breaking news
Ananthapur
-
దయనీయంగా రైతుల పరిస్థితి
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘అన్నదాత సుఖీభవ’ కింద పెట్టుబడి సాయం రూ.20 వేలను గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. రెండేళ్లకురూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2,94,353 మంది రైతులకు ‘భరోసా’ అందిస్తే కూటమి ప్రభుత్వం 2,75,642 మంది రైతులనే అర్హులుగా తేల్చిందన్నారు. 18,711 మందికి కోత పెట్టడం అన్యాయమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుతమే బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఏటా జూలైలోనే పెద్ద ఎత్తున పరిహారమూ అందజేశామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని రద్దు చేసి బీమా పథకాల లబ్ధి అందని ద్రాక్షగా మార్చారన్నారు. గత ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లోనూ వర్షాలు లేవన్నారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 8.50 లక్షలు ఎకరాలు కాగా 3.26 లక్షలు ఎకరాలు మాత్రమే పంటలు సాగయ్యాయన్నారు. అధిక ధరలకు యూరియా.. యూరియా, డీఏపీని వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని ‘అనంత’ మండిపడ్డారు. కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటూ ఇబ్బంది పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంత వరకు వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించలేదన్నారు. చీనీ రైతుల కష్టాలు.. కూటమి ప్రభుత్వంలో చీనీ రైతులకూ కష్టాలు తప్పడం లేదన్నారు. గతంలో టన్ను రూ.40 వేలు ఉండగా ఇప్పుడు టన్ను రూ.20 వేలకు మించడం లేదన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చీనీ రైతులకు పంటల బీమా ద్వారా పెద్ద ఎత్తున్న పరిహారం అందజేశామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. హెచ్ఎల్సీ, హంద్రీ–నీవా ద్వారా నీటి విడుదల నేపథ్యంలో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించి నీటి కేటాయింపులు చేయాలన్నారు. హెచ్ఎల్సీ ఉత్తర, దక్షిణ కాలువకు నీరు విడుదల చేయాలన్నారు. జిల్లా నుంచి ప్రజలు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏరాసి నారాయణరెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా ఇన్చార్జ్ ఉదయ్కుమార్, రైతు విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిది భాస్కర్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, సంయుక్త కార్యదరిశ పెన్నం శివారెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూలు శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్, గ్రీవెన్స్ సెల్ శింగనమల నియోజకవర్గం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, వైసీపీ నాయకులు చెన్నంపల్లి వెంకటరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి, పురుషోత్తం, శ్రీనివాసులు, సుంకిరెడ్డి, నారాయణస్వామి, కసిరెడ్డి కేశవరెడ్డి, జగదీష్, పాటిల్ తిమ్మారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
రేషన్ బియ్యం కృష్ణార్పణం
ధర్మవరం: మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని సోమందేపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యం మాఫియా డాన్గా అవతార మెత్తాడు. తొలుత పెనుకొండ నియోజకవర్గంతో మొదలు పెట్టి... మెల్లమెల్లగా మూడు జిల్లాలను శాసించే స్థాయికి ఎదిగాడు. ప్రతినెలా ఇతని అక్రమ సంపాదన రూ.కోటికి పైగానే ఉండటం ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. దందా ఇలా.. రేషన్ బియ్యం అక్రమ రవాణాను సదరు మాఫియా డాన్ కొత్త పుంతలు తొక్కించాడు. ఒకేసారి పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచితే అందరికీ తెలిసిపోతుందని భావించి వినూత్నంగా ప్లాన్ చేశాడు. ఒక్కో జిల్లాలో 5 లేదా 6 వరకు స్టాక్ పాయింట్లు పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో రవాణా చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కో నియోజకవర్గంలోని మండలం, పట్టణాలను వేరుచేసి రిటైల్గా కొంత మందికి కిలోపై రూ.3 చొప్పున కమీషన్ చెల్లిస్తూ బియ్యం సేకరించేలా పురమాయించాడు. సేకరించిన బియ్యాన్ని ఆటోలు, టాటా ఏస్ వాహనాల ద్వారా స్టాక్ పాయింట్కు చేరుస్తారు. అక్కడి నుంచి రేషన్ మాఫియా డాన్ రాత్రి వేళ భారీ వాహనాల్లో గంటల వ్యవధిలోనే సరిహద్దులు దాటించి కర్ణాటకకు చేరవేస్తాడు. వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోందిలా.. తొలుత పెనుకొండ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టిన రేషన్ దందాను ఆ తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి సదరు డాన్ విస్తరించాడు. ధర్మవరానికి సమీపంలోని ఎన్ఎస్గేట్, సీకేపల్లి మండలం ప్యాదిండి, నామాల, మేడాపురం వద్ద స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశాడు. ధర్మవరం మండలంలో వివిధ రేషన్ షాపులు, ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఆటోల్లో స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. అలాగే అనంతపురం జిల్లాలోని వివిధ మండలాల్లో సేకరించిన బియ్యాన్ని రాప్తాడు మండలం కందుకూరు కెనాల్కు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన స్టాక్పాయింట్లో నిల్వ చేస్తాడు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని ఐచర్ వాహనాల్లో లోడ్ చేసి కర్ణాటకలోని బంగారు పేటలో ఉన్న మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటాడు. సదరు మిల్లులో లావు బియ్యాన్ని సన్న బియ్యంగా ప్రాసెస్ చేసి అధిక ధరతో మళ్లీ ప్రజలకు విక్రయిస్తుండడం గమనార్హం. మూడు జిల్లాల్లో జోరుగా వ్యాపారం.. శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, అనంతపురం జిల్లా పరిధిలోని ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలతో పాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కూడా బియ్యం అక్రమ వ్యాపారాన్ని సదరు డాన్ విస్తరించినట్లు సమాచారం. ఇటీవల పులివెందులలో పట్టుబడ్డ రేషన్ బియ్యం కూడా సదరు డాన్వే అయినా బినామీలను చూపి బయటపడినట్లు తెలుస్తోంది. అనతికాలంలోనే భారీగా అక్రమార్జన.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రేషన్బియ్యం అక్రమ వ్యాపారంలో భారీగా అక్రమార్జన చేసినట్లు సమాచారం. ఆంధ్రాలో పేదల బియ్యాన్ని రిటైలర్ల దగ్గర రూ.18 చొప్పున కొని కర్ణాటకలో రూ.27 లెక్కన అమ్ముకుంటున్నారు. వందలాది వాహనాలలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ప్రతినెలా రూ.కోటికిపైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ఒత్తిళ్లు.. కొందరు నిజాయితీ గల పోలీస్ అధికారులు రేషన్ బియ్యం వాహనాలను పట్టుకుంటే... వెంటనే జిల్లాలోని ఓ పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధితో పాటు బీజేపీకి చెందిన జిల్లా నాయకుడు రంగ ప్రవేశం చేసి కేసులు కట్టకూడదని ఒత్తిడి తీసుకెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా ధర్మవరం మండలం సీతారాం పల్లి వద్ద సదరు రేషన్ మాఫియా డాన్కు చెందిన ఓ ఐచర్ వాహనాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు కట్టకూడదని పోలీసులపై సదరు నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. వాహనంలో ఉన్నవి రేషన్ బియ్యం కాదని మీడియాకు చెప్పాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీంతో తెల్లవారుజామున పట్టుకున్న బియ్యం వివరాలను సాయంత్రమైనా పోలీస్, రెవెన్యూ అధికారులు వెల్లడించక పోవడం గమనార్హం. పేదల బియ్యం.. పెద్దల భోజ్యం ‘పుష్ప’ సినిమాను తలపించేలా రేషన్ బియ్యం స్మగ్లింగ్ మూడు జిల్లాలను శాసిస్తున్న సోమందేపల్లి ‘డాన్’ అక్రమ దందాతో రూ.కోట్లు గడిస్తున్న వైనం అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యం పట్టించుకోని అధికార గణంఅధికారులకు మామూళ్లు.. మూడు జిల్లాల రేషన్ బియ్యం వాహనాలు ధర్మవరం, సీకేపల్లి, సోమందేపల్లి, కియా పోలీస్స్టేషన్, కొడికొండ చెక్పోస్టు మీదుగా వెళ్తుంటాయి. ఈ మార్గంలోని పోలీస్స్టేషన్లకు రేషన్ మాఫియా డాన్ ప్రతి స్టేషన్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మామూళ్లు ముట్ట చెప్పుతుండడం విశేషం. ఒకవేళ సదరు స్టేషన్లలో పోలీస్ ఉన్నతాఽధికారులు లంచం తీసుకునేందుకు నిరాకరిస్తే కిందిస్థాయి సిబ్బందితోనే పని చక్కబెడుతుంటాడు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన విజిలెన్స్ అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. రూ.1.80 లక్షల చొప్పున విజిలెన్స్ అఽధికారుల్లో కొందరికి మామూళ్లు అందుతుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. పుష్ప సినిమాలో గంధపు చెక్కల స్మగ్లింగ్ను తలదన్నేలా రేషన్ బియ్యం అక్రమ దందా ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. సోమందేపల్లికి చెందిన ఓ రేషన్ మాఫియా డాన్ ఏకంగా మూడు జిల్లాల్లో తన అక్రమ వ్యాపారాన్ని విస్తరించాడు. రాజకీయ నాయకులతో పాటు అధికారులకూ భారీగా ముడుపులు ముట్టజెబుతూ రూ.కోట్లు గడిస్తున్నాడు. అతని దందా విస్తృతి చూసి ‘రామ’రామ.. ‘కృష్ణ’ కృష్ణ అంటూ అధికారులే నివ్వెరపోతున్నారు. -
విద్యుత్ చార్జీలు తగ్గించాలి
కూడేరు: విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. సర్ధుబాటు చార్జీల పేరిట ఏకంగా రూ.15485 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడం దారుణమన్నారు. సోమవారం కూడేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కంలో లోటును భర్తీ చేయడానికి ట్రూ ఆప్ చార్జీల పేరిట రూ.12771 కోట్ల అదనపు భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని మండిపడ్డారు. ఈ ఆలోచనకు స్వస్తి చెప్పడంతో పాటు ఇప్పటికే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేలు ఇస్తామంటూ ప్రకటించి.. తాజాగా పీఎం కిషాన్తో కలిపి విడుతల వారీగా ఇస్తామని ప్రకటించడం కుట్రలో భాగంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపి, తొలుత కాలువ వెడల్పు పనులు పూర్తి చేయాలని, పిల్ల కాలువలు ఏర్పాటు చేసి ఆయకట్టుకు నీరందించాలన్నారు కోరారు. సమస్యలపై ఈ నెల 12,13 తేదీల్లో జరిగే సీపీఐ జిల్లా మహా సభల్లో చర్చించి, ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేశవ రెడ్డి, మండల కార్యదర్శి నాగేంద్ర, నేతలు మల్లికార్జున, పెరుగు సంగప్ప, రమణ, మలరాయుడు, వెంకటేష్, శ్రీరాములు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మూడు పదుల వయసు పైబడినా పెళ్లి కాలేదన్న వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని మల్లాపురం ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న పరమేశ్వరప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తల్లి, ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి ముగ్గురు అన్నదమ్ములూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమారుడు వెంకటేశులకు వివాహమైంది. రెండో కుమారుడు జగదీష్ (33)కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదేమోనంటూ జగదీష్ తరచూ బంధువులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పాము కాటుతో వృద్ధుడి మృతి రాయదుర్గం టౌన్: పాము కాటుకు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న ఎరికల కుమారస్వామి (66) ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని సీబీఎన్ కాలనీలో ఉన్న తన ఇంటి వద్ద కూర్చొని ఉండగా చేతికి పాము కాటు వేసింది. నాటు వైద్యంతో నయం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి బంధువులు తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు అర్ధరాత్రి ఆయన మృతిచెందాడు. కాగా, కుమారస్వామికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్తంభించిన తపాలా సేవలు అనంతపురం సిటీ: తపాలా శాఖలో మరింత పారదర్శకతతో పాటు వేగవంతమైన సేవలందించే క్రమంలో కేంద్ర తపాలా శాఖ గత నెలలో 2.0 కొత్త సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం మూడు రోజుల పాటు తపాలా సేవలను బంద్ చేశారు. ఆ తర్వాత సర్వర్ మొరాయింపుతో అరకొర సేవలు కొనసాగుతూ వచ్చాయి. ఈ సమస్యను అధిగమించడం సాధ్యం కాకపోవడంతో సోమవారం ఒక్కసారిగా సర్వర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రెండు హెడ్ పోస్టాఫీసులతో పాటు 64 సబ్ పోస్టాఫీసులు, 407 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో తపాలా సేవలు స్తంభించాయి. అనంతపురం, గుంతకల్లు హెడ్ పోస్టాఫీసుల్లోని వివిధ రకాల కౌంటర్లు మూతపడ్డాయి. వచ్చిన జనం వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు. దూరభారం నుంచి వచ్చిన వారు సాయంత్రం వరకు వేచి చూశారు. -
సమస్య పరిష్కరించాలంటూ గొడవ
అనంతపురం అర్బన్: తనకు మంజూరైన టిడ్కో ఇంటిని వేరొకరికి ఇచ్చారని, దీనిపై వందలసార్లు అర్జీ ఇచ్చినా సమస్యకు పరిష్కారం చూపలేదంటూ ఇన్చార్జి కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోలతో అనంతపురంలోని కోవూరు నగర్లో నివాసముంటున్న రఘు గొడవపడ్డాడు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను ఏ కారణం చేత అనర్హుడిగా ముద్ర వేశారంటూ నిలదీశాడు. ఇల్లు ఇవ్వరు... అందుకు కారణం చెప్పరంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. అధికారులు నచ్చచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని బలవంతంగా ఆయనను బయటకు పంపాల్సి వచ్చింది. బయటకు వచ్చిన అనంతరం రఘు మాట్లాడుతూ.. 2018లో తనకు టిడ్కో కింద ఇల్లు మంజూరైందన్నారు. అటు తరువాత తన పేరున ఉన్న ఇంటిని వేరొకరికి ఇచ్చారని వాపోయాడు. ఇదేమని అడిగితే నిన్ను ఇనెలిజిబుల్ (అనర్హునిగా) చేశారని చెబుతారే తప్ప కారణం చెప్పడం లేదన్నారు. తనకు మంజూరైన ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఇన్చార్జి కలెక్టర్ శివ్నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, రామ్మోహన్, మల్లికార్జునుడు, వ్యసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 463 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. తల్లిపాలు శ్రేష్టం తల్లి పాలు బిడ్డకు అత్యంత శ్రేష్టమనే విషయంపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు–2025 పోస్టర్లను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ వరకూ తల్లిపాల ఆవశ్యక్తపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఐసీడీఎస్ పీడీ నాగమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై ర్యాలీ.. ప్రతి నెల 5న సచివాలయాల పరిధిలో వాట్సాప్ గవర్నెన్స్పై ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. వాట్సాప్స్ గవర్నెన్స్ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఆయన విడుదల చేశారు. ఉన్నతాధికారిని నిలదీసిన సామాన్యుడు పరిష్కార వేదికలో 463 వినతులు అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి : ఇన్చార్జ్ కలెక్టర్ -
ఎరువులు.. పడరాని పాట్లు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటల సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నా... ఎరువుల సమస్య నెలకొనడం గమనార్హం. ప్రధానంగా యూరియా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. వరి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం తదితర పంటల కోసం రైతులు ఎగబడుతున్నా బస్తా యూరియా కూడా లభించే పరిస్థితి లేదంటున్నారు. వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులు మాత్రం తగినంత నిల్వ ఉన్నట్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సమస్య లేకున్నా యూరియా నిల్వలు మాత్రం పూర్తిగా ఖాళీ అయినట్లు రీటైల్, హోల్సేల్ డీలర్లు వాపోతున్నారు. పొటాష్ కూడా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా యూరియా సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. కొన్ని కంపెనీల నుంచి కోటా మేరకు ఎరువుల సరఫరా సక్రమంగా కావడం లేదని చెబుతున్నారు. అప్పట్లో ఎన్నడూ ఇలా లేదు.. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జిల్లా అంతటా మంచి వర్షాలతో పంటల సాగు అధికంగా ఉన్నా ఎన్నడూ ఎరువుల సమస్య ఉత్పన్నం కాలేదు. నెలవారీ కోటా మేరకు ఎరువులు సరఫరా కావడం, ఆర్బీకేలు, డీసీఎంఎస్, పీఏసీఎస్ లాంటి సొసైటీల్లో కూడా పెద్ద ఎత్తున నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. కానీ కూటమి సర్కారు వచ్చాక ఎరువుల కోటా నామమాత్రం చేయడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. అధిక ధరలు.. ఖరీఫ్లో జిల్లాకు 1.08 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు కేటాయించారు. అందులో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 19 వేల మెట్రిక్ టన్నులు డీఏపీ, 4,700 మెట్రిక్ టన్నులు ఎంఓపీ, 4 వేల మెట్రిక్ టన్నులు ఎస్ఎస్పీ కాగా అత్యధికంగా 53 వేల మెట్రిక్ టన్నులు వివిధ కాంప్లెక్స్ ఎరువులు కేటాయించారు. కాంప్లెక్స్ ఎరువులు తగినంత సరఫరా అవుతున్నా యూరియా సరఫరా మందకొడిగా ఉంది. ఆరు మండలాల రైతులను ఆదుకుంటున్న స్థానిక డీసీఎంఎస్లో నాలుగు రోజులుగా యూరియా బంద్ కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో అక్కడక్కడా యూరియా ఎంఆర్పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం. యూరియా కోసం బారులు బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలోని సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.సోమవారం ఉదయమే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. చంటి బిడ్డలున్న మహిళలు కూడా క్యూలో నిల్చోవ డాన్ని బట్టి క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకోవచ్చు. -
జల్లెడ పడుతున్నా జాడ లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం పట్టణంలోని ఎస్బీఐలో జరిగిన భారీ దోపిడీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 11 కేజీలకు పైగా బంగారం (రూ.11 కోట్ల విలువ), రూ.30 లక్షల నగదు దోచుకుని వెళ్లి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ కనీసం చిన్న ఆధారాన్ని కూడా సేకరించలేక పోయారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పాటు అనంతపురం నుంచి మూడు బృందాల పోలీసులు, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మూడు బృందాలు నాలుగు రోజులుగా జల్లెడ పడుతున్నా ఎక్కడా జాడ కూడా తెలియలేదు. ఆనవాళ్లు దొరక్కుండా.. ఎంత తెలివైన దొంగలైనా ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేసి దొరికిపోతుంటారు. ఫింగర్ ప్రింట్స్ లోనో, సెల్ఫోన్ లొకేషన్ వల్లో చిక్కేస్తుంటారు. కానీ హిందూపురం ఎస్బీఐ దోపిడీ ఘటనలో దొంగలు అత్యంత జాగ్రత్త పడ్డారు. నేరస్తుడు ఎలక్ట్రికల్ పనిలో నిష్ణాతుడైనట్లు తెలుస్తోంది. ఫేజ్, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ కనెక్షన్ ఇలా అన్ని వైర్లనూ చాలా జాగ్రత్తగా కట్ చేశారు. సీసీ కెమెరా కనెక్షన్ మొదట్లోనే తొలగించారు. వెంట తెచ్చుకున్న మినీ గ్యాస్ సిలిండర్ నుంచి కట్టర్ను ఉపయోగించి కిటీకీ ఇనుప చువ్వలు కత్తిరించారు. ముఖానికి మాస్కు, కాళ్లకు సాక్సు, చేతులకు గ్లౌజులు వేసుకుని అత్యంత పకడ్బందీగా లాకర్లను కట్ చేసి 11 కేజీలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. ఎక్కడా వేలిముద్రలు, పాదముద్రలు పడకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. దోపిడీకి ఇద్దరు దొంగలు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు బ్యాంకు ఆవరణలో వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలలోగా దోపిడీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘోరంగా విఫలం.. బ్యాంకు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు వారం రోజులుగా పోలీసులు జల్లెడ పడుతున్నా ఎక్కడా ఆచూకీ లేదు. ప్రధానంగా సెల్ ఫోన్ వాడటం లేదని తెలిసింది. దొంగలు ఇతర రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరు, నెల్లూరు, హైదరాబాద్తో పాటు అనుమానం వచ్చిన చోటల్లా గాలిస్తున్నా జాడ దొరకలేదు. పుట్టపర్తి పోలీసులకు ఈ విషయం పెద్ద సవాలుగా మారింది. ఇదే కాదు చాలాచోట్ల దొంగతనాలు జరుగుతున్నా దొంగలను పట్టుకోవడంలో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలూ ఉన్నాయి. జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని, రికవరీలు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుతో సామాన్య ప్రజలకు మాత్రం ఆవేదనే మిగులుతోంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టినా దొంగిలిస్తుంటే ఏం చేయాలంటూ ఖాతాదారులు వాపోతున్నారు. హిందూపురం బ్యాంకు దోపిడీ కేసులో కనిపించని పురోగతి మూడు బృందాలు గాలిస్తున్నా చిన్న క్లూ కూడా దొరకని వైనం చోరీల కట్టడిలో శ్రీసత్యసాయి పోలీసులు విఫలమయ్యారని విమర్శలు -
ఈ సెల్ఫోన్లు మాకొద్దు
● జిల్లా వ్యాప్తంగా సీడీపీఓలకు తిరిగిచ్చేసిన అంగన్వాడీలు అనంతపురం సెంట్రల్/రాప్తాడు రూరల్: ‘ఈ సెల్ఫోన్లు మాకొద్దు బాబోయ్’ అంటూ అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు సీడీపీఓలకు సెల్ఫోన్లు తిరిగిచ్చేశారు. జిల్లాలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ప్రతి కేంద్రానికీ స్మార్ట్ఫోన్ అందించారు. చిన్నారులు, గర్భిణుల హాజరుతోపాటు వారికి అందిస్తున్న పౌష్టికాహారం, ఇతరత్రా కార్యక్రమాల వివరాలను వీటి ద్వారానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్ఫోన్లు సరిగా పనిచేయడం లేదని అంగన్ వాడీలు ఫిర్యాదులు చేస్తున్నా స్పందన కరువైంది. ఇటీవల పని ఒత్తిడి మరింత ఎక్కువ కావడంతో తాము ఇక భరించలేమంటూ అంగన్వాడీ కార్యకర్తలు సెల్ఫోన్లను తిరిగిచ్చేశారు. అనంతపురం అర్బన్ మినహా జిల్లాలో అన్ని ప్రాజెక్టుల్లో సోమవారం అధికారులకు అప్పగించారు. అయితే సెల్ఫోన్లు తీసుకోవడానికి కొందరు సీడీపీఓలు, అధికారులు నిరాకరించగా.. అంగన్వాడీ సిబ్బంది మాత్రం సెల్ఫోన్లు మాకొద్దు అంటూ స్పష్టం చేశారు. పని చేయలేకపోతున్నాం ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు సరిగా పనిచేయడం లేదు. ఒక్కో పనికి గంటల పాటు సమయం పడుతుండడంతో అంగన్వాడీ వర్కర్లు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రాష్ట్రంలో ఐదారుగురు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. కొత్త ఫోన్లు ఇచ్చే వరకూ ఆన్లైన్ చేయం అని స్పష్టంగా తెలియజేసి వెనక్కు ఇచ్చాం. – రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ త్వరలో కొత్త ఫోన్లు మంజూరు సెల్ఫోన్లు మొరాయిస్తున్నాయని గతంలోనే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈనెలాఖరులోగా కొత్త సెల్ఫోన్లు వస్తాయని తెలుస్తోంది. అంతవరకూ ఆన్లైన్ ద్వారా సేవలందించాలని అంగన్వాడీ వర్కర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – నాగమణి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
