజలు ప్రజావాణికి వస్తారని అధికారులు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులపై దృష్టిసారించాలి తాడూరు: గ్రామీణ ప్రాంతాల రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్రావు అన్నారు. సోమవారం ప్రజా ప్రభుత్వం– ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో క్లస్టర్ రైతువేదికల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వాడకం, సహజ వ్యవసాయం, వరిలో ప్రాధాన్యత రకాలు, మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. అలాగే మండలంలోని ఇంద్రకల్ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమానికి వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్ పద్మహర్షతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, సహాయ సంచాలకుల పూర్ణశేఖర్ హాజరయ్యా రు. రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగులో అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడి సాధించేలా ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్రెడ్డి, ఉద్యాన శాఖా ధికారి జగన్, ఉపసర్పంచ్ పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఫలితాలు
కందనూలు: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పనితీరుకు నిదర్శనం ఫలితాలు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ కూడలిలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పునాది పశ్చిమబెంగాల్లో పుట్టిందని, అక్కడ పుట్టిన నాయకుడే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన ఆశయ సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్షాతోపాటు అనేక మంది నాయకులు దేశంలో చేస్తున్న నిస్వార్థ సేవలకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయానికి కారణమన్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అంత్యోదయ సిద్ధాంతం అమలు కార్యక్రమాలను ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన అందించినందుకే ప్రజలు ఆత్మవిశ్వాసంతో బీజేపీని గెలిపించారన్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రజాతీర్పునకు అనుగుణంగా రాబోయే కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశంలో 370 ఆర్టికల్, రామ జన్మభూమి, త్రిపుల్ తలాక్, ఒక దేశం– ఒకే చట్టం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్గౌడ్, పట్టణ అధ్యక్షుడు ప్రమోద్కుమార్, కార్యాలయ కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
వెల్దండ: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కొట్రలో ఆదివారం కంఠ మహేశ్వరస్వామి దేవాలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీసింగ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డిలు వేర్వేరుగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, నాయకులు భూపతిరెడ్డి, ఆనంద్కుమార్ సంజీవ్కుమార్, బచ్చు రామకృష్ణ, హరికిషన్నాయక్, సురేందర్రెడ్డి, బీజేపీ నాయకులు శేఖర్రెడ్డి, బాలస్వామి, గౌడ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. -
ఈతకు వెతలు!
కొల్లాపూర్: వేసవి సెలవు దినాల్లో ఈత నేర్చుకోవడం చిన్నారులకు గగనంగా మారుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లేకపోవడంతో ఎంజీకేఎల్ఐ కాల్వలు, బావులను ఆశ్రయిస్తున్నారు. అయితే వాటి లోతు ఎక్కువగా ఉండటం.. జమ్ము, ముళ్లపొదలు కాళ్లకు చుట్టుకోవడం వంటి కారణాలతో ఏటా చిన్నారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఈత నేర్చుకునే క్రమంలో పలువురు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రమాదాల నివారణకు క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుచేసి.. చిన్నారులకు ఈత నేర్చుకునే వెసులుబాటు కల్పించడమే ఉత్తమ మార్గమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొల్లాపూర్లో అసంపూర్తిగా పనులు.. కొల్లాపూర్లోని మినీ స్టేడియంలో 2017లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పట్లో పంచాయతీరాజ్శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు యువజన, క్రీడాశాఖ ద్వారా రూ. 1.80కోట్లు మంజూరు చేయించారు. మినీస్టేడియం నిర్మించిన గుత్తేదారుకే పనులు అప్పగించగా.. పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్శాఖ అధికారులకు కట్టబెట్టారు. ఆరు నెలల్లో పనులు పూర్తిచేయాలని అప్పట్లో జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. అయితే నిధులలేమి కారణంగా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అయితే కొన్ని నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు స్విమ్మింగ్ పూల్ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. త్వరగా పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అయితే ఈ వేసవిలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభమవుతుందని అంతా భావించారు. కానీ పనులు ఇప్పుడు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. వేసవిలో ఈత నేర్చుకునేందుకు బావులు, కాల్వలే దిక్కు ఏటా ప్రమాదాల బారినపడుతున్న చిన్నారులు జిల్లాలో ప్రైవేటు స్విమ్మింగ్ పూల్స్కు డిమాండ్ క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించాలని ప్రజల వేడుకలు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి.. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో కూడా పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుచేయాలి. చిన్నపిల్లలు ఈత నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. బావులు, కాల్వల వద్దకు వెళ్లి పిల్లలు మృత్యువాత పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటే పరిష్కార మార్గం. మార్నింగ్ వాకర్లు, యువతకు కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగపడతాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. – ఎర్రమోని యాదగిరి, కొల్లాపూర్ అసంపూర్తి పనులపై దృష్టి.. కొల్లాపూర్లో అసంపూర్తిగా ఉన్న స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల పురోగతి కొన్ని నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. అచ్చంపేటలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్పూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేస్తున్నాం. ఈత కోసం బావులు, కాల్వలకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. – సీతారాం, డీవైఎస్ఓ -
సన్నాలకే మొగ్గు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. -
కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. -
సౌకర్యాలు లేక రైతుల ఇబ్బందులు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్యానాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఎం బృందం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. అమ్మకానికి తెచ్చి ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ఉండి పోతుందని, సకాలంలో తూకం వేయక పోవడం, తూకం వేసిన ధాన్యాన్ని తరలించక పోవడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. యార్డులో కనీస సౌకర్యాలు కల్పించకపోతే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీపీ ఎం నాయకులు వెంకటయ్య, పర్వతాలు, వాల్యానాయక్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
● జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష ● 11.30 గంటల వరకే అనుమతించిన అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో నీట్ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. -
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు. సీపీఐ పోరాటంతోనేపనిగంటల తగ్గింపు పెద్దకొత్తపల్లి: సీపీఐ పోరాట ఫలితంగానే ప్రభుత్వం కార్మికులకు పనిగంటలను తగ్గించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పెద్దకొత్తపల్లి మండలం నక్కపల్లిలో సీపీఐ పార్టీ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్రెడ్డి, శ్రీనివాసులు, మల్లయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాన ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాట దక్కడంలేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. బస్సును ఢీకొన్న కారు ● ఇద్దరి దుర్మరణం ● హెదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం -
దోపిడీకి ముగింపేది?
