breaking news
	
		
	
  Ananthapur
- 
      
                   
                               
                   
            వేదవతి ప్రవాహంలో చిక్కుకున్న విజయవాడ వాసులు
బ్రహ్మసముద్రం: మండల పరిధిలోని వేదవతి నది ప్రవాహంలో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. వివరాలు.. విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న వంశీ, శ్రీనివాస్ రాయదుర్గంలో నివాసముంటూ.. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనిపలు గ్రామాల్లో రుణాల మంజూరు, వసూళ్లు చేసేవారు. ప్రతి సోమవారం గ్రామాలకు చేరుకుని రుణ గ్రహీతల నుంచి కంతులు వసూలు చేసుకుని సంస్థ ఖాతాలో జమ చేసేవారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో బ్రహ్మసముద్రం మండలానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వారు.. వేపులపర్తి – గుమ్మఘట్ట మధ్యలో వేదవతి కాజ్వేను దాటుతుండగా ప్రవాహ వేగానికి అదుపు తప్పి బైక్తో పాటు కొట్టుకుపోతూ చెట్లను పట్టుకుని కేకలు వేశారు. గమనించిన స్థానిక యువకులు కొందరు సాహసం చేసి తాళ్ల సాయంతో నీటి ప్రవాహంలోకి దిగి వాహనంతో పాటు ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై కాజేవేపై రాకపోకలు నిషేధిస్తున్నట్లు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. భద్రతపై దృష్టి పెట్టండి : జేసీ అనంతపురం అర్బన్: పెద్ద కార్యక్రమాలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత అఽధికారులను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో భద్రత చర్యలపై సోమవారం కలెక్టరేట్లో అధికారులతో జేసీ సమీక్షించారు. బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలి బాలల సంరక్షణ కేంద్రాలను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు జేసీ సూచించారు. బాలల సంరక్షణ కేంద్రాల జిల్లాస్థాయి సిఫారసు కమిటీ సమావేశం సోమవారం రెవెన్యూభవన్లో జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. సంరక్షణ కేంద్రాల్లోని బాలలకు పూర్తి స్థాయి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ల లైసెన్స్ కోసం 11 మంది దరఖాస్తు చేసుకున్నారని, నిబంధనల మేరకు పది మందికి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో కమిటీ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి, జిలా రిజిస్ట్రార్ భార్గవ్, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ అర్చన, డీపీఓ ఖలీల్, డీసీపీఓ మంజునాథ్, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు సహకార సంఘంలో రూ.6 లక్షల గోల్మాల్ శింగనమల: స్థానిక దొణరామేశ్వర రైతు సహకార సంఘంలో చోటు చేసుకున్న రూ.6 లక్షల గోల్మాల్పై వెలుగు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రైతు సంఘంలో దాదాపు రూ.కోటి వరకూ లావాదేవీలు ఉన్నాయి. గత రెండేళ్లలో రూ.6 లక్షలు వరకు సొమ్మును అందులో పనిచేస్తున్న అకౌంటెంట్ పేరు మీద వేశారు. ఆ డబ్బును వెలుగు కార్యాలయంలోని కొందరు పంచుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. రెండు నెలల క్రితం అకౌంటెంట్ అనారోగ్యంతో మృతిచెందాడు. బ్యాంక్ లావాదేవీలపై కుటుంబసభ్యులు బ్యాంక్కు పోవడంతో బాగోతం కాస్త బట్టబయలైంది. మృతుడిపై నెపం నెట్టేసి వెలుగు సిబ్బంది చేతులు దులుపుకున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారుల విచారణకు ఆదేశించారు. దీనిపై వెలుగు సీసీ ఈశ్వరయ్యను వివరణ కోరగా.. సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలను ఉన్నతాధికారులకు తెలియజేయడమేగాక, పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశామన్నారు. చెస్లో రాణించిన నిహాల్ అనంతపురం కార్పొరేషన్: నగరానికి చెందిన ఏడేళ్ల నిహాల్ నయనంజకు ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ 1,505 దక్కింది. ఈ మేరకు రేటింగ్లను అఖిల భారత చదరంగా సమాఖ్య సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిహాల్ను ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్కుమార్నాయుడు అభినందించారు.ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీల భర్తీకి కసరత్తు అనంతపురం సిటీ: జిల్లాలోని ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. జిల్లాలో మొత్తం ఎయిడెడ్ స్కూళ్లు రెండు ఉండగా, పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిని ఏ విధంగా భర్తీ చేయాలి, రోస్టర్ పాటించాలా లేదా, ఇప్పటికే పని చేస్తుంటే వారికి ఎలా అవకాశం ఇవ్వాలనే అంశాలపై చర్చ నడుస్తోంది. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఆ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, సమగ్ర నివేదిక తయారు చేసి కలెక్టర్ అనుమతికి పంపనున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి పుట్లూరు: మండలంలోని అరకటివేముల గ్రామానికి చెందిన ఓబుళనాయుడు(36) అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. వ్యవసాయంతో పాటు ఐచర్ వాహనం డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఓబుళనాయుడు ఆదివారం మద్యం ఎక్కువగా సేవించి, ఇంటి వద్ద అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన భార్య లావణ్య, కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. - 
      
                   
                               
                   
            కనిపించని108
తాడిపత్రి టౌన్: అత్యవసర సమయంలో రోగులను, క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవలు కనుమరుగయ్యాయి. మరమ్మతుల పేరుతో అంబులెన్స్లను నెలల తరబడి ఆస్పత్రులకు దూరం చేయడంతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు నిదర్శనమే పుట్లూరు మండలం ఎ.కొండాపురం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులు పడిన ఇబ్బందులు. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం జూలాకాల్వకు చెందిన చిననాగప్ప, మల్లమ్మ.. సోమవారం వ్యక్తిగత పనిపై తాడిపత్రికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఎ.కొండాపురం వద్ద గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు వెంటనే 108 అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. గంటల తరబడి వేచి ఉన్నా వాహనం రాకపోవడంతో క్షతగాత్రుల వేదనను చూడలేక అనంతపురం నుంచి కూల్డ్రింక్లు, వాటర్బాటిళ్లను తాడిపత్రికి ఆటోలో తరలిస్తున్న డ్రైవర్ నరేంద్ర తన లగేజీ ఆటోలోనే వారిని ఓ పక్కగా కూర్చొబెట్టుకుని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు నరకం అనుభవించామని, ఆటో డ్రైవర్ నరేంద్ర రాకుంటే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని క్షతగాత్రులు వాపోయారు. ఈ విషయమై 108 అంబులెన్స్ డీఎం సోమశేఖర్ను వివరణ కోరగా.. పుట్లూరు, పెద్దపప్పూరు మండలాలకు చెందిన 108 వాహనాలు మరమ్మతు కోసం విజయవాడకు తరలించినట్లు తెలిపారు. మిగిలిన మూడు వాహనాలతోనే సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు తప్పని తిప్పలు రెండు గంటల పాటు రోడ్డుపైనే నరకం ఆస్పత్రికి చేర్చి మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్ - 
      
                   
                               
                   
            పేదలకు వైద్యాన్ని దూరం చేస్తే ఊరుకోం
ఉరవకొండ: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేయాలని చూస్తే ఊరుకోబోమని కూటమి సర్కార్ను వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటిసంతకాల కార్యక్రమాన్ని ఉరవకొండలోని గుంతకల్లు రోడ్డు వద్ద సోమవారం ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పేదలకు ఖరీదైన వైద్యం అందించడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, దానిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 3,500 చికిత్సలకు విస్తరించి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం దాదాపు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యక్ష పథకం కింద వైద్య సేవలు అందించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ తీరులో మార్పు రావాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, నాయకులు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, ఆమిద్యాల రాజేష్, ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, చందా చంద్రమ్మ, లత్తవరం గోవిందు, జోగి వెంకటేష్, పచ్చి రవి, అంగదాల అంజి, కురుబ ప్రకాష్, వడ్డే ఆంజనేయులు, మారేష్, డిష్ సురేష్, చాబాల జగదీష్, కరూరు వెంకటేష్, సోమశేఖర్, మోమిన్ జిలానీ, బళ్లారి ఆసీఫ్, జీఎంఎస్ మీరం బాషా, బొంబాయి సెట్ మైనుద్దీన్, బెళగల్ షమ్ము, ముల్లాశర్మాస్, ఇర్ఫాన్, షఫీ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ - 
      
                   
                               
                   
            ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
జిల్లాలోనే అత్యదికంగా బొమ్మనహాళ్, కణేకల్లు, డి హీరేహాళ్ ప్రాంతాల్లోని హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో రెట్టింపు విస్తీర్ణంలో వరి సాగులోకి వచ్చింది. గత రబీలా కాకుండా ఈ ఖరీఫ్లో రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. బయట మార్కెట్లో వరి ధరలు తక్కువగా ఉండడంతో రైతులంతా కొనుగోలు కేంద్రాల వైపు చూస్తున్నారు. ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుకు అండగా నిలవాలి. నిర్లక్ష్యం చేస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం - 
      
                   
                               
                   
            పురస్కారమందుకున్న శాంతినారాయణ
అనంతపురం కల్చరల్: తెలంగాణలోని నిజామాబాద్లో జరిగిన సాహితీవేడుకల్లో కేంద్ర సాహిత్య అకాడమీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కన్వీనర్ ఆచార్య మృణాళిని చేతుల మీదుగా ‘అమృతలత జీవిత సాఫల్య’ సీనియర్ రచయిత డాక్టర్ శాంతినారాయణ సోమవారం అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి శాంతినారాయణ చేస్తున్న సేవలను రచయిత్రులు నెల్లుట్ల రమాదేవి, వి.ప్రతిమ కొనియాడారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తాడిపత్రి టౌన్ (పెద్దపప్పూరు): ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని నలుగురుకి గాయాలయ్యాయి. పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజశేఖర్ పశువులు అదే గ్రామానికి చెందిన ప్రభోదర్రెడ్డి పొలంలోకి వెళ్లి మేసి పైప్లైన్ను ధ్వంసం చేశాయి. ఈ విషయంగా పొలం వద్ద గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న ప్రభోదర్రెడ్డి సోదరుడు అమర్నాథరెడ్డి, రాజశేఖర్ బంధువు తులసమ్మ అక్కడకు చేరుకోవడంతో ఇరు కుటుంబాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. గాయపడిన నలుగురిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. - 
      
                   
                               
                   
            సెపక్తక్రా ఓవరాల్ చాంపియన్ కృష్ణా
ఉరవకొండ రూరల్: గత రెండు రోజులుగా ఉరవకొండ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్ –14, 19 రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల క్రీడా పోటీలు సోమవారం ముగిసాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ –19 బాలబాలికల విభాగంలో కృష్ణా జిల్లా మొదటి స్థానం, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచాయి. అండర్– 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తూర్పు గోదావరి, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో కర్నూలు, బాలికల విభాగంలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు ఆల్ ఇండియా సెపక్ తక్రా పెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ పరిశీలకుడు రమేష్, ఉరవకొండ ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ మెడల్స్ ప్రదానం చేశారు. పోటీలను పీడీలు మారుతీ ప్రసాద్, పుల్లా రాఘవేంద్ర, ప్రభాకర్, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు, ముద్దలాపురం శివ తదితరులు పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేశారు. పరిష్కార వేదికకు 105 వినతులు అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 105 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. త్వరితగతిన బాధితులకు పరిష్కారం చూపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ మహబూబ్బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభం మడకశిరరూరల్: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో దివంగత శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యులు రూ.6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి) సోమవారం ప్రారంభమైంది. దాతలు డాక్టర్ శాంతా, జయరామ్, స్వామి జపానంద తదితరులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైజ్ఞానిక సంస్థ చైర్మన్ జీఎన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్లో 34 ఏళ్లు క్రితం ఏర్పాటైన కంటి ఆస్పత్రి ద్వారా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మడకశిరలో ఏర్పాటైన ఆస్పత్రి ద్వారా 5 లక్షల మందికి వైద్య సేవలు అందించడమే సంస్థ లక్ష్యమన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. అవసరమున్న వారికి ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తామన్నారు. మూడేళల్లో 10 గ్రామీణ కంటి పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కంటికి సంబంధించిన అన్నిరకాల వైద్య సేవలు, ఆపరేషన్లు 90 శాతం వరకూ నీలకంఠాపురం ఆస్పత్రిలోనే నిర్వహిస్తామన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సేవలు నీలకంఠాపురంలోనూ ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఉత్తమ సేవలతో ప్రపంచస్థాయిలో మంచి పేరు తేవాలన్నారు. వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య చికిత్సలు చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలన్నారు. మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు వైటీ ప్రభాకర్రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, సుధాకర్ , ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైస్ చైర్మన్ రాజీవ్రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్, మాజీ పీసీసీ అధక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సీడబ్ల్యూసీ మెంబర్ కొప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్రెడ్డి, సేవమందిరం విద్యా సంస్థ అధినేత కేటీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            కంది దిగుబడులపై తెగుళ్ల ప్రభావం
అనంతపురం అగ్రికల్చర్: కందికి మారుకామచ్చల పురుగు ఆశించినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. పురుగు ఉధృతి నివారణలో భాగంగా రోజువారీ కంది పంటను పరిశీలించాలన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే 0.4 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 శాతం ఎస్జీ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 వాతం ఎస్సీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తర్వాత ప్రతి 7 నుంచి 10 రోజులకోసారి పంటను పరిశీలించి మారుకామచ్చల పురుగు ఆశించిన పువ్వులు, కాయలను తీసివేయాలని, నిర్లక్ష్యం చేస్తే 40 నుంచి 60 శాతం వరకు పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్త విజయశంకరబాబు - 
      
                   
                               
                   
            అయ్యగార్లపల్లిలో అధికారుల పరిశీలన
శెట్టూరు: అయ్యగార్లపల్లిలో శోత్రియం భూముల అన్యాక్రాంతంపై ‘మళ్లీ వచ్చాడు.. భూ బకాసురుడు’ శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై నివేదిక అందించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్ఐ గౌతమ్, అయ్యగార్లపల్లి వీఆర్ఓ అశోక్ గ్రామంలోని సర్వే నంబర్లు 172–1, 139–1, 179–5లోని భూములను పరిశీలించారు. గ్రామంలో నీటి కుంట, స్థానికుల ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. ప్రజల స్థలాలను వారికి తెలియకుండా సుధాకర్శెట్టి తన కుటుంబీకుల పేరున పట్టాలు చేయించుకున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు డిప్యూటీ తహసీల్దార్ అనిల్కుమార్ తెలిపారు. - 
      
                   
                               
                   
            ఓయమ్మో.. ఓయమ్మో!
● కళ్లు బైర్లు కమ్మేలా టీడీపీ నేత సుధాకర్శెట్టి ‘పట్టా’ల చిట్టా కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం అయ్యగార్లపల్లితో పాటు గ్రామం చుట్టూ ఉన్న భూములను ఓ టీడీపీ నేత కబళించాలని చూస్తున్న వైనంపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయన ఎవరెవరి పేరున ఎన్ని ఎకరాలకు పట్టాలు పొందారనే విషయం బయటకు వచ్చింది. ‘పట్టా’ ఎట్టెట్టా.. శోత్రియం దారులు అమ్మారంటూ ఫేక్ అగ్రిమెంట్లు సృష్టించి వందల ఎకరాల భూములను మింగేద్దామనుకున్న టీడీపీ నేత సుధాకర్ శెట్టి పట్టాదారు పాసుపుస్తకాలు చిట్టా చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే! అయ్యగార్లపల్లి సర్వే నం.4–1లో 20.02 ఎకరాల్లో బంజరు భూమి ఉంది. ఈ భూమికి సుధాకర్ శెట్టి తన తల్లి కె.సుమిత్రమ్మ పేరున రైతువారీ పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే నం.173లో పశువుల మేత కోసం వదిలిన 16.43 ఎకరాలకు తండ్రి సూర్యనారాయణ పేరున పట్టా పొందాడు. ఇవే కాక సర్వే నం. 179–2లో 3.99 ఎకరాల్లోని నీటి కుంటకూ కె.సుమిత్రమ్మ పేరున, సర్వే నం.16లోని 11.23 ఎకరాలకు (ప్రస్తుతం ఈ భూమిలో అదే గ్రామానికి చెందిన పూజారి తిమ్మన్న, బి.నింగప్ప, సన్నీరన్న (లేట్), పాలయ్య, ప్రభాకర్ సాగులో ఉన్నారు) తన సోదరుడు కె.రాధాకృష్ణ పేరున, 209–2లోని 20.53 ఎకరాలను రాచమడుగు వరలక్ష్మి (సుధాకర్ శెట్టి భార్య సోదరి) పేరున, 172–1లోని 3.16 ఎకరాలకు తన బావమరిది ఆదిమూలపు బాబుప్రసాద్ పేరున, సర్వే నం.285లోని 28.27 ఎకరాలకు (ప్రస్తుతం ఈ భూమిలో పలువురు రైతులు పంటలు సాగు చేస్తున్నారు) సోదరుడు కె.రాధాకృష్ణ పేరున, సర్వే నం. 287లోని 31.87 ఎకరాలకు బావమరిది అశ్వర్థ నారాయణ పేరున, సర్వే నం.180లో 1.36 ఎకరాలు (అయ్యగార్లపల్లి– తిప్పనపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో) కె.సుమిత్రమ్మ పేరున, సర్వే నం. 4–1లోని 20.02 ఎకరాల బంజరు భూమికి కె. సుమిత్రమ్మ పేరున, 158–1,158–2లోని 34.24 ఎకరాలకు తన భార్య శశికళ,139–1లోని 2.52 ఎకరాలకు రాధాకృష్ణ, 207లోని 20.66 మిగులు భూములకు, 247–2లోని 1.16 ఎకరాల అనాధీన భూమికి తన బంధువు నారాయణ స్వామి పేరిట పట్టాలు పొందాడు. అధికారులను మచ్చిక చేసుకుని ఇలా ఇష్టారాజ్యంగా 200 ఎకరాలకు పైగా పట్టాలు అక్రమంగా మంజూరు చేయించుకున్నాడు. 2018లో సుధాకర్ శెట్టి భూ బాగోతం బయటకు వచ్చిన సమయంలో శెట్టూరు తహసీల్దార్గా ఉన్న సుబ్రహ్మణ్యం రెండేళ్ల సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అండతో సర్వే.. అయ్యగార్లపల్లి సర్వే నం. 285లోని 28.27 ఎకరాలను అనంతపురం నగరానికి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు ఇటీవల సుధాకర్ శెట్టి సిద్ధమయ్యాడు. గత 40 ఏళ్లుగా ఈ భూముల్లో శెట్టూరు మండలం ముచ్చర్లపల్లికి చెందిన ఆరుగురు, అయ్యగార్లపల్లికి ఆరుగురు రైతులు ఇప్పటికీ వివిధ రకాల పంటలను సాగు చేస్తుండడం గమనార్హం. ఇక్కడ ప్రస్తుతం ఒక ఎకరం భూమి విలువ రూ.5 లక్షలకు పైగా పలుకుతోంది. అలాంటి భూమిని కేవలం అగ్రిమెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించి సుధాకర్ శెట్టి అమ్మేశాడు. భూమిలో ఇటీవల హద్దులు నాటేందుకు వెళ్లగా ఇన్నాళ్లూ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అండతో పోలీసు బలగాల నడుమ సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. - 
      
                   
                               
                   
            తాడిపత్రిలో రౌడీరాజ్యం
తాడిపత్రి నియోజకవర్గంలో రౌడీరాజ్యం రాజ్యమేలుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో జేసీ అనుచరులమని చెప్పుకుంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి రాత్రి వేళ హెల్మెట్లు ధరించి చొరబడి దాడులు చేస్తున్నారు. ఇటీవల తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డిపై దగ్గరుండి జేసీ ప్రభాకర్రెడ్డి దాడి చేయించిన ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద జేసీ అనుచరులు రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. తన మాట వినని పోలీసు అధికారులపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు దిగుతుండడం గమనార్హం. కిందిస్థాయి అధికారులనే కాకుండా ఇటీవల ఏకంగా అడిషనల్ ఎస్పీ రోహిత్కుమార్ను ఆయన పరుష పదజాలంతో దూషించిన తీరును చూసి రాష్ట్రమంతా నిర్ఘాంతపోయిందంటే అతిశయోక్తి కాదు. - 
      
                   
                               
                   
            వసతులు మృగ్యం.. అవస్థలమయం
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో సర్వజనాస్పత్రిలో సదుపాయాలు మృగ్యంగా మారాయి. నీరు, బాత్రూంలు, ఫ్యాన్, కుర్చీలు, బల్లలు, తదితర కనీస సౌకర్యాల కల్పనలోనూ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా దుస్థితి నెలకొనడం గమనార్హం. మంచి నీళ్లకూ ఇబ్బందులు.. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కైన సర్వజనాస్పత్రి లోని లేబర్, సర్జరీ, ఎంఎం, ఎఫ్ఎం, తదితర వార్డుల్లో వాటర్ ప్లాంట్లు మరమ్మత్తుకు నోచుకోక అలంకార ప్రాయంగా మారాయి. ఈ క్రమంలో మెడిసిన్, సర్జరీ వార్డుల్లో ఉన్న వారు తాగునీటి కోసం రెండు ఫ్లోర్లు దిగి కిందికి రావాల్సి వస్తోంది. గతంలో వాటర్ ప్లాంట్ల మరమ్మతు, నిర్వహణకు రూ.లక్ష వెచ్చించేలా ఆస్పత్రి అధికారులు ప్రతిపాదించినా, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మొద్దు నిద్ర వీడలేదు. నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఇక.. వివిధ వార్డుల్లో బాత్రూంలు కంపు కొడుతున్నా శానిటేషన్ నిర్వాహకులు ఏమాత్రమూ స్పందించడం లేదు. ఫ్యాన్లు పనిచేయక ఉక్కపోత సర్వజనాస్పత్రిలోని మేల్ మెడిసిన్, ఫీమెల్ మెడిసిన్, ఈఎన్టీ, సైకీయార్టీ, సర్జరీ తదితర వార్డుల్లో పూర్తి స్థాయిలో ఫ్యాన్లు పని చేయడం లేదు. దీంతో రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కొందరు రోగులు తమ వెంట టేబుల్ ఫ్యాన్లను తెచ్చుకుంటున్న దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వానికి తగ్గట్టుగానే ఆస్పత్రి పర్యవేక్షకులు కూడా తమకేమీ పట్టదన్న ధోరణిలో ఉంటుండడంపై రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు. మేల్ మెడిసిన్ వార్డుకు వెళ్తున్న ఓ వృద్ధుడు తన వెంట టేబుల్ ఫ్యాన్ తీసుకెళ్తున్న దృశ్యం కుర్చీలు, బల్లలు లేకపోవడంతో నేలపై కూర్చున్న బాలింతలు, వారి కుటుంబ సభ్యులు - 
      
                   
                               
                   
            నిండా ముంచిన మోంథా
అనంతపురం అగ్రికల్చర్: ‘మోంథా’ తుపాను పప్పుశనగ రైతులను నిండా ముంచింది. జిల్లా వ్యాప్తంగా 2 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు లేత పైర్లు మునిగి కుళ్లిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిపోయిన పంటను తొలగించి రెండో సారి విత్తుకోవాల్సి ఉంటుంది. కూటమి సర్కారు అలసత్వం కారణంగా మొదటిసారే అష్టకష్టాలు పడి విత్తనాలు సమకూర్చుకున్న రైతులకు రెండో సారి విత్తనాలు కొని విత్తుకోవాలంటే అయ్యే పని కాదు. వారం, పది రోజుల్లోనే.. దుక్కులు, ఎరువులు, విత్తనం, కూలీల కోసం ఎకరాకు రూ.15 వేలకు పైగా ఖర్చు చేసి అక్టోబర్ రెండు, మూడు వారాల్లో నల్లరేగడి భూముల్లో రైతులు పప్పుశనగ విత్తుకున్నారు. మోంథా తుపాన్ కారణంగా జిల్లాలోని ఉరవకొండ, విడపన కల్లు, వజ్రకరూరు గుంతకల్లు, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 30 నుంచి 80 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో పొలాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. రెండు మూడు రోజులు నిల్వ ఉండటంతో పప్పుశనగ పంట దెబ్బతింది. సాగు చేసిన వారం, పది రోజుల్లోనే ఇలా జరగడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పంట నష్టం అంచనా ఏదీ...? నష్టం అంచనాల్లో దెబ్బతిన్న పప్పుశనగ పంటను వ్యవసాయశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. కేవలం గార్లదిన్నె, బొమ్మనహాళ్ మండలాల్లో 237 మంది రైతులకు చెందిన వరి, వేరుశనగ, మొక్కజొన్న 212 ఎకరాల్లో దెబ్బతినడంతో రూ.88 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఎక్కడా పప్పుశనగ నష్టం ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్తులో ఇన్పుట్ సబ్సిడీతో పాటు మళ్లీ విత్తనం అందే పరిస్థితి లేదని చెబుతున్నారు. కనీసం వాస్తవ పరిస్థితుల ఆధారంగా రెండో సారి విత్తుకునేందుకు వీలుగా విత్తనంపై ప్రత్యేక రాయితీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. జగన్ హయాంలో 80 శాతం రాయితీ 2021 నవంబర్లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇలానే తుపాన్ వల్ల లేతపైర్లు దెబ్బతిన్నపుడు రెండో సారి విత్తుకునేందుకు వీలుగా రైతులకు 80 శాతం రాయితీతో విత్తనం అందించారు. ఆ తర్వాత పంటకాలం ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చినట్లు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, నేడు చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయంపై చిన్నచూపు చూస్తుండటంతో అడుగడుగునా రైతులకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. పంట పూర్తిగా దెబ్బతింది - 
      
                   
                               
                   
            జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
కిటకిటలాడిన పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై 435 వినతులు అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కిటకిటలాడింది. ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి, మల్లికార్జునుడు, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 435 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని.. ● వితంతు పింఛను మంజూరు చేయించాలని తాడిపత్రి పట్టణం భగత్సింగ్ నగర్కు చెందిన షంషీర్బీ, కుందుర్పి మండలం మహంతపురానికి చెందిన గీతమ్మ, అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట పంచాయతీ చంద్రబాబునగర్కు చెందిన పోలక్క విన్నవించారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, పింఛన్ అందించి ఆదుకోవాలని కోరారు. ● భూమిని సర్వే చేయాలని కోరితే సర్వేయర్ పట్టించుకోవడం లేదని గుత్తి మండలం పెద్దోడి గ్రామానికి చెందిన దాసరి వెంకన్న వాపోయాడు. పెద్దోడి గ్రామ పొలం సర్వే నంబరు 61లో తమకు 6.97 ఎకరాల భూమి ఉండగా, అందులో 37 సెంట్లు మిగులు భూమిగా నమోదైందని చెప్పాడు. సర్వే చేయించి మిగులు భూమి నుంచి తొలగించాలని కోరాడు. ● 22ఏ జాబితా నుంచి తమ భూమిని తొల గించి హక్కు కల్పించాలని యల్లనూరు మండలం బొప్పేపల్లికి చెందిన గంగయ్య వేడుకున్నాడు. బొప్పేపల్లి సర్వే నం. 425లో 7.25 ఎకరాలకు తన తండ్రి పేరున 1939లో డీ పట్టా ఇచ్చారని, అప్పటి నుంచి తాము పంటలు సాగు చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఇటీవల భూమిని 22ఏ జాబితాలో చేర్చడంతో ఇబ్బందులు పడుతున్నామని, పరిష్కారం చూపాలని కోరాడు. - 
      
                   
                               
                   
            నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అనంతపురం సెంట్రల్: ప్రైవేటు ట్రావెల్స్, స్కూల్ బస్సులలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను ఉప రవాణా కమిషనర్ వీర్రాజు హెచ్చరించారు. సోమవారం రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్స్, స్కూల్ బస్సుల నిర్వాహకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తరచూ వాహన తనిఖీలు ఉంటాయన్నారు. ప్రతి వాహనంలో అత్యవసర ద్వారం, అగ్ని నియంత్రణ పరికరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. బస్సు బ్రేకులు, టైర్ కండీషన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, సునీత, ఏఎంవీఐ రఘునాథ్, ఏఓ కామరాజు, రాకేష్ మధుకర్బాబు, ప్రైవేటు ట్రావెల్స్, స్కూల్, కళాశాల బస్సు యజమానులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా జట్ల ఎంపిక అనంతపురం కార్పొరేషన్: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడా జట్ల ఎంపిక ప్రక్రియను సోమవారం నగరంలోని వివిధ క్రీడా మైదానాల్లో చేపట్టారు. అండర్ –14 క్రికెట్ జట్టులో అక్రమ్, జగదీష్యాదవ్, తన్వీర్, తోసిఫ్, తమోగ్న, సమృతన్, కన్నన్, అభినవ్, దీపక్, స్నేహిత్సింహ, లలిత కిషోర్, పవన్, రామ్చరణ్, చరణ్తేజ్, కౌశిక్ కుమార్, మెహెల్ రెడ్డి, క్రితిన్కుమార్ చోటు దక్కించుకున్నారు. అలాగే అండర్ –14 అథ్లెటిక్స్లో డీ శ్రీనాథ్, పీ రితీష్రెడ్డి, ఎస్ యశ్వంత్, సీ పవన్, శ్రీనాథ్, సీ లోకేష్, బీ సమరసింహ, ఆనంద్, జీ. దేవిక, కే.భవ్య, ఏ.రిధి, ఎన్ అవంతి, జీఎన్ గగన, నందక్క, హేమశ్రీ ఎంపికయ్యారు. ఐఐటీ, నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు అవకాశంఅనతపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, నీట్పై లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన విద్యార్థులకు విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుంది. పూర్తి వివరాలకు 99493 54106 లో సంప్రదించవచ్చు. నేటి నుంచి సేవాఘడ్లో రజతోత్సవాలు గుత్తి రూరల్: మండలంలోని సేవాఘడ్లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు సంత్ సేవాలాల్ మహరాజ్, జగదాంబమాత ఆలయ రజతోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు అనంతపురం: పోక్సో కేసులో ముద్దాయికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. రూ.10 వేల జరిమానా కూడా విధించారు. వివరాలు.. కేకే ట్రావెల్స్ బస్సులో 2022 ఏప్రిల్ 18న హైదరాబాద్ నుంచి అనంతపురం నగరానికి ఓ తల్లి, ఆమె కుమార్తె (5) బయలుదేరారు. ఇదే బస్సు ఎక్కిన శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి గ్రామం మరువపల్లికి చెందిన ఎం. అమరనాథ రెడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అనంతపురం మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి ఎస్ఐ సులోచన కేసు నమోదు చేసి, పోక్సో కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. జడ్జి చిన్నబాబు ఈ కేసులో 8 మంది సాక్షులను విచారించారు. సోమవారం తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు అమరనాథ రెడ్డికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 వేల పరిహారం చెల్లించాలని సూచించారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మినారాయణ కేసు వాదించారు. మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ మహబూబ్బాషా, కోర్టు మానిటరింగ్ సిస్టం సీఐ భాస్కర్ గౌడ్ పర్యవేక్షణలో కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, పీసీ డి. కిరణ్కుమార్ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు. - 
      
                   
                               
                   
            మత్తులో ఘోరాలు..
●గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గత నెల 13న రౌడీషీటర్ కమ్మ ఆనంద్ (33) అలియాస్ బొంబాయి ఆనంద్ దారుణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఈ హత్య జరిగింది. ఆనంద్ స్నేహితుడే మద్యం మత్తులో అతని తలపై బండరాయితో మోది చంపాడు. ●గత నెల 18న అనంతపురం గుత్తి రోడ్డులోని తడకలేరు సమీపంలో గుణ అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న సమయంలో అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికీ ఘటనను తలచుకుని ప్రజలు వణికిపోతున్నారు. ●తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ను ఇటీవల తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇష్టారాజ్యంగా దూషించారు. ఏకంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజునే ఏఎస్పీపై రెచ్చిపోయి మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన ఓ ఐపీఎస్ అధికారిపై జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి..... జిల్లాలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో చెప్పేందుకు ఈ ఘటనలే నిదర్శనాలు.అనంతపురం సెంట్రల్: జిల్లావ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట హత్యలు, దాడుల ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. నేరాలు పెరిగిపోవడంతో సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వాలిపోతున్న ‘పచ్చ గద్దలు’ అధికార అండతో ‘పచ్చ’ నాయకులు భూకబ్జాలకూ ఒడిగడుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి పాగా వేయాలని చూస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ నేతల భూదాహం చూసిన ప్రజలు భయకంపితులవుతున్నారు. అధికారులను ఆశ్రయిస్తున్నా తగిన స్పందన లేకపోవడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. బెదిరింపుల పర్వం అరాచకాలను వెలుగులోకి తెస్తున్న మీడియా ప్రతినిధులపై కొందరు ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల విలేకరులపై ‘మీ అంతు చూస్తా’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోగా.. గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విలేకరులను ఏకంగా రైలు పట్టాలపై పడుకో పెడతా అంటూ బెదిరించడం గమనార్హం. ఇక.. శింగనమల నియోజకవర్గంలో ఎర్రమట్టి దోపిడీని వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విలేకరిపై ఇటీవల ‘పచ్చ’ మూక దాడికి పాల్పడింది. అమలు కాని ఎస్పీ ఆదేశాలు.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీ జగదీష్ కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చెబితేనే పోస్టింగ్ వచ్చిందని, దీంతో వారు చెప్పినట్లే పనిచేయాలనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకుల దాడులు, దౌర్జన్యాలపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసుస్టేషన్లో కేసులు నమోదు కావడం లేదు. తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కూడేరు సీఐ రాజు తీరుతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు, సానుభూతిపరులు పోలీసుస్టేషన్కు వెళ్తే బూతులు మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇటీవల పలువురు బాధితులు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంది. ఈ క్రమంలో ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరుకుతుండడంతో మందుబాబులు పూటుగా తాగి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో మందుబాబులు హల్చల్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ క్రమంలో మహిళలు రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక..గంజాయికి కూడా జిల్లా అడ్డాగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గుత్తి రోడ్డుకు చెందిన ఓ యువకుడు గంజాయికి బానిసగా మారి ఆ మత్తులో సొంత మేనమామపైనే దాడి చేశాడు. జిల్లాలో అటకెక్కిన శాంతిభద్రతలు నిత్యం ఎక్కడో ఒక చోట హత్యలు, దాడుల ఘటనలు పెచ్చుమీరుతున్న అధికార పార్టీ నేతల అరాచకాలు పోలీసుల గస్తీ లేక పెరిగిన మందుబాబుల ఆగడాలు రాజకీయ పోస్టింగ్లు కావడంతో నోరు మెదపని ఖాకీలు - 
      
                   
                                                     
                   
            జనసేన నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కూటమి’ ప్రభుత్వ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్యకు యత్నించి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన ఇన్చార్జ్ మంజునాథ్కు మద్దతుగా పోలీసులు చేసిన ఈ చర్య ‘అనంత’లో కలకలం రేపుతోంది. మంజునాథ్కు రాయదుర్గం, కర్ణాటక సరిహద్దు బండ్రావి అనే గ్రామంలోని రాగుల సిద్ధప్పకు మధ్య నగదు లావాదేవీలున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలలో మంజునాథ్కు సిద్ధప్ప బాకీ పడ్డాడు. ఈ క్రమంలో మంజునాథ్ సిఫార్సుతో రాయదుర్గం పోలీసులు సిద్ధప్పను అదుపులోకి తీసుకున్నారు. అతడిని వేధించడంతో పాటు రెండు రోజులు చిత్తకొట్టినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగక సిద్ధప్పకు సంబంధించిన రెండు ట్రాక్టర్లు, రెండు బొలెరో వాహనాలను కూడా స్టేషన్కు తెప్పించారు.సిద్ధప్ప తండ్రి బండ్రావప్పను సీఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ పిలిపించారు. డబ్బుల విషయమై ఒత్తిడి చేశారు. దీంతో వారికి బండ్రావప్ప రూ.10 లక్షలిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.లక్ష వారు తీసుకుని, రూ.9 లక్షలు మంజునాథ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో రూ.20 లక్షలు అప్పు ఉందని తేల్చి, ఖాళీ పత్రాలపై బండ్రావప్పతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. కుమారుడిపై పోలీసుల దాడి, తనతో బలవంతంగా సంతకాలు, వాహనాలు తీసుకెళ్లడంతో గ్రామంలో పరువు పోయిందని భావించిన బండ్రావప్ప ఆదివారం పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు బళ్లారిలోని విమ్స్లో చేర్పించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఉలిక్కిపడిన పోలీసులు బండ్రావప్ప ఆత్మహత్యాయత్నంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తమ అదుపులో ఉన్న సిద్ధప్ప, వాహనాలను వదిలిపెట్టారు. బండ్రావప్పను ఎవరూ కలవకుండా, ఆస్పత్రిలో ఫొటోలు తీయకుండా తమకు అనుకూలమైన ఒక లెక్చరర్ను కాపలా ఉంచారు. ఇక వ్యవహారం రాయదుర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వద్దకు చేరింది. దీంతో విషయం బయటకు రానీయొద్దని, సిద్ధప్పను ఒప్పించి ఆయన ఇచ్చిన రూ.10 లక్షలు తిరిగి ఇచ్చేస్తామని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. - 
      
                   
                               
                   
            సర్కార్ తీరుతో నష్టపోతున్న రైతులు
● కరువు మండలాల ప్రకటనలో జిల్లాకు తీవ్ర అన్యాయం అనంతపురం అర్బన్: కరువు మండలాల ప్రకటనలో జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని, ఫలితంగా రైతులు నష్టపోతున్నారంటూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవక సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని మండలాలను కరువు జాబితాలో చేర్చకుండా రైతులు, రైతు కూలీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. జూలై ఆఖరు, ఆగస్టులో కురిసిన వర్షాలకు దిగుబడులు పూర్తి తగ్గి పెట్టుబడులు కూడా చేతికి అందక రైతులు అప్పుల పాలయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 31 మండలాలను కరువు జాబితాలో చేర్చి పంట నష్టపోమయిన రైతులకు పరిహారం, బీమా ప్రకటించాలని డిమాండ్ చేశారు. - 
      