మానిటరింగ్ టీమ్కు సహకరించండి
● అధికారులకు ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పరిశీలనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ జాతీయస్థాయి మానిటరింగ్ కమిటీ ఈనెల 13 వరకు జిల్లాలో పర్యటించనుంది. కమిటీకి సమగ్ర వివరాలు, సమాచారం ఇవ్వడంతో పాటు సంపూర్ణ సహకారం అందించాలి’ అని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయస్థాయి మానిటరింగ్ బృందం రీసెర్చ్ అధికారి సాంబశివరావు, అసిస్టెంట్ రీసెర్చ్ అధికారి సబృతి నవ్యతో కలిసి ఇన్చార్జ్ కలెక్టర్ సోమవారం రెవెన్యూ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో మాట్లాడి విజయగాథలను బృంద సభ్యులకు తెలియజేయాలన్నారు. బృందానికి క్షేత్రస్థాయిలో అధికారులు, మండల, గ్రామ సిబ్బంది సంపూర్ణ సహకారం అందించాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆస్వాస్ యోజన, జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సరోవరం పథకం తదితర పథకాల అమలును పరిశీలిస్తారన్నారు. గమనించిన అంశాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. సమావేశంలో డ్వామా పీడీ సలీంబాషా, జెడ్పీ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజునాయుడు, హౌసింగ్ పీడీ శైలజ, డీఆర్డీఏ ఏపీడీలు గంగాధర్, సత్యనారాయణ, సర్వే ఏడీ రూప్లానాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఈ పోస్టు... చాలా ‘రేటు’!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది అనంతపురం నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషనే. గొలుసు దొంగలు, మట్కారాయుళ్లు, రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్, భూ కబ్జాలు ఇలా ఒకటేమిటి నిత్యం బాధితులతో ఈ స్టేషన్ కిటకిటలాడుతుంటుంది. అలాంటి స్టేషన్కు నెలన్నర రోజులుగా సీఐని నియమించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో బాధితులు స్టేషన్కు వస్తుంటారు.. వారి సమస్యలు పరిష్కరించాలనే కనీస ఆలోచన కూడా లేకుండా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుండడం గమనార్హం. రాయ‘బేరాలు’... వన్టౌన్ సీఐ పోస్టుకు టీడీపీ నేతలు బేరం పెట్టినట్లు తెలిసింది. రూ.15 లక్షల వరకూ పలుకుతోందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.డబ్బు ఇవ్వకుంటే పోస్టింగ్ ఇచ్చేది లేదంటూ అధికార పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారని, బేరం కుదరకపోవడంతోనే నెలన్నర రోజులుగా సీఐని నియమించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సీఐలు అంత డబ్బు చెల్లించలేక వన్టౌన్కు రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బు చెల్లించేదెవరు.. పోస్టింగ్ తెచ్చుకునేదెవరన్న విషయంపై పోలీసు వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు కూడా ఎటూ తేల్చని దుస్థితి నెలకొనడం గమనార్హం. రాజేంద్ర యాదవ్ సస్పెన్షన్ తర్వాత.. నెలన్నర క్రితం తన్మయి అనే ఇంటర్ విద్యార్థిని హత్య జరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వన్టౌన్ స్టేషన్కు సీఐ లేరు. రాజేంద్రనాథ్యాదవ్ కూడా అప్పట్లో టీడీపీ నాయకుల ద్వారానే ఈ స్టేషన్కు వచ్చారు. టూటౌన్ సీఐకి ఇన్చార్జ్ ఇచ్చినా.. రాజేంద్రనాథ్ సస్పెన్షన్ తర్వాత టూటౌన్ సీఐ శ్రీకాంత్కు వన్టౌన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ రెండు స్టేషన్లు చూడటం ఆయన వల్ల కావడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం వన్టౌన్ ఎస్ఐగా ఉన్న వ్యక్తి బాధితుల సమస్యలు పరిష్కరించడం కన్నా భూముల పంచాయితీలు ఎక్కువగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనంత వన్టౌన్ సీఐ పోస్టుకు టీడీపీ నేతల బేరం! పోలీసు ఉన్నతాధికారుల మౌనంపై సర్వత్రా చర్చ -
డయేరియా వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టండి : డీఎంహెచ్ఓ
శింగనమల: గ్రామాల్లో డయేరియా వ్యాప్తి చెందకుడా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి ఆదేశించారు. శింగనమల సీహెచ్సీలో డయేరియాతో చికిత్స పొందుతున్న పెద్దమట్లగొంది గ్రామానికి చెందిన 14 మందిని సోమవారం ఆమె ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాంతులు, విరేచనాలకు గల కారాణాలపై ఆరా తీశారు. అనంతరం పెద్దమట్లగొంది గ్రామాన్ని సందర్శించి, అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఆమె వెంట తరిమెల పీహెచ్సీ వైద్యులు డాక్టర్.శంకర్ నాయక్, వైద్య సిబ్బంది ఉన్నారు. మట్కా బీటర్ల అరెస్ట్ అనంతపురం: నగరంలోని సాయి నగర్ రెండో క్రాస్ చివరన మట్కా ఆర్గనైజర్తో పాటు 8 మంది బీటర్లను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. వివరాలను సోమవారం రాత్రి ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని సంగమేశ్వర నగర్కు చెందిన తుమ్మల సరస్వతి, చంద్రబాబు కొట్టాల వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న నివాసమున్న షేక్ రసూల్, పాతూరు మున్నా నగర్కు చెందిన బండారి వన్నూరప్ప, అంబేడ్కర్ నగర్కు చెందిన మన్నల రామకృష్ణ, అనంతపురం రూరల్ మండలం కృష్టమరెడ్డిపల్లి నివాసి వడ్డే దస్తగిరి, ఉప్పరపల్లికి చెందిన అక్కెం రామాంజినేయులు, బోయ శ్రీరాములు, ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన పోతులయ్య అలియాస్ పోతన్న ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు, మట్కా పట్టీలు, బాల్ పెన్నులను స్వాధీనం చేసుకున్నారు. వైభవంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగ మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభునికి సోమవారం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో అర్చకులు సంతోష్ స్వామి, మంజునాథ్ స్వామి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేశారు. హోమాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లారీల ఢీ – ఒకరి మృతి విడపనకల్లు: మండలంలోని గడేకల్లు వద్ద 67వ జాతీయ రహదారిపై సోమవారం రెండు లారీలు ఢీ కొన్నాయి. ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. లారీలు రెండూ పరస్పరం ఢీకొనడంతో క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. క్యాబిన్లో ఇరుక్కున్న హర్యానాకు చెందిన డ్రైవర్ జితేంద్రకుమార్ (35)ను స్థానికులు అతి కష్టంపై వెలికి తీసి వెనువెంటనే బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ను ఢీ కొన్న టిప్పర్ పెద్దవడుగూరు: స్థానిక సాయిబాబా ఆలయంలో సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొంది. ఘటనలో చిట్టూరు గ్రామానికి చెందిన యువకులు తరుణ్, మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో భారీ వాహనం కిందకు బైక్ పడింది. బైక్పై ఉన్న ఇద్దరూ పక్కన పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
యాడికి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం రాయచెరువులోని ఉప్పర వీధిలో నివాసముంటున్న శ్యామలమ్మ కుమారుడు భరత్కుమార్ (39) ట్రాన్స్ పోర్టు లావాదేవీలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నష్టం రావడంతో తన సొంత లారీలను అమ్మేసి ఓ లారీ డ్రైవర్గా జీవనం మొదలు పెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటిని కూడా అమ్మేశాడు. దీంతో దిక్కుతోచని శ్యామలమ్మ కర్నూలులోని తన చెల్లెలు కుమార్తె ప్రభావతి ఇంటికి చేరుకుంది. ఆదివారం రాత్రి రాయలచెరువులోని హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గాలి మిషన్ వద్ద నిద్రించిన భరత్కుమార్.. సోమవారం వేకువజాము 1 గంట సమయంలో నిద్ర లేచి రోడ్డు దాటుతుండగా తాడిపత్రి నుంచి గుత్తి వైపు వెళుతున్న వాహనం ఢీకొంది. తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ ఈరన్న అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే భరత్కుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి శ్యామలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బొమ్మనహాళ్: కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ జమాల్బాషా తెలిపిన మేరకు.. అందిన సమాచారం మేరకు సోమవారం బొమ్మనహాళ్ మండలం శ్రీరంగాపురం క్యాంపు వద్ద విజిలెన్స్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో వాహనంలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి స్ధానిక పీఎస్కు తరలించారు. ఆర్ఐ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్ నాగరాజు, బియ్యం వ్యాపారి రామకృష్ణ, బొలేరో వాహన యజమాని వీరభద్రస్వామిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కాగా, పట్టుబడిన రేషన్ బియ్యాన్ని బొమ్మనహాళ్, విడపనకల్లు మండలాల్లో పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. ప్రభుత్వంతో జేఎన్టీయూ అవగాహన ఒప్పందం అనంతపురం: పరిశ్రమల్లో రక్షణాత్మక విధానాలపై అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో జేఎన్టీయూ(ఏ) ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ కృష్ణయ్య పరస్పరం మార్చకున్నారు. ఈ ఒప్పందం మేరకు పరిశ్రమల్లో కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించుకోవాలనే అంశంపై జేఎన్టీయూలోని ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెకానికల్ అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అలాగే పరిశ్రమల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. కార్యక్రమంలో జేఎన్టీయూ(ఏ) డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, కార్మికశాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు, తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’ను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. రైతులను మరోసారి ఈ రక్కసి కబళించే దుస్థితి దాపురించింది. గతేడాది అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో భారీ నష్టాలు చవిచూసిన జిల్లా రైతులు.. ఈ ఏడాది కూడా అంతకు మించి నష్టాలు మూటగట్టుకునే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ‘చంద్
దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్న రైతు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాను ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించినా ఏ మాత్రమూ ప్రభావం చూపడం లేదు. ‘నైరుతి’ ప్రవేశానికి ముందు ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురిశాయి. ఏప్రిల్లో 12.1 మి.మీ గానూ నాలుగింతలు అధికంగా 56.3 మి.మీ, మేలో 36.7 మి.మీ గానూ ఏకంగా 101.3 మి.మీ వర్షపాతం నమోదైంది. తీరా జూన్లో ఖరీఫ్ మొదలయ్యేనాటికి వరుణుడు ముఖం చాటేశాడు. జూన్ 8, 12 తేదీల్లో మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదైంది. జూన్ ముగిసేనాటికి 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ వర్షం పడింది. పంటలు విత్తుకునేందుకు కీలకమైన జూలైలో వాన కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించలేదు. జూలైలో 64.3 మి.మీ గానూ 46.4 శాతం తక్కువగా కేవలం 34.7 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద 131.1 మి.మీ గానూ ప్రస్తుతానికి 37 శాతం లోటు వర్షపాతంతో 82.7 మి.మీ నమోదైంది. ఒక మండలంలో మాత్రమే సాధారణం కన్నా అధిక వర్షం కురిసింది. 7 మండలాల్లో సాధారణం నమోదు కాగా మిగతా 24 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సీజన్ మొదట్లోనే సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదు కావడం కరువు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అడపాదడపా కురిసిన వర్షాలకే విధి లేని పరిస్థితుల్లో రైతులు పంటలు వేశారు. అలా సాగు చేసిన పంటలు ప్రస్తుతం ఎండుముఖం పడుతున్నాయి. ఈ ఖరీఫ్లో 3.42 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ జూన్ 15 నుంచి నైరుతి నిరాశపర్చడంతో ప్రధాన పంటలు విత్తుకునే సమయం ముగిసేనాటికి అంటే జూలై ఆఖరుకు 40 శాతం విస్తీర్ణంతో 1.35 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చాయి. ఇంకా 60 శాతం భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇక.. మిగిలిన సుమారు 2 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం కష్టమని రైతులు వాపోతున్నారు. గత నాలుగు దశాబ్దాల జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధానపంట వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 47 వేల హెక్టార్లకు పరిమిత మైంది. మరో ప్రధానపంట కంది 49 వేల హెక్టార్లు, 44 వేల హెక్టార్లకు గానూ పత్తి 14 వేల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. ఆముదం 17 వేల హెక్టార్లకు గానూ 6,300 హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల హెక్టార్లకు గానూ 10,500 హెక్టార్లు, సజ్జ 2,500 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 500 హెక్టార్లు, కొర్ర 200 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. పెద్దవడుగూరు మండలంలో 66 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం పత్తి సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. నెలల తరబడి వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి, ఆముదం తదితర పంటలు చాలా ప్రాంతాల్లో వాడుముఖం పట్టగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి వారం పది రోజులు కొనసాగితే మునుపెన్నడూ లేని విధంగా కరువు కాటు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు పాలనలో వరుస కరువులు విలయతాండవం చేశాయి. అప్పట్లో ఒక్కోసారి అకాల వర్షాలు, మరోసారి అసలు వర్షాలే కురవకుండా పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రక్కసి కోరల్లోకి అన్నదాతలు సీజన్ ముగిసినా 40 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు వర్షాలు లేక ఆ పంటలూ ఎండుముఖం ‘చంద్రబాబు–కరువు కవలలు’ అంశంపై మళ్లీ చర్చ ఎండుతున్న పంటలు.. సర్వత్రా చర్చనీయాంశం.. -
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని సీతారాంపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ధర్మవరం రూరల్ పోలీసులు 170.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందడంతో ధర్మవరం రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు, సీఎస్డీటీ కేశవనాయుడు, వీఆర్ఓ, పోలీస్ సిబ్బంది సోమవారం ఉదయం సీతారాంపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనంతపురం వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఐచర్ను నిలిపి తనిఖీ చేశారు. అందులో 341 బ్యాగుల (170.50 క్వింటాళ్లు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనాన్ని స్టేషన్కు తరలించారు. ఐచర్ వాహన డ్రైవర్, బుక్కపట్నం మండలానికి చెందిన గుజ్జల సతీష్ని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే సోమందేపల్లికి చెందిన నరేష్, చెన్నేకొత్తపల్లికి చెందిన సద్దాం ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. -
5న సర్పంచుల ‘చలో విజయవాడ’
గుంతకల్లు రూరల్: ఏడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్రెడ్డి డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు చెల్లించకుండా కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 5న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంతకల్లు మండలంలోని తన సొంత పంచాయతీ ఓబుళాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు నెలల క్రితం గ్రామ పంచాయతీలకు గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1121 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టడంతో పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గడిచిన వేసవిలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడితే, ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కార్మికుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగన్ సర్కార్ గ్రామ పంచాయతీలను, స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు మాట్లాడటం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరు చేస్తుందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు గౌరవ వేతనాన్ని పెంచాలని, ఉపాధి పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో పనులు నిర్వహించాలని, ఎన్నికల హామీల్లో భాగంగా ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి పంచాయతీలకు నిధులను కేటాయించాలని, పంచాయతీలకు అందాల్సిన సర్ చార్జీలను నిరంతరం విడుదల చేయాలనే డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి సర్పంచులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్రెడ్డి -
విద్యార్థుల గొంతు నొక్కేందుకే జీఓ
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల్లో సమస్యలు వెలుగులోకి రాకుండా విద్యార్థుల గొంతు నొక్కేలా కూటమి ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. పాఠశాల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రవేశించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను నగరంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరాయుడు, కుళ్లాయిస్వామి మాట్లాడారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు వెలుగులోకి వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భయంతో కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థి హక్కులపై దాడిగా భావించాల్సి వస్తున్న ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మంజునాథ్, నాని, సమీర్, తరుణకార్తీక్, యశ్వంత్, అక్బర్, సురేష్, ఉమేష్, భీమేష్ పాల్గొన్నారు. విద్యను నిర్వీర్యం చేసేందుకే లోకేష్కు మంత్రి పదవి : ఏఐవీబీ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికే నారా లోకేష్కు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టారని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐవీబీ) జిల్లా ప్రధానకార్యదర్శి పృథ్వీ ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు తప్ప ఇతరులెవరూ పాఠశాలల్లోకి వెళ్లకుండా నిషేధించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. విలీనం పేరుతో అనేక ప్రాథమిక పాఠశాలలను అన్యాయంగా మూసేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను జైళ్లల్లా మార్చడమే మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసంబంద్ధ జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఇంతియాజ్, నరేంద్ర పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తర్వుల దగ్ధం -
‘సమగ్ర’ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లకు (పీటీఐ) ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ పీటీఐల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కృష్ణకళామందిరంలో పీటీఐల ఉమ్మడి జిల్లా అసోసియేషన్ మహాసభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు శివకుమారి మాట్లాడుతూజజ 13 ఏళ్లుగా రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న పీటీఐలు ఇప్పటి వరకూ కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్, ప్రధానకార్యదర్శి పీఎస్ ఖాన్, మహిళా విభాగం చైర్పర్సన్ సురేఖరావు, పీటీఐల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీదేవి, ప్రభాకర్, విజయకుమారి, సౌజన్య, రాజేంద్ర పాల్గొన్నారు. మహిళ దారుణ హత్య పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన అంజప్పకు మడకశిర మండలం చందకచెర్లు గ్రామానికి చెందిన సన్నక్క (50)తో వివాహమైంది. అయితే ఇటీవల దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో సన్నక్క భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఏమైందో తెలియదు కానీ శనివారం రాత్రి పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీ బిందూనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వెనుక మైదానంలో హత్యకు గురైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భర్త అంజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వ్యక్తి దుర్మరణం
