breaking news
Ananthapur
-
అక్రమ రవాణాకు రథసారథులు
అనంతపురం క్రైం: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి నిషేధిత వస్తువులు, మద్యం రవాణా అవుతోంది. కొన్ని ముఠాలు ఎరగా వేసే డబ్బుకు లొంగిపోయి కొందరు డ్రైవర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బెంగళూరు నుంచి ఆర్మీ లిక్కర్ బాటిళ్లను అనంతపురానికి తీసుకొస్తున్న ఆర్టీసీ డ్రైవరును ఎకై ్సజ్ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు బస్సుల్లో తనిఖీలు పూర్తిగా వదిలేయడం వల్లే అక్రమ రవాణా ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గత సెప్టెంబరు 20న బెంగళూరు రూటుకు వెళ్లే డ్రైవర్ల వ్యవహారంపై ‘గాడి తప్పిన ఆర్టీసీ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ రూటుకు వెళ్లాల్సిన డ్రైవర్లు కాకుండా అధికారులను ‘బాగా చూసుకునే’ వారిని విధులకు పంపుతున్నారని కథనంలో పేర్కొంది. చాలా కాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు ఎకై ్సజ్ అధికారుల దాడుల అనంతరం గానీ తెలియరాలేదు. తప్పు చేసినా.. చర్యలు శూన్యం ఆర్టీసీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఆర్ఎం సుమంత్ ఆదోని ఈ వ్యవహారాల్లో తలదూర్చలేదు. ప్రస్తుతమున్న ఆర్ఎం శ్రీలక్ష్మి కూడా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కిందిస్థాయి సిబ్బంది ఆడింది ఆటగా సాగుతోంది. తప్పు చేసిన వారు ఆధారాలతో సహా దొరికినా.. చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులే వారిని రక్షిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకే కిందిస్థాయి సిబ్బంది ఏమాత్రం భయపడకుండా.. అక్రమాలకు పాల్పడుతున్నారు. నిషేధిత వస్తువులు వస్తున్నాయిలా.. అనంతపురం జిల్లా కేంద్రానికి పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి నిషేధిత వస్తువులను ఎక్కువగా డ్రైవర్లే తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఏపీఎస్ ఆర్టీసీతో పాటు కర్ణాటక బస్సుల డ్రైవర్లు కూడా ఈ తరహా రవాణాకు తెగబడుతున్నట్లు పక్కా సమాచారం ఉంది. కాగా నేరుగా కర్ణాటక బస్సుల డ్రైవర్లతో కొన్ని ముఠాలు పార్సిళ్లు తెప్పించుకుంటున్నట్లు నిఘా సంస్థల అధికారులు గుర్తించారు. ఇకపై సాధారణ వాహనాల తరహాలో ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీ చేసి పంపాలన్న యోచనలో అధికారులున్నట్లు తెలుస్తోంది. అధికారుల సేవలో స్క్వాడ్ టీమ్.. ఫలానా అధికారి మనకు వస్తే అనుకూలంగా ఉంటారు.. మనం విధులకు డుమ్మాకొట్టి ఇక్కడే కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉండొచ్చనే వారి సంఖ్య ఈ స్క్వాడ్ టీమ్లో అధికంగా ఉందన్న ఆరోపణలున్నాయి. గత ఆర్ఎం సమయంలో స్క్వాడ్ టీమ్లోని కీలక వ్యక్తులు కార్యాలయం వీడి బయటకు వెళ్లలేదని సహచర ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఉదయం ఆర్ఎం ఇంటికి కాయగూరలు మొదలు, అధికారి ఆలయ దర్శనం వరకు అన్నీ దగ్గరుండి చూసుకోవడమే స్క్వాడ్ టీమ్ విధులని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ రవాణాకు సహకరిస్తున్న డ్రైవర్లపై చర్యలు తీసుకుని, సంస్థ ప్రతిష్టను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మద్యం, నిషేధిత వస్తువుల రవాణా ముఠాలు వేసే ఎరకు చిక్కుకుంటున్న ఆర్టీసీ డ్రైవర్లు బస్సుల తనిఖీలను విస్మరించిన ఉన్నతాధికారులు తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తున్న వైనం -
1,009 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా
అనంతపురం అగ్రికల్చర్: కోరమాండల్ కంపెనీ నుంచి 1,009.495 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్లో వ్యాగన్ల ద్వారా వచ్చిన యూరియా నిల్వలను వారు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చినదాంట్లో మార్క్ఫెడ్కు 520 మెట్రిక్ టన్నులు, మిగతా 489.495 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు, మన గ్రోమోర్సెంటర్లకు కేటాయించినట్లు వెల్లడించారు. ఇండెంట్ల మేరకు మార్క్ఫెడ్ ద్వారా ఆర్ఎస్కేలు, సొసైటీలకు, అలాగే మనగ్రోమోర్, ప్రైవేట్ డీలర్ల నుంచి రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తారని తెలిపారు. సెల్ఫోన్ రిపేరీపై రేపటి నుంచి శిక్షణ అనంతపురం సెంట్రల్: సెల్ఫోన్ రిపేర్ కోర్సుపై నిరుద్యోగులకు ఈ నెల 6 నుంచి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. 45 రోజులు శిక్షణాకాలంలో అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం, శిక్షణ అనంతరం టూల్కిట్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులకు వందశాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎకాలజీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. ఆకతాయికి చెప్పుదెబ్బ ● ధైర్యంగా ఫిర్యాదు చేసిన యువతి అనంతపురం: మద్యం మత్తులో అమ్మాయిలను ఇబ్బందిపెడుతున్న ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో హౌసింగ్బోర్డులోని ఎస్ఆర్ వైన్స్ దగ్గర రోడ్డుపై ముగ్గురు యువకులు పీకలదాకా తాగి హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న యువతిని ఓ యువకుడు తాకాడు. దీంతో ఆ అమ్మాయి ధైర్యంగా తిరగబడింది. చెప్పు తీసుకుని చితక్కొటింది. అనంతరం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈవ్టీజర్లు అనంతసాగర్ కాలనీకి చెందిన రవికుమార్, వేణుగోపాల్, శివశంకర్ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని సీఐ శ్రీకాంత్యాదవ్ శనివారం తెలిపారు. 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అమ్మాయిలను వేధిస్తే ఎవ్వరికై నా ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. రైలుకిందపడి వ్యక్తి ఆత్మహత్య పామిడి: పి.కొండాపురం రైల్వేగేట్ సమీపాన పెద్దమ్మ గుడి వెనుక శనివారం గుర్తు తెలియని వ్యక్తి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల ఛిద్రమైపోయింది. తెల్ల అంగీ, పంచె, ఎర్ర టవల్ ధరించి ఉన్నాడు. గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో విద్యుదాఘాతంతో పశ్చిమ బెంగాల్కు చెందిన తజిబుల్ (34) అనే కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్లోని మధ్యపార గ్రామానికి చెందిన తజిబుల్ పని నిమిత్తం కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి వచ్చాడు. అయితే శనివారం సాయంత్రంవిద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా స్తంభంపైకి ఎక్కిన తజిబుల్ షాక్కు గురై కిందపడ్డాడు. వెంటనే స్థానిక సిబ్బంది కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే తజిబుల్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. మరణ వార్తను కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు కంబదూరు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్కు బదులు మరొక లైన్కు ఎల్సీ ఇవ్వడం వల్లే కార్మికుడు షాక్కు గురై చనిపోయినట్లు తెలుస్తోంది. ఆటోడ్రైవర్లకు చేయూత బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ సేవలో..’ పథకం కింద ఆటోడ్రైవర్లకు చేయూత అందించిందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పథకం కింద జిల్లాలో 9,275 మంది డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.13,91,25,000 మంజూరైంది. ఇందుకు సంబంధించిన మెగా చెక్కును శనివారం బుక్కరాయసముద్రంలో కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ జెండా ఊపి ఆటో ర్యాలీతో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ సాల్మాన్, డిస్టిక్ మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ శ్రీదేవి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు ఐక్య పోరాటం
● బీసీ నేతల పిలుపు అనంతపురం అర్బన్: హక్కుల సాధన, జనాభా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. జనగణనలోనే కులగణన చేపట్టాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాలులో కుల, ప్రజాసంఘాలతో సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకర్రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీమ్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ అహమ్మద్, కురబ సంఘం తరఫున మాజీ మయర్ రాగే పరశురాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్మన్ దాదా గాంధీ, తదితరులు మాట్లాడారు. కులగణన ద్వారానే బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ కులగణన చేపట్టిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కులగణన పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వమని జపం చేస్తూనే.. మరోవైపు కులగణన చేపట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. కులగణన డిమాండ్తో ‘చలో అమరావతి’ చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సదస్సులో సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, వడ్డెర సంఘం నాయకుడు వడ్డే జయంత్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎస్ఆర్ నాగభూషణం, బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు, మైనారిటీ నాయకులు మైనుద్ధీన్, నాయకులు సంజీవప్ప, శ్రీరాములు, కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, రాజేష్, సంతోష్ కుమార్, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
విడపనకల్లు: రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. విడపనకల్లు శివారులో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వైజాగ్కు చెందిన సుధీర్ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీలో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అనంతపురంలో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ అనంతరం కుటుంబంతో కలిసి సరదాగా హంపికి వెళ్లాలనుకున్నారు. శనివారం మధ్యాహ్నం అనంతపురం నుంచి సుధీర్ తన భార్య లావణ్య (34), కుమారుడు ఉదయ్తో కలిసి శనివారం హంపికి కారులో బయల్దేరాడు. ఇక గోవా నుంచి సంజీవ్రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి అనంతపురానికి కారులో వస్తున్నారు. విడపనకల్లు శివారులోని పెట్రోలు బంకు సమీపంలో రెండు కార్లు అదుపుతప్పి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జవడంతో లోపల ఉన్న వారంతా కాళ్లు, చేతులు విరిగి కోమాలోకి వెళ్లిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఉరవకొండ సీఐ మహానంది, విడపనకల్లు ఎస్ఐ ఖాజాహుస్సేన్ తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కార్లలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో అతికష్టం మీద బయటకు తీసి ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో లావణ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రథమ చికిత్స అనంతరం సంజీవ్రెడ్డి, పుల్లయ్య నా యుడు, శ్రీనివాసులు, నాగిరెడ్డిలను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులెక్కడ...? రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే కంటి వైద్యులు తప్ప మిగిలిన డాక్టర్లు, సూపరింటెండెంట్, సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. పోలీసులు, స్థానికులు, కొంతమంది చారిటబుల్ ట్రస్టు సభ్యులు వైద్యులకు సహాయ సహకారాలు అందించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలోని 50 పడకల ఆస్పత్రిలోనే వైద్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం దారుణమని స్థానికులు వాపోయారు. స్పీడ్ బ్రేకర్లు వేయండి విడపనకల్లులో పెట్రోలు బంకు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కెంగూరి ఎర్రిస్వామి, సీపీఎం నాయకులు రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బోయ వెంకటేశులు తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న సంజీవ్రెడ్డి కోమాలోకి వెళ్లిన లావణ్య భర్త సుధీర్, కుమారుడు ఉదయ్ మరో ఆరుగురికి తీవ్ర గాయాలు ఎదురెదురుగా కార్లు ఢీకొనడంతో ఘటన -
బుజ్జీ నువ్వులేని జీవితం నాకెందుకు?
రాప్తాడు: ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి.. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తట్టుకోలేకపోయిన యువకుడు ‘బుజ్జీ.. నువ్వు లేని జీవితం నాకెందుకు.. నేను చనిపోతున్నా’ అంటూ పురుగుమందు డబ్బా చేతపట్టుకుని సెల్ఫీ తీసుకుని సెల్ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామానికి చెందిన కత్తె లింగమయ్య, మాలమ్మ దంపతుల కుమారుడు కత్తె పోతులయ్య, నార్పల మండలంలోని అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల వారికి చెప్పకుండా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం తమకు ఇష్టం లేదని, మైనార్టీ కూడా తీరలేదని అమ్మాయి తల్లిదండ్రులు నార్పల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రేమికులను పట్టుకొచ్చి.. పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరినీ ఎవరిళ్లకు వారిని పంపించేశారు. మైనార్టీ తీరే వరకు దూరంగా ఉండాలని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో బాలికకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో పోతులయ్య తట్టుకోలేకపోయాడు. ‘నువ్వు లేని జీవితం నాకెందుకు.. బుజ్జీ (ప్రేమించిన అమ్మాయి) నేను చనిపోయిన తర్వాతైనా మన కుటుంబాలను కలుపుతావని అనుకుంటున్నా. నేను చనిపోవాలనుకునే వారందరికీ ధన్యవాదాలు. ఒక వేళ మమ్మల్ని కలిపే ఉద్దేశం ఉంటే బతికించాలని, లేనిపక్షంలో నన్ను వదిలేయండి. మామా నీకు ఎంతో ఇష్టమైన స్థలంలోనే చచ్చిపోతున్నా. కడుపులో చాలా నొప్పిగా ఉంది మామా. నీ కోసం అగ్గి పెట్టె ఒకటే తెచ్చాను. బీడీలు తేలేకపోయాను మామా. బుజ్జీ నేను చచ్చిపోతున్నా.. నువ్వన్నా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఊళ్లో చనిపోతే నువ్వు రావని, మీ ఊర్లో వచ్చి చచ్చిపోతున్నాను బుజ్జీ. దయచేసి నా శవాన్ని మీ ఊర్లోనే పూడ్చి పెట్టాలి. బుజ్జి నా శవం నీ ఒక్కదానికే దొరకాలని కోరుకుంటున్నా. ఈ ప్లేస్ మీరు చూపించిన ప్లేసే. మామ వాళ్లు, వీళ్లు చెప్పిన మాటాలు విని పంతానికి పోయావు. ఇదొక్కసారి నా మాట వింటావని కోరుకుంటున్నా. మీ గ్రామంలోనే పురుగులమందు తాగుతున్నా’ అంటూ సెల్ఫీ వీడియో తీసి, వారి కుటుంబ సభ్యులకు పంపించిన తర్వాత పోతులయ్య తన సెల్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు. పురుగుమందుబాటిల్తో యువకుడి ఆత్మహత్యాయత్నం సెల్పీ వీడియో అనంతరం సెల్ స్విచాఫ్ -
రేపు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 6న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కార స్థితి ఏ దశలో ఉందనే విషయాన్ని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekoram.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య బెళుగుప్ప: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని యలగల వంక గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివ తెలిపిన మేరకు.. యలగలవంకకు చెందిన కురుబ పోతన్న (71) తన ఏడు ఎకరాల్లో బోర్లు వేయించేందుకు, పంటల సాగుకు సుమారు రూ.25 లక్షల అప్పు చేశాడు. కొన్ని సంవత్స రాలుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పోతన్న శనివారం విషపు గుళికలు మింగాడు. గుర్తించిన భార్య పార్వతమ్మ చుట్టుపక్కలవారి సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, చికిత్స ఫలించక పోతన్న మృతి చెందాడు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ పేర్కొన్నారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవాలి ● అగ్నిమాపకశాఖ డీజీ వెంకటరమణ అనంతపురం:ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) పి. వెంకటరమణ అన్నారు. శనివారం జేఎన్టీయూ(ఏ) ఆడిటోరియంలో జోన్–4 పరిధిలోని శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందిన అగ్నిమాపక శాఖ అధికారులు, సహాయ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలోని అగ్నిమాపక సదుపాయాల స్థితిగతులపై ఆరా తీశారు. అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది బలోపేతం, కొత్త సాంకేతిక పరికరాల అవసరంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థను అభివృద్ధి పరిచేలా సూచనలు ఇచ్చారు. ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారి (జోన్–4) ఎం. భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్లపై జీఎస్టీ తగ్గింపు అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెక్టారుకు రూ.4,450 వరకు రైతులకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంజూరై మెటీరియల్ పంపిణీ కాని, అలాగే రైతు వాటా చెల్లించి, పరికరాలు మంజూరు కాని వారు గత నెల 22 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు మేరకు మొత్తం 1,408 మంది రైతులకు రూ.67.63 లక్షల మేరకు తిరిగి వెనక్కి చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు 18 వేల హెక్టార్ల లక్ష్యం ఉన్నందున 2018–19 కన్నా ముందు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. పశ్చిమ దిశగా గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
తేనెటీగల దాడిలో రెవెన్యూ ఉద్యోగులకు గాయాలు వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (లిఫ్ట్) వద్ద శనివారం సాయంత్రం రెవెన్యూ ఉద్యోగులపై తేనెటీగలు దాడి చేశాయి. పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎం.రామాంజినేయులు అనే వ్యవసాయ కూలీ నాలుగు రోజుల క్రితం ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీ–నీవా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. దీంతో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, వజ్రకరూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం వజ్రకరూరు తహసీల్దార్ నరేష్కుమార్ నేతృత్వంలో ఆర్ఐ సతీష్కుమార్, వీఆర్వోలు ఛత్రేనాయక్, రంగస్వామి, వీఆర్ఏలు విజయ్, పెన్నయ్య, సుంకన్నతో పాటు మరికొందరు రెవెన్యూ ఉద్యోగులు ఛాయాపురం నుంచి రాగులపాడు లిఫ్ట్ వరకు కాలువ వెంట గాలించారు. రాగులపాడు లిఫ్ట్ వద్ద అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. వీఆర్వోలు ఛత్రేనాయక్, రంగస్వామి, వీఆర్ఏలు విజయ్, పెన్నయ్య, సుంకన్న తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వజ్రకరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● ఎస్పీ జగదీష్ రాప్తాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. అనంతపురం రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులు, చోరీలు, రికవరీలు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ఆరా తీశారు. చోరీ కేసుల్లో రికవరీలు పెరగాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్థాలపై చైతన్య సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతర నిఘా ఉంచి, గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశులు, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్ తదితరులు ఉన్నారు. సమర్థవంతమైన సేవలందించాలి శింగనమల (నార్పల): పోలీస్స్టేషన్కు వచ్చే ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జగదీష్ సిబ్బందికి సూచించారు. శనివారం నార్పల పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. మండలంలో పరిస్థితులు, కేసుల వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ల కదిలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు వచ్చే వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ఉన్నారు. -
కేశవన్నా.. పప్పుశనగ ఇంకెప్పుడన్నా?
● ఆర్థిక మంత్రి ఇలాకాలోనే విత్తనానికి నిధులు ఇవ్వకుండా దాటవేత ● గత ఖరీఫ్, రబీకి సంబంధించి ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలు అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత జిల్లాలోనే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఖరీఫ్లో ఆలస్యంగా విత్తన వేరుశనగ పంపిణీ చేయడంతో రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. కనీసం పంపిణీ చేసిన విత్తనానికి సంబంధించి రాయితీ సొమ్మును ఏజెన్సీలకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. గత ఖరీఫ్, రబీతో పాటు ఈ ఖరీఫ్లో విత్తన వేరుశనగ, పప్పుశనగకు సంబంధించి ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలు పెట్టడంతో ఏజెన్సీల నిర్వాహకులు విత్తన సరఫరాకు ముందుకు రావడం లేదు. దీంతో రబీలో పప్పుశనగ రాక ఆలస్యమవుతోంది. సీజన్ ప్రారంభమై నాలుగైదు రోజులైనా ఇప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభించకపోవడం చూస్తే అసలు రైతులకు రాయితీ విత్తనం ఇస్తారా లేదా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వర్షం వస్తే నల్లరేగడి భూములు కలిగిన 25 మండలాల్లో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యామ్నాయమూ లేదు.. ఖరీఫ్లో అననుకూల వర్షాలతో పంటల సాగు మందకొడిగా సాగింది. సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చినా... ఇంకా లక్ష ఎకరాల వరకు పొలాలు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇందులో విత్తుకునేందుకు ప్రత్యామ్నాయం కింద ఇవ్వాల్సిన ఉలవ, జొన్న, కొర్ర లాంటి విత్తనాలు కూడా ఇవ్వకుండా మరిపించేశారు. ఆగస్టు 25న నిర్వహించిన జిల్లాస్థాయి అభివృద్ధి కమిటీ (డీఆర్సీ)లో మంత్రి పయ్యావుల కేశవ్ ఖరీఫ్ సాగుపై సమీక్షించారు. ‘ప్రత్యామ్నాయం’ కింద విత్తనాలు అందిస్తామని ఘనంగా ప్రకటించిన ఆయన చివరకు దాని ఊసే ఎత్తలేదు. కనీసం రబీలోనైనా ముందస్తు సాగుకు వీలుగా విత్తన పప్పుశనగ అందించాల్సి ఉండగా ఇప్పటికీ మొదలు పెట్టలేదంటే రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. పట్టించుకునే తీరికేదీ..? రైతుల కష్టనష్టాల్లో పాలుపంచుకోవాల్సిన చంద్రబాబు సర్కారు వారి గురించి అసలు పట్టించుకోవడమే లేదు. గతంతో పోలిస్తే సగానికి సగం కోత పెట్టి ఈ రబీలో జిల్లాకు 14 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు కేవలం 500 క్వింటాళ్ల రాయితీ పప్పుశనగ కేటాయించడం దీనికి అద్దం పడుతోంది. సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గించి అదనపు భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్సిక్స్– సూపర్హిట్’ అంటూ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేసి సభ నిర్వహించింది. ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి కూడా నిధులు నీళ్లలా ఖర్చు పెట్టారు. డీఎస్సీలో ఎంపికై న వారికి పోస్టింగ్లు ఇవ్వడానికి భారీ మొత్తం వెచ్చించి అమరావతికి పిలిపించుకున్నారు. ఇలా ఆర్భాటాలకు పోయి మంచినీళ్ల ప్రాయంగా ఖజానాను కరిగించేస్తున్న ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా ఇవ్వకుండా రిక్తహస్తం చూపిస్తుండడం గమనార్హం. -
మహనీయుల జీవితం ఆదర్శప్రాయం
అనంతపురం అర్బన్: మహనీయుల జీవితాలు ఆదర్శప్రాయమని, వారు చూపిన శాంతి మార్గంలో నడవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 2న కలెక్టరేట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రి వంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనమంతా స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నామన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేంగా మహాత్మాగాంధీ అహింసను ఆయుధంగా చేసుకుని ఉద్యమించారన్నారు. గాంధీ మహాత్ముడు అందించిన స్పూర్తితో ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్ధేందుకు పౌరులు కృషి చేయాలని పిలపునిచ్చారు. లాల్బహదూర్ శాస్త్రి స్వాతంత్య్రోద్యమంలో సైనికులు, రైతులు పాత్రను గుర్తు చేస్తూ జై జవాన్– జై కిసాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, పరిపాలనాధికారి అలెగ్జాండర్, తహసీల్దార్లు హరికుమార్, రియాజుద్ధీన్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగమేఘాల మీద ‘సెక్టోరియల్స్’ చేరిక ● ఆసక్తి చూపని ఏఎస్ఓ.. ఆ పోస్టు భర్తీకి మళ్లీ బ్రేక్? అనంతపురం ఎడ్యుకేషన్: ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న సమగ్రశిక్షలోని సెక్టోరియల్ అధికారుల పోస్టులను ఎట్టకేలకు భర్తీ చేశారు. జిల్లా అధికారులు పంపిన జాబితాకు రాష్ట్ర అధికారులు ఆమోదముద్ర వేశారు. అక్కడి నుంచి జాబితా రాగానే ఎంపికై న టీచర్లు స్కూళ్లల్లో రిలీవ్ అయి ఆగమేఘాల మీద సమగ్రశిక్ష కార్యాలయంలో చేరారు. అసిస్టెంట్ సీఎంఓ కె.చంద్రశేఖర్, ఏఎంఓ పి.వేణుగోపాల్, అలెస్కో కె.రామచంద్ర, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) బి.నారాయణస్వామి విధుల్లో చేరగా.. ఏఎస్ఓగా ఎంపికై న ఎన్.నరసింహారెడ్డి మాత్రం చేరలేదు. వాస్తవానికి ఈయన అందరికంటే మెరిట్ ఉన్నట్లు తెలిసింది. ఏఎంఓ పోస్టు పట్ల ఆసక్తి ఉన్నా.. ఆయనను ఏఎస్ఓ పోస్టుకు ఎంపిక చేయడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆసక్తి చూపలేదు. దీంతో ఏఎస్ఓ పోస్టు భర్తీకి మళ్లీ బ్రేక్ పడినట్లేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుపై కోర్టుకు.. అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) పోస్టుపై తపోవనం జిల్లా పరిషత్ పాఠశాల ఇంగ్లిష్ టీచరు కిష్టప్ప హైకోర్టును ఆశ్రయించారు. ముందు నోటిఫికేషన్లో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధికారులు ఎంపిక చేశారు. ఆమోదం కోసం రాష్ట్ర అధికారులకు నివేదించగా.. ఎలాంటి కారణం లేకుండా ఆయన్ను తప్పించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న తనను నిబంధనలకు విరుద్ధంగా తప్పించారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ కన్నడలో చదివి ఉండాలని పేర్కొన్నారు. తాజాగా తీసుకున్న నారాయణస్వామి ప్రాథమిక స్థాయిలో అది కూడా ఒక తరగతి మాత్రమే కన్నడలో చదివినట్లు తెలిసింది. ఈయనను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పండుగ పూట విషాదం
ఉరవకొండ/ వజ్రకరూరు: ఆ దంపతులు వారసుడి కోసం ఎన్నో నోములు నోచారు. ఎన్నో గుళ్లు తిరిగారు. ముగ్గురు కుమార్తెల తర్వాత కుమారుడు పుట్టడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. అలా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం ఒక కుదుపు కుదిపేసింది. దసరా పండుగకు ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి సంబరంగా ఉన్నారు. తండ్రీ పిల్లలు అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. ‘అమ్మా గుడి నుంచి రాగానే నాకు ఓళిగ చేసి పెట్టాలి’ అంటూ కొడుకు చెప్పాడు. అవే కొడుకు చివరి మాటలు అవుతాయని ఆ తల్లి ఊహించలేదు. అరగంటకే రోడ్డు ప్రమాదంలో భర్త, కుమారుడు దుర్మరణం చెందారన్న వార్త ఆమెను కుదిపేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మీనుగ సుంకన్న (43), నాగలక్ష్మి దంపతులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు సులోచన, కల్పన, భవానితో పాటు కుమారుడు సుదర్శన్ (10) సంతానం. గురువారం ఉదయం దసరా పండుగను పురస్కరించుకుని అమ్మవారి దర్శనం కోసం వజ్రకరూరు మండలం కడమలకుంటకు ద్విచక్రవాహనంపై ఉరవకొండ నుంచి తన కుమారుడు సుదర్శన్, కుమార్తెలు కల్పన, భవానితో కలిసి సుంకన్న బయల్దేరాడు. భార్య నాగలక్ష్మి, పెద్ద కుమార్తె సులోచన ఇంటివద్దే ఉన్నారు. పిల్లలతో కలిసి వెళ్తుండగా ద్విచక్రవాహనాన్ని మార్గ మధ్యంలో పీసీ ప్యాపిలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుంకన్న, కుమారుడు సుదర్శన్ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు వెళుతున్న వాహనదారులు గమనించి వెంటనే వజ్రకరూరు పోలీసులకు సమాచారం అందించారు. విషయం కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ సుంకన్న భార్య గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. గాయపడిన కుమార్తెలను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించారు. సుంకన్న భార్య ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహాత్ముని కల సాకారం చేసిన జగన్
అనంతపురం కార్పొరేషన్: జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్బహుదూర్ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శాంతి, అహింస అనే ఆయుధాలతో గాంధీజీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గాంధీజీ ఆశయ సాధన కోసం అందరూ కలసికట్టుగా ముందుకెళ్దామన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి 1,25,000 మందికిపైగా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సచివాలయల ద్వారా ఇంటి వద్దకే సుపరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి దేశానికి ఎన్నో సేవలందించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థ నాయక్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, రాష్ట్ర నాయకులు వెన్నం శివరామిరెడ్డి, మదిరెడ్డి నరేంద్రరెడ్డి, వేమల నదీం, కృష్ణవేణి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, సైఫుల్లాబేగ్, నాయకులు మీసాల రంగన్న, అనిల్కుమార్గౌడ్, రహంతుల్లా, జావేద్, కై లాస్, రాధాకృష్ణ, ఎంఎస్ఎస్ సాదిక్, వెన్నపూస రామచంద్రారెడ్డి, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, పసలూరు ఓబులేసు, ఉష, తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
● కంటి తుడుపు ప్రదర్శన.. కనిపించని రైతులు
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ఆగ్రోస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు రైతులు కరువయ్యారు. ఏదో చేయాలంటే చేయాలన్నట్లుగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పట్టుమని 20 మంది కూడా రైతుల హాజరు కాలేదు. వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఆగ్రోస్ మేనేజర్ ఓబుళపతి, డ్వామా పీడీ సలీంబాషా, జెడీబీఎన్ఎఫ్ డీపీఎం లక్ష్మానాయక్, ఏఆర్ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.విజయశంకరబాబు, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, ఏడీఏ అల్తాఫ్తో పాటు ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ అధికారులు, ఆయా శాఖల సిబ్బంది, ఆర్ఎస్కే అసిస్టెంట్లు, ఓ ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. డ్రోన్లు, రోటోవీటర్లు, టిల్లర్లు, ఇతర కొన్ని పరికరాలు ప్రదర్శించారు. ట్రాక్టర్లు, డ్రోన్లు, ఇతర వ్యవసాయ పరికరాలపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించినట్లు జేడీఏ తెలిపారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి అనంతపురం: జూనియర్ న్యాయవాదులకు తక్షణమే స్టైఫండ్ చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవరావు డిమాండ్ చేశారు. అనంతపురం బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమిత్ర పథకం కింద ప్రతి నెలా జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే శిక్షణ భృతిని పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీని విస్మరించారని విమర్శించారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించకపోతే అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐలు అధ్యక్ష, కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు ఈ.ప్రసాద్, నాగరాజు, కమిటీ సభ్యులు నాగభూషణ్, శ్రీనివాస్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
గొంతు కోసుకుని.. ఆస్పత్రి నుంచి పరుగు తీసి!
ఉరవకొండ/అనంతపురం కార్పొరేషన్: క్షణికావేశంలో పొలాల్లో గొంతు కోసుకున్న ఓ యువకుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. అతికష్టంపై పోలీసులు వెంటాడి పట్టుకుని మళ్లీ ఆస్పత్రికి చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జీజీహెచ్లో చేర్పిస్తే అక్కడా తనదైన శైలిలో రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఉరవకొండలోని హమాలీ కాలనీకి చెందిన శేఖర్కు వివాహమైంది. పిల్లలు లేరు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన శేఖర్ క్షణికావేశానికి లోనై గురువారం బూదగవి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి కత్తితో గొంతు కోసుకున్నాడు. అటుగా వెళుతున్న రైతుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా ఒక్కసారిగా అందరినీ తోసేసి రోడ్డుపైకి పరుగు తీశాడు. సీఐ మహనందితో పాటు సిబ్బంది వెంటపడి పరుగు తీసినా చేతికి చిక్కకుండా తప్పించుకోని పారిపోతుండగా స్థానికులు అతి కష్టంపై అడ్డుకుని నిలువరించారు. వెంటనే శేఖర్ను పట్టుకుని పోలీసులు ఆస్పత్రికి చేర్చి, దగ్గరుండి చికిత్స చేయించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని జీజీహెచ్కి తరలించారు. జీజీమెచ్లో హల్చల్.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో శేఖర్ను జీజీహెచ్కు పోలీసులు, కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. అయితే చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తూ క్యాజువాలిటీలోని టేబుళ్లపైకి ఎక్కి కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. చివరకు ఈఎన్టీ వైద్యురాలు డాక్టర్ మధులిక, తదితరులు శేఖర్కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి, మెయిన్ ఆపరేషన్ థియేటర్కు తరలించి శస్త్రచికిత్స చేసి, ఈఎన్టీ వార్డుకు తరలించారు. కాసేపటికి తేరుకున్న శేఖర్ అక్కడున్న సెక్యూరిటీ, అటెండర్పై కర్రతో దాడి చేశాడు. శుక్రవారం ఉదయం శేఖర్ను మెరుగైన వైద్యం కోసం కడప ఆస్పత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యాయత్నం జీజీహెచ్లో సర్జరీ తర్వాత సెక్యూరిటీ, తదితరులపై దాడి -
పెట్రోల్ బంకుల్లో దోపిడీ
జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంది. అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంతో వినియోగదారుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. తాజాగా అనంతపురంతో పాటు గుంతకల్లులో పెట్రోల్ బంకుల్లో మోసాలపై స్థానికులు తిరగబడ్డారు. అనంతపురం: నగరంలోని గుత్తిరోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో తక్కువ పెట్రోల్ పోస్తూ మోసం చేస్తున్నారంటూ యువకులు ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో కాశీవిశ్వనాథ్ అనే యువకుడు రూ.100 ఇచ్చి పెట్రోల్ పట్టాలని కోరాడు. అందులో కేవలం 50 రూపాయల విలువ గల పెట్రోల్ మాత్రమే పట్టారు. బైక్ నుంచి పెట్రోల్ను బాటిల్కు తీసుకుని పరిశీలిస్తే కొలతల్లో తేడా రావడంతో పెట్రోల్ బంకు పంప్ ఆపరేటర్ను నిలదీశాడు. మీరు ఇచ్చింది రూ.50. పెట్రోల్ కూడా అంతే వేశానంటూ బుకాయించాడు. దీంతో వినియోగదారుడిలో అసహనం రేకెత్తింది. ఈ పెట్రోల్ బంకులో ఏళ్ల తరబడి మోసం జరుగుతోందని, ఈ రోజు పరిశీలిస్తే గుట్టు రట్టయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. బాధిత వినియోగదారుడికి మద్దతుగా పెట్రోల్ బంకు వద్ద నిరసన తెలిపారు. ప్రజల్ని మోసగిస్తూ.. తక్కువ పెట్రోల్ను పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు చెట్ల కుండీలను పగులగొట్టారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వన్టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. శనివారం వరకూ పెట్రోల్ బంకు తెరవకూడదని, తూనికలు కొలతల శాఖ అధికారులతో తనిఖీ చేయించిన అనంతరం వారు ఆమోదిస్తేనే పెట్రోల్ బంకు తెరవాలని సీఐ ఆదేశించారు. కొలతల్లో భారీ వ్యత్యాసాలు నిలదీసిన వినియోగదారులపై దౌర్జన్యం వాహనదారుల్లో పెల్లుబుకిన ఆగ్రహం -
విదేశాలకు చీనీ ఎగుమతులపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం మార్కెట్ నుంచి విదేశాలకు చీనీ ఎగుమతులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఉన్న చీనీ మార్కెట్ను కలెక్టర్ సందర్శించారు. ఈ–నామ్ పద్ధతిలో చీనీ క్రయ విక్రయాల గురించి ఆరా తీశారు. అలాగే ఏటా మార్కెట్కు వస్తున్న చీనీకాయలు, పలుకుతున్న ధరలు, రైతులకు కల్పిస్తున్న వసతులు తదితర అంశాల గురించి మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, గ్రేడ్–2 సెక్రటరీ రూప్కుమార్, అలాగే ట్రేడర్లను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి కనీసం 200 టన్నులు చీనీకాయలు విదేశాలకు ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటే రైతులకు మరింత గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు. ‘అమృత్’ పనులు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: ‘అమృత్’ పథకం కింద నగరపాలక సంస్థతో పాటు పురపాలక సంఘాల్లో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రజారోగ్య, నగర పాలక, టిడ్కో అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 1.0 కింద రూ.15.35 కోట్లతో చేపట్టిన అనంతపురం వాటర్ సప్లయ్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ పనులు, ట్రయల్ రన్ చేపట్టాలని ఆదేశించారు. పథకం కింద గుంతకల్లు పట్టణంలో రూ.10.98 కోట్లతో చేపట్టిన పనులు పూర్తిచేసి ఈ నెలాఖరుకు ట్రయల్ రన్ చేపట్టాలన్నారు. తాడిపత్రిలో పనులు వారంలోగా పూర్తి చేయాలన్నారు. అనంతపురం, గుంతకల్లులో సీపేజ్ అండ్ సెప్టేజ్ నిర్వహణ పనులను, ఇతర మునిసిపాలిటీల్లో చేపట్టిన ఇతర ప్రధాన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఏపీ టిడ్కో కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తయిన వాటికి సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 301 చెరువులను నింపాలి జిల్లాలో భూగర్భజలాలు పెరగాలంటే 301 చెరువులను నీటితో నింపాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నీటి వనరులు, భూగర్భజలాల పెంపు, తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హెచ్చెల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్, మైనర్ ఇరిగేషన్ శాఖల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్షించారు. -
‘ఉపాధి’ అక్రమాలకు చెక్!