                   
                               
                   
            జేసీ అనుచరుల రౌడీయిజం
అనంతపురం/తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. రౌడీల్లా మారి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే మీ అంతు చూస్తాం.. అంటూ వీరంగం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటిసంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు కంచెం రామ్మోహన్ రెడ్డి, గడ్డం పరమేష్ తదితరులు ఆదివారం తాడిపత్రిలోని పాతకోట, పోరాటకాలనీల్లో నిర్వహించారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ గౌస్ మహమ్మద్ అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని నిలిపేయాలని అడ్డగించారు. ఇంతలోనే జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులైన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి, టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, జింకా లక్ష్మీదేవితో పాటు నేరచరితగల పలువురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న ఎస్ఐ గౌస్ మహమ్మద్ వారిని వారించకపోగా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే చేయిచేసుకున్నారు. కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపేయించారు. తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు తిరిగి వెళుతుండగా.. జేసీ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. మూడు వాహనాలపై రాళ్లవర్షం కురిపించారు. ఈ రాళ్లదాడిలో ఒక వాహనం వెనుకవైపు అద్దాలు పగిలిపోయాయి. వైఎస్సార్సీపీ కార్యకర్త సుభాష్కు గాయాలయ్యాయి. పథకం ప్రకారమే దాడులు.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాడిపత్రి భగత్సింగ్ కాలనీలో నిర్వహించాలని వైఎస్సార్సీపీ నాయకులు తొలుత నిర్ణయించారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున ఇంటింటికీ వెళ్లి ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ నాయకులు గొడవ వద్దనుకుని పాతకోట, పోరాటకాలనీకి కార్యక్రమాన్ని మార్చుకున్నారు. అయినా జేసీ వర్గీయులు అక్కడ కూడా విధ్వంసానికి దిగారు. కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా దాడులు చేయాలని జేసీ వర్గీయులు ముందే పథకం రూపొందించుకున్నట్లు స్పష్టమవుతోంది. తాడిపత్రిలో నిత్యం అలజడులు సృష్టిస్తూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రాక్షసానందం పొందుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులపై ఫిర్యాదు.. కోటి సంతకాల సేకరణ సందర్భంగా దాడికి పాల్పడిన టీడీపీకి చెందిన నలుగురు మునిసిపల్ కౌన్సిలర్లతో పాటు 25 మంది టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్ ఎరుకల రామాంజినేయులు పట్టణ సీఐ ఆరోహణరావుకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, జింకా లక్ష్మీదేవి, హాజీవలి, షేక్షాతో పాటు ఆ పార్టీ నాయకులు రఘు, శంకర్, పాతకోట బబ్లూ, డిష్రాజు, బూర్గల రాము, ఓట్ల ప్రసాద్, పాతకోట షబ్బీర్, పోరాటకాలనీ పెద్దయ్యతో పాటు మరికొందరు అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ రాళ్లదాడికి తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విచారణ చేపడుతున్నామని సీఐ ఆరోహణరావు ‘సాక్షి’కి తెలిపారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ చేపట్టిన కోటిసంతకాల సేకరణకు ఆటంకాలు నాయకుల వాహనాలపై రాళ్ల దాడి జేసీ వర్గీయులకే వత్తాసు పలికిన పట్టణ ఎస్ఐ - 
      
                   
                               
                   
            రాచూరీ.. ఫోర్జరీ!
రాప్తాడురూరల్: రూ. వేల కోట్ల విలువైన పాపంపేట శోత్రియం భూముల కబ్జా వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములు తమవంటూ చెప్పుకునే వ్యక్తి వీఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలు.. పాపంపేట భూములకు సంబంధించి వీఆర్ఓ, మండల సర్వేయర్ జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్లు అంటూ రాచూరి కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏలు చేయించుకున్న వెంకటచౌదరి, శ్రీరాములు తదితరులు మ్యుటేషన్ కోసం హైకోర్టులో కేసు వేశారు. అయితే, 2024 ఆగస్టు 13వ తేదీతో 29.96 ఎకరాలకు సంబంధించి జారీ చేసిన ఆరు పొజిషన్ సర్టిఫికెట్లతో తనకు సంబంధం లేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని వీఆర్ఓ రఘు యాదవ్ చెబుతున్నా పైఅధికారులకు కాని, ఇటు పోలీసులకు కాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. అధికారులపై ఒత్తిళ్లు.. కబ్జా వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ముందునుంచి బాధితులకు అండగా నిలిచింది. ఇటీవల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి బాధితులను వెంటబెట్టుకుని కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుల అండతోనే భూములను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోం దంటూ మీడియా సమావేశాలు పెట్టి వివరించారు. అలాగే సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్సత్తా పార్టీలు, పలు ప్రజాసంఘాల నాయకులు కూడా బాధితులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో పాపంపేట భూముల కబ్జా వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం.. వీఆర్ఓ సంతకం ఫోర్జరీ అంశంపై ఇటీవల కొందరు బాధితులు నేరుగా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన క్రిమినల్ కేసు నమోదుకు ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. రోజులు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో శనివారం మరోమారు బాధితులు కలెక్టర్ను కలిసి విన్నవించారు. వెంటనే ఆర్డీఓ కేశవనాయుడుకు ఫోన్ చేసిన కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే మీపై చర్యలుంటాయంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో హుటాహుటిన ఆర్డీఓ, తహసీల్దార్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. వీఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి వివాదానికి కారణమైన రాచూరి వెంకటకిరణ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎట్టకేలకు ఆర్డీఓ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం రూరల్ పోలీసులు 340 (2), 518 (4) సెక్షన్ల కింద 225/2025గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాపంపేట భూ బాగోతంలో కీలక పరిణామం వీఆర్ఓ సంతకం ఫోర్జరీ ఆర్డీఓ ఫిర్యాదుతో పోలీస్స్టేషన్లో కేసు - 
      
                   
                               
                   
            నేడు పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. meekosam.ap. gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ అర్జీ సమర్పించవచ్చని తెలిపారు. వేతనాలు నిలుపుదల చేస్తాంఅనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకంలో బోగస్ మస్టర్లతో నిధులను కొల్లగొడుతున్న వైనంపై ‘ఉపాధిని ఊడ్చేస్తున్నారు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీం బాషా స్పందించారు. ఏపీఓలతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అక్రమాలు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి వేతన బిల్లులను నిలుపుదల చేయాలని ఏపీఓలను ఆదేశించామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. బోగస్ మస్టర్లు సృష్టిస్తే ఫీల్ అసిస్టెంట్లను ఇంటికి పంపుతామని ఆయన హెచ్చరించారు. కూలిన హెచ్చెల్సీ హెడ్ రెగ్యులేటర్ బొమ్మనహాళ్: బొమ్మనహాళ్ సెక్షన్ పరిధిలోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) 116.399 కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులేటర్ ఆదివారం రాత్రి కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హెచ్చెల్సీపై హెడ్ రెగ్యులేటర్ నిర్మించి చాలా ఏళ్లు కావడంతో ఇటీవల శిథిలావస్థకు చేరుకుంది. హెచ్చెల్సీ అధికారులు కూడా మరమ్మతుల గురించి పట్టించుకోకపోవడంతో హెడ్ రెగ్యులేటర్ గేట్లు పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుతం హెచ్చెల్సీలో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తుండటంతో ఉధృతికి హెడ్ రెగ్యులేటర్, దానికి అమర్చిన నాలుగు గేట్లలో మూడు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలిసింది. మృత్యువులోనూ తోడుగా.. ఓడీచెరువు (అమడగూరు): జీవితాంతం కలిసి ఉంటా మని పెళ్లినాడు చేసిన బాసలు.. మరణానంతరం కూడా కొనసాగించారు ఆ దంపతులు. వివరాలిలా ఉన్నాయి. అమడగూరు మండలం జౌకలకొత్తపల్లికి చెందిన దండు వెంకటరమణ (75), దండు చిన్నపాపమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వయోభారంతో వెంకటరమణ శనివారం రాత్రి చనిపోయాడు. భర్త మరణంతో మనోవేదనకు గురైన దండు చిన్నపాపమ్మ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. వీరి అన్యోన్య దాంపత్యం మృత్యువులోనూ వీడని బంధంగా నిలిచింది. తల్లి, తండ్రి కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడంతో కుమారులు, కుమార్తెలు విషాదంలో మునిగిపోయారు. - 
      
                   
                               
                   
            చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
ఉరవకొండ/వజ్రకరూరు: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేయించిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఉరవకొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంతో పాటు వజ్రకరూరు మండలం కమలపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘విశ్వ’ మాట్లాడారు. కూటమి సర్కారు వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకి రాదంటూ మంత్రి మాట్లాడడం దారు ణమన్నారు. సింహాచలం, తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన విష యాన్ని మరువకనే మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం కలచివేస్తోందన్నారు. ఈ క్రమంలోనే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని ఆరోపించారు. నకలీ మద్యం తయారీ మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందన్నారు. ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్న జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కేసులో నిందితుడైన జనార్దన్రావుతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి జోగి రమేష్ను అరెస్టు చేయించారన్నారు. ‘దొంగే.. దొంగ దొంగ’ అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న ధోరణిలోనే చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి పాలనలో రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని ఉన్నట్లుండి ప్రకటించడంతో చాలా మంది కట్టలేదన్నారు. గతంలో 84 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించగా, ఈ ఏడాది కేవలం19 లక్షల మంది చెల్లించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పప్పుశనగ విత్తనాలను సకాలంలో అందించకపోవడంతో రైతులే సొంతంగా సమకూర్చుకుని పంట సాగు చేశారని, ఇప్పుడు రాయితీతో విత్తనాలు ఇవ్వడానికి సిద్ధమవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుకు మారుపేరుగా ఉన్న జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న,వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి సందీప్రెడ్డి, బీసీ సెల్ జిల్లా నాయకుడు అల్లెప్ప, మండల ఉపాధ్యక్షుడు ఉస్మాన్, రైతు విభాగం అధ్యక్షుడు భరత్రెడ్డి, పార్టీ నాయకులు ఓబన్న, ఆమిద్యాల రాజేష్, మల్లి, చంద్రశేఖర్, లక్ష్మినారాయణరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, నాగేష్, నారాయణనాయక్, ప్రకాష్రెడ్డి, రమేష్, మహబూబ్పీరా, కిరణ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం - 
      
                   
                               
                   
            భక్తుల ప్రాణాలంటే లెక్కలేదా?
అనంతపురం: కూటమి ప్రభుత్వ అలసత్వంతోనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది భక్తులు మృతి చెందారని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. సీఎం చంద్ర బాబుకు భక్తుల ప్రాణాలంటే లెక్కలేనట్లుగా ఉందని విమర్శించారు. మృతి చెందిన భక్తులకు ఆదివారం రాత్రి అనంతపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య,పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, రాధాకృష్ణ, సైఫుల్లా బేగ్, గౌస్ బేగ్, ఆలమూరు శ్రీనివాస రెడ్డి, పెన్నోబులేసు, నరసింహులు, చింత కుంట మధు, కమల్ భూషణ్, రహంతుల్లా, శ్రీనివాసులు, దాదాఖలందర్, ఎగ్గుల శ్రీనివాసులు, రాధాయాదవ్, వినీత్, చంద్రశేఖర్ యాదవ్, కట్టు బడి తానీషా, కృష్ణవేణి, ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మల్లెల వేణు, జావీద్, అనిల్కుమార్, గౌడ్, భారతి, శోభ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            నియాన్ సూపర్ సెంచరీ
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర, పాండిచ్చేరి జట్ల మధ్య అండర్ – 23 సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ శుక్రవారం అనంత క్రీడాగ్రామంలోని ప్రధాన మైదానంలో ప్రారంభమైంది. బీసీసీఐ నూతన నిబంధనల మేరకు టాస్ లేకుండా అతిథి జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాండిచ్చేరి జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాండిచ్చేరి ఓపెనర్లుగా కెప్టెన్ నియాన్ కంగయాన్, రాఘవన్ బరిలో దిగారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికి 12 పరుగుల స్కోర్ వద్ద రాఘవన్(3)ను సుమిత్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం మొదటి వికెట్ కింద వచ్చిన ఆర్ జశ్వంత్, నియాన్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జశ్వంత్ శ్రీరాం(26)ను కామిల్ క్లీన్బౌల్డ్ చేశాడు. అనంతరం నితిన్ ప్రణవ్, నియాన్ వికెట్ కాపాడుకుంటూ స్కోర్ వేగాన్ని పెంచారు. వీరిద్దరూ అవకాశం దొరికినప్పుడల్లా అద్భుతమైన షాట్లతో బంతిని బౌండరీలు దాటిస్తూ వీక్షకులను అలరించారు. 119 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి బాటలు వేశారు. ఈ క్రమంలో కెప్టెన్ నియాన్ సెంచరీ సాధించాడు. నితిన్ ప్రణవ్ 128 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. 190 పరుగుల వద్ద మూడో వికెట్ను పాండిచ్చేరి కోల్పోయింది. ఇక కెప్టెన్ నియాన్ దూకుడు పెంచుతూ 257 బంతుల్లో 21 బౌండరీల సహాయంతో 131 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఆట ముగిసే సమయానికి మరో బ్యాటర్ ఫృథీరాజన్ ఖన్నా 29 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో సుమిత్, కామిల్, హేమంత్, ఆదిత్యరెడ్డిలు చెరో వికెట్ తీసుకున్నారు. - 
      
                   
                               
                   
            ● నేత్రపర్వంగా తెప్పోత్సవం
శింగనమల: కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శింగనమల రంగరాయల చెరువులో ఆదివారం తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు గొల్లకొండ వేంకటరమణస్వామి, ఆత్మ సీతారామలక్ష్మణలు, పార్వతీపరమేశ్వరుడు, వాసవీమాత, ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా చెరువు వద్దకు చేర్చారు. సాయంత్రం 5.30 గంటలకు పూజలు నిర్వహించి, మత్స్యకారులు ఏర్పాటు చేసిన తెప్పపై ఉత్సవ మూర్తులను విహరింపజేస్తూ చెరువు మధ్యలోకి చేరుకున్న గంగపూజల అనంతరం తిరిగి ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా చెరువులో మహిళలు కార్తీక దీపాలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో ఉత్సవ మూర్తులను ఘనంగా ఊరేగించారు. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ,, మండల అధికారులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            అవినీతి ఖజానా
అనంతపురం అర్బన్: కొందరు ఉద్యోగుల కమీషన్ల కక్కుర్తి ఖజానా శాఖ పరువు తీస్తోంది. అనైక్యత.. విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటూ బజారుకెక్కారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో పలువురు అధికారులు, సిబ్బంది అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడి నుంచి బిల్లులకు మోక్షం కలగాలంటే ఉద్యోగుల చేయి తడిపితేనే ఫైలు ముందుకు కదులుతుంది. లేదంటే ఏదో ఒక కొర్రీ వేస్తూ ముప్పుతిప్పలు పెడతారు. రిటైర్డు ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు మరొకరి గురించి చెడుగా ప్రచారం చేసుకుంటుండటం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. అధికారులను, ఉద్యోగులను గుప్పిట్లో పెట్టుకునేందుకు... తమ మాట వినని వారిపై ఉన్నతాధికారులకు పిటిషన్లు పంపే సంస్కృతికి దిగడం చర్చనీయాంశంగా మారింది. రూటే సప‘రేటు’.. ఖజానా శాఖలో ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బంది రూటే సప‘రేటు’గా ఉంటోంది. ఇక్కడ ముడుపుల దందాకు ఆకాశమే హద్దుగా సాగుతోందనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బిల్లులకు పర్సంటేజీ ముట్టచెప్పకపోతే చుక్కలు చూపిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఒక్క రోజులో పాసయ్యే బిల్లును వారం పదిరోజులు కాలయాపన చేయడం.. సరిగా లేవంటూ కొర్రీలు వేస్తూ వెనక్కు పంపడం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చుక్కలే! రిటైర్డ్ ఉద్యోగులకు ఖజానా శాఖ సిబ్బంది కొందరు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు కమ్యుటేషన్, గ్రాట్యుటీ ప్రభుత్వం నుంచి మంజూరవుతుంది. వాటి బిల్లులను పాస్ చేయించుకునేందుకు విశ్రాంత ఉద్యోగులు ఖజానా కార్యాలయం, ఇక్కడి సిబ్బంది చుట్టూ ‘అవిశ్రాంతంగా’ తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ముడుపులు ముట్టజెప్పి పనిచేయించుకోవాల్సి వస్తోందని పలువురు వాపోయారు. ఇక నాడ్రాయల్ సర్టిఫికెట్ తీసుకునేందుకు చేతులు తడాపాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందారు. డబ్బులు ఇవ్వకపోతే బిల్లులకు కొర్రీ తప్పదంటున్నారు. ఉద్యోగాల పేరిట నయా దందా.. ఇవన్నీ ఒక ఎత్తయితే జిల్లా ఖజానా కాార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి నయా దందాకు తెరతీశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆ శాఖ ఉద్యోగుల్లోనే చర్చించుకుంటున్నారు. వసూలు తంతు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. వ్యవహారం బయటకు రావడంతో అప్రమత్తమైన సదరు ఉద్యోగి.. తనస్థాయిలో ‘సర్దుబాటు’కు ప్రయత్నాలు చేసుకుంటున్నాడని సమాచారం. అవినీతిలో ఆకాశమే హద్దు.. ఉద్యోగుల మధ్య విభేదాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కాసులిస్తేనే బిల్లులు ముందుకు - 
      
                    
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. మండల కేంద్రాలైన రాప్తాడు, కనగానపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఇక పల్లె ప్రాంతాలకు వెళ్లే రహదారులు దయనీయంగా తయారయ్యాయి. ఒకట్రెండు చోట్ల రోడ్లు వేసి ... నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి చేశామని టీడీపీ నేతలు గొప్పలకు పోతున్నారు తప్పితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రం సమీపంలోని కక్కలపల్లి, కాటికానికాలువ, టమాట మండీ ప్రాంతాల్లో రాకపోకలు సాగించడం ప్రాణసంకటంగా మారుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం - 
      
                   
                               
                   
            చీనీలో కలుపు నివారణకు ‘వీడ్మ్యాట్’
అనంతపురం అగ్రికల్చర్: చీనీలో కలుపును సమర్థవంతంగా అరికట్టేందుకు వీలుగా ‘వీడ్మ్యాట్’ను అందుబాటులోకి తెచ్చినట్లు ఉద్యానశాఖ కమిషనరేట్ జేడీ దేవమునిరెడ్డి, డీడీహెచ్ డి.ఉమాదేవి తెలిపారు. వీటిని రైతులకు రాయితీ కింద ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో కలుపు నివారణకు నిషేధిత మందులతో పాటు మరికొన్ని ప్రమాదకరమైన గడ్డి మందులు సిఫారసు చేస్తుండటం వల్ల చీనీ చెట్ల జీవితకాలం తగ్గిపోతోందని, అలాగే దిగుబడులు సైతం తగ్గి, అక్కడక్కడ చెట్లు ఎండిపోతున్నాయన్నారు. ఈ విషయాన్ని ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో వీడ్మ్యాట్ వాడకంతో కలుపు రాకుండా నివారించుకోవడంతో పాటు తేమశాతం కూడా పెరుగుతుందన్నారు. అలాగే జంభేరి అంట్లు కాకుండా రంగపూర్ రకం అంట్లు కలిగిన చీనీ మొక్కలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామన్నారు. ఏఈఓల సంఘం నూతన కమిటీ ఎంపిక అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాల మురళీకృష్ణ ఎంపికయ్యారు. ఆదివారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఏఈఓల సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా బాల మురళీక్రిష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆదినారాయణ, కోశాధికారిగా శ్వేత, సహాధ్యక్షులుగా ఎన్.ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా జోత్స్న, సుజిత, దిలీప్కుమార్, సెక్రటరీలుగా మనోజ్కుమార్, భరత్రాజ్, భాగ్యశ్రీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామన్న, పబ్లిక్ సెక్రటరీగా మణికంఠకుమార్, మరికొందరిని ఈసీ మెంబర్లుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ నాయకులు నరసింహ, అశోక్, ఏఈఓలు గంగులయ్య, శ్రీనివాసరావు, రాము తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మచ్చు కత్తితో టీడీపీ నేత దాడి
శెట్టూరు: స్థానిక వైఎస్సార్సీపీ నేత రంగనాథశెట్టి కుమారుడు రవితేజశెట్టి (సాఫ్ట్వేర్ ఉద్యోగి)పై టీడీపీ నాయకుడు సురేష్ యాదవ్ మచ్చుకత్తితో దాడి చేశాడు. బాధితులు తెలిపిన మేరకు...నెల రోజుల క్రితం అయ్యగార్లపల్లి గ్రామానికి చెందిన సురేష్యాదవ్ తన అమ్మ చంద్రమ్మ పేరున ఉన్న రెండు ఎకరాల పొలాన్ని రవితేజ తల్లి శైలజకు రూ.7 లక్షలతో విక్రయించి ఆగస్టులో రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్రస్తుతం ఆ భూమి విషయంగా సురేష్ యాదవ్ తిరగబడ్డాడు. రూ. 4 లక్షలు ఇస్తాను భూమి తిరిగి ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. అయితే రూ.7 లక్షలు తిరిగి ఇస్తే భూమి తిరిగి ఇస్తామని రవితేజ చెప్పినా సురేష్యాదవ్ వినకుండా దౌర్జన్యానికి దిగాడు. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బు ఇవ్వలేదంటూ కళ్యాణదుర్గం రూరల్ సీఐకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. వాస్తవం తెలియని సీఐ ఇద్దరినీ స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు. తాము డబ్బు ముట్టజెప్పినట్లు ఆధారాలను రవితేజ వాళ్లు చూపించారు. అధికారం అండతో ఏదో చేద్దామని ప్రయత్నించిన సురేష్ యాదవ్కు భంగపాటు ఎదురుకావడంతో అంతు చూస్తానని ఆ సమయంలోనే బెదిరించాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రవితేజ కుటుంబసభ్యులు తిరుపతికి వెళ్లి శనివారం ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సురేష్ యాదవ్ అదే రోజు రాత్రి మచ్చుకత్తితో రవితేజ వాళ్ల ఇంట్లోకి చొరబడి సోఫాపై కూర్చొని ఉన్న రవితేజపై దాడి చేశాడు. ఆ సమయంలో రవితేజ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పంది. చేతిపై, ఛాతిపై లోతైన గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోబోయిన శైలజ కూడా స్వల్ప గాయాలతో బయటపడింది. క్షతగాత్రులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంభూపాల్ తెలిపారు. కాగా, దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడు, ఎంపీపీ సోమనాథరెడ్డి, కన్వీనర్ ఎం.ఎస్ రాయుడు, నాయకులు హరినాథరెడ్డి, లింగప్ప తదితరులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. - 
      
                   
                               
                   
            విద్యుత్ సమస్యలపై నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యలపై ఆ శాఖ సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా వినియోగదారులు సోమవారం ఉదయం 10 నుండి 12గంటల మధ్య 89777 16661, 91333 31912కు కాల్ చేసి నేరుగా సీఎండీ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఉత్కంఠగా రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలు ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 69వ రాష్ట్ర స్థాయి సెపక్తక్రా అండర్–14, 17 బాలబాలికల పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఆల్ఇండియా సెపక్తక్రా ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ పరిశీలకుడు రమేష్ ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి 280 మంది బాల, బాలికలు హాజరయ్యారు. రాత్రి ప్లడ్లైట్ల వెలుగులో పోటీలు ఉత్కంఠగా సాగాయి. టోర్నీ పరిశీలకులుగా సీనియర్ పీడీ మారుతీప్రసాద్, పుల్తా రాఘవేంద్ర వ్యవహరించారు. - 
      
                   
                                                     
                   
            తాడిపత్రిలో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు
అనంతపురం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈరోజు(ఆదివారం, నవంబర్ 2వ తేదీ) తాడిపత్రిలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఇక్కడ చేయొద్దంటూ టీడీపీకి చెందిన జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు సైతం దిగారు. జేసీ వర్గీయులు చేసిన దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా తాడిపత్రిలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జేసీ వర్గీయులు అడ్డుకోవడమే కాకుండా దాడులకు దిగారు. ఇక్కడకు ఎవరూ రావొద్దంటూ నిరంకుశ పాలనను గుర్తు చేసిన జేసీ వర్గీయులు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. - 
      
                   
                                                     
                   
            కూటమి సర్కారుతో అన్యాయం.. టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం
సాక్షి,అనంతపురం: కల్యాణ దుర్గలో టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. కూటమి సర్కార్ తనని వేధిస్తోందంటూ తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.కూటమి సర్కారు తనకు కుటుంబానికి అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ కార్యకర్త శివకుమార్, తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు బాధితుణ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శివకుమార్కు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. ఓ కేసులో కూటమి నేతలు తన కుటుంబాన్ని అక్రమంగా ఇరికిస్తున్నారని శివకుమార్ తన సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేశాడు. - 
      
                   
                               
                   
            రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
కళ్యాణదుర్గం రూరల్: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందాడు. ఇదే ఘటనలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల తెలిపిన మేరకు... పాతచెరువు గ్రామంలో నివాసం ఉండే వన్నూరస్వామి తన కుమారుడు ప్రజ్వల్ (6)తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై గోళ్ల గ్రామం వైపు బయల్దేరాడు. గోళ్ల సమీపంలో రాగానే అనంతపురం నుంచి వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. బైక్పై వస్తున్న తండ్రీ కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో వారిని స్థానిక సీహెచ్సీకి చేర్చారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడండో అందులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజ్వల్ (6)మృతి చెందాడు. రూరల్ పోలీసుల సంఘన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. స్పందించని 108 వాహనం : రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ ఎంత సేపటికీ రాలేదు. చేసేది లేక ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ‘తపాలా’ ఆధ్వర్యంలో ఉత్తర రచన పోటీలు అనంతపురం సిటీ: తపాలా శాఖ ఆధ్వర్యంలో ఉత్తర రచన (లెటర్ రైటింగ్) పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ అనంతపురం డివిజన్ సూపరింటెండెంట్ అమర్నాథ్ శనివారం తెలిపారు. ఇందులో భాగంగా ‘లెటర్ టు మై రోల్ మోడల్’ అనే అంశంపై నిర్వహించే పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. పోటీలు 18 ఏళ్లలోపు వారికి ఒక విభాగం, 18 ఏళ్లు పైబడిన వారికి మరొక విభాగం కింద ఉంటాయన్నారు. ప్రతి కేటగిరీలో రెండు విభాగాలలో ఉత్తర రచన పోటీలు ఉంటాయని తెలిపారు. ఇన్లాండ్ లెటర్ కార్డ్ కేటగిరి–500 పదాలలోపు ఉండాలి. ఎన్వలప్ కేటగిరి–1000 పదాలకు మించకుండా రాయాలని స్పష్టం చేశారు. చేతితో రాసిన ఉత్తరం మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు. తెలుగు, హిందీ, ఆంగ్లంలో రాసిన ఉత్తరాలు డిసెంబర్ 25లోగా పంపాలని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలు ఉంటుందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఉంటుందని ఆయన తెలిపారు. చేతి రాతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే.. సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాల కాలంలో ఉత్తర రచన సంప్రదాయం మరుగున పడిపోతోందని తపాలా సూపరింటెండెంట్ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత, ప్రజల్లో ఉత్తర రచనపై ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించతలపెట్టినట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవలని కోరారు. హెచ్చెల్సీలో కొట్టుకుపోయి బాలుడి మృతి పెద్దవడుగూరు: పొలం నుంచి ఇంటికి బయల్దేరిన బాలుడు మార్గమధ్యంలోని హెచ్చెల్సీని దాటే క్రమంలో ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. బుర్నాకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు, శశికళ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. 12 ఏళ్ల క్రితం రామాంజనేయులు మృతి చెందాడు. అప్పటి నుంచి శశికళ వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. కుమార్తె ఇంటర్మీడియెట్, కుమారుడు పదో తరగతి చదువుతున్నారు. కుమారుడు పృధ్వీరాజ్ శనివారం పాఠశాలకు వెళ్లలేదు. తాత పొలంలో వేరుశనగ కట్టెను మిషన్తో నూర్పిడి చేస్తున్నారని, అక్కడికి బయల్దేరాడు. మార్గమధ్యంలో హెచ్చెల్సీలో దిగి అవతలి పొలం వైపునకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో నీటిలోకి దిగిన పృధ్వీరాజ్ ప్రవాహ ఉధృతికి పట్టుతప్పి కిందపడి కొట్టుకుపోయాడు. సమీపంలోని బ్రిడ్జి వద్ద సుడిగుండంలో చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు బాలుడిని బయటకు తీసి పెద్దవడుగూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీరాజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. - 
      
                   
                               
                   
            ఇదేనా రైతు ప్రభుత్వమంటే?
జూన్, జూలైలో వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్లో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి భారీగా పడిపోయింది. ఆగస్టులో వర్షం కురి సినా రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం జిల్లాలో అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలి. ఎమ్మెల్యేలు కూడా స్పందించి రైతులకు చేయూతనందించాలి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలి. రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం కాదు చేతల్లో చూపాలి. – ఆర్. చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి - 
      
                   
                               
                   
            ఆలయంలో అపచారం
● నార్పల మారెమ్మ గుడిలో మందుబాబుల హల్చల్ ● ఆలయంలోనే మద్యం తాగి, అమ్మవారి విగ్రహం పగులగొట్టిన వైనంశింగనమల(నార్పల):నార్పల మండల కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో అపచారం జరిగింది. శుక్రవారం రాత్రి మందుబాబులు మారెమ్మ ఆలయ తాళం పగులగొట్టి, గుడిలోకి వెళ్లి మారెమ్మ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారు. అక్కడే మద్యం సేవించారు. వస్తువులు చెల్లాచెదురుగా పడేశారు. అనంతరం హుండీని ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాగర్ శనివారం మారెమ్మ గుడిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. బెంబేలెత్తుతున్న ప్రజలు.. నార్పలలో ఇటీవల మందుబాబుల ఆగడాలు పెరిగిపోయాయి. బెల్టుషాపులు విచ్చలవిడిగా ఏర్పాటు కావడంతో పూటుగా మద్యం తాగి అకృత్యాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో మహిళలపై వేధింపులకు దిగుతున్నారు. మద్యం తాగి చోరీలకు సైతం పాల్పడుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత శింగనమల నియోజకవర్గంలో శాంతిభద్రతలు క్షీణించాయి. అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయి. ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు వెలిశాయి. నార్పలలో వరుస సంఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆకతాయిలు మారెమ్మ గుడిలోనే మద్యం తాగడం మరీ దారుణం. ఎకై ్సజ్ శాఖ, పోలీస్ వ్యవస్థ విఫలమయ్యాయి. –నార్పల సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి - 
      
                   
                               
                   
            పారదర్శకంగా పింఛన్ల పంపిణీ
● కలెక్టర్ ఆనంద్ రాప్తాడురూరల్/అనంతపురం సిటీ: అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఓ .ఆనంద్ ఆదేశించారు. శనివారం అనంతపురం రూరల్ మండలం కురుగుంట వైఎస్సార్ కాలనీలో పలువురికి ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 2,97,363 మంది లబ్ధిదారులకు సుమారు రూ.124.84 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. పలువురు కాలనీవాసులు కలెక్టర్ను కలిసి డ్రైనేజీ పనులు చేపట్టేలా చూడాలని, రోడ్ల వెడల్పు చేయించాలని, కాలనీలో నూతన రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరగా.. పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శైలజ, ఎంపీడీఓ దివాకర్, రూరల్ తహసీల్దార్ మోహన్ కుమార్, పంచాయతీ సెక్రటరీ సర్దార్వలి పాల్గొన్నారు. పాత రోజులు గుర్తొస్తున్నాయి.. ‘జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో విద్యార్థులు పాల్గొనడం హర్షణీయం. నేను కూడా విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్ నిర్వహించే ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని సేవలందించా. మిమ్మల్ని చూడగానే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కురుగుంట గ్రామంలో ఆర్ట్స్ కళాశాల యూనిట్–2, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు సుంకర రమేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విష్ణుప్రియ, కాలనీ నాయకులు నారాయణస్వామి, కుమార్, రంజిత్ కుమార్ పాల్గొన్నారు. ఎర్రమట్టి మాఫియాపై పోలీసుల చర్యలు అనంతపురం: ఎట్టకేలకు ఎర్రమట్టి మాఫియాపై పోలీసులు చర్యలకు ఉప క్రమించారు. బుక్కరాయ సముద్రం మండలం పసలూరు గ్రామంలోని జగనన్న లే అవుట్లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎర్రమట్టి మాఫియాపై ‘సాక్షి’లో ఇటీవల ‘అమ్మ అభయం.. తమ్ముళ్ల దారుణం’ శీర్షికన కథనం వెలువడింది. శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా యథేచ్ఛగా జరుగుతున్న సహజ వనరుల లూటీని కూలంకుషంగా వివరించడంతో పోలీసు అధికారులు స్పందించారు. బుక్కరాయ సముద్రం మండలంలో 17 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, 3 జేసీబీలు, నాలుగు హిటాచీలను స్వాధీనం చేసుకున్నారు. రూ.2,64,991 జరిమానా విధించారు. అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తే చర్యలు తప్పవని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. - 
      
                   
                               
                   
            1.50 లక్షల మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతులు
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు మేలు జరిగేలా ఈ ఏడాది జిల్లా నుంచి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల అరటి విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఉద్యానశాఖ కమిషనరేట్ జేడీ దేవమునిరెడ్డి ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీహెచ్ డి.ఉమాదేవి, ఏడీహెచ్ దేవానంద్తో కలిసి హెచ్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగులో ఉన్నందున.. అందులో 1,500 హెక్టార్ల తోటల నుంచి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన అరటి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్పొరేట్ కంపెనీలు, రైతు ఉత్పత్తి సంఘాల సహకారంతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పద్ధతులు పాటించి నాణ్యమైన అరటి పండించేలా ప్రోత్సహించాలన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ అమలు చేసే ఎఫ్పీఓలకు హెక్టారుకు రూ.25 వేలు రాయితీ వర్తింపజేస్తామని తెలిపారు. తాడిపత్రి నుంచి ఏసీ కంటైనర్ వ్యాగన్ల ద్వారా నేరుగా విదేశాలకు అరటి ఎగుమతులు జరిగేలా చూడాలన్నారు. తద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. భవిష్యత్తులో ఎగుమతులు మరింత పెరిగేలా కక్కలపల్లి టమాటా మండీ మాదిరిగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో అరటి కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తే మార్కెటింగ్ సదుపాయం పెరిగి రైతులకు లాభదాయకంగా మారుతుందని తెలిపారు. డిసెంబర్ నుంచి అరటి ఎగుమతులు మొదలు పెట్టడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం నార్పల మండలంలో క్షేత్రస్థాయి ప్రదర్శన కింద అరటి తోటలను పరిశీలించారు. - 
      
                   
                               
                   
            ఉపాధిని ఊడ్చేస్తున్నారు!
● ఆత్మకూరు మండలం వడ్డుపల్లి పంచాయతీలో చేపడుతున్న ఉపాధి పనుల్లో 10 మంది శ్రామికుల ఫొటోను 14 మస్టర్లకు నమోదు చేశారు. శ్రామికులను అటు ఇటుగా మార్చి యాప్లో అప్లోడ్ చేశారు. ఈ రెండే కాదు.. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు వరంగా మారింది. పనులకు రాని వారిని సైతం వచ్చినట్లు మస్టర్లలో నమోదు చేస్తూ ఉపాధి నిధులను కొల్లగొట్టేస్తున్నారు. కూలీల హాజరును పెద్ద ఎత్తున నమోదు చేస్తూ వారికి వచ్చే బిల్లుల్లో 50 శాతం చొప్పున తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులు కూడా మస్టర్లను పరిశీలించకుండానే ఆమోదం తెలుపుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ‘పచ్చ’ నేతల అండ జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూటమి నేతల అండ మెండుగా ఉండడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలోని చాలా గ్రామ పంచాయతీల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులను సైతం లెక్కచేయని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే సాహసం కూడా అధికారులు చేయడం లేదని తెలిసింది. ఇటీవల బుక్కరాయసముద్రం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే అండగా ఉన్నారంటూ టీడీపీ నాయకులే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మస్టర్లు పరిశీలిస్తే అక్రమాలు బయటికి.. ఉపాధి హామీ పథకంలో రోజువారీగా పనులకు హాజరైన శ్రామికుల పేర్లను, ఫొటోలను ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేస్తారు. వాటిని పరిశీలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న మోసాలు, అక్రమాలు ఇట్టే బయటపడతాయని పలువురు చెబుతున్నారు. అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. చెన్నంపల్లిలో ఒకే ఫొటోను పలు మస్టర్లలో నమోదు చేసిన దృశ్యాలు పనులకు వచ్చేది తక్కువ.. మస్టర్లలో చూపేది ఎక్కువ ఒకే ఫొటోను మార్చి మార్చి నమోదు కూటమి నేతల అండదండలతో కొల్లగొడుతున్న వైనం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో అక్టోబర్ 11న చేపట్టిన ఉపాధి పనులకు 209 మంది శ్రామికులు హాజరైనట్లు మస్టర్లలో నమోదు చేశారు. ఎన్ఎంఎంఎస్ యాప్లో ఒకే ఫొటోను పలుమార్లు అప్లోడ్ చేశారు. 20 మంది కూలీల ఫొటోను అటు ఇటుగా మార్చి 22 మస్టర్లకు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు ఈ విషయాన్ని గుర్తించినా స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్పై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్కు అధికార పార్టీ నాయకుల మద్దతు మెండుగా ఉండడంతోనే అధికారులు మిన్నకుండిపోతున్నట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేస్తున్న మస్టర్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తాం. ఒకే ఫొటోను మస్టర్లలో నమోదు చేసి ఉపాధి నిధులను పక్కదారి పట్టిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. – సలీం బాషా, డ్వామా పీడీ - 
      
                   
                               