రాయదుర్గం టౌన్: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామానికి చెందిన బసవరాజు (32)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ మొబైల్ కంపెనీలో కేబుల్ నెట్వర్క్ ఇంజినీర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రాయదుర్గం మండలం గుండ్లపల్లి వద్ద జరుగుతున్న కేబుల్ పనులను ఆదివారం పర్యవేక్షించిన బసవరాజు... మధ్యాహ్నం డ్రైవర్ కమల్తో కలసి డీ–మ్యాక్స్ వాహనంలో భోజనానికని ఆవులదట్ట గ్రామానికి బయలుదేరారు. కాశీపురం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వేగంగా దూసుకెళ్లడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొని పల్లంలోకి బోల్తాపడింది. ఘటనలో బసవరాజు వాహనంలోనే ఇరుక్కొని మృతి చెందాడు. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. యువకుడి బలవన్మరణం నార్పల: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. నార్పలలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా నివాసముంటున్న ఆదినారాయణ, బాలవీరమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఇటీవల కుమారుడు హర్ష (27)కు వివాహం నిశ్చయమమైంది. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా మనోవేదనకు లోనైన హర్ష.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఎంత సేపటకీ హర్ష తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. బంగారు గొలుసు అపహరణ గుంతకల్లు టౌన్: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కాలనీలోని మసీదు పక్కన వన్నూర్రెడ్డి, రమాదేవి దంపతులు కిరాణా కొట్టు (రెడ్డి షాపు) ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కొట్టులో రమాదేవి కూర్చొని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు కొట్టు దగ్గరికెళ్లి సిగరెట్లు కావాలని అడిగాడు. ఆ సమయంలో సిగరెట్ ప్యాకెట్ తీసుకునేందుకు రమాదేవి అటు తిరగగానే వెనుక నుంచి ఆమె మెడలోని 3 తులాల బరువున్న బంగారు గొలుసును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్ పై ఎక్కి ఉడాయించాడు. రమాదేవి గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ మనోహర్, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నాన్నా అంటూ పరుగెత్తుకెళ్లి.. ● వాహనం కిందపడి చిన్నారి మృతి యాడికి: మండలంలోని లక్షుంపల్లి గ్రామంలో ఆదివారం మద్యాహ్నం వాహనం కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాలు.. లక్షుంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం తాను సాగుచేసిన టమాట పంటను తొలగించి వాహనంలో వేసుకుని మధ్యాహ్నం ఇంటి వద్దకు చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం పంటను మార్కెట్కు తరలించేందుకు బయలుదేరుతుండగా తన తండ్రి వెళుతున్నట్లు గుర్తించిన రెండేళ్ల వయసున్న చిన్న కుమార్తె పరుగున ఇంటి బయటకు చేరుకుంది. అప్పటికే ముందుకు కదిలిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. విషయం తెలియగానే ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుడి అనుమానాస్పద మృతి నల్లమాడ: అమడగూరు మండలం మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఓ యువకుడి మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన గుణిశెట్టి రాజేష్(36)కు ఏడేళ్ల క్రితం అమడగూరు మండలం మహమ్మదాబాద్ పంచాయతీ బావిచెరువుపల్లికి చెందిన కేశవయ్య కుమార్తె సుమిత్రతో వివాహమైంది. తాగుడుకు బానిసైన రాజేష్ తనను తరచూ వేధిస్తున్నాడంటూ కొన్నేళ్ల క్రితం భర్తను వదిలి తల్లిదండ్రుల వద్దకు సుమిత్ర చేరుకుంది. ఆదివారం బావిచెరువుపల్లిలోని అత్తారింటికి వెళ్లిన రాజేష్... భార్యను కాపురానికి రావాలని కోరాడు. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. అనంతరం ఏమి జరిగిందో ఏమో.. మహమ్మదాబాద్ సచివాలయం సమీపంలో చెట్టుకు వేసిన ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు. -
కేజీబీవీ విద్యార్థులను తీర్చిదిద్దాలి
● విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు కడప ఎడ్యుకేషన్: కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులను చదువులో దిట్టలుగా మార్చాలని కేజీబీవీ సబ్జెక్టు టీచర్లకు రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపు నిచ్చారు. కడప నగర శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన రాయలసీమ పరిధిలోని కేజీబీవీలలో పనిచేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. కేజీబీవీలలో విద్యనభ్యసించే వారంతా చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారిని చదువుల్లో దిట్టలుగా చేయడం అదృష్టంగా భావించాలన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానంద రాజులు మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా తెలుసుకున్న మరిన్ని కొత్త విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు బోధించడం ద్వారా వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, రిసోర్సు పర్సన్లు సమగ్రశిక్ష సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎకాలజీ సెంటర్లో ఉచిత శిక్షణ అనంతపురం అగ్రికల్చర్: హౌస్ వైరింగ్, మోటార్ రివైండింగ్ లాంటి ఎలెక్ట్రికల్ కోర్సుల్లో ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సెంటర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కనీసం 5వ తరగతి వరకు చదివి, 18 నుంచి 40 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులు. శిక్షణా కాలంలో మధ్యాహ్న భోజన వసతి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్తో పాటు ఉచితంగా టూల్కిట్ అందిస్తారు. అలాగే 100 శాతం ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ తీసుకుంటారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎకాలజీ సెంటర్ కార్యాలయంలో పనివేళల్లో లేదా, 97044 07134, 77807 52418 నంబర్లలో సంప్రదించవచ్చు. -
వీధివీధినా పశువులే..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని ప్రతి వీధిలోనూ వీధి పశువుల బెడద తీవ్రమైంది. ఇప్పటికే కుక్కల గోలతో సతమతమవుతున్న ప్రజలు.. ఈ పశువుల బెడద ఎన్నడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నారు. ‘గో సంరక్షణ’ పథకాన్ని గాలికొదిలేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనంతపురం కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో వీధి పశువుల బెడద నానాటికీ జఠిలమవుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, మడకశిర, హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, తదితర మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో పశువులు రోడ్డుపైనే ఉంటున్నాయి. వీటి పెంపకం దారులు మేత కోసం వాటిని రోడ్లపై వదిలేస్తున్నారు. ప్రధానంగా ఉభయ జిల్లా కేంద్రాల్లో ప్రధాన రోడ్లతో పాటు ప్రతి వార్డుల్లోనూ ఆవుల సంచారం పెరిగిపోయింది. రోడ్డుకు అడ్డంగా వస్తుండడంతో పలుమార్లు వాహనదారులు వాటిని ఢీకొని కిందపడి గాయపడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక ప్రధాన మార్గాల్లో రోడ్డుకు అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో కిందపడిన వాహనదారులు అకాలమృత్యువాత పడిన ఘటనలూ ఉన్నాయి. ప్లాస్టిక్, వ్యర్థాలతో ఆరోగ్యంపై ప్రభావం.. పట్టణ పరిసరాల్లో నివాసముంటున్న పశుపోషకులు వాటి సంరక్షణను గాలికి వదిలేశారు. ప్రభుత్వం సైతం గో సంరక్షణ పథకాన్ని అటకెక్కించడంతో పశుగ్రాసం అందక పలువురు రోడ్డుపైనే పశువులను వదిలేస్తున్నారు. దీంతో ఆకలితో అలమటిస్తున్న ఆవులు .. చెత్త దిబ్బల్లో, కంపోస్టు యార్డుల్లో ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక వీటి పాలను ఆహారంగా తీసుకున్న ప్రజలు సైతం అనారోగ్యం బారిన పడుతున్నారు. గోశాల ఉన్నా.. వీధి పశువుల సంరక్షణకు అనంతపురంలోని కలెక్టరేట్ ఎదురుగా గోశాలను ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ గోశాలకు ఆవులను తరలించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. అయితే ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో పశుపోషకులకు నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు కానీ, తదుపరి చర్యలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తామేమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నట్లుగా అధికారులు వాపోతున్నారు. రోడ్ల పైనే పశువులు.. తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలో పదుల సంఖ్యలో ఆవులు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కూరగాయల మార్కెట్, చింతల వేంకటరమణస్వామి ఆలయం, గాంధీ కట్ట, ఆర్టీసీ బస్టాండ్, గన్నెవారిపల్లి కాలనీ తదితర ప్రాంతాల్లో పశువుల బెడద తీవ్రంగా ఉన్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఆవుల నుంచి పాలు తీసుకున్న అనంతరం యజమానులు వాటిని నిర్లక్ష్యంగా రోడ్డుపైకి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లపై చెత్తా చెదారం, కుళ్లిన ఆహారం, ప్లాస్టిక్ కవర్లు తింటూ పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే పాలలో నాణ్యత లోపించి సేవించిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో పశువులు రోడ్లపైనే.. నిద్రమత్తులో అధికారులు పట్టించుకోని పాలకవర్గం వీడని పరేషాన్ రాయదుర్గం టౌన్: పట్టణంలోని అనేక ప్రాంతాల్లో పశువుల సంచారంతో వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తున్నారు. ప్రధాన రోడ్లతోపాటు ఇటీవల వీధుల్లో సైతం పశువుల సంచారం అధికమైంది. పశువుల పాలు పిండుకుని వాటిని యజమానులు వదిలేస్తుండడంతో అవి రోడ్లపై పడి ఉన్న వ్యర్థాలను తింటూ తిరుగుతున్నాయి. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం, వినాయక సర్కిల్, కణేకల్లు రోడ్డు, బళ్లారి రోడ్డు, కూరగాయల మార్కెట్లో నిత్యం పశువులతో స్థానికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పశువులను గోశాలలకు తరలించడంతోపాటు రోడ్లపై వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు. అన్ని చోట్ల సంచారం గుంతకల్లు టౌన్: పట్టణంలోని రహదారులు, ప్రధాన చౌరస్తాలతో పాటు కూరగాయల మార్కెట్లో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు ఆవులు, ఎద్దులు, లేగదూడలు అడ్డుగా రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 18న సంతమార్కెట్లో రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ కూరగాయలు కొనుగోలు చేస్తున్న మహిళ మీదకు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ అంశాన్ని అదే నెల 26న జరిగిన కౌన్సిల్ సమావేశంలో సభ్యులు లేవనెత్తడంతో స్పందించిన అధికారులు వారం రోజుల్లోపు చర్యలు తీసుకుని రోడ్డుపైకి వచ్చిన ప్రతి పశువునూ గోశాలకు తరలిస్తామంటూ భరోసానిచ్చారు. అయితే నేటికీ ఇది కార్యాచరణలోకి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా స్థాయి యోగా పోటీల ప్రారంభోత్సవంలో గవిమఠం ఉత్తరాధికారి ఉరవకొండ: సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పరిపూర్ణ జీవన విధానానికి యోగ అత్యంత ఆవశ్యమని గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్ర క్రీడలు, యువజన విభాగ శాఖ సౌజన్యంతో ఏపీ యోగాసాన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో 5వ జిల్లా స్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలమూలల నుంచి 240 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. పోటీలను మఠం ఉత్తరాధికారి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించి, మాట్లాడారు. పరిపూర్ణ జీవనశైలికి యోగా ఒక బాటగా నిలుస్తుందన్నారు. అనంతరం 10 నుంచి 28 ఏళ్ల లోపు ఉన్న వారికి ఏడు ఈవెంట్లతో పోటీలు నిర్వహించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్ తాటికొండ, ప్రధాన కార్యదర్శి మారుతీప్రసాద్, అబ్జర్వర్ బద్రీనాథ్, నాగభూషణ్, దివాకర్, ఆయూర్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మాటలు జాగ్రత్త సునీతమ్మా
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులతో 2 లక్షల ఎకరాలకు పైగా భూములు బీడుగా మారబోతున్నాయిు. 40–50 వేల రైతు కుటుంబాలను నేల కూల్చుతున్నావు. శత్రువులతో నీ భర్త ఫ్యాక్షన్ చేసి ఉండొచ్చుకాని నువ్వు మాత్రం తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తున్నావు. నీ కంటే నీ భర్త పదిరెట్లు మేలని మీ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాప్తాడు నియోజక వర్గంలో వేలాదిమంది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత హత్యలు, దాడులు, అక్రమ కేసుల బాధిత కుటుంబాలవారు తరలి వచ్చారన్నారు. ఏరోజైనా రాత్రిపూట నీ భర్త నిద్రపోయాడా? ‘నీభర్త పేరు చెబితేనే భయపడతామని చెబుతున్నావు... 1998–99లో నీ భర్త ఏరోజైనా రాత్రిపూట నిద్రపోయాడా?’ అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరిని కలవరించుకుంటూ భయపడేవాడో ఆమెకే తెలియాలన్నారు. ‘అరవిందనగర్లో మా ఇంటికి వంద అడుగుల దూరంలోనే నీ భర్త ఇల్లు కట్టాడు. నీ భర్తపై యుద్ధం చేసి 30 నెలలు నేను జైలు జీవితం గడిపా. నా తండ్రి అదే ఇంట్లోనే కాపురం ఉన్నాడు. నీ మొగుడు చనిపోయిన తర్వాత ఆ ఇంటినుంచి పక్కకు పోయాం. నువ్వేమో నీ భర్త గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆయన తమ్ముడిని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాల్రెడ్డి వద్దకు వెళ్లి...‘పెద్దాయనా నేను గొర్లు కాసుకునేవాడిని. నాకు ఏ రాజకీయం వద్దు. నన్ను వదిలిపెట్టమని మద్దెలచెరువు నారాయణరెడ్డికి చెప్పు’ అని బతిమాలలేదా? ఇదీ మీ ఆయన చరిత్ర’ అన్నారు. ఆర్ఓసీతో ఊచకోత కోయించారు.. పరిటాట రవి మంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఓసీ అనే ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకుని ఊచకోత కోయించారని ప్రకాష్ రెడ్డి దుయ్యబట్టారు. ‘నీ మొగుడిని చంపిన మద్దెలచెరువు సూరి కాళ్లు పట్టుకుని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2009 తర్వాత నీ రాజకీయ జీవితం మద్దెలచెరువు సూరి పెట్టిన భిక్ష. సూరి వద్దకు మీ బంధువులను పంప లేదా? మీ ఆయన హత్య కేసు ముద్దాయిలతో నువ్వు సయోధ్య కుదుర్చుకోలేదా? మద్దెలచెరువు సూరి శిష్యుడు శివలింగకు నీ తమ్ముడు బాలాజీ రూ. 5 లక్షలు ఇచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయించలేదా?మరో శిష్యుడు భానును ఉపయోగించుకోలేదా?ఇదీ మీ అసలు చరిత్ర. పవర్లో ఉంటే జుట్టు పట్టుకుంటావు. లేకపోతే మరోలా వ్యవహరిస్తావు. మీ వద్ద ఎంపీపీగా పని చేసిన దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలిగితే నీ కుమారుడికి ధర్మవరం టికెట్ తెప్పించుకోలేకపోయావు. ఇదీ మీ చరిత్ర. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నావు... ప్రకాష్రెడ్డిని జైలుకు పంపాలంటే నీకు రూలింగ్ కావాలేమో. ప్రకాష్రెడ్డి జైలుకు వెళ్లేందుకు ఏ రూలింగ్ అవసరం లేదు. 20 ఏళ్లు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం’ అన్నారు. వేల కుటుంబాలు వీధులపాలు.. రాష్ట్రంలో రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను ఆపేసి వేల కుటుంబాలను వీధులపాలు చేశారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ‘ఆలమూరు, కొడిమి జగనన్నకాలనీల్లో 10 వేల మందికి ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కూడా అడ్డుకున్నారు. పాపంపేట వద్ద ఇళ్లు కూల్చేయించావు. అప్పటి నుంచి 110 ఎకరాల శోత్రియం భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారందరూ భయపడుతున్నారు. అందుకే నీ భర్త కంటే కూడా నువ్వంటేనే భయపడుతున్నారు. మళ్లీ అధికారంలోకి రామనే తెలుసు కాబట్టే అందినకాడికి దోచుకుంటున్నారు. ఎవరూ మీ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి పవన్, గోవిందరెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, అమర్నాథరెడ్డి, జూటూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను చూసి మీ పార్టీ వాళ్లు, మీ కులం వాళ్లే భయపడుతున్నారు 1998–99లో నీ భర్త ఏరోజైనా రాత్రిపూట నిద్రపోయాడా? మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం -
టీబీ డ్యాం @ 80 టీఎంసీలు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో 80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం జలాశయంలోకి 23,938 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఈ క్రమంలో 2 క్రస్ట్ గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 23,900 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,633 అడుగుల నీటి నిల్వకు గాను 1,626.06 అడుగులకు నీరు చేరు కుంది. ఇన్ఫ్లో 23,938 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 23,900 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఇదే క్రమంలో ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద హెచ్చెల్సీలో 1,240 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. అలరించిన సంగీత కచేరీ ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా జోన్ –6 దేశాలైన యూరప్, కెనడా దేశాల భక్తులు ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కొనియాడుతూ సాగిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. -
జేఎన్టీయూ(ఏ) కాన్స్టిట్యూట్ కళాశాలగా ‘స్కిట్’
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ‘కాన్స్టిట్యూట్’ జాబితాలోకి మరో కళాశాల చేరింది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్)ని జేఎన్టీయూ కాన్స్టిట్యూట్ కళాశాలగా మార్చారు. ఇప్పటికే ఏపీఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్ జాబితాలో స్కిట్ కళాశాలను ఆప్షన్ ఇచ్చుకోవడానికి వీలుగా వెబ్సైట్లో చేర్చారు. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ప్రాథమికంగా సమాచారం అందగా... ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రానున్నాయి. 1997లో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘స్కిట్’ కార్యకలాపాలు తొలుత సమర్థవంతంగా నడిచినా... కొన్నేళ్లకే అడ్మిషన్లు పడిపోయాయి. నిర్వహణ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ‘స్కిట్’ను జేఎన్టీయూ కాన్స్టిట్యూట్ కళాశాలగా మార్చాలంటూ 10 సంవత్సరాల నుంచి పాలకమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది.ఇందుకు సంబంధించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా కార్యరూపం దాల్చింది. ఐదో కళాశాల.. జేఎన్టీయూ (ఏ) పరిధిలో ఇప్పటివరకూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, ఓటీపీఆర్ఐ, పులివెందుల, కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలు కాన్స్టిట్యూట్గా ఉన్నాయి. తాజాగా స్కిట్ చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. కాన్స్టిట్యూట్ కళాశాలగా రూపాంతరంతో ‘స్కిట్’కు సంబంధించిన స్థిర, చరాస్తులు అన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి రానున్నాయి. కళాశాల నిర్వహణ మొత్తం జేఎన్టీయూ (ఏ) పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే జేఎన్టీయూ ఉన్నతాధికారులు ‘స్కిట్’కు సంబంధించి ప్రిన్సిపాల్ నియామకం, ఫ్యాకల్టీ కేటాయింపు తదితర అంశాలపై దృష్టి సారించారు. ‘స్కిట్’లో తొలుత ఐదు బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి పొందారు. సీఎస్డీ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్), సీఎస్ఈ (కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్), సీఎస్ఎం (సీఎస్ఈ–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్), ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)లో బ్రాంచ్కు 66 చొప్పున 330 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. కోర్సు ఫీజు రూ.70 వేలుగా నిర్ధారించారు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కోర్సు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. -
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
అనంతపురం మెడికల్: ఓ డాక్టర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది.కుటుంబీకులు, బంధువులకు తీరని శోకం మిగిల్చింది. గైనకాలజిస్టు చేయాల్సిన శస్త్రచికిత్సను ఓ సర్జన్ చేయడంతో అధిక రక్తస్రావం జరిగి చివరకు గర్భిణి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైద్యుడి నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబీకులు ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వివరాలు... బుక్కరాయసముద్రం మండలం చదళ్లకు చెందిన మల్లికార్జున, రాధమ్మ (29) దంపతులకు అమల, సాయి సంతానం. రాధమ్మ మరోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఐదో నెల. గర్భంలోని బిడ్డ విషయంలో సమస్య తలెత్తడంతో ఇటీవల నగరంలోని ఓ గైనకాలజిస్టును సంప్రదించారు. అయితే, శస్త్రచికిత్స చేయడానికి గైనకాలజిస్టు నిరాకరించారు. దీంతో ఈ నెల ఒకటో తేదీన నగరంలోని సాయికృప ఆస్పత్రికి మల్లికార్జున, రాధమ్మ వెళ్లారు. అక్కడ ఆమెకు డాక్టర్ వెంకటరమణ నాయక్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, జీజీహెచ్) కొన్ని మందులిచ్చి ఆదివారం రమ్మన్నారు. దీంతో రాధమ్మ ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఆస్పత్రికి రాగా, గంట వ్యవధిలోనే గర్భసంచి తొలగించాలంటూ డాక్టర్ వెంకటరమణ నాయక్ ఆపరేషన్ ప్రారంభించారు. కాసేపటికే అధిక రక్తస్రావం జరిగి రాధమ్మ ప్రాణాలు విడిచింది. బంధువుల ధర్నా.. వైద్యుడి నిర్లక్ష్యంతోనే రాధమ్మ మృతి చెందిందంటూ కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వైద్యుడిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ అనుపమజేమ్స్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. గైనకాలజిస్టు చేయాల్సిన సర్జరీ మీరెందుకు చేశారని డాక్టర్ వెంకటరమణ నాయక్ను ప్రశ్నించగా.. ఆయన నీళ్లు నమిలారు. అనంతరం ఆస్పత్రిని డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. అనుమతులు తిరస్కరించినా.. ఏడాది క్రితం కూడేరుకు చెందిన ఓ మహిళా రోగి ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చారు. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి శ్రీనివాస్నగర్లోని లావణ్య హాస్పిటల్ (ప్రస్తుత సాయికృప ఆస్పత్రి) లో సర్జరీ చేయగా.. అది కాస్తా వికటించింది. చివరకు ఆమె కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు చేయగా కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశాలతో ఆస్ప త్రిని అప్పట్లో సీజ్ చేశారు. ఇటీవల అదే చోట సాయికృప పేరున ఆస్పత్రికి దరఖాస్తు చేసుకోగా ఆరోగ్యశాఖాధికారులు తిరస్కరించారు. అయినా, గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రి నడుపుతూ శస్త్రచికిత్సలు ప్రారంభించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. తల్లి లేని బిడ్డలై.. రాధమ్మ మృతితో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లిలేని వారయ్యారు. ఆస్పత్రిలో తల్లికి ఏం జరిగిందో తెలియక ‘అమ్మా..అమ్మా’ అంటూ వారు అంటుండం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. -
అధికారుల అండతోనే బరితెగింపు!