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను ప్రవేశపెడుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పనుల్లో పాలు పంచుకుంటేనే ఉపాధి వేతనం అందుతుంది. లేకపోతే లేదు. గతంలో నకిలీ ఫొటోలతో దోపిడీ.. గతంలో ఉపాధి హామీ పథకం నిధులను అడ్డగోలుగా దోచేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు చేతి వాటం ప్రదర్శించి జాబ్కార్డు ఉంటే చాలు ఉపాధి పనులకు రాకున్న వచ్చినట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నకిలీ ఫొటోలను అప్లోడ్ చేసి వేతనాల రూపంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో 2వేలమంది ఉపాధి కూలీలు ఉంటే రోజు వారీగా 1,900 మందికి పైగా పనులకు హాజరైనట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేశారంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గ్రామం మొత్తం ఉపాధి పనులకు హాజరవడంపై జిల్లా అధికార యంత్రాంగమే విస్తుపోయింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే కేవలం 200మంది మాత్రమే కనిపించారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు 20 రోజుల వేతనాలను నిలుపుదల చేశారు. జిల్లాలోని 32 మండలాల్లో ఇదే తంతు కొనసాగినట్లుగా అప్పట్లో అధికారులు గుర్తించారు. ప్రతి సోమవారం వేతనాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.86 లక్షల జాబ్కార్డులు, 11.58 లక్షల మంది శ్రామికులు ఉన్నారు. అనంత జిల్లాలో 3.16లక్షల జాబ్కార్డులు, 5.38 లక్షల మంది శ్రామికులు, శ్రీసత్యసాయి జిల్లాలో 3.70 లక్షల జాబ్ కార్డులు, 6.20 మంది శ్రామికులున్నారు. వీరి జాబ్కార్డులను ఆధార్తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 శాతానికి పైగా అనుసంధాన ప్రక్రియను పూర్తయింది. పనులకు హాజరయ్యే శ్రామికులకు ఈ–కేవైసీని తప్పనిసరి చేయడంతో కష్టించిన వారికి మాత్రమే వేతనాలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. వారంలో ఎన్ని రోజులు పని చేసినా.. పని చేసిన రోజులకు సంబంధించి ప్రతి సోమవారం వేతనాలు వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. ప్రతి రోజూ రెండు పర్యాయాలు పనులకు హాజరైన ఫొటో, పనులు ముగించిన అనంతరం మరో ఫొటో ఆధారిత హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జాబ్కార్డులకు ఆధార్ అనుసంధానం 15 నుంచి జిల్లాలో అమలు -
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
తాడిపత్రి రూరల్: స్థానిక చింతల వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సూర్యప్రభ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. కేశేపల్లి టీచర్కు అంతర్జాతీయ కార్టూనిస్ట్ అవార్డుశింగనమల(నార్పల): అబ్లా ఆర్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కార్టున్ – ఎల్నాస్ఎల్ హల్వా 2025 పోటీల్లో నార్పల మండలంలోని కేశేపల్లి జెడ్పీహెచ్ఎస్ ఆర్ట్ టీచర్ చిన్న కుళ్లాయప్పకు అవార్డు దక్కింది. క్యారికేరేచర్ విభాగంలో వివిధ దేశాలకు చెందిన పలువురు కార్టూనిస్ట్లు పోటీ పడగా, భారత దేశం నుంచి తలపడిన చిన్న కుళ్లాయప్ప ద్వితీయ స్థానంలో నిలిచారు. దీంతో ఆయనను నార్పల మండల వాసులు, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి ● ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ అనంతపురం మెడికల్: పీహెచ్సీ వైద్యుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలని కూటమి సర్కార్కు ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం నాయకులు హితవు పలికారు. సమ్మెలో భాగంగా శుక్రవారం అనంతపురంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యులుగా మూడేళ్ల పాటు విధులు కొనసాగించిన తర్వాత పీజీ వైద్య విద్యను అభ్యసించడానికి గతంలో ఉన్న 30 శాతాన్ని 15 శాతానికి కుదించడం సబబు కాదన్నారు. టైం బౌండ్ పదోన్నతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. గత నెలలో సెకండరీ హెల్త్ సర్వీసులో కేవలం రెండు సంవత్సరాలు పూర్తయిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు డిప్యూటీ సివిల్ సర్జన్లుగా హోదా ఇచ్చి ఇంత వరకూ ప్రొబేషనరీ పీరియడ్ డిక్లరేషన్ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ఏపీ పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ నాయకులు డాక్టర్ లోకేష్, డాక్టర్ శివసాయి, డాక్టర్ మనోజ్, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శివశంకర్ నాయక్, డాక్టర్ జయకుమార్ నాయక్, డాక్టర్ స్వాతి, డాక్టర్ సుష్మిత డాక్టర్ చందన, డాక్టర్ హనీషా తదితరులు పాల్గొన్నారు. ‘దుర్గం’లో పట్టపగలే భారీ చోరీ ● రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం అపహరణ కళ్యాణదుర్గం: స్థానిక పార్వతీ నగర్లో పట్టపగటే భారీ చోరీ జరిగింది. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు ఉదయం బంధువుల ఇంటికెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలోపు చోరీ జరగడం గమనార్హం. పోలీసులు తెలిపిన మేరకు... పార్వతీనగర్లో నివాసముంటున్న మహేంద్ర నాయుడు.. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆటోమొబైల్స్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి శుక్రవారం ఉదయం బంధువుల ఆహ్వానం మేరకు బెళుగుప్ప మండలం విరుపాపల్లిలో జరిగే ఓ విందు కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చిలోపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి గమనించారు.రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పట్టణ సీఐ హరినాథ్, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజీల్లో ఓ దొంగ కదలికలను పోలీసులు స్పష్టంగా గుర్తించారు. బదిలీపై 22 మంది టీచర్ల రాక అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా జిల్లాకు 22 మంది వచ్చారు. శుక్రవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎం.ప్రసాద్బాబు సమక్షంలో కౌన్పెలింగ్ నిర్వహించి స్కూళ్లు కేటాయించారు. బదిలీల్లో జిల్లాకు వచ్చిన వారిలో హెచ్ఎంలు ఇద్దరు, పీఎస్హెచ్ఎంలు ఇద్దరు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకరు, గణితం ముగ్గురు, పీఎస్ ముగ్గురు, బీఎస్ ఒకరు, ఇంగ్లీష్ ఒకరు, పీఈటీ ఒకరు, ఎస్జీటీలు ఏడుగురు ఉన్నారు. కాగా 3, 4 కేటగిరీలకు సంబంధించి కొన్ని స్కూళ్లు మాత్రమే ఖాళీలు చూపడంపై యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆయా కేటగిరీల్లో అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు. -
బెళుగుప్ప ఎంపీపీపై ‘అవిశ్వాసం’ పెట్టండి
● ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కళ్యాణదుర్గం: బెళుగుప్ప ఎంపీపీ సి.పెద్దన్నపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది పార్టీ నాయకులతో కలిసి కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచి ఎంపీపీగా పదవి అలంకరించిన పెద్దన్న అనంతర కాలంలో టీడీపీలోకి చేరిపోవడంతో పాటు అభివృద్ధి పనులకు సహకరించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చులకనగా చూస్తున్నారని వాపోయారు. ఇలా పలు కారణాలతో మెజార్టీ సభ్యులైన తాము ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1991లోని 245 సెక్షన్ 1 మేరకు సి.పెద్దన్నపై అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. తమ విన్నపం మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, మండల కన్వీనర్ మచ్చన్న, జెడ్పీటీసీ త్రిలోక్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగప్ప, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, రమణేపల్లి సర్పంచ్ రమేష్, కాలువపల్లి మాజీ సర్పంచ్ తిమ్మన్న, గుండ్లపల్లి వెంకటరెడ్డి, మోహన్, ఎంపీటీసీలు సురేష్బాబు, ప్రసాద్, ఈర బొమ్మన్న, పుష్పావతి, వరలక్ష్మి, అంజినమ్మ, నాగరత్నమ్మ, ప్రభావతి, రేఖమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో చిరుత...!
కళ్యాణదుర్గం: పట్టణంలోని అక్కమాంబ కొండకు ఆనుకుని ఉన్న పార్వతినగర్లోని జనావాసాల్లోకి బుధవారం అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. సమీపంలోని ఓ ఇంటి ఆవరణలోని మెట్లపై కుక్క పడుకుంది. ఒక్క ఉదుటున చిరుత దాడి చేసి కుక్కను కిందకు లాక్కొచ్చింది. గట్టిగా అరుస్తూ చిరుత నుంచి తప్పించుకున్న కుక్క మరో వైపున పరుగెత్తింది. అదే సమయంలో అక్కడే ఆరుబయట పడుకున్న ఓ వ్యక్తి లేవడంతో చిరుత అటునుంచి కొండప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. చిరుత సంచారంపై పలుమార్లు స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జనావాసాల్లోకి రాకుండా చిరుతను బంధించి అటవీ ప్రాంతంలోకి వదలేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సత్యసాయి జయంతిఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా యశ్వంతపూర్–హిందూపురం (06518/19) ప్యాసింజరును ఈ నెల 20 నుంచి 26 వరకు గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే బెంగళూరు–ధర్మవరం మధ్య మరో ప్యాసింజర్ రైలు (06595/96) ఈ నెల 20 నుంచి 26 వరకు నడపనున్నట్లు వెల్లడించారు. సీఈసీ, ఎస్ఈసీలో పలువురికి చోటు అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎస్ఈసీ)ల్లో జిల్లాకు చెందిన కొందరికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ సభ్యులుగా ఉమామహేశ్వర్ నాయుడు(కళ్యాణదుర్గం), రంగన్న, నదీం అహ్మద్ (అనంతపురం అర్బన్), ఎస్ఈసీ సభ్యులుగా బోగాతి నారాయణరెడ్డి (శింగనమల), గౌని ఉపేంద్రరెడ్డి (రాయదుర్గం), లింగాల శివశంకర్రెడ్డి (అనంతపురం అర్బన్), బొంబాయి రమేష్నాయుడు (తాడిపత్రి) నియమితులయ్యారు. -
ఇసుక డంప్ సీజ్
బొమ్మనహాళ్: అక్రమంగా డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. వివరాలు... బొమ్మనహాళ్ మండలంలోని కురువల్లి, బొల్లనగుడ్డం గ్రామాలకు చెందిన కొందరు అధికార పార్టీ అండతో ఇసుక దందా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 25 ట్రాక్టర్ల ఇసుకను కురువల్లి గ్రామ శివారులో డంప్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నబీరసూల్, తహసీల్దార్ మునివేలు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, ఇసుక డంప్ను సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా నిల్వలు చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మునివేలు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు గుత్తి: స్థానిక చెంబుల బావి వీధిలో రెండు రోజుల క్రితం రూ.300 కోసం గొడవపడి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయన్నారు. వాటి ఆధారంగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్జల్, ఆదిల్, ఆరీఫ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున యథేచ్ఛగా మద్యం అమ్మకాలుబ్రహ్మసముద్రం : మహాత్మా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం. అయితే ఇందుకు బ్రహ్మసముద్రం గ్రామానికి అధికారులు మినహాయింపునిచ్చినట్లుగా ఉంది. గాంధీ జయంతి, దసరా రెండూ ఒకే రోజు రావడంతో బ్రహసముద్రంలో బెల్ట్షాపు నిర్వాహకులు హంగామా చేశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. బెల్ట్ షాప్ను పూలతో ముస్తాబు చేసి, 2వ తేదీ ఉదయం 6 గంటలకే మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు. విషయం తెలిసినా అటుగా రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. స్థానికులు కొందరు కళ్యాణదుర్గం ఎకై ్సజ్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మరుక్షణమే బెల్ట్షాపు నిర్వాహకుడికి ఫోన్ చేసిన వారి సమాచారం అందించి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందంటూ స్థానికులు మండిపడ్డారు. -
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వివాహ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిలో పెద్దారెడ్డిని ఆపారు. ఈ క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వివాహానికి వెళ్తానని మందుగానే పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. -
విద్యుదాఘాతంతో గోశాల కార్మికుడి మృతి
ఆత్మకూరు: విద్యుత్ షాక్కు గురై గోశాల కార్మికుడు మృతిచెందాడు. ఘటనపై గోశాల నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహ రించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు జోక్యంతో బాధితులకు న్యాయం చేకూరింది. వివరాలు... ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గోశాలలో కుర్లపల్లికి చెందిన సంజీవులు (40) పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం విద్యుత్ మోటారు సాయంతో నీటిని పడుతూ గోశాలను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతిచెందాడు. మృతదేహం ఐదు గంటల పాటు అక్కడే ఉన్నా... నిర్వాహకులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. సంజీవులు మృతదేహంపై పడి భార్య రమాదేవి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. న్యాయం చేయాలంటూ ఆందోళన సంజీవులు మృతిపై న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అనంతపురానికి చెందిన ఆదినారాయణ నాయుడు గోశాల నిర్వహిస్తున్నాడని, ఎండోమెంట్ అనుమతులు లేకపోయినా అనధికారంగా నడిపిస్తూ అక్కడ పనిచేస్తున్న దళితుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మహిళా మండల మాజీ కన్వీనర్ సుభద్రమ్మ అక్కడకు చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. సంజీవులు మృతి చెందిన ఐదు గంటల సేపైనా ఆదినారాయణ నాయుడు అక్కడకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులను పక్కన పెట్టుకుని ఆదినారాయణనాయుడు అక్కడు చేరుకున్నారు. పెన్నోబులేసు తదితరులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం చెల్లిస్తానంటూ అంగీకరించారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు చెల్లించారు. అనంతరం సంజీవులు భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘటన మృతిపై స్పందించని గోశాల నిర్వాహకులు బాధితుల ఆందోళన -
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
అనంతపురం సిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ముందుకు సాగుతోందని ఆ సంస్థ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ (జీఎం) షేక్ ముజీబ్పాషా పేర్కొన్నారు. అనంతపురంలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మారిన కాలానుగునంగా ప్రైవేటు సంస్థలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ లోనూ అనేక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలందించడమే లక్ష్యంగా దూసుకుపోతోందని వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లు 13,208 ఉండగా, ఓఎల్టీఎస్ 189 కనెక్షన్లు ఉన్నాయన్నారు. 2జీ/4జీ టవర్లు 343 ఉండగా, 2,79,591 మంది ప్రీపెయిడ్ వినియోగదారులు ఉన్నారన్నారు. 2,679 మంది పోస్ట్పెయిడ్ కస్టమర్లు, 790 ఐఎల్ఎల్ కనెక్షన్లను కలిగి ఉన్నామన్నారు. సమష్టి కృషితోనే తమ సంస్థ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే ఏడాదిలో 5జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలు, స్కీముల అమలు కారణంగా ఇతర నెట్వర్క్ల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీజీఎం బాలగంగాధర్రెడ్డి, ఏజీఎం బాలాజీ, ఎస్డీఈలు రేవతి, హేమంత్కుమార్, శ్రీనివాసరెడ్డి, జేటీఓలు మాళవిక, వెంకటరెడ్డి, ఐఎఫ్ఏ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్పాషా అనంత వేదికగా అట్టహాసంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
‘సాధారణం’తో సరి
అనంతపురం అగ్రికల్చర్: ‘ఖరీఫ్’ సాధారణ వర్షపాతంతో ముగిసింది. సెప్టెంబర్ నెలాఖరుతో సీజన్ ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ మొదలు కాక ముందే తొలకర్లు పలకరించడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. దానికి తోడు నైరుతి రుతుపవనాలు ఈ సారి మే 26న చాలా ముందుగానే ప్రవేశించడంతో అన్నదాత హర్షాతిరేకం వ్యక్తం చేశాడు. కానీ రుతుపవనాల ప్రవేశం తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. జూన్, జూలై రెండు నెలల పాటు వాన పడటం గగనంగా మారిపోయింది. జూలై ఆఖరుకే జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జూన్లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. అది కూడా జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారం తర్వాత పరిస్థితి మారిపోయింది. అలాగే, ఖరీఫ్ పంటలు విత్తుకునేందుకు అత్యంత కీలకమైన జూలైలో వర్షాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జూలైలో 64.3 మి.మీ గానూ 46 శాతం తక్కువగా 34.7 మి.మీ వర్షం కురిసింది. జూన్, జూలైలో కేవలం ఐదు వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం. 28 రెయినీ డేస్.. నాలుగు నెలల ఖరీఫ్లో 28 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. అందులో ఆగస్టులోనే 14 రికార్డు కాగా మిగతా మూడు నెలల్లో మరో 14 రోజులు నమోదు కావడం గమనార్హం. ‘సాధారణం’ నమోదైనా శింగనమల, పుట్లూరు, అనంతపురం, రాప్తాడు మండలాల్లో తక్కువగానే వర్షం కురిసింది. 10 మండలాల్లో ఎక్కువగానూ, 17 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇలా ఖరీఫ్లో వర్షాలకు సంబంధించి భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో పంటల సాగు పడుతూ..లేస్తూ సాగింది. ఎట్టకేలకు 3.43 లక్షల హెక్టార్లకు గానూ 88 శాతంతో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సారి 1.04 లక్షల హెక్టార్లతో కంది పంట మొదటి స్థానంలో ఉండగా, 90 వేల హెక్టార్లతో వేరుశనగ రెండో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వకపోవడంతో ఉలవ, పెసర, అలసంద, కొర్ర, జొన్న తదితర పంటలు నామమాత్రంగా మిగిలిపోయాయి. అననుకూల వర్షాలతో ఈ ఏడాది అన్నదాత పరిస్థితి అయోమయంగా తయారైంది. మురిపించి.. కంగారెత్తించి ఖరీఫ్ నాలుగు నెలల్లో 335.5 మి.మీ వర్షపాతం నమోదు జూన్, జూలైలో వర్షాభావం, ఆగస్టులో అధికంగా వర్షం 28 వర్షపు రోజులు... 77 డ్రైస్పెల్స్ నమోదు 88 శాతంతో 2.98 లక్షల హెక్టార్లలో పంటల సాగు -
అనంతలో మహాత్ముని అడుగుజాడలు
● అక్షరబద్ధం చేసిన డాక్టర్ రమేష్ నారాయణ ● నేడు ఉచితంగా పంపిణీ అనంతపురం కల్చరల్: దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన మహాత్ముని అడుగుజాడలు జిల్లా అంతటా మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. నాటి దేశకాల పరిస్థితులను, మొక్కవోని దేశభక్తిని ఘనంగా చాటే స్మృతులు తరాలు సాగిపోతున్నా సజీవ రూపాలుగా దర్శనమిస్తూనే ఉన్నాయి. మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్న అనంత వాసులు ఎందరో తాము సైతం అంటూ స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ విశేషాలన్నింటినీ ఎంతో హృద్యంగా చాటి చెప్పేలా ‘అనంత’ జిల్లాలో గాంధీజీ’ పేరుతో అక్షర బద్ధం చేశారు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ పతికి రమేష్నారాయణ. గురువారం జరుగనున్న గాంధీజీ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. -
కొనసాగుతున్న వైద్యుల సమ్మె
● గ్రామీణులకు తప్పని అవస్థలు ● డీఎంహెచ్ఓ ముందుచూపులేని నిర్ణయంతో చిక్కులు అనంతపురం మెడికల్: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా బుధవారం ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయ కులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. క్లినికల్ పీజీ సీట్లను 30 శాతం నుంచి 15 శాతం, నాన్ క్లినికల్ సీట్లను 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో వైద్యులు నష్టపోతారన్నారు. 2020 బ్యాచ్కు సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి అలవెన్స్లు అందివ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ సంధ్య, డాక్టర్ శివసాయి, డాక్టర్ నాన్సి, డాక్టర్ సాహితి, డాక్టర్ లోకేష్, డాక్టర్ శివసాయి, ఆసియా, ప్రీతి, సుమన్ కుమార్, పరమేష్, వినోద్కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. స్తంభించిన సేవలు.. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు స్తంభించాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు తదితర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు కష్టాలు చెప్పనలవిగా మారాయి. డీఎంహెచ్ఓ ఇష్టారాజ్యం.. ముందుచూపు లేకుండా డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. వైద్యుల సమ్మె నేపథ్యంలో జిల్లాలోని పలు పీహెచ్సీలకు ఏరియా ఆస్పత్రుల నుంచి 28 మంది, బోధనాస్పత్రి నుంచి 26 మంది వైద్యులను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి నియమించిన 26 మందిలో పీజీలే ఉన్నారు. ఇందులోనూ 20 మంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు. ఈ క్రమంలో భాషా సమస్య తలెత్తడం,ఎటువంటి రవాణా చార్జీలను అందించకపోవడం, పైపెచ్చు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులను కేటాయించడంతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేదు. దీనిపై బుధవారం పీజీలందరూ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ నాయక్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. భద్రతా సమస్యల నేపథ్యంలో అంతదూరం వెళ్లలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ డీఎంహెచ్ఓ భ్రమరాంబ దేవితో మాట్లాడారు. పీజీ వైద్యులను అర్బన్ హెల్త్ సెంటర్లకు కేటాయించి, అక్కడ పని చేసే వారిని పీహెచ్సీలకు పంపితే ఇబ్బందులు ఉండవని చెప్పగా, డీఎంహెచ్ మాత్రం తానేమీ చేయలేనని చేతులెత్తేయడం గమనార్హం. ఇక.. పీజీలు బయోమెట్రిక్ వేస్తేనే స్టైఫండ్ వస్తుంది. బయోమెట్రిక్ సౌకర్యం అనంతపురంలోని వైద్య కళాశాలతో పాటు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే ఉంటుంది. ఆస్పత్రులకు వెళ్తే బయోమెట్రిక్ వేయలేక స్టైఫండ్ కూడా రాదు. ఈ విషయాలన్నీ తెలిసినా డీఎంహెచ్ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుగ పూట పస్తులేనా?
‘మా ప్రభుత్వంలో మాకే ఎదురు తిరుగుతారా? అయితే వారికి జీతాలు ఆపేయండి’ అనే ధోరణితో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై కూటమి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఫలితంగా తెలుగు పండుగల్లో అతిపెద్దదైన దసరా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండునెలలుగా జీతాలు లేకపోవడంతో మా ఇళ్లలో పండుగ కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం సెంట్రల్/తాడిపత్రి రూరల్: అంగన్వాడీ టీచర్లకు పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదు. అగస్టు నెల గౌరవ వేతనం సెప్టెంబరు మొదటి వారంలో వారి బ్యాంకు ఖాతాల్లో పడాల్సి ఉండగా సెప్టెంబర్ నెల దాటినా అధికారులు వేయలేదు. జిల్లాలోని 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దసరా పండగకు ఇక కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. దసర సెలవుల పేరుతో ఇతర ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, బంధువుల రాకతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. కొత్త దుస్తులు, పిండి వంటలు తదితరాలకు రూ.వేలల్లోనే ఖర్చు ఉంటోంది. అయితే రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అంగన్వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చినందుకేనా? అగస్టు నెల జీతం రాకపోవడానికి అంగన్వాడీ టీచర్లు తమ వద్ద సెల్ఫోన్లను అధికారులకు వెనక్కు ఇవ్వడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు సెల్ఫోన్ ద్వారా యాప్లో నమోదు చేయాల్సి ఉంది. అయితే చాలా ఏళ్ల క్రితం మంజూరు చేసిన సెల్ఫోన్లు కావడంతో యాప్లో నమోదు ప్రక్రియ సకాలంలో జరగక అంగన్వాడీ సిబ్బంది ఇబ్బందులు పడుతూ వచ్చారు. పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లను గత ఆగస్టులో వెనక్కు ఇచ్చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం.. గత నెల 25న చర్చలకు ఆహ్వానించింది. ఓ యూనియన్ (ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న) సెల్ఫోన్ వినియోగించడానికి సమ్మతించిండంతో అందరూ కూడా సెల్పోన్లను తీసుకుని పనిచేయాలని హుకుం జారీ చేసింది. దీంతో ప్రభుత్వ వైఖరిని ప్రధాన సంఘాలు వ్యతిరేకించాయి. ఆన్లైన్లో మాత్రం నమోదు చేయబోమని మాన్యువల్గా చేస్తామని స్పష్టం చేశాయి. దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జీతాలు నిలుపుదలతో అంగన్వాడీల మెడలు వంచే కుట్రకు తెరలేపింది. దీంతో ఆగస్టుతో పాటు సెప్టెంబర్ గడిచినా జీతాలు అందలేదు. 2,302జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు 2,079అంగన్వాడీ వర్కర్లు222మినీ అంగన్వాడీ వర్కర్లు2,079అంగన్వాడీ హెల్పర్లువెంటనే జీతాలు మంజూరు చేయాలి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గత రెండునెలలుగా జీతాలు పడలేదు. ప్రస్తుతం దసరా పండుగ వచ్చింది. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందిగా మారింది. పండుగ సరుకులు, నూతన దుస్తులు కొనుగోలు చేయలేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు మంజూరు చేయాలి. – రమాదేవి, జిల్లా కార్యదర్శి ఏపీ అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీలకు అందని ఆగస్టు వేతనం ముగిసిన సెప్టెంబరు నెల సెల్ఫోన్లు తిరిగిచ్చేశారని ప్రభుత్వం కక్ష! దసరా పండుగ సమయంలో డబ్బు లేక అవస్థలు -
‘రబీ’ వచ్చేసింది
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి మొదలైన ఖరీఫ్ సీజన్ ముగిసింది. బుధవారం నుంచి రబీ సీజన్ మొదలు కానుంది. డిసెంబర్ నెలాఖరు వరకు ‘రబీ’గా పరిగణిస్తారు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి చలికాలం, మార్చి నుంచి వేసవి మొదలవుతుంది. ఖరీఫ్లో 2.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ, కంది, పత్తి, మొక్కజొన్న, ఆముదం తదితర ప్రధాన పంటలు సాగులోకి వచ్చాయి. రబీలో జిల్లాలో ప్రధాన పంటగా పప్పుశనగ 70 వేల హెక్టార్లకు పైబడి సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రబీలో 1.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అంచనా వేశారు. అందులో ప్రధానంగా పప్పుశనగతో పాటు వేరుశనగ 20 వేల హెక్టార్లు, మిగతా అన్ని పంటలు కలిపి మరో 30 వేల హెక్టార్ల వరకు సాగులోకి రావొచ్చని చెబుతున్నారు. రబీ సీజన్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం 139.3 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. అందులో అక్టోబర్లోనే అత్యధికంగా 100.9 మి.మీ, నవంబర్లో 28.6 మి.మీ, డిసెంబర్లో 9.8 మి.మీ నమోదు కావాలి. ముందస్తు సాగుకు సిద్ధం.. ఖరీఫ్కు సంబంధించి జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో రబీలో ముందస్తు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. నల్లరేగడి భూముల్లో పప్పుశనగతో పాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు విత్తుకునేందుకు విత్తనం కోసం ఎదురుచూస్తున్నారు. అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డీ.హిరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పామిడి, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విపడనకల్లు, గుంత కల్లు మండలాల్లో విత్తన పంపిణీ చేపట్టాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు పప్పశనగ సాగుకు మంచి అదనుగా చెబుతున్నా... వర్షాలు వస్తే ముందుగానే సాగుకు రైతులు రెడీగా ఉన్నారు. కానీ కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు. గతేడాది 27,129 క్వింటాళ్ల విత్తన పప్పుశనగ కేటాయించగా... ఈ సారి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి పరిమితం చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఖరీఫ్లో పంపిణీ చేసిన వేరుశనగ, పప్పుశనగ, కందులు, విత్తన వరి తదితర వాటికి సంబంధించి కూటమి సర్కారు ఏపీ సీడ్స్ ద్వారా ఏజెన్సీలకు బకాయిలు చెల్లించలేదు. దీంతో విత్తన సేకరణ, సరఫరా, పంపిణీ ఈ సారి జాప్యమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే ఏఓలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లు నాన్సబ్సిడీ కింద రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము పూర్తి స్థాయిలో ఏపీ సీడ్స్కు చెల్లించకపోవడం కూడా సమస్యగా మారిందని చెబుతున్నారు. ఇక.. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రబీ కింద నీటి వసతి సదుపాయం కలిగిన ప్రాంతాల్లో వేరుశనగ సాగుకు వీలుగా రాయితీ విత్తన పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్లో 1.20 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా ప్రధాన పంటగా 70 వేల హెక్టార్లలో పప్పుశనగ ఈశాన్యంతో 139.3 మి.మీ సాధారణ వర్షపాతం! -
ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్
అనంతపురం: కర్ణాటక నుంచి ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ ఎకై ్సజ్ అధికారులకు ఓ ఆర్టీసీ డ్రైవర్ పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి వస్తున్న ఆర్టీసీ అనంతపురంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న శివకోటి ఆలయం వద్ద ఆపి తనిఖీ చేశారు. సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణిస్తున్న శివకోటి ఆలయం వద్ద నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ పి.ఓబులనారాయణరెడ్డి వద్ద నుంచి 60 ఆర్మీ ఫుల్ బాటిళ్ల మద్యం పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అదే బస్సులో ముందు వైపు కూర్చొన్న పాత నిందితులు సాకే పవన్కుమార్, వడే శ్రీనివాసులు వెంటనే బస్సు దిగి పారిపోయారు. బెంగళూరులోని ఆర్టీ క్యాంటీన్ నుంచి మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా చేరవేస్తున్నట్లుగా విచారణలో వెలుగు చూసింది. -
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 1న 0.4 మి.మీ, 2న 0.2 మి.మీ, 3న 2.4 మి.మీ, 4న 5.5 మి.మీ, 5న 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీల నుంచి 32.7 డిగ్రీలు, రాత్రిళ్లు 22.8 డిగ్రీల నుంచి 23.2 డిగ్రీల మధ్య ఉండొచ్చన్నారు. గొర్రె పిల్లలను మింగిన కొండచిలువ పుట్టపర్తి అర్బన్: మందలో ఉన్న రెండు చిన్న గొర్రె పిల్లలను కొండ చిలువ మింగింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం పైపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పొద్దుపోయాక సమీపంలోని కొండ నుంచి వచ్చిన భారీ కొండ చిలువ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి విజయ్ మందలోకి చొరబడింది. ఒక పిల్లను మింగేసింది. రెండవ పిల్లను నోట కరుచుకోవడంతో అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన విజయ్ తోటి కాపరుల సహకారంతో రెండవ పిల్లను కొండ చిలువ నోటి నుంచి లాగేశారు. అప్పటికే అది మృతి చెందింది. కొండచిలువ ఎటూ వెళ్లలేక మందలోనే ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పుట్టపర్తికి చెందిన కరుణ సొసైటీ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని బుక్కపట్నం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేశారు. పీహెచ్సీలకు 54 మంది వైద్యుల కేటాయింపు అనంతపురం మెడికల్: జిల్లాలోని పలు పీహెచ్సీలకు 54 మంది వైద్యులను కేటాయించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పీహెచ్సీల డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఆయా పీహెచ్సీలకు వైద్యులను సర్దుబాటు చేశారు. ఏరియా ఆస్పత్రుల నుంచి 28 మంది, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 26 మంది వైద్యులను పంపినట్లు డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. 104,108 సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం తాడిపత్రి రూరల్: పట్టణంలో భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకట రమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విశ్వక్సేన సేవ జరిగింది. ఆలయం చుట్టూ విశ్వక్సేనుల ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయం విద్యుద్దీపాలంకరణల నడుమ కొత్త శోభ సంతరించుకుంది. రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి : జేసీ అనంతపురం అర్బన్: కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లను జేసీ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చౌక ధరల దుకాణాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. కార్డుదారులు పోర్టబిలిటీ ద్వారా తమకు దగ్గరలోని ఏ చౌక దుకాణం వద్దనైనా సరుకులు తీసుకోవచ్చన్నారు. సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్యలున్నా కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఇళ్ల నిలుపుదల పాపం ప్రభుత్వానిదే
రాప్తాడురూరల్: ‘పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం కేవలం రూ. 1.80 లక్షలకే ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ పనులను నిలిపివేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలను నిలుపుదల చేసిన పాపం ఈ ప్రభుత్వానిదే’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురం నగర శివారులోని తన క్యాంపు కార్యాలయంలో ‘డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వ బాధితులకు జగన్ ఇచ్చిన అభయం డిజిటల్ బుక్ అన్నారు. మిథున్రెడ్డిది అక్రమ అరెస్ట్.. ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 2014–19 మధ్య లిక్కర్ అమ్మకాల ద్వారా రూ. 70 వేల కోట్ల ఆదాయం పొందితే, జగన్ హయాంలో 2019–24 మధ్య రూ.1.5 లక్షల కోట్లకు ఆదాయం పెరిగిందని, ఆదాయం పెరిగిన ప్రభుత్వంలో స్కాం జరిగిందా? లేకుంటే ఆదాయం తగ్గిన చంద్రబాబు హయాంలో స్కాం జరిగిందా ఆలోచించాలన్నారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికాడో దేశానికే తెలుసని,స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అనారోగ్య సమస్యలపై బెయిల్ వచ్చిందనేది అందరికీ తెలుసన్నారు. విజిలెన్స్తో ఏం తేల్చారు? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల లోనే జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, అయితే ఇప్పటిదాకా ఏమి తేల్చారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం రూరల్ మండలంలో ఇళ్ల నిర్మాణాలు జరగకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత ఆపారన్నారు. నేడు ఒక్కో ఇంటిపై అనంతపురం ఎమ్మెల్యే రూ. 10 వేలు, రాప్తాడు ఎమ్మెల్యే రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ‘అదేమైనా మీ నాయన గంటా.. లేకుంటే మీ జేజినాయన ముడుపులు ఏమైనా ఇచ్చారా..’ అని ప్రశ్నించారు. అమరావతిలో నాలుగు కంపెనీలకే రూ. వేల కోట్ల పనులు అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుక, చివరకు ఇళ్ల నిర్మాణాల నుంచి కూడా డబ్బులు కావాలా అని ప్రశ్నించారు. ఇంత దోచుకుంటున్నా మెడికల్ కళాశాలల నిర్మాణాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మనసు రాలేదా అని నిలదీశారు. పేదలకు ఉచిత వైద్యంతో పాటు పిల్లలకు వైద్యవిద్య అందించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేస్తారా అని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్సార్ చనిపోయిన తర్వాత దేవుడయ్యాడని, కానీ చనిపోయిన తర్వాత పీడ పోయిందబ్బ అనుకునేలా చేసుకోవద్దని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గంగుల భానుమతి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజి, లాయర్ నాగిరెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, గోవిందరెడ్డి, బండి పవన్, నీరుగంటి నారాయణరెడ్డి, లింగారెడ్డి, సునీల్దత్తరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణవి బాధ్యత లేని మాటలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్టవి బాధ్యత లేని మాటలు అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు.అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలతో టీడీపీ నేతలకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియడం లేదన్నారు. ‘అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి...కడుపైనా చెయ్యాలి’ అని గతంలో మాట్లాడారన్నారు.‘నువ్వు కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రివే.. అయినా అలా ఎలా మాట్లాడావు. గ్లాస్ అలా తిప్పి మ్యాన్సన్హౌస్ మందు తాగితే అమ్మ పెళ్లామవుతుందా...పెళ్లాం అమ్మవుతుందా’ అని నిలదీశారు. సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ‘ఎవడు’ అని మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. తల్లిని అవమానించిన వారి పంచన చేరి పవన్కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నారని, నేడు అన్నను అవమానిస్తే మాత్రం నోరు ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్పై చేస్తున్న దుష్ప్రచారమంతా చిరంజీవి రాసిన లేఖ, మహేష్బాబు, నారాయణమూర్తి మాటలతో పటాపంచలయ్యాయన్నారు. నిరుపేదల నుంచి ఒక్కో ఇంటికి రూ. 10 వేలు వసూలు చేస్తారా? కూటమి బాధితులకు జగనన్న అభయం ‘డిజిటల్ బుక్’ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
పేద విద్యార్థులు వైద్య విద్య చదవొద్దా?