                   
            ఎస్ఆర్ఐటీ అధ్యాపకులకు జాతీయ పురస్కారాలు
బుక్కరాయసముద్రం: ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో పని చేస్తున్న ఇద్దరు అధ్యాపకులకు జాతీయస్థాయి పురస్కారాలు లభించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బాలక్రిష్ణ తెలిపారు. కళాశాలలో అధ్యాపకులు డాక్టర్ రంజిత్రెడ్డి, చిన్న పుల్లయ్య పరిశోధన, విద్యా రంగాలలో అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఎక్సలెన్స్ అవార్డులు–2025 (5వ ఎడిషన్) పురస్కారాలు ప్రదానం చేశారన్నారు. బ్రైనోవిషన్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారన్నారు. దేవ్యాప్తంగా మూడు వేల నామినేషన్లలో 1000 విశ్వ విద్యాలయాలు పాల్గొనగా.. 400 అవార్డులు ఉన్న ఈ పోటీల్లో ఎస్ఆర్ఐటీ గౌరవం దక్కించుకుందన్నారు. డాక్టర్ రంజిత్రెడ్డికి సాధ్య ఆచార్య పురస్కారం, చిన్న పుల్లయ్యకు జేష్ట ఆచార్య పురస్కారం అందజేశారన్నారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది. - 
      
                   
                               
                   
            రైళ్లలో చోరీలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి
గుంతకల్లు: రైలులో ప్రయాణిస్తున్నపుడు తమ విలువైన వస్తువులు చోరీకి గురైనా, పోగుట్టుకున్నా ఇకపై ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదు చేయాలని గుంతకల్లు జీఆర్పీ డీఎస్పీ శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. శనివారం డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో ఎన్ఐసీ జిల్లా కోఆర్డినేటర్ అభిలాష్రెడ్డి ఆధ్వర్యంలో ఈ–ఆఫీస్ (పేపర్ లేస్)పై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. అందులో భాగంగానే పేపర్ లేస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదునూ ఆన్లైన్ ద్వారానే నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జీఆర్పీ సీఐలు అజేయ్కుమార్, హరున్బాషా, సిబ్బంది శర్మాస్ పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మాతృమరణాలకు బాధ్యులపై చర్యలు తీసుకోండి
● కలెక్టర్ ఓ.ఆనంద్ అనంతపురం అర్బన్: మాతృమరణాలకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మాతాశిశు మరణాలపై సమీక్షించారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట–2, రాయదుర్గం–1, కొర్రపాడు–1, కొర్రపాడు యూపీహెచ్సీలో జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృ మరణం జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని డీఎంహెచ్ఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ ఓదార్చి ఘటనపై చర్చించి నివేదికను తయారు చేసి సభ్యుల ద్వారా సంతకం తీసుకుని తనకు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్షించారు. కొర్రపాడు పరిధిలోని చదుల్ల గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ మాతృమరణం జరిగిందని, ఇందుకు బాధ్యురాలైన ఆశావర్కర్ను సర్వీసు నుంచి తొలగించి ఆమైపె ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. యాడికి మండలం వీరన్నపల్లికి చెందిన హరిత అనే మహిళ మాతృ మరణానికి కారణమైన ఆర్ఎంపీపై ఎఫ్ఐరా నమోదు చేయాలని, ఆ గ్రామ ఆశా వర్కర్, ఏఎన్ఎంపై కూడా శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కురుగుంట గ్రామంలో మృదుల అనే మహిళ మాతృమరణానికి సంబంధించి వైద్య ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులను బాధ్యులను చేస్తూ మెమో జారీ చేయాలని ఆదేశించారు. ‘‘ప్రజలకు మెరుగైన వైద్యసేవలు సత్వరం అందించే లక్ష్యంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాలి వస్తుందని హెచ్చరించారు. - 
      
                   
                               
                   
            చెస్లో గుంతకల్లు విద్యార్థికి రికార్డ్స్థాయి రేటింగ్
గుంతకల్లు: ఇటీవల కర్నూలులో నిర్వహించిన చెస్ టోర్నీలో ప్రతిభ చాటిన గుంతకల్లు విద్యార్థి సాయి సౌరిస్ అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు కోచ్లు అనిల్కుమార్, రామారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండీ బజార్లో నివాసముంటున్న వంకదారు వీరేంద్ర, సౌమ్య దంపతుల కుమారుడు సాయి సౌరిస్ రోటరీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నీలో పాల్గొని ప్రతభ కనబరచడంతో రాపిడ్ విభాగంలో 1440 రేటింగ్, బ్లిట్జ్ విభాగంలో 1651 రేటింగ్ సాధించి రికార్డు నెలకొల్పోనట్లు వివరించారు. ఇంత వరకు గుంతకల్లు చదరంగ క్రీడల్లో ఇదే అత్యుత్తమ రికార్డు అన్నారు. దీంతో విద్యార్థి సాయి సౌరిస్ను ఉపాధ్యాయులుతోపాటు పలువురు అభినందించారు. స్కూటీ డిక్కీలో రూ.6 లక్షల చోరీ గుత్తి: స్కూటీ డిక్కీలో భద్రపరచిన రూ.6లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. వివరాల్లోకెళితే... కాసేపల్లికి చెందిన ఓబులేష్రెడ్డి గుత్తిలోని బీసీ కాలనీలో నివాసముంటున్నాడు. అనంతపురం రోడ్డులో కారు వాటర్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కాసేపల్లిలో ఉన్న పొలం అమ్మాడు. ఆ డబ్బును ఇంటిలో ఉంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆ డబ్బును బాకీలు ఉన్న వారికి కట్టడానికి స్కూటీ డిక్కీలో పెట్టి అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లాడు. స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేసరికి స్కూటీ డిక్కీ తెరిచి ఉంది. అనుమానం వచ్చి పరిశీలించగా అందులో నగదు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు. నేటి నుంచి రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలు ఉరవకొండ: రాష్ట్రస్థాయి సెపక్తక్రా స్కూల్ గేమ్స్ పోటీలు ఉరవకొండలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సెపక్తక్రా క్రీడా సంఘం చైర్మన్ సప్తగిరి మల్లికార్జున, ప్రెసిడెంట్ షాహీన్, పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, సీనియర్ పీడీ మారుతీ ప్రసాద్, పుల్లా రాఘవేంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–14, అండర్–17 పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి బాలబాలికలు హాజరవుతున్నారన్నారు. క్రీడాకారులు, కోచ్లకు భోజన వసతితో పాటు వారికి అన్ని వసతులు కల్పించామన్నారు. రాత్రి ఫ్లడ్ లైట్ల మధ్య కూడా మ్యాచ్లు కొనసాగుతాయన్నారు. మ్యాచ్లు తిలకించేందుకు ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. - 
      
                   
                               
                   
            ప్రాణాన్ని బలిగొన్న ఓవర్టేక్
● మరో ముగ్గురికి తీవ్రగాయాలు గుంతకల్లు రూరల్: టిప్పర్ డ్రైవర్ ఓవర్టేక్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ముగ్గురిని తీవ్రగాయాలపాలు చేసింది. తిమ్మాపురం గ్రామం వద్ద జరిగిన ఈ ఘటన కూలీల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. గుంతకల్లు రూరల్ ఎస్ఐ రాఘవేంద్రప్ప, క్షతగాత్రులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దంచర్ల గ్రామానికి చెందిన పది మంది వ్యవసాయ కూలీలు శనివారం తిమ్మాపురం– దోనిముక్కల గ్రామాల మధ్య గల రైతు రంగన్న పొలంలో కరివేపాకు పంట తొలగించేందుకు ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఆటోలో తిరుగుపయనమయ్యారు. అర కిలోమీటర్ దూరం ప్రయాణించగానే తిమ్మాపురం వద్ద వెనకాలే వస్తున్న టిప్పర్ వారి ఆటోను ఓవర్టేక్ చేసేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో ఎదురుగా గొర్రెల మంద రావడంతో టిప్పర్ డ్రైవర్ దానిని తప్పించేందుకు స్టీరింగ్ను కొద్దిగా ఆటోవైపు తిప్పాడు. ఆ సమయంలో టిప్పర్ ఎక్కడ తగులుతుందోనన్న భయంతో డ్రైవర్ జనార్దన్ ఆటోను పక్కకు తిప్పాడు. అంతే ఆదుపు తప్పిన ఆటో ఒక్కసారిగా బోల్తా పడి తిరిగి యథాస్థానంలో నిల్చుంది. ఆటోలో ఉన్న కూలీలందరూ ఎగిరిపడ్డారు. ప్రమాదంలో దంచర్ల గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న (45) అనే వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. రంగస్వామి, యల్లప్ప, రామాంజనేయులు అనే మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా మృతుడు పెద్ద పుల్లన్నకు భార్య సువర్ణ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద పుల్లన్న మరణవార్త విని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్ఐ రాఘవేంద్రప్ప పరిశీలించి, కేసు నమోదు చేశారు. - 
      
                   
                                                     
                   
            కొత్త పింఛన్ ఏదీ బాబూ..?
కదిరి ఎన్జీఓ కాలనీకి చెందిన జయమ్మ భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె వితంతు పింఛన్ కోసం స్థానిక సచివాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయానికి తిరుగుతూనే ఉంది. కానీ నేటికీ ఆమెకు పింఛన్ మంజూరు చేయలేదు. పెనుకొండకు చెందిన నరసమ్మకు 52 ఏళ్లు. బీసీ వర్గానికి చెందిన ఆమె...బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పడంతో ఇప్పుడు పింఛన్ కోసం స్థానిక సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు... ..కూటమి సర్కార్ ఏడాదిన్నర కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకపోవడంతో వేలాది మంది అర్హులు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ తిరుగుతూనే ఉన్నారు.కదిరి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా... కొత్త పింఛన్ మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లను తొలగిస్తోంది. దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ పొందుతున్న 10 వేల మందికిపైగా లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇందులో కొందరి పేర్లు పింఛన్ జాబితా నుంచి తొలగింది. పింఛన్ల వెబ్ సైట్ క్లోజ్.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా జనవరి, జూలై మాసాల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. 6 నెలల్లో వచ్చిన దరఖాస్తులను స్థానిక సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుడా..కాదా? అనే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించేవారు. ఆపై ఆన్లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) జరిపేవారు. ఆ తర్వాత అర్హులకు పింఛన్ మంజూరు చేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు సంబంధించిన వెబ్సైట్ను కూటమి ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసింది. దీంతో కనీసం దరఖాస్తు చేసుకునే వీలు కూడా లేకపోయింది. పైగా పింఛన్లు వెరిఫికేషన్ పేరుతో ఇప్పటికే ఎంతో మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. అందుకే జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబి్ధదారుల సంఖ్య ప్రతి నెలా తగ్గిపోతోంది. గత ప్రభుత్వంలో జిల్లాలో 2,74,839 మంది పింఛన్దారులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,63,173కు తగ్గింది. ప్రతినెలా పింఛన్ల కోతే.. జగన్ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా అర్హతే ప్రామాణికంగా వైఎస్సార్ పింఛన్ కానుక అందజేశారు. జిలాల్లో 2,74,839 మందికి వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతి నెలా రూ. 4,131.52 కోట్లు లబ్ధి చేకూరింది. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లలో కోత పెడుతోంది. సెపె్టంబర్ నెలలో జిల్లాలోని 2,64,384 మందికి పింఛన్ అందజేయగా.. అక్టోబర్లో ఆ సంఖ్య 2,63,987కు తగ్గింది. ఒకేనెల 397 మందిని పింఛన్ జాబితా నుంచి తొలగించారు. ఇక అక్టోబర్ నెలలో సుమారు 814 పింఛన్లు తగ్గించారు. ఇలా అర్హులను పింఛన్ జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు... పింఛన్ పంపిణీ పేరుతో జిల్లా పర్యటనకు వస్తుండటంపై బాధితులు పెదవి విరుస్తున్నారు. ‘‘మా పింఛన్లు పీకేసి పింఛన్లు పంపిణీ అని మా ఊరికే వస్తారా’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీ నెరవేర్చండి మాది బీసీ(బెస్త)సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు. రెండేళ్లు కావస్తున్నా... ఇంత వరకూ అతీ..గతీ లేదు. నాకిప్పుడు 58 ఏళ్లు. పింఛన్ కోసం ఎదురు చూస్తున్నా. అధికారులను అడిగితే చంద్రబాబునే అడుగు..అని అంటున్నారు. – జి.గోవిందు, ఉప్పార్లపల్లి, నల్లచెరువు మండలం - 
      
                   
                               
                   
            ఓసీల సంక్షేమాన్ని విస్మరిస్తే పతనం తప్పదు
● కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి అనంతపురం రూరల్: అగ్రవర్ణ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం అనంతపురంలోని లలిత కళాపరిషత్లో నిర్వహించిన ఓసీ విద్యార్థి యువజన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. ఓసీ వర్గాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక వేత్తల ద్వారానే ప్రభుత్వానికి అధిక శాతం పన్నులు వసూళ్లవుతున్నాయన్నారు. అయినా అగ్రవర్ణ పేదల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అగ్రవర్ణ పేదల సంక్షేమానికి జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీని సరళీకృతం చేయాలన్నారు. ఓసీ కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్థన్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ అర్హత టెట్ పరీక్షల్లో ఓసీలకు 90 మార్కుల నుంచి 75 మార్కులకు తగ్గించాలన్నారు. పోటీ పరీక్షలకు హజరయ్యే ఓసీ అభ్యర్థుల వయోపరిమితి సడలించాలని, ఓసీ విద్యార్థులకు సంక్షేమ హస్టళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజునాథ్చౌదరి, జిల్లా అధ్యక్షుడు మురారి రాము, కార్యదర్శి అల్లె మాధవరెడ్డి, నాయకులు తమ్ముల సూరి, జితేందర్రెడ్డి, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            అరాచకాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ఏరోజూ మాట్లాడని సీపీఐకి ఈరోజు పాపంపేట భూముల సమస్య గుర్తుకు వచ్చిందా అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాపంపేట ప్రాంతంలోని అదే శోత్రియం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా 14 ఇళ్లను కూల్చివేసినప్పుడు సీపీఐ ఎక్కడికి వెళ్లిందన్నారు. ఇదే నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్యను హత్య చేసినప్పుడు ఎక్కడకి వెళ్లారన్నారు. 14 ఏళ్ల దళిత బాలికను నెలల తరబడి పాశవికంగా అత్యాచారం చేస్తే సీపీఐ పార్టీ ఎక్కడికి పోయిందని నిలదీశారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడం ద్వారా ఇదే నియోజకవర్గంలో లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారిపోతుంటే ఏమైపోయారని నిలదీశారు. పాపంపేట భూముల కబ్జా వ్యవహారంతో ఈరోజు పరిటాల కోటలు బీటలు పారాయన్నారు. వారి గౌరవం మసకబారిందన్నారు. వారి నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో వారిపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు సీపీఐ నాయకులు వస్తున్నారా అనే అనుమానం వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు ఈ ప్రాంతంలో గతంలో చాలా ఎన్నికల్లో పరిటాల సునీతకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. తాను కమ్యూనిస్ట్ పార్టీని, సిద్ధాంతాలను గౌరవిస్తానని, అయితే సిద్ధాంతాలు లేని వ్యక్తులను గౌరవించలేనని స్పష్టం చేశారు. 14 ఇళ్లను కూల్చివేసిన రోజు బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. తాము కోర్టుకెళ్లి స్టే తెచ్చి స్థలాలను నిలబెట్టామన్నారు. కచ్చితంగా పాపంపేట భూములపై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. ఒక్క సెంటు భూమి జోలికి వచ్చినా తరిమితరిమి కొడతామని హెచ్చరించారు. అండగా నిలిచింది తోపుదుర్తి ప్రకాష్రెడ్డే 2019లో మా ఇళ్లను కూల్చి వేస్తామని అధికారులు వస్తే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అడ్డుకున్నారని విద్యారణ్యనగర్ ఇళ్ల కూల్చివేత బాధితులు తెలిపారు. ఐదేళ్ల పాటు ఒక ఇటుక కూడా తొలగించకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పాత ఆర్డర్లతో బలవంతంగా కూల్చివేశారన్నారు. తాము రోడ్డున పడితే ఎమ్మెల్యే గానీ, ఇతర అధికార పార్టీ నాయకులు గానీ కన్నెత్తి చూడలేదన్నారు. ఇళ్లు కూల్చేసినరోజు బీజేపీ, జనసేన, టీడీపీ, సీపీఐ ఎక్కడికిపోయాయన్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చొరవతోనే కోర్టులో స్టేటస్కో తెచ్చుకున్నామన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు బి.గోపాల్రెడ్డి, ఈశ్వరయ్య, మాదన్న, నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సందీప్యాదవ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 14 ఇళ్ల కూల్చివేత కనిపించలేదా? మజ్జిగ లింగమయ్యను హత్య చేసినపుడు ఎక్కడికి పోయారు? దళిత బాలికను పాశవికంగా అత్యాచారం చేస్తే ఏమైపోయారు? పాపంపేట ఉద్యమంలో పాలు పంచుకోవడానికి వస్తున్నారా.. పరిటాల సునీతపై వ్యతిరేకత తగ్గించడానికా? సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణను ప్రశ్నించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి - 
      
                   
                               
                   
            బొలెరో బోల్తా.. ఒకరి మృతి
కళ్యాణదుర్గం రూరల్/శెట్టూరు: మండలంలోని గోళ్ల గ్రామం వద్ద బొలెరో వాహనం బోల్తాపడి, వ్యవసాయ కూలీ రాజన్న(44) మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం ఉదయం పామిడి గ్రామం వద్ద పుచ్ఛకాయలను లోడు చేసుకుని ఏడుగురు కూలీలతో శెట్టూరు మండలానికి చెందిన బొలెరో వాహనం తిరుగు ప్రయాణమైంది. మార్గ మధ్యంలో గోళ్ల వద్దకు చేరుకోగానే టైరు పేలడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఘటనలో కూలీ రాజన్న అక్కడికక్కడే మృతి చెందాడు. శివకృష్ట, మంజు, శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కూలీలంతా శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజన్నకు భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజన్న మృతితో శెట్టూరు మండలం గొల్లలదొడ్డిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. - 
      
                   
                               
                   
            బాధ్యతలు విస్మరిస్తే చర్యలు
అనంతపురం అర్బన్: బాధ్యతలు విస్మరించినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ ఆనంద్ ఐడీసీఎస్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో అధికారులతో బాల్య వివాహ నిరోధక సమన్వయ కమిటీ సమావేశం, మిషన్ శక్తి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు సత్వరం మెరుగైన సేవలందించే ఐసీడీఎస్లో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పౌష్టికాహార లోపం కలిగిన వారి వివరాలు పక్కాగా ఉండాలన్నారు. వాస్తవ విరుద్ధంగా నివేదికలు ఇస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బరువు తక్కవకు సంబంధించి సివియర్ కేటగిరీలో ఐదు వేల మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. సివియర్ కండీషన్ కేసులను సూపర్వైజర్లు ప్రతి నెలా పర్యవేక్షించి, ఆ కేటగిరీ నుంచి బయటకు తేవాలన్నారు. పిల్లల ఎత్తు, బరువు ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలన్నారు. ఐసీడీఎస్లో జిల్లా వ్యాప్తంగా 36 వర్కర్, 68 హెల్పర్ మొత్తం 104 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. రోస్టర్ సక్రమంగా అమలు చేసి నాలుగు రోజుల్లోగా నివేదించాలన్నారు. నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పీడీ అరుణకుమారి, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, అధికారులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిరోధానికి చర్యలు జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బాల్యవిహాలు, అత్యాచారాలు, ఉమెన్ ట్రాఫికింగ్, గృహ హింస, వేధింపుల కేసులకు సంబంధించి వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ వేల్ఫేర్ కమిటీ, పోలీసులు నమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా లీగల్ అథారిటీ సర్వీస్ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, డీసీపీఓ మంజూనాథ్, ఇతర అఽధికారులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ అధికారులకు కలెక్టర్ హెచ్చరిక నివేదికలు పక్కాగా ఉండాలి అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆదేశం - 
      
                   
                               
                   
            పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
అనంతపురం అర్బన్/టౌన్: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని కృషి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్యతో కలిసి సర్కులర్ ఎకానమీ, వేస్ట్ రీసైకిలింగ్ పాలసీపై సిమెంట్ ప్లాంట్లు, స్టీల్ పరిశ్రమలు, టైర్ పైరోలిసిస్ యూనిట్లలో ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిలింగ్ యూనిట్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో రీసైకిలింగ్కు అన్ని చర్యలు చేపట్టామన్నారు. గ్రానైట్ వ్యర్థాలను రీసైకిల్ చేసి విలువ ఆధారిత ఆదాయవనరులుగా మార్చుకోవాలని చెప్పారు. భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. కాలుష్య నియంత్రణపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములవ్వాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి కిషోర్రెడ్డి, ఏఈ కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శైలజ, పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            పీఏబీఆర్కు తగ్గిన ఇన్ఫ్లో
కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు ఇన్ఫ్లో తగ్గింది. శుక్రవారం నాటికి రిజర్వాయర్లో 5.27 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. హెచ్చెల్సీ ద్వారా 150, జీడిపల్లి జలాశయం నుంచి 160 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తికి 985 క్యూసెక్కులు, తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, ధర్మవరం కుడికాలువకు లీకేజీ రూపంలో 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి రూపంలో 25 క్యూసెక్కుల చొప్పున అవుట్ఫ్లో ఉంది. నీటి మట్టం తగ్గడంతో 6వ గేటును బంద్ చేసి, 4వ గేటు ద్వారా 630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. - 
      
                   
                               
                   
            పటేల్ సేవలు స్ఫూర్తిదాయకం
అనంతపురం సెంట్రల్: దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎస్పీ జగదీష్ కొనియాడారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద జాతీయ ఏక్తా దినోత్సవాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. సువిశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ డీఎస్పీ వెంకటేశులు, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు ధరణికిశోర్, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్యాదవ్, రాజేంద్రనాథ్యాదవ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            నేత్రపర్వంగా కలశ ప్రతిష్టాపన
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం చేపట్టిన కలశ ప్రతిష్ట మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతోపాటు, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. శుక్రవారం వేకువజామునే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.10 గంటలకు ఆలయ ప్రధాన గోపురంతోపాటు, మిగిలిన నాలుగు రాజ గోపురాలపై రుత్వికుల మంత్రోచ్ఛారణల మధ్య కలశాలను ప్రతిష్టించారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఎం.విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, సిబ్బంది పర్యవేక్షించారు. - 
      
                   
                               
                   
            పీఏబీఆర్ సమీపంలోనే అక్రమ మైనింగ్
● అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ను కోరిన మాజీ ఎమ్మెల్యే విశ్వ అనంతపురం: కూడేరు మండల పరిధిలో పీఏబీఆర్కు ఆనుకుని ఉన్న గుట్టలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ను తక్షణమే నిలుపుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని చాంబర్లో కలెక్టర్ ఆనంద్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, పలు అంశాలపై చర్చించి, వినతిపత్రం అందజేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే అక్రమ మైనింగ్ నిరాటంకంగా జరుగుతోందన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే నల్లరాయి గ్రానైట్ను డోన్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీకి తరలించేశారన్నారు. పీఏబీఆర్ రెండు గుట్టల మధ్య ఉందన్నారు. పడమటి వైపు మిట్ట ప్రాంతం వరకు ఆనకట్ట కట్టారన్నారు. క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసిన కట్టడం మినహా తక్కిన భాగమంతా ఆనకట్టను రాతి కట్టడంతో పటిష్టపరిచారని తెలిపారు. తూర్పు వైపున ఆనకట్ట మాదిరిగా డ్యాంకు గుట్ట సపోర్ట్గా ఉందన్నారు. ఈ గుట్టలోనే విలువైన నల్లరాయి ఉందని చెప్పారు. డ్యాంకు సపోర్ట్గా ఉన్న ఈ గుట్టలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భూమిపై స్పష్టత ఇవ్వండి కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సర్వే నంబర్–93లో 136 ఎకరాల భూమి ఎవరికి చెందుతుందో పూర్వాపరాలు పరిశీలించి నిర్ధారణ చేయాలని విశ్వేశ్వరరెడ్డి కలెక్టర్ను కోరారు. శోత్రియందారులకు చెందిందా? లేక చెరువుకు సంబంధించినదా అనేది రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. శోత్రియంకు చెందిన 1800 ఎకరాల భూమిలో 1962 నెల్లూరు సెటిల్మెంట్ అధికారి సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎంత భూమిని భూ యజమానులకు అప్పగించారు.. ప్రభుత్వం ఆధీనంలో ఎంత ఉందో వెల్లడించాలన్నారు. లేకుంటే 136 ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతుందన్నారు. ఇటీవల ఈ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను ఉన్నపళంగా ఖాళీ చేయించారని గుర్తు చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్రెడ్డి, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అద్యక్షుడు రామచంద్రా రెడ్డి, ఎంపీటీసీ రమేష్ పాల్గొన్నారు. - 
      
                    
పిచ్చికుక్కదాడిలో నలుగురికి గాయాలు
పెద్దపప్పూరు: మండల కేంద్రం పెద్దపప్పూరులో శుక్రవారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓ ఏడాదిన్నర వయసున్న భవ్యశ్రీ చెవిని కొరికేసిన పిచ్చికుక్క.. అక్కడే ఉన్న చంద్ర, రామాంజులరెడ్డి, రామక్రిష్ణపై దాడిచేసి గాయపరిచింది. సంఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి బాధితులు వెళితే అక్కడ సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత తాడిపత్రి ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. స్థానికంగా ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోతే అత్యవసర సమయాల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీడీహెచ్ఓ లోకేష్కుమార్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ క్రీడలు విజయవంతం చేయాలి అనంతపురం అర్బన్: అనంతపురంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం శుక్రవారం స్థానిక కృష్ణకళామందిర్లోని రెవెన్యూ హోమ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా ఉత్సవాల బెలూన్ను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ స్టేడియంలో మూడు రోజులుపాటు జరగనున్న రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడల నిర్వహణకు, విజయవంతానికి జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దివాకర్రావు, సోమశేఖర్, తహసీల్దార్ మోహన్కుమార్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, హరిప్రసాద్రెడ్డి, రెవెన్యూ క్రెడిట్ సొసైటీ కోశాధికారి సంజీవరాయుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం మహిళ అధ్యక్షురాలు సురేఖరావు, నాయకులు రేఖ, పునీత్బాబు, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు. బెంగళూరులో జిల్లా రైతుల నిరసన కళ్యాణదుర్గం: ఆరుగాలం కష్టించి సాగు చేసిన కర్భూజా, కళింగర పంటను మార్కెట్కు తరలిస్తే పంటను అమ్మి సొమ్ము చేసుకున్న వ్యాపారి డబ్బు ఇవ్వకుండా మోసగించాడంటూ బెంగళూరులోని ఏఆర్ అన్వర్ మండీ వద్ద జిల్లా రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రంతో పాటు మడకశిర, హిందూపురం, కర్ణాటక రాష్ట్రం వైఎన్హెచ్ కోట, పావగడ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా మార్కెట్కు తరలించిన పంటకు సదరు మార్కెట్ మండీ యజమాని కాంతరాజ్ డబ్బు ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ రైతుల వద్ద పంట కొనుగోలు చేసిన వ్యాపారులు శ్రీరాములు, పాతిరెడ్డి, తిమ్మరాజు, తిమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగు నెలలకు గాను సుమారు రూ.కోటి వరకు మండీ యజమాని చెల్లించాల్సి ఉందన్నారు. తన వద్ద డబ్బు లేదని, ఒత్తిడి చేస్తే చనిపోతానంటూ బెదిరింపులకు దిగుతున్నాడంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ బెంగళూరు మార్కెట్ యార్డ్ కమిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. - 
      
                   
                               
                   
            ‘సర్దార్’ సేవలు నిత్య స్మరణీయం
● ఏక్తా ర్యాలీలో కలెక్టర్ ఆనంద్ అనంతపురం కల్చరల్: భారత తొలి రక్షణ శాఖ మంత్రిగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ అందించిన సేవలు నిత్య స్మరణీయమని కలెక్టర్ ఆనంద్ అన్నారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నగరంలో ఐక్యతా మార్చ్ ఘనంగా జరిగింది. యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద వందలాది మందితో సాగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. సర్దార్ వల్లభబాయ్ పటేల్ చొరవతోనే 565 సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయన్నారు. ఆయన అడుగుజాడల్లో యువత నడిచి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారత్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద అధికారులు ఘనంగా నివాళులర్పించారు. నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్ శిష్యబృందం శాసీ్త్రయ నృత్యనీరాజనాలర్పించింది. కార్యక్రమంలో మై భారత్ ప్రోగ్రాం ఇన్చార్జి గోవర్దన్ శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, ఆర్ట్స్కాలేజ్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి అజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రాయితీ పప్పుశనగకు స్పందన నిల్ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ సంయుక్తంగా ఆలస్యంగా చేపట్టిన రాయితీ పప్పుశనగ విత్తన పంపిణీకి రైతుల నుంచి స్పందన కనిపించడం లేదు. పప్పుశనగ సాగు చేసే నల్లరేగడి కలిగిన మండలాల్లో గురువారం ఆర్ఎస్కేలో రిజిష్ట్రేషన్లు మొదలు పెట్టారు. ఈ రెండు రోజుల్లో 160 క్వింటాళ్లకు 140 మంది వరకు రైతులు రిజిష్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం పుట్లూరు, ఉరవకొండ మండలాలకు 350 క్వింటాళ్లు విత్తనం సరఫరా చేసినట్లు తెలిపారు. గతేడాది 28 వేల క్వింటాళ్లు కేటాయించగా.. ఈసారి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. అలాగే గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇవ్వగా కూటమి సర్కారు 25 శాతానికి తగ్గించేసింది. బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకు... ప్రభుత్వం ప్రకటించిన ధరలకు పెద్దగా వ్యత్యాసం లేదని రైతులు చెబుతున్నారు. కనీసం అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ మొదలు పెట్టి ఉన్నా కొంత వరకు ప్రయోజనంగా ఉండేదని చెబుతున్నారు. నెల రోజుల ఆలస్యంగా విత్తన పంపిణీ మొదలు పెట్టడంతో సొంతంగా బయటినుంచి సమకూర్చుకున్నామని అంటున్నారు. న్యాయవాది నిత్య విద్యార్థే అనంతపురం: న్యాయవాది నిత్య విద్యార్థేనని, న్యాయశాస్త్రంపై బలమైన అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమరావు అన్నారు. అనంతపురంలోని విజయనగర లా కళాశాలలో శుకవ్రారం ‘గేట్వే సెలబ్రేషన్స్ న్యూ వేవ్ ’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, వృత్తిలో రాణించాలంటే నిరంతర తపన, పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. నూతన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా అదనపు న్యాయమూర్తి సి.సత్యవాణి మాట్లాడుతూ తాము విద్యార్థి దశలో లేని సదుపాయాలు నేటితరం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. లా గ్రాడ్యుయేట్లకు వృత్తిలో ఎన్నో మెరుగైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆలూరి రామిరెడ్డి, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ హెచ్.రాఘవేంద్రచార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమరావు - 
      
                   
                               
                   
            జీజీహెచ్లో మహిళ అదృశ్యం
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో అడ్మిషన్లో ఉన్న చిన్నారిని తీసుకుని ఓ తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన మీనుగ కేశమ్మ కనిపించలేదని భర్త ఓబులప్ప ఫిర్యాదు చేశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడో సంతానమైన చిన్నారి శ్రుతికి ఆరోగ్యం బాగలేకపోతే నాలుగు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. భర్త ఓబుళప్ప బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం ఇద్దరు పిల్లలను ప్రభుత్వాస్పత్రిలోనే వదిలేసి చిన్న కూతురితో కలిసి తల్లి వెళ్లిపోయింది. ఓబులప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి శెట్టూరు: రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శెట్టూరు మండలం ముచ్చర్లపల్లికి చెందిన గొల్ల ఈరన్న (35)కు భార్య నాగమణి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం రాత్రి శెట్టూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంలో తన స్వగామానికి వెళుతున్న ఆయన పెరుగుపాళ్యం వద్దకు చేరుకోగానే చీకట్లో రోడ్డు పక్కన ఆపిన ట్రాక్టర్ను గుర్తించక ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈరన్నను స్థానికులు కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిపై కేసు నమోదు రాప్తాడు రూరల్: ఆర్టీసీ డ్రైవరుపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తిపై అనంతపురం రూరల్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వివరాలు.. ఈ నెల 27న కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ నగర శివారులోని సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో యూటర్న్ వద్దకు చేరుకోగానే రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనదారుడు నారాయణస్వామి అడ్డుకున్నాడు. వేగంగా వస్తున్నావంటూ బస్సు డ్రైవర్ రాముతో గొడవపడుతూ చెప్పుతో దాడి చేశాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. - 
      
                   
                               
                   
            మానవత్వం చాటుకున్న ఎస్ఐ
పెద్దపప్పూరు: నడవలేని స్థితిలో రోడ్డుపై పడిపోయిన వృద్ధుడిని కుటుంబసభ్యుల చెంతకు చేర్చి ఎస్ఐ నాగేంద్రప్రసాద్ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు... పెద్దపప్పూరుకు చెందిన 75 ఏళ్ల నాగయ్య పుట్టకతోనే అంధుడు. రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య, ఒక్కగానొక్క కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసిచ్చాడు. భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో దాదాపు రూ.6 లక్షలు ఖర్చు పెట్టి తాడిపత్రిలో ఇంటిని నిర్మించి, కుమార్తె పేరున రాయించి ఇచ్చాడు. ఈ క్రమంలో ఆదరించేవారు లేక వారం రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్న నాగయ్య... గురువారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నడవలేని స్థితిలో కుప్పకూలిపోయాడు. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానిక ‘సాక్షి’ విలేకరి.. విషయాన్ని వెంటనే ఎస్ఐ నాగేంద్రప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే ఎస్ఐ అక్కడకు చేరుకుని వృద్ధుడితో మాట్లాడారు. రెండు కాళ్లకు పుండ్లు ఏర్పడి నడవలేకపోతున్నానంటూ నాగయ్య కన్నీరుపెట్టుకున్నాడు. స్పందించిన ఎస్ఐ వెంటనే కుటంబసభ్యులు గురించి ఆరా తీసి తన సొంత ఖర్చుతో వారి చెంతకు చేర్చారు. సకాలంలో స్పందించిన ఎస్ఐ చొరవను స్థానికులు అభినందించారు. - 
      
                   
                               
                   
            శభాష్ లావణ్య..
● సర్వజనాస్పత్రికి 12 లీటర్ల తల్లిపాలను దానం చేసిన బాలింత అనంతపురం మెడికల్: తన శిశువుకు పాలను పట్టిన తర్వాత మిగులు పాలతో నవజాత శిశులు ఆకలి తీర్చే అవకాశం ఉన్నా.. చాలా మంది బాలింతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గ్రామీణ బాలింత తన పాలను దానం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4న మరుట్ల గ్రామానికి కెందిన నవీన్కుమార్ భార్య లావణ్య సర్వజనాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత మిగులు పాలను మదర్ మిల్క్ బ్యాంక్కు ఇవ్వడం ద్వారా తల్లి పాలు తక్కువగా ఉన్న శిశువులకు అందించి ఆకలి తీర్చవచ్చునని బాలింతలకు డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత పర్యవేక్షణలో న్యూట్రీషియనిస్టు పల్లవి, సిబ్బంది రాధ అవగాహన కల్పించారు. ఈ అంశంపై చైతన్యం పొందిన లావణ్య విషయాన్ని వెంటనే తన భర్తకు తెలిపి ఆయన అంగీకారంతో అడ్మిషన్లో ఉన్న సమయంలో రోజూ తన బిడ్డకు పాలను ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను మదర్ మిల్క్ బ్యాంకుకు అందించారు. ఇదే స్ఫూర్తితో డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆమె కొనసాగిస్తూ పాలను తీసి భద్రపరుస్తూ వచ్చారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఆర్ఎంఓ హేమలత, న్యూట్రీషినిస్టు పల్లవి, రాధ.. గురువారం మరుట్ల గ్రామానికి చేరుకుని లావణ్య భద్రపరిచిన 12 లీటర్ల పాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా లావణ్య దాతృత్వాన్ని డాక్టర్ హేమలత కొనియాడారు. ఈ పాలను ఐసీడీఎస్ పర్యవేక్షణలో ఉండే అనాథ శిశువులతో పాటు సర్వజనాస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో అడ్మిషన్లో ఉన్న తల్లిపాలు లేని పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. - 
      
                   
                               