అనంతపురం క్రైం: అధికారుల అండతోనే ‘పచ్చ’ గద్దలు బరితెగించినట్లు తెలిసింది. ఓ సివిల్ వివాదంలోకి రక్షణ పేరిట పోలీసులు తలదూర్చడం ఇందుకు బలం చేకూరుస్తోంది. వివరాలు.. అనంతపురం నగర శివారులోని ఎంకేఎం ఫంక్షన్ హాలు సమీపాన జాతీయ రహదారికి ఆనుకుని సర్వే నంబర్లు 209–210లోని రూ. కోట్ల విలువైన భూమిలోకి రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు జేసీబీలతో ప్రవేశించడం కలకలం రేపింది. అయితే, ఈ వ్యవహారంలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ రహదారికి ఆనుకుని భూమి ఉండడం, రూ. కోట్లు విలువ చేస్తుండడంతో భూమిని కాజేసేందుకు కొన్ని శక్తులు చేతులు కలిపినట్లు తెలిసింది. బాధితుల కథనం మేరకు..అక్రమార్కులకు నగర ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు అండగా ఉన్నారు. అక్రమార్కులు ఆ భూమి వివరాలను స.హ చట్టం ద్వారా తెలుసుకుని నకిలీ పత్రాలు సృష్టించారు. ముందుగా వీఆర్ఓ, డీటీ స్థాయి అధికారులకు ఎర వేశారు. వారి ద్వారా మ్యానువల్ వంశ వృక్షాన్ని పుట్టించారు. నకిలీ జీపీ కూడా సిద్ధం చేశారు. ఓ సబ్రిజిస్ట్రార్తో చేతులు కలిపి బేరం కుదుర్చుకున్నారు. చివరిగా ఓ పోలీసు అధికారిని కలసి రక్షణ కోరారు. సర్వే చేయించుకుంటామంటే కొందరు అడ్డొస్తున్నట్లు కట్టుకథ అల్లారు. శనివారం జేసీబీలతో భూమిలోకి దిగారు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే పోలీసులతో హెచ్చరికలు చేయించారు. పక్కనే ఉన్న ఓ కల్యాణమండపం యజమానికి కూడా అక్రమార్కులు హెచ్చరికలు చేశారు. మండపంలో కూడా కొంత భాగం తమకొస్తుందంటూ బెదిరించారు. స్థానికంగా ప్లాట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న బండలు, సరిహద్దుల రాళ్లను ధ్వంసం చేసి భయాందోళన సృష్టించారు. ప్రైవేటు కేసులకు రెడీ.. కోర్టు తీర్పు కాపీలు తీసుకుని నెలల తరబడి తిరిగితేగాని రక్షణగా రాని పోలీసులు అక్రమార్కులు కోరగానే ఎందుకు తలదూర్చారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ విషయంపై బాధితులు సంబంధిత శాఖల్లో ఎవరైతే అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తారో వారిపై ప్రైవేటు కేసులు వేయాలని భావిస్తున్నారు. భూ వివాదంలో నకిలీలపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు. నా సంతకం కాదేమో: వీఆర్ఓ 209–210 సర్వే నంబర్లకు సంబంధించి మీరిచ్చిన రిపోర్టు నిజమేనా అని ‘సాక్షి’ ప్రశ్నించగా సదరు వీఆర్ఓ స్పందించారు. రిపోర్టులోని సంతకం తనది కానట్టే ఉందన్నారు. రిపోర్టు ఇచ్చిన రోజు తాను ఇన్చార్జ్గా ఉన్నానని తెలిపారు. ‘పచ్చ’ గద్దల వ్యవహారంలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చని తెలియజేశారు. 13న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు అనంతపురం సిటీ: ఉభయ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 13న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫైలును సిద్ధం చేసి చైర్పర్సన్ బోయ గిరి జమ్మకు పంపగా.. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపారు. స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన హాలులో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు నిర్వహించనున్నారు. సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు పంపారు. జిల్లా స్థాయి అధికారులు కచ్చితంగా సమగ్ర సమాచారంతో హాజరుకావాలని పేర్కొన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ధర్నా బెళుగుప్ప: మండల పరిధిలోని గంగవరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆదివారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల లో ఓల్టేజ్తో పాటు విద్యుత్ సరఫరాలో కోతలు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బోరుబావుల మోటార్లు సరిగా ఆడటం లేదని వాపోయారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతు న్నాయని చెప్పారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఏఈ గంగాధర్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. -
జిల్లా అంతటా శనివారం పగటి ఉష్ణోగ్రతలు పెరగగా, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడ తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు ● ‘ఫ్యాప్టో’ ధర్నాలో నాయకుల ధ్వజం అనంతపురం అర్బన్: ‘‘కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చేసిందేమీ లేదు. 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏల ఊసే లేదు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయలేదు.కనీసం సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి సమయం కూడా ఇవ్వడం లేదు’’ అంటూ ‘ఫ్యాప్టో’ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిమాండ్ల సాధనకు శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ శ్రీనివాసనాయక్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా పీఆర్సీ ఉసేలేదన్నారు. 12వ వేతన సవరణ సంఘం అమలు గడువు ఆలస్యమైనందున వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మూడు డీఏలను ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని, ఇప్పటికే మంజూరైన డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలూ చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. 2004 సెప్టెంబరు 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన వారందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో 57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులపై పీ–4 కార్యక్రమం బలవంతంగా రుద్దడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నాకు వైఎస్సార్టీయూ నాయకులు నాగిరెడ్డి, శ్రీధర్గౌడ్, ఎంఈఓ–2 సంఘం నాయకులు రామచంద్ర, పీడీ సంఘం అక్కులప్ప తదితరులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ‘ఫ్యాప్టో’ కో–చైర్మన్లు ఓబుళేసు, లింగమూర్తి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు రమాణారెడ్డి, వెంకటేష్, కార్యదర్శి రత్నం, కోశాధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కు కోల్పోవాల్సిందేనా?
● మెగా డీఎస్సీ ఎస్జీటీ పరీక్షలో ఓ ప్రశ్నకు తప్పు సమాధానం ● అభ్యంతరం తెలిపినా పరిష్కరించలేదంటున్న అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ ఎస్జీటీ పరీక్షలో ఓ ప్రశ్న తప్పుగా ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఫైనల్ ‘కీ’ కూడా విడుదల చేశారు. ఈ ‘కీ’ తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏంటా ప్రశ్న...? ఎస్జీటీ పరీక్షల్లో భాగంగా జూలై 2న మధ్యాహ్నం జరిగిన పరీక్షలో 41వ ప్రశ్నగా ‘తిక్కనకు సంబంధించి కింది వాటిలో సరికానిది’ అని అడిగారు. సమాధానాలు.. ‘అ–మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు, ఆ–నిర్వచనోత్తర రామాయణం వీరి రచన, ఇ–మహాభారతంలో అరణ్యపర్వం నుంచి మహాప్రస్థానిక పర్వం వరకు రచించారు. ఈ–నాటకీయత వీరి కవితా లక్షణం’ అని ఇచ్చారు. కీలో సమాధానం ‘అ,ఆ,ఈ’ అని ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులు చెబుతున్నారు. 8వ తరగతి తెలుగువాచకం 146వ పేజీలో ‘ఆతిథ్యం’ అనే పాఠంలో ఈ విషయం స్పష్టంగా ఉండడం గమనార్హం. తిక్కన ‘మనుమసిద్ది ఆస్థానంలో మంత్రిగా పని చేశారు, నిర్వచనోత్తర రామాయణం రచించారు, ఈయన శైలి నాటకీయం’ అని ఆ పాఠంలో స్పష్టంగా ఉంది. అంటే ఈ ప్రశ్న ‘తిక్కనకు సంబంధించి కింది వానిలో సరైనది’ అని అడిగిఉంటే వారు ఇచ్చిన సమాధానం సరిపోయేది. వారు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్లలో లేనేలేదు. దీనిపై ఆధారాలతో సహా అభ్యంతరాలు తెలిపినా అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా ఫైనల్ కీ విడుదల చేశారు. ఈ క్రమంలో తాము అరమార్కు నష్టపోవాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. అరమార్కుతోనే వందలాది మంది అభ్యర్థుల ర్యాంకులు మారిపోతాయంటున్నారు. ప్రశ్నకు సమాధానం తెలీక... అదృష్టం కొద్దీ ‘అ,ఆ,ఈ’ సమాధానం ఇచ్చిన వారికి మార్కు వస్తుంది. అలాకాకుండా ఏళ్ల తరబడి రేయింబవళ్లు చదువుకుని పూర్తిగా అవగాహన ఉండి తప్పుగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం పెట్టలేని అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రశ్నకు మార్కు యాడ్ చేయాలని కోరుతున్నారు. -
●కసాపురం.. భక్తజనసాగరం
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ఆంజనేయస్వామి నామస్మరణతో పురవీధులు మార్మోగాయి.సీతారామలక్ష్మణులు హనుమంత వాహనంపై కొలువుదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శనివారం వేకువజామునే నెట్టికంటుడికి మహాభిషేకాలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని వజ్రకవచ అలంకరణలో తీర్చిదిద్దారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు బెల్డోణ సత్రంలో అన్నదానం చేపట్టారు. సాయంత్రం సీతారామలక్ష్మణులను హనుమంత వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకీలో ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కే.వాణి, ఏఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రేపు, ఎల్లుండి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్:అనంతపురం,శ్రీ సత్యసాయి జిల్లాల్లో సోమ,మంగళ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం కూడా వర్షం పడవచ్చన్నారు. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షం పడే సూచన ఉందని పేర్కొన్నారు. పంటల బీమా గడువు పెంపు అనంతపురం సెంట్రల్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ పంటల బీమా(ఆర్డబ్లూబీసీఐఎస్) గడువును ఈనెల 14 వరకూ పొడిగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఉమా మహేశ్వరమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలుగా గడువు పొడిగించినట్లు వివరించారు. జూలై 31తో గడువు ముగిసిందన్నారు. అయితే జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వలన వివిధ పంటల సాగుకు ఇంకా సమయం ఉందని, దీని దృష్టిలో పెట్టుకొని గడువు పెంచాలని వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో బీమా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. రుణం తీసుకోని రైతులకు ఈనెల 14 వరకూ, రుణం తీసుకున్న వారికి ఈనెలాఖరు వరకూ అవకాశం కల్పించారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు కలెక్టరేట్లో పరిష్కార వేదిక అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలిపారు. -
అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’
● ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కూడేరు: అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ అందుతుందని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. శనివారం కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లలితమ్మ అధ్యక్షతన నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,75,642 మంది రైతు కుటుంబాలకు రూ.192.95 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.137.82 కోట్లు, ‘పీఎం కిసాన్’ కింద రూ.55.13 కోట్ల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుందన్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కూడా లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కూడేరు మండలంలో 9,454 మంది రైతు కుటుంబాలకు రూ.6.62 కోట్లకు సంబందించి మెగా చెక్ అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారిణి ఉమామహేశ్వరమ్మ, ఏడీ అల్తాఫ్ బాషా, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఏఓ శుభకర్ రైతులు పాల్గొన్నారు. మత్తు బిస్కెట్ల పట్టివేత అనంతపురం సిటీ: రైల్లో తరలిస్తున్న మత్తు బిస్కెట్లను పోలీసులు పట్టివేశారు. ఒడిశా నుంచి బెంగళూరుకు రైళ్లలో నిషేధిత పదార్థాలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అనంతపురం పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు అనంతపురం రైల్వే స్టేషన్ చేరుకోగానే జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ సెల్, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన అశోక్కుమార్ సాల్మన్ అనే ప్రయాణి కుడి బ్యాగును తనిఖీ చేయగా.. అందులో మత్తు పదార్థాలు కలిగిన 210 బిస్కెట్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ‘ఉద్యాన’ ప్రోత్సాహకాలపై దృష్టి సారించండి అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఉద్యాన పథకాల ఫలాలు, ప్రోత్సాహక రాయితీలు పూర్తిస్థాయిలో రైతులకు అందించడంపై దృష్టి సారించాలని ఉద్యాన శాఖ డీడీ డి.ఉమాదేవి ఆదేశించారు. శనివారం నగరంలోని ఉద్యానశాఖ కార్యాలయంలో ఏడీ దేవానంద్కుమార్తో కలిసి హార్టికల్చర్ ఆఫీసర్స్ (హెచ్ఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఐడీహెచ్, ఆర్కేవీవై, ఆయిల్పామ్, బ్యాంబూ మిషన్ కార్యక్రమాల కింద వివిధ పథకాల అమలుకు రూ.12.86 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, యాంత్రీకరణ, పోస్ట్ హార్వెస్టింగ్, ఫారంపాండ్లు, ప్యాక్హౌస్, పాలీహౌస్, కోల్డ్ రూం, కోల్డ్ స్టోరేజీ, సోలార్ డ్రయ్యర్స్, రైపనింగ్ చాంబర్స్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ తదితర అన్ని రకాల పథకాల అమలుకు అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ప్యాక్ హౌస్లకు రూ.2 లక్షల రాయితీ ఉంటుందన్నారు. అలాగే వ్యక్తిగత ఫారంపాండ్లకు రూ.75 వేలు, కమ్యూనిటీ ఫారంపాండ్ల నిర్మాణానికి రూ.18 లక్షలు, సోలార్ కోల్డ్ రూంలకు రూ.4.38 లక్షలు, రైపనింగ్ చాంబర్స్కు రూ.21 లక్షలు, కోల్డ్రూంలకు రూ. 5.25 లక్షలు, సోలార్ డ్రయ్యర్స్కు రూ.లక్ష ఇలా... రాయితీలు రైతులు సద్వినియోగం చేసుకునేలా, పూర్తి స్థాయి బడ్జెట్ ఖర్చు చేయడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ–క్రాప్ నమోదు ఖచ్చితంగా జరిగేలా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. -
ఈ ఉపాధ్యాయుడు మాకొద్దు
బ్రహ్మసముద్రం: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు తమకొద్దు అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ముక్తకంఠంతో నినదించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం మేరకు... బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆర్. వేమనారాయణ విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. బాలికలపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మాట్లాడేందుకంటూ విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఇవ్వమంటున్నారు.ఇవ్వకపోతే ఇష్టమొచ్చినట్లు కొడుతునారు. ఇటీవల విద్యార్థులు తిరగబడడంతో మెడికల్ లీవ్పై వెళ్లిపోయిన ఆయన.. రెండు రోజుల క్రితం తిరిగి విధులకు హాజరయ్యారు. కానీ, పాత బుద్ధి మాత్రం పోనిచ్చుకోకుండా విద్యార్థినులతో మళ్లీ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. శనివారం వారు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడు వేమనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఎం సుహాసినికి వినతి పత్రం అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గుండిగానిపల్లి తెలుగు టీచర్పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు -
జల్సాల కోసం దొంగతనాలు
రాప్తాడురూరల్: జల్సాలకు అలవాటుపడిన యువకులు అప్పులపాలై.. వాటిని తీర్చుకునేందుకు దొంగలుగా మారి.. చివరకు కటకటాలపాలయ్యారు. ఇటీవల అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాల డెయిరీలో రూ.10 లక్షల విలువైన జనరేటర్, 70 అల్యూమినియం పాల క్యాన్లను చోరీ చేసిన కేసులో నిందితులను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రూరల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అనంతపురంలోని రంగస్వామినగర్కు చెందిన చిక్కులూరు షెక్షావలి, అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన గోవిందు సింహాద్రి, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం డీఆర్ కాలనీకి చెందిన సి.మనోహర్ ఉన్నారు. చిక్కులూరు షెక్షావలి తపోవనంలో డీజే, లైటింగ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తక్కిన ఇద్దరికీ రాచానపల్లి, కొర్రపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాల కేంద్రాల్లో సూపర్వైజర్లుగా పని చేశారు. ప్రస్తుతం ఆ రెండు పాలకేంద్రాలు మూతపడడంతో పనిలేక అప్పులు చేసుకున్నారు. షెక్షావలికి జనరేటర్ అవసరం ఉందని తెలుసుకుని రాచానపల్లిలో మూతపడిన పాలకేంద్రంలోని జనరేటర్, అల్యూమినియం పాలక్యాన్లను ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 14న రాత్రి రెండు వాహనాల్లో వెళ్లి పాలడెయిరీ భవనం తాళాలు పగులగొట్టి జనరేటర్, పాలక్యాన్లను ఎత్తుకెళ్లారు. అరెస్ట్ ఇలా... రాచానపల్లి ప్రభుత్వ పాలడెయిరీ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ జగదీష్ ఉత్తర్వుల మేరకు రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సీఐ శేఖర్కు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ కె.రాంబాబు, సిబ్బందితో తపోవనం సమీపంలోని పెట్రోలుబంకు వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకుని కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ జనరేటర్, పాలక్యాన్లు స్వాధీనం -
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
ముదిగుబ్బ/ కుందుర్పి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలోని నాయీబ్రాహ్మణ వీధికి చెందిన శ్రీనివాసులు కుమారుడు కార్తీక్ (23), అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వలస మూర్తి కుమారుడు రోహిత్ (23) తమిళనాడు రాష్ట్రం మధురైలోని కలసలింగం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ బైక్పై యూనివర్సిటీ సమీపంలో వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తీక్, రోహిత్ మృతి చెందారు. రోహిత్ జాతీయస్థాయి రెజ్లింగ్ క్రీడాకారుడు. -
స్నేహంలో అనుమానాలొద్దు