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ సీఎంగా ఉన్న సమయంలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంద న్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావాలని, తమ విద్యార్థులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరిన ప్రభుత్వాలను చూశాం కానీ, మెడికల్ కళాశాలలు తాము నిర్వహించలేమంటూ కేంద్రా నికి లేఖ రాసిన ఏకై క ప్రభుత్వం ప్రస్తుత కూటమి సర్కారే అని దుయ్యబట్టారు. ఒక్కో కళాశాలలో 15 శాతం సీట్లు కేంద్రం భర్తీచేస్తే తక్కిన 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదివే వీలుండేదన్నారు. అలాంటిది ఉన్న కళాశాలలన్నీ ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందన్నారు. నగర మేయర్ వసీం మాట్లాడుతూ మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు అప్పగించడం దుర్మార్గమన్నారు. నిర్వహణ సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప మాట్లాడుతూ పీపీపీ విధానం మాటున ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు అప్పగిస్తున్నారన్నారు.రాష్ట్రంలో పేద విద్యార్థులు వైద్యవిద్య చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రైవేట్గా మెడికల్ సీటు పొందాలంటే రూ.80 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని, పేద వర్గాలకు ఇది సాధ్యమేనా అని వాపోయారు. పేదలను వంచిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగర అధ్య క్షుడు సోమశేఖర్రెడ్డి, మైనార్టీ, ఎస్టీ, మహిళ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు సైఫుల్లాబేగ్, శ్రీనివాసనాయక్, శ్రీదేవి, చంద్రశేఖర్యాదవ్, పార్టీ నాయకులు పసలూరు ఓబులేసు, రాఘవ, రాఘవేంద్రప్రసాద్, సాకే శంకర్, ఎగ్గుల శ్రీనివాసులు, గౌస్బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మారుతీనాయుడు, నరేంద్రరెడ్డి, ఆంజనేయులు, కాట మయ్య, సాకే కుళ్లాయిస్వామి,అశోక్, ప్రియాంక, వెన్నం శివరామిరెడ్డి, మారుతీప్రసాద్, రామాంజనేయులు, శోభారాణి, శోభాబాయి, కమల్ భూషణ్, కై లాస్, నితిన్రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ హయాంలో 17 వైద్య కళాశాలలు బాబు నిర్ణయంతో నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా వైద్య విద్య కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే భవిష్యత్తులో చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకుల హెచ్చరిక -
పేదలపై భారం
రేషన్ కోసం చౌక దుకాణం వద్ద క్యూలో నిల్చున్న కార్డుదారులు (ఫైల్) అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో పేదలకు సంక్షేమం కనుమరుగవుతోంది. రేషన్లో ‘కోత’ కొనసాగుతోంది. కార్డుదారులకు సరుకులను ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కందిపప్పు పంపిణీ నిలివేశారు. కాదు కాదు.. ఎగనామం పెట్టారు! పేదలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన జొన్నలు, రాగుల పంపిణీకి తాజాగా కూటమి సర్కారు మంగళం పాడింది. గత నెల వరకు జొన్నలను అరకొరగా స్టోర్లకు సరఫరా చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. అక్టోబరుకు సంబంధించి చౌక దుకాణాలకు జొన్నలు, రాగుల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు కిలో కందిపప్పు చొప్పున నెలసరి కోటా 615 టన్నులు, అదే విధంగా జొన్నలు 1,100 టన్నులు, రాగులు 1,100 టన్నులు కేటాయించాల్సి ఉన్నా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కందిపప్పు పంపిణీ చేయడం లేదు. మూడు నెలలుగా అరకొరగా జొన్నలు పంపిణీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం నేడు పూర్తిగా ఎగనామం పెట్టేసింది. అదే బాటలో రాగుల పంపిణీని కూడా నిలిపివేసింది. ఇచ్చిందీ గతంలో కొనుగోలు చేసినవే..! కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా కందిపప్పు కిలో రూ.67తో అందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసలు కొత్తగా కందిపప్పు కొనుగోలు చేసేందే లేదు. గత ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసిన స్టాక్ ఉన్నంత వరకే కందిపప్పును పంపిణీ చేయడం గమనార్హం. ఏడు నెలలుగా అదే మాట.. రేషన్ కోతపై అధికారులు చెప్పే కారణాలు వింటే విస్తుపోవాల్సిందే. కందిపప్పు సరఫరాకు సంబంధించిన ప్రక్రియ ఇంకా టెండర్ దశలో ఉందని ఏడు నెలలుగా చెబుతుండడం చూస్తే సార్లూ ‘ఏమి సెప్తిరి’ అని ఎవరికైనా అనిపించకపోదు. జొన్నలు, రాగుల విషయానికి వస్తే స్టాక్ అయితే ఉందట.. కాకపోతే ఆన్లైన్లో సమస్య కారణంగా స్టోర్లకు సరఫరా చేయలేకున్నామని చెప్పడం గమనార్హం. కోతలు... వాతలు కనిపించవా? గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా నాణ్యమైన కందిపప్పు, జొన్నలు, రాగులు పంపిణీ చేశారు. అయినా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేశారు. ఆ ‘పచ్చ’ కళ్లకు నేడు కోతలు.. వాతలు కనిపించడం లేదనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. కొనసాగుతున్న కూటమి కోతలు మొదట కందిపప్పు దూరం తాజాగా జొన్నలు, రాగుల పంపిణీకి మంగళం బియ్యం, చక్కెరతోనే సరి పేదలపై మోయలేని భారం కందిపప్పు, జొన్నలు, రాగులను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో పేదలు బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి కుటుంబం నెలకు ఒక కిలో కందిపప్పు, మూడు కిలోల జొన్నలు, ఒక కిలో రాగులు వినియోగిస్తారు. ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67, జొన్నలు, రాగులు మూడు కిలోలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.130, జొన్నలు రకాన్ని బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 వరకు, రాగులు కిలో రూ.50 వరకు పలుకుతున్నాయి. సర్కారు పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కిలో కంది పప్పుపై రూ.73 అదనంగా, మూడు కిలోల జొన్నలకు రూ.120 నుంచి రూ.180, రాగులకు కిలో రూ.50 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. -
2 నుంచి ప్రత్యేక రైళ్లు
● షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో.. గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో రైళ్లు నడుస్తాయన్నారు. అక్టోబర్ 2 గురువారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్ జంక్షన్లో రైలు బయలుదేరి ధర్మవరం జంక్షన్కు శనివారం తెల్లవారుజూమున 3.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ధర్మవరం జంక్షన్ నుంచి (01438) అక్టోబర్ 4 శనివారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 10.30 గంటలకు షోలాపూర్కు చేరుకుంటుందన్నారు. బీదర్, వికారాబాద్, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్డు, ములకలచెరువు, కదిరి రైల్వే స్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. బీదర్–బెంగళూరు మధ్య.. బీదర్–బెంగళూరు మధ్య అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. బీదర్ జంక్షన్ (07063)లో అక్టోబర్ 4 శనివారం మధాహ్నం 2.40 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు రైలు బెంగళూరు చేరుతుందన్నారు. తిరిగి అక్కడి నుంచి అక్టోబర్ 5 ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ చేరుకుంటుందన్నారు. హమ్నాబాద్, కమలాపూర్, కలబురిగి, షాహబాద్, వాడీ, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యలహంక సేష్టన్ల మీదుగా రైలు నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
తండ్రి స్ఫూర్తితో...
తాడిపత్రిలోని రెడ్డివారిపాలెంలో నివాసముంటున్న మనోహర్రెడ్డి భారత సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్ఫూర్తితో భారత సైన్యంలో చేరాలని కుమార్తె సాయిహరితరెడ్డి పరితపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. అయినా రాజీ పడకుండా ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తొలిసారిగా అమ్మాయిలకు పైలెట్ శిక్షణ కోసం చేపట్టిన ఇంటర్వ్యూలకు హాజరైంది. ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి పైలెట్ శిక్షణకు అర్హత సాధించిన సాయిహరిత రెడ్డిని అభినందిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని వ్యోమగామి కల్పనాచావ్లా తల్లి అందజేశారు. ప్రస్తుతం సాయి హరితారెడ్డి దక్షిణాఫ్రికాలో పైలెట్ శిక్షణ తీసుకుంటోంది. తన తండ్రిలా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేదే లక్ష్యమని ఆమె చెబుతోంది. -
ఉద్యోగులకు మొండిచేయి చూపిన ‘కూటమి’
● వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అనంతపురం ఎడ్యుకేషన్: దసరా కానుకగా రెండు డీఏలు, ఐఆర్ 30 శాతం ప్రకటిస్తారని ఎదురు చూసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధానకార్యదర్శి జి.శ్రీధర్గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఇప్పటికై నా స్పందించి డీఏలు, 30 శాతం మధ్యంతర భృతి, సంపాదిత సెలవుల ఎన్క్యాష్మెంట్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. తాగుడుకు డబ్బివ్వలేదని కొడవలితో దాడి అనంతపురం: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదంటూ సొంత మేనమామ కొడుకుపైనే కొడవలితో దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. వన్టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామ సింగిల్ విండో ప్రెసిడెంట్ చాకలి కేశన్న మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పాతూరు జంగాలపల్లి మసీదు వద్ద ఉన్న సమయంలో మేనత్త కుమారుడు సుబ్బారావు కలసి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రోజూ తాగుడుకు డబ్బు కావాలంటూ దౌర్జన్యం చేయడం సరికాదని కేశన్న సర్దిచెప్పబోతుండగా కొడవలితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు కేకలు వేయడంతో సుబ్బారావు అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రుడు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరూ టీడీపీకి చెందిన వారే కావడం, పైగా సమీప బంధువులు కావడంతో దాడిని రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అరటి చెట్టుకు రెండు గెలలు పుట్లూరు: సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా పుట్లూరు మండలం రంగరాజుకుంట గ్రామానికి చెందిన రైతు పొన్నపాటి హనుమంతురెడ్డి తోటలో ఒక చెట్టుకు రెండు గెలలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో అరటి పంటను సాగు చేయగా రెండవ పంటలో ఇలా ఒక చెట్టుకు మాత్రమే రెండు గెలలు వచ్చిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా రెండు గెలలు రావడం ఎన్నడూ చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాగా, అరటి మొక్క కాండంలో రెండవ శిరోజం ఏర్పడినప్పుడు ఇలా రెండు గెలలు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
‘స్పీడ్’ పెంచిన ‘తపాలా’
● నేటి నుంచి స్పీడ్ పోస్టులోకి రిజిస్టర్ పోస్టు విలీనం ● తడిసి మోపెడవుతున్న చార్జీలు అనంతపురం సిటీ: రిజిస్టర్ పోస్టును రద్దు చేసి, స్పీడ్ పోస్టులో కలిపేస్తున్నట్లు ప్రకటించిన తపాలా శాఖ.. స్పీడ్ పోస్టు చార్జీలను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు ఈ–కామర్స్ తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ వంటి సేవలు, దేశ వ్యాప్తంగా ఒకే టారిఫ్, విద్యార్థులకు 10 శాతం రాయితీ అంటూ నమ్మబలికే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచే స్పీడ్ పోస్టు అమలు : అతి తక్కువ ఖర్చుతో అనువైన తపాలా సేవగా కొనసాగుతూ వచ్చిన రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ పూర్తిగా రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులోకి విలీనం చేసింది. తపాలా శాఖ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల వారిపై అదనపు భారం పడుతోంది. అంతేకాక పోస్టు డెలివరీ సమయంలో చిరునామాదారు ఫోన్కు ఓటీపీ వస్తుంది. ధ్రువీకరణ తరువాతే పోస్టుమాన్ ఆ పోస్టును అందజేస్తారు. ఈ సేవ కోసం నిర్దేశిత టారిఫ్ మీద జీఎస్టీ కాకుండా అదనంగా ఒక్కో ఆర్టికల్కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. బల్క్ సేవలు వినియోగించుకునే సంస్థలకు 5 శాతం తగ్గింపు ప్రకటించింది. అయితే తపాలా శాఖ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే.. కేంద్ర తపాలా శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ కొరియర్ సంస్థలకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. దశాబ్దాలుగా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన రిజిస్టర్ పోస్టును స్పీడ్ పోస్టులోకి విలీనం చేయడం వినియోగదారుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. – ఇనగలూరు ఇమ్రోజా, నిరుద్యోగి, అనంతపురం ధరలు పెంచి రాయితీనా? అందరికీ అనువైన ధరలతో ఉన్న రిజిస్టర్ పోస్టును రద్దు చేసిన స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్పీడ్ పోస్టు ధరలు విపరీతంగా ఉన్నాయి. పైగా విద్యార్థులకు మాత్రం పది శాతం రాయితీ ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. ధరలు ఇష్టానుసారంగా పెంచి తగ్గిస్తున్నట్లు బుకాయించడం దేనికో? – బోయ ఎస్.పల్లవి, ఉద్యోగిని, అనంతపురం -
ధర్మవరం వరకు ‘సూపర్ ఫాస్ట్’ పొడిగింపు
● సత్యసాయి జయంత్యుత్సవాల నేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం కదిరి: గుంటూరు – తిరుపతి మధ్య నడుస్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు (17261)ను ధర్మవరం వరకూ పొడిగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి (నవంబర్ 23)ని పురస్కరించుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అంటే రెండు నెలల పాటు ఈ రైలు ధర్మవరం వరకు నడుపుతారు. ఆ తర్వాత ఎప్పటి లాగానే తిరుపతి వరకూ వచ్చి ఆగిపోతుంది. రోజూ సాయంత్రం 4.30 గంటలకు రైలు గుంటూరులో బయలుదేరుతుంది. నరసరావుపేట, వినుకొండ, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, రాజంపేట మీదుగా ప్రయా ణించి తెల్లవారుజామున 3.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుంచి 4.05 గంటలకు బయలుదేరి పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్, మొలకలచెరువు, కదిరి మీదుగా ఉదయం 9 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ధర్మవరంలో మధ్యాహ్నం 1.20కి బయలు దేరి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7.15కు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ 10 నిమిషాలు మాత్రమే ఆగి.. తర్వాత బయలుదేరి మరుసటి దినం ఉదయం 7.20 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రెండు నెలల పాటు రోజూ ఒక రైలు (17261) గుంటూరు లో సాయంత్రం 4.30కు బయలుదేరితే, ఇంకో రైలు (17262) ధర్మవరంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరేలా రైల్వేశాఖ నిర్ణయించింది. -
సమగ్ర శిక్షలోనూ అందని రెన్నెళ్ల జీతాలు
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వ నిర్వాకంతో సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అతి పెద్ద పండుగ చేసుకోలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, మండల్ లెవెల్ అకౌంటెంట్లు, సీఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్టులు, సైట్ ఇంజనీర్లు, ఆయాలు, డీపీఓ సిబ్బంది, కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం పేర్లతో వీరంతా తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు ప్రతి నెలా జీతం డబ్బులు అందితే గాని కుటుంబ పోషణ జరగదు. అలాంటిది రెండు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువుల అతిపెద్ద పండుగ కూడా వచ్చింది. పెద్దల సంగతి పక్కన పెట్టి కనీసం పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. పండుగ ముందు జీతాలు వస్తాయని ఎదురుచూసినా 30వ తేదీతో అది నిరాశగానే మిగిలింది. ఈ నేపథ్యంలో కొందరు వడ్డీకి అప్పులు చేయగా, మరికొందరు ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్ల వద్ద నగదు బదిలీ తీసుకున్నారు. ఎన్నికల ముందేమో ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తామన్న కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైం ఉద్యోగుల పట్ల పక్షపాతవైఖరిని అవలంభిస్తుండడం గమనార్హం. పస్తులు పెడుతున్నారు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఫైనాన్స్ కంట్రోలర్ను కలిసి విన్నవించాం. పండుగలోపు రెన్నెళ్ల జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ వేయలేదు. పండుగ పూట ఉద్యోగులను పస్తులు పెడుతున్నారు. – కె .విజయ్, సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ -
లాభసాటి వ్యవసాయమే లక్ష్యం..
తాడిపత్రిలోని అంబాభవానీ వీధిలో నివాసముంటున్న వద్దిమోహన్ కుమార్తె భానురేఖ.. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఇక్రిషాట్లో ఆరు నెలల ఇంటర్న్షిప్కు అర్హత సాధించింది. అనంతరం ఎమ్మెస్సీ చదివేందుకు జపాన్లోని మెక్స్ సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షల్లో నెగ్గి ఆ దేశంలోని హోక్కాయిడో యూనివర్సిటీలో రూ.70 లక్షల ఉపకార వేతనంతో ఉచితంగా సీటు దక్కించుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగి ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసి, వాటి ఫలాలను రైతులకు చేరువ చేస్తానని భానురేఖ సగర్వంగా అంటున్నారు. -
ఆర్డీటీని సమైక్యంగా కాపాడుకోవాలి
● కలెక్టర్ ఆనంద్కు ప్రజా సంఘాల నాయకుల వినతి అనంతపురం అర్బన్: పేదల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఆర్డీటీ సంస్థను సమైక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాల అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన పరిష్కార వేదికలో కలెక్టర్ ఓ.ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెవెన్యూవల్ చేయని కారణంగా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పేదలకు అందిస్తున్న కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చొరవ చూపి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలన్నారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సాకేహరి, ఎమ్మార్పీఎస్ ఓబులేసు, ఐఎంఎం బాషా, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, బేడబుడగ జంగాల సంఘం అంజి, పుసల సంఘం మధు, ఆర్డీటీ మాజీ ఉద్యోగులు గోవిందు, చండ్రాయుడు, హెల్పింగ్ హ్యాండ్స్ షబ్బీర్, నజీర్, ఎరికల సంక్షేమ సంఘం ముసలన్న పాల్గొన్నారు. -
పాలకుల్లో చలనం రావాలంటే ఉద్యమాలే శరణ్యం
● 7న తలపెట్టిన ‘చలో విజయవాడ – పోరుబాట’ విజయవంతం చేయండి ● ఫ్యాప్టో రాష్ట్ర కోచైర్మన్ హృదయరాజు అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్సనర్ల సమస్యల పరిష్కారంపై పాలకుల్లో కదలిక రావాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కోచైర్మన్ హృదయరాజు అన్నారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. పరిశీలకులుగా హాజరైన హృదయరాజు మాట్లాడుతూ.. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యాశాఖలో 72, 73, 74 జీఓలు అమలు చేయాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. కేంద్ర మెమో 57ను అమలుపరుస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించి వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు, సంపాదిత సెలవు బిల్లులు విడుదల చేయాలన్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలన్నారు. డిమాండ్ల సాధనకు ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్టోబర్ 7న విజయవాడలో తలపెట్టిన ‘చలో విజయవాడ–పోరుబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఆర్. శ్రీనివాసనాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, ఫ్యాప్టో జిల్లా సభ్య సంఘాల నాయకులు వెంకటేష్, రమణారెడ్డి, లింగమూర్తి, ఓబులేసు, లింగమయ్య, వెంకట రత్నం, రామాంజనేయులు, జయరామిరెడ్డి, అక్కులప్ప, రెహ్మాన్, సిరాజుద్దీన్, గోపాల్ రెడ్డి, జార్జ్, కులశేఖర రెడ్డి, వెంకటసుబ్బయ్య, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. -
వైస్ ఎంపీపీ బైక్కు నిప్పు
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండల వైఎస్సార్సీపీ నేత, వైస్ ఎంపీపీ వెంకటేష్నాయక్కు చెందిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లికి చెందిన వెంకటేష్నాయక్ ఆదివారం కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి తండాకు వేరుశనగ కాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. సాయంత్రం వేరుశనగ బస్తాలను బొమ్మగానిపల్లి తండాకు తరలించేందుకు ఆటోలు అందుబాటులో లేకపోవడంతో అదే గ్రామంలో ఉంటున్న తన సోదరి ఇంట్లోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమస్యాత్మక రైలు మార్గాల్లో అప్రమత్తంగా ఉండాలి గుంతకల్లు: ప్రస్తుత కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక రైలు మార్గాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జోనల్ పరిధిలోని డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. గుంతకల్లు నుంచి డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, అడిషనల్ జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. వర్షాల సమయంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వంతెనలు, సోరంగాలు, రోడ్డు అండ్ బ్రిడ్జిల వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అప్రమత్త చర్యల్లో భాగంగా కంకర, సిమెంట్, బండరాళ్లు, ఇసుక, తదితరాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రత, రైలు కార్యకలాపాలకు ఎలాంటి అంటకాలు కలగకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతపురం సబ్ రిజిస్ట్రార్గా ఇస్మాయిల్ అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనంతపురం అర్బన్ (రామ్నగర్) ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఇస్మాయిల్ను నియమిస్తూ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రామ్నగర్ జాయింట్ –2 సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న యూనస్ను తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్గా బదిలీ చేయడంతో ఆయన సోమవారం రిలీవ్ అయ్యారు. దీంతో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఇస్మాయిల్ను ప్రధాన కారాలయం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో ఆయన సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలను సీకరించనున్నారు. తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్గా యూనస్ తాడిపత్రి టౌన్: స్థానిక సబ్ రిజస్ట్రార్గా యూనస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి డిప్యుటేషన్పై ఆయనను తాడిపత్రికి బదిలీ చేశారు. -
రూ.26 కోట్ల వ్యాపార లక్ష్యం సాధించాలి
● డీసీఎంఎస్ మహాజనసభలో చైర్మన్ నెట్టెం వెంకటేశులు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పురోభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని సొసైటీ చైర్మన్ నెట్టెం వెంకటేశులు అన్నారు. సోమవారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయ ఆవరణలో మహాజన సభ జరిగింది. డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్తో పాటు డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.24.71 కోట్లు వ్యాపార ప్రగతి సాధించామన్నారు. ఇందులో ప్రధానంగా ఎరువుల పంపిణీ ద్వారానే రూ.22.41 కోట్లకు పైగా సమకూరిందన్నారు. ఈ ఏడాది రూ.26 కోట్లు వ్యాపార ప్రగతిని సాధించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మహాజనసభలో అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి, అకౌంట్స్ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. సాంకేతికతను రైతులకు చేరువ చేయండి ● ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ శారద కళ్యాణదుర్గం: నూతన సాంకేతికతను రైతులకు చేరువ చేసి, వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారద సూచించారు. కళ్యాణదుర్గం కేవీకేను సోమవారం ఆమె సందర్శించారు. కేవీకేలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన వివిధ పంటలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు నూతన వంగడాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ జాన్సన్, కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ ఈ.చండ్రాయుడు, కేవీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ‘సమగ్ర’ సెక్టోరియల్స్ నియామకం
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష కార్యాలయానికి సెక్టోరియల్ అధికారుల నియామకం పూర్తయింది. రాజకీయ గ్రహణం, అధికారుల అలసత్వం కారణంగా ఏడాదికిపైగా ఈ పోస్టులు ఖాళీగానే ఉంటూ వచ్చాయి. పర్యవేక్షణ లేక కుంటుపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాల దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చి, అందిన దరఖాస్తులను పరిశీలించి సీనియార్టీ జాబితా మేరకు ఇంటర్వ్యూలు చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఎక్కడా సమాచారం బయటపడకుండా ఈ ప్రక్రియ అంతా గోప్యంగా ఉంచారు. నెలన్నర దాటినా నియామక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈనెల 23న ‘అటకెక్కిన విద్యాభివృద్ధి’ శీర్షికన ‘సాక్షి’లో మరో కథనం వెలువడింది. దీంతో రాష్ట్ర అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా అధికారులు పంపిన జాబితాకు ఆమోదం తెలుపుతూ ఐదుగురిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేడో, రేపో వీరు విధుల్లో చేరనున్నట్లు సమాచారం. -
ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం
● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు అనంతపురం కార్పొరేషన్: పేదింటి బిడ్డలకు వైద్య విద్యను వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేద్దామంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు పిలుపునిచ్చారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను తీసుకువస్తే... కూటమి ప్రభుత్వం పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్షిప్ కింద 66 ఏళ్ల పాటు నిర్వహించుకునేలా ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలనే డిమాండ్తో మంగళవారం ఉదయం 11 గంటలకు అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘం బలోపేతానికి చర్యలు అనంతపురం టవర్క్లాక్: ఏపీ ఎన్జీఓ సంఘాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టినట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎన్జీఓ హోంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. సంఘం బలంగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం పది మందిని సభ్యులుగా చేయించాలన్నారు. సచ్చివాలయ ఉద్యోగులను కూడా సంఘంలోకి అహ్వానించాలన్నారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం ప్రతినిధులు మనోహర్రెడ్డి, శ్రీధర్, చంద్రశేఖర్, వెంకటేష్ బాబు, రమాదేవి, జమీలాబేగం, సుదర్శన్ శర్మ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం గార్లదిన్నె: రైలు కిందపడబోయిన యువకుడిని లోకో పైలెట్ సకాలంలో గుర్తించి, ప్రమాదం నుంచి కాపాడాడు. వివరాలు.. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేష్కు గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. ఇటీవల భార్య గొడవపడి పుట్టింటికి చేరుకుంది. దీంతో వెంకటేష్ సోమవారం యర్రగుంట్లకు చేరుకుని భార్యను కాపురానికి రావాలని అభ్యర్థించాడు. ఆమె నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెంది గార్లదిన్నెలోని డ్యాం రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ప్యాసింజర్ రైలు కిందపడబోయాడు. గమనించిన లోకో పైలెట్ రైలు వేగాన్ని నియంత్రించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే వెంకటేష్ను పట్టాల పైనుంచి పక్కకు లాగేశారు. -
‘ఈ–క్రాప్’ నమోదు చేయాలంటూ వినూత్న నిరసన
విడపనకల్లు: తాము సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేయాలంటూ విడపనకల్లు మండలం హవళిగి గ్రామ సచివాలయం ఎదుట జాతీయ పతాకంతో రైతులు నిరసన తెలిపారు. పంటల నమోదు చేయాలంటూ పలుమార్లు వ్యవసాయాధికారి పెన్నయ్యను కోరినా ఆయన స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగియనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల నమోదు చేయాలంటూ అర్జీ ఇచ్చేందుకు వస్తే ‘ఈ–క్రాప్ చేయకపోతే ఏమవుతుంది.. ఈ ప్రభుత్వం మరికొన్ని రోజులు గడువు పెంచుతుందిలే’ అంటూ వ్యవసాయాధికారి విడ్డూరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. అనంతరం సమస్యకు పరిష్కారం కోరుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు అర్జీ అందజేశారు. రోజుల తరబడి అభ్యర్థించినా మండల వ్యవసాయాధికారి స్పందించ లేదంటూ ఆవేదన ఈ–క్రాప్ చేయకపోతే ఏమవుతుందంటూ ఏఓ విడ్డూరపు వ్యాఖ్యలు -
గందరగోళం మధ్య చిన్నారి మృతిపై విచారణ
ఉరవకొండ: ఈ నెల 25న ఉరవకొండ సీహెచ్సీలో వైద్యం అందక ఐదేళ్ల బాలుడు అహరోన్కుమార్ మృతిచెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ సోమవారం చేపట్టిన తీవ్ర గందరగోళం మధ్య సాగింది. కమిటీ సభ్యులు డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వరాజ్, డీఎంహెచ్ఓ భ్రమరాంబిక దేవి, సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం వైద్య నిపుణుడు డాక్టర్ లోక్నాథ్ల వేర్వేరుగా బాధ్యులైన వైద్యాధికారి డాక్టర్ ఇస్మాయిల్, స్టాఫ్నర్సు ప్రియాంకతో పాటు మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులను విచారణ చేశారు. నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్కూ విన్నవించనున్నట్లు సభ్యులు తెలిపారు. డాక్టర్ చౌదరియే కారణం చిన్నారి మృతి అంశంపై విచారణ సాగుతుండగానే ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ చౌదరితో జైభీమ్పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామప్పనాయక్ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తొలుత బాలుడిని డాక్టర్ చౌదర తన ప్రైవేట్ క్లినిక్లో చేర్పించుకుని చికిత్స అందిస్తూ వచ్చారని, ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారంటూ మండిపడ్డారు. డాక్టర్ చౌదరి నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడంటూ ఆరోపించారు. దీంతో బాధ్యుడైన మరో డాక్టర్ డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. బాలుడి మృతికి తన పొరపాటు లేదని, పరిస్థితి విషమించిన తర్వాతనే ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారంటూ చెప్పబోగా, ఆయనపై బాధిత కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. -
ప్రతి రోగికి మెరుగైన సేవలందించాలి
● మంత్రి సత్యకుమార్ అనంతపురం మెడికల్: చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికీ మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. సోమవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. గుండె జబ్బుల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఎయిమ్స్లో కూడా లేని అత్యాధునిక పరికరాలు సూపర్ స్పెషాలిటీలో ఉన్నాయన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్.. గుండె శస్త్రచికిత్సల్లో అందించిన సేవలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ద్వారా వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జీజీహెచ్ సూపరిండెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పాల్గొన్నారు. -
ఇబ్బందులు పెట్టేవారిని వదలం
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని వదిలి పెట్టబోమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారని, ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమస్యతో పాటు ఇబ్బంది పెట్టిన వారి వివరాలు, ఫొటోలు, సమాచారం నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు నేరుగా అధినేత వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాయని, ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వారితో కలసి తిరగడం బాలకృష్ణకు సిగ్గుగా లేదా అని నిలదీశారు. తండ్రి పార్టీని లాక్కున్నా వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి బాలకృష్ణది కాదన్నారు. ఆయనకు ఏ సర్టిఫికెట్లు ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ బాల కృష్ణ చంద్రబాబు చెంత చేరి ఎన్టీఆర్ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన చలువతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అనేక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇళ్ల వద్దకే పథకాలు అందించారన్నారు. జగనన్నకు అందరూ తోడుగా ఉండాలన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల ప్రసాద్, మహేశ్వరరెడ్డి, ఎల్లారెడ్డి, శివ శంకర్, ఖాదర్వలి,జెడ్పీటీసీలు భాస్కర్,బోగాతి ప్రతాప్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మిద్దె కుళ్లా యప్ప, చామలూరు రాజగోపాల్, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ నాయక్, మేజర్ పంచాయతీ సర్పంచ్ పార్వతి, పూల నారాయణ స్వామి, చికెన్ నారాయణస్వామి, శ్రీరామిరెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్తో భరోసా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా బాలకృష్ణ ప్రవర్తన: మాజీ మంత్రి శైలజానాథ్ -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం ● ‘పరిష్కార వేదిక’లో 325 వినతులు అనంతపురం అర్బన్: ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 325 విన తులు అందాయి. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 250 వరకు ఉండడం గమనార్హం. కార్యక్రమానికి ముందు అర్జీల పరిష్కారంపై అఽధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని చెప్పారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలన్నారు. సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీ–ఓపెన్ కాకూడదని స్పష్టం చేశారు. వినతుల్లో కొన్ని.. ● ఉపాధి కోసం తాము ఊరు వదిలి వెళ్లగా, భూమిని ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించాడని డీ.హీరేహాళ్ మండలం హనుమాపురం గ్రామానికి చెందిన పింజారి హుసేన్సాబ్ విన్నవించాడు. సర్వే నంబరు 477–బీలో తమకు 2.15 ఎకరాలు ఉందని చెప్పాడు. బతుకుదెరువు కోసం ఊరు విడిచి వెళ్లడంతో ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించాడని, న్యాయం చేయాలని కోరాడు. ● తమ వ్యవసాయ భూమిని 22ఏ (నిషేధిత భూములు) జాబితాలో వేరేవారి పేరున చేర్చారని నార్పల మండలం గంగనపల్లికి చెందిన సంజీవనాయుడు విన్నవించాడు. గూగూడు గ్రామ పొలం సర్వే నంబరు 266–1ఏలో 5 ఎకరాలు 52 ఏళ్ల నుంచి తమ స్వాధీనంలో ఉందని చెప్పాడు. అయితే 22ఏ కింద వేరొకరిపై చేర్చారని, సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ● వివాదంలో ఉన్న సర్వే నంబర్లను తొలగించాలని ఎం.భాస్కర్ విన్నవించాడు. తమకు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామ పొలంలోని సర్వే నంబర్లు 340–1ఏ3, 370–1, 379–1,2, 380–3, 382–2ఏ అన్నీ వివాదంలో ఉన్నాయని తెలిపాడు. విచారణ చేసి తొలగించాలని విన్నవించాడు. -
జీఎస్టీపై అవగాహన కల్పించాలి
అనంతపురం అర్బన్: జీఎస్టీ 2.0పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏపీఎంఐపీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పోస్టర్లు, స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీ చేసి తగ్గిన జీఎస్టీ సక్రమంగా అమలు చేస్తున్నారా.. లేదా పరిశీలించాలన్నారు. తగ్గిన జీఎస్టీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశ్రమలు, సూక్ష్మ సేద్యం, వ్యవసాయం, క్రీడా వస్తు సామగ్రి, ఎలక్ట్రానిక్, స్టేషనరీ తదితర దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేయాలని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో 99 శాతం వస్తువులు, సేవలు పన్నురహితంగా మారాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, ఏపీఎంఐపీడీ రఘునాథరెడ్డి, డీపీఓ నాగరాజు నాయుడు, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి మంజుల పాల్గొన్నారు. జిల్లాలో మరో రెండు ఎంఎస్ఎంఈ పార్కులు అనంతపురం టౌన్: జిల్లాలో మరో రెండు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో 50 ఎకరాలు, కూడేరులో 100 ఎకరాల్లో పార్క్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న వారు ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇప్పటికే రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి ఎంఎస్ఎంఈ పార్క్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బరితెగించిన ఇసుకాసురులు ● ఇసుక అక్రమ తరలింపునకు ఏకంగా మట్టి రోడ్డు ఏర్పాటు శింగనమల: ఇసుకాసురులు బరితెగించారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వివరాలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక మండలంలో పలువురు టీడీపీ నాయకులు ఇసుకపై కన్నేశారు. ఇటీవల మండలంలోని రాచేపల్లి వద్ద పెన్నానదిపై వీరి కన్ను పడింది. నదిలో ఇసుక పుష్కలంగా అందుబాటులో ఉండడంతో కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచించారు. ఇసుక తరలించడానికి ఏకంగా ఎర్రమట్టితో రోడ్డు వేసుకున్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఇసుకను తరలించడానికి జేసీబీతో వెళ్తున్న వీరిని రాచేపల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై సోమవారం ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. కుమారుడికి పెళ్లి కాలేదని బలవన్మరణం అనంతపురం సిటీ: వ్యక్తి ఆత్మహత్య కేసులో మిస్టరీని రైల్వే పోలీసులు ఛేదించారు. వివరాలను సోమవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం రాజీవ్కాలనీ పంచాయతీ పరిధిలోని పొట్టి శ్రీరాములు కాలనీకి చెందిన సల్లా మల్లికార్జున(59)కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లి కాగా, కుమారుడికి ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కటీ కుదరలేదు. దీంతో కుమారుడికి ఇక పెళ్లి కాదేమోననే బెంగతో ఈ నెల 27న అనంతపురం సమీపంలో మల్లికార్జున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడి ఆచూకీ లభ్యమైంది. -
దంపతులపై టీడీపీ నాయకుల దాడి
ఆత్మకూరు: అధికార అండతో రాప్తాడు నియోజకవర్గంలో ‘పచ్చ’ నేతలు రెచ్చిపోతున్నారు. తామేం చేసినా చెల్లుతుందన్న రీతిలో దాడులకు పాల్పడుతున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దంపతులపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు.. బ్రాహ్మణ యాలేరుకు చెందిన బండి చిన్న అహోబిలం తనకు అనారోగ్యంగా ఉండటంతో సోమవారం ఉదయం అనంతపురం వెళ్లి చికిత్స చేయించుకుని సాయంత్రం గ్రామానికి వచ్చాడు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద కూర్చుని ఉండగా టీడీపీ నాయకులు శంకరయ్య, శివయ్యలు అక్కడికి వచ్చి అహోబిలంతో గొడవకు దిగారు. చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. విషయం తెలిసి అహోబిలం భార్య కొండమ్మ, కోడలు సుకన్య, కుమారుడు నాగరాజు అక్కడికి చేరుకోగా వారిపైనా దాడికి దిగారు. ఘటనలో కొండమ్మకు పక్కటెముక విరిగింది. అహోబిలంకు గాయాలయ్యాయి. కుటుంబీకులు ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాత కక్షలు మనసులో పెట్టుకొని తన తల్లిదండ్రులపై దాడి చేసినట్లు బండి నాగరాజు తెలిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. -
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం
అనంతపురం కార్పొరేషన్/అనంతపురం సిటీ: తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అధికారుల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, 9 నెలల అరియర్స్ అందించాలన్నారు. వచ్చే నెల 1న యథావిధిగా సచివాలయాల్లోనే పింఛన్ పంపిణీ చేస్తామని, ఆ తర్వాత నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకలు సుధాకర్, లక్ష్మినారాయణ, వరప్రసాద్, విమల పాల్గొన్నారు. -
పప్పుశనగ విత్తన కేటాయింపులు కుదింపు