                   
            ఫసల్.. ఫైసల్
● రైతులకు శాపంగా మారిన సర్కారు నిర్లక్ష్యం ● అవగాహన లేక తోచిన విధంగా బీమా ప్రీమియం చెల్లించిన రైతులు ● సవరణకు అవకాశం ఇస్తేనే ప్రయోజనం అనంతపురం అగ్రికల్చర్: రైతులకు కొండంత భరోసానివ్వాల్సిన బీమా పథకాలు మాయగా మారుతున్నాయి. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం వెరసి రైతులకు ఫలాలు అందని ద్రాక్షగా మారే దుస్థితి దాపురించింది. ఖరీఫ్ మొదలు కాకమునుపే పంట రుణాల రెన్యువల్స్ ప్రారంభం కావడంతో కొందరు వేరుశనగ, మరికొందరు కంది, పత్తి, ఆముదం పంటలకు, ఇంకొందరు ఉద్యాన పంటలకు బీమా ప్రీమియం చెల్లించారు. ఆ తర్వాత ప్రీమియం కట్టిన పంటను కాకుండా ఇతర పంటలు వేశారు. వేరుశనగకు ప్రీమియం కట్టిన రైతులు కంది లేదా ఆముదం, పత్తి లాంటి పంటలు, కందికి కట్టిన రైతులు వేరుశనగ లేదా ఇతర పంటలు సాగు చేశారు. అయితే, ప్రీమియం చెల్లించిన పంటనే ఈ–క్రాప్లోకి చేర్చాల్సి రావడం, ఈ–క్రాప్లో ఒక పంట, ప్రీమియం మరో పంటకు ప్రీమియం చెల్లించడంతో రైతులకు బీమా అందడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. 2.34 లక్షల హెక్టార్లకు.. జిల్లాలో 1.49 లక్షల మంది రైతులు 2.34 లక్షల హెక్టార్ల పంటలకు ప్రీమియం కట్టి ఫసల్ బీమా, వాతావరణ బీమా పరిధిలోకి వచ్చారు. ఖరీఫ్లో 12 రకాల పంటలకు బీమా పథకం అమలు చేస్తుండగా అందులో పంట దిగుబడుల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరపకు వర్తింపజేశారు. కంది రైతులు ఎకరాకు రూ. 80, వరి రూ.164, జొన్న రూ.84, మొక్కజొన్న రూ.132, ఆముదం రూ.80, ఎండుమిరపకు రూ.576 ప్రకారం ప్రీమియం చెల్లించారు. ఇక వాతావరణ బీమా పథకం వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటికి వర్తింప జేశారు. ఇందులో వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం, పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, టమాటాకు రూ.1,600, అరటికి రూ.3 వేల ప్రకారం రైతులు చెల్లించారు. తోచినట్లుగా చెల్లింపు పంట రుణాలు ముందుగానే మొదలు కావడం, అధికారులు అవగాహన కల్పించని కారణంగా రైతులు తమకు తోచిన విధంగా ప్రీమియం చెల్లించినట్లు తెలిసింది. వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 1,49,261 మంది రైతులు 2,34,220 హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. ఇందులో వాతావరణ బీమా పంటలకు సంబంధించి 1,29,336 మంది రైతులు 2,03,160 హెక్టార్లకు ప్రీమియం కట్టారు. అలాగే ఫసల్ బీమాకు సంబంధించి కేవలం 19,925 మంది 31,064 హెక్టార్లకు మాత్రమే డబ్బు చెల్లించారు. ఫసల్ బీమా కింద గుర్తించిన కంది 1.04 లక్షల హెక్టార్లు, వరి 25 వేలు, జొన్న వెయ్యి హెక్టార్లు, మొక్కజొన్న 29 వేలు, ఆముదం 16 వేలు, ఎండుమిరప 9 వేల హెక్టార్లు... ఈ ఆరు పంటలు ఏకంగా 1.85 వేల హెక్టార్లలో సాగు చేశారు. కానీ, ప్రీమియం కట్టింది 31,064 హెక్టార్లకే కావడంతో కంది, ఆముదం రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. వాతావరణ బీమా కింద వేరుశనగ 91 వేల హెక్టార్లు, పత్తి 26 వేల హెక్టార్లు మొత్తంగా 1.17 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణ బీమా కింద సాగు కన్నా చాలా అధికంగానే 2.03 లక్షల హెక్టార్లకు ప్రీమియం కట్టారు. అంటే వేల సంఖ్యలో రైతులు వాతావరణ బీమాకు ప్రీమియం చెల్లించినా అందులో చాలా మంది ఫసల్బీమా పంటలు సాగు చేసినట్లు స్పష్టమవుతోంది. అటు ప్రీమియం రూపంలో అధికంగానే చెల్లించినా... పరిహారం అసలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకుల్లో వివరాల సవరణకు అవకాశం కల్పిస్తే మేలని రైతులు చెబుతున్నారు. మరి కూటమి సర్కారు, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. - 
      
                   
                               
                   
            కుట్రలకు బెదరం.. మరింత బలపడతాం
● కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్కుమార్ పదవి రద్దుపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి తలారి రాజ్కుమార్, కౌన్సిలర్లు సురేష్, లక్ష్మన్న, పరమేశ్వరప్ప, పార్టీ మున్సిపల్ కన్వీనర్ సుధీర్, రూరల్ మండల కన్వీనర్ గోళ్ల సూరి, కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉద్దేశ పూర్వకంగా వైఎస్సార్సీపీ చైర్మన్ను తొలగించారన్నారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని, నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడతామని తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ టీడీపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాలకు రావడం లేదనే సాకు చూపి చైర్మన్ పదవిని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. కౌన్సిల్ మీట్ పెట్టేందుకు కమిషనర్ సహకరించడం లేదంటూ పలుమార్లు ఆర్డీఓ, కలెక్టర్, మున్సిపల్ ఆర్డీకు సైతం చైర్మన్ విన్నవించారని గుర్తు చేశారు. ఈ అంశంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య సూచనలతో చట్టపరంగా న్యాయ పోరాటం సాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, నియోజకవర్గ అధ్యక్షుడు చరణ్, కిరీటియాదవ్, పూజల మారుతి, షెక్షావలి, దొడగట్ట మారుతి, జాకీర్, రాజు, నరేష్, మల్లి పాల్గొన్నారు. ఎంఈఓలకు షోకాజ్ జారీ బ్రహ్మసముద్రం : మండలంలోని గొంచిరెడ్డిపల్లి పాఠశాలలో భోగస్ ఎన్రోల్మెంట్ అంశంపై మండల విద్యాశాఖాధికారులు ఓబుళపతి, కృష్ణానాయక్కు జిల్లా విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే ఘనటకు సంబంధించి ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని రెండు రోజుల క్రితం సస్సెండ్ చేసిన విషయం తెలిసిందే. వాహనం ఢీకొని వ్యక్తి మృతి పామిడి: స్థానిక పాత బస్టాండ్లోని జెండా కట్ట వద్ద వాహనం ఢీకొన్ని పామిడికి చెందిన షాషావలి (45) మృతిచెందాడు. గురువారం సాయంత్రం టీ తాగేందుకు వచ్చిన ఆయనను గార్లదిన్నె మండలం కల్లూరు నుంచి వేగంగా వచ్చిన తుపాను వాహనం ఢీకొంది. ఘటనలో తలకు, కాలికి తీవ్ర గాయమైన షాషావలిని పక్కనే ఉన్న సీహెచ్సీకి అక్కడున్న వారు తీసుకెళ్లారు. పరిస్థితి విషమిస్తుండడంతో అనంతపురంలోని ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించిక ఆయన మృతిచెందాడు. ఘటనపై సీఐ యుగంధర్ కేసు నమోదు చేశారు. వ్యక్తి బలవన్మరణం కదిరి అర్బన్: మండలంలోని బాలప్పగారిపల్లికి చెందిన బాలూనాయక్ (38) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలో ప్రమాదవశాత్తు కాలు విరగడంతో చికిత్స పొందాడు. అప్పటి నుంచి తరచూ అనారోగ్య సమస్యలు వెన్నాడుతుండడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. - 
      
                   
                               
                   
            అవిశ్వాసంపై టీడీపీ కుట్ర
● ఎంపీటీసీ సభ్యురాలి అపహరణ ● పోలీసులకు ఫిర్యాదు చేసిన బీకేఎస్ వైఎస్సార్సీపీ శ్రేణులు బుక్కరాయసముద్రం: వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఎంపీపీ సునీతపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గకుండా టీడీపీ నాయకులు కుట్ర పన్నారని జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి మండిపడ్డారు. మెజారిటీ లేకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని, ఇది ఫలించకపోవడంతో ఓ ఎంపీటీసీ సభ్యురాలిని బలవంతంగా ఇంటిని పిలుచుకెళ్లి రాజకీయాల్లో నైతికతకు పాతరవేశారంటూ ధ్వజమెత్తారు. ఎంపీటీసీ సభ్యురాలి అపహరణను నిరసిస్తూ గురువారం బీకేఎస్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సీఐ పుల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్, గువ్వల శ్రీకాంతరెడ్డి మాట్లాడారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 19 స్థానాలకు గాను 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా గెలిచారని గుర్తు చేశారు. ఆ సమయంలో సునీత, కాలువ వెంకటక్ష్మి చెరో రెండేళ్లు ఎంపీపీ పదవిలో కొనసాగేలా పెద్దలు నిర్ణయించారన్నారు. అయితే ఈ ఒప్పందాన్ని సునీత ఉల్లంఘించి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలోకి చేరారన్నారు. ఆ తర్వాత సునీతను పార్టీ నుంచి సస్సెండ్ చేస్తున్నట్లుగా, తమ పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని శింగనమల నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ ప్రకటించారన్నారు. అయినా రాజకీయ నైతికతకు ఎమ్మెల్యే బండారు శ్రావణి పాతరేస్తూ సునీతను ఎంపీపీగానే కొనసాగిస్తూ వచ్చారన్నారు. దీంతో గత నెల 26న ఆమైపె అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్తో పాటు ఆర్డీఓకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు విన్నవించారన్నారు. ఈ అంశంపై స్పందించిన అధికారులు ఈ నెల 30 అవిశ్వాస తీర్మానం పెట్టేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించి భంగపడ్డారన్నారు. గురువారం అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలిని బలవంతంగా ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లిపోయారని, ఇందుకు బాధ్యులైన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            కరువు కోరల్లో జిల్లా రైతులు
జిల్లా రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ తెలిపారు. మోంథా తుపాను ప్రభావంపై వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లతో గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. జిల్లాకు సంబంధించి వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ అధినేతకు వివరించారు.చంద్రబాబు–కరువు రెండూ కవల పిల్లలని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పేవారని, ఆ పరిస్థితి నేడు మళ్లీ జిల్లాలో నెలకొందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించడంతో రైతులకు ఇబ్బంది లేకుండా పోయిందని గుర్తు చేశారు. కొన్ని మండలాలపై ప్రభావం జిల్లాలో మోంథా తుపాన్ ప్రభావం ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, శెట్టూరు, బొమ్మన హాళ్, బ్రహ్మసముద్రం, విడపనకల్లు మండలాలపై పడిందని ‘అనంత’ తెలియజేశారు. బొమ్మనహాళ్ మండలం హరేసముద్రం, బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లిలో రెండు ఇళ్లు కూలిపోయాయన్నారు. వేదవతి హగరి నదుల్లో వరద కారణంగా పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయన్నారు. గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో కొన్ని చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఉరవకొండలోని పలు కాలనీల్లో నేతన్నల మగ్గాల గుంతల్లోకి నీరు చేరడంతో నష్టం కలిగిందని పేర్కొన్నారు. - 
      
                   
                               
                   
            మల్బరీతో కాదు ఆముదంతో...
అనంతపురం అగ్రికల్చర్: పట్టుగూళ్ల పెంపకంలో సరికొత్త ప్రయోగానికి పట్టు పరిశ్రమశాఖ సన్నాహాకాలు చేస్తోంది. ఇప్పటి వరకూ మల్బరీ ఆకుల ద్వారా పట్టుగూళ్లు పండిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై ఆముదం (క్యాస్టర్) ఆకులు మేతగా వేసి పట్టుగూళ్లు పండించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ తరహా పట్టుగూళ్ల పెంపకాన్ని ‘ఎరి సెరికల్చర్’గా పిలుస్తారని... ఈశాన్య రాష్ట్రాల్లో కొందరు రైతులు పండిస్తున్నట్లు పట్టుశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ ఇటీవల ఆముదం పంట సాగు విస్తీర్ణం బాగా పెరగడంతో... ఇక్కడ కూడా అలాంటి పంటను ప్రయోగాత్మకంగా చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పట్టుశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆముదం పంట సాగు ప్రాంతాలు, విస్తీర్ణం, రైతుల స్థితిగతులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు రైతులను ఎంపిక చేసి వచ్చే ఖరీఫ్ నుంచి ప్రయోగాత్మకంగా ఆముదం ద్వారా పట్టుగూళ్లు పండించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఆముదం గత ఐదారేళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వేరుశనగ సాగు తగ్గించి చాలా మంది రైతులు కంది, మొక్కజొన్నతో పాటు ఆముదంపై దృష్టి సారించారు. ఐదారేళ్ల క్రితం వరకు వందల ఎకరాలకు పరిమితమైన ఆముదం ఇప్పుడు వేలాది ఎకరాలకు చేరుకుంది. ఈ ఖరీఫ్లో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 13 వేల ఎకరాలు... మొత్తంగా 58 వేల ఎకరాల్లో ఆముదం సాగులోకి వచ్చింది. కొద్ది పాటు మార్పుతో.. మామూలు మల్బరీ పద్ధతితో పోల్చుకుంటే కొద్ది పాటు మార్పుతో ఆముదంతో పట్టుగూళ్లను పెంచే అవకాశముంది. మల్బరీ ద్వారా నెల రోజులకే పంట చేతికొస్తుండగా ఆముదం ద్వారా అయితే రెండు నెలలు సమయం పడుతుంది. ఇపుడున్న పద్ధతిలో అయితే పట్టు పురుగుల్లో రోగనిరోధక శక్తి తక్కువ కాగా, ఆముదం పంట కింద మేపుతున్న పురుగుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటోంది. ఇపుడున్న పట్టుగూళ్ల నుంచి రెక్కల పురుగులు ఆలస్యంగా బయటకు రావడం వల్ల దారం పొడవుగా ఉంటుంది. ఆముదం ద్వారా అయితే పట్టుగూళ్ల నుంచి రెక్కల పురుగు వెంటనే బయటకు రావడం వల్ల దారం పొట్టిగా తక్కువగానే వస్తుందని చెబుతున్నారు. ఆముదం పట్టుగూళ్ల నుంచి ‘అహింసా’ అలాగే ‘పీస్ సిల్క్’ పేరుతో పట్టుచీరలు, ఇతరత్రా వస్తువుల తయారీకి వాడుతుండటం, వాటికి మార్కెట్లో గిరాకీ ఉన్నందున పట్టుగూళ్లకు కూడా మంచి ధరలు పలికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆముదం పంట ఉత్పత్తులతో పాటు అదనంగా పట్టుగూళ్ల పెంపకం ద్వారా రైతుకు లాభం ఉంటుందని చెబుతున్నారు. మరి ప్రయోగాత్మక సాగులో ‘ఎరి సెరికల్చర్’ విధానం ఎంత వరకు ఫలితం ఇస్తుందనేది వేచిచూడాలి. పట్టుగూళ్ల పెంపకంలో సరికొత్త ప్రయోగంపై దృష్టి ఆముదం విస్తీర్ణంపై వివరాలు సేకరిస్తున్న పట్టుశాఖ వచ్చే ఖరీఫ్ నుంచి ప్రయోగాత్మకంగా ‘ఎరి సిల్క్వార్మ్’ - 
      
                   
                               
                   
            జాతీయ స్థాయి సైన్స్ పోటీలకు ఎంపిక
అనంతపురం సిటీ: జాతీయ స్థాయి సైన్స్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్లు అనంతపురం సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ గురువారం తెలిపారు. హనకనహళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గీతారెడ్డి, రాయదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీసాయిదీప్తి ఎంపికైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. నవంబర్ 6 నుంచి 8 వరకు ఢిల్లీలో జరిగే సైన్స్ కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారన్నారు. అక్కడి ప్రముఖ సైన్స్ కేంద్రాలు, సైన్స్ మ్యూజియం, రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్, నెహ్రూ ప్లానిటోరియం లాంటి ప్రఖ్యాత విజ్ఞాన ప్రదేశాలను విద్యార్థులు సందర్శిస్తారన్నారు. సైన్స్ పట్ల ఆసక్తి, వివిధ సందర్భాల్లో నిర్వహించిన సైన్స్ కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్య నేపథ్యం పరిశీలించి జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎంపిక చేశారన్నారు.నాసా కేంద్రంలో పని చేసే ప్రముఖ ఇంజినీర్తో ముఖాముఖి చర్చలోనూ పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎంపికైన విద్యార్థినులను డీఈఓ ప్రసాద్బాబు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజా చౌదరి అభినందించారు. నవంబర్ 11న వైఎస్సార్ సీపీ ర్యాలీ అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో నవంబర్ 4న తలపెట్టిన ర్యాలీ కార్యక్రమం వాయిదా పడినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. తుపాన్ దృష్ట్యా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. నవంబర్ 11న జరిగే ర్యాలీల్లో వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. - 
      
                   
                               
                   
            ఓఎంసీలో కొనసాగిన తనిఖీలు
డీ హీరేహాళ్ (రాయదుర్గం): డీ హీరేహాళ్ మండల పరిధిలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో మైనింగ్, అటవీశాఖ అధికారులు వరుసగా రెండో రోజు గురువారం కూడా తనిఖీలు నిర్వహించారు. మైన్స్ అండ్ జియాలజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ (సోషల్ ఫారెస్ట్) గురుప్రభాకర్ ఆధ్వర్యంలో సరిహద్దులు పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అండ్ జియాలజీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓబుళాపురం పరిసరాల్లోని ఆరు ఐరన్ఓర్ కంపెనీల లీజుల సరిహద్దులను పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలు సమర్పించిన తర్వాత సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యటిస్తుందన్నారు. వీరి పర్యవే క్షణలో మైనింగ్ లీజు హద్దులను తేల్చి సుప్రీంకోర్టుకు నివేదిక అందిస్తామన్నారు. డీఎఫ్ఓ గురుప్రభాకర్ మాట్లాడుతూ నవంబర్ 10లోపు సర్వే పనులు పూర్తిచేస్తామన్నారు. తాగడం వల్ల కాదు.. మానేసినందుకే అస్వస్థత ● చౌళూరు ఘటనపై ఎకై ్సజ్ శాఖ వింత భాష్యం హిందూపురం టౌన్: ‘హిందూపురం ప్రాంతంలో ఇటీవల కల్తీ కల్లు తాగి కొంతమంది అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నది అవాస్తవం. కల్లు, మద్యానికి బాగా అలవాటు పడిన వారు ఒక్కసారిగా మానేస్తే వచ్చే అనర్థాల వల్లే ఆస్పత్రి పాలయ్యారు’ అంటూ ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ బుధవారం చౌళూరులో చోటుచేసుకున్న ఘటనపై వింత భాష్యం చెప్పారు. హిందూపురం మండలం చౌళూరు గ్రామంలో బుధవారం కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురి కాగా, వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. కల్తీ కల్లు వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని చౌళూరు గ్రామస్తులే ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్, సీఐ లక్ష్మీదుర్గయ్య విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా బ్రాందీ, విస్కీ, కల్లు సేవిస్తున్న వారు ఉన్నట్టుండి ఆ అలవాటు మానుకుంటే అనారోగ్యానికి గురికావడం, మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని వైద్యులు కూడా తెలిపారన్నారు. బుధవారం చౌళూరులో జరిగిన ఘటన కూడా ఇలాంటిదేనన్నారు. అయినా జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు, నకిలీ మద్యం విక్రయాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆటో బాడుగ అడిగినందుకు పచ్చ మూక దాడి చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దల గ్రామంలో పచ్చమూక రెచ్చిపోయింది. ఆటో బాడుగ డబ్బు అడిగినందుకు ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి తెగబడింది. 15 ఏళ్ల వయసున్న బాలుడిని కిందపడేసి ఇష్టానుసారంగా తొక్కి, కాళ్లతో బలంగా తొక్కడంతో విషమ పరిస్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. బాధిత కుటుంబం తెలిపిన మేరకు.. న్యామద్దల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు వెంకటేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక టీడీపీ నేత మురళి ఇటీవల ఆటోను బాడుగకు తీసుకెళ్లాడు. రోజులు గడుస్తున్నా బాడుగ డబ్బు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి తన ఇంటి ఎదుట తారసపడిన మురళిని వెంకటేష్ పలకరిస్తూ ఆటో బాడుగ డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఆ సమయంలో మురళి తాను బాడుగ డబ్బు అప్పుడే ఇచ్చానని బుకాయిస్తూ గొడవకు దిగాడు. భర్తతో గొడవ పడుతుండడం గమనించిన వెంకటేష్ భార్య రమాదేవి, కుమారులు కిషోర్, హేమంత్ అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే టీడీపీకి చెందిన బయన్న, నాగేశ్వరితో కలసి మురళి రెచ్చిపోతూ వెంకటేష్తో పాటు అతని కుటుంబసభ్యులపై దాడికి తెగబడ్డారు. హేమంత్ను కింద వేసి కాళ్లతో తొక్కి బలంగా తన్నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు చెన్నేకొత్తపల్లిలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. నొప్పిని తాళలేక కడుపు పట్టుకుని మెలికలు తిరిగిపోతుండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. - 
      
                   
                               
                   
            అన్నదాత గోడు పట్టదా?
● ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి చూస్తే చాలా బాధేస్తోంది ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం: ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు కూడా రైతులకు సకాలంలో అందడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రెండు ఖరీఫ్లు, ఒక రబీ సీజన్ ముగిసింది. ఇప్పుడు మరో రబీ ప్రారంభమైంది. ఈ నాలుగు సీజన్లలో ఏనాడూ విత్తనాలు సకాలంలో అందించిన పాపాన పోలేదు’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీ సీజన్ ప్రారంభమై నెల గడిచినా రైతులకు సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు పంపిణీ చేయలేని దుస్థితిని ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 శాతం సబ్సిడీతో పప్పుశనగ విత్తనాలు అందిస్తే.. నేడు 25 శాతానికి కుదించారని మండి పడ్డారు. అందులోనూ గత ఏడాది జిల్లాకు 27 వేల క్వింటాళ్ల పప్పుశనగ కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 14 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. ఇటీవల నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ చేస్తామని సాక్షాత్తూ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పినా ఇంత వరకు అతీగతీ లేదన్నారు. అన్ని పంటలూ రోడ్డు పాలు గిట్టుబాటు ధరలు లేక గతంలో టమాట పంటను మాత్రమే రైతులు పారేసిన ఘటనలు చూశామని, కానీ నేడు అరటి, చీనీ, మామిడి పంటలను కూడా రోడ్డుపై పడేస్తున్నారని ‘అనంత’ వాపోయారు. ఇటీవలి వరకు రూ.2,800 పలికిన క్వింటా మొక్కజొన్న నేడు రూ.1,800కి పడిపోయిందన్నారు. ఈ విషయంపై అధికార పార్టీకే చెందిన రాయదుర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాయడం చూస్తే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని అన్నారు. గతంలో మాదిరి పెద్ద ఎత్తున వలసలు, రైతుల బలవన్మరణాలు ఎక్కడ జరుగుతాయోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వచ్చేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. హెచ్ఎల్సీ, హంద్రీ–నీవా నీటి నిర్వ హణలో నిర్లక్ష్యం చేస్తుండడంతో చాగళ్లు, పీఏబీఆర్, ఎంపీఆర్ నుంచి నీరు వృథా అవుతున్నాయని పేర్కొ న్నారు. ఇటీవల నిర్వహించిన ఐబీఏ సమావేశంలో కనీసం ఎన్ని రోజులు నీళ్లు వస్తాయి.. ఏ పంటలు వేసుకోవాలో కూడా చెప్పలేదన్నారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ సమస్యలపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పంచాయితీ చేస్తాం.. రండి అంటారా? తమ భూముల్ని గద్దల్లా తన్నుకుపోతున్నారంటూ బాధితులు ఆవేదన చెందుతుంటే పంచాయితీలు చేస్తాం రండి అంటూ ఏకంగా ప్రకటనలు ఇస్తున్న ఘనత కూటమి పాలకులకే దక్కుతుందని ‘అనంత’ విమర్శించారు. బాధితులకు కలెక్టర్, ఎస్పీలు భరోసా ఇవ్వలేరా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో రేషన్, లిక్కర్ దందా జోరుగా సాగుతోందన్నారు. ఎమ్మెల్యే అనుచరులే భూదందాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బుడగ జంగాలకు చెందిన భూములు, కృష్ణ ఇంగ్లిష్ మీడియం స్కూల్ యజమానులకు చెందిన భూములు లాక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. సాయినగర్లో అధికార పార్టీకి చెందిన వాళ్లే నకిలీ రిజిస్ట్రేషన్ చేసుకుని స్థలం కాజేయాలని చూశారన్నారు. పాపంపేట భూముల విషయంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలోని పసలూరు, అనంతపురంలోని చిన్మయనగర్లో స్థలాలను ఎమ్మెల్యే అనుచరులే ఆక్రమించుకుంటున్నారన్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఓబిరెడ్డి, నాగన్న, రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            బాబు ప్రభుత్వానివన్నీ డ్రామాలే
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం పుట్లూరు: రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానివన్నీ డ్రామాలేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. గురువారం పుట్లూరు ప్రధాన రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనుకు విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విత్తన పంపిణీ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న సమయంలో విత్తన రిజిస్ట్రేషన్లు గురువారం నుంచి ప్రారంభించామని వ్యవ సాయ అధికారి కాత్యాయని తెలపడంపై మండిపడ్డారు. మండలానికి 2,200 క్వింటాళ్ల విత్తనాలు వచ్చినట్లు చెబుతున్నారని, వాటిని ఎక్కడ నిల్వ చేశారో చెప్పాలని నిలదీశారు. ఈ క్రమంలోనే ఏపీ సీడ్స్ అధికారులకు మాజీ మంత్రి ఫోన్ చేయగా ఇప్పటివరకు పుట్లూరు మండలం నుంచి ఎలాంటి ఇండెంట్ రాలేదని వారు చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. వైఎస్సార్సీపీ ధర్నా గురించి తెలియగానే రైతులను మభ్యపెట్టడానికి డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోందని శైలజానాథ్ విమర్శించారు. రెండు రోజుల్లో రైతులకు సబ్సిడీపై విత్తన పప్పుశనగ అందించని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు పొన్నపాటి మహేశ్వరరెడ్డి, ప్రసాద్, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్య దర్శి వంశీగోకుల్రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర,జిల్లా కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            అనంతసేనడికి శ్రీనివాసుని అండ!
రాయదుర్గం/అనంతపురం టవర్క్లాక్: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన రాయదుర్గం నియోజకవర్గంలోని మురడి ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడిగా తిరిగి అనంతసేనను తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఇచ్చిన లేఖ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. 2022, జూలై 12న ఆలయంలో రాసలీలలు సాగిస్తూ అనంతసేన పట్టుబడడంతో భక్తుల డిమాండ్ మేరకు దేవదాయశాఖ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారించుకున్న అనంతరం అతన్ని అర్చకత్వ విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి అర్చకుడిగా తిరిగి వచ్చేందుకు అనంతసేన చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుతో సిఫారసు లేఖ తీసుకుని విజయవాడలోని దేవదాయశాఖ కార్యాలయంలో అనంతసేన సమర్పించాడు. ఈ విషయం కాస్త బహిర్గతం కావడంతో భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయ ప్రతిష్టను మంట కలిపిన అనంతసేనను తిరిగి అర్చకుడిగా ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అతని రాసలీలలు తెలిసి సిఫారసు లేఖ ఎలా ఇచ్చారని, అధికారముంది కదా అని కామాంధుడికి ఆలయ అర్చకత్వం బాధ్యతలు అప్పగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పందించి తన సిఫారసు లేఖను వెనక్కు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు అనంతపురంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కాలవ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కామాంధుడైన అర్చకుడికి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. అనంతసేనను తిరిగి అర్చకుడిగా నియమిస్తే ఎమ్మెల్యే కాలవకు కనీస మర్యాద కూడా ఉండదన్నారు. దేవుడి సేవకు మహిళా భక్తులు దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన సిఫారసు లేఖను తక్షణమే వెనక్కు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాసాని నాగరాజు, అంకే కుళ్లాయప్ప, అనంతపురం అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డిపల్లి నరేంద్ర, హరి ప్రసాద్, జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. తొలగించిన అర్చకుడిని తిరిగి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిఫారసు లేఖ ఎమ్మెల్యే కాలవ తీరుపై మండిపడుతున్న బీఎస్పీ నాయకులు ఆలయంలో రాసలీలలు సాగించిన వ్యక్తిని అర్చకుడిగా ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం - 
      
                   
                                                     
                   
            'అమ్మ' అభయం.. 'తమ్ముళ్ల' దారుణం
ఈ ఫొటో చూసి చెరువో, నీటి కుంటో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. బుక్కరాయసముద్రం మండలం పసులూరు లేఔట్లోని జగనన్న కాలనీ ఇది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇంటి నిర్మాణాలు చేపట్టే క్రమంలో పునాదుల వరకు నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. రాబందుల్లా మారి పునాది మట్టిని సైతం తరలించేశారు.లక్ష్మీదేవి అనే మహిళ అనంతపురంలో మూడు దశాబ్దాలుగా అద్దె ఇంట్లో ఉంటూ చిన్నాచితక పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది. గత ప్రభుత్వంలో పసులూరులోని జగనన్న లేఔట్లో ఆమెకు స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేశారు. అప్పట్లోనే పునాది వరకు ఇంటి నిర్మాణం జరిగింది. సొంతింటి కల నెరవేరుతోందని లక్ష్మీదేవి ఆనందపడుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడంతో ఆమె కల పటాపంచలైంది. ఇంటి చుట్టూ ఎర్రమట్టిని ‘తమ్ముళ్లు’ మేసేయడంతో నేడు ఇంటి స్థలమే నామరూపాల్లేకుండా పోయింది. దీంతో ఆమె ఆవేదన అంతా ఇంతా కాదు. అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని పసలూరు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో 33 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో జగనన్న లేఔట్ను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ అవస్థలు పడుతున్న రెండు వేల మంది నిరుపేదలకు ఇక్కడ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.13 లక్షలు వెచ్చించి ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించింది. అప్పట్లోనే 600 ఇళ్లకు పునాదుల వరకూ నిర్మాణం కూడా పూర్తి చేసింది. నామరూపాల్లేకుండా.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎర్రమట్టి దోపిడీకి తెరలేపిన ‘తమ్ముళ్లు’ పసలూరు జగనన్న లేఔట్పై పడ్డారు. అనంతపురం నగరానికి 9 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇదే అదనుగా జేసీబీ, టిప్పర్లతో రాత్రీ పగలూ తేడా లేకుండా టిప్పర్ ఎర్రమట్టిని రూ.7 వేలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. రోజూ 100 టిప్పర్ల లెక్కన రూ.7 లక్షల చొప్పున జేబుల్లోకి వేసుకున్నారు. ఇష్టారాజ్యంగా తమ్ముళ్లు సాగించిన మట్టి దోపిడీతో జగనన్న లేఔట్ నేడు నామరూపాల్లేకుండా పోయింది. లేఔట్లోని ఇళ్ల పునాదుల చుట్టూ అడుగుల లోతుకు తవ్వడంతో నివాసయోగ్యానికి ఏ మాత్రమూ అనుకూలంగా లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా మళ్లీ లేఔట్ వేసేందుకు సాధ్యం కాని దుస్థితి నెలకొంది. సింహభాగం సొమ్ము ‘అమ్మ’కే.. కూటమి అధికారంలోకి వచ్చాక శింగనమల నియోజకవర్గ పరిధిలో మట్టికొండలు కరిగిపోతున్నాయి. ఇసుక, గ్రావెల్, మట్టితో సహా దొరికిన సహజ సంపదనంతా లూటీ చేస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధి తల్లికి ప్రతి నెలా రూ. లక్షల్లో ముట్టజెబుతూ ముఠాలుగా ఏర్పడి మరీ తరలిస్తున్నారు. ‘అమ్మ’ ఆశీర్వాదంతో పగలూ, రాత్రి తేడా లేకుండా ఎర్రమట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పసలూరు జగనన్న కాలనీలో కొల్లగొట్టిన ఎర్రమట్టి సొమ్ములో సింహభాగం ‘అమ్మ’కే సమర్పించినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు ఉండడం గమనార్హం. ఎర్రమట్టి టిప్పర్లు పసలూరు, కొత్తపల్లి, ఉప్పరపల్లి గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడంతో ఆ మార్గమంతా అధ్వానంగా మారింది. అయినా అటు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. సెంటు భూమి ఇవ్వని బాబు సర్కారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలను సైతం తమ్ముళ్లు మాయం చేయడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. - 
      
                   
                               
                   
            మట్టి మాఫియాకు అధికార అండ
● మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురం: జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లో కూటమి అధికారంలోకి వచ్చాక ఎర్రమట్టిని తరలించి కాలనీ స్వరూపాన్నే మార్చేశారన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. మట్టి మాఫియాను ప్రశ్నించిన పత్రికా విలేకరులపైనా దాడులు చేస్తున్నారన్నారు. అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డి పల్లి, బుక్కరాయసముద్రం, ఆలమూరు మట్టి కొండలన్నీ మాఫియా మాయం చేసిందన్నారు. కృష్ణం రెడ్డిపల్లి వద్ద నుంచి రోజూ 150 నుంచి 200 టిప్పర్ల ఎర్రమట్టిని తరలిస్తున్నారన్నారు. వీటన్నింటినీ రవాణా, మైనింగ్ , రెవెన్యూ శాఖలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో 20 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వానికి రూ.20 కోట్లకు పైగా రాయితీ ఎగ్గొట్టినా పట్టించుకునే వారు లేరన్నారు. పెన్నానదికి గర్భశోకం, చిత్రావతి వధ అంటూ అధికార పార్టీకి వత్తాసు పలికే పత్రికల్లోనే కథనాలు వస్తున్నాయని, అయినా అధికారుల వైపు నుంచి చర్యలు లేవని అన్నారు. పసలూరుకు వచ్చి చూడండి గత ప్రభుత్వంలో పసులూరు వద్ద నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి..మంచి లేఅవుట్ వేసి అధునాతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఇప్పుడు అక్కడ కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రమట్టిని అక్రమంగా తరలించారన్నారు. కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు వచ్చి చూస్తే ఏ స్థాయిలో దారుణాలకు పాల్పడ్డారో తెలుస్తుందన్నారు. పసులూరు లేఅవుట్లో ఎర్రమట్టి తరలింపు అంశంపై బుక్కరాయసముద్రం పోలీస్స్టేషన్లో కేసు పెట్టినా.. ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ లేవన్నారు. అసలు కేసు ఏమైందో చెప్పేవారే లేరన్నారు. అక్రమార్కులపై చర్యలు కోసం వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ గువ్వల శ్రీకాంత్రెడ్డి, శింగనమల మండల కన్వీనర్ పూల ప్రసాద్, గార్లదిన్నె మండల కన్వీనర్ యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            నిగ్గు తేల్చకుండా గుడిసెల తొలగింపు
కూడేరు: మండలంలోని బ్రాహ్మణపల్లిలో సర్వేనంబర్ 93లో ఇంటి స్థలాలు కేటాయించాలంటూ 24 రోజుల క్రితం అఖిల భారత రైతు కూలీ సంఘం, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సుమారు 1,700 మంది పేదలు ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. వీరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బుధవారం వేకువజాము 3 గంటలకు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలు, 140 మంది పోలీసులతో రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని జేసీబీలతో గుడిసెలను నేలమట్టం చేయించారు. ఆ సమయంలో ఆ భూమి తమదేనంటున్న ఇద్దరు వ్యక్తులు వంద మంది ప్రైవేట్ సైన్యంతో పేదలను ఇష్టానుసారంగా లాగి పక్కకు పడేశారు. గుడిసెల్లోని సామగ్రిని పక్కకు తీసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా జేసీబీలను ఉసిగొల్పడంతో పేదలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి చెరువు భూమిగా ఉందని అలాంటి భూమి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా ఎలా ఇస్తారంటూ అధికారులను ఏఐకేఎంఎస్, న్యూడెమోక్రసీ నేతలు, పేదలు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. భూమి తమది అని చెప్పుకునే టీడీపీ నేతలకు అండగా అధికారులు నిలిచి తెల్లారేలోపు చీకట్లలోనే పని ముగించేసి చేతులు దులుపుకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బ్రాహ్మణపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో 2200 ఎకరాల శోత్రియం భూములు ఉన్నాయి. వీటిలో నెల్లూరు సెటిల్మెంట్ ఎంత, అందులో మిగులు భూమి ఎంత? సీలింగ్ చట్టం కింద ఎంత భూమి ఉంది. స్వాధీనం చేసుకున్న ఆ భూమి ఎక్కడుంది... ఏమైంది? ప్రైవేట్ వ్యక్తుల పేరుతో వందలాది ఎకరాల భూమిని ఎలా కేటాయిస్తారు? తదితర అంశాలపై వాస్తవాలు తేల్చకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని పేదలు వాపోయారు. కేవలం స్థానిక టీడీపీ నాయకులు వెంకటేశులు, నారాయణస్వామి అక్కడున్న 136 ఎకరాలు తమదేనంటూ నోటి మాటగా చెప్పడంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడబలుక్కొని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 1,700 గుడిసెలను జేసీబీలతో కూలదోసిన రెవెన్యూ అధికారులు - 
      
                   
                               
                   
            ఒక్క సంతకంతో భావితరాలకు ఉజ్వల భవిత
కళ్యాణదుర్గం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసే ప్రతి ఒక్క సంతకం భావితరాలకు ఉజ్వల భవిత కానుందని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. బుధవారం సాయంత్రం పార్టీ శ్రేణులతో కలసి స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 15, 16వ వార్డుల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలతో మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఆపేలా గవర్నర్కు లేఖ పంపేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా వార్డులలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం కన్వీనర్ సుధీర్, కౌన్సిలర్లు లక్ష్మన్న, పరమేశ్వరప్ప, రాజ్కుమార్, నాయకులు గణేష్, ఉమాపతి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి కృష్ణమూర్తి, కామక్కపల్లి మల్లి, యూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు యాదవ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు చరణ్, మురళి, రామిరెడ్డి, దొడ్ల తిప్పేస్వామి, షెక్షావలి, అజయ్, జాకీర్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య - 
      
                   
                               
                   
            ప్రేమ... పెళ్లి.. ఓ కిడ్నాప్
అనంతపురం సెంట్రల్: ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అగ్రవర్ణ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. అదే మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన కురుబ బాలకొండ శంకరయ్య(32) ఆమెతో పరిచయం పెంచుకుని చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇటీవల ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం చేయాలని నిశ్చయించారు. విషయం తెలుసుకున్న శంకరయ్య బుధవారం ఆమెను తన వెంట పిలుచుకెళ్లాడు. పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా తెలుసుకున్న మహిళ బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురంలోని రాంనగర్లో ఉన్నాడని తెలుసుకుని కారులో వచ్చి శంకరయ్యను కిడ్నాప్ చేశారు. నగర శివారుకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయంపై డయల్ –100కు సమాచారం వెళ్లడంతో అక్కడి నుంచి ఆదేశాలు అందుకున్న అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అప్రమత్తమై, బాధితుడు పడి ఉన్న చోటుకు చేరుకున్నారు. ఒళ్లంతా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న శంకరయ్యను సర్వజనాసుపత్రికి తరలించారు. కిడ్నాప్నకు పాల్పడిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు సీఐ జగదీష్ నిరాకరించారు. యువకుడిని చితకబాదిన మహిళ బంధువులు - 
      