అనంతపురంలోని కాంట్రాక్ట్ ఉద్యోగి స్కైలాబ్ రెడ్డి, మల్లికార్జునరెడ్డిది 30 ఏళ్ల స్నేహం. ఏనాడూ చిన్న పట్టింపు లేకుండా వీరి స్నేహం సాగిపోతోందంటే చెప్పుడు మాటలు వినకపోవడం, ఒక వేళ వినాల్సి వచ్చినా ఏనాడూ ఆలోచించకుండా అడుగేసింది లేదు. ఇంట్లో వారందరినీ భగవంతుడే ఇచ్చాడు. మంచి స్నేహాన్ని తామే ఎంచుకోవాలన్న స్పృహతో ఉంటేనే ఏ బంధమైనా కలకాలం ఉంటుందంటున్నారు. సాధారణంగా చాలా స్నేహాలు ఈగోలతో, ఆర్థిక విషయాలలో చెడిపోతుంటాయని, అందరూ అటువంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. అప్పుడే స్నేహం వర్ధిల్లుతుంది. -
భారత సైన్యానికి ఏటా రూ.10 లక్షల విరాళం
అనంతపురం కార్పొరేషన్: తమ కుమారుడు ఆలూరు విరాట్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా భారత సైన్యానికి ఆలూరు ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల విరాళం అందిస్తామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు పేర్కొన్నారు. శనివారం కుమారుడి పుట్టిన రోజును పురస్కరించుకుని నార్పలలోని చెన్నకేశవ వృద్ధాశ్రమానికి రూ.లక్ష, బెంగళూరులోని బన్నేరుఘట్ట జూలో ఐదు జంతువులను దత్తత తీసుకుని వాటి పరిరక్షణకు రూ.లక్ష అందజేసినట్లు పేర్కొన్నారు. ఇటీవలే భారత సైన్యానికి రూ.10 లక్షల విరాళం అందజేసినట్లు వెల్లడించారు. పదేళ్లుగా విరాట్ పుట్టిన రోజు సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో, కోవిడ్ సమయంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. -
కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ
అనంతపురం అర్బన్: నాటక పితామహుడు బళ్లారి రాఘవ కళామతల్లి ముద్దుబిడ్డ అని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆయన జీవితం తెలుగుజాతికి మణిహారమంటూ కొనియాడారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బళ్లారి రాఘవ 145వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై బళ్లారి రాఘవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ బళ్లారి రాఘవ నాటకరంగానికి వన్నె తెచ్చారన్నారు. ఆయన సామాజిక సంఘ సంస్కర్త అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ ప్రారంభించి పలు నాటకాలను ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆయన ప్రజ్ఞను గుర్తించిన అప్పటి ఆంగ్ల ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడమే కాకుండా లాల్బహదూర్ అనే బిరుదుతో సత్కరించిందన్నారు. సంపన్న కుటుంబానికి చెందినా నిరాండంర జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి బళ్లారి రాఘవ అని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, డీఈఓ ప్రసాద్బాబు, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, కళా సంస్థ ప్రతినిధి మైకెల్బాబు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. మౌలిక వసతులు తప్పనిసరి కూడేరు: అహుడా లే అవుట్లలో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ స్వామి శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కూడేరు, బ్రాహ్మణపల్లిలోని అహుడా లేఅవుట్లను పరిశీలించారు. లేఅవుట్ల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, అహుడా లేఅవుట్ తెలిపేలా శాశ్వత హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి,, అహుడా ఈఈ దుశ్యంత్, డీఈ రేవంత్, తహసీల్దార్ మహబూబ్ బాషా, రీసర్వే డీటీ ప్రసాద్, సర్వేయర్ ఆయేషా సిద్ధిఖీ, వీఆర్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యాటకల్లులో దొంగల హల్చల్
శెట్టూరు: యాటకల్లులో దొంగలు పట్టపగలే హల్చల్ చేశారు. శనివారం సాయంత్రం గ్రామ చివరున్న మోటార్ పంపుసెట్ వైర్లు, స్టార్టర్ బాక్సులను ముగ్గురు దుండగులు తొలగించి ఎత్తుకుపోతుండగా.. అటుగా వస్తున్న ఓ రైతు వారిని ఎవరు మీరని వివరాలు అడిగాడు. దీంతో దుండగులు రైతును బెదిరించి ముందుకెళ్లారు. వెంటనే రైతు గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకొని దుండగులను పట్టు కున్నారు. సర్పంచ్ ఈరన్న సమాచారంతో ఎస్ఐ రాంభూపాల్ వచ్చి దుండగులను స్టేషన్కు తరలించారు. ఇప్పటికే పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. పోలీసులు విచారించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాప్తాడురూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ బీజేపీ కొట్టాల దారిలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన వెంకటరమణనాయుడు (43) బలపంరాయి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం అనంతపురం వచ్చాడు. వచ్చిన పని పూర్తికాలేదని కాటిగానికాలువ గ్రామంలో స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి అనంతపురం వచ్చే సమయంలో బీజేపీ కొట్టాలకు వెళ్లే క్రాస్ వద్ద కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న వారు గమనించి అతడిని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటరమణనాయుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రైవేట్ భూమిపై వాలిన ‘పచ్చ’ గద్దలు
● యజమానులను దరిదాపుల్లోకి రానీయని పోలీసులు ● బాధితుల్లో విశ్రాంత న్యాయమూర్తి, మరికొంతమంది అనంతపురం క్రైం: అధికార తెలుగుదేశం పార్టీ అండతో కొందరు నాయకులు రూ.కోట్లు విలువైన ప్రైవేట్ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఏకంగా పోలీసుల రక్షణలో భూమిని చదును చేయించడం.. అసలైన ప్లాట్ల యజమానులను దరిదాపుల్లోకి రాకుండా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... అనంతపురం నగర శివారులోని ఎంకేఎం ఫంక్షన్హాలు సమీపాన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నంబరు 209, 210లో మొత్తం 12 ఎకరాలు భూమి ఉంది. ఇందులో గంగాధర, లింగమ్మ, మారెన్న, మంజునాథ, లక్ష్మీదేవితో పాటు పదుల సంఖ్యలో వ్యక్తులకు ప్లాట్లు ఉన్నాయి. విలువైన ఈ స్థలాలపై టీడీపీకి చెందిన పెద్ద మనుషులు కన్నేశారు. సమీప బంధువును ముందుంచి భూమిని కాజేసేందుకు పథకం వేశారు. అందుకు అనుగుణంగా శనివారం మందీమార్బలంతో పాటు పోలీసులను రక్షణగా తీసుకుని సదరు సర్వే నంబర్లలోని భూమిలోకి జేసీబీలతో వచ్చారు. ఇదివరకే అక్కడున్న బండలు, షెడ్లు కూల్చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని పోలీసులు వారి స్థలాన్ని సర్వే చేయించుకుంటున్నారని, ఎవ్వరూ అడ్డు రావద్దని స్పష్టం చేయడంతో వెనక్కు తగ్గారు. తహసీల్దార్ సెలవులో ఉండగా.. సర్వేకు ఎలా అనుమతిచ్చారు? సివిల్ వివాదంలో రక్షణ పేరిట పోలీసులు ఎందుకు తలదూరుస్తున్నారో స్థానికులకు అంతుబట్టలేదు. తమ వద్ద ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయని చెబుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. ప్లాట్లు కబ్జాకు గురవుతున్న బాధితుల్లో విశ్రాంత న్యాయమూర్తి ఒకరు ఉన్నారు. ఆయన ఈ వ్యవహారంపై ఎస్పీని నేరుగా కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అసలు కబ్జాదారులు ఏ డాక్యుమెంట్లు చూపిస్తే పోలీసులను రక్షణగా పంపించారని ప్రశ్నించినట్లు సమాచారం. స్పందించిన ఎస్పీ డీఎస్పీని విచారణకు ఆదేశించారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బాధితులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందించి న్యాయం చేయకపోతే.. తాము ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ‘రైతులను బిచ్చగాళ్లుగా చూస్తున్నారు’ గుంతకల్లు: రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలకులు రైతులను బిచ్చగాళ్లుగా చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ విమర్శించారు. శనివారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఒక్క అనంతపురం జిల్లాలోనే 8.55 లక్షలు ఎకరాలకు గాను 3 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేసినట్లు జిల్లా వ్యవసాయధికారులు ప్రకటించారన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల్లో విత్తనం వేయాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్భర పరిస్థితి నెలకొన్న తరుణంలో అన్నదాత సుఖీభవ కింద మీరు (ప్రభుత్వాలు) రూ.7వేలు ఇచ్చి.. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎకరాకు రూ.25వేలు ఇచ్చినా అ డబ్బులు రైతులకు సరిపోవన్నారు. సాగుకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహరక మందులు 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక హంద్రీ–నీవా కాలువ వెడుల్పు చేసిన ఉమ్మడి అనంత జిల్లాకు ఏ మాత్రమూ ప్రయోజనం లేదన్నారు. రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేయడానికి బనకచెర్ల నీటి పథకాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శంచారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, బి.మహేష్, గోపీనాథ్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
హిందూపురం: ఆర్థిక ఇబ్బందులతో న్యాయవాదులను నియమించుకోలేని నిరుపేద ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్జి ఈ. భీమారావు తెలిపారు. శనివారం ఆయన ఏడీజే కంపల్లె శైలజ, జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి రాజశేఖర్, సీనియర్ సివిల్ జడ్జి డి.వెంకటేశ్వర్లు నాయక్, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యతో కలిసి స్థానిక సబ్జైలును తనిఖీ చేశారు. సౌకర్యాలపై ఆరా తీశారు. ఖైదీలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. భోజనం సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ పంపించాలని అధికారులను ఆదేశించారు. సబ్ జైలులో ఆన్లైన్ సౌకర్యం కల్పించాలని సబ్జైలు అధికారి హనుమన్నను ఆదేశించారు. అనంతరం పలువురు ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినా పోలీసులు ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపారని జిల్లా జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తాము జైలులో ఉంటే తమపై కేసులు పెట్టిన వ్యక్తులు తమ కుటుంబీకులను ఇబ్బందులు పెడుతూ గ్రామంలోకి రాకుండా అడ్డు కుంటున్నారని వాపోయారు. వారి ఆవేదన విన్న జడ్జి అరెస్టు సమయంలోనే జడ్జి ముందు పోలీసుల వేధింపుల గురించి చెప్పాలన్నారు. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పినప్పుడే న్యాయ సహాయం అందుతుందన్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలంతా మార్పు చెంది సమాజంలోకి వెళ్లాలన్నారు. అనంతరం ఆయన స్థానిక సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం భవన సముదాయాన్ని పరిశీలించారు. కోర్టు ఆవరణంలో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటి నాణ్యత గురించి ఆర్అండ్బీ ఇంజినీర్, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జడ్జి వెంట న్యాయవాదులు రాజశేఖర్, నవేరా, భరత్ సింహా తదితరులు ఉన్నారు. సబ్జైలు తనిఖీలో జిల్లా జడ్జి భీమారావు -
12, 13 తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు
అనంతపురం అర్బన్: సీపీఐ జిల్లా మహాసభలు ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ తెలిపారు. శనివారం నగరంలోని నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తా మని చెప్పి ఏడాదైనా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి వాటి పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యదర్శివర్గ సభ్యులు రాజారెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు లింగమయ్య, కత్తి నారాయణస్వామి, రాజేష్ గౌడ్, సంతోష్కుమార్, పద్మావతి, అల్లీపీరా, పెద్దయ్య, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు. 5న విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన అనంతపురం అర్బన్: విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు నాగరాజు మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. స్మార్ట్ మీటర్లు పగులకొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుబాటు చార్జీల పేరుతో రూ.15,485 కోట్లు భారం మోపిందన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.2,787 కోట్లు అదనపు భారం వేశారన్నారు. ఈ భారాలను కప్పిపుచ్చి రూ.460 కోట్లు ట్రూడౌన్ ద్వారా తగ్గిస్తున్నట్లు నమ్మబలుకుతున్నారని విమర్శించారు. తాజాగా మరో రూ.12,700 కోట్లు భారాన్ని వినియోగదారులపై మోపనుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజారెడ్డి, నాగేంద్రకుమార్, నాగమణి, బాలరంగయ్య, శ్రీరాములు, రామాంజనేయులు, వీరనారప్ప, తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛమైన స్నేహం
అనంతపురానికి చెందిన టీఎల్ శారద, ఝాన్సీలది స్వచ్ఛమైన స్నేహ బంధం. వీరి వయసు 60 ఏళ్లు పైబడింది. శారదా మునిసిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదివే సమయంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇద్దరి జీవితాలలో జరిగే శుభ, అశుభాలన్నింటిలో రెండు కుటుంబాల వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ మైత్రీబంధాన్ని ఆస్వాదిస్తున్నారు. మరో విశేషమేమంటే స్నేహాన్ని బంధుత్వంగానూ మార్చుకున్నారు. ‘స్నేహమంటే ఇతరుల కోసం ఆలోచించేదేనని అనుకున్నాను కాబట్టే ఇన్నేళ్లయినా పొరాపొచ్చలు రాలేదు’ అని ఇటీవలే టీచర్గా ఉద్యోగ విరమణ చేసిన శారద తెలిపారు. -
●స్నేహ హస్తం.. స్ఫూర్తి మంత్రం
అనంతపురంలోని శ్రీపొట్టి శ్రీరాములు హై స్కూల్లో 1984 సంవత్సరంలో చదువుకున్న వారంతా ఒక బాస చేసుకున్నారు. హైస్కూలు వీడి వెళ్లినా అందరూ కలుస్తుండాలని. ఎన్ని సమస్యలు ఉన్నా వీలైనప్పుడల్లా కలవాలని. అలా కలయిక మొదలైంది. 2012లో ప్రత్యేకంగా ఒక గ్రూపు ఏర్పాటు చేసుకుని ప్రతినెలా కృష్ణకళామందిరంలో సమావేశమై సాదకబాధకాలు చర్చించుకుంటున్నారు. ఈ గ్రూపులో వందమందికి పైగా ఉన్నారు. వీరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మిగతా స్నేహితులంతా స్పందించి సాయం అందిస్తూ.. నేటికీ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని గ్రూపు నిర్వాహకులు యమ్మనూరు చంద్రశేఖర్, జయసింహ, రామకృష్ణ చెబుతున్నారు. -
అపూర్వ స్నేహితులు
కొర్రపాడుకు చెందిన అక్కులప్ప, ఉరవకొండకు చెందిన తిమ్మారెడ్డిది అపూర్వమైన స్నేహబంధం. అనంతపురంలోని హైస్కూల్లో 6వ తరగతి చదివే సమయంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. 30 ఏళ్లుగా వీరి స్నేహం చెక్కు చెదరలేదు. అక్కులప్ప పార్ట్టైం పీహెచ్డీ చేస్తూ, న్యాయవాది వృత్తిని ఎంచుకున్నారు. తిమ్మారెడ్డి ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. చిన్నపాటి మనస్పర్ధలు కూడా లేకుండా వారి స్నేహాన్ని కొనసాగిస్తూ.. స్పూర్తిగా నిలుస్తున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా వీలైనప్పుడు ఇద్దరూ కలుస్తున్నారు. బాల్యంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అదే సంతోషంగా సాగేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. దైవదర్శనాలకు కలిసే వెళ్తున్నారు. ప్రతి పండుగనూ బంధువుల్లా చేసుకుంటామని ఇద్దరూ చెబుతున్నారు. -
గుడ్డు.. వెరీ బ్యాడ్
● పాఠశాలలు, అంగన్వాడీలకు నాసిరకం గుడ్లు సరఫరా గుంతకల్లుటౌన్/తాడిపత్రిరూరల్: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లోపించింది. 25 శాతం కుళ్లిపోయిన, చిన్న సైజు గుడ్లను అందజేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల్లో కొందరు విద్యార్థులైతే మధ్యాహ్న భోజనంలో అందజేస్తున్న కోడిగుడ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రప్రసాద్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సుమారు 1,350 మంది విద్యార్థులు ఉండగా..వారానికి ఆరు వేల గుడ్ల వరకు అందుతున్నాయి. వీటిలో 300 దాకా పగిలిన, కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయి. కొన్ని కోడిగుడ్ల బరువు 30 గ్రాములు మాత్రమే ఉంటోంది. శుక్రవారం ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా..గుడ్లు నాణ్యత లేని విషయం వెలుగులోకి వచ్చింది. మంచి ప్రభుత్వమని చెప్పుకునే కూటమి సర్కారు నాసిరకమైన గుడ్లను సరఫరా చేస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. కొన్ని డ్యామేజీ, చెడిపోయిన గుడ్లు సరఫరా అవుతున్న మాట వాస్తవమేనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిబాబు తెలిపారు. ఈ అంశంపై ఎంఈఓకు లేఖ రాశామన్నారు. గుడ్ల నాణ్యతపై విద్యార్థులను విచారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని గుంతకల్లు ఎంఈఓ మస్తాన్ రావు చెప్పారు. అంగన్వాడీ గుడ్లలో కోత! అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లలో కోత పెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 302 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రతి నెలా నాలుగు విడతలుగా దాదాపు 4.28 లక్షల కోడిగుడ్లను సరఫరా చేయాలి. కానీ జూలైలో మూడు, నాల్గవ విడతగా ఇవ్వాల్సిన 2.9 లక్షల గుడ్లను సరఫరా చేయలేదు. అలాగే ఈ ఏడాది మార్చిలో 20,060, ఏప్రిల్లో 17,068, మేలో 55,717, జూన్లో 59,359 గుడ్లు సరఫరా కాలేదని అంగన్వాడీ సిబ్బందే చెబుతున్నారు. అరకొర గుడ్ల సరఫరా, సైజులో వ్యత్యాసంపై ఇప్పటికే పై అధికారులకు నివేదిక పంపామని ఐసీడీఎస్ తాడిపత్రి ప్రాజెక్టు సీడీపీఓ సాజిదాబేగం తెలిపారు. పైనుంచి గుడ్లు సరఫరా కావడం లేదని కాంట్రాక్టర్ అంటున్నారన్నారు. -
పాతకొత్త చెరువులో నెమళ్ల సందడి
గుంతకల్లు రూరల్: మండలలోని పాతకొత్త చెరువు (పీకేచెరువు) గ్రామంలో నెమళ్ల సందడి నెలకొంది. స్థానికులకు అలవాటు పడిన కొన్ని నెమళ్లు తరచూ ఆహారం కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి సాయంత్రానికి గ్రామానికి చేరుకుంటున్నాయి. వీటికి తోడు అటవీ ప్రాంతంలోని నెమ్మళ్లు సైతం వచ్చి వెళుతుండడంతో గ్రామంలో ఎటు చూసినా నెమళ్లు కనిపిస్తున్నాయి. అంతేకాక వ్యవసాయ పనులు, గొర్రెల మేపు తదితర పనుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన రైతులు అక్కడ నెమలి గుడ్లు కనిపిస్తే తెచ్చి ఇంట్లో కోళ్ల కింద పొదిగేసి నెమళ్ల సంతతి పెరిగేలా చర్యలు తీసుకున్నారు. -
20 వేల మందికి ‘సాయం’ నిల్!