అనంతపురం అగ్రికల్చర్: రైతులపై కూటమి సర్కారు చిన్నచూపు ధోరణి కొనసాగిస్తోంది. అరకొర విత్తనాలు, ఎరువుల కేటాయింపులతో చెలగాటమాడుతోంది. తాజాగా రబీలో ప్రధాన పంటగా పండించే విత్తన పప్పుశనగ కేటాయింపులను 14 వేల క్వింటాళ్లకు కుదించింది. విత్తన కేటాయింపులు, ధరలు, సబ్సిడీ ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా మరో రెండు రోజుల్లో రబీ ప్రారంభమవుతున్న తరుణంలో ఆలస్యంగా కేటాయింపులు, ధరలు ప్రకటించింది. ఈ క్రమంలో విత్తన కేటాయింపులను గతంలో కన్నా సగానికి తగ్గించడం గమనార్హం. ఇక సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి కుదించడంతో జిల్లా రైతులపై రూ.1.65 కోట్లు భారం పడే పరిస్థితి నెలకొంది. జేజీ–11 రకం క్వింటా పూర్త్తి ధర రూ.7,800 కాగా అందులో 25 శాతం రాయితీ రూ.1,950 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. పట్టించుకునే వారు కరువు.. అన్నదాతను మొదటి నుంచి చంద్రబాబు సర్కారు ఇబ్బందులకు గురి చేస్తోంది. మొదటి ఏడాది ‘సుఖీభవ’ కింద రూ.400 కోట్లకు పైగా ఎగ్గొట్టిన ప్రభుత్వం రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చినా... ఇంకా వేల మందికి సొమ్ము జమ కాని పరిస్థితి. ఇక ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ కింద పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడం లేదు. ఈ ఖరీఫ్లో కూడా విత్తన వేరుశనగ ఆలస్యంగా ఇవ్వడంతో రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక యూరియా పరిస్థితి ఎంత చెప్పినా తక్కువే. రైతులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ‘ప్రత్యామ్నాయం’ ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు సర్కారు... తాజాగా అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రబీ రైతులకు కూడా కుచ్చుటోపీ పెట్టేందుకు పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యం తప్పదా...? గతేడాది ఖరీఫ్, రబీతో పాటు ఈ ఖరీఫ్లో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సొమ్ము చెల్లించకుండా బకాయిలు పెట్టడంతో ఇప్పుడు రబీలో పప్పుశనగ సరఫరాకు ఏజెన్సీలు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రబీ రైతులకు సకాలంలో విత్తన పప్పుశనగ అందడం కష్టంగానే కనిపిస్తోంది. ఖరీఫ్లో మాదిరిగా రబీలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పంట సాగు విస్తీర్ణంపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయితీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గింపు రైతన్నలపై చిన్నచూపు ధోరణిని కొనసాగిస్తున్న ‘కూటమి’ ప్రభుత్వ అలసత్వంతో అన్నదాతలపై రూ.1.65 కోట్ల అదనపు భారం -
బీ'ట్' కేర్ ఫుల్
గత నెలలో అనంతపురం రూరల్ మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు గుండె నొప్పిగా ఉందంటూ అనంత పురంలోని సర్వజనాస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షిస్తున్న సమయంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అనంతపురం నగరపాలక సంస్థలో పని చేసే ఓ ఉద్యోగి ఇటీవల అమరావతికి వెళ్లారు. మార్గమధ్యంలో ఉన్నఫళంగా గుండె నొప్పి వచ్చింది. తోటి సిబ్బంది హుటాహుటిన కర్నూలు జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేరి్పంచగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వీరిద్దరే కాదు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇటీవల యువతలో గుండెపోట్లు పెరిగిపోయాయి. అనంతపురం మెడికల్: నిండు నూరేళ్లు జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. వందేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవనం సాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో వందేళ్ల మాట పక్కన పెడితే 25 నుంచి 30 ఏళ్లకే యువత మరణిస్తుండడం కలచివేస్తోంది. ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలో కోల్పోతుండడం కలవరపరుస్తోంది. చెట్టంత కొడుకు కళ్లముందే ప్రాణాలు విడుస్తుండడంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా సగటున 25 వేల మందికిపైగా గుండెపోట్లకు గురవుతుండడం గమనార్హం. 2019–20లో 4,660, 2020–21లో 5,107, 2021–22లో 6,637, 2022–23లో 7,909, 2023–24లో 10,274, 2024–25లో 9,754, 2025లో 7 వేల వరకు (ఇప్పటి వరకు) గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరిగాయి.ఏటా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (ఆరోగ్య శ్రీ)లో భాగంగా 30 శాతానికి పైగా గుండె జబ్బులకే వ్యయమవుతోంది. రూ.25 కోట్లకు పైగానే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా రోజూ కనీసం అరగంట వాకింగ్, వ్యాయామం చేయాలంటున్నారు. ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. జంక్ ఫుడ్తో ఓబెసిటీ, గ్యాస్రై్టటీస్ తదితర సమస్యలు తలెత్తుతాయంటున్నారు. వారానికి 150 నిమిషాలు కనీస నడక మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా బీపీ, కొలె్రస్టాల్, షుగర్, టెస్టులు చేయించుకుని మందులు వాడితే గుండెపోటును నియంత్రించవచ్చంటున్నారు. వ్యసనాలతోనే సమస్య.. వ్యసనాలకు బానిసలు కావడం,వ్యాయామం, యోగా తదితర వాటికి దూరంగా ఉండడం తదితర కారణాలతో చిన్నవయసులోనే గుండె సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో యువత పార్టీల పేరుతో ఇష్టానుసారంగా మద్యం తీసుకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన ధూమపానాన్ని సేవిస్తున్నారు. దీనికి తోడు ఉరుకుల పరుగుల జీవితంలో బిజీగా ఉంటూ మానసిక ఒత్తిడికి లోనవుతూ హైపర్టెన్షన్, మధుమేహం బారిన పడుతున్నారు. యోగాతో సత్ఫలితాలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఆహార అలవాట్లు లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, నిద్రలేమి తదితర కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. గుండె పోటు, బీపీ, మధుమేహం తదితర సమస్యలు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం చేయాలి. యోగా బాగా ఉపయోగపడుతుంది. నిత్యం యోగా చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. – సురేష్ ఈశాపతి, యోగా గురువు, అనంతపురం వైద్య పరీక్షలు చేయించుకోవాలి జంక్ ఫుడ్, పొగ తాగడం, వ్యాయామం లేకపోవడంతో యువత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. వంశపారంపర్యంగా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో 12 మందిని పరీక్షిస్తే అందులో ముగ్గురికి కచ్చితంగా బీపీ సమస్య కని్పస్తోంది.ఈ పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – సుభాష్ చంద్రబోస్, అసోసియేట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి -
టీడీపీ నాయకుల దాష్టీకం
అనంతపురం: తమ భూమి ఆక్రమించవద్దంటూ అడ్డుపడిన బాలికపై టీడీపీ నేతలు దాష్టీకం ప్రదర్శించారు. దాడి చేసి నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లి పక్కన పడేశారు. అసభ్యపదజాలంతో దూషించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపల చోటు చేసుకుంది. బాధితురాలు సోమవారం గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో తన గోడు విన్నవించింది. వివరాలిలా ఉన్నాయి. జంబుగుంపల గ్రామానికి చెందిన గొల్ల దొడ్డయ్య కుమార్తె శాలిని పదో తరగతి వరకు చదివింది. అదే గ్రామ సర్వే నంబర్ 110లో వీరికి 4.05 ఎకరాల భూమి ఉంది. 109–1 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉందంటూ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే చేశారు. శాలిని తల్లిదండ్రులు గొల్ల లక్ష్మి, దొడ్డయ్య తమ పట్టా భూమిలో దారి లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు అధికారులు ఏమీ తేల్చకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గత శనివారం టీడీపీ నాయకులైన గొల్ల బొమ్మయ్య, కుమారుడు గొల్ల తిప్పేస్వామి, గొల్ల నరసింహప్ప భార్య గొల్ల చిక్కమ్మ కలిసి శాలిని తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తన్ని నానా దుర్భాషలాడారు. జేసీబీని తెప్పించి వారి పొలం మీదుగా దౌర్జన్యంగా రోడ్డు వేసేందుకు సిద్ధం కాగా.. శాలిని అడ్డుకోబోయింది. అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు వెట్టి మారెప్ప కుమారుడు వెట్టి హనుమంతురాయుడు, ఈరప్ప కుమారుడు జి.హనుమంతురాయుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా పక్కకు లాగిపడేశారు. జేసీబీతో తొక్కించి చంపుతామంటూ.. బండ బూతులు తిడుతూ తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసి టీడీపీ నేతలే సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. ఘటనా స్థలంలోనే పోలీసులు ఉన్నా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఆపలేకపోయారు. దీంతో టీడీపీ నేతలకు భయపడి బాధిత కుటుంబం స్థానిక పోలీస్స్టేషన్కు కూడా వెళ్లలేకపోయింది. తమకు న్యాయం చేయాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. -
రెచ్చిపోయిన టీడీపీ మూకలు.. మైనర్ బాలికపై దాడి
సాక్షి,అనంతపురం: ఏపీలో దుశ్శాసన పాలన కొనసాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూమి ఆక్రమణకు వ్యతిరేకంగా నిలిచిన మైనర్ బాలికపై టీడీపీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను బలవంతంగా లాగిపడేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. సీఐటీయూ మహాసభల వేదిక వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్తో కలిసి ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను వీడాలన్నారు. జిల్లాలో పేదలపాలిట కల్పతరువుగా ఉన్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్కు కార్మికులు పోరాటం సాగించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలన్నారు. ముగిసిన మహాసభలు: సీఐటీయూ జిల్లా మహాసభలు ముగిశాయి. 59 మందితో సీఐటీయూ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగేంద్రకుమార్ మరోసారి ఎన్నికయ్యారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షెక్షావలి డిమాండ్ చేశారు. ఆల్మేవా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వై.ఫకృద్ధీన్ అధ్యక్షతన ఆదివారం అనంతపురంలోని లిటిల్ఫ్లవర్ స్కూల్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 నెలలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటి వరకూ 12వ పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. జిల్లా ప్రధానకార్యదర్శి ఫారూక్ మహమ్మద్ మాట్లాడుతూ.. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. కారుణ్య నియమాకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏ అందని ద్రాక్షలా మారాయని వాపోయారు. సమావేశంలో ఆల్మేవా నాయకులు ఫరూఖ్, ఫకృద్దిన్, అన్వర్, రసూల్, అస్రఫ్అలి, దౌలా, రఫి, మహబూబ్బాషా, సర్దార్ పాల్గొన్నారు. ‘ఆల్మేవా’ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు షెక్షావలి -
కొలిస్తే చింతలన్నీ దూరం
తాడిపత్రి రూరల్: కోరిన కోర్చెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాడిపత్రిలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ అష్టమి నుంచి బహుళ విదియ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించే పనులు ఊపందుకున్నాయి. 30న మంగళవారం సాయంత్రం విష్యక్సేనారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, అక్టోబరు 1న శేషవాహనం, 2న సింహవాహనం, మధ్యాహ్నం శమీ వృక్ష దర్శనం రాత్రి హంసవాహనం, 3న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 4న ఉదయం మోహినిదేవి అలంకరణ, రాత్రి గరుడ వాహనం, 5న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం హనుమద్ వాహనం, 6న ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం గజవాహనం, 7న ఉదయం తిరుకల్యాణం, మధ్యాహ్నం విందుభోజనాలు, మధ్యాహ్నం 2.45గంటలకు బ్రహ్మరథోత్సవం, 8న ఉదయం తిరుచ్చిలో ఉత్సవం, సాయంత్రం అశ్వవాహనం, 9న వసంతోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ద్వాదశ అరాధన, రాత్రి ధ్వజా అవరోహణ, కుంభప్రోక్షణ, భట్టర్ మర్యాద నిర్వహించనున్నారు. శిల్పకళతో అబ్బుర పరుస్తున్న ఆలయం.. భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఆలయంలో అరుదైన శిల్ప కళాసంపదను సొంతం చేసుకుంది. క్రీ.శ. 1490–1520 మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యంలో మండలాధీశునిగా పనిచేస్తున్న తిమ్మనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. శిల్ప కళాశోభితమైన మంటపాలు, మహాద్వార గోపురాలను అద్భుతంగా నిర్మించారు. ప్రధాన ద్వారం, గాలిగోపురం తూర్పు దశలో ఉన్నాయి. గాలిగోపురానికి ముందు రాతితో నిర్మించిన ఊయాల మంటపం, ఎతైన దీపపు స్తంభం ఉన్నాయి. హంపీలోని శిల్ప కళకు దగ్గర పోలికతో ఉన్న ఈ ఆలయాన్ని వారణాశి నుంచి ప్రత్యేకంగా రప్పించిన శిల్పులతో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెతున్నారు. ఆలయంలో ఏకశిలారథంతో పాటు రామాణ, మహాభారత, భాగవతం విశిష్టను చాటే శిల్పాలు అబ్బుర పరుస్తున్నాయి. కళ్యాణమంలపంలోని లో స్థంభంలో మూడు దీపపు స్తంభాలను మీటితే సప్తస్వరాలు పలుకుతాయి. గర్భగుడిపై భాగంలో ఏర్పాటు చేసిన రాతిపద్మం నాటి శిల్ప కళానైపుణ్యానికి అద్దం పడుతోంది. మొత్తం 40 రాతి స్తంభాలతో మహా మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలోని విశాల ప్రాంగణంలో మహాలక్ష్మి అలయం, కల్యాణమంటపం, చెన్నకేశవ స్వామి ఆలయం, లక్ష్మీ సమేత వరాహస్వామి, ఆంజినేయ స్వామి, లక్ష్మీనారాయణ, రామాంజినేయ, రామానుజార్యుల ఉప అలయాలు ఉన్నాయి. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చింతల వేంకటరమణస్వామి రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు 7న బ్రహ్మరథోత్సవం బ్రహ్మోత్సవాలు ఇలా.. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనంతపురం రూరల్: ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యత తీసుకుని మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ‘నమో వనం – ఏక్పెడ్ మాకే నామ్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీఆర్ఐటీ కళాశాలలో ఆయన మొక్కలు నాటి, మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, నాయకులు చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల దొంగ గుత్తి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత ఆరు మాసాలుగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న గాజులపల్లికి చెందిన ఓ యువకుడిని సీఐ నాగరాజు, ఎస్ఐలు సురేష్, గౌతం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చూపనున్నట్లు సమాచారం. ముందస్తు టీకానే శరణ్యం ● పశుశాఖ జేడీ ప్రేమ్చంద్ అనంతపురం అగ్రికల్చర్: రేబీస్ సోకితే చికిత్సకు నయమయ్యే అవకాశం తక్కువగా ఉన్నందున ముందస్తు టీకాలు, ఇతర జాగ్రత్తలే శరణ్యమని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ అన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక సాయినగర్లో ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రలో నిర్వహించిన కార్యక్రమంలో కుక్కలకు రేబీస్ టీకాలు వేసి, జేడీ మాట్లాడారు. కుక్క కాటు వేస్తే వైరస్ శరీరంలో ప్రవేశించి కండరాలలో వైరస్ వృద్ధి చెంది నాడీ వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు చేరి ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు. చికిత్స కన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పెంపుడు, వీధి కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించాలని తెలిపారు. కుక్క కాటుకు గురైతే పారే నీటి కొళాయి కింద కార్బలిక్ సబ్బు లేదా డెట్టాల్ సబ్బుతో 10 నుంచి 15 సార్లు బాగా నురగ వచ్చేలా కడుక్కోవాలన్నారు. గాయం మీద ఐస్ ముక్కలు ఉంచడం వల్ల కొంత మేలు జరుగుతుందని, అనంతరం వైద్యుల పర్యవేక్షణలో చిక్సి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీడీఎల్ ఏడీ డాక్టర్ జి.రవిబాబు, ఆసుపత్రి ఏడీ డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ సుంకాలు దేశానికి నష్టం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అనంతపురం టవర్క్లాక్: ట్రంప్ విధిస్తున్న సుంకాలు దేశానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ‘ట్రంఫ్ టారిఫ్ – టెర్రరిజం – భారతదేశంపై ప్రభావం’ అంశంపై ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాంభూపాల్ మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక దిగుమతులపై 25 శాతం వరకు సుంకాన్ని ట్రంప్ విధించారని గుర్తు చేశారు. తాజాగా ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకం విధించారన్నారు. కొన్ని రోజులుగా హెచ్1 బీ వీసాలపై పది లక్షల డాలర్లు పన్ను వేశారన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై కూడా సుంకాలను అమెరికా విధిస్తోందన్నారు. ఇప్పటికే ఆక్వా రైతులు తమ ఉత్పతులు ఎగుమతులు చేసుకోలేక నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ట్రంప్ టారీఫ్లపై ప్రధాని నరేంద్ర మోది నోరు విప్పాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, కార్యదర్శి వర్గ సభ్యుడు బాల రంగయ్య, తదితరులు మాట్లాడారు. -
‘బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
గుత్తి: మెగా స్టార్ చిరంజీవిపై రాష్ట్ర అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు పాటిల్ సురేష్ డిమాండ్ చేశారు. గుత్తిలో గాంధీ సర్కిల్ వద్ద ఆదివారం చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. బాలకృష్ణ డౌన్డౌన్ అంటూ ప్లేకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాటిల్ సురేష్ మాట్లాడారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పక పోతే ఆందోళన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, దుర్గాప్రసాద్, ఓబులేసు, వెంకటేష్, రుద్రాక్షల రాజా, నూర్బాషా, నాగరాజు, హరి, షెక్షావలి తదితరులు పాల్గొన్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ రాయదుర్గం టౌన్: మండలంలోని మల్లాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు ఆదివారం సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డ్రోన్ ఎగురవేసి, స్థావరాన్ని గుర్తించారు. అలాగే రాయదుర్గం సమీపంలోని వట్లకుంట కొండ ప్రాంతంలో సాయంత్రం చేపట్టిన తనిఖీల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.87,150 నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ● తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు, పెన్నానది బ్రిడ్జి కింద పేకాట అడుతున్న 15 మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి అప్గ్రెడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదివారం తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసి రూ.41,930 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే తాడిపత్రిలోని సీపీఐ కాలనీలో పేకాట అడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.37,370 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ● గుత్తి రూరల్: మండలంలోని జక్కలచెరువు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రామారావు తెలిపిన మేరకు.. గ్రామ శివారులోని ఓ తోటలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పట్టుబడిని ఏడుగురిని అరెస్ట్ చేసి, నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ.39,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అరాచకాలకు ‘డిజిటల్ బుక్’తో చెక్
గుంతకల్లు టౌన్: అధికారమదంతో విర్రవీగుతున్న కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలకు బుద్దిచెప్పేందుకే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను అందుబాటులోకి తీసుకొచ్చారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. రెడ్బుక్ పేరిట కూటమి నేతలు, కొంత మంది పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషియల్ మీడియా యాక్టివిస్ట్లను వేధిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హింసా రాజకీయాలకు పాల్పడిన నేతలతో పాటు అక్రమ కేసులు బనాయించిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి, న్యాయపోరాటం సాగిస్తామన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ భరోసా లాంటిదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, కౌన్సిలర్లు నీలావతి, కుమారి, చాంద్బాషా, సుమోబాషా, లింగన్న, ఎంపీటీసీలు హనుమంతు, సర్పంచులు నారాయణస్వామి, నాగార్జున, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు వీరేష్, కొంగనపల్లి, అంజి, పవన్, బాసిద్, బాబూరావు, వార్డు ఇన్ఛార్జ్లు దర్గానాయుడు, ఎల్లప్ప, సీనియర్ నాయకులు మల్లికార్జున శాస్త్రి, ఫ్లయింగ్మాబు, నూర్నిజామి, ఎంఎం.రెహమాన్, నల్లప్ప, నాయకులు జయన్న, తిక్కస్వామి, గోవింద్నాయక్, జయరామిరెడ్డి, రామాంజి, సోమిరెడ్డి, వెంకటేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధికారం శాశ్వతం కాదు.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని తెలుసుకుని ఇప్పటికై నా అధికార మదాన్ని వీడాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ హితవు పలికారు. స్వయంకృషితో మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ హేళనగా మాట్లాడినా.. సొంత తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీలో ఏమీ మాట్లాడకపోయినా తన కుటుంబసభ్యులను దూషించారని బోరున విలపించిన చంద్రబాబు.. సాక్షాత్తూ జూనియర్ ఎన్టీఆర్ మాతృమూర్తిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అసభ్యకరంగా దూషించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. డిజిటల్ బుక్ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ -
ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ ఇంట్లో చోరీ
గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్న ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ అరికేరి శ్రీనాథ్ ఇంట్లో చోరీ జరిగింది. గుత్తి మాజీ ఎమ్మెల్యే అరికేరి జగదీష్ సోదరుడు అరికేరి శ్రీనాథ్ తన కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 19న బెంగుళూరుకు, తర్వాత అక్కడి నుంచి కాశీ యాత్రకు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గుర్తించిన దుండగులు ఆదివారం వేకువజామున బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లోని శబ్ధాలు కావడంతో నిద్ర మేల్కోన్న ఎదురింటిలోని వ్యక్తిగా గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. విషయాన్ని పోలీసుల ద్వారా శ్రీనాథ్కు స్థానికులు చేరవేయడంతో అప్పటికే కాశీ యాత్ర ముగించుకుని బెంగళూరుకు చేరుకున్న శ్రీనాథ్ కుటుంబసభ్యులు వెంటనే ఇంటికి చేరుకుని పరిశీలించారు. బీరువాను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలను అపహరించినట్గుగా నిర్ధారించుకున్నారు. కాగా, చోరీ సమయంలో ఓ దుండగుడి టవాల్ అక్కడే పడిపోయింది. వేలిముద్రల నిపుణులు రంగంలో దిగి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మస్తాన్ తెలిపారు. ప్రొఫెషనల్ దొంగల పనే.. బ్యాంక్ విశ్రాంత మేనేజర్, బెస్తకాలనీలో వంట మాస్టర్ ఇంట్లో చోరీకి పాల్పడింది ప్రొఫెషనల్ దొంగలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత బెస్త కాలనీలో దొంగతనానికి పాల్పడిన వారు వచ్చిన హొండా షైన్ ద్విచక్రవాహనాన్ని సంజీవనగర్లోని ఓ ఇంటి వద్ద వదిలి కేపీఎస్ థియేటర్లో ఆపరేటర్గా పనిచేస్తున్న లోకేష్ ద్విచక్రవాహనాన్ని అపహరించి తిలక్నగర్లోని బ్యాంక్ మేనేజర్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. రెండు ద్విచక్రవాహనాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వంట మాస్టర్ ఇంట్లో .. స్థానిక బెస్త కాలనీలో నివాసముంటున్న రూప్సాగర్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు శుభకార్యాల్లో వంట పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రూప్సాగర్ ఈ నెల 20న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి కర్ణాటకలోని హొళ్లి, హోసపేట ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో వంట చేయడానికి వెళ్లాడు. గుర్తించిన దుండగులు తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రూప్సాగర్ కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఇంటికి చేరుకుని చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో కసాపురం పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
లైన్మెన్కు విద్యుత్ షాక్
● పరిస్ధితి విషమం.. బళ్లారికి తరలింపు బొమ్మనహాళ్: విద్యుత్ షాక్తో గ్రేడ్–2 జూనియర్ లైన్మాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బొమ్మనహాళ్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొమ్మనహాళ్ విద్యుత్ కార్యాలయంలో గ్రేడ్–2 జూనియర్ లైన్మాన్గా రామాంజినేయులు విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తన పొలంలో 11 కేవీ విద్యుత్ లైన్ హెడ్ ఫ్యూజు పోయిందని తెలపడంతో ఆదివారం ఉదయం మరమ్మతు చేసేందుకు రామాంజనేయులు వెళ్లాడు. కురువల్లి బొమ్మనహాళ్ ఫీడర్ లైన్ కింద ఉన్న ఈ లైన్కు స్ధానిక సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని, ప్యూజు వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి షాక్కు గురై పై నుంచి కిందకు పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన రైతులు వెంటనే ఓ ప్రైవేట్ అంబులెన్స్లో బళ్లారిలోని విమ్స్కు తరలించారు. రెండు చేతులు, ఓ కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమ్స్ వైద్యులు తెలిపారు సమాచారం అందుకున్న రాయదుర్గం ఏడీఏ శ్రీనివాసనాయుడు, బొమ్మనహాళ్ ఏఈఈ లక్ష్మీరెడ్డి బళ్లారికి చేరుకుని క్షతగాత్రుడిని పరామర్శించారు. ఆపరేటర్ తప్పిదమే కారణమనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై లోతైన విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్నేహితుడిపై కత్తితో దాడితాడిపత్రి టౌన్: పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన రఫీపై స్నేహితుడు సన్నీ కత్తితో దాడి చేశాడు. సన్నీకి సరిపడని వారితో రఫీ మాట్లాడుతున్నాడన్న కారణంగా ఆదివారం మద్యం మత్తులో కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వీపుపై తీవ్రగాయమైన రఫీని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. సంతల ఆదాయం రూ.3.62 లక్షలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గత వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.3.62 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.2,22,250 వసూలు కాగా ఆదివారం జరిగిన పశువులు, ఎద్దుల సంత నుంచి రూ.1,40,600 మేర వసూలైనట్లు వివరించారు. -
డిజిటల్ బుక్తో శ్రేణులకు భరోసా
ఉరవకొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి ప్రభుత్వంలో కష్టాలు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించేందుకే మాజీ సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను ఆవిష్కరించారని పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం అనంతపురంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిజిటల్ బుక్ స్కానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎటు చూసినా అక్రమ నిర్బంధాలు, అరెస్టులు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినా కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఆఖరుకు మీడియా స్వేచ్ఛను హరించే విధంగా దుర్మార్గపు పాలన సాగుతోందని దుయ్యబట్టారు. హైకోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. ఇటీవల పోలీసుల తీరును ఆక్షేపిస్తూ స్వయంగా హైకోర్టు ఒక కేసును సీబీఐకు అప్పగించడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. మాజీ సీఎం జగన్పై అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను విశ్వ ఖండించారు. గతంలో సినీ నటుడు చిరంజీవి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లినప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. పార్టీ అధినేతను, కార్యకర్తలను అవమానిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టప్రకారం అందరినీ శిక్షిస్తామని పునరుద్ఘాటించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిజిటల్ బుక్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, విద్యార్థి, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అరాచక పాలన పోలీసులపై హైకోర్టు తీవ్ర స్పందన ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి కార్యకర్తలను కాపాడుకుంటాం వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి -
‘ధన’లక్ష్మీ నమోస్తుతే
శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఏడో రోజైన ఆదివారం జగన్మాత వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాయదుర్గంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ. కోటి విలువైన కరెన్సీ నోట్లు, కాయిన్లతో అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాయి రాజశేఖర్, యువజన సంఘం అధ్యక్షుడు వంశీకృష్ణ, ప్రధాన అర్చకులు వెంకటాచలశర్మ అలంకరణలో పాలుపంచుకోగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. – రాయదుర్గంటౌన్: -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కార స్థితి గురించి కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. జాషువా సాహిత్యంపై రోజంతా చర్చించినా తక్కువే ● మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతపురం టవర్క్లాక్: కవి గుర్రం జాషువా సాహిత్యం గురించి రోజంతా చర్చించినా తక్కువే అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన జాషువా 130వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆర్ట్స్ కళాశాల వద్ద జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అలెగ్జాండర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. గుర్రం జాషువా తెలుగుజాతి ముద్దు బిడ్డ అన్నారు. ఆయన కవిత్వం ఎంత విస్తారమో అంత వైవిధ్యమన్నారు. ప్రతీ అంశాన్ని తనదైన శైలిలో మలిచి తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపార న్నారు. అలాంటి మహానుభావుడు తెలుగు వారు కావడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా అధ్యక్షుడు రాజేష్, నాయకులు చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుస్తీ విజేత ‘అనంత’ ● ద్వితీయస్థానంలో చిత్తూరు, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లాలు హిందూపురం టౌన్: రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల విజేతగా అనంతపురం నిలిచింది. ద్వితీయ స్థానంలో తిరుపతి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లాలు నిలిచాయి. హిందూపురంలో రెండురోజులుగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 5వ రాష్ట్రస్థాయి కుస్తీ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అన్ని జిల్లాల నుంచి 106 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 36 కేటగిరీల్లో పోటీలు జరిగాయి. ఇందులో 36 మంది విజేతలుగా నిలిచారు. వీరు నవంబర్ ఒకటో తేదీ నుంచి అయోధ్యలో నిర్వహించే జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొననున్నారు. సైకిల్పై నుంచి పడి బాలుడి మృతి యాడికి: సైకిల్ తొక్కుతూ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలో కూల్ డ్రింకు షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న అశోక్కు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మదన్ సాయి (15) కర్నూలులో 10వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి తమ కూల్ డ్రింక్ షాపు వద్దకు సైకిల్లో బయలుదేరిన మదన్సాయి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో కర్నూలు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. కుమారుడి అకాల మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. -
టమాట రైతుకు ధరాఘాతం
ఆత్మకూరు: టమాట ధరలు రైతులను ఊరించి.. ఉసూరుమనిపిస్తున్నాయి. ధర ఆశాజనకంగా ఉంటుందన్న ఉద్దేశంతో రైతులు టమాట సాగు చేశారు. ప్రారంభంలో మంచి ధర లభించినప్పటికీ.. ఇప్పుడు ఉన్నపళంగా తగ్గిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, మడకశిర, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు, ఆత్మకూరు, రాప్తాడు, కదిరి మండలాల్లో ఎక్కువగా టమాట సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగైంది. నారు, మందులు, ఎరువులు, కూలీల ఖర్చు ఎకరాకు రూ.50 వేల వరకు వెచ్చించారు. ఇక కట్టెలు పాతి పందిరి వేస్తే ఎకరాకు మరో రూ.30వేల దాకా అదనం. అంత శ్రమించి పంట సాగు చేసిన రైతులు ప్రస్తుతం మార్కెట్లో ధరలు చూసి షాక్ అవుతున్నారు. రోడ్డుపాలు.. మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పడిపోయాయి. 15 కిలోల టమాట బాక్సు ధర రూ.20 నుంచి రూ.150 మించడం లేదు. ఈ ధరలు కేవలం మొదట్లో రెండు కటింగులు మాత్రమే అమ్ముడుపోతున్నాయని, కొంచెం కాయల పరిమాణంలో తేడా ఉన్నా, మచ్చలు ఉన్నా ‘నో సేల్’ అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది మార్కెట్లో అమ్ముడుపోని టమాటలను రోడ్డు పక్కన పడేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందలేదు. సాగు చేసిన టమాట పంటకు వర్షాల వల్ల మచ్చలు రావడంతో పూర్తిగా నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. భారీగా ధరల పతనం పెట్టుబడులూ తిరిగిరావడం లేదు నష్టం వస్తోంది టమాట రైతులు ప్రస్తుతం నష్టాలు చవిచూస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందలేదు. ధరలు వస్తాయన్న ఆశతో టమాట సాగు చేశాం. కూలీలకు కూడా అందడం లేదు. రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలి. – నారపరెడ్డి, రైతు, పంపనూరు, ఆత్మకూరు మండలం -
వైద్య పరీక్షలు చేయించుకోవాలి
జంక్ ఫుడ్, పొగ తాగడం, వ్యాయామం లేకపోవడంతో యువత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. వంశపారంపర్యంగా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో 12 మందిని పరీక్షిస్తే అందులో ముగ్గురికి కచ్చితంగా బీపీ సమస్య కన్పిస్తోంది.ఈ పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – సుభాష్ చంద్రబోస్, అసోసియేట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి -
పెండింగ్ మాట వినిపించొద్దు
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ స్పష్టమైన ఆదేశాలు అనంతపురం అర్బన్: ‘‘నిర్దే శించిన అంశాలకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి కావాలి. ఏ అంశంలోనూ పెండింగ్ మాట వినిపించకూడదు’’అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారం, ఉద్యోగులకు ఏడాదిన్నరగా పదోన్నతుల కల్పనలో జరుగుతున్న జాప్యంపై ‘సాక్షి’లో ఈనెల 17న, 21వ తేదీన ‘‘సారూ... దృష్టి సారించండి’’, ‘‘కొత్తసారుపై.. కొండంత ఆశ’’ శీర్షికన ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ స్పందించారు. పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బందితో ఆయన రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమై తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇలా.. ● 22ఏ (నిషేధిత భూములు) జాబితాలోని భూములకు సంబంధించిన ఫైళ్లను పరిష్కరించాలి. చెక్లిస్ట్ ప్రకారం ఫైలును పక్కాగా సిద్ధం చూసి ఆమోదం కోసం ఉంచాలి. తిరస్కరణకు గురయ్యే వాటిని ఉంచకూడదు. 22ఏ ప్రత్యేక డ్రైవ్ కింద మొదటి విడతగా 487 ఫైళ్లు పరిశీలించి క్లియర్ చేయాలి. 10 రోజుల తర్వాత రెండో విడత చేపట్టి 500 ఫైళ్లు క్లియర్ చేయాలి. 22ఏ జాబితా నుంచి భూమి తొలగించాలంటూ పరిష్కార వేదికలో ఇక నుంచి ఫిర్యాదులు రాకూడదు. ● నిబంధనల ప్రకారం ఉన్న డాటెడ్ ల్యాండ్ (చుక్కల భూములు) ఫైళ్లు క్లియర్ చేయాలి. చెక్లిస్ట్ ప్రకారం ఫైళ్లను సిద్ధం చేసి ఆమోదం కోసం ఉంచాలి. ఏ దశలోనూ నిర్లక్ష్యం, అవినీతికి తావివ్వకూడదు. చిన్నపాటి ఫిర్యాదు కూడా రాకూడదు. ● కారుణ్య నియామకాల విషయంలో నిర్లక్ష్యం సరికాదు. ఎప్పటికప్పుడు ఫైళ్లను ఉంచాలి. నెల రోజుల వ్యవధిలో కారుణ్య నియామకాలు కల్పించాలి. ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆమోదం కోసం ఉంచండి. ● ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో జాప్యం చేయకూడదు. ఇందుకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి ఆమోదం కోసం ఉంచండి. ప్రతీదీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. -
‘పీపీపీ’తో పేదలకు వైద్యవిద్య దూరం
అనంతపురం అర్బన్: పేదలకు వైద్య విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని న్యాయవాదులు మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పద్ధతి (పీపీపీ)లో నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆనంద్ను శనివారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో న్యాయవాదులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం న్యాయవాదులు గాజుల ఉమాపతి, ఆర్. హరినాథరెడ్డి, ఈ.వెంకటరాముడు, గౌనినాగన్న, బాకే హబీబుల్లా తదితరులు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 వైద్య కళాశాలలను మంజూరు తీసుకొచ్చా రన్నారు. కళాశాలలకు ప్రభుత్వ భూమి, నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టారన్నారు. అందులో ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వీటితో పాటు ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణమూ జరుగుతోందన్నారు. వీటి ద్వారా ఏటా 1,500 మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే అవకాశం లభిస్తుందన్నారు. 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య అభ్యసించవచ్చన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరునికీ మెరుగైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటూ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. సర్కారు నిర్ణయంతో వైద్య కళాశాలలతో పాటు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళతాయని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు జి.నాగరాజబాబు, టీఆర్ నారపరెడ్డి, టి.నరసింహారెడ్డి, కె.విద్యాపతి, సయ్యద్ షాహి, ఇ.లక్ష్మీకాంత, టీఎం రాఘవేంద్ర, సూర్యచంద్రయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ, చంద్రబాబు కార్మిక వ్యతిరేకులు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ధ్వజం అనంతపురం అర్బన్: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కార్మిక వ్యతిరేకులని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం నగరంలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి నగర పాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. సీతారాం ఏచూరి ప్రాంగణం (స్థానిక ఫంక్షన్ హాలు)లో సీఐటీయూ జెండాను సీనియర్ నాయకుడు ఏజీ రాజమోహన్రెడ్డి ఆవిష్కరించారు. సీఐటీయూ ఆఫీసు బేరర్లు నాగమణి, నాగరాజు, శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభకు నరసింగరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. పీ–4తో పేదరికం లేకుండా చేస్తానంటూ మరింత పేదరికంలోకి నెట్టేసే విధానాలు అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారీ విధానాలు అమలు చేస్తూ శ్రమదోపిడీకి సిద్ధమయ్యాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో 10 గంటల పని విధానంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కూటమి ప్రభుత్వం కార్మిక ద్రోహిగా మారిందని మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులు కూడా నిత్యావసర సరుకులపై సుంకాలు వేయలేదని, కానీ మోదీ ప్రభుత్వం నిత్యావసరాలపైనా పన్నులు విధించిందని విమర్శించారు.8 గంటల పని విధానం, కార్మికులకు కనీస వేతనాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు ఉచిత విద్య, వైద్యం అమలు, హక్కుల పరిరక్షణకు ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, నాయకులు బాలరంగయ్య, లింగమయ్య, ఆర్వీనాయుడు, గోపాల్, ముత్తూజా, వెంకటనారాయణ, రామాంజినేయులు, రమాదేవి, శకుంతల, నాగభూషణ, జగన్మోహన్, శివప్రసాద్, నాగరాజు, శ్రీనివాసులు, సాకేనాగరాజు పాల్గొన్నారు. -
ఓఎంసీలో అటవీశాఖ అధికారుల తనిఖీలు