                   
                               
                   
            78 మందికి కారుణ్య నియామకాలు
● ‘సాక్షి’ కథనంతో కదలిక అనంతపురం అర్బన్: ఏడాదిన్నరగా కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్న అంశంపై ‘కొత్త సారుపై కొండంత ఆశ ’ శీర్షికన గత నెల 21న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై కలెక్టర్ ఆనంద్ వెంటనే స్పందించారు. నెల రోజుల వ్యవధిలో కారుణ్య నియామకాలు పూర్తి కావాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించడంతో ప్రక్రియలో కదలిక వచ్చింది. మొత్తం 102 దరఖాస్తులు పరిశీలించారు. వీటిలో సమగ్రంగా ఉన్న 78 దరఖాస్తులను ఆమోదిస్తూ బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో సంబంధీకులకు నియామక ఉత్తర్వులను కలెక్టర్ ఆందజేసి, మాట్లాడారు. కారుణ్య నియామకం కింద వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారు బాధ్యతగా ఉంటూ ప్రజలకు నిజాయతీతో సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, డీటీ శ్రీనివాసమూర్తి, తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి
అనంతపురం అర్బన్:‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలి. అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ పి.జగదీష్తో కలిసి ఆయన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్మశాన వాటికల ఏర్పాటుకు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పరిష్కార వేదికలో ఎస్సీ, ఎస్టీ సమస్యలకు సంబంధించి అందిన అర్జీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఉల్లంఘనలకు తావివ్వకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, డీఆర్ఓ ఎ.మలోల తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఖర్చు చేయాలన్నారు. గుమ్మఘట్ట ఎంఈఓ రామచంద్రప్ప సస్పెన్షన్ అనంతపురం సిటీ: గుమ్మఘట్ట మండల విద్యా శాఖాధికారి(ఎంఈఓ)గా పని చేస్తున్న హరిజన రామచంద్రప్ప సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం విద్యా శాఖ కడప ప్రాంతీయ సంచాలకుడు శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా హరిజన రామచంద్రప్ప పనిచేశారు. ఆ సమయంలో నాడు–నేడు పథకం కింద మంజూరైన రూ. లక్షల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. తాజాగా విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఈఓ రామచంద్రను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు. అయితే తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారంటూ ఎంఈఓ రామచంద్ర విలేకరులతో వాపోయారు. నిద్ర మత్తు వీడిన సర్కారు ● ఎట్టకేలకు పప్పుశనగ పంపిణీకి సిద్ధంఅనంతపురం అగ్రికల్చర్: కూటమి సర్కారు నిద్ర మత్తు వీడింది. జిల్లాలో ఎట్టకేలకు విత్తన పప్పుశనగ పంపిణీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రబీ రైతులకు రాయితీతో విత్తన పప్పుశనగ పంపిణీ చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో ఎట్టకేలకు పంపిణీకి సిద్ధమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం వ్యవసాయశాఖ నుంచి ఏపీ సీడ్స్కు అనుమతులు జారీ అయ్యాయి. జిల్లాకు కేటాయించిన 14 వేల క్వింటాళ్ల జేజీ–11 రకం విత్తనాలు 25 శాతం సబ్సిడీతో ఇవ్వడానికి వీలుగా గురువారం నుంచి 17 మండలాల పరిధిలో 180 ఆర్బీకేల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించారు. తాడిపత్రి డివిజన్కు 4,850 క్వింటాళ్లు, ఉరవకొండ డివిజన్ 4,285, రాయదుర్గం డివిజన్ 2,465, గుత్తి డివిజన్ 1,200, కళ్యాణదుర్గం డివిజన్ 1,000, అనంతపురం డివిజన్కు 200 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఇందులో 7 వేల క్వింటాళ్లు సర్టిఫైడ్ సీడ్, మరో 7 వేల క్వింటాళ్లు ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కణేకల్లు, డీ.హీరేహాళ్, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, యాడికి, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి, ఉరవకొండ,విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. క్వింటా పూర్తి ధర రూ.7,800 కాగా రాయితీ రూ.1,950 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 ప్రకారం చెల్లించాలి. - 
      
                   
                               
                   
            కక్ష గట్టి.. పదవి నుంచి తప్పించి!
● దుర్గం మున్సిపల్ చైర్మన్ రాజ్కుమార్ తొలగింపు ● ఎమ్మెల్యే అమిలినేని కక్ష సాధింపులపై సర్వత్రా విమర్శలు కళ్యాణదుర్గం: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కక్ష సాధింపులు తారస్థాయికి చేరాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్కుమార్పై కక్ష గట్టిన ఆయన తాజాగా పదవి నుంచి తొలగింపజేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మున్సిపల్ అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపిస్తూ తొలగించడం గమనార్హం. రూ.46 కోట్ల పనులకు అడ్డు లేకుండా.. ఇటీవల మున్సిపల్ పాలక వర్గం రూ.46 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా రూ.16 కోట్లతో మున్సిపల్ కాంప్లెక్స్ భవనం, రూ.3 కోట్లతో మున్సిపల్ కార్యాలయం, రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మల్టీ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణాలతో పాటు పలు చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం ప్రతిపాదించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీకి సంబంధించిన చైర్మన్ ఉంటే తమ అక్రమాలకు అడ్డంకిగా మారతాడని భావించి తప్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టార్గెట్ చేసిన కమిషనర్ కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. చైర్మన్ రాజ్కుమార్కు కనీస గౌరవం ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే ఏం చెబితే అదే చేస్తున్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్ మీట్పై పలుమార్లు చైర్మన్, కౌన్సిలర్లు కమిషనర్ను కలిసినా తేదీలు ఖరారు చేయలేదు. ఎమ్మెల్యే ఏ డేట్ చెబితే అదే రోజు ఉంటుందని గతంలో ఆయన ప్రకటించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. తాజాగా ప్రిన్సిపల్ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో.. రెండు నెలల వ్యవధిలో రెండు కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా చైర్మన్ జరపలేదని పేర్కొనడం గమనార్హం. సాధారణ వ్యక్తికి చైర్మన్ పీఠం.. తోపుడు బండిపై కళింగర, బొప్పాయి, కర్భూజ పండ్లను పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే రాజ్కుమార్ను కౌన్సిలర్ను చేయడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ పీఠం ఇచ్చి వైఎస్సార్ సీపీ గౌరవించింది. అలాంటి నిరాడంబర వ్యక్తిని అవమానకర రీతిలో తొలగింపజేసిన ఎమ్మెల్యేపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారు.. అగ్రవర్ణాల వ్యక్తులను అందలం ఎక్కించడం కోసమే చైర్మన్ పదవి నుంచి రాజ్కుమార్ను ఎమ్మెల్యే తొలగింపజేశారని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు దుయ్యబట్టారు. కౌన్సిలర్లు సురేష్, గోపారం హేమావతి, కుర్రా రాము, ఈడిగ సుదీప్తి, ఎరుకుల తిప్పమ్మ, తిరుమల చంద్రమ్మ, లక్ష్మన్న, పరమేశ్వరప్ప, పూసల భాగ్యమ్మ, అర్చన, కో ఆప్షన్ సభ్యులు మమతా సురేష్, అప్జల్, సల్లా మారుతి పత్రికా ప్రకటన విడుదల చేశారు. పనికిమాలిన, లంచ గొండి కమిషనర్ను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజ మెత్తారు. కమిషనర్ పోస్టుకు అర్హత లేని వంశీకృష్ణ భార్గవ్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో వివాదాలకు తెర లేపారన్నారు. ఈయన పూర్తిగా టీడీపీ కార్యకర్త అని, తన పై అధికారులంటే కూడా ఏ మాత్రమూ భయం లేదన్నారు. అవినీతిని ప్రోత్సహించడంలో భాగంగానే కుట్రతో పదవిని రద్దు చేశారన్నారు. - 
      
                   
                               
                   
            వైఎస్సార్సీపీ మండల కన్వీనర్పై దాడి
పెద్దవడుగూరు: మండల కేంద్రమైన పెద్దవడుగూరులో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డిపై టీడీపీ కార్యకర్త ఈశ్వరరెడ్డి దాడికి తెగబడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భీమునిపల్లి, రావులుడికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలతో తన ఇంట్లో మాట్లాడుతుండగా మద్యం మత్తులో అక్కడకు చేరుకున్న ఈశ్వరరెడ్డి కవ్వింపు చర్యలకు దిగాడు. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే తన పేరును పార్టీ ప్రతిపాదించిందని, వైఎస్సార్సీపీ తరఫున ఎవ్వరైనా నిలబడితే చంపుతానంటూ బెదిరించాడు. దీంతో శరభారెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామని, అప్పటి వరకూ ఎలాంటి గొడవలకు పోకుండా కలసిమెలిసి ఉందామని తెలిపాడు. దీంతో శరభారెడ్డిపై ఈశ్వరరెడ్డి దాడి చేశాడు. పక్కన ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించి, పట్టుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని పీఎస్కు తరలించారు. అనంతరం పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. విద్యుదాఘాతంతో రైతు మృతి యల్లనూరు: విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన పత్తికొండ పెద్దన్న (72)కు భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తమకున్న పొలంలో పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వరి పంటకు నీరు పెట్టేందుకు బుధవారం ఉదయం భార్యతో కలసి పెద్దన్న పొలానికి వెళ్లాడు. స్తంభంపై ఉన్న లైనుకు మోటార్ వైర్లను తగిలించే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ బుక్కరాయసముద్రం: మండలంలోని వడియంపేట వద్ద ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీకేఎస్ పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ పుల్లయ్య వెల్లడించారు. ఈ నెల 6న కేశవరెడ్డి పాఠశాల క్యాష్ కౌంటర్లో నుంచి రూ. 2 లక్షల నగదును దుండగులు అపహరించారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారన్నారు. ఈ క్రమంలో నిందితులను గుజరాత్లోని వల్సార్ జిల్లాకు చెందిన రవి పవార్, భరత్ రాజారంగా గుర్తించి, సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకుని వచ్చినట్లు వివరించారు. విచారణ అనంతరం నేరాన్ని అంగీకరించడంతో నిందితులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించామన్నారు. కాగా, ఇదే కేసులో మనోహర్, పవార్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు సీఐ పుల్లయ్య తెలిపారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి అనంతపురం టౌన్: నెల వారీ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోపు చెల్లిస్తే వచ్చే నెల బిల్లులో వినియోగదారుల రూ.25 అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ విషయాన్ని గుర్తించుకుని సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు. - 
      
                   
                                                     
                   
            మోసకారి డీటీకి మంత్రిగారి అండ..
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం నగరానికి చెందిన కె.అశోక్కుమార్ పౌర సరఫరాల విభాగంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ.. 2022 నుంచి మెడికల్ లీవ్లో ఉన్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఆయన అమాయకులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని, భూములు రాయిస్తానని ఎంతోమంది రైతులను నమ్మించి రూ.కోట్లలో దండుకున్నారు. ఉద్యోగానికి వెళ్తే డబ్బిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఉంటాయని భావించి డ్యూటీకి వెళ్లకుండానే కాలం గడిపేస్తున్నారు.అంతటితో ఆగకుండా పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తారు. అలాంటి అధికారికి పెనుకొండ నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి సవిత సిఫారసు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్కుమార్ అనంతపురం జిల్లాలోని రొళ్ల, అగళి, పరిగితో పాటు వివిధ మండలాల్లో సీఎస్డీటీగా పని చేశారు. 2022 నుంచి మెడికల్ లీవ్లో ఉన్నారు. తాను పనిచేసిన ప్రాంతాల్లో పలువురికి మాయమాటలు చెప్పి రూ.కోట్లలో దండుకున్నారు.అనంతపురం గుల్జార్పేటకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.2 లక్షలు, కోర్టు రోడ్డుకు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, తాడిపత్రిలో రూ.8 లక్షలు, కమ్మవారిపల్లిలో రూ.15 లక్షలు, కుంటిమద్దికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు, కర్నూలులో రూ.3.5 లక్షలు, నార్పలలో రూ.5 లక్షలు.. ఇలా సుమారు 27 మంది నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకున్నారు. కొందరి నుంచి అప్పుగా తీసుకోగా.. మరికొందరికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తానని నమ్మబలికి వసూలు చేశారు. పనులు చేయించకపోగా.. డబ్బు కూడా తిరిగివ్వలేదు. బాధితులు డబ్బు అడిగితే రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. తమ ఫోన్ నంబర్లు సైతం బ్లాక్ లిస్టులో పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంత్రి ఇలాకాలో పోస్టింగ్ కోసం.. రూ.కోట్లు దండుకుని బాధితులను ఇబ్బంది పెడుతున్న సీఎస్డీటీ అశోక్కుమార్ చికిత్స కోసం బెంగళూరు వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉంటుందని, అతడికి రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, పెనుకొండ మండలాల్లో ఏదో ఒకచోట పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. అయితే, ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో మంత్రి సవితతో సిఫారసు చేయించుకున్నారు. - 
      
                   
                               
                   
            ఉరవకొండలో భారీ వర్షం
● మగ్గం గుంతల్లో నీటి ఊటతో చేనేతల ఆవేదన ● వర్షాలతో పంటలకూ తీవ్ర నష్టంఅనంతపురం అగ్రికల్చర్/ఉరవకొండ: ‘మోంథా’ తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 14 మండలాల పరిధిలో 9.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరవకొండలో 80.4 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే, గుంతకల్లు 53.2 మి.మీ, రాయదుర్గం 45.4, శెట్టూరు 39.2, బొమ్మనహాళ్ 22.4, బ్రహ్మసముద్రం 20, విడపనకల్లు 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం పగలంతా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. ఈ వర్షాలతో పంట నూర్పిడి చేస్తున్న వరి, వేరుశనగ, మొక్కజొన్నతో పాటు టమాటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, భారీ వర్షానికి ఉరవకొండ పట్టణంలోని చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి ముడి సరుకులు దెబ్బతిన్నాయి. నష్టం అంచనాకు మంగళవారం అధికారులు సర్వే చేపట్టారు. వేదావతి ఉగ్రరూపం రాయదుర్గం: వేదావతి నది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ‘బీటీపీ’కి వరద పోటెత్తింది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1,655 అడుగులు కాగా, 1,653.2 అడుగులకు నీరు చేరింది. దీంతో డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు 4,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వేదవతి హగిరిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా బీటీపీ వద్ద మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. గుమ్మఘట్ట – బ్రహ్మసముద్రం మార్గంలో వేపులపర్తి సమీపాన వేదావతిపై నిర్మించిన కాజ్వేపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపేశారు. - 
      
                   
                               
                   
            బాలుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలో ఐదేళ్ల బాలుడు సుశాంత్ను దారుణంగా హత్య చేసిన పెన్నయ్యను మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. సీఐ రాజేంద్రనాథ్యాదవ్ తెలిపిన మేరకు.. నగరంలోని అరుణోదయ కాలనీలో నివాసముంటున్న గోవిందహరి, నాగవేణి దంపతుల కుమారుడు సుశాంత్(5) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గత శనివారం రాత్రి 12 గంటల సమయంలో టిఫెన్ తినడానికి దంపతులిద్దరూ ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లిన సమయంలో పొరుగింటిలో నివాసముంటున్న ఆటోడ్రైవర్ పెన్నయ్య బాలుడిని హత్య చేసి సంచిలో తీసుకెళ్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ముళ్ల పొదల్లోకి పడేశాడు. అయితే బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానితుడు పెన్నయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించాడు. ఇందుకు కారణాలను వెల్లడించాడు. పెన్నయ్య గతంలో పెళ్లి చేసుకున్న ఆమె విభేదించి వెళ్లిపోయింది. దీంతో సావిత్రి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలంగా ఆమెతోనూ మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల సావిత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు కారణం సుశాంత్ తల్లి నాగవేణి అని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే బాలుడిని హత్య చేసినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంగళవారం రిమాండ్కు తరలించారు. - 
      
                   
                               
                   
            బెల్టు షాపులపై విస్తృత దాడులు
అనంతపురం సెంట్రల్: అనంతపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మంగళవారం అనధికారిక మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. అనంతపురం ఎక్సైజ్ పోలీసులు, ఎస్టీఎఫ్టీఎం, విజయవాడ ఈఎస్టీఎఫ్ సిబ్బంది బృందంగా ఏర్పడి దాడులు చేశారు. నారాయణపురం గ్రామానికి చెందిన చాకలి నాగేంద్ర నుంచి 30 బాటిళ్లు, పంగల్ రోడ్డులో సాకే నాగలక్ష్మి నుంచి 34 మద్యం బాటిళ్లు, కక్కలపల్లికి చెందిన బుడగం ముసలప్ప నుంచి 42 మద్యం బాటిళ్లు స్వాధీ నం చేసుకొని కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో ఈఎస్టీఎఫ్ సీఐ జయనాథరెడ్డి, ఎస్ఐలు కృష్ణారెడ్డి, ప్రసాద్, హెచ్ఆర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. పీఏబీఆర్లో జల విద్యుత్ ఉత్పత్తి పునః ప్రారంభం కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద జల విద్యుత్ ఉత్పత్తిని పునః ప్రారంభించినట్టు డ్యాం ఇరిగేషన్ ఈఈ శశి రేఖ తెలిపారు. మంగళవారం ఆమె పీఏబీఆర్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ గేటు లింక్ మరమ్మతులు పూర్తి కావడంతో విద్యుత్ ఉత్పత్తిని పునః ప్రారంభించామన్నారు. ఒక టర్బైన్లో గంటకు 3 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. డ్యాంలోకి ఇన్ఫ్లో 1,000 క్యూసెక్కులుండగా అవుట్ ఫ్లో 2,200 క్యూసెక్కులు నమోదవుతోందన్నారు.మోంథా తుపాన్ నేపథ్యంలో డ్యాం భద్రత దృష్ట్యా 4,6 గేట్లు ఎత్తి దిగువకు 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఆమె వెంట డీఈఈలు వెంకటరమణ, ఉదయ్, ఈఈలు లక్ష్మీదేవి, ముత్యాలప్ప తదితరులున్నారు. - 
      
                   
                               
                   
            ఎస్సీల సమస్యల పరిష్కారానికి కృషి
అనంతపురం టవర్క్లాక్/అనంతపురం రూరల్: ఎస్సీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శాసనసభ సభ్యుల కమిటీ అధ్యక్షుడు కుమార రాజా తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో షెడ్యూల్ కులాలకు చెందిన సంఘాల నాయకులు, ప్రజల నుంచి కమిటీ సభ్యులు ఫిర్యాదులు స్వీకరించారు. తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, రీ సర్వేలో తన పేరును అధికారులు తొలగించారని ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన పద్మావతి ఫిర్యాదు చేశారు. జిల్లాలో దళిత, గిరిజనులపై దాడులు అధికమయ్యాయని, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా చూడాలని ఓ సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. అంబేడ్కర్ విదేశీ విద్య, రద్దయిన 27 సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేయడంతో పాటు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్కు కృషి చేయాలని దండోరా నాయకులు కోరారు. ఎస్కేయూలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. వినతుల స్వీకరణ అనంతరం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శాసనసభ కమిటీ సభ్యులు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కుమారరాజా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, కమిటీ సభ్యులు కావలి గ్రీష్మ, ఎంఎస్ రాజు, బోనెల విజయ చంద్ర, రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            కాపాడబోతే కాటేసింది!
గార్లదిన్నె: విష సర్పాన్ని కాపాడబోయిన ఓ వ్యక్తి చివరకు దాని కాటుకు మృతిచెందాడు. వివరాలు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన నెట్టికల్లు (57)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కల్లూరులోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం తన ఇంటి సమీపంలోని ఓ ఇంట్లో పాము ఉందని తెలుసుకున్న నెట్టికల్లు.. దానిని కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళుతుండగా కాటేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పామిడిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. - 
      
                   
                               
                   
            దళితురాలనే హోటల్ను కూలదోశారు
● లంచం తీసుకుని కమిషనర్ ద్రోహం చేశారు ● బాధితురాలు దివ్య కళ్యాణదుర్గం: కేవలం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళను కావడంతోనే టీడీపీ నేతల ఒత్తిళ్లతో తన హోటల్ను మున్సిపల్ అధికారులు కూలదోశారంటూ బాధితురాలు దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హోటల్ తొలగించిన స్థానంలో ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షుడు చెలిమప్పతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. తాను 30 ఏళ్లుగా ఆర్అండ్బీ స్థలం పక్కనే చిన్న హోటల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపాలిటీకి నీటి పన్ను, ఇంటి పన్నుతో పాటు విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నానన్నారు. తన హోటల్ వెనుక ఉన్న కానిస్టేబుల్ నరసింహులతో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ రూ.1.50 లక్షలు లంచం తీసుకుని అన్యాయంగా తన హోటల్ను తొలగించారని ఆరోపించారు. తన హోటల్ పక్కనే ఆర్అండ్బీ స్థలంలో నిర్వహిస్తున్న హోటళ్ల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలైన తన హోటల్ను మాత్రమే కూలదోశారంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. కమిషనర్ మూడు రోజుల్లోపు ఆర్అండ్బీ స్థలంలో ఉన్న వాటిని తొలగిస్తానని చెప్పారని తొలగించని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతానని పేర్కొన్నారు. - 
      
                   
                               
                   
            వంక పొరంబోకు స్థలాలతో వ్యాపారం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 194–8లోని వంక పొరంబోకు స్థలాలతో కొందరు కేటుగాళ్లు వ్యాపారం మొదలుపెట్టారు. ఈ సర్వే నంబరులో మొత్తం 12.05 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల మేరకు ఈ భూమి అంతా వంకపొరంబోకుగా ఉంది. పైగా ఈ భూమి హైకోర్టులో వివాదం ఉంది. ఈ భూమిపై కన్నేసిన ఈడిగ వెంకటేశు, ఇర్ఫాన్, శివశంకర్ తదితరులు పేదలతో అక్రమంగా గుడిసెలు వేయించారు. ఒక్కో గుడిసెకు వేలాది రూపాయలు వసూలు చేశారు. అందరికీ ఫేక్ పట్టాలు ఇచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెళ్లి మాట్లాడారు. వినకపోవడంతో మంగళవారం ఇన్చార్జ్ వీఆర్ఓ జిలానీ ఆశిక్ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఈడిగ వెంకటేశు గతంలో ఇలాంటి కేసులోనే రిమాండ్కు వెళ్లొచ్చాడు. ఇర్ఫాన్పై కూడా కేసులు నమోదైనట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన కొందరు నేతల వీరికి అండగా నిలిచినట్లు తెలిసింది. - 
      
                    
జిల్లా అంతటా మంగళవారం తుపాను వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలి వీచింది.
‘దివ్యాంగుడు రమేష్ పింఛనుకు నమోదు చేస్తాం’ అనంతపురం అర్బన్: స్థానిక అరవిందనగర్లో నివాసముంటున్న జొన్నా రమేష్కు పింఛను వచ్చేలా ఆన్లైన్లో నమోదు చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ఈనెల 28న సాక్షిలో ప్రచురితమైన ‘‘ప్రజా ప్రదక్షిణ వేదిక’’ కథనంపై కమిషనర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ రమేష్కు పింఛను తొలగించిన అంశంపై ఆరా తీశామన్నారు. గతంలో ఆయనకు వృద్ధాప్య పింఛను మంజూరులో భాగంగా విచారణకు వెళ్లిన సమయంలో ఇంటి వద్ద లేడని, దీంతో మంజూరు కాలేదని చెప్పారు. రమేష్కు 2024 సెప్టెంబరు 4న వికలాంగ సర్టిఫికెట్ మంజూరైందన్నారు. కొత్త పింఛను నమోదుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తామని వెల్లడించారు. నిషేధిత డ్రగ్స్ సీజ్ పామిడి: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ కాంప్లెక్స్లోని బాలాజీ మెడికల్ స్టోర్లో మంగళవారం డ్రగ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ శాఖ ఏడీ వీర కుమార్రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అశోక్రెడ్డి, మాధవి తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నిషేధించిన డ్రగ్స్ అమ్మకాలను గుర్తించి సీజ్ చేశారు. కార్యక్రమంలో సీఐలు యుగంధర్, జైపాల్రెడ్డి, ఈగల్ ఎస్ఐ హనుమంతు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            తుపాన్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలి
● ప్రజలకు ఎస్పీ జగదీష్ సూచనఅనంతపురం సెంట్రల్: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ‘మోంథా’ తుపాన్ ముగిసే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జగదీష్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు డయల్ 100, 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రధాన చెరువులు, వాగులు, వంతెనలు, చెక్డ్యాంల వద్ద పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిడుగుపాట్లు సంభవించే ప్రమాదమున్న నేపథ్యంలో వ్యవసాయ పనుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చెట్ల కింద ఉండరాదని రైతులకు ఆయన సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు అనంతపురం మెడికల్: వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులతో డీఎంహెచ్ఓ మాట్లాడారు. పంచాయతీ, మునిసిపల్ అధికారుల సమన్వయంతో మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేపట్టాలన్నారు. డెంగీ, మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల్లో అందుబాటులో ఉండాలని, విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూమ్ కాన్ఫరెన్స్లో డీఎల్టీఓ జయలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, డెమో నాగరాజు, స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            దుర్గం టీడీపీలో అసమ్మతి మంటలు
● ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ● అమిలినేనిపై మారుతీ చౌదరి గరం గరం కళ్యాణదుర్గం: నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి జ్వాల రగిలింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వ్యవహార శైలిపై అదే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నం మారుతీ చౌదరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొని, గెలిచిన అనంతరం ఆ వర్గాన్ని ఎమ్మెల్యే దూరం పెడుతూ వచ్చారు. ఈ–స్టాంప్ కుంభకోణంపై ఫిర్యాదు కళ్యాణదుర్గంలో ఇటీవల దుమారం లేపిన ఈ స్టాంప్ కుంభకోణం బయటకు రావడానికి కారణం మారుతీ చౌదరేనని ఎమ్మెల్యే అమిలినేని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ క్రమంలోనే కుంభకోణం గురించి మారుతీ చౌదరి అధిష్టానం వద్ద వివరించారని, బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని బ్యాంకర్లను మోసం చేయడంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే అమిలినేనికి, ఉన్నం కుటుంబ సభ్యులకు మరింత దూరం పెరిగింది. తాజాగా పెట్రోల్ బంక్ స్థలం వ్యవహారం తాజాగా పట్టణంలోని కంబదూరు రోడ్డులో మారుతీ చౌదరికి చెందిన నయారా పెట్రోల్ బంకుకు సంబంధించి వివాదం రేగింది. పెట్రోల్ బంకు ఆర్అండ్బీ స్థలంలో ఉందని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొల్పారని, దీంతో రంగంలోకి దిగిన అధికారులు పెట్రోల్ బంకుతో పాటు అక్కడి గదులను కొలతలు వేసినట్లు తెలిసింది. దీనిపై రగిలిపోయిన మారుతీ చౌదరి రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ వంశీకృష్ణభార్గవ్పై చిందులు తొక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపైనా, దాని వెనుక ఉన్న వారిపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పడం సంచలనం కలిగించింది. - 
      
                   
                               
                   
            జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుత్తి: స్థానిక సాయి అకాడమీకి చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు అకాడమీ మాస్టర్ సాయి తేజ మంగళవారం తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గుత్తికి చెందిన కరిష్మ, కీర్తన, పూజిత బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. వీరు నవంబర్లో జమ్ముకాశ్మీర్లో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. 31 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించొచ్చు అనంతపురం సిటీ: ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈ నెల 31 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ మంగళవారం తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుముతో నవంబర్ 6వ తేదీలోపు చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమ్మవారి ఆలయంలో త్రిశూలం కూల్చివేత తాడిపత్రి టౌన్: స్థానిక ఏటిగడ్డ పెద్దమ్మ ఆలయంలో త్రిశూలాన్ని అదే కాలనీకి చెందిన ఓగేటి రంగనాథ్ కూల్చి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోమవారం సాయంత్రం రంగనాథ్ ఆలయం వద్దకెళ్లి రోడ్డుకు అడ్డంగా త్రిశూలం ఉందని, కాలనీలోకి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందంటూ ఆలయ కమిటీ సభ్యులను దూషిస్తూ పెకలించి వేశాడన్నారు. ఎస్ఐ గౌస్బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రంగనాథ్ను బైండోవర్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. న్యాయం చేయకుంటే.. ఆత్మహత్య చేసుకుంటా శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలోని ఇందిరమ్మ కాలనీలో రెవెన్యూ అధికారులు రేకుల షెడ్కు ఉన్న పునాదిని తొలగించారని, తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితురాలు నాగలక్ష్మి వాపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అయింది. స్పందించిన తహసీల్దార్ అరుణకుమారి మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలనీలో ఆమె ఉంటున్న స్థలాన్ని మరొకరికి కేటాయించామని, దీనిపై ఆమె దరఖాస్తు చేసుకుంటే, అర్హతను పరిశీలించి మరో చోట ఇంటి స్థలం మంజూరు చేస్తామన్నారు. ఆమె వేసుకున్న స్థలం మరొకరికి ఇచ్చినందున తొలగించాల్సి వచ్చిందన్నారు. - 
      
                   
                               
                   
            జెడ్పీలో సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు
అనంతపురం టవర్క్లాక్: జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పించారు. మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో పదోన్నతుల ఉత్తర్వులను చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో టి.ఫణిశేఖరరెడ్డి (జెడ్పీ కార్యాలయం), సి.రవి (వజ్రకరూరు), వై.లోక మల్లికార్జునరెడ్డి (అమడగూరు), కె.హనుమంతప్ప (గుమ్మఘట్ట), ఎం.కృష్ణానాయక్ (బెళుగుప్ప), హెచ్.మల్లికార్జున (బత్తలపల్లి), యు.ముత్యాలరెడ్డి (జెడ్పీకార్యాలయం) ఉన్నారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. పదోన్నతుల్లో పదనిసలు జిల్లా పరిషత్ ఉద్యోగుల పదోన్నతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు రకాల క్యాడర్లకు మంగళవారం సాయంత్రం పదోన్నతులు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడి వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే పదోన్నతి పొందిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా స్థాన చలనం కలిగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయంగా పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లుగా జెడ్పీ ఉద్యోగులు బాహటంగానే విమర్శిస్తున్నారు. - 
      
                   
                               
                   
            మారని జీజీహెచ్ తీరు
ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అనంతపురంలోని సర్వజనాస్పత్రి (జీజీహెచ్) సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఎక్కడా స్వచ్ఛత కనిపించడం లేదని రోగుల సహాయకులు వాపోతున్నారు. పర్యవేక్షణ లోపం కారణంగా నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. అనంతపురం మెడికల్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలను అందించిన అనంతపురంలోని సర్వజనాస్పత్రి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వీర్యమైంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి అందించిన సేవలు నేటికీ ప్రజలు మరువలేకున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వంలో సర్వజనాస్పత్రిలో పరిపాలన పడకేసింది. రోగులకందించే వైద్యంలో నాణ్యత కరువైంది. పర్యవేక్షణ లోపంతో రోగులు, గర్భిణులు, బాలింతలు అర్ధాకలితతో అలమటిస్తున్నారు. ఇక పారిశుధ్యం నిర్వహణ, రోగుల భద్రత గాలిలో దీపమైంది. వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. పరిపాలన అస్తవ్యస్తం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారులు వ్యవహరిస్తున్నారు. పైరవీలతో సూపరింటెండెంట్ బాధ్యతలను స్వీకరించిన వారు ఆస్పత్రి పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో సేవలు అడుగంటిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల కాలంలోనే ముగ్గురు సూపరింటెండెంట్లు మారారు. ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు, మూడు సార్లు కింది స్థాయి సిబ్బందికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి ఇన్విజిలేషన్ డ్యూటీ అంటూ సెలవులో వెళ్లిపోవడం గమనార్హం. ఇక ఆస్పత్రిలో పరిశుభ్రత అనేది ఎక్కడేగాని కనిపించడం లేదు. వీధికుక్కలు వార్డుల్లో సంచరిస్తూ అక్కడే తిష్ట వేస్తున్నాయి. వార్డుల్లో సురక్షిత ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశారు. బయో వ్యర్థాల నిర్వహణ కనిపించడం లేదు. డైట్ నిర్వహణ కాంట్రాక్టర్లకు వరదాయినిగా మారింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఏనాడూ అన్నపానీయాలు అందించిన దాఖలాలు లేవు. ఫలితంగా అడ్మిషన్లో ఉన్న రోగులు, బాలింతలు, గర్భిణులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పోస్టింగ్లు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఎన్నడూ లేనివిధంగా ఈ 17 నెలల కాలంలోనే ఇష్టారాజ్యంగా విధులు కట్టబెడుతూ ఆస్పత్రి నిర్వహణను అస్తవ్యస్తంగా మార్చేశారు. గతంలో పని చేసిన ఇద్దరు సూపరింటెండెంట్లు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ సౌజన్య కుమార్కు అబా రిజిస్ట్రేషన్ ఇన్చార్జ్గా, ఫార్మసీ మెడికల్ ఆఫీసర్గా, ఆఫీస్ ఏడీ పోస్టుల్లో కూర్చోబెట్టారు. క్యాజువాలిటీలో సీఎంఓగా ఉన్న డాక్టర్ కౌసర్బేగంను కొన్ని రోజుల పాటు ఫార్మసీ ఇన్చార్జ్గా, ప్రస్తుతం డిప్యూటీ ఆర్ఎంఓ సీటును అప్పగించారు. అలాగే క్యాజువాలిటీలో పనిచేస్తున్న 8 మంది మెడికల్ ఆఫీసర్లను సూపర్ స్పెషాలిటీకి కేటాయించారు. వాస్తవానికి ఆస్పత్రిలో రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంఓ) అత్యంత కీలకం. వీరి కనుసన్నల్లోనే పర్యవేక్షణ జరగాలి. కానీ, ఆ పరిస్థితి ఎక్కడేగాని కనిపించడం లేదు. ఏకపక్షంగా ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారికి విధులు కేటాయించేస్తున్నారు. ఎంఎన్ఓల విధులు సైతం ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నా.. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ సీనియర్ ఎంఎన్ఓకు బాధ్యతలు అప్పగించారు. దీంతో క్యాజువాలిటీ, ఏఎంసీ, మెడిసిన్, ఆర్థో, ఆపరేషన్ థియేటర్లలో ఎంఎన్ఓ విధులను తనకు నచ్చినవారికి కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. స్టాఫ్నర్సులు సైతం గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మలబాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. సీనియర్లు అనే సాకుతో కొందరు స్టాఫ్నర్సులు నైట్ డ్యూటీలకు దూరంగా ఉంటున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు సైతం విధులకు డుమ్మా కొడుతున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే... గతి తప్పిన ఆస్పత్రి పాలనను గాడిలో పెట్టాలంటే కలెక్టర్ స్పందించాలని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. గతంలో పనిచేసిన కలెక్టర్ ఆస్పత్రి లో చోటు చేసుకున్న లొసుగులపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని, ప్రస్తుతం నూతన కలెక్టర్ అయినా ఆస్పత్రిపై దృష్టి సారిస్తే రోగులకు నాణ్యమైన సేవలు అందుతాయని అంటున్నారు. ఆస్పత్రిలో సర్జరీ, ఆర్థో, పల్మనాలజీ, డర్మటాలజీ, మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, బ్లడ్ బ్యాంకు విభాఇగాల్లో వైద్యులు ఉదయం 9.30 గంటలకు రావడం మధ్యాహ్నం 12 గంటలకు వారి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని, ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ జోక్యం తప్పనిసరి అనే వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ఏకై క పెద్ద దిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో పడకేసిన పరిపాలన అనతి కాలంలోనే పలువురు సూపరింటెండెంట్ల బదిలీ రోగులకు అందని నాణ్యమైన సేవలు శానిటేషన్, డైట్ నిర్వహణ అస్తవ్యస్తం అర్ధాకలితో అలమటిస్తున్న రోగులు - 
      
                   
                               