అనంతపురం అగ్రికల్చర్: ఎదురుచూపులు, అనేక వాయిదాల అనంతరం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడత కింద శనివారం పీఎం కిసాన్ కింద రూ.2 వేలతో పాటు అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు జమ చేస్తామని ప్రకటించింది. అనేక కొర్రీలు వేయడంతో దాదాపు 20 వేల మందికి పెట్టుబడిసాయం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. తొలి ఏడాది రూ.400 కోట్ల ఎగనామం అధికారంలోకి రాగానే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగానే ప్లేటు ఫిరాయించారు. అదిగో ఇదిగో అంటూనే 14 నెలలు కాలం గడిపేశారు. ఇప్పుడు పీఎం కిసాన్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14 వేలు ఇస్తామన్నారు. ఈ రూ.14 వేలు ప్రకారం గతేడాది ఇవ్వకుండా జిల్లా రైతులకు ఏకంగా రూ.400 కోట్లకు పైగా ఎగనామం పెట్టారు. ఖరీఫ్–2025 మొదలు కాకమునుపే మేలోనే ఇస్తామన్నారు. తర్వాత తేదీలు మారుస్తూ... ఎట్టకేలకు శనివారం సుఖీభవ కింద మొదటి విడతగా రూ.5 వేలు సొమ్ము వేస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల కుదింపు గత వైఎస్సార్సీపీ హయాంలో 2,94,353 మందికి ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందించారు. ఇప్పుడు జాబితాలకు కొర్రీలు వేసి 2,75,049 మందికి కుదించారు. అంటే గతంలో కన్నా 19,304 మంది రైతులు జాబితాలో స్థానం కోల్పోయారు. వీరందరికీ సుఖీభవ దక్కే పరిస్థితి లేదు. సాధారణంగా ఏటా రైతుల సంఖ్య, భూమి పాస్పుస్తకాల సంఖ్య కొంతైనా పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన గత ప్రభుత్వంలో కన్నా కొందరు రైతులు పెరగాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా తగ్గించేయడం గమనార్హం. ఈ–కేవైసీ, ఎన్పీసీఐ లింక్ లేదంటూ కొందరు రైతులకు పెట్టుబడిసాయం దక్కే పరిస్థితి లేదు. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు చొప్పున రూ.55 కోట్లు, సుఖీభవ కింద రూ.5 వేల ప్రకారం రూ.137.53 కోట్లు... మొత్తంగా రూ.7 వేల ప్రకారం రూ.192.53 కోట్లు మేర పెట్టుబడిసాయం జమ కానుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రెండో విడత కింద రబీలో కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేలు, అలాగే మూడో విడత కింద జనవరి లేదా ఫిబ్రవరిలో కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం వాటాగా రూ.4 వేలు ప్రకారం జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంతో పోల్చితే మొదటి విడత కింద 19,304 మంది రైతులకు రూ.13.51 కోట్లకు పైగా సొమ్ము దక్కకుండా చేశారు. గత ప్రభుత్వంలో 2,94,353 మందికి ‘రైతు భరోసా’ లబ్ధి ఈసారి 2,75,049 మందికే ‘సుఖీభవ’ అంటున్న కూటమి ప్రభుత్వం -
జిల్లాలో పోలింగ్ కేంద్రాల పెంపు
అనంతపురం అర్బన్: పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ తరువాత జిల్లాలో కొత్తగా 330 కేంద్రాలు పెరిగినట్లు డీఆర్ఓ మలోల తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ కొత్తగా జారీ చేసిన నిబంధన ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 మంది ఓటర్ల ఉండాలన్నారు. అంతకు మించి ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 2,226 పోలింగ్ కేంద్రాలు ఉండగా హేతుబద్ధీకరణ తరువాత 330 పెరిగి కేంద్రాల సంఖ్య 2,556కు చేరినట్లు వివరించారు. రెండు కిలోమీటర్ల పరిధిలోనే ప్రస్తుతం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలన్నీ ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని, వీటికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. ఇందుకు సంబంధించి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని కోరుతూ పరిశీనార్థం కొత్త పోలింగ్ కేంద్రాల జాబితాను నియోజకవర్గ స్థాయిలో ఆయా పార్టీల ప్రజాప్రతినిధులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి సానుకూలత వచ్చిన తర్వాత జిల్లాస్థాయిలో తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల మార్పునకు 48, కేంద్రం పేరు మార్పునకు 7 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటిని ఆమోదం కోసం జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపనున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రతినిధులు అమర్నాథ్రెడ్డి, రాధాకృష్ణ, టీడీపీ నారాయణస్వామి, బీజేపీ ఈశ్వరప్రసాద్, జనసేన కిరణ్కుమార్, ఐఎన్సీ ఇమామ్వలి, సీపీఎం బాలరంగయ్య, ఆమ్ఆద్మీ పార్టీ ప్రతినిధి మసూద్వలి, ఈఆర్ఓలు కేశనాయుడు, తిప్పేనాయక్, రమేష్రెడ్డి, మల్లికార్జునుడు, రామ్మోహన్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, డీటీ కనకరాజు, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, ఈడీటీలు పాల్గొన్నారు. హేతుబద్ధీకరణతో కొత్తగా 330 కేంద్రాలు అత్యధికంగా అనంతపురంలో 70 అత్యల్పంగా కళ్యాణదుర్గం, శింగనమలలో 21 చొప్పున కేంద్రాలు -
అడ్డగోలు నియామకాలను రద్దు చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: అడ్డగోలుగా చేపట్టిన ఎంఈఓల నియామకాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ, పీఆర్ హెచ్ఎంల ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలా కాకుండా కేవలం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని మండిపడ్డారు. ఇది పంచాయతీ రాజ్ ప్రధానోపాధ్యాయులకు జరిగిన తీరని అన్యాయంగా భావిస్తున్నామన్నారు. అడ్డగోలుగా నియామకాలను వెంటనే రద్దుచేసి మళ్లీ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే శనివారం ఫ్యాప్టో తలపెట్టిన కార్యక్రమానికి వైఎస్సార్టీఏ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, రాష్ట్ర, జిల్లా నాయకులు గోవిందరెడ్డి, రవీంద్రారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, గంగాధర్ రెడ్డి వెంకటరమణ, గోపాల్, ఎన్. వెంకటరెడ్డి, కృష్ణా నాయక్, సిద్ధ ప్రసాద్, రామకృష్ణ, విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి -
నాసిరకం విత్తనంతో నష్టపోయాం
● ఫర్టిౖలైజర్ షాప్ ఎదుట రైతుల ధర్నా కళ్యాణదుర్గం రూరల్: నాసిరకం విత్తనంతో నష్టపోయినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్యాణదుర్గంలోని అన్నదాత ఫర్టిలైజర్ షాప్ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. శెట్టూరు మండలం మాలేపల్లి గ్రామానికి చెందిన 20 మంది రైతులు కళ్యాణదుర్గంలోని అన్నదాత ఫర్టిలైజర్ షాప్లో మొక్కజొన్న విత్తనాలు తీసుకుని, సాగు చేపట్టినట్లు తెలిపారు. పంట కాలం పూర్తయిన తర్వాత దిగుబడి తామే కొనుగోలు చేస్తామంటూ రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారన్నారు. ఆ తర్వాత పెట్టుబడి, మందుల కోసం ఒక్కొక్క రైతు నుంచి రూ.70 వేలు వసూలు చేసుకున్నారని వివరించారు. అయితే ఫర్టిలైజర్ నిర్వాహకులు నాసిరకం విత్తనం ఇవ్వడంతో పంట పూర్తిగా ఎత్తిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని పలుమార్లు ఫర్టిలైజర్ నిర్వహకులకు తెలిపిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. దీంతో పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ శుక్రవారం ఫర్టిలైజర్ షాప్ ఎదుట నిరసన చేపడితే.. యజమాలు దుకాణాన్ని మూసి అజ్ఞాతంలోకి వెళ్లారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న వ్యవసాయాధికారులు అక్కడకు చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులతో మాట్లాడి.. రైతులకు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
‘ఆ టీచర్ మా కొద్దు’
ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వి. రోజారాణి తమకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి కేటాయించిన ఉపాధ్యాయురాలు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. సమయపాలన పాటించడం లేదన్నారు. పాఠశాలలోనే నిద్ర పోతుంటారన్నారు. గ్రామస్తులు ప్రశ్నిస్తే మా ఆయన పోలీస్, మీపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతోందని వాపోయారు. ఇలాంటి ఉపాధ్యాయులతో తమ పిల్లల విద్యాభివృద్ధి కుంటుపడుతుందని, ఆమెను బదిలీ చేసి, మరో ఉపాధ్యాయుడిని నియమించాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ఎంఈఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ఖాద్రీశుడికి ప్రత్యేక పూజలు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో సావ్మి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఆలయ అధికారుల తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం ఏర్పాటు చేశారు. -
నరకకూపాలుగా వసతిగృహాలు
● కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు ● వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుల ధ్వజంఅనంతపురం అర్బన్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు నరక కూపాలను తలపిస్తున్నాయని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ధ్వజమెత్తారు. వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్ ఎదుట ట్రంక్ పెట్టెలు, కంచాలతో ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఎ.రవిచంద్ర హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని మంత్రులు తమ పిల్లలను సంక్షేమ వసతిగృహాల్లో ఉంచి చదివిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్వహణను విస్మరించడంతో అధ్వానంగా మారాయని ధ్వజమెత్తారు. దోమ తెరలు, చాపలు, పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు విద్యార్థులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలన్నారు. పారిశుధ్యం లోపించి విద్యార్థులు ఆనారోగ్యంపాలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. వసతిగృహాలకు ప్రహరీ లేకపోవడంతో ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణ కరువై అభద్రతతో ఉన్నారన్నారు. వసతిగృహాల నిర్వహణకు రూ.143 కోట్లు కేటాయించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు ప్రకటించారన్నారు. ఆ నిధులు విడుదల చేశారా..? చేసి ఉంటే ఎక్కడ ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా..? అంటూ నిలదీశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు 27 రకాల వస్తువులు ఇవ్వాల్సి ఉన్నా అమలు కాలేదన్నారు. అనంతరం డీఆర్ఓ మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాకు వైఎస్సార్సీపీ బీసీసెల్ అధ్యక్షుడు దేవేంద్ర హాజరై మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎండీ సుల్తాన్, వంశీయాదవ్, బీసీసెల్ రాష్ట్ర నాయకులు గోగుల పుల్లయ్య, విద్యార్థి విభాగం నియోజకవర్గాల అధ్యక్షులు కై లాష్, కాశీ, మనోజ్, సాకే పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు మంజూనాథ్రెడ్డి, వెంకట, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిశాంత్రెడ్డి, ఆశోక్, కార్యదర్శులు హరినాథరెడ్డి, మహేష్నాయక్, నగర నాయకులు అంజన్రెడ్డి, ఫయాజ్, రాహుల్రెడ్డి, రఫీ, తదితరులు పాల్గొన్నారు. -
ఉపశమనం కాదు.. ప్రత్యక్ష నరకమే
● కాలిన రోగుల హాహాకారాలు ● వార్డుల కేటాయింపులో గందరగోళం ● ఇదీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దుస్థితి అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారుల అవగాహన రాహిత్యం రోగులకు నరకప్రాయంగా మారుతోంది. కోవిడ్ ముందస్తు చర్యల కోసం ఈఎన్టీ వార్డును కేటాయించి.. ఇక్కడి రోగులను బర్న్స్ వార్డుకు మార్పు చేశారు. ఇక కాలిన రోగుల వైద్య విభాగం (బర్న్స్ యూనిట్)లో చికిత్స పొందాల్సిన రోగులను సర్జికల్ విభాగంలోని ఎంఎస్ 1, 2, 3, 4, 5, ఎఫ్ఎస్ వార్డులకు మార్చారు. ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఉపశమనం పొందలేక.. హాహాకారాలు చేస్తున్నారు. కోవిడ్ కేసులు వస్తే చికిత్స అందించేందు కోసం ఖాళీ చేయించిన ఈఎన్టీ వార్డును రిజర్వ్ చేశారు. ఇదిలా ఉంటే సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం బర్న్స్ వార్డులోని ఆపరేషన్ థియేటర్ (ఓటీ)ని అనస్తీషియా విభాగానికి కేటాయించడం పెద్ద దుమారం రేపింది. ఈ నిర్ణయంపై సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ రామస్వామి నాయక్ అభ్యంతరం తెలిపారు. కాలిన రోగులకు ఉపయోగపడే ఓటీని మరో విభాగానికి కేటాయించడం సరికాదని, ఇప్పటికే కాలిన రోగులు ఇబ్బందులు పడుతున్నారని లేఖ రాశారు. సూపరింటెండెంట్ సొంత విభాగం ఆర్థో ఓటీలోనే అనస్తీషియాకు స్థలం కేటాయిస్తే బాగుంటుందని పలువురు వైద్యులు పేర్కొంటుండటం గమనార్హం. ఉక్కపోతతో కాలిన రోగుల అవస్థలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నం చేసుకున్న కాలిన కేసులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వస్తాయి. అందులోనూ 50 శాతం నుంచి 80 శాతం కాలి ప్రాణాంతకమైన స్థితిలో వస్తుంటాయి. అటువంటి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 కోట్లతో 20 పడకల సామర్థ్యంతో బర్న్స్ వార్డు ఏర్పాటు చేశారు. అందులో అధునాత ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఏసీ గదులతో వార్డును తీర్చిదిద్దారు. కాలిన కేసులకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్జరీ వైద్యులకు ఢిల్లీలో శిక్షణ కూడా ఇచ్చారు. అత్యవసరమైన వార్డును ఈఎన్టీకి కేటాయించి, ఈఎన్టీ వార్డును ఖాళీగా ఉంచేశారు. సర్జరీ విభాగంలో ఉక్కపోత కారణంగా కాలిన రోగులు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికై నా రోగుల అవస్థలను గుర్తించి ఇదివరకు ఎలా ఉందో అలా సంబంధిత విభాగంలోనే వైద్య సేవలందించాలని పలువురు కోరుతున్నారు. అసంబద్ధ నిర్ణయాలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు. ఈ వ్యక్తి పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన నాగేశ్వర్రెడ్డి. ఎడమచేతికి కాలడంతో సర్వజనాస్పత్రికి వచ్చారు. కాగా ఓపీ నంబర్ 8లో సర్జరీ వైద్యులు చూసి సర్జికల్ వార్డుకు పంపించారు. వాస్తవంగా ఇటువంటి కేసులను బర్న్స్ వార్డులో ఉంచి మెరుగైన వైద్యం అందించవచ్చు. బర్న్స్ వార్డులో ఏసీలతో పాటు బయట వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా అంతర్గతంగా సేవలందిస్తారు. తద్వారా గాయం త్వరగా మానే అవకాశం ఉంటుంది. ఇలా ఎంతోమంది రోగులు సర్జరీ వార్డుల్లో ఉక్కపోతతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. -
కాలవా.. నీటి కష్టాలు పట్టవా?
రాయదుర్గం టౌన్: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో తరచూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా.. ఇటు అధికారుల్లో కానీ, అటు ప్రజాప్రతినిధుల్లో కానీ ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పట్టణంలో కొన్నిచోట్ల వారం రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో పది రోజులుగా తాగునీరు అందకపోవడంతో గత నెలలో వరుస ఆందోళనలతో రాయదుర్గం అట్టుడికిపోయింది. తాజాగా శుక్రవారం మరోసారి రాయదుర్గం – బళ్లారి ప్రధాన రహదారిపై బీజీ తిలక్ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా 30 వార్డు మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులకు పైగా నీరు సరఫరా చేయకపోతే తామెలా జీవించాలంటూ ప్రశ్నించారు. ఆధ్యాత్మిక ప్రచార ఆశ్రమం ఎదురుగా ఉన్న వీధిలో దాదాపు ఏడాదిగా తాగునీరు సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు సైతం ప్రజల తాగునీటి కష్టాలు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ డీఈ సురేష్, ఎస్ఐ ప్రసాద్, నీటి సరఫరా విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. ట్యాంకర్లు పంపి నీటి సమస్య పరిష్కరిస్తామని, క్షేత్రస్థాయిలో సమస్య గుర్తించి నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మున్సిపల్ కమిషనర్ దివాకర్రెడ్డి మాట్లాడుతూ..శనివారం నుంచి పట్టణంలోని అన్ని కాలనీల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. వరుస ఆందోళనలతో అట్టుడుకుతున్న రాయదుర్గం -
రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి
అనంతపురం అర్బన్: బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని నవోదయ కాలనీలోని చౌక ధరల దుకాణాన్ని ఆయన సందర్శించి రేషన్ పంపిణీని తనిఖీ చేశారు. రేషన్ పంపిణీపై కార్డుదారులను ఆరా తీశారు. బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇవ్వాలని కార్డుదారులు కోరారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ కార్డుదారులకు కచ్చితమైన తూకంతో బియ్యం ఇవ్వాలన్నారు. తక్కువ తూకం వేస్తే చర్యలు ఉంటాయని డీలర్లను హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, వీఆర్ఓ రామాంజనేయులు పాల్గొన్నారు. ఇళ్ల వద్దే పింఛన్ పంపిణీ చేయాలి లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇన్చార్జ్ కలెక్టర్ స్థానిక నవోదయ కాలనీలో ఉమాదేవి, గుశాంతప్ప ఇళ్లకు వెళ్లి పింఛను అందజేశారు. ఏవైనా సమస్యలు ఉంటే చెబితే ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పావని, తహసీల్దార్ హరికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
●బయటపడిన డొల్లతనం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్, బూట్లు, ఇతర సామగ్రి ఏటా ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఈ పథకంతో భారీగా ప్రజాధనం వృథా అవుతోందని, నాసిరకం కిట్లను పంపిణీ చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన కిట్ను అందజేస్తామని గొప్పలకు పోయారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులకు అందజేసిన కిట్లలోని డొల్లతనం కాస్త బయటపడింది. విద్యార్థులకు అందజేసిన బ్యాగ్లు రెండంటే రెండే రోజుల్లో చిరిగిపోయి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
యువకుడి బలవన్మరణం
గుమ్మఘట్ట: తాగుడకు బానిసైన ఓ యువకుడు వ్యసనాన్ని మానలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన హరిజన తిప్పేస్వామి, గీతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. వ్యవసాయంతో జీవనం సాగించేవారు. పెద్ద కుమారుడికి వివాహమైంది. ఈ క్రమంలో రెండో కుమారుడు రాజ్కుమార్ (24)కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్కటీ కుదరకపోవడంతో రాజ్కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో పలుమార్లు తల్లిదండ్రులు మందలించినా అతనిలో మార్పు రాలేదు. తాగుడుకు బానిసైన తనకు ఇక పెళ్లి కాదని భావనలో క్షణికావేశానికి లోనై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు రాయదుర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక రాజ్కుమార్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.రంపం కోసుకుని వ్యక్తికి తీవ్ర గాయాలు గుత్తి: ప్రమాదశాత్తు రంపం కోసుకుని ఖాసీం వలి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గుత్తి ఆర్ఎస్లోని బీసీ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. తన ఇంటికి వేసిన రేకులను సరి చేయడానికి రంపంతో కోస్తుండగా చేజారి పొట్టపై పడింది. ఎలక్ట్రిక్ రంపం కావడంతో పొట్ట కోసుకుపోయింది. విపరీతంగా రక్తస్రావం అవుతుండడంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇన్నోవేషన్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు అనంతపురం అర్బన్ : జేఎన్టీయూలో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లో ఉద్యోగాల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్కు తెలిపారు. సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్న జిల్లాల కలెక్టర్లతో ఐటీ కార్యదర్శి శుక్రవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఇతర అధికారులు ఉన్నారు. సెంటర్ గురించి పరిశ్రమలు, విద్యాసంస్థలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ మురళీకృష్ణ, డీఈ వి.రాజగోపాల్, నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాపరెడ్డి, ఆర్అండ్బీ జేసీ బాలకాటమయ్య, తదితరులు పాల్గొన్నారు. తేలు కుట్టి యువకుడి మృతి గుంతకల్లు రూరల్: మండలంలోని దంచర్ల గ్రామానికి చెందిన కొట్టం రామాంజనేయులు కుమారుడు శివ (30) తేలు కుట్టడంతో మృతిచెందాడు. వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా ఉన్న శివకు 18 నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం పొలం పనులు చేస్తున్న సమయంలో తేలు కుట్టింది. గుర్తించిన బాధితుడు వెంటనే తేలును చంపేశాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు తెలపడంతో వారు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స అందేలోపు శివ మృతి చెందాడు. -
కిలో బంగారు ఆభరణాల సీజ్