డీ హీరేహాళ్ (రాయదుర్గం): ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో అటవీశాఖ అధికారులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం జిల్లా ఇన్చార్జ్ డీఎఫ్ఓ చక్రపాణి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజర్ రామంచంద్రుడు, డీఆర్ఓ దామోదర్రెడ్డి సిబ్బందితో వెళ్లి ఓఎంసీ ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. 2011లో సీబీఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం, వాహనాల స్క్రాబ్ వివరాలపై డీఎఫ్ఓ ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ సీజ్ చేసిన ఐరన్ ఓర్ను కొందరు అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. అయితే ఇక్కడ అలాంటిదేమీ కానరాలేదన్నారు. ఒకటి, రెండు ట్రిప్పులు మాత్రమే తరలివెళ్లినట్టు గుర్తించామన్నారు. పెద్ద ఎత్తున దోపిడీ జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. ఓఎంసీ ప్రాంతంలో పటిష్ట నిఘా ఉంచామన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ–పంట నమోదు తప్పనిసరి కళ్యాణదుర్గం రూరల్/రాయదుర్గం టౌన్/ కణేకల్లు: సాగు చేసిన పంటలను రైతులు తప్పని సరిగా నమోదు చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం డివిజన్ పరిధి లోని మండలాల్లో ఈ– పంట నమోదును పరశీలించారు. ఈ సందర్బంగా ఆమె మట్లాడుతూ రైతుల పొలాల్లోకి వెళ్లి ఏ పంటలైతే సాగు చేశారో వాటి వివరాలే నమోదు చేయాలన్నారు. యూరియాపై రైతులెవరూ ఆందోళన చెందొద్దని, డిమాండ్కు సరిపడా యూరియా పంపిణీ చేస్తామన్నారు. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పెండింగ్ రైతుల వివరాలను పూర్తి చేయాలన్నారు. ఆర్ఎస్కేల సిబ్బంది రైతులతో మమేకమై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఎల్లప్ప, ఏఓ శ్రావణ్ కుమార్, రాణి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం
● డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయని వైనం యాడికి: అధికార పార్టీ నాయకులు, డీలర్లు వైఎస్సార్సీపీ నాయకులపై ‘పచ్చ’పాతం చూపుతున్నారు. డిజిటల్ రేషన్ కార్డులు అందించకుండా వేధిస్తున్నారు. దీనిపై బాధితులు సచివాలయ సిబ్బందిని ఆశ్రయించినా ఫలితం లేక పోయింది. వివరాలు.. యాడికి మండలంలోని వెంగన్నపల్లిలో ఇటీవల ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డులను డీలర్లు ఇంటింటికీ పంపిణీ చేపట్టారు. అయితే గ్రామంలో దాదాపు 30 మంది వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు మాత్రం కార్డులు అందించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై పలు మార్లు బాధితులు స్థానిక సచివాలయం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. దీంతో శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బాధితులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంగన్నపల్లి ఎంపీటీసీ పుట్లూరు జయప్రద, పుట్లూరు సరస్వతి, పుట్లూరు ఉమాదేవి, పుట్లూరు చిన్న వెంకట రెడ్డి, నంద్యాల రాములమ్మ, గుత్తి పంపిరెడ్డి, లక్ష్మిరంగా రెడ్డి, రమేష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సూరి, నరసింహులు, తిరుమలేశ్వర రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం ● సచివాలయ ఉద్యోగుల మండిపాటు అనంతపురం మెడికల్: రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శనివారం నగరంలోని టవర్క్లాక్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ, జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు వారు వినతి పత్రాలు అందించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన 3 నెలల నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలల అరియర్స్, పదోన్నతులు, మాతృశాఖ ప్రకారం జాబ్చార్ట్, ఆరేళ్లు పూర్తయిన ఉద్యోగికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీం మంజూరు తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న డోర్ టూ డోర్ సర్వేలకు స్వస్తి చెప్పాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుధాకర్, మల్లికార్జున, చంద్ర, వరప్రసాద్, లక్ష్మినారాయణ, హనుమంతు, ముత్యాలు, మంజునాథ్, మృదుల, శంకర్ రెడ్డి, విద్యాసాగర్, నరేష్, చిన్నవన్నూరప్ప, కిషోర్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. గాండ్లపర్తిలో అదృశ్యం.. బళ్లారిలో ప్రత్యక్ష్యం రాప్తాడు: గాండ్లపర్తిలో అదృశ్యమైన తల్లీపిల్లలు బళ్లారిలో ప్రత్యక్ష్యమయ్యారు. వివరాలు.. మండలంలోని గాండ్లపర్తి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య భార్య పద్మలత తన మూడేళ్ల కుమార్తె భానుశ్రీ, 8 నెలల కుమార్తె బేబీతో కలిసి ఈ నెల 23న అదృశ్యమైంది. దీనిపై పోతులయ్య ఫిర్యాదు మేరకు సీఐ టీవీ శ్రీహర్ష కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గాలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల దగ్గర గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే బళ్లారిలో తల్లీకుమార్తెల ఆచూకీ లభ్యం కావడంతో వెళ్లి తీసుకొచ్చారు. శనివారం వారిని తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం భర్త సాకే పోతులయ్యకు అప్పగించారు. పోలీసులను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ప్రత్యేకంగా అభినందించారు. -
ఐక్యతతోనే బీసీలకు ఫలాలు
● కులగణనతోనే బీసీల అభ్యున్నతి ● మాజీ ఎంపీ తలారి రంగయ్య అనంతపురం టవర్క్లాక్: ఐక్యతతోనే బీసీలకు ఫలాలు అందుతాయని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. శనివారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ తలారి రంగయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, మాజీ మేయర్ రాగే పరుశురామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ బీసీలు అత్యధిక జనాభా ఉన్నా ఎన్నో ఏళ్లుగా వెనుకబడిపోతున్నారన్నారు. హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్ల కోసం అడుక్కోవడానికే పరిమితమయ్యామని, ఇలాగే భయపడుతూ ఉంటే మరింత వెనుకబాటు తప్పదన్నారు. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించి అందరికీ ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో కుల గణన చేయడం ద్వారా బీసీలు అభివృద్ధి చెందారన్నారు. గతంలో తాను మున్సిపల్ కమిషనరుగా ఉన్నప్పుడు కులగణనపై నివేదిక కూడా పంపినట్లు గుర్తు చేశారు. ఇప్పటికై నా బీసీల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు కులగణన చేపడతామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో బీసీల జపం చేసి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేవరకు ఉద్యమాలు కొనసాగించాలన్నారు. ఇందుకు బీసీ ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు బాల రంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్, ఇమామ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, బీఎస్పీ నాయకులు గోవిందు, ఆర్పీఎస్ నాయకులు శ్రీరాములు. శివబాల, లింగమూర్తి, బోరంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ బుక్
కార్యకర్తలకు అండగా ఉండేందుకేడిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు అనంత, పార్టీ నాయకులు అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పరాకాష్టకు చేరాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కక్ష సాధింపు చర్యలు ఊపందుకున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా ఉంటానని, అన్యాయం చేసిన ఎవరినీ వదలబోనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారని’ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ ఆవరణలో డిజిటల్ బుక్కును ఆయన ఆవిష్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులపై హైకోర్టు మండిపడడమే కాకుండా కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చిందని, ఇంత వరకు దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితిని చూడలేదని అనంత అన్నారు. వెబ్సైట్లో నమోదు చేస్తాం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని అనంత హెచ్చరించారు. పాలకుల ఆదేశాలతో వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎక్కడున్నా వదిలిపెట్టబోమన్నారు. బాధితులు ఎవరైనా తమ ఇబ్బందులను డీబీ.డబ్ల్యూఈవైఎస్ఆర్సీపీ.కామ్ అనే వెబ్సైట్లో నమోదు చేయవచ్చన్నారు. 040–49171718 నంబర్కు కాల్ చేసి కూడా తెలపవచ్చునన్నారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, 29న మండల స్థాయిలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్మాది అని, అతనికి మతిస్థిమితం లేదని, వైఎస్ జగన్, చిరంజీవిలపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అతని పేరు ఇప్పటికే డిజిటల్ బుక్లో నమోదైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పార్టీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, హిందూపురం పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వత్థ నాయక్, రాష్ట్ర నాయకులు పెన్నోబులేసు, వెన్నం శివరామిరెడ్డి, కృష్ణవేణి, బాబా సలాం, జానీ, ఎగ్గుల శ్రీనివాసులు, రంగంపేట గోపాల్రెడ్డి, మీసాల రంగన్న, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, శ్రీనివాసులు నాయక్, మల్లెమీద నరసింహులు, వైపీ బాబు, చంద్రశేఖర్ యాదవ్, అమర్నాథ్రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, నాయకులు దాదు, నాగార్జున్ రెడ్డి, చింతకుంట మధు, కేశవరెడ్డి, అనిల్కుమార్ గౌడ్, సాకే కుళ్లాయస్వామి, సాకే చంద్రలేఖ, ఉష, తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టే వారి వివరాలను అందులో నమోదు చేస్తాం డిజిటల్ బుక్ ఆవిష్కరణలో అనంత బాలకృష్ణ ఓ ఉన్మాదని మండిపాటు -
పనుల్లో పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదు
అనంతపురం సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారులు, బ్రిడ్జిలు, భవనాల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, లేకపోతే ఉపేక్షించేది లేదని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) బాలూ నాయక్ హెచ్చరించారు. స్థానిక ఆ శాఖ రాయలసీమ సర్కిల్ కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పీఎంజీఎస్వై కింద చేపట్టిన తారు రోడ్లు, బ్రిడ్జిలు, నాబార్డు కింద చేపట్టిన రోడ్లు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టి అర్ధంతరంగా ఆగిన హెల్త్ క్లినిక్ల నిర్మాణాలపై ఈఎన్సీ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద కొత్తగా పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, ఒక్కో పంచాయతీ భవనానికి రూ.32 లక్షల చొప్పున కేటాయించినట్లు వివరించారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాణ్యత వంద శాతం పాటించాల్సిందేనని, లేకపోతే కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లక్ష్యాల కేటాయింపులో వెనుకబడిన ఇంజినీర్లు పని తీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా ఎస్ఈ బండారు మురళీ, కర్నూలు ఎస్ఈ వేణుగోపాల్, ఈఈలు ప్రభాకర్రెడ్డి, శ్రీరాములు, శంకరయ్య, క్యూసీ ఈఈ మల్లికార్జున మూర్తి, ఆదోని ఈఈ రామకృష్ణ, డీఈఈలు కె.లక్ష్మీనారాయణ, జింకల కృష్ణజ్యోతి, గుత్తి మురళీధర్, ఎస్ఈ పీఏ రాజేంద్రప్రసాద్ సహా 4 జిల్లాల పీఆర్, పీఆర్ఐ, పీఐయూ, క్వాలిటీ కంట్రోల్ డీఈఈలు పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణం పరిశీలన పెద్దవడుగూరు మండలం చిత్తూరు–పామిడి మార్గంలోని వంకపై పీఎంజీఎస్వై–3 కింద రూ.16.75 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని ఈఎన్సీ శనివారం పరిశీలించారు. నిబంధనల మేరకు బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని ఆదేశించారు. -
20 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 2.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విడపనకల్లు 11.8 మి.మీ, గుత్తి 10.8 మి.మీతో పాటు మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 84 మి.మీ నమోదైంది. ఓవరాల్గా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 303.4 మి.మీకి గానూ 9.6 శాతం అధికంగా 332.5 మి.మీ నమోదైంది. ఈ సీజన్లో 28 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. 11 మండలాల్లో సాధారణం కన్నా అధికంగానూ, 17 మండలాల్లో సాధారణం, మిగతా మూడు మండలాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. ఆదివారం కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. పయ్యావుల ఇలాకాలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి ● 21 మంది పేకాటరాయుళ్ల అరెస్టు ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో భారీ పేకాట స్థావరంపై ఉరవకొండ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. 21 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. పయ్యావుల సొంత పంచాయతీ అయిన ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల పరిధిలోని మైలారంపల్లి వద్ద వ్యవసాయ క్షేత్రంలో భారీఎత్తున పేకాట స్థావరం నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉరవ కొండ అర్బన్ సీఐ మహానంది ఆధ్వర్యంలో పోలీసులు శనివారం రాత్రి వ్యవసాయ క్షేత్రాన్ని చుట్టుముట్టారు. 21 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.77 వేల నగదు, 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లను స్టేషన్కు తరలించి..కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేస్తున్నామని, నిర్వాహకులు ఎవరన్నది విచారణలో తేలాల్సి ఉందని సీఐ మహనంది తెలిపారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం బుక్కరాయసముద్రం: ఎంపీపీ సునీతపై వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కేశవ నాయుడుకు 12 మంది ఎంపీటీసీలు, వైఎస్సార్ సీపీ నాయకులు నోటీసు అందజేశారు. మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ సభ్యులు 13 మంది ఉన్నారు. వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి టీడీపీలోకి చేరిన ఎంపీపీ సునీతపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని 13 మంది ఎంపీటీసీలు నిర్ణయించుకుని నోటీసును ఆర్డీఓకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు కాలువ వెంకటలక్ష్మి, నామాల శిరీష, బుల్లే సుజాత, వడ్డే రాజ్యలక్ష్మి, భాస్కర్ రెడ్డి, రాం గోపాల్, ఎర్రినాగప్ప, అంజినరెడ్డి, సాకే జయలక్ష్మి, శివారెడ్డి, కుళ్లాయప్ప, రామచంద్ర, నాగయ్య తోపాటు జెడ్పీటీసీ భాస్కర్, చికెన్ నారాయణస్వామి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. రేపు ‘పరిష్కార వేదిక’అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం ఉంటుందని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో తెలియజేయాలని సూచించారు. అర్జీతో పాటు ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే రసీదు తీసుకురావాలని సూచించారు. -
వైద్యం అందక ఐదేళ్ల బాలుడి మృత్యువాత
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. సకాలంలో వైద్యం అందక శుక్రవారం ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన నిరుపేద కూలీ హరిజన కేటీ రాజేష్, సరిత దంపతుల ఐదేళ్ల కుమారుడు అహరోన్కుమార్ నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతుండడంతో ఉరవకొండ లోని గుంతకల్లు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు. దీంతో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నైట్ డ్యూటీ డాక్టర్ ఇస్మాయిల్తోపాటు ఏఎన్ఎంలు ప్రియాంక, అంజన ఉన్నారు. డాక్టర్ ఆస్పత్రి పై భవనంలో విశ్రాంతి తీసుకుంటుండగా, నర్సు ప్రియాంక తానే తెలిసిన వైద్యం చేసి ఇంజక్షన్ తోపాటు సెలైన్ పెట్టారు. డాక్టర్ను పిలిచి ఒకసారి బాబు పరిస్థితి చూడాలని కుటుంబ సభ్యులు చెప్పినా ఏఎన్ఎం పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబు పరిస్థితి విషమించడంతో డాక్టర్ ఇస్మాయిల్ హుటాహుటిన వచ్చి పరీక్షించారు. అప్పటికే బాబు మృతి చెందాడు. పుట్టిన రోజు జరిగిన నాలుగు రోజులకే బాబు మృతిచెందడం బాధాకరం. ఆందోళనతో దిగివచ్చిన అధికారులు దీంతో ఆస్పత్రి ఎదుట బాబు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి ఉరవకొండ అర్బన్ సీఐ మహనంది, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వరాజ్ కూడా ఆస్పత్రికి వచ్చి శాఖా పరమైన విచారణ చేపట్టారు. దీనిపై సమగ్ర నివేదికను వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్తో పాటు కలెక్టర్కు సమరి్పస్తామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రంగిలిసింగి పంచాయతీ కుజభంగిలో వ్యాక్సిన్ వికటించి పసికందు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కుజభంగికి చెందిన ప్రవీణ్ కుమార్ భార్య అగతంబిడి లావణ్యకు రెండు నెలల క్రితం బిడ్డ జన్మించింది. ఈ నెల 24న గ్రామంలో వైద్య సిబ్బంది పసికందుకు వ్యాక్సిన్ వేశారు. అప్పటి నుంచి బిడ్డకు జ్వరం వస్తూనే ఉంది. శుక్రవారం తెల్లవారు జామున ఊపిరాడకపోవడంతో బిడ్డ మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై స్థానిక వైద్యాధికారి పి.రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పసరు మందు పట్టించడం వల్లే పసికందు మృతి చెందిందన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వేస్తే సాధారణ జ్వరం ఉంటుందని, పుట్టుకతోనే పసికందుకు మూర్ఛ లక్షణాలు ఉన్నాయన్నారు. మూర్ఛ ఉన్నట్టు తెలియక బాధిత కుటుంబీకులు పసరు మందును పట్టించడంతో పరిస్థితి విషమించి పసికందు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందన్నారు.డెంగీతో బాలుడి మృతి గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలో రెండేళ్ల బాలుడు డెంగీతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిన్న రంగన్న కుమారుడు నరహరి(2)కి పది రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో రక్తపరీక్ష చేయించారు. డెంగీగా నిర్ధారణ కావడంతో ఎమ్మిగనూరులోని చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. ఆరి్థక స్థోమత లేని తల్లిదండ్రులు.. నరహరిని సోమవారం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నరహరి శుక్రవారం మరణించాడు. -
స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి హెచ్చరించారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఎస్టీయూ జిల్లా రెండో కార్యవర్గ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన రఘనాథరెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు అంటూ ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్సనర్లకు కూటమి పెద్దలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత ఓ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. 27 నెలలుగా ఆలస్యం చేస్తూ వచ్చిన 12వ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2024, జనవరి నుంచి ఇప్పటి వరకూ బకాయి పడిన నాలుగు డీఏలు మంజూరు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోతే అక్టోబర్ 7న విజయవాడలో వేలాది మందితో ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు, ఆర్థిక కార్యదర్శి గంటే ప్రసాద్, విశిష్ట అతిథులు సీపీఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా ఇన్చార్జి నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఉద్యోగులను విస్మరించిన కూటమి ప్రభుత్వం ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి -
మొక్కజొన్న విత్తనాల మోసం
బొమ్మనహాళ్: తమ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు సాగు చేస్తే అధిక దిగుబడి ఖాయమంటూ రైతులకు నకిలీ విత్తనాలను బలవంతంగా అంటగట్టిన ఘటన బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. బాధిత రైతులు తెలిపిన మేరకు... కణేకల్లు క్రాస్కు చెందిన ఓ ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడు హరినాథ్... హైదరాబాద్కు చెందిన బయర్ విత్తన కంపెనీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో 2024లో దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన 50 మంది రైతులకు నమ్మబలికి మొక్కజొన్న విత్తనాలను బలవంతంగా అంటగట్టి వంద ఎకరాల్లో సాగు చేయించాడు. ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోవడంతో ఏజెంట్ను రైతులు నిలదీశారు. దీంతో గత ఏడాది కంపెనీ ప్రతినిధులు వచ్చి పంట పరిశీలన చేసి ఎకరాకు రూ.45 వేలు చొప్పున పరిహారం చెల్లించేలా ఒప్పంద పత్రం రాసిచ్చారు. అనంతరం ఏజెంట్ అరకొర పరిహారం చెల్లించి తర్వాత ముఖం చాటేశాడు. తమను మోసం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు మోహనందప్ప, శివగంగమ్మ, సంతోష్ వేడుకుంటున్నారు. -
పప్పుశనగ కేటాయింపులకు కత్తెర
● రబీ విత్తన పంపిణీపై స్పష్టత కరువు ● గత ఏడాది 28వేల క్వింటాళ్ల విత్తనం ● ఈసారి 14వేల క్వింటాళ్లకు కుదింపు అనంతపురం అగ్రికల్చర్: నల్లరేగడి భూముల్లో రబీ పంటగా పప్పుశనగ సాగు చేసే రైతులకు రాయితీ విత్తనం ఎపుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అక్టోబర్ ఒకటి నుంచి రబీ మొదలు కానున్నా... విత్తనానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. మరోపక్క ఈసారి జిల్లాకు విత్తన కేటాయింపుల్లో కూటమి ప్రభుత్వం కత్తెర వేసినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది 28 వేల క్వింటాళ్లు విత్తన పప్పుశనగ జిల్లాకు కేటాయించారు. అయితే ఈసారి 14 వేల క్వింటాళ్లకు కుదించినట్లు తెలుస్తోంది. దీంతో వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు కాస్తంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేటాయింపులు పెంచాలని మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీంతో పంపిణీ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏటా రబీలో 40 శాతం రాయితీతో అక్టోబర్ మొదటి వారంలోనే విత్తన పప్పుశనగ సాఫీగా అందించింది. కానీ కూటమి సర్కారు గత రబీలో రాయితీకి కూడా కొర్రీలు వేసింది. 40 శాతం ఉన్న రాయితీని 25 శాతానికి తగ్గించడంతో జిల్లా రైతులపై రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడింది. ఈసారైనా రాయితీ పెంపు చేస్తారా లేదంటే 25 శాతంతోనే ఇస్తారా అనేది స్పష్టత రాలేదు. విత్తనం కోసం ఎదురుచూపు రబీ సమీపిస్తుండటంతో నల్లరేగళ్లు సిద్ధం చేసుకున్న రైతులు విత్తన పప్పుశనగ కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్లో వర్షాభావం వల్ల నల్లరేగడి భూములు కలిగిన చాలా ప్రాంతాల్లో పంట వేయకుండా ఖాళీగానే ఉంచుకున్నారు. వర్షాలు కూడా కురుస్తుండటంతో ముందస్తు సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో రబీ ప్రధాన పంటగా 25 మండలాల్లో 70 వేల నుంచి 80 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. విత్తన పంపిణీ 22 మండలాల పరిధిలో చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం, ఆత్మకూరు, కూడేరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పామిడి, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విపడనకల్లు, గుంతకల్లు మండల పరిధిలో జేసీ–11 రకం విత్తనం పంపిణీ చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
ప్రమాదమే సతీష్రెడ్డిని బలిగొంది
● ప్రాథమిక విచారణలో స్పష్టమైనట్లు వెల్లడించిన డీఎస్పీ రవిబాబు అనంతపురం: పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన దేవన సతీష్రెడ్డి మృతి కేవలం ప్రమాదం వల్లనే జరిగిందని గుంతకల్లు డీఎస్పీ రవిబాబు స్పష్టం చేశారు. అనంతపురం అర్భన్ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 24న రాత్రి 8:40 గంటల సమయంలో పామిడి– నాగసముద్రం రోడ్డులోని సిమెంటు పెళ్లల ఫ్యాక్టరీ వద్ద సతీష్రెడ్డి రక్తగాయాలతో మృతి చెందినట్లుగా సమాచారం అందుకున్న పామిడి ఇన్చార్జ్ సీఐ రాజు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారన్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ట్రాక్టర్ ట్రాలీకి రక్తపు మరకలు అంటిన దృశ్యాన్ని గమనించి డ్రైవర్ దేవరపల్లి సాయికుమార్ను విచారణ చేయడంతో ట్రాక్టర్లో ఇంటి సామగ్రిని పామిడి నుంచి గుత్తి మండలం బ్రాహ్మణపల్లికి చేరవేస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి ఢీకొని కిందపడిపోయినట్లుగా అంగీకరించాడన్నారు. అయితే డ్రైవర్ భయపడి ముందుకెళ్లిపోయి, సామాన్లు అన్లోడ్ చేసి అదే రోజు రాత్రి 11 గంటలకు తిరిగి అదే దారి గుండా వెళుతూ తన ట్రాక్టర్కు గుద్దుకున్న వ్యక్తి చనిపోయి ఉండటాన్ని గమనించి వాహనాన్ని పామిడిలోని ఓనర్ రాజకుళ్లాయప్ప ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడన్నారు. సతీష్రెడ్డి మృతికి ప్రమాదమే కారణమనేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో లీగల్ ఒపీనియన్ తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 16 వరకూ పోషణ్ మాసోత్సవాలు అనంతపురం సెంట్రల్: కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 16 వరకూ పోషణ్ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ నాగమణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆరోగ్యవంతమైన మహిళా – శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది’ అనే అంశంపై జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. -
జీఎస్టీపై అవగాహన చర్యలు
● సీఎస్కు తెలిపిన కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: జీఎస్టీ తగ్గింపుపై జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, తదితర అంశాలపై సీఎస్ శుక్రవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ భాస్కర్వల్లి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, నెడ్క్యాప్ అధికారి అశోక్రెడ్డి, అసిస్టెంట్ కమిషర్ సరేంద్రరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎస్కు కలెక్టర్ వివరించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టేటా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిశ్రమలతోనే జిల్లా ప్రగతి
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా ప్రగతి, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికరంగాన్ని పటిష్ట పరిచేలా, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు సకాలంలో మంజూరు చేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తిమ్మసముద్రం, ఊరిచింతల, కూడేరు ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడలను త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ను ఆదేశించారు. పీఎంఈజీపీ ద్వారా అర్హులైన వారి నుంచి మంచి ప్రాజెక్టులను ఎంపిక చేయాలని పరిశ్రమల శాఖ అధికారిని సూచించారు. ఇటీవల ప్రారంభమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో స్టార్టప్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. రాయదుర్గానికి చెందిన పారిశ్రామికవేత్తకు స్థలసేకరణ చేయాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్ పాలసీ కింద 17 యూనిట్లకు పెట్టుబడి, విద్యుత్, వడ్డీ, స్టాంప్డ్యూటీ రాయితీలకు రూ.93 లక్షల సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్యాదవ్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, డీటీసీ వీర్రాజు, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఏపీఐఐజీ డిప్యూటీ జోనల్ మేనేజర్ దేవకాంతమ్మ పాల్గొన్నారు. -
నిషేధిత భూములపై ప్రత్యేక డ్రైవ్
అనంతపురం అర్బన్: నిషేధిత భూముల (22ఎ) ఫైళ్ల పరిష్కారానికి కలెక్టర్ ఆనంద్ చర్యలు చేపట్టారు. ‘సాక్షి’లో ఈనెల 17న ప్రచురితమైన ‘‘సారూ... దృష్టిపెట్టండి’’ కథనానికి ఆయన స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 32 మండలాలకు చెందిన ఫైళ్ల పరిశీలన ప్రక్రియ కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో మండల తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు చేపట్టారు. ఈ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల పర్యవేక్షించారు. 32 మండలాల పరిధిలో 2024 జూన్ 15 తరువాత అందిన ఫైళ్లలో ప్రస్తుతం మొదటిదశగా 487 ఫైళ్ల పరిశీలన నిర్వహిస్తున్నారు. కాలేజీలకు రేపటి నుంచి దసరా సెలవులు అనంతపురం ఎడ్యుకేషన్: అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలకు ఆదివారం నుంచి అక్టోబరు 5 వరకు దసరా పండుగ సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నేపఽథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ శుక్రవారం తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తమ దృష్టికి వస్తే నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను, విద్యార్థుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాకు 1,586 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం అగ్రికల్చర్: నర్మదా కంపెనీ నుంచి 1,585.85 మెట్రిక్ టన్నుల యూరియా శుక్రవారం జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్లో వ్యాగన్ల ద్వారా సరఫరా అయిన యూరియా లాట్లను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన దాంట్లో 1,020 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్కు, 565.85 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఇండెంట్ల మేరకు మార్క్ఫెడ్ నుంచి ఆర్ఎస్కేలు, సొసైటీలు, ఎఫ్పీవోలకు, ప్రైవేట్ డీలర్ల నుంచి రీటైల్ దుకాణాలకు సరఫరా చేసి రైతులకు అందుబాటులో పెడతారని తెలిపారు. -
అచ్చోసిన ఆంబోతులా బాలకృష్ణ తీరు
● చిరంజీవిపై వ్యాఖ్యలు దుర్మార్గం ● పవన్ స్పందించకపోవడం దారుణం ● మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: పవిత్రమైన అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తూలుతూ మాట్లాడిన తీరు అచ్చోసిన ఆంబోతులా ఉందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ హుందాగా మాట్లాడాల్సిన బాలకృష్ణ తూలుతూ నోటికొచ్చినట్టు మాట్లాడటాన్ని తప్పుపట్టారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సినీ పెద్దలైన చిరంజీవి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో జరిపిన చర్చల గురించి కామినేని శ్రీనివాస్ ప్రస్తావించగా.. బాలయ్య కల్పించుకుని అవాకులు చెవాకులు పేలారన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే తోటి సభ్యులంతా ఒక పిచ్చోడిని చూసినట్టే చూస్తుంటారని, ఎందుకంటే బాలయ్య మాట తీరు అలా ఉంటుందని అన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చలు జరిపిన చిరంజీవిని ఉద్దేశించి వాడు, వీడు అంటూ కరడుగట్టిన కులతత్వం, అధికార మదంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. తన అన్నపై ఇంత దారుణంగా బాలకృష్ణ మాట్లాడుతున్నా సభలోనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించకపోవడం, కనీసం జన సైనికులు దీనిపై మాట్లాడకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిన పవన్.. తన అన్నను అవమానపరిచినా తుడుచుకుని వెళ్లిపోయేలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చివరకు చిరంజీవి స్పందించి ఆనాడు చర్చల్లో పాల్గొనేందుకు బాలయ్య కోసం ఎన్నిసార్లు ప్రయత్నించారో, తర్వాత చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగిన తీరును లేఖద్వారా తెలియజేశారన్నారు. బాలకృష్ణకు మానసిక స్థితి సరిగా లేదని, ఆయన్ని యర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెస్తరమణ పాల్గొన్నారు. -
జెడ్పీలో సంబరాలు
అనంతపురం సిటీ: జెడ్పీ చైర్మన్గా బోయ గిరిజమ్మ నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య, ఉద్యోగులతో కలసి ముందుగా తన చాంబర్లో గిరిజమ్మ కేక్ కట్ చేసి, పంచారు. ఈ సందర్భంగా గిరిజమ్మకు ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువ కప్పి సత్కరించారు. నాలుగేళ్ల తన పదవీ కాలంలో తనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సహకరించిన ఉద్యోగులకు గిరిజమ్మ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉపాధి పనుల్లోనూ కక్కుర్తి!
గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పక్కదారి పట్టింది. కాదేదీ అవినీతికి అనర్హం అనే రీతిలో కొందరు అధికారులు ఉపాధి నిధులు స్వాహా చేస్తున్నారు. తాడిపత్రిటౌన్: ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్.. అనే చందంగా మారింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం అధికారుల తీరు. ఓ టెక్నికల్ అసిస్టెంట్ చేతివాటాన్ని ప్రదర్శించి ఎన్డబ్ల్యూపీసీ (సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్) నిధులను ఏకంగా తన భార్య బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకుని కూలీలను నిట్టనిలువునా ముంచేశాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కూలీలను కాదని.. తాడిపత్రి మండలంలో 22 పంచాయతీలు ఉండగా... 21 పంచాయతీల్లో 2014–19 మధ్య కాలంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ వెచ్చించారు. ఈ మొత్తం నిధుల్లో 25 శాతం అంటే రూ.3 లక్షలను అప్పటి ప్రభుత్వం విత్హెల్డ్లో ఉంచింది. ఈ నిధులు పది రోజుల క్రితం విడుదలయ్యాయి. వీటిని పంచాయతీల వారీగా ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా ఓ టెక్నికల్ అసిస్టెంట్ తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు. దాదాపు రూ.90 వేలను తన భార్య బ్యాంక్ ఖాతాలోకి బదలాయించుకుని, ఉపాధి కూలీలకు మొండి చెయ్యి చూపాడు. అక్రమాలకు అధికారుల ఊతమా? ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అధికారులు ఊతమిస్తున్నారా అనే ప్రశ్నకు ఔననే సమాధానమే వినిపిస్తోంది. పనుల కల్పన మొదలు... బిల్లుల చెల్లింపు వరకూ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రతి అధికారీ తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారుల లొసుగులన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుని కింది స్థాయి సిబ్బంది ఆడింది ఆట.. పాడింది పాటగా రెచ్చిపోతున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బంది బ్లాక్మెయిల్కు తలొగ్గి అక్రమాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే తాజాగా తాడిపత్రి మండలంలో చోటు చేసుకున్న విత్హెల్డ్ నిధులు పక్కదారి పట్టిన అంశం. అక్రమాలకు పాల్పడిన టెక్నికల్ అసిస్టెంట్పై చర్యలు తీసుకుంటే గతంలో తాము చేసిన అక్రమాలు అతను బయటపెడతాడనే భయం వారిని వెన్నాడుతుండడంతో... చడీచప్పుడు చేయకుండా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం చేసిన పనులకు సంబంధించిన నిధులు కావడంతో ఈ విషయాన్ని ఉపాధి కూలీలు సైతం మరిచిపోయారు. ఇదే అదనుగా ఉపాధి కూలీలను దగా చేస్తూ ఆ సొమ్మును అధికారులు పంచుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కదారి పట్టిన విత్హెల్డ్ ఉపాధి నిధులు చేతివాటం చూపిన టెక్నికల్ అసిస్టెంట్ తన భార్య బ్యాంక్ ఖాతాలోకి ఎస్డబ్ల్యూపీసీ నిధులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
బాలకృష్ణా.. పొగరు తగ్గించుకో
● నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం ● మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి గుంతకల్లు టౌన్: అసెంబ్లీ సాక్షిగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణ పొగరు తగ్గించుకోవాలని హితవు పలికారు. తప్పతాగి మరోసారి వైఎస్.జగన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాల్పుల కేసులో బాలకృష్ణను దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి మానవత్వంతో కాపాడకపోయి ఉంటే జైల్లో ఊచలు లెక్కపెట్టేవారని గుర్తు చేశారు. బాలకృష్ణ చేష్టలను ఆయన అభిమానులు భరిస్తారేమో కానీ వైఎస్సార్సీపీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరని స్పష్టం చేశారు. -
దబిడిదిబిడే అంటే కుదరదు
● బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమన్న విద్యార్థి, యువజన విభాగం అనంతపురం కార్పొరేషన్: బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉంటూ సినిమాల్లోలా దబిడిదిబిడే అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తే కుదరదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగాలు హెచ్చరించాయి. అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బాలకృష్ణ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, యువజన విభాగం నగరాధ్యక్షుడు శ్రీనివాస దత్తా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ పాలనలో విద్య, వైద్యంతో పాటు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అప్పటి సీఎం జగన్ విశేష ప్రజాదరణను సొంతం చేసుకున్నారన్నారు. బాలకృష్ణ తన హుందాను మరచి నోరు పారేసుకుంటూ పోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదు, నగర ఉపాధ్యక్షుడు ఉదయ్, విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు కైలాష్, నాయకులు మసూద్ అలి, మహ్మద్ రఫి, సురేష్, అకాష్, సాదిక్, వినీత్ పాల్గొన్నారు. బాలకృష్ణ దిష్టిబొమ్మ దహనం వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మదిరెడ్డి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని టవర్క్లాక్ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. నరేంద్రరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన తప్పు తెలుసుకుని ఆయన మాటలు వెనక్కు తీసుకోవాలన్నారు. గతంలో ఇంటిలో కాల్పులు జరిగిన ఘటనలో బాలకృష్ణను రక్షించిందెవరో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నితిన్రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్రెడ్డి, నాయకులు సుధీర్, మాధవరెడ్డి, లోకేష్శెట్టి, హేమంత్ యాదవ్, వడ్డే ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్న నాయకులు బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న యువజన, విద్యార్థి విభాగాల నాయకులు -
ఐదేళ్ల నిరీక్షణ.. ఐదు రోజులకే విషాదం!
అనంతపురం మెడికల్: ఆ దంపతులు సంతానం కోసం ఐదేళ్లు నిరీక్షించారు. ఎట్టకేలకు తొలిచూరి కాన్పులో మగబిడ్డ జన్మించాడు. అయితే ఆ బిడ్డ ఐదు రోజులకే కన్ను మూశాడు. ఈ ఘటన ఆ దంపతులను కలచివేసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ మృతి చెందాడంటూ బంధువులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన మేరకు... నగరంలోని హనుమాన్ కాలనీకి చెందిన శిరీష, జయసింహ దంపతులు. ఐదేళ్ల నిరీక్షణ అనంతరం శిరీష తొలిచూరి గర్భం దాల్చింది. నగరంలోని అమ్మ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ శివజ్యోతి వద్ద చూపించుకుంటూ వచ్చింది. ఈ నెల 20న అదే ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ సూచన మేరకు కుటుంబ సభ్యులు సాయినగర్లోని హృదయ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. 23వ తేదీ వరకు అంటే మూడు రోజులకే రూ.3.50 లక్షలకు పైగా ఖర్చయ్యింది. అయితే బిడ్డలో అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిల్యూర్ అవుతున్నాయని, మరొక ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ నెల 24వ తేదీన బిడ్డను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. 25వ తేదీ ఆ బిడ్డ చనిపోయాడు. బిల్లు చెల్లించిన తర్వాతనే బిడ్డను బయటకు తీసుకుపోండని హృదయ ఆస్పత్రి నిర్వాహకులు కర్కశంగా వ్యవహరించి జాప్యం చేయడం వల్లే తమ బిడ్డ మరణించాడంటూ శిరీష, జయసింహ దంపతులు ఆరోపించారు. గైనకాలజిస్ట్ శివజ్యోతి కూడా సకాలంలో ప్రసవం చేయకపోవడం వల్లే బిడ్డ ఆరోగ్యం తల్లకిందులైందని ఆరోపిస్తూ బాధితులు బంధువులతో కలిసి శుక్రవారం అమ్మ ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ మనోరంజన్రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ శివజ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పిదం లేదని వారు చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు ఆస్పత్రిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఘటనపై ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ మనోరంజన్రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చివరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ సమక్షంలో ఇరు వర్గాల వారు మాట్లాడుకున్నారు. మృతి చెందిన పసికందు, విలపిస్తున్న శిరీష, జయసింహ డాక్టర్ల నిర్లక్ష్యంతోబాబు మృతి ‘అమ్మ’ ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేసిన బాధితులు -
బీకేఎస్ ఎంపీపీపై అవిశ్వాసం!