                   
            తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ గడువు పెంపు
అనంతపురం సెంట్రల్: తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్కుమార్ చౌదరిని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి, ఏఎస్పీ రోహిత్కుమార్ మధ్య కొంతకాలంగా ప్రత్యక్ష పోరు నడుస్తున్న విషయం విదితమే. చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్పీని బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తన మాట నెగ్గబోతోందన్న ధీమాతో అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీపై జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే ఇందుకు విరుద్ధంగా ఏఎస్పీ రోహిత్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో జేసీ దూకుడుకు కల్లెం వేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్దమైనట్లుగా ఊహాగానాలు చెలరేగాయి. యాచకురాలిపై అత్యాచారయత్నం? శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో కూతలేరు బ్రిడ్జి వద్ద నిద్రిస్తున్న ఓ యాచకురాలిపై గుర్తు తెలియని వ్యక్తి సోమవారం అర్ధరాత్రి సమయంలో అత్యాచారయత్నం చేసినట్లు తెలిసింది. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 50 ఏళ్ల వయస్సున్న మహిళ 20 రోజులుగా నార్పలలోని దుకాణాలు, బస్టాండ్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ రాత్రి సమయంలో కూతలేరు బ్రిడ్జి సమీపంలోని షాపుల ఎదుట నిద్రించేది. సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె ఆత్యాచారయత్నం చేయడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకోవడంతో సదరు వ్యక్తి పారిపోయాడు. మంగళవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళా యాచకురాలిని విచారించారు. అనంతరం ఆమెను పోలీసులు ప్రొద్దుటూరులోని కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. దీనిపై ఎస్ఐ సాగర్ను వివరణ కోరగా... ఘటనపై తాము విచారణ చేశామన్నారు. యాచకురాలిపై అత్యాచారయత్నం జరగలేదన్నారు. ఫేక్ పత్రాలతో కోర్టుకు వెళ్లారు అనంతపురం టవర్క్లాక్: నగర శివారులోని పాపంపేట స్థలాలకు ఫేక్ పత్రాలు సృష్టించి కోర్టుకు వెళ్లారని బాధితుడు వి.అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. పాపంపేట భూ బాధితులు మంగళవారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాపంపేటలో 10 వేల కుటుంబాలు, 30 వేల మంది జనాభా, 18 వేల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. పాపంపేటలోని 900 ఎకరాలకు సంబంధించి శోత్రియం భూములకు వారసులమంటూ కొందరు వ్యక్తులు ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లతో కోర్టును ఆశ్రయించి, తమను ఇబ్బంది పెడుతున్నారని, అంతేకాక ఖాళీ చేయాలంటూ దౌర్జన్యాలు సాగిస్తున్నారని వాపోయారు. కొన్నేళ్ల క్రితం శోత్రియం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ప్రస్తుతం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. తమ స్థలాలను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ఆకులేడులో ‘తమ్ముళ్ల’ మట్టి దోపిడీ
● పట్టపగలే జేసీబీ పెట్టి మూడు టిప్పర్లతో తరలింపు శింగనమల: మండలంలోని ఆకులేడు గ్రామంలో వాటర్షెడ్ పనులు జరిగిన ప్రాంతంలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు ఎర్రమట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పట్టపగలే జేసీబీ పెట్టి మూడు టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వారం రోజుల క్రితం ఎర్రమట్టిని తరలించేందుకు ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై తహసీల్దార్ శేషారెడ్డిని వివరణ కోరగా.. ఆకులేడు ప్రాంతంలో ఎర్రమట్టిని తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడా ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం కార్పొరేషన్: అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు నగదు ప్రోత్సాహక పథకానికి వచ్చే నెల 4వ తేదీ రాత్రి 11.59 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్డీఓ మంజుల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్ఏఏపీ కేఆర్ఈఈడీఏ (సాప్ క్రీడా) యాప్ లేదా https://sports.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. 266 ఫైళ్లకు పరిష్కారం అనంతపురం అర్బన్: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న 22ఏ (నిషేధిత భూముల) జాబితా ఫైళ్ల పరిష్కారంలో భాగంగా కలెక్టర్ ఓ.ఆనంద్ చేపట్టిన రెండో విడత ప్రక్రియలో 266 ఫైళ్లకు పరిష్కారం దక్కింది. గత నెల 26, 27 తేదీల్లో చేపట్టిన తొలి విడత ప్రక్రియలో 191 ఫైళ్లను పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నెల 25, 26 తేదీల్లో మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కలెక్టరేట్లోనే ఉంటూ ఫైళ్లను పరిశీలించి సిద్ధం చేశారు. అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు ఆర్డీఓలు నేతృత్వంలో సాగిన ఈ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల పర్యవేక్షించారు. అధికారులు సమర్పించిన 266 ఫైళ్లల్లో ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉన్న 108 ఫైళ్లను కలెక్టర్ ఆమోదించారు. నిబంధనకు విరుద్ధంగా ఉన్న 158 ఫైళ్లను తిరస్కరించారు. చుక్కల భూముల దరఖాస్తులపై డీఎల్సీ (డాటెడ్ ల్యాండ్ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. - 
      
                   
                                                     
                   
            తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. మరో ఏడాది పాటు తాడిపత్రి ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి కొనసాగనున్నారు. ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి ట్రైనింగ్ ప్రొగ్రామ్ను ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 10 నుంచి జనవరి 2026 దాకా రోహిత్.. శిక్షణకు వెళ్లాల్సి ఉంది.ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్ రోహిత్ ను వెంటనే బదిలీ చేయాలని చంద్రబాబు సర్కార్పై జేసీ ఒత్తిడి చేశారు. ప్రభాకర్రెడ్డి అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని మరో ఏడాది తాడిపత్రి ఏఎస్పీ గా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, ‘రేయ్.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్మెన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా.. ఒక్కో యూట్యూబ్ నా కొడుక్కి చెబుతున్నా జాగ్రత్త’’ అంటూ గత గురువారం (అక్టోబర్ 23) మరోసారి జేసీ ప్రభాకర్రెడ్డి బూతులతో రెచ్చిపోయారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానిం చడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ జగదీష్ అదే రీతిలో స్పందించడం తెలిసిందే.ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఎస్పీ జగదీష్ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగా వేచి ఉన్నా.. ఎస్పీ జగదీష్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి వెనుతిరిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకున్నారు. అంతుచూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు.నేను చదువుకున్న వాన్ని.. మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడే జేసీ ప్రభాకర్రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అధికారపార్టీలో ఉన్నా.. చివరుకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటిదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. - 
      
                   
                               
                   
            ఇచ్చిన డబ్బు అడిగితే అవమానించారు
కళ్యాణదుర్గం: ‘అవసరానికి ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించలేదు. డబ్బు ఇవ్వాలని అడిగితే టీడీపీ నేతల అండ చూసుకుని అవమానించారు. ఫిర్యాదు చేసినా పోలీసులూ పట్టించుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగాడు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గంలోని పుట్టగోసుల వీధిలో నివాముంటున్న ఆర్టీసీ ఉద్యోగి వెంకటస్వామి కుమారుడు కృష్ణగౌడ్ తాను చనిపోవడానికి కారణం బియ్యం జయమ్మ, ఆమె పెద్ద కుమారుడు ప్రకాష్, చిన్న కుమారుడు ప్రకాష్ అని సెల్ఫీ వీడియోలో విలపిస్తూ పురుగుల మందు తాగాడు. వారిని నమ్మి దాదాపుగా రూ.14.50 లక్షలు అప్పుగా ఇచ్చానని పేర్కొన్నాడు. అలాగే తన స్నేహితుడు సాయితేజ ద్వారా మరో రూ.3 లక్షలు ఇప్పించానన్నాడు. పది రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పట్టణ పోలీసులు పట్టించుకోలేదని వాపోయాడు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకుడు కొండాపురం అనిల్చౌదరి దుకాణంలో ఆ పార్టీ నేతల సమక్షంలో పంచాయితీ పెట్టించారన్నారు. జయమ్మ దూషిస్తూ చెయ్యి చేసుకుందని, ఈ అవమానం భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అనంతరం ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో అప్రమత్తమైన స్నేహితులు, కుటుంబసభ్యులు కృష్ణగౌడ్ లొకేషన్ ఆధారంగా ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా పురుగుల మందు తాగుతూ యువకుడి సెల్ఫీ వీడియో - 
      
                   
                               
                   
            ముసురుకున్న ‘మోంథా’ మేఘం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా ‘మోంథా’ తుపాను మేఘం ముసురుకుంది. తుపాను ప్రభావంతో సోమవారం సాయంత్రం బెళుగుప్ప, గుంతకల్లు, నార్పల, శింగనమల, ఉరవకొండ,ఆత్మకూరు,కూడేరు,బ్రహ్మసముద్రం, రాప్తాడు, పామిడి, విడపనకల్లు, గుత్తి తదితర మండలాల్లో వర్షం కురిసింది. ‘మోంథా’ ప్రభావంతో ఏ క్షణంలోనైనా వర్షాలు కురవొచ్చని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, వేరుశనగ, మొక్కజొన్న నూర్పిడి జరుగుతున్న నేపథ్యంలోనే తుపాను పట్టుకోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అరటి, టమాట, ఇతర పంటల సాగు రైతులకూ దిక్కుతోచడం లేదు. అయితే తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ చెబుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. మంగళ, బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షసూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు.అందరూ అప్రమత్తంగా ఉండాలిఅనంతపురం అర్బన్: జిల్లాపై మోంథా తుపాన్ ప్రభావం తీవ్రంగా లేకపోయినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తుపాన్ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అదే విధంగా డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 8500292992కు ఫోన్ చేసి సాయం లేదా సమాచారం కోరవచ్చని ప్రజలకు సూచించారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు చెట్లు, టవర్లు, స్తంభాలు, బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని కోరారు. - 
      
                   
                               
                   
            ఏపీ డెఫ్ క్రికెట్ జట్టులో చోటు
అనంతపురం కార్పొరేషన్: ఏపీ డెఫ్ క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్ (ఆల్రౌండర్), పవన్కుమార్ (వికెట్కీపర్) ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే 9వ జాతీయ స్థాయి టీ–20 డెఫ్ క్రికెట్ చాంపియన్షిప్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. వీరి ఎంపికపై జిల్లా స్పోర్ట్స్ చెవిటి సంఘం అధ్యక్షుడు డి.మహమ్మద్, కార్యదర్శి సత్యనారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విధుల్లోకి పీహెచ్సీ వైద్యులు అనంతపురం కార్పొరేషన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం పూర్తి స్థాయి విధులకు వైద్యాధికారులు హాజరయ్యారు. గత నెల 28 నుంచి వైద్యాధికారులు సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. జిల్లాలోని 45 పీహెచ్సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యాధికారులు విధుల్లోకి ఉండాలి. అలాగే ప్రతి ఎమర్జెన్సీ కేసుకు వైద్యాధికారి సకాలంలో స్పందించాలి. ఇదిలా ఉండగా వైద్యాధికారులు సమ్మె కాల్ ఆఫ్ అంశాన్ని కనీసం డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి బహిర్గతం చేయలేకపోయారు. దీంతో పీహెచ్సీల్లో వైద్యులు ఉండరని ప్రజలు పెద్ద ఎత్తున సర్వజనాస్పత్రికి తరలివచ్చారు. నేడు శాసనసభ కమిటీ పర్యటన అనంతపురం రూరల్: షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ ఈ నెల 28న జిల్లాలో పర్యటించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి తెలిపారు. కమిటీ గౌరవాధ్యక్షులు కుమార్రాజావర్ల, శాసనసభ్యులు కొండ్రు మరళీమోహన్, కొలికపూడి శ్రీనివాసరావు, తాటిపర్తి చంద్రశేఖర్, దేవి వరప్రసాద్, విజయచంద్ర, ఎమ్మెస్ రాజు, రోషన్కుమార్, కావలి గ్రీష్మ, బొమ్మి ఇస్రాయెల్, మురళీధర్ బృందం జిల్లాలో పర్యటిస్తుందన్నారు. మంగళవారం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఆర్అండ్బీ అతిథి గృహంలో షెడ్యూల్ కులాలకు చెందిన ప్రజలు, కుల సంఘాల నాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్లో సంక్షేమ పథకాల అమలు, పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ సేవల్లో రిజర్వేషన్ అమలు అంశాలపై చర్చిస్తారన్నారు. - 
      
                   
                               
                   
            అర్చకుల డిమాండ్లివే
● ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చాలి. ● వేతనం పెంచాలి. ● ప్రస్తుత ప్రభుత్వంలో అర్చకుల ఆధీనంలో ఉన్న మాన్యానికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు భరోసా అందడం లేదు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. ● 6సీ లోని అన్ని ఆలయాలకు డీడీఎన్ఎస్ (ధూపదీప నైవేద్య పథకం) వర్తింపజేయాలి. ● ఖాళీగా ఉన్న ఈఓ పోస్టులను భర్తీ చేసి ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ● అర్చకులకు భద్రత కల్పించాలి. ● ఇచ్చిన హామీ మేరకు హెల్త్కార్డులు జారీ చేయాలి. ● అర్చకుల ఐడీ కార్డులను అధికారికంగా మంజూరు చేయాలి. అనంతపురం కల్చరల్: దైవ సేవలో ఉండే అర్చకులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఏళ్ల తరబడి అపరిష్కృత సమస్యలతో కాలం నెట్టుకొస్తున్నారు. అతి తక్కువ వేతనం, అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హెల్త్కార్డులు, ధూపదీప నైవేద్య పథకంలో లొసుగుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. నిబంధనల పేరుతో కొర్రీలు ఎన్నికల వేళ నాయకులిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా అర్చక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. చివరకు దేవదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో నిబంధనల పేరుతో కొర్రీలు విధిస్తుండడంతో అర్చకులు సతమతమవుతున్నారు. కొన్ని ఆలయాల్లో అర్చకులు మరణిస్తే వారి కుటుంబాలకు దేవదాయ శాఖ పరంగా సౌలభ్యాలు సకాలంలో అందడం లేదు. చివరకు ఆ ఆలయాల్లో అర్చకుల భర్తీ విషయంలోనూ నిబంధనలు అంటూ వారసులను దూరం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కుందుర్పిలోని ఆలయం. అక్కడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న రాంబాబు చనిపోతే ఆయన భార్య గిరిజాకుమారి డెత్ గ్రాట్యూటీ కోసం రెండేళ్లుగా దేవదాయ శాఖ ఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక్కడ తిరకాసుపెట్టి ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి రూల్స్ లేవని తిప్పి పంపారు. చివరకు గుడిలో నిత్యపూజలు సజావుగా సాగేందుకు కనీసం అన్న కొడుకుకై నా అర్చకుడి పోస్టు ఇప్పించాలని ఆమె ఎండోమెంటు కార్యాలయ అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దేవదాయ శాఖ పరిధిలో 3 వేలకు పైగా ఆలయాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండోమెంటు పరిధిలో 3,143 ఆలయాలున్నాయి. ఇందులో అనంతపురం కింద 2,004, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 1,139 ఆలయాలున్నాయి. వీటిలో డీడీఎన్ఎస్, ధార్మిక పరిషత్తు (డీపీ) పథకం వర్తిస్తున్న ఆలయాల సంఖ్య మరీ హీనంగా ఉంది. అనంతపురం జిల్లాలో డీడీఎన్ఎస్ కింద 403, డీపీ కింద 170 ఆలయాలు ఉండగా, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో డీడీఎన్ఎస్ కింద 274, డీపీ కింద 43 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేయాలని ఏళ్ల తరబడిగా అర్చకులు కోరుతున్నారు. చేకూరని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ఈఓల కొరతతో ముందుకు సాగని 43 రిజిస్ట్రేషన్లుపీడిస్తున్న ఈఓల కొరత గతంలో ఉమ్మడి జిల్లాలోని దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో 25 మందికి పైగా ఈఓలుండేవారు. ప్రస్తుతం వివిధ కారణాలతో ఆ సంఖ్య 18కి పడిపోయింది. ఇందులో శ్రీసత్యసాయి జిల్లాలో కేవలం నలుగురే ఉండడం గమనార్హం. దీంతో పని భారంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. ఫలితంగా అర్చకుల సమస్యలు పేరుకుపోతున్నాయి. ఆలయాల ఆస్తులు, మాన్యం రిరకార్డు చేసే ప్రక్రియ (43 రిజిస్ట్రేషన్) మందకొడిగా సాగుతోంది. అర్చకుల పట్ల గతంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా అర్చకులు అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. అలాగే వేర్వేరు సందర్భాలలో తమ డిమాండ్లను నెరవేర్చాలని అర్చకులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. - 
      
                   
                               
                   
            జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. పశ్చిమ దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
హవ్వ... ఇదేం పోస్టింగ్! ● ‘దుర్గం’ సబ్ రిజిస్ట్రార్గా మళ్లీ రామ్మోహన్ ● గతంలో అక్కడ అక్రమాలకు పాల్పడడంతో సస్పెన్షన్ అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు ఎక్కడికై నా పోస్టింగ్ ఇచ్చేస్తారు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా మళ్లీ రామ్మోహన్ నియమితులు కావడమే ఇందుకు నిదర్శనం. గతంలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తూ అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన ఆయనకు తిరిగి అక్కడికే పోస్టింగ్ ఇవ్వడాన్ని చూసి ఆ శాఖలో పని చేస్తున్న అధికారులే విస్తుపోతున్నారు. వివరాలు.. ఏడాది క్రితం బెళుగుప్ప మండలంలో ఒక వ్యక్తి 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే, ఇది జరిగిన నాలుగు నెలలు తర్వాత సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ప్రమేయం లేకుండా విక్రయించిన వ్యక్తులతో కుమ్మక్కై ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశాడు. విషయంపై బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ పాత్ర ఉన్నట్లు నిర్ధా రించి అతన్ని సస్పెండ్ చేశారు. 6 నెలల అనంతరం బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్గా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా అక్కడి నుంచి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా బదిలీ చేయడం.. వెంటనే ఆయన బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడంతోనే బదిలీ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్మోహన్ గతంలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన సమయంలోనే ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అలాంటి అధికారికి మళ్లీ అక్కడికే పోస్టింగ్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మీని వివరణ కోరగా ఆమె స్పందించారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రామ్మోహన్ను బదిలీ చేసినట్లు తెలిపారు. బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్గా అక్కడే సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న అధికారికి ఇన్చార్జ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. - 
      
                   
                               
                   
            ఆకట్టుకున్న ఓపెన్ హౌస్
అనంతపురం సెంట్రల్: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీసుకార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్హౌస్ ఆకట్టుకుంది. పోలీసులు విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి ఆసక్తిగా గమనించారు. సాంకేతిక పరికరాలపై ఎస్పీ జగదీష్ అవగాహన కల్పించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్ఐలు పవన్కుమార్, మధు, రాముడు, ఆర్ఎస్ఐలు జాఫర్, బాబ్జాన్, మగ్బుల్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కార వేదికకు 145 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 145 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా జస్టిస్ భానుమతి అనంతపురం: ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోర్టుల పనితీరు, న్యాయమూర్తుల పనితీరు, పరిశీలన, అజమాయిషీ, కేసుల పర్యవేక్షణ, న్యాయ వ్యవహారాలను పరిశీలించనున్నారు. ఇది వరకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న జి.రామకృష్ణ ప్రసాద్ (ఏపీ హైకోర్టు న్యాయమూర్తి) శ్రీకాకుళం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా నియామకం అయ్యారు.తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం టవర్క్లాక్: తుపాన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తుపాన్ సమయంలో ఎవరూ ఇళ్లను విడిచి బయటకు వెళ్లకూడదని, విద్యుత్ తీగలు, చెట్లు, పాడుబడిన భవనాల సమీపాల్లో ఉండరాదని సూచించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సివిల్ సర్వీసెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు వాయిదా అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 29న జరిగే సివిల్ సర్వీసెస్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలను వాయిదా వేశారు. ఈ మేరకు డీఎస్డీఓ మంజుల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మెగా సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం సిటీ: స్థానిక ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.సరిత సోమవారం వెల్లడించారు. 2005–2016 సంవత్సరాల మధ్య కాలంలో చదివి ఫెయిలైన అభ్యర్థుల కోసం సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29 నుంచి నవంబర్ 29వ తేదీలోపు కళాశాలలో ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు 96764 14799లో సంప్రదించాలన్నారు. జిల్లాకు 1,822 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం అగ్రికల్చర్: నర్మదా కంపెనీకి చెందిన 1,822 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం జిల్లాకు చేరింది. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ పరిశీలించారు. - 
      
                   
                               
                   
            పేద విద్యార్థుల డాక్టర్ కల ఛిద్రం
అనంతపురం: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంతో పేద విద్యార్థుల డాక్టర్ కలను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’కు విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి సంతకాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘అనంత’ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా మారిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజాప్రతినిధులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లామన్నారు. రూ.8 వేల కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అప్పట్లోనే రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తమ పార్టీ హయాంలోనే ఏడు మెడికల్ కళాశాలలను పూర్తి చేసి ఐదింట్లో తరగతులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. నిర్మాణంలో ఉన్న కళాశాలలను నేడు చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలా చెప్పడం సిగ్గుచేటు.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చెప్పడం దుర్మార్గమన్నారు. ఏడాదికి రూ.1,000 కోట్లు ఖర్చు చేసినా 10 మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావడం సంతోషకరమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒకే దఫా 17 మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావడానికి వైఎస్ జగన్ చూపిన దార్శనికతే కారణమన్నారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తోందన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, మైనారిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాగజ్ఘర్ రిజ్వాన్, మాసినేని నరేష్, కృష్ణా రెడ్డి, జిల్లా కార్యదర్శులు అనిల్ కుమార్ గౌడ్, ప్రకాష్, వెంకట రెడ్డి, సుబ్రమణ్యం, నగర ఉపాధ్యక్షులు కాకర్ల శ్రీనివాస్, కార్యదర్శులు రామాంజి రాయల్, హుస్సేన్, కార్పొరేటర్లు నాగార్జున రెడ్డి, లీలావతి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, బూత్ కమిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమరనాథ రెడ్డి, బీసీ సెల్ నగర కార్యదర్శి రామకృష్ణ, ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, సాకే కుళ్లాయి స్వామి, దాదాపీర్, హరి, చంటి, రషీద్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల కోసం డబ్బు ఖర్చు చేయలేమనడం దుర్మార్గం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత - 
      
                   
                               
                   
            ఇబ్బంది పెట్టే ఎవరినీ వదలం
బుక్కరాయసముద్రం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ఎవరినీ ఉపేక్షించబోమని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ హెచ్చరించారు. చంద్రబాబునాయుడు తలకిందులా తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పాత్రికేయుడిపై ఎర్రమట్టి మాఫియా దాడిని ఖండిస్తూ సోమవారం బీకేఎస్ మండలం పసులూరు గ్రామంలో బాధిత విలేకరి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ‘కాళ్లు పట్టుకుంటామని... ఇకపై మీ వార్తలు రాయడని’ చెప్పినా వినకుండా ఇంటి మీదకు వచ్చి మహిళలని చూడకుండా చెప్పలేని పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారంటూ విలేకరి పెద్దన్న భార్య రత్నమ్మ కన్నీరు పెట్టుకున్నారు. దళితులనే కారణంతోనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శైలజనాథ్ మాట్లాడుతూ.. అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పద్దతి మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బాధిత పెద్దన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జగనన్న లే అవుట్లో ఎర్రమట్టి తవ్వకాలను పరిశీలించారు. కాలనీ మొత్తాన్ని తవ్వేడాన్ని గమనించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి దుర్మార్గాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. చర్యలు తీసుకోండి విలేకరి పెద్దన్నపై దాడి చేసిన ఎర్రమట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఎస్ఐ రాంప్రసాద్కు ఫిర్యాదు ప్రతిని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు అంజి, జయరామిరెడ్డి, నరేష్, వరికూటి కాటమయ్య, బయపరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, చిన్నపరెడ్డి, పద్మావతి, నిమ్మల భాస్కర్, శివారెడ్డి, కొండ, రామాంజనేయులు, నారాయణ, తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులపై మాజీ మంత్రి శైలజనాథ్ ఆగ్రహం - 
      
                   
                               
                   
            అర్చకుల సమస్యలు పరిష్కరించాలి
అర్చక కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. దేవదాయశాఖలో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. గత ప్రభుత్వంలో అర్చకులు రైతు భరోసా అందుకుంటే.. ఈ రెండేళ్లుగా ఆ మాటే లేకుండా పోయింది. ఇస్తున్న రూ.10 వేల వేతనానికి తల్లికి వందనం లాంటి పథకాలు ఆపడం సబబు కాదు. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – వైపీ ఆంజనేయులు, అధ్యక్షులు, జిల్లా అర్చక సమాఖ్య చర్యలు తీసుకుంటున్నాం మా దృష్టికి వచ్చిన అర్చకుల సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతిక కారణాల వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది. ఎక్కడ కూడా అర్చకులు ఇబ్బంది పడకూడదన్నదే లక్ష్యం. తల్లికి వందనం, రైతు భరోసా పథకాల వర్తింపులోనూ న్యాయం జరిగేలా చూస్తాం. – తిరుమలరెడ్డి, ఎండోమెంటు సహాయ కమిషనర్, అనంతపురం - 
      
                   
                               
                   
            అత్యవసరమైతే అంతే!
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రికి అత్యవసర కేసులు తీసుకొస్తే ఇక అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రోడ్డు ప్రమాదాలు, విషం తాగిన వారు, పాముకాటు, కిడ్నీ, లివర్ తదితర బాధితులు ఒక్కోసారి మధ్యాహ్నం వేళ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే, ఆ సమయంలో వైద్యులు పత్తా లేకుండా పోతుండడంతో రోగుల పరిస్థితి గాల్లో దీపంలా మారుతోంది. క్యాజువాలిటీ , రక్తనిధి కేంద్రంలో సాయంత్రం 4 గంటల తర్వాత వైద్యులు అందుబాటులో ఉండరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఎమర్జెన్సీ మెడిసిన్కు తాళాలు..క్యాజువాలిటీకి వచ్చే ప్రాణాంతక కేసులకు సకాలంలో వైద్యం అందించి అనంతరం వార్డులకు పంపాలి. కానీ క్యాజువాలిటీలో విధుల్లో ఉండాల్సిన హెచ్ఓడీతో పాటు మిగిలిన వైద్యులు పత్తా లేకుండా పోతున్నారు. వాస్తవంగా 24 గంటలూ ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు షిఫ్ట్ల రూపంలో అందుబాటులో ఉండాలి. కానీ, వైద్యులందరూ ఉదయం వేళ మాత్రమే పని చేసి తమకేం పట్టదన్న ధోరణిలో వెళ్లిపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డుకు ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి రోజూ 600 నుంచి 800 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ క్రమంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో భారమంతా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, పీజీలపై పడుతోంది.రక్తనిధిలోనూ అంతే..సర్వజనాస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. వాస్తవంగా ఇక్కడ కూడా పెథాలజీ విభాగానికి చెందిన వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాల్సి ఉన్నా అటువంటి పరిస్థితి లేకుండా పోతోంది. గైనిక్, లేబర్, ఆర్థో, మెడిసిన్, సర్జికల్ తదితర వార్డులకు రక్తం అందించే ముందు పెథాలజిస్టులు పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, వారికి సొంత ఆస్పత్రులు ఉండడంతో పత్తా లేకుండా పోతున్నారు. దీంతో రాత్రి వేళ రక్తం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయాలపై ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కలెక్టర్ ఆనంద్ అయినా స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. - 
      
                   
                                                     
                   
            వైఎస్సార్సీపీ నేత రామసుబ్బారెడ్డిపై టీడీపీ దాడి
అనంతపురం: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో జూటూరులో వైఎస్సార్సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిపై టీడీపీ నేత దాడి చేశారు. రామసుబ్బారెడ్డిపై టీడీపీకి చెందిన రవికుమార్ కొడవలితో దాడికి దిగాడు. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి గాయపడ్డారు. ఆయన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.. - 
      
                   
                               
                   
            గాడి తప్పిన.. ఖాకీ
అనంతపురం సెంట్రల్: రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన ఆ పోలీసు అధికారి గాడి తప్పారు. మాఫియాతో కుమ్మక్కై ప్రతి నెలా రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. నగరంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్లో జరుగుతున్న ఈ అవినీతి దందా ఇటీవల ఆ అధికారి చేసిన కనికట్టు వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. వివరాలు... రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను ఇటీవల ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రెడ్హ్యాండెడ్గా పట్టుకొని నగరంలో వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. దీనిపై విచారణ చేసి కేసు నమోదు చేయాల్సిన పోలీసు అధికారి రేషన్ మాఫియాతో బేరం కుదుర్చుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్కే టోకరా వేసి మూడింటిలో ఒక వాహనాన్ని గుట్టు చుప్పుడు కాకుండా వదిలిపెట్టారు. ఇందుకు సదరు రేషన్ మాఫియా భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీనిపై మిగిలిన రెండు వాహనాలకు సంబంధించిన వ్యక్తులు కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. ఇదే కాదు... సదరు అధికారి వన్టౌన్ పోలీసుస్టేషన్కు వచ్చిన తర్వాత రేషన్ మాఫియా ద్వారా నెలనెలా భారీగానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాసుల కక్కుర్తి..అనంతపురం నగరాన్ని కేంద్రంగా చేసుకొని రేషన్ మాఫియా దందా చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల నుంచి గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని నగర శివారులోని ఓ గోడౌన్కు చేర్చడం... తర్వాత లారీల్లో కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రేషన్ మాఫియాకు రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి డాన్గా వ్యవహరిస్తుండగా, నగరంలో ఓ మహిళ, ఎస్కే యూనివర్సిటీ సమీపంలో ఉన్న మరో వ్యక్తి కీలకంగా ఉన్నారు. వీరి వ్యవహారం మొత్తం పోలీసులకు తెలిసినా నెలనెలా మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమాల డొంక కదులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుజిల్లాలో రేషన్ మాఫియాపై ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు. దీని వెనుక ఎంతటి వారున్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. రేషన్ అక్రమంగా తరలుతున్నట్లు ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు చేస్తున్నాం. నగరంలో జరిగిన ఆ వ్యవహారంపై విచారిస్తాం. అవినీతికి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.– పి. జగదీష్, ఎస్పీ - 
      
                   
                               
                   
            బుగ్గకు కార్తీక శోభ
తాడిపత్రి రూరల్: స్థానిక పెన్నానది ఒడ్డున వెలసిన పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు సహస్ర లింగార్చనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబరు 3న రెండవ సోమవారం స్వామివారికి సప్త వర్ణ పుష్ప యాగం, 5న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు గండా దీపోత్సవం, సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపోత్సవం, రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 9న స్వామి వారి ఆరుద్ర జన్మ నక్షత్రం పురస్కరించుకుని మహాగణపతి, రుద్ర చండీ యాగం, అనంతరం వన భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10న ఉదయం కేదారేశ్వర నోము, సాయంత్రం 6 గంటలకు భక్తి సంగీతం నిర్వహించనున్నారు. 17న సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సం ఉంటుంది. 18న ఉదయం 7 గంటలకు లక్ష బిల్వార్చన, మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు ప్రదోశకాల పూజ, దశవిధ హారతులు, ఉత్సవ మూర్తుల ప్రాకారోత్సవం, అనంతరం నృత్య ప్రదర్శన ఉంటాయి. 20న సాయంత్రం 6గంటలకు భస్మాభిషేకం, భక్తులకు అల్పాహార వితరణ ఉంటుంది. - 
      
                   
                               
                   
            ఎకై ్సజ్ సురక్ష యాప్తో నకిలీ మద్యానికి అడ్డుకట్ట
అనంతపురం సెంట్రల్: ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యానికి అడ్డుకట్ట పడుతుందని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురంలోని పలు మద్యం దుకాణాలు, బార్ల వద్ద సురక్షయాప్పై అవగాహన కల్పించారు. మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ణు స్కాన్ చేయడం ద్వారా అది నకిలీదా? లేదా అసలైనదా తెలిసిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశీలించుకున్న తర్వాతనే మద్యం కొనుగోలు చేయాలని కోరారు. షాపు నిర్వాహకులు కూడా యాప్ ద్వారానే విక్రయాలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు చేరిన 475 మెట్రిక్ టన్నుల యూరియా అనంతపురం అగ్రికల్చర్: మద్రాసు ఫర్టిలైజర్స్ కంపెనీ నుంచి 475 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్కు ఆదివారం వ్యాగన్ల ద్వారా చేరిన యూరియా బస్తాలను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్కు 325 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 150 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. వివాహిత అదృశ్యం రాప్తాడు రూరల్: అత్తారింటికి బయలుదేరిన వివాహిత కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కొడిమి గ్రామానికి చెందిన శివప్రసాద్ కుమార్తె మహేశ్వరికి బళ్లారి సమీపంలోని సిరిగెరికి చెందిన గణేష్తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల పుట్టింటికి వచ్చిన మహేశ్వరి ఈ నెల 22న అత్తారింటికి వెళుతున్నట్లు చెప్పి బయలుదేరారు. అయితే అత్త గారి ఊరికి మాత్రం చేరుకోలేదు. ఆందోళన చెందిన ఇరుకుటుంబాల సభ్యులు వివిధ ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో తండ్రి శివప్రసాద్ ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. - 
      
                   
                               
                   
            అ‘పూర్వ’ కలయిక
యాడికి: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 1970–75లో 6 నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న వారిలో దాదాపు 80 మంది అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తరగతి గదులను తాకుతూ పరవశించిపోయారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. ప్రస్తుత హెచ్ఎం రామాంజనేయులుతో పాటు నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు భాస్కరరెడ్డి, సుబ్బారెడ్డి, శేషారెడ్డిని ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు వెంకటకృష్ణారెడ్డి, మహబూబ్ బాషా, సత్యనారాయణ, లింగం చంద్రశేఖర్, చింతా వెంకటయ్య, దాసరి కృష్ణ, సంటప్ప, చింతా వెంకటయ్య, నల్లప్ప, మంజుల, ఉమామహేశ్వరి, టెంకాయల హరిస్వామి, తదితరులు నేతృత్వం వహించారు. ● శింగనమల: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 1987–88 బ్యాచ్ విద్యార్థులు 38 సంవత్సరాల తర్వాత అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. నాటి గురువులు మనోహరిదేవి, నామ్దేవ్, పెద్దయ్య, బాలకృష్ణ, సుబ్బారెడ్డి, పాఠశాల స్థలదాత ఉస్థిపల్లి నాగరాజును ఘనంగా సన్మానించారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. - 
      
                   
                               
                   
            14 మంది జూదరుల అరెస్ట్
తాడిపత్రి రూరల్: మండలంలోని ఊరుచింతల కొండల్లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.1,66,150 నగదు, తొమ్మిది సెల్ఫోన్లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను తాడిపత్రి అప్గ్రేడ్ ఎస్ఐ ధరణిబాబు వెల్లడించారు. అందిన సమచారం మేరకు ఆదివారం ఊరుచింతల గ్రామ శివారున తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో కొండల్లో పేకాట ఆడుతున్న 14 మంది జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరిలో జమ్మలమడుగులోని కన్నేనూరువీధికి చెందిన రామాంజనేయులు, సంజామల మండలం గిద్దలూరుకు చెందిన రామకృష్ణ, అవుకు మండలం సింగనపల్లికి చెందిన కంబయ్య, కడపలోని సాయి స్ట్రీట్కు చెందిన నాగరాజు, వేంపల్లి మండలం వెలమవారిపల్లికి చెందిన కరుణాకర్రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం బోలుగుట్లపల్లికి చెందిన కొండారెడ్డి, పులివెందులలోని రాజారెడ్డి కాలనీకి చెందిన షేక్ మాబూషరీఫ్, ముద్దనూరు మండలం కోసినేపల్లి గ్రామానికి చెందిన అన్నయ్య, తాడిపత్రికి అమీర్ బాషా, పోరాటకాలనీకి చెందిన సోమశేఖరరెడ్డి, ఇందిరానగర్కు చెందిన శివదత్త, శ్రీనివాసపురానికి చెందిన రషీద్, సుంకులమ్మపాలెంకు చెందిన సురేష్, పెద్దపప్పూరు మండలం ఆమళ్లదిన్నెకు చెందిన గుత్తా నరేంద్ర ఉన్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ● శెట్టూరు: మండలంలోని లక్ష్మంపల్లి వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు ప్రొబేషనరీ ఎస్ఐ నరసింహారెడ్డి, సిబ్బంది ఆదివారం లక్ష్మంపల్లికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9,800 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాంభూపాల్ తెలిపారు. రూ.1.66 లక్షల నగదు, నాలుగు కార్లు స్వాధీనం - 
      
                   
                               
                   
            ఖైదీలకంటే అధ్వానంగా బతుకుతున్నాం
విడపనకల్లు: తమను ఓ గదిలో ఉంచి కనీసం అన్నపానీయాలు కూడా ఇవ్వకుండా వార్డెన్ వేధింపులకు గురి చేస్తోందని, ఖైదీలకంటే అధ్వానంగా బతుకుతున్నామని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడి ఎదుట ఆదర్శ పాఠశాల విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆదివారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ హరిప్రసాద్యాదవ్ విడపనకల్లు ఆదర్శ పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వార్డెన్ సరస్వతి దురాగతంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థినులను హాస్టల్లో ఉంచి బయట తాళం వేసి ఉండడం గమనించిన వెంటనే వార్డెన్కు ఫోన్ చేసి, మాట్లాడారు. విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా హాస్టల్ తనిఖీ చేయడానికి వచ్చానని తెలపగానే ‘నువ్వు ఎవరైతే నాకేంటి, నేను ఉన్నప్పుడు రా’ అంటూ సరస్వతి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో కంగుతిన్న డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ గేటు బయటి నుంచే విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో నిత్యావసర సరుకులు బయటి మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు బహిర్గతమైంది. వార్డెన్ భర్త మంత్రి పయ్యావుల కేశవ్కు ముఖ్య అనుచరుడిగా ఉండటం వల్ల ఆమె నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపించారు. విచారణలో వెల్లడైన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడి ఎదుట వాపోయిన ఆదర్శ పాఠశాల విద్యార్థినులు - 
      
                   
                               
                   
            నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. వైఎస్సార్ సీపీ ర్యాలీ వాయిదా ● నవంబర్ 4వ తేదీ నిర్వహణ ● పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’లో భాగంగా అన్ని నియోజకవర్గ స్థాయిల్లో ఈ నెల 28న తలపెట్టిన ర్యాలీ కార్యక్రమం వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. తుపాన్ దృష్ట్యా కార్యక్రమాన్ని నవంబర్ 4కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. అమరవీరులకు అండగా ఉంటాం అనంతపురం సెంట్రల్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ పి. జగదీష్ భరోసా ఇచ్చారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాలతో ఆదివారం జిల్లాలో అమరవీరుల ఇళ్లకు పోలీసు అధికారులు వెళ్లి బాధిత కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన హనుమంతు రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగంలో జూనియర్ కమాండోగా పనిచేస్తూ 2008లో ఒడిశా బార్డర్లో అసువులు బాశారు. ఆయన భార్య స్రవంతి పోలీసు శాఖలో పనిచేస్తూ స్థానిక ఆదిమూర్తినగర్లో నివాసముంటోంది. ఎస్పీ ఆదేశాలతో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ వారి ఇంటికి వెళ్లి హనుమంతు చిత్రపటానికి నివాళులర్పించారు. ఏ ఇబ్బందులున్నా తెలి యజేయాలని, పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే టూటౌన్ పోలీసుస్టేషన్లో పనిచేస్తూ ఈ ఏడాది జనవరి 17న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నారాయణ నాయక్ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు శ్రీకాంత్, ఆర్ఐ పవన్కుమార్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్నాథ్, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ టోర్నీలో జిల్లా బాలికల సత్తా గోపాలపట్నం: విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నంలో జరిగిన టేబుల్ టెన్నిస్ టోర్నీలో జిల్లా బాలికలు సత్తా చాటారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14 బాలికల విభాగంలో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. అండర్–17 బాలికల విభాగంలో జిల్లా జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. విజేతలను అధికారులు, కోచ్లు, ఉపాధ్యాయులు అభినందించి జ్ఞాపికలు అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. - 
      