తాడిపత్రి టౌన్: మండలంలోని కడప రోడ్డులో గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో కిలో బరువున్న బంగారు నగలతో పాటు రూ.1.48 లక్షల నగదు పట్టుబడింది. సరైన అనుమతి పత్రాలు లేకుండా తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకు కారులో నగలు, నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రొద్దుటూరుకు చెందిన నగల వ్యాపారి ఉభయ్దుల్లాతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, దాదాపు 1,123.92 గ్రాముల బంగారు ఆభర ణాలు, రూ.1,48,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు, నగదును కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు వివరించారు. రైల్వే క్వార్టర్స్లో చోరీ రాయదుర్గం టౌన్: స్థానిక నూతన రైల్వే క్వార్టర్స్లో చోరీ జరిగింది. రైల్వే టీఆర్డీ (ట్రాక్షన్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్) వర్కర్గా పనిచేస్తున్న నాగేంద్ర ఇంత కాలం తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి క్వార్టర్స్లో కేటాయించిన నూతన ఇంటికి గురువారం మొత్తం సామగ్రిని తరలించారు. అనంతరం శుక్రవారం నూతన గృహంలో చేరాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అద్దె ఇంట్లోనే కుటుంబసభ్యులతో కలసి నిద్రించారు. ఇదే అదనుగా భావించిన దుండగులు క్వార్టర్స్లోని ఇంటి తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బ్యాగుల్లోని బంగారు, వెండి సామగ్రితో పాటు కొంత మేర నగదు అపహరించారు. శుక్రవారం ఉదయం నూతన గృహంలో పూజాదికాలు చేసేందుకు సిద్ధమై వచ్చిన నాగేంద్ర కుటుంబసభ్యులు చోరీ విషయాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. మొత్తం రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అది ప్రమాదం కాదు.. హత్యే
గార్లదిన్నె: గత నెల కారు ఢీకొని రైతు మృతి చెందిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. అది ప్రమాదం కాదని, పథకం ప్రకారం కుటుంబసభ్యులే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు నిర్ధారించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గార్లదినెన్న పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. గార్లదిన్నె మండలం జంబులదిన్నె గ్రామానికి చెందిన బోయ నల్లప్ప (50)కు 30 ఏళ్ల క్రితం శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 25 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం నల్లప్ప తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్రెడ్డిపల్లి సమీపంలో ఉన్న క్వారీలో పని చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ మహిళతో సన్నిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్థిక సాయం అందిస్తూ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసి భార్య సర్దిచెప్పేందుకు ప్రయత్నించింది. అయితే భార్యకు విడాకులు ఇచ్చేందుకై నా సిద్ధమని, ఆ మహిళను మాత్రం తాను వీడి ఉండలేనని నల్లప్ప స్పష్టం చేయడంతో మనస్పర్తలు చెలరేగి ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం లక్ష్మి తన పిల్లలతో కలసి కల్లూరు నివాసముంటోంది. నల్లప్ప అనంతపురం సమీపంలోని సోములదొడ్డిలో ఒంటరిగా ఉంటూ రోజూ ద్విచక్ర వాహనంపై ఓబులాపురం వద్ద ఉన్న తోటకు వచ్చి వెళ్లేవాడు. అప్పుడప్పుడు తెలంగాణలో ఉంటున్న మహిళ వద్దకెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆస్తి కూడా ఆమె పేరునే రాసిస్తాడనే అనుమానం నెలకొని భార్య లక్ష్మి ఆందోళనకు గురైంది. దీంతో పిల్లలకు ఆస్తి దక్కాలనే ఆలోచనతో ఎలాగైనా భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఆమె... తన కుమారుడు ఆశ్రయ్, పెద్దవడుగూరు మండలం చిత్రచేడులో ఉంటున్న అక్క కుమారుడు శ్రీకాంత్ కలసి నల్లప్ప హత్యకు పథకం రచించారు. పథకంలో భాగంగా జూలై 23న నల్లప్ప ద్విచక్ర వాహనంపై వ్యవసాయ తోట వద్ద నుంచి తిరిగి వస్తుండగా జంబులదిన్నె కొట్టాల సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఇన్నోవా కారుతో ఢీకొని హతమార్చారు. హత్యకు ఉపయోగించిన కారును అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అయితే తొలుత ప్రమాదంలో రైతు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా భార్య, కుమారుడిని విచారణ చేయడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో లక్ష్మి, ఆమె కుమారుడు ఆశ్రయ్, అక్క కుమారుడు శ్రీకాంత్ని గురువారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ కౌలట్లయ్య, ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ భార్యనే సూత్రధారి కుమారుడు, అక్క కుమారుడితో కలసి కుట్ర నిందితుల అరెస్ట్ -
ఆటో కింద పడి చిన్నారి మృతి
గార్లదిన్నె: ప్రమాదవశాత్తు ఆటో కింద పడి ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన వెంకటనాయుడు కొంత కాలంగా గార్లదిన్నె మండలం కల్లూరు కొండ కింద కొట్టాలలో నివాసముంటున్నాడు. ఆయన కుమార్తె తనూజ (9) గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో వస్తుండగా ఇంటి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చే మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో ఆటోను డ్రైవర్ రివర్స్ చేశాడు. అయితే ఈ విషయం తెలియని తనూజ ఉన్నఫలంగా ఆటో దిగడంతో అదుపు తప్పి కిందపడింది. డ్రైవర్ గమనించేలోపు వాహనం బాలికపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అదే ఆటోలో పామిడిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. -
‘జేఎన్టీయూ’ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీటెక్ నాల్గో సంవత్సరం రెండో సెమిస్టర్ అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ, ఎంబీఏ రెండో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్/సప్లి, ఎంబీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) సప్లి, ఎంసీఏ రెండో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్/సప్లి, ఎంసీఏ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ, ఫార్మా డీ నాల్లో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–17) రెగ్యులర్/సప్లి ఫలితాలను గురువారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. ఫలితాల కోసం వర్సిటీ వెబ్సైట్ చూడాలని కోరారు. ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ మోసం ● అనంతలో పోలీస్ స్టేషన్ ఎదుట హిజ్రాలు, బాధితుల ధర్నా అనంతపురం: నగరంలోని లెక్చరర్స్ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు. ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు. దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ఏపీఎస్ఏపీఈ రాష్ట్ర అధ్యక్షుడిగా కూరపాటి
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్ఏపీఈ) రాష్ట్ర అధ్యక్షుడిగా శింగనమల మండలం పెరవలిలోని జెడ్పీహెచ్ఎస్ పీడీ కూరపాటి నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. గురువారం విజయవాడలో ఏపీఎస్ఏపీఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉద్యోగ విరమణ రోజే మృతిగుంతకల్లు రూరల్: వైద్య, ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీరస్గా పనిచేస్తున్న వసుంధర గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం పత్తికొండ మండలం పుచ్చకాలమాడ పీహెచ్సీలో పనిచేస్తున్నారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆమె ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వసుంధర.. ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ, సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించి వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కన్ను మూశారు.తాగుడుకు డబ్బు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్యరాప్తాడు రూరల్: తాగుడుకు డబ్బు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ సోములదొడ్డి పంచాయతీ పావురాలగుట్ట కాలనీలో నివాముంటున్న షాజహాన్ (45), గౌషియా దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో షాజహాన్ కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. పనీపాట చేయకుండా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ మద్యం తాగుతూ జులాయిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ తరచూ భార్యను వేధించేవాడు. గురువారం మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని అడగడంతో గౌషియా లేవని చెప్పింది. దీంతో క్షణికావేశానికి లోనైన షాజహాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గౌషియా ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.రైలు ఢీకొని వ్యక్తి మృతిచెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగలింగారెడ్డి (57) చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లిలో గురువారం జరిగిన అల్లుడి కర్మకాండలో పాల్గొంనేందుకు భార్య సుధారాణితో కలసి వచ్చాడు. ఈ క్రమంలో కర్మ కాండలు పూర్తయిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని వస్తానంటూ భార్యతో చెప్పి గ్రామ సమీపంలోని పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొంది. ప్రమాదంలో శరీరం ఛిద్రమై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హిందూపురం జీఆర్పీ ఎస్ఐ సజ్జప్ప అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం
అనంత వాసికి ట్రాఫిక్ పద్మవ్యూహం చుక్కలు చూపిస్తోంది. పది, ఇరవై నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్య స్థానాలకు కూడా గంటకు పైగా సమయం పడుతోంది. ఒక్కొక్కసారి ఈ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంది. వ్యూహాత్మకదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) అందుబాటులో ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టకపోవడంతో అనంత నగర ప్రజలు నిత్యమూ ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వాహనాల సంఖ్య సుమారు 12 లక్షలు ● చిక్కుకుంటే బయటపడటం కష్టం అనంతపురం: ‘అనంత’లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్నాయి. నగరంలో ఒకప్పడు గంటల్లో సాగిన ప్రయాణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బహుముఖ వ్యూహంతో చేపట్టిన పనుల వల్ల నిమిషాల్లోనే ముగుస్తూ వచ్చింది. అప్పట్లో చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నగర దారులను ప్రగతికి సోపానాలుగా మార్చేశాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రమంగా ట్రాఫిక్ కష్టాలు నగర వాసులను వెన్నాడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నిమిషాల్లో సాగిల్సిన ప్రయాణం... ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని గంటల సమయం పడుతోంది. ప్రతి జంక్షన్ పద్మవ్యూహమే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. నగరంలోని వ్యాపార కేంద్రాలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్, బస్టాండు దగ్గర వాహనాల రాకపోకలు జఠిలంగా మారాయి. రుద్రంపేట సర్కిల్, కళ్యాణదుర్గం రోడ్డు సర్కిల్, బళ్లారి రోడ్డు సర్కిల్, సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్, సూర్యనగర్ సర్కిల్, పాతూరు సర్కిల్, గాంధీ బజార్, తిలక్ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ నుంచి పాతూరుకు వెళ్లే మార్గం, శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే దారి, బస్టాండు వద్ద ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఉండడంతో దుకాణాలకు వచ్చే కొనుగోలుదారుల వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడంతో రోడ్డుపై ఉంచేస్తున్నారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం నెలకొంటోంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాహన చోదకులు అడ్డదిడ్డంగా దూసుకెళుతుండడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలతో పాటు వృద్దులు, పిల్లలతో వెళ్తున్న వారి అవస్థలు వర్ణనాతీతం. ఇసుక టిప్పర్లు, భారీ వాహనాలు సైతం అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్క్లాక్ మీదుగా వెళ్తున్నాయి. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలను రాత్రి సమయాల్లోనే నగరంలో ప్రవేశించేలా చర్యలు తీసుకోవడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు నగర పరిసర ప్రాంతాల నుంచి రోజూ 30 వేల మంది నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలతో రోడ్లు కిక్కిరిస్తున్నాయి. అంతేకాక నగర విస్తరణ కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఇందుకు ఇరుకై న రోడ్లు ఓ కారణమైతే, సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం మరో కారణంగా తెలుస్తోంది. ఫలితంగా నగరంలోని ప్రధాన కూడళల్లో అరగంట వరకు రోడ్లపై ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతూరులో గాంధీరోడ్డుతో పాటు, తిలక్ రోడ్డు, గాంధీ బజార్ విస్తరణకు నోచుకోలేకపోయాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. సంత వేళ నరకం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శని, ఆదివారాల్లో గొర్రెలు, మేకలు, పశువుల సంతలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజులూ కాపర్లు, వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మార్కెట్ యార్డు వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో సంతలు జరిగే రోజుల్లో జాతీయ రహదారిపైనే ఆటోలు, ద్విచక్రవాహనాలు, మినీ లారీలు, ట్రక్కులు ఆపాల్సి వస్తోంది. కోళ్లు, కొడవళ్లు, గొడ్డళ్లు, ఇతర సామాగ్రిని రహదారిపై విక్రయిస్తుంటారు. పశువులు, జీవాలను తరలించే వాహనాలు వందల సంఖ్యలో మార్కెట్ యార్డు నుంచి బయటకు వస్తుంటాయి. ఆ రెండ్రోజులు మార్కెట్ వద్ద ప్రయాణం వాహనదారులకు నరకం చూపిస్తోంది. విపరీత రద్దీతో ఆర్టీసీ బస్సులు నిదానంగా వెళుతుంటాయి. గంటకు పైగా సమయం నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రుద్రంపేట సర్కిల్లో తరచూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుంటారు. సాయంత్రం అయితే ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చిన వారు తమ వాహనానలు రోడ్డు పక్కనే పార్కింగ్ చేస్తుంటారు. ఆ సమయంలో కియా కార్ల కంపెనీకి సంబంధించిన బస్సులతో పాటు కర్ణాటకు వెళ్లే లారీలు రోడ్డుమీదే ఆగిపోతున్నాయి. మూడు వైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కసారి ఇక్కడ ట్రాఫిక్లో చిక్కుకుంటే బయటపడేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. –ఎం. బాబాఖాన్, అనంతపురం వాహనం అనివార్యం గతంలో పోలిస్తే అనంతపురంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుతం ద్విచక్రవాహనాలు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ఎప్పడుపడితే అప్పుడు భారీ వాహనాలు నగరంలోకి పట్టపగలే వస్తున్నాయి. భారీ వాహనాలను పగటి పూట నగరంలోకి రాకుండా నియంత్రించాల్సి ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్నాం. సప్తగిరి సర్కిల్, బస్టాండు, పాతూరు, శ్రీకంఠం సర్కిల్లో ట్రాఫిక్ను దాటుకుని వెళ్లాడమంటే యుద్ధం చేసినట్లే. – విష్ణువర్దనరెడ్డి, న్యాయవాది, అనంతపురం -
రాప్తాడులో రెచ్చిపోయిన దొంగలు
రాప్తాడు: మండల కేంద్రంలో పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ సమీపంలో బీసీ కాలనీలో నివాసముంటున్న బాధితుడు చిరుతల ఇటుకు నల్లప్ప తెలిపిన మేరకు.. రాప్తాడుకు చెందిన చిరుతల ఈశ్వరయ్య కుమారుడు గణేష్, అడ్ర వెంకటేశులు కుమారై సరిత వివాహం ఈ నెల 30న రాప్తాడులోని లక్ష్మీపండమేటి వేంకటరమణస్వామి ఆలయంలో జరిగింది. వివాహనికి బంధువైన ఇటుకు నల్లప్ప, తన భార్య శ్రీదేవితో కలసి వెళ్లాడు. వధూవరులిద్దరూ రాప్తాడుకు చెందిన వారు కావడంతో ఇరువైపులా కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి మెరిమణి నిర్వహించారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి మెరవణిలో నల్లప్ప దంపతులు పాల్గొన్నారు. విషయాన్ని గుర్తించిన దుండగులు తలుపులు ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించి బీరువాలోని ఏడున్నర తులం బరువున్న బంగారు నగలు, రూ.60వేల సొంత నగదు, ఇటుకుల పల్లయ్య స్వామి ఆలయానికి చెందిన రూ.85వేలు, మోటార్ మెకానిక్గా ఉన్న కుమారుడు శివయ్య బెంగళూరులో సామగ్రి కొనుగోలు చేసేందుకు ఇతరుల నుంచి అప్పుగా తెచ్చిన రూ.4.20 లక్షలను అపహరించారు. రాత్రి 11 గంటలకు మెరవణి పూర్తి కావడంతో 12 గంటలకు ఇంటికెళ్లిన దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీహర్ష, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. రూ.5.65 లక్షల నగదు చోరీ ఏడున్నర తులాల బంగారు నగలూ అపహరణ -
మఠం ఆస్తుల పరిరక్షణకు చర్యలు
ఉరవకొండ: కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న విలువైన గవిమఠం భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి తెలిపారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో అన్యాక్రాంతమైన రూ.కోటి విలువైన భూమిని న్యాయపోరాటంతో సాధించుకున్నట్లు వివరించారు. గురువారం స్థానిక గవిమఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాధికారి మాట్లాడారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా దేవసముద్రం హోబళి కృష్ణరాజపురం గ్రామంలో సర్వే నంబర్ 39లో మఠానికి రూ.కోటి విలువ చేసే 10 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిని సిద్దయ్య స్వామి అనే అర్చకుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్నారు. ఆయన మృతి అనంతరం అతని భార్య రుద్రమ్మ మఠం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో విషయం తెలిసి ఈ ఏడాది జూలై 16న చిత్రదుర్గ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం మఠానికి చెందిన భూమిని అర్చకుల పేరు మీద చేసేందుకు హక్కులేదని, వాటిని అర్చకులు అనుభవించేందుకు మాత్రమే వీలుందని న్యాయస్థానం వెల్లడి చేసిందన్నారు. రికార్డుల్లో పేర్లు మార్చడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను కోర్టు మందలించిందన్నారు. దీంతో ఆ భూమికి సంబంధించి హక్కులు గవి మఠానికి కల్పిస్తూ ఆన్లైన్ రికార్డుల్లో పొందుపరిచారన్నారు. ఉరవకొండ గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి -
పలువురికి బళ్లారి రాఘవ అవార్డులు
అనంతపురం కల్చరల్: జిల్లా వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కళాకారులకు బళ్లారి రాఘవ అవార్డులు దక్కాయి. ప్రపంచ నాటక రంగాన్ని ప్రభావితం చేసిన ‘అనంత’ రంగస్థల యోధుడు బళ్లారి రాఘవ జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం అనంతపురంలోని లలితకళాపరిషత్తులో ప్రత్యేక ఉత్సవాలు, సాంస్కృతిక, నాటక సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన నటులు, రచయితలకు పురస్కారాలనందిస్తున్నట్లు ఎల్కేపి కార్యదర్శి పద్మజ వెల్లడించారు. అవార్డులు దక్కిన వారిలో కర్నూలుకు చెందిన రామలింగేశ్వరరావు, బాపట్ల జిల్లా రేపల్లెకు నివాసి భూపతి ధర్మారావు, అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి కుళ్లాయప్ప, మల్లెల జయరామ్ ఉన్నారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ఎస్ఎం బాషా ఆధ్వర్యంలో ‘గోవు మా లచ్చిమి’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. -
భారీగా పడిపోయిన వేరుశనగ సాగు
● 1.82 లక్షల హెక్టార్ల అంచనా వేస్తే 40 వేల హెక్టార్లకే పరిమితం ● తీవ్రవర్షాభావం, ‘కూటమి’ సాయం లేకపోవడమే కారణం అనంతపురం అగ్రికల్చర్: ప్రధాన పంటగా దశాబ్దాల పాటు పేరుగాంచిన వేరుశనగ సాగు ఈ సారి కనిష్ట స్థాయికి పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కూటమి సర్కారు సకాలంలో నాణ్యమైన విత్తనం ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం అందించకపోవడం తదితర కారణాలతో వేరుశనగ పంట సాగకు రైతులు ముందుకు రాలేదు. దీంతో ఈ ఖరీఫ్లో 1.82 లక్షల హెక్టార్లుగా అంచనా వేసినా... చివరకు 40 వేల హెక్టార్ల వద్ద నిలిచిపోయింది. ఇందులోనూ చాలాచోట్ల నీటి వసతి కింద సాగు చేశారు. ఇక పంట విత్తుకునే సమయం జూలై నెలాఖరుతో ముగియడంతో సీజన్ ముగిసేలోపు వేరుశనగ సాగు 50 వేల హెక్టార్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాధారంగా విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయినట్లు చెబుతున్నారు. దెబ్బతీసిన జూలై వర్షాలు.. సాధారణంగా ఖరీఫ్లో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూలై నెల మంచి అదను. అయితే జూలైలో వరుణుడు ముఖం చాటేయడంతో ఖరీఫ్ ఏరువాకపై తీవ్ర ప్రభావం చూపింది. జూలైలో 64.3 మి.మీ గానూ 34.5 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కన్నా 46.2 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. జూన్లో కూడా 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. ఇలా సీజన్ ప్రారంభమైన కీలకమైన మొదటి రెండు నెలల్లోనే 125.5 మి.మీ గానూ 35 శాతం తక్కువగా 82.4 మి.మీ వర్షపాతం నమోదు కావడం ప్రధాన పంటల సాగుకు అవరోధంగా మారింది. కణేకల్లు, కుందుర్పిలో మాత్రమే సాధారణం కన్నా కాస్త అధికంగా వర్షాలు కురిశాయి. ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగతా 23 మండలాల్లో వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. 10 మండలాల్లో అయితే సాధారణం కన్నా 50 నుంచి 70 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం.. ఈ ఖరీఫ్లో 3,42,232 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణంగా అంచనా వేయగా ఇప్పటి వరకు 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చి ఉంటాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇంకా 2 లక్షల హెక్టార్ల వరకు భూములు బీళ్లుగానే ఉంటాయి. ప్రతి శనివారం మండలాల నుంచి సాగు విస్తీర్ణం గణాంకాలు సేకరిస్తున్నారు. ఆగస్టులో వేరుశనగ సాగు చేయకూడదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఆగస్టు 15 వరకు కంది, ఆముదం, పత్తి, కొర్ర, సజ్జ విత్తుకోవచ్చని సూచించారు. ఆగస్టు 15 తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని తెలిపారు. సాగు గడువు ముగియడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికపై దృష్టి సారించారు. మండలాల నుంచి విత్తన ప్రతిపాదన నివేదికలు తీసుకుంటున్నారు. -