● కలెక్టర్, జెడ్పీ డిప్యూటీ సీఈఓలకు విన్నవించిన ఎంపీటీసీలుఅనంతపురం సిటీ/ బుక్కరాయసముద్రం: పార్టీ కట్టుబాటు తప్పి.. నమ్మకద్రోహం చేసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీతపై వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం కలెక్టర్ ఆనంద్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్యను వేర్వేరుగా కలిసి విన్నవించారు. బుక్కరాయసముద్రం మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందగా, ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. బుక్కరాయసముద్రం–2 స్థానం నుంచి గెలుపొందిన దాసరి సునీతకు ఎంపీపీ పగ్గాలు అప్పగించారు. అప్పట్లోనే ఒక ఒప్పందం కుదిరింది. మొదట ఎంపీపీ పగ్గాలు చేపట్టిన వారు రెండేళ్లు, ఆ తరువాత అధికారం చేపట్టే వారు మూడేళ్లు ఎంపీపీగా కొనసాగాలని ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి కట్టుబడి దాసరి సునీత తొలిసారి ఎంపీపీ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లు గడిచిన తర్వాత మరో ఆరు నెలలు తనకు అవకాశం కల్పించాలని కోరగా.. వైఎస్సార్సీపీ పెద్దలు సరేనన్నారు. ఆ గడువు ముగియగానే బుక్కరాయసముద్రం–1 ఎంపీటీసీ సభ్యురాలు కాలువ వెంకటలక్ష్మికి ఎంపీపీ పగ్గాలు అప్పగించాలి. అయితే దాసరి సునీత పదవి నుంచి తప్పుకోకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో మిగిలిన సభ్యులు ఆమెను వ్యతిరేకించారు. పార్టీ ఫిరాయింపుతో అసలుకే ఎసరు ఒప్పందం మేరకు ఎంపీపీ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని రాజకీయ విలువలు కాపాడాలని మిగిలిన సభ్యులు సునీతకు సూచిస్తూ వచ్చారు. అయితే వాటిని ఆమె పెడచెవిన పెట్టడమే గాక ఏకంగా పార్టీ ఫిరాయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె టీడీపీలోకి చేరిపోయారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యుల సంఖ్య ఆరుకు చేరగా, వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య 13కు చేరింది. ఇప్పటికీ వైఎస్సార్సీపీకే స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా ఎంపీపీ సునీత పదవి వీడకుడా మొండిగా వ్యవహరిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి పట్టు ఎంపీపీ సునీతపై తక్షణం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎంపీటీసీ సభ్యులు మూకుమ్మడిగా వైఎస్సార్సీపీ పెద్దల దృష్టికి తెచ్చారు. ఇదే అంశంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల సమన్వయకర్త సాకే శైలజానాథ్తో రెండు రోజులపాటు మంతనాలు జరిపారు. వారి సూచన మేరకు శుక్రవారం ఎంపీటీసీ సభ్యులు నామాల శిరీష (బీకేఎస్–4), బుల్లే సుజాత (బీకేఎస్–5), వడ్డే రాజ్యలక్ష్మి (బీకేఎస్–6), భాస్కర్రెడ్డి (రేగడ కొత్తూరు), రాంగోపాల్(వడియంపేట), ఎర్రినాగప్ప (గోవిందంపల్లి), అంజినరెడ్డి (చెదళ్ల), సాకే జయలక్ష్మమ్మ (రెడ్డిపల్లి), శివారెడ్డి (దయ్యాలకుంట్లపల్లి), కుళ్లాయప్ప (వెంకటాపురం), రామచంద్ర (కె.కె.అగ్రహారం), నాగయ్య (చెన్నంపల్లి) అనంతపురానికి చేరుకున్నారు. ముందుగా డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్యను కలసి అవిశ్వాస తీర్మానం కోసం వినతిపత్రమందించారు. ఆ తర్వాత జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మను కలిసి, చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులతో పాటు జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, సర్పంచులు పార్వతి, శ్రీనివాసరెడ్డి, ఎర్రిస్వామి, వైఎస్సార్సీపీ బుక్కరాయసముద్రం మండల శాఖ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ముసలన్న, మల్లికార్జున, పూల నారాయణస్వామి, పురుషోత్తం, చికెన్ నారాయణస్వామి తదితరులు విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యమన్నారు. ఒప్పందం ఉల్లంఘించిన దాసరి సునీత ఎంపీపీ పదవిలో ఉండటానికి ఏమాత్రమూ అర్హురాలు కాదన్నారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ ఆనంద్ను కలసి వినతిపత్రం అందజేశారు. శనివారం అనంతపురం ఆర్డీఓ గుత్తా కేశవనాయుడును కలిసి అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేస్తామని చెప్పారు. -
హోంగార్డుపై టీడీపీ అల్లరి మూక దాడి
గుంతకల్లు: రోజు వారీ విధుల్లో భాగంగా కసాపురం దేవస్థానం వద్ద డ్యూటీలో ఉన్న హోంగార్డు పుల్లయ్యపై టీడీపీ అల్లరి మూకలు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాయి. వివరాలు.. గుంతకల్లు వన్టౌన్ పీఎస్లో పనిచేస్తున్న హోం గార్డు పుల్లయ్య గత 24 రోజులుగా కసాపురం ఆలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో రాజగోపురం వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మద్యం ఫుల్గా సేవించి స్కూటీపై వచ్చిన కసాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు భీమప్ప, మంజు, రాము.. పుల్లయ్యతో ఘర్షణపడ్డారు. ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటావా? అంటూ భీమప్ప, మంజు కొడుతుండగా స్థానిక దుకాణదారులు అడ్డుకోవడం జారుకున్నారు. అనంతరం పుల్లయ్యను రాము తన స్కూటీలో ఎక్కించుకుని సమీపంలోని సులభ కాంప్లెక్స్ వద్ద తీసుకెళ్లి అక్కడ కాపు కాచిన భీమప్ప, మంజుతో కలసి మరోసారి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారి బారి నుంచి తప్పించుకుని ఆలయ ఉద్యోగుల సాయంతో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నాడు. చికిత్స అనంతరం కసాపురం పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
ఆర్టీసీ ఎండీకి నిరసన సెగ
తాడిపత్రిటౌన్: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ద్వారాకా తిరుమలరావుకు పారిశుధ్య కార్మికుల నుంచి నిరసన సెగ తాకింది. సీ్త్రశక్తి పథకం అమలు తీరును పరిశీలించేందుకు తాడిపత్రిలో శుక్రవారం పర్యటించిన ఆయన్ను పారిశుధ్య కార్మికులు చుట్టుముట్టారు. వేతనాలు పెంచి తమ కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు కోరారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి తీపి కబురు చెబుతామని ఎండీ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి సీ్త్రశక్తి అమలు తీరుపై ప్రయాణికులను ఆరా తీశారు. త్వరలో ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమలరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో తిరుపతికి 300, విశాఖకు 100, మరో 12 డిపోలకు 50 బస్సుల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, ఏఎస్పీ రోహిత్కుమార్చౌదరి, ఆర్టీసీ డీఎం మురళీధర్ పాల్గొన్నారు. -
అమ్మా.. నేనేం పాపం చేశా!
కడుపులో నేను పడ్డానని తెలియగానే మురిసిపోయావు.. నవమాసాలు కంటికి రెప్పలా మోశావు.. పురిటి నొప్పులు తట్టుకున్నావు.. నువ్వు పునర్జన్మ పొంది.. నాకు జన్మనిచ్చావు.. ఇంత చేసి చివరికి ఆప్యాయత పంచకుండానే పడేశావు... అసలు నేనేం పాపం చేశానమ్మా! (అనంతపురం నగరంలో రోడ్డు పక్కన పడి ఉన్న ఓ పసికందు అంతరంగానికి అక్షర రూపమిది) అనంతపురం: అప్పుడే పుట్టిన పసికందును నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేసి వెళ్లిన ఘటన గురువారం అనంతపురం నగరంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆడబిడ్డ అనే చిన్నచూపో లేక మరేదైనా కారణమో గానీ ముక్కుపచ్చలారని శిశువును అమానవీయంగా వదిలేసి వెళ్లారు. వివరాల్లోకి వెళితే... అనంతపురం సాయినగర్ ఏడో క్రాస్లో గురువారం తెల్లవారుజామున నవజాత శిశువును పాలిథిన్ కవర్లో చుట్టి రోడ్డు పక్కన వదిలిపెట్టారు. శిశువు ఏడుపు విని చుట్టుపక్కల ఇళ్ల వారు నిద్రలేచి అధికారులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ ఎస్ఐ రుష్యేంద్ర, ఐసీడీఎస్ పీడీ ఎం.నాగమణి, డీసీపీఓ మంజునాథ్, మూడో సచివాలయం మహిళా పోలీస్ టీఎం సుస్మిత, ఏఎన్ఎం లక్ష్మి అక్కడికి చేరుకుని నవజాత శిశువును స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. 72 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. శిశువుకు కావాల్సిన పాలను మదర్ మిల్క్ బ్యాంకు నుంచి అందిస్తున్నారు. శిశువును వదిలేసి వెళ్లిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
అగ్రి ల్యాబ్లకు చంద్రగ్రహణం
రాయదుర్గం: విత్తనం మంచిదైతే పంట బాగుంటుంది. పంట కళకళలాడితే దిగుబడికి దిగులుండదు. ధరలూ కలిసొస్తే రైతుకు తిరుగుండదు. అంతా సవ్యంగా జరగాలంటే మేలి రకం విత్తనం కావాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అగ్రి ల్యాబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, నార్పల, అనంతపురం, గుంతకల్లులో అగ్రి ల్యాబ్లు నిర్మించారు. ఒక్కో ల్యాబ్ నిర్మాణానికి, వసతులకు రూ.కోటి ఖర్చు చేశారు. మట్టి నమూనాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షలతో పాటు పశుసంవర్ధక శాఖ, ఆక్వా కల్చర్ అభివృద్ధిలో భాగంగా అందుకు సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. రాయదుర్గంలో స్వయంగా జగన్ చేతుల మీదుగా అగ్రి ల్యాబ్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో నష్టాలు.. అగ్రి ల్యాబ్ల ద్వారా విత్తన పరీక్ష నివేదిక వారం నుంచి పది రోజుల్లోనే పొందవచ్చు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్ధారణ రిపోర్టును రెండు లేదా మూడు రోజుల్లోపు అందిస్తారు. రైతులు కాకుండా ఇతర ప్రైవేటు వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 3 వేల వరకు చెల్లిస్తే చాలు. విత్తనాల నివేదిక కోసం రూ.200 మాత్రమే చెల్లించేలా రుసుం విధించారు. రైతులకై తే సేవలన్నీ ఉచితం. ఇలా ఎంతో మేలు చేకూర్చేలా గత ప్రభుత్వం తీసు కొచ్చిన అగ్రి ల్యాబ్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేయడంతో సేవలేవీ రైతులకు అందడం లేదు. వసతుల కల్పనతో పాటు సిబ్బందిని సర్దుబాటు చేయడంలో నిర్లక్ష్యం చూపడంతో నేడు నామమాత్రంగా పరీక్షలు జరుగుతున్నాయి. అది కూడా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి అగ్రి ల్యాబ్లలో మాత్రమే అరకొరగా టెస్టింగ్లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల అవి కూడా లేవు. జిల్లాలో ఏటా వరి, కంది, పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు రైతులు సాగుచేస్తున్నారు. అగ్రి ల్యాబ్లు సరిగా పనిచేయని నేపథ్యంలో నకిలీ విత్తనాలను కొంటూ నష్టాలు మూట కట్టుకుంటున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం అగ్రి ల్యాబ్లలో టెక్నికల్ ఏఓలు, ఏఈఓలు, ఎంపీఈఓలను అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం టెస్టింగ్లు వచ్చినప్పుడు మాత్రమే వారిని వినియోగించి ఆ తర్వాత క్రాప్ బుకింగ్కు వాడుకుంటున్నాం. అగ్రి ల్యాబ్లపై నివేదిక తెప్పించుకుని పూర్తిస్థాయిలో పరీక్షలు మొదలయ్యేలా చర్యలు చేపడతాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – ఉమామహేశ్వరమ్మ, జేడీఏ రైతులను చులకనగా చూడొద్దు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాయదుర్గంలోని అగ్రి ల్యాబ్లో బాగా పరీక్షలు నిర్వహించారు. నేడు కేవలం మెలకశాతం మాత్రమే చేస్తున్నారు. పశు సంవర్ధక, మత్స్యశాఖలకు సంబంధించిన సేవలు కనిపించడం లేదు. మట్టి నమూనాలు కూడా తీసుకోవడం లేదు. రైతుల పట్ల చులకనభావం సరికాదు. –శివన్న, రైతు, రంగచేడు రైతు సంక్షేమమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహణపై నిర్లక్ష్యం జరగని పరీక్షలు.. అందని ఫలితాలు నకిలీ విత్తనాలతో చిత్తవుతున్న రైతులు -
ప్లాస్టిక్ను స్వచ్ఛందంగా నిషేధించాలి
● ప్రజలకు కలెక్టర్ ఆనంద్ పిలుపు అనంతపురం అర్బన్/రాప్తాడు రూరల్: ‘‘పర్యావరణానికి ప్లాస్టిక్ చేటు చేస్తుంది. పర్యావరణం దెబ్బతింటే మానవ మనుగడకే ప్రమాదం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా ఏక్దిన్.. ఏక్ గంట... ఏక్ సాథ్ (ఒకరోజు–ఒక గంట–అందరూ కలిసి)’లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లిలో సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ను తొలుత గ్రీన్ ఆఫీసుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా బట్ట, జనపనార సంచులు వాడుతూ, తోటి వారూ వాడేలా చైతన్యపర్చాలన్నారు. ఈ కార్యక్రమం ఒకరోజు చేయాల్సింది కాదని, ఇంట్లో మనం ఎలా శుభ్రం చేసుకుంటామో, అలాగే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతలో మునిసిపల్, పంచాయతీ వర్కర్లకు ప్రజలు సహకారం అందించాలన్నారు. అనంతరం పర్యావరణహిత బట్ట బ్యాగులు పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై కలెక్టర్ చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పిల్లిగుండ్ల కాలనీ సీతారాముల ఆలయ సమీపంలోని గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, సంపూర్ణ పోషణ్ అభియాన్ కింద పౌష్టికాహార మాసోత్సవాల స్టాల్ను సందర్శించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్బాబు, సర్పంచ్ కృష్ణయ్య,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని శంకర్, జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజు నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ పాల్గొన్నారు. రెవెన్యూ క్రీడోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతి ఉత్సవాలు నవంబరు 7,8,9 తేదీల్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టర్లను కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో స్నేహభావం, ఐక్యత, క్రీడాస్ఫూర్తి, సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు ఇలాంటి ఉత్స వాలు తోడ్పతాయన్నారు. అనంతరం లాటరీ విధానంలో డ్రెస్కోడ్ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీరాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి తదితరులున్నారు. -
ఎదుగుదలను ఓర్వలేక అంతమొందించారా?
పామిడి: వైఎస్సార్సీపీ నాయకుడు సతీష్రెడ్డి ఎదుగుదలను ఓర్వ లేక ప్రత్యర్థులు అంతమొందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి మండలంలోని కాలాపురం గ్రామ సమీపాన వైఎస్సార్ సీపీ రూరల్ బూత్ కన్వీనర్ల ప్రెసిడెంట్ దేవన సతీష్రెడ్డి (34) మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. సతీష్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు మంచి స్నేహితులు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం సదరు టీడీపీ నాయకుడి కుటుంబ వ్యవహారంలో సతీష్రెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో మిత్రుడి కుటుంబంలోని టీడీపీ నాయకుడికి, సతీష్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో ఆ వ్యక్తి వాటర్ ప్లాంట్ విషయంలోనూ సతీష్రెడ్డి జోక్యం చేసుకొన్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామం వదిలిపెట్టి వెళ్లిన సదరు టీడీపీ నాయకుడు ఇటీవలే పామిడిలో ప్రత్యక్షమయ్యాడు. సతీష్రెడ్డి వైఎస్సార్ సీపీ కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగిపోతుండడం చూసి ఓర్వలేకపోయాడని, ఎలాగైనా అంతమొందించాలని భావించి బుధవారం రాత్రి హత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పోస్టుమార్టం చేశాక పోలీసులు సతీష్రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులంటూ వేచి ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రోడ్డు ప్రమాదమట..! రోడ్డు ప్రమాదం కారణంగానే సతీష్ రెడ్డి మృతి చెందాడని ఓ వ్యక్తి గురువారం రాత్రి పోలీసు ప్రతినిధినంటూ ‘సాక్షి’కి ఫోన్ చేసి తెలపడం గమనార్హం. సీసీ ఫుటేజీల్లో ఓ ట్రాక్టర్, సతీష్రెడ్డి ద్విచక్రవాహనం ఒకదాని వెనుక ఒకటి వెళ్లినట్లు కనిపించాయని, ఆ ట్రాక్టర్ను సతీష్రెడ్డి ద్విచక్రవాహనం ఢీ కొనడంతోనే తీవ్ర గాయాలపాలై చనిపోయాడని చెప్పారు. ట్రాక్టర్ రేకు కారణంగా సతీష్రెడ్డి గొంతు కోసుకుపోయి ఉంటుందన్నారు. మరోవైపు సతీష్రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలు బహిర్గతం చేస్తామంటూ పామిడి ఇన్చార్జ్ సీఐ రాజు తెలపడం గమనార్హం. సతీష్రెడ్డి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని, కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే క్లూస్ టీం, పోలీసు జాగిలాల సాయంతో ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు. అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, అధైర్య పడరాదని సతీష్రెడ్డి కుటుంబసభ్యులకు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ధైర్యం చెప్పారు. గురువారం జీ కొట్టాల గ్రామంలో నిర్వహించిన సతీష్ రెడ్డి అంత్యక్రియల్లో వైవీఆర్ పాల్గొన్నారు. సతీష్ రెడ్డి తల్లి సుంకురత్నమ్మ, తండ్రి కాశీవిశ్వనాథరెడ్డి, సోదరి మహాలక్ష్మి, సోదరులు సుదర్శన్రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, బంధువులను ఓదార్చారు. విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. సతీష్రెడ్డి మృతి అంశాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుందని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని జగనన్న భరోసానిచ్చారని తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, నాయకులు బోయ రామచంద్ర, సునీల్రెడ్డి, రమేష్రెడ్డి, రూపేష్రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, పామిడిలోని సీహెచ్సీ మార్చురీలో సతీష్రెడ్డి మృతదేహానికి డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. వీరాంజ నేయులు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నాయకుడు సతీష్రెడ్డి మరణంపై అనుమానాలెన్నో! స్వగ్రామంలో ఓ టీడీపీ నాయకుడితో విభేదాలున్నట్లు వినికిడి -
పసి ప్రాణం ఉక్కిరిబిక్కిరి
అనంతపురం మెడికల్: పసి ప్రాణాన్ని మహమ్మారి పట్టుకుంటోంది. పాలు కూడా తీసుకోలేని స్థితికి తీసుకెళ్తోంది. ఊపిరి కూడా సలపనంతంగా ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లాలో ఇటీవల చిన్నారుల న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి.చాపకింద నీరులా మహమ్మారి వ్యాప్తి చెందుతుండడం అందరినీ కలవరపరుస్తోంది. అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డుల్లో న్యుమోనియా కేసులు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో రోజూ 40 నుంచి 60 అడ్మిషన్లు జరుగుతుండగా.. అందులో సగానికి పైగా వైరల్ న్యుమోనియా కేసులు ఉండడం గమనార్హం. గడిచిన నెలన్నరలో న్యుమోనియా బారిన పడిన వెయ్యి మంది చిన్నారులకు వైద్యులు చికిత్సలు అందించారంటే ఎంతగా ప్రబలిందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులను సంప్రదించాలి.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. అందులో న్యుమోనియా ఒకటి. మూడేళ్లలోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో ఎక్కువగా వ్యాధి బారిన పడతారు. ఇటీవల వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి తోడు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలను తిప్పడం వల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందుతుంది. మొదటగా జలుబుతో ప్రారంభమై దగ్గు, జ్వరం, ఆయాసం తదితర లక్షణాలు బయటపడుతాయి. అనంతరం చిన్నారులు తల్లిపాలను తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడుతూ ఉక్కిరిబిక్కిరవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులకు అందించే ఆహారంలో శీతల పదార్థాలు లేకుండా చూసుకోవాలి. న్యుమోనియా లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పడకల సమస్య.. సర్వజనాస్పత్రి చిన్నపిల్లల వార్డులో మూడు యూనిట్లలో 90 పడకలుంటే ప్రస్తుతం 187 మంది అడ్మిషన్లో ఉన్నారు. సగానికిపైగా న్యుమోనియా కేసులున్నాయి. వైరల్ ఫీవర్తో 42 మంది ఇబ్బంది పడుతున్నారు. వార్డులో సరిపడునన్ని పడకలు లేక పోవడంతో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి వైద్య సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. నెబులైజేషన్ కోసం క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రే మేలు.. సర్వజనాస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు న్యుమో నియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సేవలందిస్తున్నారు. దీంతో చిన్నారులు వేగంగా కోలుకుంటున్నారు. రామగిరికి చెందిన దంపతులు ఇటీవల న్యుమోనియా బారిన పడిన తమ కుమారుడిని అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రూ.వేలల్లో ఖర్చు చేసినా బిడ్డ ఆరోగ్యంలో మార్పురాలేదు. వెంటిలేటర్పై ఉన్న పసికందును సర్వజనాస్పత్రికి తీసుకురాగా వైద్యులు మెరుగైన వైద్య సేవలందించడంతో ఇటీవల కోలుకుంటున్నాడు. నిర్లక్ష్యం చేయొద్దు... చిన్నారుల్లో వైరల్ న్యుమో నియా అధికమవుతోంది. మందుల షాపులు, ఆర్ఎంపీల వద్దకు వెళ్లి కౌంటర్ మెడిసిన్ వాడొద్దు. అందుబాటులో ఉన్న చిన్నపిల్లల వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. – డాక్టర్ సంజీవయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, జీజీహెచ్ వామ్మో న్యుమోనియా జిల్లాలో ప్రబలుతున్న మహమ్మారి జలుబు, దగ్గు, జ్వరంతో చిన్నారుల అవస్థలు సర్వజనాస్పత్రిలో నిత్యం నమోదవుతున్న కేసులు మారిన వాతావరణంతో రోగం బారిన పడుతున్న పసికందులు ‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్న తల్లిదండ్రులు సర్వజనాస్పత్రిలో మెరుగైన చికిత్సలు -
21 ఎల్పీజీ సిలిండర్ల సీజ్
గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో జిలాన్ గ్యాస్ ఫిల్లింగ్ దుకాణంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమంగా నిల్వ చేసిన 21 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ నరేంద్ర భూపతి, సీఎస్డీటీ జీవీ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.వ్యక్తి దుర్మరణంరాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం పాతూరులోని భవానీ నగర్లో నివాసముంటున్న కురుబ మల్లేశప్ప (53), రమాదేవి దంపతులు తోపుడు బండిపై అరటి కాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మల్లేశప్ప రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో అరటి తోటలు చూసుకుని 44వ జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి శరవేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. రాత్రి 7 గంటలకు మృతుడిని మల్లేశప్పగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. ఘటనపై సీఐ టి.వి.శ్రీహర్ష కేసు నమోదు చేశారు. -
●ప్రయాణం.. ప్రహసనం
దసరా పండుగ నేపథ్యంలో కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో జిల్లా కేంద్రంలోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పిల్లలను పిలుచుకెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణం కావడంతో గతంలో కంటే భిన్నంగా ఈ సారి తల్లులే అత్యధికంగా వచ్చారు. బస్సుల సంఖ్య పెంచక పోవడంతో ఉన్న బస్సులన్నీ కిక్కిరిశాయి. బస్టాండ్ పాయింట్లో బస్సు ఆగగానే ఎక్కేందుకు మహిళలు పోటీ పడ్డారు. తోపులాట చోటు చేసుకుంది. ఇక పురుషులు బస్సు కిటికీల నుంచి లోపలకు ప్రవేశించాల్సి వచ్చింది. – అనంతపురం క్రైం/సాక్షి ఫొటోగ్రాఫర్: ● ఆదాయం రాకపోగా రైతన్నకు చేతి నుంచి రూ.600 ఖర్చు జిల్లాకు చేరిన 756 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీకి చెందిన 756.315 మెట్రిక్ టన్నుల యూరియా, 586 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 113.6 మెట్రిక్ టన్నులు 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు వ్యాగన్ల ద్వారా గురువారం చేరిన యూరియాను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 450 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్కు, మిగతా 306.315 మెట్రిక్ టన్నులను ప్రైవేట్ డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. దళారుల రాజ్యం.. రైతు నిలువు దోపిడీ ‘గురుకుల’ సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి మృతి బుక్కరాయసముద్రం: మండలంలోని కొర్రపాడు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సేవా సుప్రీం ఏజెన్సీ కింద పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కృష్ణవేణి కుమార్తె, 17 నెలల వయసున్న చిన్నారి 3 రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బంది కాచి పక్కన ఉంచిన పాలలో పడి తీవ్రంగా గాయపడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని దళిత సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్దపప్పూరు: దళారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తుండడంతో టమాట రైతు నిలువు దోపిడీకి గురయ్యాడు. పంటను మార్కెట్కు తరలిస్తే లాభం మాట దేవుడెరుగు... రైతు చేతి నుంచే రూ. వందలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. వివరాలు... పెద్దపప్పూరుకు చెందిన టమాట రైతు షేక్ రఫీ గురువారం 25 కిలోల చొప్పున 31 బాక్సుల టమాటను బొలెరో వాహనంలో నంద్యాల జిల్లా ప్యాపిలిలోని మార్కెట్లో విక్రయానికి తీసుకెళ్లాడు. ఇందుకు గాను వాహనానికి రూ.1,500 అద్దె చెల్లించాడు. అక్కడి దళారులు గ్రేడింగ్ చేసి 31 బాక్సులను కాస్త 23 బాక్సులకు కుదించారు. బాక్స్కు రూ.70 చొప్పున వేలం పాడడంతో రూ.1,610 వచ్చింది. దళారుల కమీషన్ రూ.160 పోను రూ.1,450 చేతికి అందింది. పంట కోసిన కూలీలకు రూ. 600 రైతు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క రూపాయి ఆదాయం రాకపోగా చేతి నుంచి మరింత ఖర్చు పెట్టాల్సి రావడంతో రైతు ఆవేదనకు అంతులేకుండా పోయింది. -
●అధినేతతో భేటీ
అనంతపురం కార్పొరేషన్/శింగనమల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు పలువురు వేర్వేరుగా కలిశారు. కలిసిన వారిలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి, పుట్టపర్తి – కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు నిట్టూరు రఘునాథరెడ్డి ఉన్నారు. -
‘ఎస్ఆర్ఐటీ’కి జాతీయ గుర్తింపు
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ గురువారం వెల్లడించారు. ఇటీవల భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, యూజీసీ మద్దతుతో నిర్వహించిన జాతీయ స్థాయి పర్యావరణ సంరక్షణ్ పోటీల్లో ఎస్ఆర్ఐటీకి చెందిన 23 మంది విద్యార్థులు ప్రతిభ చాటారు. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వంద విద్యాసంస్థలు పోటీకి హాజరు కాగా, ఎస్ఆర్ఐటీకి 85వ స్థానం దక్కింది. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి విద్యాసంస్థగా ఎస్ఆర్ఐటీకి ఖ్యాతి దక్కింది. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం కళాశాలలో అధ్యాపకులు అభినందించారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణాలకు కారణంగా తెలుస్తోంది. కళ్యాణదుర్గం రూరల్: స్థానిక రాచప్పబావి కాలనీకి చెందిన తిప్పేస్వామి (34) ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామానికి చెందిన తిప్పేస్వామి జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితం రాచప్ప బావి కాలనీలోని అద్దె ఇంటికి మకాం మార్చాడు. భార్య గీతాంజలి, నాలుగేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. తీవ్ర అర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మనోవేదనకు లోనైన ఆయన గురవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం సిటీ: అనంతపురం–తాటిచెర్ల మార్గంలోని డౌన్ లైన్ మధ్యలో రైలు కింద పడి గుర్తు తెలియని ఓ యువకుడు(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తల నుజ్జునుజ్జు కావడంతో మృతుడిని గుర్తించడం కష్టమైంది. సమాచారం అందుకున్న రైల్వే హెడ్కానిస్టేబుల్ దామోదర్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
● రికార్డుల్లో లేకున్నా రైతు పొలంలో రస్తా కుందుర్పి: జంబుగుంపల గ్రామంలో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కసుతో రైతుల పొలాల్లో దౌర్జన్యంగా రస్తా వేసేందుకు ఉపక్రమించారు. అడ్డుకోబోయిన మహిళలను బెదిరించడంతో బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. జంబుగుంపల గ్రామంలోని సర్వే నంబర్ 110లో వైఎస్సార్సీపీ మద్దతుదారు రైతులు దొడ్డయ్య, ఎర్రమల్ల తదితరులకు చెందిన భూమి ఉంది. బుధవారం సాయంత్రం టీడీపీ నాయకుల ప్రమేయంతో తహసీల్ధార్ ఓబులేసు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ భూమిలో ప్రభుత్వ శివాయి జమ భూమి కూడా ఉందని రస్తా వదలకపోతే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ భూమిని వదిలేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇదే సర్వే నంబర్లో పట్టా భూమి కూడా ఉందని, అందులో రస్తా వదిలేందుకు సాధ్యం కాదని అన్నారు. ఆ సమయంలో ఎందుకు సాధ్యం కాదంటూ టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. రెవెన్యూ అధికారులను ఉసిగొల్పి సర్వే చేయించారు. అడ్డుకోబోయిన లక్ష్మి, నాగలక్ష్మిని రెవెన్యూ అధికారుల సమక్షంలోనే చితకబాదారు. జేసీబీని రప్పించి రస్తా ఏర్పాటుకు భూమి చదను పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలాక్షి, గ్రామ సర్పంచ్ గంగాధర, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మహేంద్ర, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు తిప్పేస్వామి, మాజీ డీలర్ నాగరాజు బాధితులకు అండగా నిలిచారు. పట్టా భూముల్లో రస్తా లేకున్నా.. టీడీపీ నాయకుల మాటలకు తలొగ్గి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు. కాగా, ఇదే విషయంగా తహసీల్దార్ ఓబులేసు మాట్లాడుతూ.. రస్తా వేసిన పొలానికి సంబంధించి 50సెంట్లకు పైగా భూమి ప్రభుత్వ శివాయి జమ లెక్కలో ఉందన్నారు. ఈ విషయంగా సదరు రైతులకు నచ్చజెప్పి చుట్టుపక్కల రైతులకు ఇబ్బంది లేకుండా రస్తా వేయించామని పేర్కొన్నారు. -
ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి అదృశ్యం
రాప్తాడు: మండలంలోని గాండ్లపర్తికి చెందిన సాకే పోతులయ్య భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదు. సీఐ టీవీ.శ్రీహర్ష తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి కుమారై పద్మలతకు గాండ్లపర్తి గ్రామానికి కొండన్న కుమారుడు సాకే పోతులయ్యతో 2021 సెప్టెంబర్ 21న వివాహమైంది. పోతులయ్య ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న ఉదయం పద్మలత తన భర్తకు తెలపకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారి కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఆచూకీ లక్ష్యం కాకపోవడంతో మంగళవారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.రైలు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలురాయదుర్గం టౌన్: రైలు ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న కొంతానపల్లికి చెందిన చిత్రయ్య బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో రాయదుర్గంలోని శాంతినగర్ సమీపంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో ఎగిరి పట్టాల పక్కన పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ప్రధాన పంటగా కంది
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కంది ప్రధాన పంటగా అవతరిస్తోంది. గత కొన్ని దశాబ్ధాలుగా ఏక పంటగా లక్షలాది హెక్టార్లలో సాగవుతూ వస్తున్న వేరుశనగను వెనక్కినెట్టి కంది తొలిస్థానాన్ని ఆక్రమిస్తోంది. గత నాలుగైదు సంవత్సరాలుగా జిల్లా రైతులు కంది సాగుపై మొగ్గుచూపడమే ఇందుకు కారణం. 2024 ఖరీఫ్లో ఏకంగా 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగులోకి రాగా ఈ ఖరీఫ్లో కూడా 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఈ–క్రాప్ ముగిస్తే కంది విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. జిల్లా చరిత్రలో తొలిసారిగా కంది పంట వేరుశనగను దాటిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కంది విస్తీర్ణం పెరిగినా... వేరుశనగను అధిగమించలేకపోయింది. ఈ సారి కంది తొలిస్థానంలో నిలవడం విశేషం. కంది సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు కాగా 183 శాతంతో 1.01 లక్షల హెక్టార్లకు చేరుకుంది. గతంలో ఉమ్మడి జిల్లాలో కూడా ఈ స్థాయిలో కంది ఎన్నడూ సాగులోకి రాలేదు. ఉమ్మడి జిల్లాలో 2017లో అత్యధికంగా 71 వేల హెక్టార్లుగా నమోదైంది. లక్ష హెక్టార్లలోపే వేరుశనగ గత నలభైయేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వేరుశనగ సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్ల లోపే పరిమితమైంది. ఈ సారి 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా అతి కష్టంపై 89 వేల హెక్టార్లకు చేరుకుంది.పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య, అననుకూల వర్షాల వల్ల పంట దిగుబడులు తగ్గిపోవడం, చివరికి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడం, చీడపీడల వ్యాప్తి, అడవిపందులు, జింకల బెడద తదితర కారణాలతో వేరుశనగ పేరు వింటనే రైతులు బెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. అలాగే నల్లరేగడి భూముల్లో పత్తి విస్తీర్ణం 44 వేల హెక్టార్లు అంచనా వేయగా అదనులో వర్షం పడకపోవడంతో 24 వేల హెక్టార్లకు పరిమితమైంది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మొక్కజొన్న ఇటీవల క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది 14,653 హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 25,500 హెక్టార్లకు పెరిగింది. 16,293 హెక్టార్లు అంచనా వేసిన ఆముదం 15,406 హెక్టార్లకు చేరుకుంది. నీటి వనరులు పెరగడంతో 19,466 హెక్టార్లు అంచనా వేసిన వరినాట్లు 22,500 హెక్టార్లకు చేరుకుంది. సజ్జ 2,054 హెక్టార్లకు గానూ 3,583 హెకా్టార్లలో సాగైంది. రాగి, కొర్ర, ఉలవ, పెసర, అలసంద, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర పంటలు నామమాత్రపు విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి చేస్తోంది. మొత్తమ్మీద ఈ ఖరీఫ్లో 3,42,232 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా... 83 శాతంతో 2,84,834 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగు చేశారు. ఈ క్రాప్ నమోదు పూర్తయితే ఖచ్చితమైన సాగు లెక్కలు అందుబాటులోకి రానున్నాయి. గత రెండేళ్లుగా వేరుశనగ సాగుపై రైతుల్లో సన్నగిల్లుతున్న ఆసక్తి ఈసారి 183 శాతంతో 1.01 లక్షల హెక్టార్లతో అగ్రస్థానంలో కంది 89 వేల హెక్టార్లకే పరిమితమైన వేరుశనగ -
పట్టపగలే హైడ్రామా!