● నెలక్రితం టన్నుకు రూ.1.50 లక్షలు, నేడు రూ.30 వేలే ● రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించని వ్యాపారులు ● ఆశించిన దిగుబడి రాక నష్టాల ఊబిలోకి.. ● జిల్లాలో 17 వేల ఎకరాల్లో సాగు రూ.60 లక్షలు వెచ్చించి వివిధ గ్రామాల్లో 10 తోటలు కౌలుకు తీసుకున్నా. ఇప్పటికీ మామిడి కాయలు విక్రయిస్తే రూ.15 లక్షలు కూడా రాలే. మూడు రోజుల క్రితం ఈదురు గాలులతో 5 టన్నుల కాయలు నేలరాలగా వాటిని విక్రయిస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా సరిపోలే. ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, దళారుల దోపిడీని అరికట్టాలి. – పెబ్బేటి మహేష్, మామిడి కౌలు రైతు, వీపనగండ్ల ప్రతి ఏటా మామిడి రైతులు కొనుగోలుదారుల చేతుల్లో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. – దొడ్ల కవిత, సర్పంచ్, గోపల్దిన్నె నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి మా మిడి కాయలు కొనుగోలు చేసి ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేయిస్తాం. – విజయభాస్కర్రెడ్డి, జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి, వనపర్తి బహిరంగ మార్కెట్లో తరుగు, కమీషన్ పేరుతో మామిడి రైతులు విలవిల వీపనగండ్ల: ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల నిలువు దోపిడీ వెరిసి మామిడి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అరివి అన్న చందంగా మారింది వారి పరిస్థితి. మామిడి చెట్లకు వేసే ఎరువులు, పూత దశలో పిచికారీ చేసే రసాయనిక మందులకు రూ.వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడు అవుతుంది. తీరా పంట దిగుబడి వచ్చాక మామిడి కాయలు అమ్ముదామని పోతే బహిరంగ మార్కెట్లో దళారులు తరుగు, కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలడంతో దిగుబడి దారుణంగా పడిపోయింది. మిగిలిన పంటను అయినా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు. స్పందించాల్సిన ఉద్యాన శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం జిల్లాలో పెబ్బేరు, కడుకుంట్ల గ్రామాల వద్ద కొందరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీపనగండ్ల మండలంలో మండల మహిళా సమైక్య ద్వారా మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభించి కాయ సైజు 250 గ్రాముల నుంచి 450 గ్రాముల మధ్యే ఉండాలన్న నిబంధనను విధించి, రోజు రెండు టన్నుల కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కవర్ కట్టిన కాయలు తీసుకోవడం లేదు. హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అక్కడ నిబంధనలను పాటించడం లేదు. 4 శాతం తరుగు తీయాల్సి ఉండగా.. హమాలీ తరుగు, కాయలు నాణ్యతగా లేవని సాకు చూపి 18 శాతం తరుగును తీస్తున్నారు. నెల క్రితం టన్ను కాయలు రూ.1.50 లక్షలు పలకగా నేడు టన్నుకు రూ.30 చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వేలం సమయంలో గుత్తేదారు తన అనుచరులనే నలుగురిని నియమించుకొని వేలం పాడుతున్నట్లు నటించి తను అనుకున్నట్లుగా రైతులకు తక్కువ రేటు చెల్లిస్తున్నాడు. రశీదు కూడా ఇవ్వరు. నగదు చెల్లింపులో కూడా ఆలస్యం చేస్తున్నారు. చీడపీడల నివారణ, కాయలు తెంపేందుకు కూలీల రేట్లు, ట్రాన్స్పోర్ట్, తరుగు మొత్తంగా ఎకరాకు రూ.80 వేలు ఖర్చు వస్తే విక్రయించిన తర్వాత రూ.20 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
సంఘర్షణ నిర్మూలన కోసం..
అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు.