                   
                               
                   
            ప్రభుత్వ వేతనం.. ప్రైవేట్ పాఠం
కళ్యాణదుర్గం/అనంతపురం సిటీ: బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం హరికృష్ణ.. కళ్యాణదుర్గంలోని పార్వతీనగర్లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ (సైనిక్ స్కూల్, నవోదయ, ఏపీ రెసిడెన్షియల్) నిర్వహిస్తూ జిల్లా విద్యాధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. వాస్తవానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సివిల్ కోడ్కు వ్యతిరేకంగా పనిచేయకూడదనే నిబంధన ఉంది. అయితే అధికార పార్టీని అడ్డుపెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకన్నా విద్యార్థులను చేర్చుకున్నారు. ఈ అంశం కాస్త వెలుగు చూడడంతో అక్రమార్కుడిని కాపాడే ప్రయత్నంలో టీడీపీ నేతలు తలమునకలయ్యారు. ఏం జరిగిందంటే.. నవోదయ, సైనిక్, ఏపీఆర్జేసీ వంటి పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధించిన కోచింగ్ సెంటర్ను టీడీపీ నేతల అండతో కళ్యాణదుర్గంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు హరికృష్ణ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేని ఈ సెంటర్లో 20 మంది విద్యార్థులను చేర్చుకుని, వారి పేర్లను తమ ప్రభుత్వ పాఠశాలలోని రికార్డుల్లో నమోదు చేయించారు. అయితే ఆ పిల్లలెవరూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకపోయినా.. వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ ఉపాధ్యాయుడు హరికృష్ణనే స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణాధికారిగా డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావును జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్బాబు నియమించారు. అయితే విచారణ ప్రక్రియపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ముందస్తుగా సమాచారం అందజేయడంతో రెండు రోజుల క్రితం కోచింగ్ సెంటర్కు మూతవేయడమే ఇందుకు నిదర్శనం. అక్రమార్కుడిని కాపాడేందుకు రంగంలోకి.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్ నిర్వహించడమే కాకుండా.. విధులు ఎగ్గొట్టి, బోగస్ అడ్మిషన్లతో ప్రభుత్వ పథకాలను స్వాహా చేయడం వంటి నేరాలకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కాపాడేందుకు టీడీపీ నేతలతో పాటు ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు రంగంలోకి దిగడం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే డీఈఓ, డిప్యూటీ డీఈఓ కార్యాలయం చుట్టూ రెండ్రోజులుగా వారు చక్కర్లు కొడుతున్నారు. ఈ మొత్తం అక్రమం వెనుక బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల విద్యాశాఖాధికారుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోచింగ్ కోసం చేరిన ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఫీజులు వసూలు చేసి ఎంఈఓల చేతులు తడిపినట్లు సమాచారం. ఓ అధికారికి బంగారాన్ని ఎరగా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ యవ్వారం బయటపడకుండా కాపాడుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బ్రహ్మసముద్రం ఎంఈఓ ఓబుళపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. .తమకు విషయం తెలియగానే పాఠశాలలో విచారణ చేపట్టి 9 బోగస్ ఎన్రోల్మెంట్లుగా గుర్తించామన్నారు. గతంలో ఆరోపణలు వచ్చాయని, వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతుండగా ఒత్తిళ్లు తాళలేకపోయామన్నారు. విధులు ఎగ్గొట్టి.. ఎంచక్కా కోచింగ్ సెంటర్ తెరచి.. అధికార పార్టీ అండతో అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు ఆపై ప్రభుత్వ పథకాలు స్వాహా చర్యలు తీసుకోకుండా అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి హరికృష్ణ సస్పెన్షన్ఉపాధ్యాయుడు హరికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి 10.30 గంటలకు డీఈఓ ప్రసాద్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. హరికృష్ణ అనధికార కోచింగ్ సెంటర్పై విచారణ అనంతరం డిప్యూటీ డీఈఓ అందజేసిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ స్పష్టం చేశారు. - 
      
                   
                               
                   
            వైద్య విద్యపై చంద్రబాబు వ్యాపారం
గార్లదిన్నె: రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం, వైద్య విద్యపై వ్యాపారం చేయొద్దని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గమైన ఆలోచనల్ని చంద్రబాబు విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వ యకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజా నాథ్ అన్నారు. ఆదివారం మండలంలోని కల్లూరులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సర్కిల్లోని మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విగ్రహం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శైలజానాఽథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయన్నారు. చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. నవంబర్ 4న శింగనమల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీలో అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. యువ నాయకుడు, శైలజానాథ్ తనయుడు రుత్విక్ మాట్లాడుతూ వైఎస్ జగన్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీదేవి, శింగనమల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, బీకేఎస్ జెడ్పీటీసీ భాస్కర్, ఆర్టీఐ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నారాయణస్వామి, నాయకులు చీమల శ్రీనివాసులు, చితంబరరెడ్డి, బృందావన్ రామాంజనేయులు, రవి, కిష్టన్న, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు పీరా, క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు లక్ష్మన్న, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎంవి దుర్మార్గపు ఆలోచనలు మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం - 
      
                   
                               
                   
            కలగా యాజమాన్య హక్కు
అనంతపురం అర్బన్: అసైన్డ్భూములకు యాజమాన్య హక్కులు కల్పించి రైతులకు లబ్ధి చేకూర్చాలనే గొప్ప ఆశయంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్టీలు, మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా రైతులందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో 20 ఏళ్లు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 96,188 మంది రైతులకు సంబంధించి 3,03,370 ఎకరాలకు ఫ్రీహోల్డ్ చేసి యాజమాన్య హక్కులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది. పరిశీలన పేరుతో సాగదీత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే భూములను ఫ్రీ హోల్డ్ చేసి యాజమాన్య హక్కు కల్పించే కార్యక్రమాన్ని నిలిపివేసింది. పరిశీలన పేరుతో ఎటూ నిర్ణయం తీసుకోకుండా ఏడాదిన్నరగా సాగదీస్తోంది. అంతే కాకుండా ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. తమ కష్టం బయటికి చెప్పుకుంటే అధికార పార్టీవాళ్లు ఎక్కడ ఇబ్బంది పెడతారోనని రైతులు భయపడుతున్నారు. వర్ణనాతీతం.. చంద్రబాబు పాలనలో రైతన్నలను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ప్రజలకు తాము మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ జరుగుతున్న మంచిని ఆపేస్తే బాధితులు ఎంత నరకయాతన అనుభవిస్తారో చెప్పేందుకు ఫ్రీహోల్డ్ భూముల అంశం నిదర్శనంగా నిలుస్తోంది. 3.03 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయడం ద్వారా 96 వేల మంది అన్ని పార్టీలు, మతాలు, కులాలు, వర్గాలకు చెందిన రైతులకు లబ్ధి చేకూరేది. అలాంటి ఫ్రీహోల్డ్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం నిలిపేయడంతో బాధిత రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఫ్రీహోల్డ్కు సిద్ధం చేసింది 3,03,370.35 ఎకరాలు రైతుల సంఖ్య 96,188 ముందుకు సాగని ఫ్రీహోల్డ్ ప్రక్రియ పరిశీలన పేరుతో ప్రభుత్వం సాగదీత దిక్కుతోచని 96 వేల మంది రైతులు సమస్య చెప్పుకునేందుకూ జంకుతున్న బాధితులు జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములు ఇలా - 
      
                   
                               
                   
            విరగ్గాసిన దానిమ్మ
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో రైతు రంగారెడ్డి సాగు చేసిన దానిమ్మ పంట విరగ్గాసింది. టన్ను ధర 1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షలతో అమ్ముడుపోతుండడంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత పంటల బీమా పథకంతో ఆదుకోవడంతో రూ.లక్ష వరకూ లబ్ధి చేకూరిందని, ఈ మొత్తాన్ని తిరిగి పంటపైనే ఖర్చు పెట్టడంతో నాణ్యమైన దిగుబడులు సాధ్యమయ్యాయని వివరించాడు. జగన్ ప్రభుత్వమే ఆదుకోకుంటే ఈ దిగుబడి ఉండేది కాదని తెలిపాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీమా ఊసే లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: - 
      
                   
                               
                   
            వాల్మీకి సేవాదళ్ నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతపురం రూరల్: వాల్మీకి సేవాదళ్ నూతన కార్యవర్గాన్ని వాల్మీకి సేవాదళ్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. అనంతపురం నగర యువజన విభాగం అధ్యక్షుడిగా బోయ హర్షవర్ధన్, ఉపాధ్యక్షుడిగా బోయ పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా బోయ సాయికృష్ణ, ఉరవకొండ నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడిగా శివకుమార్ను ఎన్నుకున్నారు. రాయదుర్గంలో కర్ణాటక వాసి మృతిరాయదుర్గం టౌన్: స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో కర్ణాటక వాసి మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటకలోని గంగావతికి చెందిన మహమ్మద్ గౌస్ (50) కొన్నేళ్ల క్రితం రాయదుర్గానికి వలస వచ్చి పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండడంతో పదేళ్ల క్రితం పిల్లలను పిలుచుకుని భార్య బెంగళూరుకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవనం సాగిస్తూ అతిగా మద్యం సేవించి రోడ్లపై తిరిగేవాడు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యాడు. అయినా తాగుడు మానేయలేదు. శనివారం రాత్రి పాత బస్టాండ్ ప్రాంతంలో నిద్రించిన ఆయన ఆదివారం తెల్లవారు జామున విగతజీవిగా కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. స్థానికంగానే ఉన్న అతని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఏపీఎంఎస్ వాచ్మెన్ దుర్మరణం యాడికి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఏపీ మోడల్ స్కూల్ (ఏపీఎంఎస్) వాచ్మెన్ దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన పుల్లయ్య (52)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక ఏపీఎంఎస్లో వాచ్మెన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి స్కూటీపై బయలుదేరాడు. సుంకులమ్మ ఆలయం సమీపంలోకి చేరుకోగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన పుల్లయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. గమనించిన స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు మండల కేంద్రంలోకి ప్రవేశించిన వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పుల్లయ్య మృతి విషయం తెలియగానే మోడల్స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మైలారంపల్లిలో సుత్తి తల పాము ఉరవకొండ: మైలారంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో ఓ వింత పాము ఆదివారం కనిపించింది. ఈపాము తల సుత్తి ఆకారంలో ఉండటాన్ని గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేసుకున్న అటవీశాఖ సిబ్బంది హ్యామర్హెడ్ స్నేక్గా గుర్తించారు. ఈ జాతి పాములకు శరీరరం అంతా విషం ఉంటుందని, ఒక్కకాటుతో చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈరకం పాములు కనిపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. - 
      
                   
                               
                   
            టీచర్లతో పెట్టుకోవద్దు బాబూ..
అనంతపురం సిటీ: ఉపాధ్యాయులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబుళపతి మండిపడ్డారు. ‘నేను మారాను.. నేను మారాను.. అంటుంటే ఏమో అనుకున్నాం గానీ చంద్రబాబు మారిందేమీ లేదు. ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు బాబూ..’అంటూ హెచ్చరించారు. అనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి మళ్లీ టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన ఆలోచన సరైంది కాదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్.గిరిధర్రెడ్డి కోరారు. 12వ పీఆర్సీని నియమించడంతో పాటు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. లేకపోతే ప్రభుత్వంపై పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీష్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ వెంకటరెడ్డి, అల్తాఫ్ హుస్సేన్, జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబుళపతి - 
      
                   
                                                     
                   
            తాడిపత్రి యువకుడికి గూగుల్లో రూ.2.25 కోట్ల వార్షిక వేతనం
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. చదువు పూర్తికాగానే ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్లో కొలువు సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేశ్రెడ్డి, అంబిక దంపతుల కుమారుడు సాత్విక్రెడ్డి న్యూయార్క్లోని స్టో్కన్ బ్రోక్ వర్సీటీలో ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అతడు కాలిఫోరి్నయాలోని గూగుల్లో రూ.2.25 కోట్లతో కొలువు సంపాదించాడు. దీంతో పట్టణంలోని పలువురు ప్రముఖులు సాతి్వక్రెడ్డిని ఫోన్లో అభినందించారు. - 
      
                   
                                                     
                   
            పదహారేళ్లకే ప్రసవం
అనంతపురం సిటీ: పదహారేళ్లు నిండకనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ బాలిక. విశ్వసనీయ సమాచారం మేరకు.. యాడికి మండలానికి చెందిన బాలిక (16) పదో తరగతి వరకు చదివింది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించినా చదువు మానేసి, డ్రాపవుట్గా మిగిలిపోయింది. అమ్మానాన్న కూలీ పనులకు వెళ్తే, తను ఇంటి పట్టున ఉండేది. అమ్మమ్మ ఊరైన కర్నూలు జిల్లా మద్దికెరకు తరచూ వెళ్లొచ్చేది. ఈ క్రమంలో మద్దికెరకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ దగ్గరవడంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమంటే ఉద్యోగం వచ్చాక చేసుకుంటానంటూ రాజా దాటవేస్తూ వచ్చాడు. విషయం తెలిసినా 9 నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు. బుధవారం స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వద్దకు బాలికను తీసుకెళ్లి ఐదు నెలల గర్భిణి అని చెప్పారు. గర్భవిచ్ఛిత్తికి మాత్రలు కావాలని అడిగిన వెంటనే అతను రాసిచ్చేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి మింగిన కాసేపటికి విపరీతమైన రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే గ్రామ ఆశా వర్కర్ దృష్టికి తీసుకెళ్తే ఆమె మందలించి గుత్తిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. బాలిక పరిస్థితి చూసిన అక్కడి వైద్యులు అడ్మిట్కు నిరాకరించడంతో పాటు వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని చెప్పడంతో బాలికను ఇక్కడికి తీసుకొచ్చి బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చారు. బాలిక అర్ధరాత్రి ఒంటిగంట తరువాత సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత తెలిపారు.రంగంలోకి అధికారులువిషయం తెలిసిన వెంటనే ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి, మిషన్ వాత్సల్య–మిషన్ శక్తి జిల్లా కో–ఆర్డినేటర్ బీఎన్ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ్, సఖి మేనేజర్ శాంతామణి, చైల్డ్లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి రంగంలోకి దిగారు. పోలీసులతో కలసి సర్వజనాస్పత్రికి చేరుకుని బాలికతో మాట్లాడారు. వివరాలు చెప్పేందుకు బాలిక అంగీకరించకపోవడంతో ఆమె తల్లిదండ్రులను సఖి సెంటర్కు పిలిపించి విచారించారు. మాయమాటలతో లొంగదీసుకొని, బాలికను తల్లిని చేసిన మద్దికెరకు చెందిన రాజాపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. - 
      
                   
                               
                   
            నమ్మకం లేకే మీ వద్దకు రావడం లేదు శ్రీరామ్
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మీరంటే ఈ ప్రాంత ప్రజలకు భయం ఉంది. గతంలో 14 ఇళ్లను నేలమట్టం చేశారు... ఇప్పుడు తమ ఇళ్లకూ అదే గతి పడుతుందేమోనని భయపడుతున్నారు.అంతకుముందు విద్యారణ్యనగర్లో 6 కోట్ల దాకా వసూళ్లు చేశారు. ఇప్పుడూ అలాగే వసూళ్లు చేస్తారేమోననే భయం ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. అందుకే మీ వద్దకు రావడం లేదు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఇంటి వద్దకు బాధితులు రాలేదు, బాధ్యులు రాలేదని ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ అంటున్నారని, ప్రజలకు కష్టం వస్తే మరి మీరెందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఎంత కష్టం వచ్చినా మీపై నమ్మకం లేకే ప్రజలు మీవద్దకు రావడం లేదని అన్నారు. ‘మా వద్దకు ఎవరూ రావడం లేదని, వస్తే సెటిల్మెంట్ చేస్తానని శ్రీరామ్ చెబుతున్నాడు. అంతా తెలిసిన మీ అమ్మ మొద్దునిద్ర పోతోందా, లేదంటే నటిస్తోందో తెలీదు. మీ కుటుంబం అంతా వచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. నేలమట్టమైన 14 ఇళ్ల యజమానుల కాళ్లు పట్టుకోవాలి. నేను అడిగే ప్రశ్నలకు పరిటాల సునీత సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా పని చేసిన బాధ్యతతో ప్రతిపక్ష నాయకుడిగా నేను మాట్లాడుతున్నా. నువ్వు రాజకీయ అజ్ఞానివి.. నీకు ఏ సంబంధం ఉందని మాట్లా డుతున్నావ్’ అంటూ పరిటాల శ్రీరామ్పై మండిపడ్డారు. ఫేక్ డాక్యుమెంట్లతో వస్తే ఖబడ్దార్ రాచూరి, గొల్లపల్లి కుటుంబ సభ్యులు, జీపీఏ దారులు ఫేక్ డాక్యుమెంట్లతో వస్తే ఖబడ్దార్ అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దొంగ పొజిషన్ సర్టిఫికెట్లతో కోర్టుకు వెళ్లినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రాంత ప్రజల నుంచి రూ. కోట్లు వసూళ్లు చేద్దామనే ఆలోచనతో వస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గోవిందరెడ్డి, నాయకులు గోపాల్రెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, నారాయణరెడ్డి, కుమ్మెత గోపాల్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సందీప్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పన్నాగం పారలేదనే ప్రజల ముందుకు ఇళ్లు ఉన్న కాలనీలను ఓపెన్ల్యాండ్గా చూపిస్తూ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం దొంగతనం కాదా అని ప్రకాష్ రెడ్డి నిలదీశారు. అది మీరు వేయించుకున్న మండల సర్వేయర్ చేసింది కాదా అని ప్రశ్నించారు. అడంగల్ పరిశీలిస్తే అక్కడ ఏపీఐఐసీ, నివాస గృహాలు, రస్తాలు ఉన్నాయని తెలుస్తుందన్నారు. తాము అందరి డొల్లతనాన్ని బయటకు తీసిన తర్వాత అందరూ దిగొచ్చారన్నారు. నిన్నటి రోజున తహసీల్దార్ జీపీకి రాసిన నివేదికను ముందే ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఇక్కడ అనేక గృహాలు నిర్మాణమై ఉన్నాయని, ఇనామ్ రద్దు చట్టం వచ్చిన తర్వాత శోత్రియం భూములకు ఎలాంటి విలువ ఉండదని నివేదిక ఇచ్చారని, ఇంత జరిగాక పన్నాగం పారలేదనే పరిటాల శ్రీరామ్ నేడు ప్రజల ముందుకు వచ్చాడన్నారు. గతంలో 14 ఇళ్లు మీరే కూల్చేయించారనే భయం ప్రజల్లో ఉంది నువ్వు కాదు.. మీ అమ్మను సమాధానం చెప్పమను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి - 
      
                   
                               
                   
            జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్మోహన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, జైన్ మతాలలో అర్హులైన వారు httpr;//naipunyam. ap.gov.in/urer వెబ్ సైట్ ద్వారా నవంబర్ 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐటీఐలో రెండు సంవత్సరాలు, లేదా డిప్లొమాలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేసి ఉండాలన్నారు. 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలన్నారు. ఆధార్, పాస్పోర్డు కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం 99888 53335, 87126 55686, 87901 17279, 87901 18349 నంబర్లలో సంప్రదించాలన్నారు. అరటి ఎగుమతులను ప్రోత్సహించాలి అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఉద్యాన పథకాల అమలును వేగవంతం చేయాలని ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏడీ దేవానంద్కుమార్తో కలిసి హార్టికల్చర్ ఆఫీసర్స్ (హెచ్వో)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఐడీహెచ్, ఆర్కేవీవై, ఆయిల్పామ్, బ్యాంబూమిషన్ కార్యక్రమాల కింద వివిధ పథకాల అమలుకు రూ.12.86 కోట్లు బడ్జెట్ ఉన్నందున వాటి ప్రోత్సాహక రాయితీలు పూర్తి స్థాయిలో రైతులకు అందించే బాధ్యత హెచ్వోలదే అన్నారు. గడవు సమీపిస్తున్నందున ఈ–క్రాప్ నమోదు పూర్తి చేయాలన్నారు. నాణ్యమైన అరటి పండించేలా రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు తెలియజేయాలని, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అరటి ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. యువకుడి ఆత్మహత్య గుత్తి: పట్టణంలోని చెర్లోపల్లి కాలనీకి చెందిన కృష్ణ కుమారుడు నవీన్ (27) శనివారం రాత్రి లచ్చానపల్లి బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీఆర్పీ కానిస్టేబుల్ నాగరాజు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మహిళపై అత్యాచారయత్నం పుట్లూరు: మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై రాజకుళ్లాయప్ప అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి హెచ్చరించారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ అమలుపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించిన స్కాన్ సెంటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ ద్వారా ఎదురయ్యే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో సర్వజనాస్పత్రి చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్టు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ దివ్య, డాక్టర్ దుర్గేష్, డాక్టర్ నారాయణస్వామి, డెమో నాగరాజు పాల్గొన్నారు. మాతా శిశు మరణాల నివారణకు కృషి మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో మాతా, శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఒక మాతృ, 6 శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. - 
      
                   
                               
                   
            ఒకే ఈతలో నాలుగు పిల్లలు
గుత్తి రూరల్: లచ్చానుపల్లిలో రైతు నాగార్జునకు చెందిన మేక శనివారం ఒకే ఈతలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా మేకలు ఈతలో ఒకటి లేదా రెండు పిల్లలను ఈనుతాయి. అయితే నాగార్జునకు చెందిన మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలను జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. బాధ్యతల స్వీకరణ అనంతపురం రూరల్: బీసీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీగా రామసుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఈడీగా ఉన్న సుబ్రమణ్యం ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో మైనార్టీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డిని బీసీ కార్పొరేషన్ ఇన్చార్జ్ ఈడీగా నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రామసుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఈడీని కలసి శుభాకాంక్షలు తెలిపారు. - 
      
                   
                               
                   
            బిగుస్తున్న ఉచ్చు
రాప్తాడురూరల్: పాపంపేట శోత్రియం భూముల అక్రమాల వ్యవహారంలో అనంతపురం రూరల్ మండల సర్వేయర్ రఘునాథ్, పాపంపేట వీఆర్ఓగా పని చేసిన రఘుయాదవ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా సర్వేయర్ అడ్డంగా బుక్ అయ్యారు! ఏకంగా 176 ఎకరాలు సర్వే చేసి రాచూరి కుటుంబ సభ్యులు, వారి నుంచి జీపీఏలు చేయించుకున్నవారు అనుభవంలో ఉన్నారంటూ సర్వేయర్ అధికారికంగా నివేదికలు ఇచ్చారు. పైగా ఇవన్నీ వ్యవసాయ భూములుగా పేర్కొన్నారు. వాస్తవానికి ఇక్కడన్నీ ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు ఉన్నాయి. కాలనీలు ఏర్పాటయ్యాయి. ఇవేవీ పట్టించుకోకుండా సర్వేయర్ ఏకపక్షంగా రిపోర్టులు ఇవ్వడం దుమారం రేపుతోంది. అలాగే సర్వేయర్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని కలెక్టర్ ఆనంద్ సీరియస్గా పరిగణించారు. ఈ వ్యవహారంపై విచారణాధికారిగా సర్వే ఏడీ రూప్లా నాయక్ను నియమించారు. వీఆర్ఓ పాత్రపైనా అనుమానాలు పాపంపేట వీఆర్ఓగా పని చేసిన రఘుయాదవ్ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ‘నా సంతకాన్ని ఫోర్జరీ చేశార’ని వీఆర్ఓ చెబుతున్నారు. అదే నిజమైతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే అంశంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. విచారణ పూర్తయితే ఈయనపై కూడా చర్యలుంటాయనే చర్చ రెవెన్యూ ఉద్యోగుల్లో సాగుతోంది. ఆ డాక్యుమెంటుకు చట్టబద్ధత ఉండదు : ఆర్డీఓ 296 ఎకరాలు ఆక్రమించుకునేందుకు చేసిన జీపీఏ (నాన్ రిజిస్టర్) డాక్యుమెంటుకు చట్టబద్ధత ఉండదని అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు స్పష్టం చేశారు. ఎవరైనా ఆ డాక్యుమెంట్ ఆధారంగా దౌర్జన్యం చేసినా, బెదిరించినా మీ వద్ద ఉన్న హక్కుపత్రాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పాపంపేట వాసులకు సూచించారు. పాపంపేట భూములకు అడ్డగోలు పొజిషన్ సర్టిఫికెట్లపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ విచారణాధికారిగా రూప్లానాయక్ నియామకం అడ్డంగా బుక్కయిన సర్వేయర్, వీఆర్ఓ! - 
      
                   
                               
                   
            పేరుకే హోదా.. పట్టభద్రులకు వ్యఽథ
● 15 నెలలుగా ఇన్చార్జ్ వీసీతోనే నెట్టుకొస్తున్న ఎస్కేయూ ● కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేక ఇబ్బందులు ● ఇప్పటికే రెండు దఫాలు సెర్చ్ కమిటీ నియామకం ● అయినా పూర్తి కాని వీసీ ఎంపిక ప్రక్రియ ● రెండేళ్లుగా డిగ్రీలు ప్రదానం చేయని పరిస్థితి ● స్నాతకోత్సవం నిర్వహించలేని స్థితిలో వర్సిటీ యాజమాన్యం అనంతపురం: పాలనాపరమైన ఇబ్బందులతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కొట్టుమిట్టాడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఇన్చార్జ్ వీసీకి లేకపోవడమే ఇందుకు కారణం. వర్సిటీ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ బి.అనిత నియామకమై 15 నెలలు పూర్తయింది. ఇప్పటికే రెండు దఫాలుగా సెర్చ్ కమిటీ నియామకమైనా పూర్తి స్థాయి వీసీ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ జాప్యం చేస్తోంది. ఇదిగో..అదిగో అంటూ ఊరడిస్తూ కాలయాపన చేస్తోంది. ఈ క్రమంలో కీలకమైన తీసుకోలేని అసహాయ స్థితిలో సాధారణమైన అంశాలకే ఇన్చార్జ్ వీసీ పరిమితం అవుతున్నారు. అలాగే రిజిస్ట్రార్ నియామకంలో నిబంధనలకు కూటమి సర్కార్ తిలోదకాలు ఇవ్వడంతో పాలన గాడి తప్పింది. అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి కాని, డిప్యూటీ రిజిస్ట్రార్ (డీఆర్) హోదాలో ఉన్న వారిని గాని రిజిస్ట్రార్గా నియామకం చేయాలి. ఇందుకు విరుద్ధంగా స్టాటిస్టికల్ ఆఫీసర్ స్థాయి ఉన్న వ్యక్తిని రిజిస్ట్రార్గా నియమించడం వివాదస్పదమైంది. అన్ని అర్హతలున్న వారు ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు. కేవలం ఓ సామాజిక వర్గానికి పట్టం కట్టాలనే ఉద్దేశ్యంతోనే రిజిస్ట్రార్ నియామకంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి రిజిస్ట్రార్గా ఉంటే వర్సిటీ, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. మూడేళ్ల క్రితం స్నాతకోత్సవం వాస్తవానికి స్నాతకోత్సవం ఏటా లేదా రెండేళ్లకు ఓ సారి నిర్వహిస్తుంటారు. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ డిగ్రీ అందించాలంటే స్నాతకోత్సవ నిర్వహణ తప్పనిసరి. చివరి సారిగా 2023, జులైలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ మూడేళ్లుగా స్నాతకోత్సవం ఊసే లేకుండా పోయింది. ఫలితంగా 20 వేల మంది విద్యార్థులు స్నాతకోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. డిగ్రీ పూర్తయి పీజీ కోర్సులు చేయాలంటే యూజీ పట్టా అనివార్యం. దీంతో చాలా మంది ఇన్అడ్వాన్సెడ్ కింద స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకుని పట్టా పొందుతున్నారు. దీంతో అదనపు ఫీజుల రూపంలో వేలాది మంది విద్యార్థుల జేబులకు చిల్లుపడుతోంది. స్నాతకోత్సవం నిర్వహించలేని అసహాయ స్థితిలో వర్సిటీ యాజమాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్అడ్వాన్సెడ్ స్నాతకోత్సవం కింద విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టుకునే కుట్ర సాగుతోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. హేమలత... 2024, జులైలో బీఎస్సీ (కంప్యూటర్ సైన్సెస్) కోర్సు పూర్తి చేసింది. అనంతరం సాఫ్ట్వేర్ కోర్సు ఒరాకిల్ హైదరాబాద్లో అభ్యసించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న ఆమెకు నియామక పత్రం (ఆఫర్ లెటర్) తీసుకున్న తక్షణమే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ అధికారులు సూచించారు. దీంతో సంబంధిత డిగ్రీ కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ను అడిగితే.. వర్సిటీ అధికారులు స్నాతకోత్సవం నిర్వహించలేదు కాబట్టి ఇన్ అడ్వాన్స్డ్ కాన్వొకేషన్ (ముందస్తు స్నాతకోత్సవ పట్టా) డిగ్రీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ మేరకు ఎస్కేయూకు వెళ్లి ఇన్ అడ్వాన్స్డ్ కాన్వొకేషన్కి దరఖాస్తు చేసుకుంది. ఇందుకు గాను రూ.3,500 చెల్లించాల్సి వచ్చింది. వాస్తవానికి స్నాతకోత్సవం నిర్వహించి ఉంటే పట్టా ఫీజు కేవలం రూ.2,500 మాత్రమే. ఇలా హేమలత ఒక్కరే కాదు.. స్నాతకోత్సవ డిగ్రీ కావాలనుకునే ప్రతి విద్యార్థీ అదనంగా చెల్లించాల్సి రావడంతో జేబులకు చిల్లు పడుతోంది. - 
      
                   
                               
                   
            ఆ టెండర్ల రద్దు తప్పదు
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు వేసే టెండర్లను తమ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా రద్దు చేస్తామని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు కేవలం ధనార్జనపైనే దృష్టి పెట్టారన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలనే ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఎవరు టెండర్లు వేసినా తాము అధికారంలోకి వచ్చాక అన్నీ రద్దు చేస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇది వరకే ప్రకటించారన్నారు. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు పేద విద్యార్థులను డాక్టర్లు చేసేలా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా జరుగుతోందని, త్వరలో గవర్నర్ను కలుస్తామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు అధికారుల ముందు షో చేయడం, ఆ తర్వాత వెళ్లిపోవడం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 28న శింగనమలలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నామని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులతో పాటు ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, పార్టీ బీకేఎస్, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు గార్లదిన్నె అధ్యక్షులు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల ప్రసాద్, ఖాదర్వలి, మహేశ్వరరెడ్డి, ఎల్లారెడ్డి, శంకర్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, అనంతపురం పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్య నారాయణరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముసలన్న, ప్రతాప్రెడ్డి, ఎంపీపీలు నాగేశ్వర రావు, యోగీశ్వరి, రాదా మనోహర్రెడ్డి, పూల నారాయణస్వామి, పార్వతి, చికెన్ నారాయణస్వామి, నాగిరెడ్డి, నరేష్, వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు పాల్గొన్నారు. దోచుకోవడానికే చంద్రబాబు ప్రైవేటీ కరణ జపం మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం - 
      
                   
                               
                   
            ఎన్పీఏ తగ్గింపుపై దృష్టి సారించాలి
అనంతపురం అగ్రికల్చర్: సహకార బ్యాంకులు ఆర్థిక పురోగతి సాధించాలంటే నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) శ్రీనాథ్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లా సహకార ఉద్యోగులకు స్థానిక ఆర్డీటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భగా హాజరైన ఎండీ మాట్లాడుతూ గడువు మీరిన మొండిబకాయిలు వసూళ్లు బాగా పెరగాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా బంగారు నగల తాకట్టు రుణాలు బాగా పెంచాలన్నారు. పరపతితో పాటు పరపతేతర వ్యాపార ప్రణాళికలతో బ్యాంకులను ఆర్థికంగా లాభాలబాట పట్టించడానికి పాలకవర్గం, అధికార సిబ్బంది కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, సీఈఓ కె.సురేఖారాణి, డీజీఎంలు రామ్ప్రసాద్, విజయచంద్రారెడ్డి, సుఖదేవబాబు, లక్నో నుంచి వచ్చిన ట్రైనర్ శిఖా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. ‘ లా ’కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ అనంతపురం : న్యాయశాస్త్ర కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. న్యాయవాది వృత్తిపట్ల యువతకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం. న్యాయవాద కోర్సులకు సంబంధించి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తయింది. శనివారం జాబితా విడుదలైంది. ఎస్కేయూ క్యాంపస్లోని న్యాయశాస్త్ర విభాగంలో ఎల్ఎల్బీ (మూడు సంవత్సరాలు) 66 సీట్లకు గాను అన్ని సీట్లూ భర్తీ అయ్యాయి. ఎస్కేయూ అనుబంధ విజయనగర లా కళాశాలలోనూ కన్వీనర్ కోటాలోని 80 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 80 శాతం సీట్లు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులకే దక్కాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లు 20 శాతం స్థానికులకు, స్థానికేతరులతోనూ భర్తీ చేసుకోవచ్చు. లీగల్ ప్రొఫెషనల్కు మంచి డిమాండ్ ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు సోమవారం ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంది. - 
      
                   
                               
                   
            28న డీఈఓ పోస్టుల భర్తీకి పరీక్ష
అనంతపురం మెడికల్: డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జేఎన్టీయూలోని సెంట్రల్ కంప్యూటర్ సెంటర్లో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో డీఈఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థుల జాబితాను అనంతపురం వెబ్సైట్లో ఉంచామని, అర్హత సాధించిన వారు పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. వైఎస్సార్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కృష్ణారెడ్డి అనంతపురం: వైఎస్సార్సీపీ అనుబంధ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతంశెట్టి కృష్ణారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. - 
      
                   
                               
                   
            29 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 29 మండలాల పరిధిలో 11.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుంతకల్లు 34.4 మి.మీ, రాప్తాడు 34.2, పుట్లూరు 32.4, కూడేరు 32, నార్పల 26.6, గుత్తి 24.8, బొమ్మనహాళ్ 21.2, కంబదూరు 21.2, విడపనకల్లు 16.4, యాడికి 16, గార్లదిన్నె 13.4, శింగనమలలో 11.4 మి.మీ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 100.9 మి.మీ కాగా.. ప్రస్తుతానికి 97.4 మి.మీ నమోదైంది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. సహాయక చర్యలకు రూ.కోటి అనంతపురం అర్బన్: భారీ వర్షాలు, వరదల సమయంలో అత్యవసర పనులు, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి మంజూరు చేసింది. నిధులను ఖర్చు చేసేందుకు కలెక్టరుకు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 22ఏ ఫైళ్లు సమగ్రంగా ఉండాలి అనంతపురం అర్బన్: ‘‘నిషేధిత భూముల (22ఏ) జాబితాకు సంబంధించిన ఫైళ్లు సమగ్రంగా ఉండాలి. అప్పుడే వాటికి ఆమోదం లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచు కుని నిబంధనలకు అనుగుణంగా ఫైళ్లను సిద్ధం చేయండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. 22ఏ భూముల ఫైళ్ల పరిష్కారానికి కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో చేపట్టిన రెండో విడత ప్రత్యేక డ్రైవ్లో శనివారం కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1954 జూన్ 18కి ముందు అసైన్డ్ అయిన వాటికే ఎన్ఓసీ లభిస్తుందన్నారు. నిర్దేశించిన తేదీ తరువాత అసైన్డ్ అయిన భూములు 22ఏ జాబితా నుంచి తొలగించడం సాధ్యపడదని, అలాంటివి తిరస్కరణకు గురవుతాయన్నారు. కార్యక్రమంలో జేసీ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు పాల్గొన్నారు. రేపు ‘పరిష్కార వేదిక’అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 27న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. బైక్ సర్వీసుకు అదనపు చార్జీల వసూలుపై కొరడా ● తిప్పయ్య మోటార్స్కు రూ.25 వేల జరిమానా అనంతపురం: బైక్ సర్వీసుకు అదనపు చార్జీలు వసూలు చేసిన తిప్పయ్య మోటార్స్పై వినియోగదారుల కమిషన్ కొరడా ఝళిపించింది. వివరాలు.. నగరంలోని అరుణోదయ కాలనీకి చెందిన అబ్దుల్ గఫూర్ తన హీరో హోండా స్ప్లెండర్ బైక్ను ఆర్ఎఫ్ రోడ్డులోని తిప్పయ్య మోటార్స్లో సర్వీస్ చేయించాడు. రెగ్యులర్ సర్వీసులో భాగంగా హెడ్లైట్, మరికొన్ని మరమ్మతులు చేయించి ఇందుకు రూ.1,318 బిల్లు చెల్లించాడు. అయితే, తిప్పయ్య మోటార్స్ సిబ్బంది ఇచ్చిన బిల్లులో ఎక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేసినట్లు అబ్దుల్ గఫూర్ గుర్తించాడు. దీనిపై మేనేజర్ను సంప్రదించినా సరైన సమాధానం రాలేదు. దీంతో తిప్పయ్య మోటార్స్కు లీగల్ నోటీసు పంపి వినియోగదారుల కమిషన్లో కేసు దాఖలు చేశాడు. వినియోగదారుడికి ఒక తరహాలో, ప్రభుత్వానికి చూపే జమా ఖర్చుల్లో మరో తరహా బిల్లును ఇస్తున్నట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ చేపట్టిన కమిషన్.. నైట్రోజన్ గాలికి రూ.20, ఇందుకు అదనంగా జీఎస్టీ రూ.3.60 వసూలు చేయడం సేవాలోపంగా గుర్తించింది. అదనంగా సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న తిప్పయ్య మోటార్స్ కు రూ.25 వేల జరిమానాతో పాటు కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటివి పునరావృతమైతే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత, సభ్యులు డి. గ్రేస్మేరీ, బి. గోపీనాథ్ హెచ్చరించారు. - 
      
                   
                               