అనంతపురం: పట్టపగలే హైడ్రామా నడిచింది. గోవా మద్యం తరలిస్తూ కొందరు యువకులు ఎకై ్సజ్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దాదాపు వందకు పైగా కిలోమీటర్ల మేర సినీ ఫక్కీలో ఛేజింగ్చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. రామ్మోహన్రెడ్డి వెల్లడించారు. అడ్డుకుంటే చంపుతామంటూ... గోవా నుంచి మద్యాన్ని బుధవారం ఉదయం అక్రమంగా జిల్లాలోకి తరలించుకుని వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమై ఆత్మకూరు మండలం వడ్డుపల్లి టోల్ప్లాజా వద్ద కాపు కాశారు. ఉదయం 10.30 గంటల సమయంలో అటుగా వచ్చిన స్విఫ్ట్ కారును అడ్డుకుని పరిశీలిస్తుండగా డ్రైవర్ వాకీ టాకీ ద్వారా వెనుక వస్తున్న ఇన్నోవా కారు డ్రైవర్ను అప్రమత్తం చేయడం గమనించారు. దీంతో వెనువెంటనే మరో వాహనంలో ఆత్మకూరు వైపుగా ఎకై ్సజ్ అధికారులు వెళుతుండగా హంద్రీ–నీవా కెనాల్ వద్ద ఇన్నోవా కారు ఉన్నఫళంగా వెనక్కు తిరిగి కాలువ గట్టుపై నుంచి శరవేగంగా దూసుకెళ్లింది. దీంతో ఎకై ్సజ్ అధికారులు తమ వాహనంలో వెంబడించారు. ఒకానొక దశలో ఎకై ్సజ్ అధికారుల వాహనాన్ని ఢీకొని ముందుకు సాగుతూ ఇనుపరాడ్లను తీసి ప్రదర్శిస్తూ తమను అడ్డుకుంటే చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఎకై ్సజ్ అధికారులు వదలకుండా ఇన్నోవా కారును వెంబడిస్తూ వెళ్లారు. చివరకు సాయంత్రం 4 గంటల సమయంలో కర్ణాటక సరిహద్దులోని తిరుమణి వద్ద ఉన్న బాలసముద్రం టోల్ ప్లాజా వద్ద ఇన్నోవా కారును అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడింది వీరే.. స్విఫ్ట్ కారుతో పాటు, ఇన్నోవాను అదుపులోకి తీసుకున్న ఎకై ్సజ్ అధికారులు వాటిని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించారు. రెండు వాకీటాకీలు, మొత్తం రూ.1.76 లక్షల విలువ చేసే హనీగ్రేడ్ బ్రాందీ (180 ఎం.ఎల్)– 97 బాక్సులు, గోల్డెన్ ఏఎస్ ఫైన్ విస్కీ (180 ఎం.ఎల్) – 16 బాక్సులు, మాన్షన్ హౌస్ బ్రాందీ (750 ఎం.ఎల్)– 3 బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కె.వీరేంద్ర, డి. ప్రవీణ్, కె.వెంకటేష్, కె.పవన్కుమార్ను అరెస్ట్ చేశారు. వీరిలో కె.వీరేంద్రపై మద్యం కేసులు చాలా ఉన్నాయని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. అయితే ఏనాడూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడలేదన్నారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన ఏఈఎస్ వి.శ్రీరాం, ఇన్స్పెక్టర్లు కె.అన్నపూర్ణ, ఎస్.అలీబేగ్, ఎస్ఐలు సి.నరేష్బాబు, ఎం.హరికృష్ణ, ఎన్.సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు రామచంద్ర, ఫణీంద్ర, రమేష్బాబు, కానిస్టేబుళ్లు వెంకటనారాయణ, వెంకటప్రసాద్, ఎస్.మారుతి, ఎం.మారుతి, శివానంద రెడ్డి, నాగముని, చరణ్ కుమార్, సందీప్, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ జయనాథ్ రెడ్డి, హెచ్.ఆర్. ప్రసాద్ (ఎస్ఐ), అనంతపురం ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. సినీ ఫక్కీలో దాదాపు వంద కిలో మీటర్లకు పైగా ఛేజింగ్ గోవా మద్యాన్ని తరలిస్తున్న ముఠా పట్టివేత రూ.1,76,904 విలువైన మద్యం స్వాధీనం -
పంచాయతీలను అభివృద్ధి బాట పట్టించండి
● అధికారులకు జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశం రాప్తాడు: ప్రస్తుతం సేంద్రియ ఎరువులకు భారీగా డిమాండ్ ఉందని, అందువల్ల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.శివశంకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని బుక్కచెర్ల గ్రామ పంచాయతీలో పర్యటించారు. పంచాయతీ కార్మికులు ఇంటింటికీ వచ్చి చెత్త సేకరిస్తున్నారా, తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందా.. అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అందువల్ల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ కార్మికులు కూడా తమకు కేటాయించిన ఇళ్ల నుంచి రోజూ చెత్త సేకరించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని, అక్కడ వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసి రైతులకు విక్రయించాలన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఇన్చార్జి ఈఓఆర్డీ ప్రేమ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మహేంద్రరెడ్డి పాల్గొన్నారు. ‘సత్య’కీర్తి అంతర్జాతీయంగా శోభిల్లేలా.. ప్రశాంతి నిలయం: ‘సత్యసాయి శత జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తారు. ఏ ఒక్క భక్తుడికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేద్దాం. మన ఆతిథ్యంతో సత్యసాయి కీర్తిని అంతర్జాతీయంగా శోభిల్లేలా చేద్దాం’ అని అధికారులకు శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సత్యసాయి శతజయంతి వేడుకలను దేశం గర్వించేలా పర్యావరణ హితంగా నిర్వహించాలన్నారు. రోజువారీ భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాగునీరు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్లు, వీధి దీపాలు, డస్ట్బిన్లు, వ్యర్థాల నిర్వహణ, ఫుడ్ కౌంటర్లు, అదనపు సిబ్బంది నియామకం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తుల రాకపోకలు, ముఖ్య ప్రదేశాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పటిష్టమైన పహారా కోసం స్పష్టమైన కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్, ఎస్పీ సతీష్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు చలం, డాక్టర్ నారాయణన్, ప్రభు, రామేశ్వర్ షృష్టి, రాజేష్ దేశాయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సకాలంలో ఈ–పంట నమోదు చేయాలి
ఉరవకొండ రూరల్: ఈ–పంట నమోదు ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో గడువు లోపు రైతుల ఈ–కేవైసీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. బుధవారం ఉరవకొండ మండలంచిన్నముష్టూరు, మోపిడి గ్రామాల పరిధిలోని పొలాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఆయా గ్రామాల పరిధిలో సాగు చేసిన కంది పంటను పరిశీలించి తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించారు. ఈ–పంట నమోదు జిల్లాలో 5.46 లక్షల ఎకరాల్లో నమోదు కాగా, ఉరవకొండ మండల పరిఽధిలో 22 ఎకరాల్లో నమోదు అయినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఏఓ రామకృష్ణుడు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. 27న ఉద్యోగ మేళా అనంతపురం సెంట్రల్: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో కోటక్ మహీంద్రా బ్యాంకు అనుబంధ బీఎస్ఎస్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలకు ఈ నెల 27న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులు. 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ. 16వేల నుంచి రూ.25వేలు జీతం చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27న ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. అమరావతికి తరలిన డీఎస్సీ అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులు బుధవారం ఉదయం అమరావతికి తరలి వెళ్లారు. జిల్లాతో పాటు జోనల్ పోస్టులకూ ఎంపికై న వారితో పాటు సంబంధీకులు ఒకరు తోడుగా ఉన్నారు. ఉదయాన్నే అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాల వద్ద అల్ఫాహారం ముగించుకుని మొత్తం 45 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. బస్సులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు జెండా ఊపి ప్రారంభించారు. గురువారం అమరావతిలో జరిగే కార్యక్రమంలో సీఎం, విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకుంటారని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మునీర్ఖాన్, శ్రీనివాసులు, డెప్యూటీ డీఈఓలు శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు. -
డబుల్ మర్డర్ కేసులో నిందితుడిపై దాడి
తాడిపత్రి టౌన్: రెండేళ్ల క్రితం తాడిపత్రిలో చోటు చేసుకున్న డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న కాకర్ల సుల్తాన్ హుస్సేన్పై హతుల బంధువులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. 2022లో జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఆరుగురు నిందితులు కాగా, 2024 జనవరిలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఆరీఫ్ అనే నిందితుడిని హతుల బంధువులు దాడి చేసి హతమార్చారు. దీంతో కాకర్ల సుల్తాన్ హుస్సేన్ ప్రాణభయంతో బెంగళూరుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్న ఆయన రెండు రోజుల క్రితం తాడిపత్రికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న డబుల్ మర్దర్ కేసులో బాధిత బంధువులు, బుక్కపట్లం వీధికి చెందిన రహంతుల్లా, షాషు, షాంబుల్లా మంగళవారం రాత్రి సుల్తాన్ హుస్సేన్పై ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకుని హుస్సేన్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మట్కా బీటర్ల అరెస్ట్ గుత్తి: స్థానిక అమృత్ సినిమా థియేటర్ వెనుక ఉన్న ఎస్సీ కాలనీలో మట్కా రాస్తూ ముగ్గురు బీటర్లు పట్టుబడినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. అందిన సమాచారం మేరకు బుధవారం తనిఖీలు చేపట్టిన సమయంలో మట్కా రాస్తూ రామాంజనేయులు, రాము, యల్లమ్మ పట్టుబడ్డారన్నారు. బీటర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.25,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
మంట కలుస్తున్న మానవత్వం
అనుబంధాలకు ప్రస్తుత సమాజంలో విలువ లేకుండా పోతోంది. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తుల మాయలో పడి సొంత వారిని సైతం హతమార్చే స్థాయికి బంధాలు దిగజారుతున్నాయి. డబ్బుంటే చాలు .. ఇంకేం వద్దు అనే స్థాయికి దిగజార్చి పేగు బంధాలను కడతేరుస్తున్నాయి. రాయదుర్గం: ‘నాన్నా! నీవు చచ్చిపో... ఆస్తి సొంతమవుతుంది’ అంటూ స్థిరాస్తుల కోసం రక్త సంబంధాలనే కాదనుకునే కొందరి తీరుతో మానవత్వం మంట కలుస్తోంది. జన్మనిచ్చిన తల్లి, తండ్రిని హతమార్చడం, మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదంటూ కట్టుకున్న భార్యను హత్య చేయడం వంటి ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. కొందరు మద్యం మత్తులో, మరికొందరు క్షణికావేశంలో, ఇంకొందరు పథకం ప్రకారం హత్యలకు పాల్పడిన ఘటనలు మానవత్వానికి మాయని మచ్ఛగా నిలిచాయి.మచ్చుకు కొన్ని...జిల్లాలో ఆస్తుల కోసం కన్న వారినే హతమార్చిన ఘటనలు దాదాపు 16 వరకు ఉన్నాయి. కారణాలేమైన సరే మలి వయస్సులో వారికి తోడుగా ఉండాల్సిన కన్నబిడ్డలే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. కొట్టడం, తిట్టడం, పేగు బంధం అన్న మాటే మరిచి మారణాయుదాలతో మట్టుపెట్టడం లాంటి ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.● ఈ ఏడాది మార్చి 25న రాయదుర్గం మండలం టి.వీరాపురంలో వాల్మీకి సుంకప్ప (62) దారుణ హత్యకు గురయ్యాడు. కుమారుడు వన్నూరుస్వామినే మచ్చుకత్తితో గొంతు కింద నరికి చంపేశాడు. తండ్రి పేరుపై ఉన్న రెండు ఎకరాల స్థిరాస్తిని తన పేరుపై బదలాయించాలని కొంత కాలంగా కుమారుడు పట్టుపట్టడంతో తన మరణానంతరం ఆస్తి నీ సొంతమవుతుందని తండ్రి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఈ మాటతో క్షణికావేశానికి లోనై తండ్రి ప్రాణాలను బలిగొన్నాడు.● మండలంలోని చదం గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 12న దాయాదుల మధ్య భూ వివాదం చోటు చేసుకుని ఘర్షణ పడ్డారు. ఇందులో గంగాధర అనే రైతు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. కొన్నాళ్ల తర్వాత మృతి చెందాడు. ఆయన మృతికి పొలం గట్టు మధ్య పడిన ఘర్షణనే కారణమని పోలీసులు నిర్ధారించారు.● రాయదుర్గానికి చెందిన ఓ రైతు ఇటీవల కర్ణాటక సమీపంలోని పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. కుమారుడికి కాకుండా కోడలికి వత్తాసు పలుకుతుంటాడనే అక్కసుతో కన్న కుమారుడే ఓ రోజు మచ్చుకత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. దర్యాప్తులో అది హత్యగా పోలీసులు నిర్ధారించారు. -
నగరానికి ‘షాడో’ పీడ
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో నగరంలో అభివృద్ధి అటకెక్కింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి షాడోకి పర్సెంటేజీలు సమర్పిస్తేనే పనులు ప్రారంభించే దుస్థితి నెల కొంది. దీంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలే దంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ‘తమ్ముళ్లు’.. నేడు రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వారే అడ్డుపడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనూ పదుల సంఖ్యలో అభివృద్ధి పనుల టెండర్లను ‘షాడో’ రద్దు చేయించా రని నగరపాలక సంస్థ వర్గాలంటున్నాయి. ప్రజలకు అవస్థలు.. అనంతపురంలోని జీసస్నగర్లో వర్షం వస్తే రెండు, మూడ్రోజుల పాటు కాలనీ వాసులు ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తోంది. కాలనీలో రూ.38 లక్షలతో సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించినా ఇంత వరకు పనులు మొదలు కాలేదు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి హౌసింగ్ బోర్డుకు వెళ్లే మార్గంలో రూ.66 లక్షలతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచినా పనులు మాత్రం ప్రారంభించలేదు. 38వ డివిజన్ వడ్డే కాలనీలో రూ.28 లక్షలతో రోడ్లు వేయాలని టెండర్లను పిలిచినా పనులను కాంట్రాక్టర్ చేపట్టడం లేదు. అలాగే హమాలీ కాలనీ, వేణుగోపాల్నగర్, గుల్జార్పేట, అశోక్నగర్, అంబేడ్కర్నగర్, 2,3 రోడ్లు, గౌరవగార్డెన్ ప్రాంతాల్లో సైతం అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీనంతటికీ ‘షాడో’నే కారణమని తెలిసింది. 121 పనులు.. రూ.16.19 కోట్లు కూటమి ప్రభుత్వంలో నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం రూ.16.19 కోట్లతో 121 పనులకు టెండర్లు ఆహ్వానించారు. అందులో టెండర్ స్టేజ్లో రూ.8.7 కోట్లకు సంబంధించి 50 అభివృద్ధి పనులు ఉన్నాయి. అగ్రిమెంట్ స్టేజ్లో రూ.5 కోట్లకు సంబంధించి 52 పనులున్నాయి. ప్రజాప్రతినిధి షాడోను కాంట్రాక్టర్లు ప్రసన్నం చేసుకుంటేనే పనులకు గ్రీన్ సిగ్నల్ లభించే దుస్థితి నెలకొంది. టెండర్ వేయా లన్నా.. దక్కించుకుని పనులు ప్రారంభించాలన్నా ‘షాడో’ను కలవాల్సి వస్తోందని సమాచారం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడా లేకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ఆగిన అభివృద్ధి ప్రజాప్రతినిధి షాడోకు పర్సెంటేజీలు సమర్పిస్తేనే కాంట్రాక్టులు చేపట్టిన పనులను సైతం ముడుపులు ముట్టలేదని నిలిపేస్తున్న వైనం -
ప్రాజెక్టులకు భూ సేకరణపై నిర్లక్ష్యమొద్దు
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ‘‘భూసేకరణ, బదలాయింపు ప్రక్రియ పూర్తవ్వకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి. భూ సేకరణలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుని ముందుకెళ్లాలి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలి. ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదు’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులకు భూసేకరణ, భూ బదలాయింపు అంశాలపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్కో, రైల్వే, ఏపీఐఐసీ, ఏపీజెన్కో తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ వివరాలపై ఆరా తీశారు. ఏ ప్రాజెక్టుకు సేకరించాల్సిన భూమి ఎంత, ఇప్పటి వరకు ఎంత భూమి సేకరించి అప్పగించారు, భూసేకరణకు ఏఏ చోట్ల, ఏ తరహా అడ్డంకులు ఉన్నాయి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో భూ సేకరణ చాలా కీలకమన్నారు. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే ఆ ప్రభావం అభివృద్ధిపై చూపిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భూసేకరణ ప్రక్రియలో ఎదురైన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. తాడిపత్రి పరిధిలోని తలారి చెరువు, ఆలూరు పరిధిలో సోలార్ పార్క్కు సంబంధించి డీకేటీ నివేదికను రెవెన్యూ, జెన్కో అధికారులు సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు పాల్గొన్నారు. -
ఉద్యోగానికి పిలిచి.. లేదన్నారు!
చివరి నిమిషంలో పేరు మార్చారు ● అర్హత సాధించి..సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థికి నో చాన్స్ హిందూపురం టౌన్: డీఎస్సీలో అర్హత సాధించినా.. నియామక పత్రం అందే వరకూ ఉద్యోగంపై ఆశ పెట్టుకోవద్దని మరోసారి రుజువైంది. ఇంతకీ ఏం జరిగిందంటే...బుక్కపట్నం మండలానికి చెందిన వరలక్ష్మి ప్రస్తుతం హిందూపురంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో ఆమె ఆంగ్ల సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్లో 101వ ర్యాంకు సాధించారు. ఎంపిక జాబితాలో 85 నంబర్లో ఉన్నారు. ఆమెను ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపిక చేసినట్లు విద్యాశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమె సర్టిఫికెట్లు కూడా పరిశీలించారు. అమరావతిలో నియామక ఉత్తర్వులు తీసుకునేందుకు ఈనెల 18వ తేదీన బయలుదేరారు. అయితే కార్యక్రమం వాయిదా పడటంతో తిరిగి ఇంటికి వచ్చారు. నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అమరావతిలో గురువారం అధికారులు కార్యక్రమం ఏర్పాటు చేయగా...బుధవారం జిల్లాకు చెందిన అభ్యర్థులంతా బయలుదేరి వెళ్లారు. అయితే ఈసారి వరలక్ష్మికి మంగళవారం రాత్రి అనంతపురం డీఈఓ వరప్రసాద్ ఫోన్ చేసి.. జాబితాలో పేరు లేదని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు. అర్హత సాధించినప్పటికీ తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదంటూ బోరున విలపించారు. అయినప్పటికీ ఆ అంశం తమ పరిధిలో లేదని అధికారులు చేతులెత్తేశారు. నేను 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్కి సెలెక్ట్ అయ్యాను. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యింది. నియామక పత్రం అందుకునేందుకు సిద్ధం కాగా... మంగళవారం రాత్రి 8:30 సమయంలో డీఈఓ ఫోన్ చేసి సెలెక్షన్ లిస్ట్లో మీ పేరు లేదని చెప్పారు. ర్యాంకులో మీకంటే ముందున్న ఆంజనేయులు అనే అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. నేను టీజీటీలో 250 ర్యాంకు సాధించాను. ఆ ర్యాంకు ప్రకారం జోన్ –4లో తీసుకున్నప్పటికీ టాప్ లిస్టులో రెండో స్థానంలో 250 ర్యాంకుతో టీజీటీ పోస్ట్కు అర్హత ఉంది. అందులో ఉద్యోగం ఇవ్వాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. నాకంటే తక్కువ ర్యాంకు సాధించిన వారికీ ఉద్యోగం ఇచ్చారు. కానీ టీజీటీలో నాకు 250 ర్యాంకు వచ్చినా అనర్హురాలిగా ప్రకటించారు. కనీసం టీజీటీలోనైనా ఉద్యోగం ఇవ్వాలి. – వరలక్ష్మి -
ప్రభుత్వ వైఫల్యంతోనే..
అనంతపురం: అధికారం కోసం అలవిగాని హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టాక తుంగలో తుక్కారు. అసలు నేడు దాని గురించి పట్టించుకోవడమే మానేశారు. కూటమి ప్రభుత్వం అలసత్వం కారణంగా ఎస్కేయూ ఖ్యాతి పడిపోయింది. ఒకప్పుడు వెలుగు వెలిగిన విశ్వ విద్యాలయం నేడు మూసివేత దిశగా పయనిస్తోందంటే అతిశయోక్తి కాదేమో! గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్కేయూలో పీజీ విభాగాలు వెలవెలబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీట్లు భర్తీ కాక కళ తప్పాయి. ఈ విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని అభ్యర్థులకు సూచించారు. ఇప్పటి వరకూ పీజీ అడ్మిషన్లకు సంబంధించి కేవలం 328 సీట్లు భర్తీ అయ్యాయి. క్యాంపస్ కళాశాలలో మొత్తం 2 వేల సీట్లు ఉండగా, 328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లిష్ 09, అడల్ట్ ఎడ్యుకేషన్ 01,తెలుగు09,హిందీ 03,సోషియాలజీ 00,సోషల్ వర్క్ 01, లైబ్రరీ సైన్సెస్ 07, రూరల్ డెవలప్మెంట్ 01,హిస్టరీ 08, పొలిటికల్ సైన్సెస్ 15, పబ్లిక్అడ్మినిస్ట్రేషన్ 02,అప్లైడ్ ఎకనామిక్స్ 00, ఎకనామిక్స్02, కామర్స్ 17, బయోకెమిస్ట్రీ 11, బయోటెక్నాలజీ 12, మైక్రోబయాలజీ 11, బోటనీ 11, సెరికల్చర్ 09,జువాలజీ 12,అప్లైడ్ మేథమేటిక్స్ 04, మేథమేటిక్స్ 05,స్టాటిస్టిక్స్ 04, ఫిజిక్స్ 06, కెమిస్ట్రీ 34, పాలిమర్ సైన్సెస్ 01, జియాగ్రఫీ 06, ఇన్స్ట్రుమెంటేషన్ 06, సెల్ఫ్ ఫైనాన్స్ 61, పేమెంట్ సీట్లు 60 చొప్పున భర్తీ అయ్యాయి. నామమాత్రపు అడ్మిషన్లతో ఎస్కేయూ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులు లేకటీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్య సైతం తగ్గిపోనుంది. టీచింగ్ అసిస్టెంట్లు, అకడమిక్ కన్సల్టెంట్లు ఇంటి దారే పట్టే దుస్థితి తలెత్తుతోంది. ఆశపెట్టి.. గత సార్వత్రిక ఎన్నికల ముందు పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. తన యువగళం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం విద్యార్థులకు ఆశపెట్టారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా ఈ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవడానికి విద్యార్థులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. మరో వైపు వర్సిటీలో పీజీ అడ్మిషన్లు పెంచేందుకు యాజమాన్యం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. కోర్సులు పూర్తయిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులను పట్టించుకోవడం లేదు ఎస్కేయూ క్యాంపస్లో భారీగా పడిపోయిన అడ్మిషన్లు మొత్తం 2,000 సీట్లకు 328 సీట్లే భర్తీ నాలుగు విభాగాల్లో కేవలం ఒక్కో అడ్మిషనే సోషియాలజీ, అప్లైడ్ ఎకనామిక్స్ విభాగాల్లో అడ్మిషన్లే లేవు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో దుస్థితి వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమూ మరో కారణం కూటమి ప్రభుత్వం వస్తే వంద రోజుల్లోనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా ఆ విష యంపై అసలు దృష్టి సారించనేలేదు. ఎస్కేయూనే కాదు రాష్ట్రంలో ఉన్న వర్సిటీలన్నింటి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. అయినా, పట్టించుకునే నాథుడే లేరు. –ఈ. కుళ్లాయిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడాదిన్నరగా ఎస్కేయూకు రెగ్యులర్ వైస్ చాన్స్లర్ నియామకం కాలేదు. ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ తోనే పాలన కొనసాగిస్తున్నారు. ఒక వర్సిటీకి ఏడాదిన్నరగా వైస్ చాన్స్లర్ను నియమించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీ, రిజిస్ట్రార్లు విద్యార్థుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. – పి. హేమంత్కుమార్, వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎస్కేయూ -
ఈ– పాస్ యంత్రాల పంపిణీ
అనంతపురం అర్బన్: రేషన్ డీలర్లకు అధునాతన ఈ–పాస్ యంత్రాలు అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలోని కృష్ణ కళామందిర్లోని రెవెన్యూ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరై... ఆత్మకూరు, గార్లదిన్నె, కూడేరు మండలాలకు చెందిన డీలర్లకు ఈ–పాస్ యంత్రాలను పంపిణీ చేసి, మాట్లాడారు. ఆండ్రాయిడ్ మైక్రో కంట్రోలర్ ఆధారిత, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు, టచ్ స్క్రీన్ ఇంటర్ ఫేస్ డేటా ప్రాసెసింగ్ ఆధారంగా పనిచేసే నూతన ఈ–పాస్ యంత్రాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, ప్రతి లావాదేవీ రియల్ టైంలో నమోదవుతాయన్నారు. జిల్లాలోని 1,645 చౌక దుకాణ డీలర్లకు ఈ నెల 27వ తేదీలోపు ఈ–పాస్ యంత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, మండలాల సీఎస్డీటీలు పాల్గొన్నారు.వీఆర్వో సరెండర్కళ్యాణదుర్గం: వీఆర్ఓ పి.ఉమేష్ బాబును కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేసిట్లు కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజినల్ అధికారి వసంతబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణదుర్గంలో విధులు నిర్వర్తిస్తున్న ఉమేష్ బాబు ఇటీవల అవినీతి అక్రమాలకు పాల్పడుతునట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగిందని ఆర్డీఓ తెలిపారు. దీంతో సరెండర్ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.రైల్వే కార్మికులకు 78 రోజుల బోనస్గుంతకల్లు: రైల్వే కార్మికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల వేతనానికి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సమాచారం అందినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. దీంతో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 14,500 మంది కార్మికులకు సుమారు రూ.24 కోట్లు మంజూరు కానున్నాయి. ఒక్కో కార్మికుని బోనస్ రూపంలో రూ.17,951 మేర ఖాతాల్లో జమ కానుంది.జిల్లాకు 862 మెట్రిక్ టన్నుల యూరియాఅనంతపురం అగ్రికల్చర్: కోరమాండల్ కంపెనీ నుంచి బుధవారం 862.23 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా అయినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 336 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్కు, 526.23 మెట్రిక్ టన్నులను ప్రైవేట్ డీలర్లకు, మన గ్రోమోర్ సెంటర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఇండెంట్ మేరకు మార్క్ఫెడ్ నుంచి ఆర్ఎస్కేలు, సొసైటీలకు, అలాగే ప్రైవేట్ డీలర్ల నుంచి రిటైల్ దుకాణాలు, కోరమాండల్కు చెందిన మనగ్రోమోర్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ యువనేత దారుణ హత్య!
సాక్షి, పామిడి: వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న స్థానిక యువనేత బుధవారం రాత్రి అనంతపురం జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు! అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది. వైఎస్సార్సీపీకి చెందిన యువ నాయకుడు, జీ కొట్టాల గ్రామవాసి దేవన సతీష్రెడ్డి (34) పామిడిలో పని ముగించుకుని రాత్రి తన ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన్ను గొంతు కోసి హతమార్చినట్లు భావిస్తున్నారు. బీటెక్ చదివి వ్యవసాయం చేస్తూ.. జీ కొట్టాలకు చెందిన రైతు దేవన కాశీ విశ్వనాథ్రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా మృతుడు సతీష్రెడ్డి చిన్న కుమారుడు. బీటెక్ చదివిన ఆయన ఇంటివద్ద వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. తన అన్న సుదర్శన్రెడ్డితో కలసి దాదాపు 30 ఎకరాల్లో చీనీతోట, వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నారు. స్థానికంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది. మృతుడి మరో సోదరుడు వెంకట నరసింహారెడ్డి హైదరాబాద్లో ఉంటున్నారు. వెనుక కూర్చుని గొంతు కోశారా? దేవన సతీష్రెడ్డిది ముమ్మాటికి హత్యేనని పామిడి మండల వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎవరితోనూ విబేధాలు లేని వ్యక్తిని గొంతు కోసి దారుణంగా చంపడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎవరో ఆయన ద్విచక్రవాహనం వెనుక కూర్చుని గొంతుకోసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమ వైపుగా వెళ్లాల్సిన వ్యక్తి కుడివైపున రోడ్డుపై హత్యగావించబడి ఉండడం... మృతుడి చెప్పుల్లో ఒకటి నడిరోడ్డుపై, మరొకటి కుడివైపు దూరంగా ద్విచక్రవాహనం దగ్గర ఉండడాన్ని బట్టి ఇది హత్యేనని పేర్కొంటున్నారు. పామిడి ఇన్ఛార్జ్ సీఐ రాజు, డాగ్ స్క్వాడ్ టీమ్తో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.ఇటీవలే వైఎస్ జగన్ను కలిసి సంతోషంగా.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఇటీవలే సతీష్రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్గా నియమించింది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉంటూ యువతను చైతన్యం చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవలే కలిసి ఎంతో సంతోషంగా కనిపించిన సతీష్రెడ్డి దారుణ హత్యకు గురి కావడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. -
మరో సోషల్ మీడియా యాక్టివిస్టు అక్రమ నిర్బంధం
సాక్షి, తాడేపల్లి: హైకోర్టు హెచ్చరించినా పోలీసులు తీరు మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సవీంద్ర కేసులో పోలీసుల వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలతో సవీంద్ర విడుదలయ్యారు. అయితే, అదే సమయంలో మరో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్రెడ్డిని నిర్బంధించారు.తారక్ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయిభార్గవ్పై అనంతపురం జిల్లా పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఇంటి నుండి బలవంతంగా రాప్తాడు పీఎస్కు తరలించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లోనే ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. -
45 లీటర్ల తల్లి పాలు దానం చేసిన లిఖిత
అనంతపురం మెడికల్: బిడ్డ ఆకలి తీర్చే ప్రతి మహిళా అమ్మే. కళ్లు కూడా తెరవని పసి కూనలు ఆకలితో అమ్మ స్తనమందుకున్నా పాలు రాకపోతే.. ఆ బిడ్డల పరిస్థితి ఊహించలేం. ఆ తల్లిపడే వేదన వర్ణించలేం. ఇలా ఎందరో మహిళలు ప్రసవం అయ్యాక సకాలంలో పాలుపడక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ‘దర్శి లిఖిత’ అమ్మలా మారారు. పాలుపడక ఎటూపాలుపోని స్థితిలో ఉన్న తల్లులకు అండగా నిలిచారు. వేలాది మంది బిడ్డలకు పాలిచ్చి ప్రాణాలు పోశారు.ఇప్పటివరకు 45 లీటర్ల పాలదానంఅనంతపురానికి చెందిన దర్శి లిఖిత బెంగళూరులోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఓ బిడ్డకు జన్మనిచ్చారు. సకాలంలో పాలు పడక బిడ్డకు డబ్బాపాలు పట్టారు. ఆ సమయంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అనంతరం ఆ సమస్యను అధిగమించారు. పొత్తిళ్లలోని బిడ్డకు పాలివ్వలేని స్థితిలో తనలా ఎందరో తల్లులు బాధపడుతున్నారని తెలిసి చలించిపోయారు. ఈ క్రమంలోనే తనవంతుగా తల్లిపాలను దానం చేయాలని భావించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో ‘మదర్ మిల్క్ బ్యాంకు’కు ఇప్పటికే 31 లీటర్ల పాలను ఇచ్చారు. తాజాగా మంగళవారం మరో 14 లీటర్ల పాలను సర్వజనాస్పత్రిలోని మదర్ మిల్క్ బ్యాంకుకు అప్పగించారు. ఇప్పటి వరకు ఆమె 45 లీటర్ల తల్లిపాలను మిల్క్ బ్యాంకుకు అందించడం విశేషం. దీంతో మంగళవారం ఆస్పత్రిలో దర్శి లిఖితను డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అక్కడ పాల కోసం వేచి ఉన్న తల్లులు దర్శి లిఖితకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డిప్యూటీ ఆర్ఎంఓ హేమలత మాట్లాడుతూ... దర్శి లిఖిత ఔదార్యం ఎంతో మందికి ఆదర్శమన్నారు. తనకు తెలిసి రాష్ట్రంలోనే ఎక్కడా ఇలా ఈ స్థాయిలో తల్లిపాలను ఇచ్చి ఉండరని తెలిపారు. పాలు పట్టక ఇబ్బంది పడుతున్న తల్లుల కంటతడి తుడిచేందుకు మదర్మిల్క్ బ్యాంక్ ద్వారా పాలను అందించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యూట్రీషియనిస్టు పల్లవి, కౌన్సిలర్ రాధ, స్టాఫ్నర్సు రమ పాల్గొన్నారు. -
ఈ–క్రాప్ తప్పకుండా చేయించుకోండి
గుత్తి రూరల్: పంటలు సాగు చేసిన ప్రతి రైతూ తప్పకుండా ఈ–క్రాప్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. జక్కలచెరువు గ్రామంలో మంగళవారం గుత్తి డివిజన్ ఏడీఏ వెంకట్రాముడుతో కలిసి ఆమె పత్తి పొలాలను పరిశీలించారు. రైతు నాగరాజు పొలంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ గుత్తి మండలానికి 30 టన్నుల జిప్సమ్ వచ్చిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే రైతులు ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. పత్తి పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణకు ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. అనంతరం గ్రామ శివారులోని వేరుశనగ, కంది, ఆముదం, సజ్జ ఇతర పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి ముస్తాక్ అహ్మద్, టెక్నికల్ ఏఓ శశికళ, రైతులు పాల్గొన్నారు. జాబ్ మేళాలో 54మందికి ఉద్యోగాలు యాడికి: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మంగళవారం నైపుణ్యాభివృద్ది సంస్థ, శిక్షణ సంస్థ ఉమ్మడిగా నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని ప్రిన్సిపాల్ హరినాథరెడ్డి తెలిపారు. 266 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 149 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. అందులో 54 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. తండ్రి వైద్య ఖర్చులకు తనయుడు చోరీల బాట శివాజీనగర: తండ్రి వైద్యఖర్చుల కోసం తనయుడు చోరీలబాట పట్టి చివరకు కటకటాల పాలయ్యాడు. ఏపీలోని అనంతపురానికి చెందిన ఫీరోజ్ (24) అనే వ్యక్తిని బెంగళూరులోని వైట్ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 20 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం నిందితుడు ఫీరోజ్ తన భార్య, కుమారుడితో కలిసి హొసకోట అనుగొండనహళ్లి పరిధిలో నివాసముంటున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని తండ్రి మహమ్మద్ పాషా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చికిత్సకు డబ్బు లేక ఫిరోజ్ ఓసారి బైక్ను చోసి విక్రయించాడు. అనంతరం డ్రైవర్ వృత్తికి స్వస్తి పలికి బైక్ చోరీలపై దృష్టి పెట్టాడు. బెంగళూరులోని కాడుగోడి, వైట్ఫీల్డ్ మెట్రో స్టేషన్ల వద్ద, పార్కింగ్ స్థలాల్లో నిలిపిన బైక్లను చోరీ చేసి ఏపీలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. బైక్ చోరీ కేసులు అధికం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 12 బైక్లను సొంతదారులకు అప్పగించారు. మిగతా వాహనాలకు సంబంధించి చిరునామాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. -
చీనీ, టమాట మార్కెట్ల పరిశీలన
అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకునేందుకు ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, అగ్రివాచ్ సంస్థ ప్రతినిధి హిమయుద్దీన్ తదితరులు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ మార్కెట్, కక్కలపల్లి టమాటా మండీలను పరిశీలించారు. జిల్లాలో సాగులో ఉన్న పంటల విస్తీర్ణం, దిగుబడులు, మార్కెట్ ధరలు, రైతుల కష్టనష్టాలు, ట్రేడర్ల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని ట్రేడర్లకు సూచించారు. ప్రస్తుతం చీనీ, టమాట ధరలు కాస్త నిలకడగానే కొనసాగుతున్నట్లు తెలిపారు. ధరల్లేక రోడ్డున పడేసే పరిస్థితి తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అలాంటి పరిస్థితి ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని ట్రేడర్లు, మండీ నిర్వాహకులకు సూచించారు. పరిశీలనలో ఉద్యానశాఖ ఏడీ దేవానంద్కుమార్, ఏపీఎంఐపీ ఏపీడీ ధనుంజయ, హెచ్వో రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘గూగూడు’ హుండీ కానుకల లెక్కింపు
శింగనమల(నార్పల): ప్రసిద్ధ గూగూడు కుళ్లాయిస్వామి – ఆంజనేయస్వామి జంట దేవాలయాల్లో మంగళవారం హుండీల్లోని నగదు, నెలకంధం వల్ల వచ్చిన వెండిని భక్తుల ఆధ్వర్యంలో లెక్కించినట్లు ఎగ్జిక్యూటివ్ అధికారి శోభ తెలిపారు. హుండీలలోని కానుకలను లెక్కించగా రూ.9,46,875 వచ్చిందన్నారు. నెలకంధం లెక్కించగా వెండి 79.350 కిలోలు వచ్చిందన్నారు. ఆదేవిధంగా నార్పలలోని సుల్తాన్ పేటలోని గొంచి మాన్యం 0.07 సెంట్ల భూమి వేలం వేయగా సంవత్సరానికి రూ.12 వేల చొప్పున నార్పలకు చెందిన నాగరాజు దక్కించుకున్నాడన్నారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. లారీ డ్రైవర్ ఆత్మహత్య గుత్తి: జీవితంపై విరక్తితో లారీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే ఈశ్వర్రావు (48) లారీ డ్రైవర్గా పనిచేస్తూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. వచ్చే సంపాదనతో తీరే మార్గం కనిపించలేదు. దీంతో మంగళవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.పెద్దవడుగూరు : మండల కేంద్రమైన పెద్దవడుగూరుకు చెందిన సురేష్ (32) ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్ ఫైనాన్స్లో రూ.6.80 లక్షలు అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ఇబ్బందులు పడుతూ వచ్చాడు. డబ్బు సర్దుబాటు కాకపోతుండటంతో కుటుంబ సభ్యులతో చెప్పుకుని బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లోని బాత్రూమ్లో పురుగుమందు తాగి.. కేకలు వేశాడు. కుటుంబ సభ్యులు వచ్చి అతడిని పామిడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
మా చేతుల్లో ఏమీ లేదు
రాష్ట్ర ప్రభుత్వం మీ భూమి పోర్టల్ను అప్డేట్ చేసింది. మీ భూమి పోర్టల్లో రైతు తన భూమి వివరాలను తెలుసుకోవాలంటే ముందుగా మొబైల్ నంబర్తో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే రైతుకు కావాల్సిన భూమి వివరాలు తెలుస్తాయి. ప్రభుత్వమే మీ భూమి పోర్టల్ను అప్డేట్ చేయడంతో రోజుకు మూడుసార్లు మాత్రమే ఓటీపీని ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పోర్టల్ మార్పు చేయడం మా చేతుల్లో ఏమీ లేదు. నెట్ వర్క్ సమస్య ఉంటే తప్ప మీ భూమి పోర్టల్ మొరాయించడం జరగదు. – మునివేలు, తహసీల్దార్, బొమ్మనహాళ్ -
లాగిన్ ఆప్షన్.. కష్టాలు ఓపెన్
బొమ్మనహాళ్: కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ సాఫీగా సాగిన మీ భూమి, భూ నక్షత్ర పోర్టల్లో మార్పులు తీసుకొచ్చింది. గత రెండు నెలలుగా మీ భూమి పోర్టల్కు ఓటీపీ లాగిన్ను ఏర్పాటు చేయడంతో క్షేత్రస్ధాయిలో సమస్యలు అధికమవుతున్నాయి. రైతులు, ప్రజలు తమ భూముల వివరాలను మీ భూమి పోర్టల్లో తెలుసుకోలేక అవస్ధలు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో 4,31,677 హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 2,89,601 హెక్టార్లు వ్యవసాయ భూములు ఉన్నాయి. నెట్ స్పీడ్ లేకున్నా మొరాయింపే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని మండలాల్లో నెట్ వేగం అంతంత మాత్రమే. నగరాల్లో మాత్రమే 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో నెట్వర్క్ సౌకర్యం సరిగా లేదు. ఈ క్రమంలో గ్రామాల్లో మీ భూమి వెబ్సైట్లో వివరాలు పొందేందుకు రైతులు ఓటీపీ నమోదు చేశాకే వెబ్ల్యాండ్ ఓపెన్ అవుతోంది. నెట్ స్పీడ్ లేకపోయినా మీ భూమి పోర్టల్ ఓపెన్ అవ్వని పరిస్ధితి. గ్రామాల్లో మీ భూమి పోర్టల్లో భూ వివరాలు పొందేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్ధితి ఏర్పడింది. గతంలోని సమగ్ర భూముల వివరాలన్నీ మాయమయ్యాయి. ప్రస్తుతం చాలా వరకు భూముల వివరాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో పోర్టల్ మొరాయిస్తోంది. నెట్ సెంటర్ల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నా అవసరమైన భూ పత్రాలను పొందలేకపోతున్నారు. భూ వివరాలను గతంలో ఇంటి వద్దే తెలుసుకునే వెసులుబాటు ఉండేది. ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ క్షణాల్లో తమకు అవసరమైన భూ వివరాలను తెలుసుకునే వారు. పబ్లిక్ డొమైన్లో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ సులువుగా ఉండేది. రైతులు తమకు అవసరం వచ్చినప్పుడల్లా 1బీ, అండగల్, ఎఫ్ఎంబీలను తీసుకునేవారు. మొరాయిస్తున్న మీ భూమి పోర్టల్.. ఓపెన్ కాని భూ నక్షత్ర వెబ్ల్యాండ్లో సకాలంలో తెరుచుకోని భూముల వివరాలు ఇదే అదునుగా దోచేసుకుంటున్న మీ సేవ, నెట్ సెంటర్ల నిర్వాహకులు -
రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం నేరం
గుంతకల్లు: ఒక వ్యక్తి రెండు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ (ఐటీఓ) కిరణ్కుమార్ పేర్కొన్నారు. అలా ఎవరైనా రెండు పాన్లు కలిగి ఉంటే రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని మీటింగ్ హాలులో గుంతకల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వరంలో ఆధార్కార్డుతో పాన్ కార్డు అనుసంధానం వల్ల కలిగే లాభాలు, నష్టాలు, ప్రసుత్త ఐటీ రిటర్న్స్లో కొత్త నిబంధనలు, మార్పులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షుడు గోపా జగదీష్ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా ఐటీఓతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శివకూమర్ హాజరై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కందూరి కృపాకర్, నాయకులు పసుపుల హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రమేష్నారాయణకు ‘కీర్తి’ పురస్కారం అనంతపురం కల్చరల్: తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా అందించే ‘కీర్తి పుస్కారం’ అనంతపురానికి చెందిన ప్రసిద్ధ సాహితీ–విద్యావేత్త డాక్టర్ పతికి రమేష్నారాయణ అందుకున్నారు. మంగళవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ప్రదానోత్సవ సభలో యూనివర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాదరెడ్డి, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత సాహితీక్షేత్రంలో బహుగ్రంథకర్తగానే కాకుండా అనువాదరంగంలో విశేష ప్రతిభాపాటవాలతో జనచైతన్యం చేస్తున్నందుకు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారన్నారు. ప్రిన్సిపాల్గా, రచయితగా, సామాజికవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనకు లోతైన జ్ఞానం ఉందని కొనియాడారు. పురస్కారమందుకున్న డాక్టర్ రమేష్నారాయణను డాక్టర్ ఉమర్ఆలీషా ప్రతినిధులు రియాజుద్దీన్, షరీఫ్, సాహిత్యభారతి జిల్లా అధ్యక్షుడు గుత్తా హరి, కార్యదర్శి తోట నాగరాజు, సుంకర రమేష్ అభినందించారు. జిల్లాకు ప్రత్యేక గౌరవం తెచ్చారన్నారు. -
‘పేటీఎం’పై కేసు గెలిచిన లా విద్యార్థి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం చదువుతున్న తన్వీర్ బాషా పేటీఎంపై కేసు గెలిచాడు. తన్వీర్ బాషా ఖాతా నుంచి రూ.2,500 ఎలాంటి సమాచారం లేకుండా కట్ చేశారు. దీంతో పేటీఎంపై తన్వీర్ బాషా వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశాడు. తన కేసును తనే సొంతంగా వాదించుకున్నాడు. పేటీఎం తప్పిదాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. మంగళవారం వాదనలు విన్న కోర్టు వెంటనే పేటీఎం ఆ మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా తన్వీర్ బాషాను ఎస్కేయూ లా విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు అభినందించారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం నాయకులు డిమండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ప్రధాన డిమాండ్తో ప్రచురించిన కరపత్రాలను జిల్లా కోర్టులో ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. గురుప్రసాద్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ ఆలూరి రామిరెడ్డి, అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) గౌరవాధ్యక్షుడు సీతారామారావు హాజరయ్యారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని, జూనియర్ న్యాయవాదుల కోసం న్యాయ మిత్ర పథకం కింద ప్రతి నెలా శిక్షణ భృతిని పెంపుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, ప్రకాష్, కమిటీ సభ్యులు కరిమలగిరి, అశోక్, చంద్రశేఖర్, మల్లేస్ పాల్గొన్నారు. -
సూపర్.. సేవలు పూర్
అనంతపురం సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో రోగికి స్కాన్ తీస్తున్న ఈమె పీజీ విద్యార్థిని. ఇక్కడ విధులు నిర్వర్తించాల్సిన రేడియాలజిస్టు ఎక్కడికి వెళారో తెలియని పరిస్థితి. అదేవిధంగా ఆస్పత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితర విభాగాల్లో కొందరు వైద్యులు, సిబ్బంది తూతూమంత్రంగా విధులను నిర్వహిస్తున్నారు. దీంతో రోగులు వైద్యం పొందడానికి గంటల తరబడి సమయం పడుతోంది. అనంతపురం మెడికల్: పేరుకే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. సౌకర్యాలు, సేవలు మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. ఇక వైద్యులు, స్టాఫ్నర్సులు, సిబ్బంది ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర శివారు ప్రాంతంలో ఈ ఆస్పత్రి ఉండడంతో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు వైద్యులు విధులకు డుమ్మా కొట్టి పత్తా లేకుండా పోతుండడంతో గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సూపర్స్పెషాలిటీలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వార్డుల్లో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడంతో పాటు రోగులు ఇంటి నుంచే ఫ్యాన్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఎలా పడితే అలా నిర్మాణాలు.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో క్యాంటీన్కు కేటాయించిన ప్రాంతంలో క్యాజువాలిటీ పేరిట నిర్మాణాలు చేపడుతున్నారు. రూ.10.7 లక్షలతో పది పడకలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాగా ఉన్న ఆస్పత్రిని కళావిహీనంగా మార్చేసేలా తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. వాస్తవంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రూ.2 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. అయినా, అనవసరంగా రూ.10 లక్షలు వెచ్చించడంతో పాటు భవనాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా క్యాజువాలిటీలో కేవలం రెండు పడకలు వేసి, అందులో గుజిరీని అలాగే వదిలేశారు. క్యాజువాలిటీలో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్, వెంటిలేటర్ తదితర సదుపాయాలు ఉండాలి. దీనికితోడు విధుల్లో ఉండాల్సిన సీఎంఓ అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్నర్సు వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. దెబ్బతిన్న ఫ్లోరింగ్.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగానికి సంబంధించి వార్డులో ఫ్లోరింగ్ దెబ్బతింది. వాస్తవంగా గుండె శస్త్రచికిత్సలు, సమస్యలున్న వారు పొరపాటున కిందకు పడితే వారి ప్రాణానికే ప్రమాదం. అటువంటిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కనీసం ఫ్లోరింగ్ కూడా వేయించలేని స్థితిలో అధికారులున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కార్డియాలజీతో పాటు ఇతర విభాగాల్లోనూ మౌలిక సదుపాయాలు మృగ్యంగా మారాయి. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మ ● వెబ్ల్యాండ్ కరెక్షన్ అర్జీపై క్షేత్రస్థాయి పరిశీలనఅనంతపురం రూరల్:భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మ హెచ్చరించారు. అనంతపురం రూరల్ మండలం ఏ. నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 150–5లో వెబ్ల్యాండ్ కరెక్షన్పై వచ్చిన అర్జీపై మంగళవారం జేసీ శివ్నారాయణ్ శర్మ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చే అర్జీలపై అధికారులు ఎప్పటికప్పుడు విచారణ చేపట్టి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అర్జీదారులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, మండల సర్వేయర్ రఘునాథ్, వీఆర్ఓ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత వాతావరణశాఖ, విశాఖ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 24వ తేదీన 6.8 మి.మీ, 25న 3 మి.మీ, 26న 2.8 మి.మీ, 27న 15 మి.మీ, 28న 3.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 32.8– 30 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4– 22 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలి వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ‘అలాంటి దరఖాస్తులు స్వీకరించం’ తాడిపత్రి రూరల్: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం అనేది లేదని, అందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించబోమని తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో సిబ్బంది నోటీసు అతికించారు. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి వందలాది మంది వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి తరలిరావడంతో తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బిత్తరపోయారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. తహసీల్దార్ సోమశేఖర్ మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోరాదని సూచించారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బందిని సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. బధిరుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం ● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: బధిరుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రపంచ బధిరుల, సైన్ లాంగ్వేజ్ దినోత్సవానికి కలెక్టర్తో పాటు విభిన్న ప్రతిభావంతుల సంస్థ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ కేక్ కట్ చేసి బధిరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 45 మంది బధిరులకు ఉద్యోగం కల్పించామని, 6,707 మందికి పింఛను అందిస్తున్నామన్నారు. శ్రవణ యంత్రాలను అర్హులైన 948 మందికి త్వరలో పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, సర్వశిక్ష అభియాన్ పీడీ శైలజ, ఆర్డీటీ ప్రతినిధి రఫీ, బధిరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు లక్ష్మి నరసింహ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీ బాధితులకు చికిత్సలందించాలి హెచ్ఐవీ బాధితులకు తప్పనిసరిగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏఆర్టీ కేంద్రాల్లో నమోదయ్యేలా చూడడంతో పాటు చికిత్స అందించాలన్నారు. చికిత్స తీసుకోవడం ద్వారా హెచ్ఐవీని నియంత్రించవచ్చని, తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటారనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాజిటివ్ నెట్వర్క్ ప్రతినిధులు కలిసి నచ్చజెప్పాలన్నారు. డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీపీఓ నాగరాజునాయుడు తదితరులున్నారు. -
నిండుకుంటున్న యూరియా నిల్వలు
● బఫర్స్టాక్ ద్వారా పరిమితంగా సరఫరా అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో యూరియా నిల్వలు నిండుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కూటమి సర్కారులో పంటలకు అవసరమైన మేరకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ఎక్కడా యూరియా సమస్య ఎదురుకాలేదని రైతులు చెబుతున్నారు.ఇప్పుడెందుకు సమస్య వచ్చిందో అర్థంకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దండిగా సరఫరా చేశామని కూటమి ప్రభుత్వం, వ్యవసాయశాఖ చెబుతున్నా.. తగినంత తమకు అందడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 436 ఆర్ఎస్కేలు, మూడు డీసీఎంఎస్లు, 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీలు), రెండు రైతు గ్రూపు సంఘాలు (ఎఫ్పీఓ), మూడు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు, 460 వరకు రీటైల్ దుకాణాల ద్వారా ఇప్పటికే 35 వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా... ఒకట్రెండు బస్తాల కోసం రోజుల తరబడి రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందనేది చెప్పడం లేదు. ఈ సీజన్లో డీఏపీ, యూరియా, ఎస్ఎస్పీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు 1.07 లక్షల మెట్రిక్ టన్నులు అందించాలని ప్రణాళిక అమలు చేస్తున్నారు. అందులో యూరియా 26,789 మెట్రిక్ టన్నులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 23,400 టన్నుల వరకు సరఫరా అయినట్లు చెబుతున్నారు. ఇది కాకుండా గత ఖరీఫ్, రబీలో మిగులు (ఓపెనింగ్ బ్యాలెన్స్) 15,240 మెట్రిక్ టన్నులు చూపించి రైతులకు పంపిణీ చేశామని చెబుతున్నారు. మరి ఇంత మొత్తంలో పంపిణీ చేసినా ఎందుకు యూరియా సమస్య ఈ స్థాయిలో ఎదురవుతోందనే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. పక్కదారి పట్టడంతోనే.. మే, జూన్ నెలల్లో జిల్లాకు చేరిన యూరియాలో చాలా వరకు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద బస్తా యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్, లేదా డ్రిప్ మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా డిమాండ్ అధికంగా ఉండటంతో ఎంఆర్పీకి మించి విక్రయాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక డీసీఎంఎస్లకు సరఫరా చేయడం ఆపేశారు. ఆర్ఎస్కేలు, సొసైటీలకు పరిమితంగా సరఫరా చేస్తున్నారు. యూరియా నిల్వలు అడుగంటి పోవడంతో మార్క్ఫెడ్ దగ్గర ఉన్న 800 మెట్రిక్ టన్నుల బఫర్స్టాక్ నుంచి రోజూ కొన్ని ఆర్ఎస్కేలకు పరిమితంగా సరఫరా చేస్తున్నారు. మండలంలో ఒక ఆర్ఎస్కేను ఎంపిక చేసుకుని ఏఓలు, ఏఈఓలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లు జాగ్రత్తగా పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. -
అలా రాస్తే మీ ఇంటికి వస్తా.. మీడియాకు టీడీపీ నేత జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు అంటూ చూపొద్దంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి అలా రాస్తే.. మీ ఇళ్ల వద్దకు వస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ‘‘నా దగ్గర తమాషాలు చేయొద్దు.. నా గురించి అందరికీ తెలుసు.. మీడియా వాళ్లకు తప్పా?’’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు.తాడిపత్రిలో రోడ్డుపై పడుకుని జేసీ హల్చల్కాగా, జేసీ ప్రభాకర్రెడ్డి నిన్న (సోమవారం) కూడా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారులను బెదిరించే ధోరణిలో స్థానిక ఏఎస్పీ కార్యాలయం ఎదుట, అశోక్ పిల్లర్ సర్కిల్లో దాదాపు ఐదు గంటల పాటు మంచంపై పడుకుని నిరసన పేరిట హంగామా సృష్టించారు. పది రోజుల క్రితం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఎస్పీ రోహిత్కుమార్కు జేసీ ప్రభాకర్రెడ్డి అందజేశారు.దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదంటూ సోమవారం నేరుగా ఏఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఏఎస్పీ సుముఖంగా లేకపోవడంతో కార్యాలయం ముందు రోడ్డుపై పడుకుని హంగామా చేశారు. అయినప్పటికీ ఏఎస్పీ పట్టించుకోకపోవడంతో పట్టణంలోని అశోక్పిల్లర్ సర్కిల్కు చేరుకుని నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొన్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన కరువవడంతో అప్పటికప్పుడు రోడ్డుపై టెంట్ వేయించి.. మంచంపై పడుకున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన హైడ్రామా కొనసాగింది. చివరకు జిల్లా ఎస్పీ నుంచి ఫోన్ రావడంతో వెనక్కి తగ్గారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
● వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి స్పష్టం చేశారు. వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్ ఎదుట ఽవీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ వీఆర్ఓలకు పేస్కేల్ రూ.30 వేలు వర్తింపజేయాలన్నారు. డీఏలతో వేతనం ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. విద్యార్హతను బట్టి పదోన్నతులు కల్పించాలన్నారు. నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా మార్పు చేయాలన్నారు. వీఆర్ఏలకు పదోన్నతి కల్పించడం ద్వారా వీఆర్ఓ పోస్టులు 70 శాతం భర్తీ చేయాలన్నారు. విధినిర్వహణలో వీఆర్ఓ మరణిస్తే ఆయన కుటుంబంలో ఒకరికి వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆనంద్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరప్ప, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు విజయ్, వీఆర్ఏ సంఘం నాయకులు సుధాకర్, సుబ్రమణ్యం, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
‘బలిజలకు మేలు చేసిందేమీ లేదు’
గుత్తి: బలిజ కులస్తులను అగౌరవపరిచే విధంగా ఉన్న జీఓ నంబర్–5ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందూ జనార్దన్ డిమాండ్ చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా సోమవారం గుత్తికి విచ్చేసిన ఆయన ఆర్అండ్బీ బంగ్లాలో బలిజ సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం దొమ్మర్లను తీసుకొచ్చి బలిజ కులంలో కలిపి ‘గిరి బలిజ’ అనే నామకరణ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది బలిజలను అగౌరవ పరచడమేనన్నారు. వెంటనే జీఓ–5 ను రద్దు చేయాలన్నారు. గిరి బలిజలో ‘బలిజ’ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచిపోయినా ఇంతవరకు బలిజలకు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. కూటమి లో జనసేన భాగస్వామి అయినప్పటికీ జన సైనికులకు పదవుల కేటాయింపులో సముచిత న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బలిజ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆమరణ దీక్ష చేస్తానన్నారు. అనంతరం కాపు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కాపు ఉద్యోగుల సమస్య ఒక్కటీ పరిష్కారం చేయలేదన్నారు. పది లక్షల మంది ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు, గుత్తి బలిజ సంఘం అధ్యక్షులు పూల రమణ, మారాకుల రమణ, ఉపాధ్యక్షులు శ్రీకరం గోవింద రాజులు, సీనియర్ నాయకులు నరేష్, గోరంట్ల నాగయ్య, మంజు, మోహన్, హరి, ఈశ్వరయ్య, రాజశేఖర్, నాగరాజు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
కక్ష కట్టి.. కటకటాలపాలై
● గంజాయి కేసులో ట్విస్ట్ ● స్నేహితుడిని ఇరికించాలనుకుని ‘ఇరుక్కున్న’ యువకుడు రాయదుర్గం: వారిద్దరూ స్నేహితులు. అయితే, ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో స్నేహితుడిని ఎలాగైనా జైలుకు పంపించాలనుకుని మరో స్నేహితుడు భావించాడు. బంధువులతో కలసి పన్నాగం పన్నాడు. చివరికి తాను పన్నిన ఉచ్చులో తానే చిక్కి కటకటాలపాలయ్యాడు. ఆదివారం రాయదుర్గంలో దొరికిన గంజాయికి సంబంధించి మొత్తం వివరాలను అర్బన్ సీఐ జయనాయక్ వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. పట్టణానికి చెందిన గోళ్ల అఖిల్, ముత్తురాసి హరికృష్ణ స్నేహితులు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో అఖిల్ను ఎలాగైనా గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపాలని హరికృష్ణ భావించాడు. ఇందుకు తన మామ ముత్తురాసి అనిల్ సాయం కోరాడు. కొన్ని రోజుల క్రితం శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన ముత్తరాసి శంకర్ వద్ద రూ. 3 వేలకు 370 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. దీంతో పాటు సుమారు 10 కిలోల బరువున్న తొమ్మిది శ్రీగంధం ముక్కలను సిద్ధం చేసుకున్నారు. గంజాయి, శ్రీ గంధం ముక్కలను ఆదివారం పట్టణంలోని కణేకల్లు రోడ్డులో నివాసం ఉండే గోళ్ల అఖిల్ ఇంటి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అర్బన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ముత్తురాసి హరికృష్ణ, ముత్తురాసి అనిల్తో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నేరాన్ని వారు అంగీకరించారు. తీగ లాగితే డొంక కదిలింది నిందితుల విచారణలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తీగ ఇక్కడ లాగితే డొంక శెట్టూరు మండలం చిన్నంపల్లికి చేరింది. గ్రామానికి చెందిన ముత్తురాసి శంకర్ తన పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని, అక్కడే 370 గ్రాములు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సోమవారం నిందితులను వెంట తీసుకెళ్లి శంకర్ పొలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరో 214 గ్రాముల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 584 గ్రాముల గంజాయితో పాటు 2 సెల్ఫోన్లు, బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్, ఒక కొడవలి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ జయనాయక్ తెలిపారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. గంజాయి సాగు చేసిన ముత్తురాసి శంకర్ ఆచూకీ లభించలేదని సీఐ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు. -
జెడ్పీలో అక్రమాలు వెలుగు చూసేనా?
● మొదలైన అకౌంటెంట్ జనరల్ ఆడిట్ ప్రక్రియ ● పది రోజుల పాటు కొనసాగనున్న ఆడిట్ అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ ప్రక్రియ మొదలైంది. విజయవాడ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం అనంతపురం జెడ్పీకి సోమవారం చేరుకుంది. 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్, బీఆర్జీఎఫ్, ఎస్ఎఫ్సీ, ఇతర పద్దుల కింద ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన అన్ని రికార్డులూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బడ్జెట్ రాబడులు–ఖర్చులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ నిశితంగా చూస్తున్నారు. అయితే పాలకవర్గం అనుమతి లేకుండా కొన్ని, పాలకవర్గం తిప్పికొట్టిన మరికొన్ని పనులకు సంబంధించిన బిల్లులు గతంలో పని చేసిన సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మకై ్క డ్రా చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓఅండ్ఎంకు సంబంధించి తప్పుడు అగ్రిమెంట్లు, నకిలీ బిల్లులు పెట్టి రూ.కోట్లు కొట్టేశారని గతంలో జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ సాధారణ, స్థాయీ సంఘాల సమావేశాల్లో నిలదీశారు. అయినా అప్పటి అధికారులు కనీస విచారణ కూడా చేయలేకపోయారు. చివరకు లోకాయుక్తకు కూడా ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో వీఎల్సీ (విలేజ్ లెవల్ కమిటీ) ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులను కూడా కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బినామీ పేర్లతో పూర్తి చేసి రూ.కోట్లు స్వాహా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలోని ఓ మారుమూల మండలంలో రూ.2 కోట్లకు పైగా ఇలా నిధులను ఓ అధికారి మరో కాంట్రాక్టర్తో చేతులు కలిపి దిగమింగారని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి వచ్చిన ఆడిట్ అధికారుల పరిశీలనలో అక్రమాలు వెలుగు చూసేనా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు పది రోజుల పాటు ఏజీ ఆడిట్ ప్రక్రియ కొనసాగుతుందని జెడ్పీ వర్గాలు తెలిపాయి. నిష్పక్షపాతంగా ఆడిట్ ప్రక్రియ కొనసాగితే అక్రమాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని జెడ్పీ వర్గాలే అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
కాసం ఫ్యాషన్స్ ప్రారంభం
గుంతకల్లు: కాసం ఫ్యాషన్స్ వారి 19వ స్టోర్ గుంతకల్లులోని రైల్వేస్టేషన్ రోడ్డులో సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సినీనటి నిధి అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్యాషన్ అభిరుచి ఉన్నవారు గతంలో నగరాలకు వెళ్లి షాపింగ్ చేసేవారన్నారు. ఇప్పుడు అధునాతన కలెక్షన్స్, నిత్యం నూతన వైరెటీలు కాసం ఫ్యాషన్స్లో అందుబాటులో ఉంటాయన్నారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా తక్కువ ధరకే తమ షాపుల్లో వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం నిధి అగర్వాల్ మాల్లో కలియదిరిగారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్పై అభివాదం చేస్తూ సినీ పాటకు డాన్స్ వేసి అభిమానులను అలరించారు. కార్యక్రమంలో కాసం ఫ్యాషన్ యాజమాన్యం అరుణ్కుమార్, విశాల్, వరుణ్, కార్తీక్, సాయి పాల్గొన్నారు. భార్య మందలించిందని ఆత్మహత్య బొమ్మనహాళ్: భార్య మందలించిందని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ నబీరసూల్ తెలిపిన వివరాల మేరకు.. సింగానహళ్లికి చెందిన కురుబ మోహన్ (41) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు. కొద్దిరోజుల క్రితం ఇంటి వద్దనున్న బైక్ను ఎక్కడో కుదువపెట్టి వచ్చిన డబ్బుతో పూటుగా మద్యం తాగొచ్చాడు. ఈ విషయమై భార్య గీత మందలించడంతో మనస్తాపానికి గురైన మోహన్ ఆదివారం ఇంట్లోనే గడ్డికి కొట్టే మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మోహన్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి సంపూర్ణ మద్దతు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి వైఎస్సార్ సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంటకరామిరెడ్డి, పార్టీ ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమన్వయ కర్తలు విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణకు పూర్తి సహకారమందిస్తామన్నారు. సోమవారం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 56 ఏళ్లుగా ఆర్డీటీ పేదలకు అండగా ఉంటోందన్నారు. విద్య, వైద్యంతో పాటు మహిళా సాధికారత సాకారంలో ప్రభుత్వానికి దీటుగా పని చేస్తోందన్నారు. అలాంటి సంస్థకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంకారణంగా ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్లో జాప్యం జరుగుతుండడంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే ఆర్డీటీకి మద్దతుగా వైఎస్సార్ సీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఆర్డీటీ మూతపడితే వేలాది మంది ఉపాధి కోల్పోతారన్నారు. విద్య, వైద్యం ఇబ్బందిగా మారే పరిస్థితి లేకపోలేదన్నారు. ఉమ్మడి జిల్లాలోని బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో 600 పడకలతో ఆర్డీటీ ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తోందన్నారు. ఆర్డీటీని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యంగా భావించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగానూ పాల్గొంటామన్నారు. దసరా నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణలో మార్పులు చేసుకోవాలన్నారు. ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, పండుగ తర్వాత జాతీయ రహదారుల దిగ్భంధం లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఆర్డీటీ పరిరక్షణ కమిటీకి వారు సూచించారు. సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దు ● ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్: దసరా పండుగ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను డీఈఓ ఎం.ప్రసాద్బాబు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలకు అక్టోబరు 2 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా విద్యార్థులకు తరగతులు పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సెలవులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు. కారుణ్యం చూపారు.. అనంతపురం అర్బన్: కారుణ్య నియామకాల ప్రక్రియకు కలెక్టర్ ఓ. ఆనంద్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సోమవారం ఇద్దరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ నెల 21న సాక్షిలో ‘‘కొత్తసారుపై కొండంత ఆశ’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ నెలలోగా పూర్తి చేయాలని పరిపాలనా విభాగం అధికారులను ఆదేశించిన ఆయన.. వెనువెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఐసీడీఎస్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తూ మరణించిన వెంకటరమణ కుమారుడు రంగనాథ్కు పోలీసుశాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్ఓ గ్రేడ్–2 విధులు నిర్వర్తిస్తూ మరణించిన సుధాకర్రెడ్డి సతీమణి సుశీలమ్మకు విభిన్న ప్రతిభావంతుల శాఖలో ఓఎస్డీగా ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధ్యతగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు అందుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, తదితరులు పాల్గొన్నారు. -
‘మూల్యాంకనం’రెమ్యునరేషన్ చెల్లించండి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి మూల్యాంకన విధులకు సంబంధించిన రెమ్యునరేషన్, టీఏ, డీఏ చెల్లించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు డి.మారుతి ప్రసాద్, కోశాధికారి ప్రదీప్కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం అనంతపురం డీఈఓ ఎం.ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ పదో తరగతి వార్షిక పరీక్షలు–25లో సిట్టింగ్ స్క్వాడ్ పారితోషికం పెండింగ్ ఉందన్నారు. 2008, 2018 డీఎస్సీ ఉపాధ్యాయులకు జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉన్నందున బదిలీల్లో పాయింట్ల తేడా ఎక్కువగా ఉందన్నారు. ఒకే తేదీ జాయినింగ్ ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. బదిలీ అయి రిలీవర్ లేని కారణంగా తిరిగి పాతస్థానాల్లో పనిచేసే ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు లేకుండా చూడాలన్నారు. అసెస్మెంట్ పుస్తకాల నిర్వహణపై పున:సమీక్షించాలన్నారు. హైస్కూల్ ప్లస్లలో ఖాళీ స్థానాలలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టి వాటిని యథావిధిగా కొనసాగించాలన్నారు. మునిసిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలని, మోడల్ స్కూల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ ప్రకటించాలన్నారు. విద్యా శక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని కోరారు. -
ఈ రోడ్డులో ఎలా ప్రయాణించాలి?
బొమ్మనహాళ్: అధ్వానంగా ఉన్న రోడ్డులో ఎలా ప్రయాణించాలంటూ మండలంలోని బండూరు గ్రామానికి చెందిన యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బండూరు–ఉద్దేహాళ్ గ్రామాల మధ్య రోడ్డుపై బురద నీటిలో నిల్చుని నిరసన తెలిపారు. వర్షాకాలంలో బురద, గుంతలతో రాకపోకలు దుర్భరంగా మారాయని వాపోయారు. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. వెంటనే రహదారి పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తిప్పేస్వామి, శివరామ్, రవి, రామృష్ణ, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అటకెక్కిన విద్యాభివృద్ధి
జాబితాలో పేర్లపై లీకులు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా ‘సమగ్ర శిక్ష’ గందరగోళంగా మారింది. సెక్టోరియల్ అధికారులు లేక పాలన కుంటుపడింది. ఈ ప్రభావం విద్యాభివృద్ధిపై పడుతోంది. సమగ్రశిక్షలో పని చేస్తున్న సెక్టోరియల్ అధికారులందరినీ నిబంధనలకు విరుద్ధంగా 2024 ఆగస్టు 1న రిలీవ్ చేశారు. ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఉన్నవారిని తప్పించారు. అప్పట్లో డీఈఓగా పని చేసిన వరలక్ష్మీ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఉన్నవారిని తప్పించేందుకు చూపించిన శ్రద్ధ కొత్తవారిని తీసుకోవడంలో చూపించలేకపోయారు. ఫలితంగా ఏడాదిదాటినా ఆ పోస్టులు భర్తీ కాలేదు. చివరిస్థానానికి పడిపోయిన జిల్లా పూర్తిస్థాయిలో సెక్టోరియల్ అధికారులు ఉన్న సమయంలో డీపీసీ, ఏపీసీ సమన్వయం, ఎంఈఓలు, హెచ్ఎంలతో తరచూ పర్యవేక్షణ కారణంగా పీఎంశ్రీ, టీచ్టూల్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ఎఫ్ఎల్ఎన్ శిక్షణ తదితర అంశాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉండేది. సెక్టోరియల్ అధికారులను పంపిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి స్థానం పక్కన పెడితే చివరిస్థానంలో నిలవాల్సిన దుస్థితి ఏర్పడింది. సమగ్రశిక్షలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నా జిల్లాలోని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీస దృష్టి సారించకపోవడం బాధాకరమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంటర్వ్యూ ముగిసి నెలదాటినా... 2024 ఆగస్టు 1న సెక్టోరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సుమారు 8 నెలల తర్వాత 5 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్ ఆమోదంతో ఎస్పీడీ కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి కమిషనర్, ప్రిన్సిపల్ కార్యదర్శికి వెళ్లింది. ప్రిన్సిపల్ కార్యదర్శి ఆమోదముద్ర వేశారు. అయితే తాము సిఫార్సు చేసిన వారి పేర్లు లేకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసి అమలు చేయకుండా అడ్డుపుల్ల వేశారు. ఎట్టకేలకు ఇద్దరిని మాత్రం (జీసీడీఓ, అసిస్టెంట్ ఏఎంఓ) ఈ ఏడాది జూన్లో తీసుకున్నారు. తక్కిన పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. సీనియార్టీ జాబితా తయారు చేశారు. మార్కులు మాత్రం బయటకు వెల్లడించకుండా అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఆగస్టు రెండో వారంలో ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ముగిసింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని భావించినా నేటికీ దీనిపై స్పష్టత లేదు. కమిషనరేట్ నుంచి ఎప్పుడొస్తుందో...? ఇంటర్వ్యూల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేసి ఆమోదం కోసం కమిషనరేట్కు పంపామని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఎప్పుడొస్తుందనేది చెప్పడం లేదు. సెక్టోరియల్ ఆఫీసర్స్ లేక అల్లాడుతుంటే, మరోవైపు మినిస్టీరియల్ పోస్టులూ ఖాళీగా ఉండడం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టు ఖాళీగా ఉంది. సూపరింటెండెంట్గా ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్న కృష్ణారావు లాంగ్లీవ్లో వెళ్లారు. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కలెక్టర్ ఆనంద్ అయినా ‘సమగ్ర శిక్ష’పై దృష్టి సారించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ‘సమగ్ర’ గందరగోళం ఏడాదికిపైగా భర్తీకాని సెక్టోరియల్ అధికారుల పోస్టులు రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి ఇద్దరినే తీసుకున్న అధికారులు ఇంటర్వ్యూలు ముగిసి నెలన్నరవుతున్నా కొలిక్కిరాని వైనం పర్యవేక్షణ లేక కుంటు పడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలు కొత్త కలెక్టర్ అయినా దృష్టి పెట్టేనా? కమిషనరేట్కు పంపిన జాబితాపై కొందరు లీకులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న కొందరు తమకు అవకాశం ఇచ్చారంటూ బయట ప్రచారం చేసుకుంటున్నారు. గార్లదిన్నె మండలంలో పని చేస్తున్న ఓ ఎస్జీటీ ఇటీవల బుక్కరాయసముద్రం సమీపంలో తన సహచరులకు డిన్నర్ కూడా ఇచ్చారు. మరో టీచరు ప్రాథమిక విద్యలో ఒక తరగతి కన్నడ మీడియంలో చదివి, దీన్ని అడ్డుగా పెట్టుకుని అసిస్టెంట్ ఏఎంఓ కన్నడ పోస్టుకు ఆమోదముద్ర వేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చౌక బియ్యం పట్టివేత
పెద్దపప్పూరు: అమ్మలదిన్నెలో సూర్యనారాయణ అనే వ్యక్తి వద్ద నిల్వ ఉంచిన 15 బస్తాల చౌక బియ్యాన్ని సోమవారం పట్టుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు స్వాధీనం చేశామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందించే చౌక బియ్యాన్ని ఎవ్వరు కొనుగోలు చేసినా, అక్రమంగా రవాణా చేసినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అనంతపురం అర్బన్: విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదురుగా సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జీటీ శ్రీనివాసులు, కన్వీనర్ హర్ష మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తిగా వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. దీర్ఘకాలిక సర్వీసు ఉన్న వారిని సంస్థలో విలీనం చేయాలన్నారు. కారుణ్య నియామకాలు కల్పించడంలో కన్సాలిడేటెడ్ పే విధానానిన రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలన్నారు. 2019లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఏల్ఎం గ్రేడ్–2)లను రెగ్యులర్ జేఎల్ఎంలుగా పరిగణించి వేతనాల, ఇతర ప్రయోజనాలు కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలన్నారు. అమలులో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం స్కేల్ రూపొందించాలన్నారు. ఇలా తమ న్యాయమైన అన్ని డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కో–కన్వీనర్లు శ్రీనివాసులు, జితేంద్ర, జిలాన్, రాము, నాగార్జున, ఎస్ఎం బాషా పాల్గొన్నారు. -
సెపక్తక్రా పోటీల రన్నర్ ‘అనంత’
● ముగిసిన రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలుఉరవకొండ: రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల ఓవరాల్ విజేతగా కృష్ణా జిల్లా బాలబాలికల జట్లు నిలిచాయి. ఉరవకొండలోని జెడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 21 నుంచి జరుగుతున్న 28వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి సబ్ జూనియర్ బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. అనంతపురం, కృష్ణా జిల్లాల బాలబాలికల జట్లు ఫైనల్స్లో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. అనంతపురం జిల్లా జట్లు రన్నరప్స్తో సరిపెట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా భారతదేశ సెపక్తక్రా క్రీడల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా చైర్మన్ సప్తగిరి మల్లి, కార్యదర్శి షాహిన్, ఎస్కెఆర్సీ క్లబ్ ఉపాధ్యక్షులు ఎర్రిస్వామినాయుడు, ఆమిద్యాల రాజశేఖర్ హాజరయ్యారు. గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే క్రీడల్లో రాణిస్తారని వక్తలు తెలిపారు. అనంతరం విన్నర్స్, రన్నర్స్ జట్లకు పతకాలు, కప్లు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో సీనియర్ పీడీలు మారుతిప్రసాద్, పుల్లా రాఘవేంద్ర, నాగరాజు, ప్రభాకర్, మంజునాథ్, జనార్దన్, శివకుమార్, రాయుడు, కృష్ణ, నాగేంద్ర పాల్గొన్నారు. -
పడిగాపులు.. ఎదురుచూపులు
● కూటమి ప్రభుత్వ అలసత్వంతో రైతులకు తప్పని అవస్థలుబొమ్మనహాళ్: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అన్నదాతలు ఇంకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘యూరియా కొరత లేదు.. ప్రతి రైతుకూ అందిస్తాం’ అంటూ అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకుండా పోతోంది. ఒక వైపు పొలం పనులు చేసుకుంటూనే మరో వైపు ఎరువుల కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట గ్రామ సొసైటీలకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతన్నలు సోమవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునే క్యూలో ఆధార్కార్డులు, పాస్ పుస్తకాలు ఉంచారు. అరకొరగా వచ్చిన ఎరువులను కూడా పోలీసుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదికూడా ఒకటి లేదా రెండు బస్తాల యూరియానే అందించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బాగా పలుకుబడి ఉన్న వారు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న వారికి 20 నుంచి 30 యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆరోపించడం గమనార్హం. ఉద్దేహాళ్ సొసైటీ వద్ద యూరియా కోసం ఆధార్కార్డులు, పాసుపుస్తకాలను క్యూలో పెట్టిన రైతులు, యూరియా కోసం ఆందోళన చేస్తున్న దృశ్యం