                   
            సత్యసాయి జయంత్యుత్సవాలకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకటన మేరకు... గుంతకల్లు–చైన్నె ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నవంబర్ 19,20,21,22 తేదీల్లో నడుస్తాయి. నవంబర్ 19న చైన్నె (06091)లో రాత్రి 11.30 గంటలకు రైలు బయలుదేరి గుంతకల్లు జంక్షన్కు గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరిగి ఈ రైలు 20న ఇక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చైన్నె చేరుతుంది. యలహంక, హిందూపురం, పుట్టపర్తి సత్యసాయి నిలయం రైల్వేస్టేషన్, ధర్మవరం, అనంతపురం, గుత్తి మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుంది.● కాచిగూడ–తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తాయి. నవంబర్ 6,13,20,27 తేదీల్లో (గురువారం) కాచిగూడ జంక్షన్ (07787) నుంచి రాత్రి 10.25 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు రైల్వేస్టేషన్కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 7,14,21,28 తేదీల్లో తిరుచూనూరు రైల్వేస్టేషన్ (07788)లో సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ జంక్షన్ చేరుకుంటుంది. ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట జంక్షన్ మీదుగా రైలు ప్రయాణిస్తుంది. - 
      
                   
                               
                   
            హోటల్ తొలగింపులో ఉద్రిక్తత
● అడ్డుకోబోయిన బాధితులు, సీపీఐ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతల అరెస్ట్ కళ్యాణదుర్గం: దళిత సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుల హోటల్ షెడ్డు తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో మున్సిపల్, ఆర్అండ్బీ స్థలాలు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మించినా పట్టించుకోని అధికారులు.. చిన్న విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్న హోటల్ను ఉద్దేశపూర్వకంగా జేసీబీ సాయంతో తొలగించడం విమర్శలకు తావిచ్చింది. ఆర్డీటీ ఆస్పత్రికి ఎదురుగా రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నం.357 లోని రెండు సెంట్ల ఆర్అండ్బీ స్థలంలో రామచంద్ర, దివ్య దంపతులు షెడ్డు వేసుకుని, అందులో హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఈ హోటలే వారికి జీవనాధారంగా ఉంటోంది. వీరు వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. ఈ హోటల్ వెనుక జి.నరసింహులు అనే కానిస్టేబుల్కు సర్వే నంబర్ 359–1లోని రెండున్నర సెంట్ల స్థలం ఉంది. అయితే తన స్థలం పరిధిలోనే దివ్య హోటల్ నడుపుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు కుట్రపన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పోలీసు బందోబస్తు నడుమ శనివారం జేసీబీ ద్వారా హోటల్–బంక్ తొలగింపునకు చర్యలు చేపట్టారు. తామే తొలగించుకుంటామని, గడువు ఇవ్వాలని ప్రాధేయపడిన నిర్వాహకుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా వారిని పక్కకు లాగేసి మరీ.. హోటల్లోని సరుకులను కార్మికుల చేత పక్కకు తీయించేశారు. అటు ఇటు ఉన్న దుకాణాలను వదిలేసి తమ హోటల్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తొలగించడాన్ని దివ్య, రామచంద్ర తప్పు పట్టారు. పొట్టకూటి కోసం పేదలు ఏర్పాటు చేసుకున్న చిరు హోటళ్లు, బంకులను తొలగించరాదంటూ సీపీఐ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో హోటల్ నిర్వాహకులతో పాటు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, పట్టణ కార్యదర్శి ఓంకార్, బుడేన్, ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరితో పాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పట్టణంలో చాలాచోట్ల మున్సిపల్, ఆర్అండ్బీ స్థలాలను కబ్జా చేసి భవంతులు నిర్మిస్తున్నా మున్సిపల్ కమిషనర్కు అవేవీ కనిపించడం లేదని, పేదలు జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న వాటిని కక్ష కట్టినట్టు తొలగించడంలో ఆంతర్యం ఏమిటని ఆందోళనకారులు ప్రశ్నించారు. ముమ్మాటికీ అగ్రకులాల వారి కుట్రేనని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అనంతరం డీఎస్పీ రవిబాబు, సీఐలు వంశీధర్, హరినాథ్తో పాటు పదుల సంఖ్యలో పోలీసులు మోహరించి, అందరినీ పంపించేశారు. - 
      
                   
                               
                   
            వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రణయ్రెడ్డి
ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వై.ప్రణయ్రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యార్థి విభాగం నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్కు, సహకరించిన పార్టీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డికి ప్రణయ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి విభాగం బలోపేతానికి కృషి చేసి, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు. కవితలకు ఆహ్వానం అనంతపురం కల్చరల్: ‘రాయలసీమ ప్రసిద్ధ ప్రదేశాలు’ అనే అంశంపై కవితలు ఆహ్వానిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన కవులు నవంబర్ 15వ తేదీలోపు కవితలు పంపించాలని కోరారు. అదే నెల 30న తొమ్మిదవ రాయలసీమ మహాకవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 99639 17187 నంబర్లో సంప్రదించాలని సూచించారు. - 
      
                    
పీఏబీఆర్ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల
కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నాలుగో గేటును శనివారం తాత్కాలికంగా ఎత్తి దిగువన ఉన్న మిడ్పెన్నార్ (ఎంపీఆర్)కు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్రావు మాట్లాడుతూ డ్యాంలో నీటి మట్టం 5.443 టీఎంసీలు ఉందన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ ద్వారా పీఏబీఆర్లోకి 150 క్యూసెక్కులు, హంద్రీ–నీవా కాలువ ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. అదే విధంగా తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీల రూపంలో 220 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు. పది రోజుల క్రితం వరకు డ్యాం వద్ద ఏర్పాటైన ఏపీ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి 550–870 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వచ్చామన్నారు. దీంతో ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో ఇంచుమించు సమానంగా ఉండేదన్నారు. కానీ జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేసే ప్రాంతంలో ఏర్పాటు చేసిన గేట్ లింక్ పని చేయకపోవడంతో గేటు పైకి లేవకపోవడంతో నీరు సరఫరా కాలేదన్నారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందన్నారు. దీంతో అవుట్ఫ్లో కంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో నీటి మట్టం 5.5 టీఎంసీల దాటిపోయే పరిస్థితి ఉందన్నారు. అలా జరిగితే డ్యాం దిగువన ఉన్న భూములు నీటి ముంపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. డ్యాం నీటి నిల్వ సామర్ాధ్యన్ని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఒక గేటును ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామన్నారు. గేటు మరమ్మతు పనులు పూర్తిగానే గేటు దించి జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించేందుకు చర్యలు చేపడతామని ఎస్ఈ వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్ఈ పెంచలయ్య, డీఈఈ వెంకటరమణ, ఏఈఈలు ముత్యాలప్ప, లక్ష్మీదేవి, గంగమ్మ, రేణుక, లింగయ్య, పరమేష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచుదాం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో 16 నెలలుగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 28న చేపట్టనున్న ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇందులో మేధావులు, విద్యార్థులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈనెల 28న 10.30 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ దగ్గరున్న అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై ఆర్డీఓ ఆఫీసు వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల నిలువుదోపిడీకి స్కెచ్.. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, వేధింపులు రాజ్య మేలుతున్నాయని ‘అనంత’ దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ ఆస్తులను నిలువుదోపిడీ చేసేందుకు భారీ స్కెచ్ వేశారన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిందని, అప్పట్లోనే అందులో 7 కళాశాలలు పూర్తి కాగా మిగతా 10 కళాశాలల నిర్మాణాలు 30 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. నేడు వాటిని పీపీపీ అంటూ ప్రైవేటీకరణ చేస్తుండటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంద న్నారు. పేద వర్గాలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్నట్లుగానే జిల్లాలో కూడా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీ కరణ ఆపే ఉద్యమంలో అన్ని వర్గాలూ పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, శింగనమల, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బీసీ రమేష్గౌడ్, వెన్నం శివారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్, నగర కమిటీ అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు బాకే హబీబుల్లా, సోషియల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబాసలాం, మేధావుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, కార్పొరేటర్లు శేఖర్బాబు, శ్రీనివాసులు, రహంతుల్లా, ఇసాక్, నాయకులు ఫయాజ్, చింతకుంట మధు, కుళ్లాయిస్వామి, రామచంద్ర, దాదాపీర్, నాగార్జునరెడ్డి, మైను తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాల్సిందే పీపీపీని నిరసిస్తూ ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి - 
      
                   
                               
                   
            రైతుల ముసుగులో నయా దందా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు నయా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనం, ఎరువులు, పురుగు మందుల దుకాణదారులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఓ వైపు వసూళ్లు కొనసాగిస్తూనే... మరోవైపు సరికొత్త ఎత్తుగడతో వసూళ్లకు ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ పార్టీ ముద్ర వేసి కొందరినే టార్గెట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రైతుల ముసుగులో వారే ఫిర్యాదులు ఇప్పించి సదరు దుకాణంలో తనిఖీలు చేయడం, చిన్నపాటి పొరపాట్లు గుర్తించడం, సరుకు సీజ్.. కేసు నమోదు.. లైసెన్సు రద్దు అంటూ బెదిరిస్తున్నట్లు తెలిసింది.జిల్లాలో డివిజన్, మండల స్థాయి అధికారుల వరకు కొందరు ఈ సరికొత్త ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, పలువురు అసోసియేషన్ నాయకుల పాత్ర ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీల సమయంలో రూ. లక్షలు ఖర్చు చేసి పోస్టింగ్లు తెచ్చుకున్న కొందరు అధికారులే వసూళ్లకు తెరలేపినట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాన వనరుగా జిల్లా కేంద్రం.. జిల్లా వ్యాప్తంగా 800 వరకు దుకాణాలు ఉన్నాయి. అందులో అనంతపురం నగర పరిధిలోనే 250 దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఉండడంతో ప్రధాన ఆర్థిక వనరుగా నగరాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం రైతుల ముసుగులో టార్గెట్ చేసిన దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, మందులు కొనిపించడం.. తర్వాత బిల్లులు ఇవ్వలేదని, వేరే కంపెనీ సరుకు ఇచ్చారని, దిగుబడులు రాలేదని... ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేయించి తనిఖీలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.ఇటీవల గార్లదిన్నె, కల్లూరు, అనంతపురంలో కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి వారి దుకాణాల్లో తనిఖీలు చేశారు. చిన్నపాటి తప్పిదాలను బూచిగా చూపించి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కొంత మొత్తం చేతులు మారినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు చేయించడం కోసం కొందరు రైతులను దళారులుగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ప్రతి పనికీ, సంతకానికి రేటు నిర్ణయించి మరీ దండుకుంటున్న అధికారులు నేడు కుట్రపూరిత చర్యలకు దిగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నిషేధిత సరుకు అమ్ముతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరి షాపుల వైపు చూసే పరిస్థితే తమకు లేదని అధికారులే చెబుతుండటం విశేషం. కొందరు వ్యవసాయాధికారుల కక్కుర్తి తామే ఫిర్యాదు ఇప్పించి దుకాణాల్లో తనిఖీలు సీజ్, కేసులంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు ప్లాన్ - 
      
                   
                               
                   
            ‘డైట్’లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
అనంతపురం సిటీ: బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీసు)పై భర్తీ చేయనున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 30, 31 తేదీల్లో స్క్రూటినీ, నవంబర్ 5 నుంచి 8 వరకు ఆన్లైన్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. నవంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఖాళీల వివరాలు, విద్యార్హతలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం వెబ్సైట్ చూడాలన్నారు. బీటీపీకి పెరుగుతున్న వరద గుమ్మఘట్ట: రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వేదవతి హగరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. దీంతో క్రమంగా బీటీప్రాజెక్టుకు నీరు చేరుతోంది. గురువారం నాటికి ప్రాజెక్టులో 1652.2 అడుగుల నీరు ఉన్నట్లు జలవనరుల శాఖ డీఈఈ గీతాలక్ష్మి తెలిపారు. క్యూసెక్కుల ఇన్ప్లో ఉందన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య బుక్కరాయసముద్రం: గ్రామాలలో ఎవరైనా మద్యం అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. బీకేఎస్లోని ఎకై ్సజ్ కార్యాలయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం షాపులలో నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు ఏపీ ఎకై ్సజ్ సురక్షా యాప్ను డౌన్ లోడు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా బాటిల్ మూతపై క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా ఆ మద్యం గుర్తింపు పొందినదో, లేదో తెలిసిపోతుందన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ రామమోహన్రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్, బీకేఎస్ ఎకై ్సజ్ సీఐ నాగ సునీత, సిబ్బంది పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            శాంతినారాయణకు జీవిత సాఫల్య పురస్కారం
అనంతపురం కల్చరల్: జిల్లాకు చెందిన కవి డాక్టర్ శాంతినారాయణకు అమృతలత సాహిత్య జీవన సాఫల్య పురస్కారం–2024 వరించింది. ఈ మేరకు గురువారం పురస్కార ప్రదాత డాక్టర్ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2న నిజామాబాద్లో జరగనున్న కార్యక్రమంలో ఆయనకు పురస్కారంతో పాటు రూ.25 వేల నగదు అందించనున్నట్లు వెల్లడించారు. తెలుగు కథా సాహిత్యంలో విలక్షణ రచయితగా శాంతినారాయణ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు 70 కథానికలు, నాలుగు నవలలు, నాగలకట్ట సుద్దులు (రెండు సంపుటాలు’ రచించారు. విమలా శాంతి సామాజిక సేవా సమితి ద్వారా యువ రచయితలు, కవులకు పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. డాక్టర్ శాంతినారాయణ సాహిత్య కృషిని గుర్తించిన గత ప్రభుత్వం ఆయనకు ‘డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం’ అందించి గౌరవించింది. ఇదే క్రమంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికై న శాంతినారాయణకు పలువురు రచయితలు, కవులు అభినందనలు తెలిపారు. సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న శాంతినారాయణ అనంత ఖ్యాతిని ఘనంగా చాటారని ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, జనప్రియకవి ఏలూరు యంగన్న హర్షం వ్యక్తం చేశారు. - 
      
                   
                               
                   
            డబుల్ రిజిస్ట్రేషన్లపై సీఎంకు ఫిర్యాదు
అనంతపురం టౌన్: ఫేక్ రిజిస్ట్రేషన్లతో ఇతరుల స్థిరాస్తులను లాక్కొవాలని చూస్తే కుదరదని, ఈ అంశంపై బాధితులను బెదిరించినా ఊరుకునేది లేదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా అనంత నగరంలో ఎలాంటి భూ వివాదాలు, భూ కబ్జాలు లేవన్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో చోటామోటా నాయకులు ఫేక్ రిజిస్ట్రేషన్లతో అత్యంత విలువైన భూములను కబ్జా చేస్తూ బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసేందుకు ఎంత వరకై నా పోరాటం సాగిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న భూకబ్జాల పర్వాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగానే నగరంలో భూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు వివరించారు. నగర ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే అన్యాయాలకు తెరదీయడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వాయిదా ఈ నెల 28న నిర్వహించాలనుకున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నవంబర్ ఆఖరుకు వాయిదా వేస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి తెలిపారు. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా సినీరంగానికి సేవలు అందించిన కళాకారులను, సినీనటులను సత్కరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సినీ రంగానికి సేవలందించిన రాయలసీమ కళాకారులను పార్టీలకు అతీతంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ఒకరి స్థిరాస్తిని లాక్కొంటామంటే కుదరదు ఫేక్ రిజిస్ట్రేషన్లతో బాధితులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి - 
      
                   
                               
                   
            నా బిడ్డను ఇవ్వకపోతే చచ్చిపోతా!
● సర్వజనాస్పత్రిలో దివ్యాంగ బాలింత ఆవేదన అనంతపురం మెడికల్: ఏందమ్మా నా బిడ్డను నా చేతికెందుకివ్వరూ. రెండ్రోజులవుతోంది నా బిడ్డను నాకిచ్చేయండి. లేకపోతే చచ్చిపోతా’ అంటూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, స్టాఫ్నర్సులను ఓ బాలింత వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన ఓ 30 ఏళ్ల గర్భిణి (ఓ కాలు లేదు) ఈ నెల 10న ఆస్పత్రికి వచ్చింది. రక్తహీనత, తదితర సమస్యలతో బాధపడుతుంటే లేబర్ వార్డులో అడ్మిషన్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 18న ఆమె మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు కామెర్లులా ఉండడంతో ఆస్పత్రిలోని నవజాతా శిశు కేంద్రంలో అడ్మిట్ చేశారు. ఫొటోథెరపీ కింద బిడ్డను ఉంచి వైద్యులు సేవలందిస్తున్నారు. బిడ్డకు తల్లిపాలు ఇబ్బంది లేకుండా మదర్మిల్క్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు. ఆస్పత్రిలోని పోస్టునేటల్ వార్డులో అడ్మిషన్లో ఉన్న బాలింతకు తన బిడ్డ గుర్తొచ్చినప్పుడల్లా ఎస్ఎన్సీయూ వద్దకెళ్లి సిబ్బందిని ప్రాధేయపడుతోంది. బిడ్డకు బాగలేదని మళ్లీ ఇస్తామని చెబుతున్న సిబ్బందితో గొడవ పడి తిరిగి వార్డుకు చేరుకుంటోంది. ఇదే అంశంపై గైనిక్ హెచ్ఓడీ షంషాద్ బేగం మాట్లాడుతూ.. బాలింత సంబంధీకులు ఇప్పటి వరకూ ఎవరూ రాలేదని తెలిపారు. తన పేరు మాత్రం మంజుల అని, ఎవరూ లేరని సమాధానం చెబుతోందన్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేని కారణంగా శిశువును అప్పగిస్తే ఆ పసికందును ఏం చేస్తుందోనని సిబ్బంది భయపడుతున్నారని, సంబంధీకులు ఎవరైనా వచ్చి బాలింతకు మేలుగా ఉంటుందని పేర్కొన్నారు. - 
      
                   
                               
                   
            వ్యక్తి హత్య
● పోలీసుల అదుపులో అనుమానితులు తాడిపత్రి టౌన్: స్థానిక భగత్సింగ్ నగర్కు చెందిన పెయింటర్ రాజా (45) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇళ్లకు పెయింటింగ్ పనితో జీవనం సాగిస్తున్న రాజాకు 20 ఏళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లికి చెందిన సరస్వతితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజా మద్యానికి బానిసగా మారి తరచూ గొడవ పడుతుండడంతో పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భగత్సింగ్ నగర్లో ఒంటరిగానే జీవిస్తున్నాడు. రోజూ మరో ఇద్దరితో కలసి రాత్రి సమయంలో ఫుల్గా మద్యం సేవించే వాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో వెళుతున్న రాజా అశోక్పిల్లర్ సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు తలపై సిమెంట్ దిమ్మెతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం గుర్తించిన స్థానికుల సమాచారంతో ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐ ఆరోహణరావు, ఎస్ఐ గౌస్మహమ్మద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, రాజాతో కలసి రోజూ మద్యం సేవించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. - 
      
                   
                               
                   
            వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు
తాడిపత్రి రూరల్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని సకాలంలో రైల్వే పోలీసులు కాపాడారు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన వెంకటస్వామినాయక్, అతని సోదరుల మధ్య పొలం వివాదం ఉంది. స్థిరాస్తి పంపకంలో తనకు జరిగిన అన్యాయాన్ని తాళలేక చనిపోతున్నట్లు ఇంట్లో చెప్పి గురువారం ద్విచక్ర వాహనంపై చింతలాయపల్లికి చేరుకున్నాడు. అక్కడ బైక్ వదిలి తాడిపత్రికి వచ్చాడు. అనంతరం అతిగా మద్యం సేవించి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న గూడ్స్ రైలును గమనించి దానికి ఎదురుగా పట్టాలపై పరుగు తీస్తుండడం గమనించిన కానిస్టేబుల్ శివారెడ్డి, రైల్వే పోలీసులు వెంటాడి సకాలంలో పట్టాలపై నుంచి పక్కకు లాగారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కుటుంబసభ్యులను పిలిపించి, కౌన్సెలింగ్ అనంతరం అప్పగించారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి అనంతపురం టౌన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు పలువురు సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. ఈ మేరకు అనంతపురంలోని మంత్రి నివాసంలో గురువారం కేశవ్ను కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. జీఓ 523 ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ, వరప్రసాద్, మల్లికార్జున, చంద్ర, శివశంకర్తోపాటు పలువురు పాల్గొన్నారు. డిసెంబర్లోపు షీప్ సొసైటీ ఎన్నికలు అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు డిసెంబర్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ తెలిపారు. స్థానిక షీప్ డెవలప్మెంట్ కార్యాలయంలో యూనియన్ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్, పర్సన్ ఇన్చార్జి /డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా వీఏఎస్ డాక్టర్ గోల్డ్స్మన్ పాల్గొన్నారు. నిద్రావస్థలో ఉన్న ప్రాథమిక గొర్రెల సంఘాలను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా గడువు మీరిన సంఘాలకు త్వరలో ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని సభ ఆమోదించింది. జీవాలకు, కాపర్లకు బీమా సదుపాయం ఉందని, షెడ్లు నిర్మాణాలను ప్రోత్సహిస్తామని, జీవాల సంరక్షణకు మెరుగైన వైద్య సేవలు, వ్యాక్సినేషన్లు ఇస్తామని తెలిపారు. - 
      
                   
                               
                   
            బాబుకు కనువిప్పు కల్గించేందుకే ‘కోటి సంతకాలు’
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డికూడేరు/అనంతపురం అగ్రికల్చర్: సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టామని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్ అధ్యక్షతన ఉరవకొండ నియోజకవర్గంలోని మండలాల పరిశీలకులు, కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘విశ్వ’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం దుర్మార్గమన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ పటిష్టత కోసం చురుగ్గా పని చేసే వారికే గ్రామ, అనుబంధ కమిటీల్లో చోటు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ఉరవకొండలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దేవేంద్ర, ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ దేవా, కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండల కన్వీనర్లు బైరెడ్డి రామచంద్రారెడ్డి, డొనేకల్లు రమేష్, సోమశేఖర్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వడ్డే గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్, పార్టీ నేతలు ముస్టూరు నరేష్, నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ప్రైవేటీకరణతో వైద్య విద్య దూరం
● కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య బ్రహ్మసముద్రం: వైద్య కళాశాల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని, అంతేకాక పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా పోతాయని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మసముద్రం మండలం మామడూరులో ఆ పార్టీ మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన గురువారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగయ్య మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులు తీసుకువచ్చారన్నారు. ఇందులో పలు కళాశాలల నిర్మాణాలున పూర్తయి తరగతులూ జరుగుతున్నాయన్నారు. రూ. 5 వేల కోట్ల కేటాయిస్తే మిగిలిన కళాశాలలూ పూర్తవుతాయన్నారు. అయితే నిధులు కేటాయించకుండా పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా ప్రైవేట్ వ్యక్తలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఈ కుట్రకు సీఎం చంద్రబాబు తెరతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం సూత్రధారులు టీడీపీ నేతలేనని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వీధివీధికీ బెల్టుషాపులు ఏర్పాటు చేసి ప్రతి బాటిల్పై రూ. 30 అదనంగా వసూలు చేస్తూ దోపిడీ సాగిస్తున్నారన్నారు. అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యే అయిన తరువాత అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసి, దోపిడీకి తెరలేపారన్నారు. చివరకు బీటీపీ కాలువ మట్టిని కూడా ఎమ్మెల్యే విక్రయించుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామంలో సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం గంగాధరప్ప, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, ఎంపీపీలు కంభం చంద్రశేఖర్రెడ్డి, భీమేష్, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కై రేవు ప్రతాప్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శులు గోపాలరెడ్డి, మంజునాథ, బూత్ కమిటీ విభాగం సునీల్, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ హనుమంతరాయుడు, మండల ఉపాధ్యక్షులు రాము, మల్లికార్జున, వైస్ ఎంపీపీ బి.పల్లప్ప, ఎంపీటీసీలు శివన్న, తిప్పేస్వామి, సర్పంచ్లు రాంమ్మోహన్, నాగభూషణ, గంగాధర, ఎల్లప్ప, మండల కో ఆప్షన్ సభ్యుడు ఈశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మహదేవప్ప, అనుబంధ సంఘాల అధ్యక్షులు అభిలాష్రెడ్డి, తిప్పేస్వామి, పాతలింగ, ఎరడికెర ఎర్రిస్వామి, తిమ్మారెడ్డి, శరణప్ప, మహలింగ, ఆర్ఎంపీ వసంత్, మంజు, శంకర్నాయక్, నాగిరెడ్డి, జనార్ధన, జానీ, నాయకులు అయ్యన్న, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న తలారి రంగయ్య, సంతకాలు సేకరిస్తున్న రంగయ్య, పార్టీ శ్రేణులు - 
      
                   
                               
                   
            పుట్టడమే నేరమా?
అప్పగిస్తే సంరక్షిస్తాం రాయదుర్గం: అమ్మా .. అనే పిలుపు కోసం తహతహలాడే వారు ఎందరో ఉన్నారు. అమ్మ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండదని అంటారు. బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్నో బాధలను సైతం లెక్కచేయకుండా చిరునవ్వుతో కష్టాన్ని భరిస్తూ, పురిటి నొప్పులతో పునర్జన్మను పొందే తల్లులూ ఎందరో ఉన్నారు. అంతటి త్యాగమూర్తుల పేరుకే మచ్చతెచ్చేలా కొందరు కర్కశత్వం ప్రదరిస్తున్నారు. పేగు పంచుకుని పుట్టిన వారిని కనికరం లేకుండా ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. అమ్మా! నేనేం పాపం చేశా, పుట్టడమే నేరామా? అంటూ పసి హృదయాలు ఆక్రోసించేలా చేస్తున్నారు. జిల్లాలో గత మూడేళ్లుగా 31 మంది పసికందులు శిశుగృహలో చేరారు. లెక్కకు రాని మరణాలు మరెన్ని ఉన్నాయి. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం పరిసరాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండడం విశేషం. ఇటీవల కళ్యాణదుర్గంలో ముళ్లపొదల్లో లభ్యమైన శిశువును సరిగ్గా చూసుకోలేక మృత్యుఒడికి చేర్చారు. అలనాపాలన చూడాల్సిన అధికారులు సరైన వసతులు సమకూర్చక పోవడంతోనే శిశువు మృతికి కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి అప్పటి ఐసీడీఎస్ పీడీని బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. అసలు కారకులను మాత్రం ఉపేక్షిస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఏ కారణం చేతనైనా బిడ్డను పోషించడం భారమనుకుంటే శిశుగృహలో అప్పగించాలి. శిశువులను పెంచి పోషించే బాధ్యత తీసుకుంటాం. బిడ్డను అప్పగించాక 60 రోజుల్లో మనసుమారితే ఎప్పుడైనా సరే వెనక్కు తీసుకెళ్లవచ్చు. ఇటీవల పెళ్లికాని ఓ అమ్మాయి కూడా బిడ్డకు జన్మనిచ్చింది. వేరే ఆలోచన చేయకుండా నేరుగా శిశుగృహకు అప్పగించింది. ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా చేయకుండా భయపడి ముళ్లపొదలు, రోడ్డుపక్కన వదిలివెళ్లడం మంచిది కాదు. శిశుగృహలో ఏ ఒక్క బిడ్డా మృతి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ విషయంపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతున్నాం. – అరుణకుమారి, ఐసీడీఎస్ పీడీ - 
      
                   
                               
                   
            ●జోడెద్దుల జోరు
● 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తిన ఎద్దులు బొమ్మనహాళ్: జోడెద్దులు జోరుగా కదిలాయి. 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తి సన్మానం అందుకున్నాయి. ఈ అరుదైన ఘనతను బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన రైతుచిన్న బసయ్య పొలంలో గురువారం అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామి తన ఎద్దులతో కసలి సాధించాడు. ఇందుకు శివ, ఇస్సప్ప, రేవప్ప, రాముడు, వన్నప్ప సాయం తీసుకున్నాడు. కాడెద్దులతో గురువారం తెల్లవారుజాము 5 గంటలకు విత్తు పనులు చేపట్టి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి ఎద్దులను గ్రామంలో ఘనంగా ఊరేగించి, సంబరాలు నిర్వహించారు. - 
      
                   
                               
                   
            దంచికొట్టిన వాన
●‘అనంత’లో విరుచుకుపడిన వరుణుడు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడ్డాడు. నగరంలో 50 మి.మీ, బుక్కరాయసముద్రంలో 72, అనంతపురం రూరల్ మండలంలో 70 మి.మీల భారీ వర్షపాతం నమో దైంది. అలాగే, ఉరవకొండలో 65 మి.మీ, ఆత్మకూరు 50 మి.మీ, రాప్తాడులో 40 మి.మీ, కూడేరు 32 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నార్పల, విడపనకల్లు, కళ్యాణదుర్గం, వజ్రకరూరు, డి.హీరేహాళ్, శింగనమల, గుత్తి, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు తదితర మండలాల్లోనూ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షంతో అనంతపురం నగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలిమరపై పిడుగు కూడేరు: మండలంలోని కలగళ్లలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన జోరు వర్షం కురిసింది. గ్రామ సమీపాన గ్రీన్కో కంపెనీ ఏర్పాటు చేసిన గాలిమరపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగి గాలిమర కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. - 
      
                   
                                                     
                   
            రేయ్ నా కొడకల్లారా.. జాగ్రత్త!
అనంతపురం సెంట్రల్: ‘రేయ్.. నా కొడల్లారా.. ఏమనుకుంటున్నారు. మీ ఇళ్ల వద్దకు వస్తా. ఏమనుకుంటున్నారో. ఒక్కో నా కొడుకు ఇష్టారాజ్యంగా రాస్తారా. నాకు గన్మెన్లు తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో పెడతారా.. ఒక్కో యూట్యూబ్ నా కొడుక్కి చెబుతున్నా జాగ్రత్త’’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి బూతులతో రెచ్చిపోయారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున ఏఎస్పీ రోహిత్ చౌదరిని దుర్భాషలాడటంతోపాటు ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానిం చడం, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ ఎస్పీ జగదీష్ అదే రీతిలో స్పందించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఎస్పీ జగదీష్ను కలిసేందుకు అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగా వేచి ఉన్నా.. ఎస్పీ జగదీష్ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి వెనుతిరిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై జేసీ బూతులు లంకించుకున్నారు. అంతుచూస్తా జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నేను చదువుకున్న వాన్ని.. మా తాతల కాలం నుంచి రాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడే జేసీ ప్రభాకర్రెడ్డి అనాగరికంగా మాట్లాడుతున్న మాటలు చూసి జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అధికారపార్టీలో ఉన్నా.. చివరుకు జిల్లా ఎస్పీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే జేసీకి ఉన్న విలువ ఏపాటిదో అన్నది అర్థం కావడం లేదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. - 
      
                   
                                                     
                   
            ఎస్పీ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఝలక్
సాక్షి,అనంతపురం:తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ నిరాకరించారు. ఐపీఎస్ అధికారి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ ప్రకటించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయానికి జేసీ ప్రభాకర్రెడ్డి వచ్చారు. గంట సేపు వేచి ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎస్పీ జగదీష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్లారు. - 
      
                   
                               
                   
            మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం
● డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా స్పష్టం చేశారు. బుధవారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏడీఆర్ఎం యు.సుధాకర్, సీనియర్ డీసీఎం మనోజ్తో కలిసి ఆయన మాట్లాడారు. దసరా, దీపావళి పండగల తోపాటు నార్త్లో జరుపుకునే పలు పండుగల కారణంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా డివిజన్ వ్యాప్తంగా దాదాపు 66 ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపినట్లు తెలిపారు. ఇందులో గుంతకల్లు డివిజన్ నుంచి 12 ప్రత్యేక రైళ్లు ఉన్నాయన్నారు. తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బంది క్యూర్ కోడ్ జాకెట్లు ధరించి నేరుగా టిక్కెట్లు విక్రయం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైలు బోగీలోని టాయిలెట్స్లో నీరు రాకపోయిన, శుభ్రత లోపించిన, వైద్య పరమైన ఇబ్బందులపై ప్రయాణికులు వార్ రూమ్కు ఫిర్యాదు చేసిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. దాదాపు రూ.400 కోట్ల తిరుపతి రైల్వేస్టేషన్, రూ.50 కోట్లతో రేణిగుంట రైల్వేస్టేషన్ ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. గుంతకల్లులోని ధర్మవరం లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. మున్సిపాలిటీ స్థల సేకరణ పెండింగ్లో ఉందని, ఇందుకు అవసరమైన రూ.1.08 కోట్లను ఈ వారం లోపు మున్సిపాలిటీ ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీఎం శ్రీకాంత్రెడ్డి, ఆర్పీఎఫ్ ఏఎస్సీ అనిల్కుమార్సింగ్ పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            అక్రమ మ్యుటేషన్ సూత్రధారి డీటీ
నకిలీ పత్రాలు సృష్టించి రూ.52 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు పథకం పన్నారు. విషయం కాస్త వెలుగు చూడడంతో పాత్రధారిగా ఉన్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడి చుట్టూ విచారణ ఉచ్చును అధికారులు బిగించారు. దీంతో అసలు కీలక సూత్రధారి వెలుగులోకి వచ్చాడు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ తహసీల్దార్ కీలకంగా వ్యవహరించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణలో స్పష్టమైంది. ఉరవకొండ: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పసులూరి రమేష్బాబు, రాకేష్బాబు, రవికుమార్తో పాటు వారి అక్కాచెల్లెళ్లలకు అదే గ్రామంలోని సర్వే నంబర్లు 133, 165, 164–1లో 13.18 ఎకరాల భూమి వారి తాత, ముత్తాతల కాలం నుంచి సంక్రమించింది. హక్కుదారులు సాగులో సైతం ఉన్నారు. ఓ వ్యక్తి తనకు సంబంధం లేని భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్న ఘటన వజ్రకరూరు మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు అప్రమత్తమై డీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన పుష్పావతి, రవికుమార్, రమేష్బాబు, రాకేష్బాబు తదితరులకు చెందిన భూమిలోని మూడు ఎకరాలకు తాడిపత్రి పరిధిలోని నందలపాడు ప్రాంతానికి చెందిన రుషింగమయ్య అనే వ్యక్తి మ్యుటేషన్ టైటిల్డీడ్ కమ్ పీపీబీ కోసం ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో ఈ నెల 13న వజ్రకరూరు మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేశాడు. ఈ తతంగం గురించి తెలుసుకున్న భూమి యజమానులు వజ్రకరూరుకు చేరుకుని కూపీ లాగారు. తర్వాత అనంతపురంలో డీఆర్ఓను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసిన రుషింగమయ్య, సహకరించిన మీ సేవ నిర్వాహకుడు శ్రీనాథ్గౌడ్పై విచారణ చేపట్టి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు. అలాగే అనంతపురం రూరల్ తహసీల్దార్తో పాటు ఇటుకలపల్లి పీఎస్లోనూ ఫిర్యాదు చేశారు. తీగ లాగారు.. డొంక కదిలింది మ్యుటేషన్కు అక్రమంగా దరఖాస్తు చేసుకున్న వైనంపై ఈ నెల 20న ‘ఫేక్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్కు దరఖాస్తు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలుడింది. దీంతో ఉలిక్కి పడిన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయి విచారణకు సిద్ధమయ్యారు. తమ చేతికి చిక్కిన తీగను లాగుతున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతూ వచ్చింది. నకిలీ పత్రాలతో భూమి కాజేసేందుకు ప్రయత్నించిన ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ తహసీల్దార్ మోహన్కుమార్ విచారణ చేపట్టారు. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో ఉరవకొండ ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ శ్రీసత్యసాయి జిల్లా కదిరికి బదిలీపై వెళ్లిన అధికారి సదరు భూమిపై కన్నేశారు. దీంతో ఆగమేఘాలపై పావులు కదిపారు. తనకు సన్నిహితంగా ఉన్న వజ్రకరూరులోని మీ–సేవ నిర్వాహకుడు శ్రీనాథ్గౌడ్ ద్వారా ఈ నెల 13న సదరు పొలానికి సంబంధించి అసలు యజమాని తాడిపత్రికి చెందిన రుషింగమయ్య అంటూ ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఫ్యామిలీ సరిఫికెట్లు సృష్టించి మీ–సేవ ద్వారా ముట్యేషన్కు దరఖాస్తు చేయించినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో వజ్రకరూరులోని మీ–సేవ నిర్వహకుడు శ్రీనాథ్గౌడ్ను ఆ మండల తహసీల్దార్ నరేష్ విచారణ చేసి మీ–సేవ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. భూమికి సంబంధం లేని వ్యక్తి పేరుతో మ్యుటేషన్కు ఎలా దరఖాస్తు చేశారంటూ శ్రీనాథ్గౌడ్ను అధికారులు ప్రశ్నించగా... కదిరిలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ పేరు బహిర్గతం చేశాడు. నకిలీ పత్రాలతో మ్యుటేషన్కు దరఖాస్తు చేసిన వజ్రకరూరులోని మీ–సేవ కేంద్రం, రుషింగమయ్య పేరుతో మ్యుటేషన్కు దరఖాస్తు చేసిన దృశ్యం అక్రమాలకు తొలి ‘గురు’వు ఉరవకొండ, వజ్రకరూరు మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసి ప్రస్తుతం కదిరిలో పనిచేస్తున్న సదరు అధికారిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బినామీల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి మీ–సేవ నిర్వాహకుడికి వాట్సాప్లో ఆయనే స్వయంగా పంపినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఫోన్లో మీ–సేవ నిర్వాహకుడితో జరిపిన సంభాషణకు సంబంధించి వాయిస్ రికార్డులను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో అనంతపురం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, రూ. కోట్లు విలువ చేసే భూమికి నకిలీ ఎన్ఓసీలు జారీ చేసిన అంశంపై నేటికీ విచారణ కొనసాగుతోంది. తాజాగా నకిలీ పత్రాలతో మ్యుటేషన్కు దరఖాస్తు చేయించి, రూ.52 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు పన్నిన పన్నాగం కాస్త బట్టబయలు కావడంతో అక్రమాలకు తొలి గురువుగా ఉన్న సదరు డీటీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ పత్రాలతో రూ.52 కోట్ల భూమికి ఎసరు మ్యుటేషన్కు దరఖాస్తు చేసి అడ్డంగా దొరికిన వైనం లోతైన విచారణ చేపట్టిన అధికారులు 