టీడీపీ సర్పంచ్ దౌర్జన్యం
● తనది కాని భూమిలో చొరబడి విత్తనం వేసిన వైనం ● ఎలా వేస్తారంటూ ప్రశ్నించిన రైతుపై దౌర్జన్యం ఉరవకొండ(విడపనకల్లు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఈ పరిస్థితి తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా విడపనకల్లు మండలం జనార్దనపల్లికి చెందిన టీడీపీ సర్పంచ్, తన అనుచరులతో కలసి తనది కాని భూమిలో దౌర్జన్యంగా విత్తనం వేయడం కలకలం రేపింది. ఉరవకొండ పట్టణానికి చెందిన బాధిత రైతు జయకుమార్ విడపనకల్లు డిప్యూటీ తహసీల్దార్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. 2023, జూన్ 24న జనార్దనపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 141లో 21.05 ఎకరాల భూమిని రైతు జయకుమార్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమిలో మిర్చి, కందులు తదితర పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం ఆ గ్రామ సర్పంచ్ జనార్దననాయుడు, మరికొందరు టీడీపీ నాయకులు ఆ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ట్రాక్టర్తో కంది విత్తనం వేశారు. విషయం తెలుసుకున్న జయకుమార్, ఆయన కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సర్పంచ్ను నిలదీశారు. ఆ సమయంలో బాధిత రైతు, ఆయన కుటుంబసభ్యులపై సర్పంచ్ దౌర్జన్యం చేస్తూ దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోవాలని బెదిరింపులకు దిగారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్, డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపాడు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని వాపోయాడు. -
కొత్త కార్డులు.. కళ్లకు కాయలు
కొత్త రేషన్ కార్డు మంజూరు కావడం లేదు. కార్డులోకి పేరు చేర్చమంటున్నా పట్టించుకోవడం లేదు. కార్డుకు సంబంధించి ఆధార్ సీడింగ్ కరెక్షన్, తొలగింపు తదితర ప్రక్రియలనూ అటకెక్కించారు. కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణితో జిల్లాలో పేద ప్రజలు విసిగిపోతున్నారు. రేషన్ సరుకుల్లో కోత మినహా కొత్త కార్డుల గురించి పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేద ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం కానరావడం లేదు. దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. దరఖాస్తులు తీసుకున్నాం.. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్డులు ఇస్తాం అంటూ ఏడాదిగా కాలం వెళ్లదీస్తుండడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో 35 వేల మంది పైగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు అందజేశారు.బుట్టదాఖలు..కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగి ఉంటాయి. లేదా పిల్లలు పెద్దవాళ్లై ఉంటారు. అలాంటి వారి పేర్లు రేషన్ కార్డులోకి చేర్చాలి. కానీ అర్హులు ఏడాదిగా బతిమాలుతున్నా చేర్చడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది తమ పేరును రేషన్ కార్డులో చేర్చాలని దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకూ అతీగతీ లేదు. దరఖాస్తులు చెత్తబుట్టల్లో వేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నడూ లేదు..మృతి చెందిన వారి కార్డులు తొలగించి ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత సర్కారు హయాంలో ఎప్పుడూ సంతృప్త స్థాయిలో ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచి దరఖాస్తు చేసుకోగానే మంజూరు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది నుంచి కొత్త రేషన్ కార్డుల ఊసే లేకుండా పోయింది. ఇందుకోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇక చిరునామాలు, పేర్లలో మార్పులకు అసలు దిక్కేలేదు.రేషన్లో కోత మినహా..రేషన్ సరుకుల్లో కోత మినహా కూటమి సర్కారు చేస్తున్నదేమీ లేదని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. గతంలో గోధుమలు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆరునెలలుగా వాటిని ఇవ్వడం లేదు. జొన్నలూ లేవు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో 8 వేల మందికి పైగా వృద్ధులకు రేషన్ అందడం లేదు. -
నాలుగు మండలాలకు ఎంఈఓల నియామకం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు మండలాలకు ఎంఈఓలను నియమించారు. కుందుర్పి మండల విద్యాశాఖ అధికారిగా రాయదుర్గం ఉన్నత పాఠశాల హెచ్ఎం కే.శంకరన్న, డి.హీరేహాళ్ మండల విద్యాశాఖ అధికారిగా గుంతకల్లు ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ టి.వేణుగోపాలరావు, కంబదూరు మండల విద్యాశాఖ అధికారిగా అనంతపురం నంబర్– 2 ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచరు బి.ఉమాపతి, గుమ్మఘట్ట మండల విద్యాశాఖ అధికారిగా కళ్యాణదుర్గం కేసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచరు పి.సోమశేఖర్ (ఎఫ్ఏసీ)ను నియమిస్తూ పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో డి.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాలరావు శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నారు. తక్కిన ముగ్గురూ గురువారం బాధ్యతలు చేపట్టారు.డీసీహెచ్ఎస్గా డేవిడ్ సాల్విన్ రాజ్అనంతపురం మెడికల్: డీసీహెచ్ఎస్గా డాక్టర్ డేవిడ్ సాల్విన్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన డీసీహెచ్ఎస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. తాడిపత్రి ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా ఉన్న ఆయన్ను ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్గా నియమించారు. గతంలో ఈయన ప్రొద్దుటూరు, పులివెందుల ఏరియా ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్గా పని చేశారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ డేవిడ్కు సిబ్బంది అభినందనలు తెలిపారు.గురుకులాల్లో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లుఅనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. బాలికలకు ఉరవకొండ కళాశాలలో ఎంఈసీ గ్రూపులో ఎస్సీ–18, ఎస్టీ–2, ఓసీ–1, సీఈసీలో ఎస్సీ–1, ఎస్టీ–1, ఓసీ–1, బ్రహ్మసముద్రం కళాశాలలో హెచ్ఈసీలో ఎస్సీ–9, ఎస్టీ–1, ఓసీ–1, సీఈసీలో ఎస్సీ–6, నల్లమాడ కళాశాలలో సీఈసీలో ఎస్సీ–39, ఎస్టీ–3, ఓసీ–1, బాలురకు సంబంధించి కణేకల్లు కళాశాలలో బైపీసీలో బీసీ–2, ఎస్సీ–1, కాళసముద్రం కళాశాలలో ఎంపీసీలో ఎస్టీ–1, బైపీసీ గ్రూపులో బీసీ–2, ఎస్సీ–2 సీట్లు ఖాళీలున్నాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు నేరుగా సర్టిఫికెట్లతో ఆయా కళాశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందవచ్చన్నారు. అలాగే పప్పూరులోని బాలుర ఐఐటీ, నీట్ కళాశాలలో బైపీసీ గ్రూపులో ఎస్సీ–2 సీట్లు ఖాళీలున్నాయన్నారు. పదో తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాల్లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. -
రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలే
అనంతపురం కార్పొరేషన్: ‘ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతాంగం కరువు కోరల్లో చిక్కుకున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. కరువు పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు ప్రణాళిక రూపొందించలేదు. రైతాంగం పట్ల ఇంత నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వాన్ని నా ప్రజా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20,000 ఇంత వరకు ఇవ్వలేదు. రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలు తప్పవు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంతో సంబంధం లేకుండా ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేంద్రంతో కలిపి ఇస్తామని చెబుతుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే తొలి ఏడాది రైతులను ఎగనామం పెట్టారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 53.58 లక్షల మంది రైతులకు ఏటా రైతు భరోసా పథకం కింద రూ.13,500 అందజేశారన్నారు. ఉమ్మడి అనంత పురం జిల్లాలో 5.74 లక్షల మంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. రైతులు నేడు ఈ–కేవైసీ, ఎన్పీసీఐ లింక్ కోసం కష్టాలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. ‘తల్లికి వందనం’ తరహాలో ‘అన్నదాత సుఖీభవ’లో రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేదని, కూటమి ప్రభుత్వంలో రైతులే ప్రీమియం చెల్లించాలని బాబు నిబంధన పెట్టారని దుయ్యబట్టారు. బీమా ప్రీమియం గడువు ముగిసినా నేటికీ చాలా మంది రైతులు కట్టలేదన్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీలో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, ఈ ఏడాదీ అదే పరిస్థితిని కొనసాగించి రైతులను నిలువునా ముంచుతారా? అని ప్రశ్నించారు. సమీక్ష నిర్వహించాలి.. రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘అనంత’ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలుగా ఉందని, కానీ ఈ ఏడాది కార్తెలు దాటిపోయినా ఇప్పటి వరకు కేవలం 3.94 లక్షల ఎకరాల్లోనే వివిధ పంటల సాగు చేశారన్నారు. వేరుశనగ 8 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసేవారుంటే ప్రస్తుతం 1.63 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నా ప్రణాళిక లేకపోవడంతో నీరు సముద్రం పాలవుతోందని వాపోయారు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించలేదన్నారు. బ్లాక్లో ఎరువులు.. హెచ్ఎల్సీ కింద అక్కడక్కడా నాట్లు వేద్దామనుకుంటే ఎరువుల కొరత వేధిస్తోందన్నారు. జిల్లాలో రైతాంగం బ్లాక్లో ఎరువులు కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్యపు స్థితికి అధికారులు తీసుకువచ్చారని మండిపడ్డారు. అక్కరకు రాని ఫర్టిలైజర్స్ కొనుగోలు చేస్తేనే ఎరువులు ఇస్తామంటూ చెబుతున్నారని, దీని వెనుక అధికారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవాలని కోరితే తమపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయిందన్నారు. ఏది ఏమైనా రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతులు, రాజకీయ పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు హామీ మేరకు రైతులను ఆదుకోవాల్సిందే గత ప్రభుత్వంలో 53.58 లక్షల మందికి ‘భరోసా’ ఇచ్చాం అన్నదాతలను ఆదుకునే దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి తప్పనిసరి
అనంతపురం అర్బన్: అహుడా పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు కచ్చితంగా అనుమతి పొందాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. అహుడా పరిధిలో వీలైనంత ఎక్కువగా భూ బ్యాంక్ గుర్తించాలని చెప్పారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అహుడా ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనంతపురం, మడకశిర, కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో అహుడా చేపట్టిన పనులు, వాటి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహుడా పరిధిలో ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోని వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారితో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. నగర, పట్టణ కేంద్రాల్లో నివాసయోగ్యమైన ప్రాంతాలకు దగ్గరగా భూములను ఎంపిక చేయాలని చెప్పారు. భూ సేకరణ క్రమంలో పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు.లే అవుట్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో అహుడా కార్యదర్శి జి.రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ అధికారి ఇషాక్, ఈఈ దుష్యంత్, జేపీఓ హరీష్, సర్వేయర్ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ‘అన్నదాత సుఖీభవ’కు ఏర్పాట్లు చేయండి ‘అన్నదాత సుఖీభవ పథకం’ ఈనెల 2న ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈనెల 2న ప్రకాశం జిల్లా దర్శిలో పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం వీక్షణకు ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. సచివాలయ స్థాయిలోనూ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో 2,80,418 మంది అర్హులైన రైతులు ఉండగా, ఇందులో 2,74,210 మంది రైతులకు ఈ–కేవైసీ పూర్తయ్యిందన్నారు. 5,579 మందికి ఈ–కేవైసీ తిరస్కరణ జరిగిందన్నారు. 629 మంది ఈ–కేవైసీ పెండింగ్లో ఉందని, ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించాలని చెప్పారు. ప్రతి రైతుకూ లింక్ షేర్ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లోని ‘మీ స్థితిని తెలుసుకోండి’ ఎంపిక ద్వారా రైతుల అర్హత, అనర్హత కారణాలను పరిశీలించుకోవచ్చన్నారు. ఎన్ీపీసీఐ లింక్ కానివారు యాక్టివేట్ చేసుకోవాలని కోరారు. ఆధార్ను బ్యాంక్ ఖాతాకు జత చేయాలని సూచించారు. ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ -
హిజ్రాలకు టీడీపీ నేతల టోకరా
సాక్షి, అనంతపురం: ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు హిజ్రాలను మోసం చేశారు. నగరంలోని లెక్చరర్స్ కాలనీ వెనుక ఉండే ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హిజ్రాలు, పలువురు బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న సదరు స్థలంలో ఇప్పటికే 120 మంది గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామన్నారు.ఈ క్రమంలో తమకు పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ బి.హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబ్బాషా, బాబు వసూలు చేశారని, పట్టాలు ఇప్పించకపోగా, నగదు వెనక్కి ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బు వెనక్కు చెల్లించమంటే బతకలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో హిజ్రాలు నగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన చేశారు. దీంతో మోసం చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వివాదంలో సినీ నటుడు రోలర్ రఘు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: సినీ నటుడు రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. మడకశిర మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి రోలర్ రఘు హాజరయ్యారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కలిసేందుకు రోలర్ రఘు మడకశిర వెళ్లారు. ఆయన్ను.. మడకశిర నగర పంచాయతీ సమావేశానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీసుకెళ్లారు.మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై సినీ నటుడు రోలర్ రఘు కనిపించారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి పాలకవర్గ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే అర్హులు. అయితే, యాక్టర్ రోలర్ రఘు హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను అభాసుపాలు చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
ధనదాహం.. దౌర్జన్యం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కంపెనీలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ససేమిరా అంటున్నారు. కూటమి నేతల దెబ్బకు ఒక్క కొత్త కంపెనీ కూడా రాని దుస్థితి నెలకొంది. ఇటీవల గ్రీన్టెక్ రీమిక్స్ కంపెనీ ప్రతినిధులపై మంత్రి సవిత అనుచరులు బెదిరింపులకు దిగిన విషయం మరచిపోకముందే.. తాజాగా ‘కియా’ కార్ల పరిశ్రమల్లో కాంట్రాక్టుల కోసం మంత్రి అనుచరులు రభస చేయడం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. చిన్న పరిశ్రమ స్థాపనకు రేకుల షెడ్డు వేసినా ఎమ్మెల్యేలు వసూళ్లకు తెగబడుతుండడంతో పెట్టుబడిదారులు రావడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం దారుణంగా పడిపోయింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యంత అనువైన ప్రాంతంగా పేరుపొందింది. అలాంటి జిల్లాలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కూటమి సర్కారు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. కూటమి సర్కారు వచ్చి 13 మాసాలు దాటినా శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క చిన్న పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. గ్రీన్టెక్ రీమిక్స్ కంపెనీకి బెదిరింపులు.. కూటమి ప్రజాప్రతినిధుల ముడుపుల దాహానికి పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రూ.10 లక్షల పెట్టుబడి పెట్టేందుకు కూడా వెనుకడుగు వేస్తున్న దుస్థితి నెలకొంది. పెనుకొండ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా గ్రీన్టెక్ రీమిక్స్ కంపెనీ నడుస్తోంది. కూటమి సర్కారు రాగానే ఆ కంపెనీని సొంతం చేసుకోవాలని ఆ ప్రాంత మంత్రి పట్టుబట్టారు. అందుకు ఒప్పుకోక పోవడంతో కంపెనీకి ముడిసరుకు సప్లై కాకుండా ఆపివేయించారు. దీంతో విధిలేక సదరు కంపెనీ ప్రతినిధులు టీడీపీకి చెందిన ఎంపీతో మాట్లాడుకుని ప్లాంటులో 50 శాతం భాగస్వామ్యం ఇచ్చారు. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన మంత్రే బెదిరింపులకు పాల్పడిన అంశం ఉమ్మడి జిల్లాలో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కియాలో దౌర్జన్యకాండ.. డీజిల్, మట్టి దందాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి.. తాజాగా ‘కియా’ పరిశ్రమపై కన్నుపడింది. ‘కియా’లో పలు రకాల కాంట్రాక్టులు థర్డ్ పార్టీకి ఇస్తారు. ఎప్పట్నుంచో ఇది నడుస్తున్నదే. కియా చుట్టూ పలు అనుబంధ పరిశ్రమలూ వచ్చాయి. అయితే కియాలో కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరులు రెండు రోజుల క్రితం దౌర్జన్యానికి దిగారు. మంత్రి అనుచరులు వందల మంది రావడంతో కియా కంపెనీ ప్రతినిధులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కియా తన మానస పుత్రిక అని చెప్పుకునే చంద్రబాబు.. తన కేబినెట్లోని మంత్రే బెదిరిస్తుండటాన్ని నిలువరించలేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. భూమి పూజ రోజు నుంచే.. ఏదైనా పరిశ్రమ పెడదామని ఎవరైనా భూమి పూజ చేస్తే ఆ రోజునుంచే ఎంత ఇస్తారు, ఇవ్వకపోతే పరిశ్రమలు నడుపుకోలేరు అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి. చివరకు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉన్న ధాబాలు, హోటళ్లను సైతం నేతలు వదలడం లేదు. నెలనెలా మామూళ్లు ఇవ్వకపోతే ఇక మీ ఇష్టం అంటూ బెదిరిస్తున్నారు. సర్కస్ కంపెనీలు నడవాలన్నా ముడుపులు డిమాండ్ చేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలూ పోతున్న దుస్థితి నెలకొంది. అక్రమార్జనకు ‘తమ్ముళ్ల’ అర్రులు చెప్పినట్లు వినకుంటే దౌర్జన్యాలు ఇప్పటికే తారస్థాయికి ప్రజాప్రతినిధుల దందాలు భయభ్రాంతులకు గురవుతున్న పారిశ్రామికవేత్తలు కూటమి సర్కారు వచ్చాక ఒక్క కొత్త పరిశ్రమా ఏర్పాటు కాని వైనం -
పరామర్శకు వెళ్తే కేసులు పెట్టారు..
‘అమ్మా’ అనే పిలుపులేకుండా చేశారు రాప్తాడురూరల్: అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గాలిమాటలుగా మారాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు.‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతపురం నగర శివారు టీవీ టవర్ సమీపంలో ఎస్జేఆర్ ఫంక్షన్ హాలులో రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, బుక్కచెర్ల నల్లపరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశానికి రాప్తాడు నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చెప్పిన హామీలు చెప్పకుండా కొత్త హామీలతో మోసం చేయడం చంద్రబాబు నైజం అన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలులో అతుకులు బొతుకులే ఉన్నాయన్నారు. కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 పథకాలు తుస్సుమన్నాయన్నారు. ఏడాదిలో రూ. 1.80 లక్షల కోట్లు అప్పులు తేవడమే బాబు సృష్టించిన సంపద అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కట్టుకథలన్నీ ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పాడి మహిళా రైతుల కోసమే తన సొంత నిధులతో ‘అమ్మా’ డెయిరీని ఏర్పాటు చేశానన్నారు. డెయిరీ నిర్వహణకు ఇబ్బందులు కల్గించారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ చూపిస్తే అమూల్ డెయిరీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు. దేవర దున్నపోతుల్లా వదిలారు.. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో అక్రమ వసూళ్లకు పరిటాల కుటుంబ సభ్యులు, బంధువులను దేవర దున్నపోతుల్లా వదిలారని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పరిటాల కుటుంబం కోసం కేసుల్లో ఇరుక్కున్న బీసీ,ఎస్సీ,ఎస్టీల గురించి ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. పరిటాల సునీత కుమారులు, సోదరులు వసూల్ రాజాల అవతారం ఎత్తారన్నారు. అనంతపురం రూరల్,ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా పరిటాల కుటుంబానికి కప్పం కట్టాలంట... ఇదేమైనా వాళ్ల నాయన గంటా అని మండిపడ్డారు. కక్కలపల్లి టమాట మండీలో ‘పరిటాల శ్రీరామ్ ట్యాక్స్’ విధిస్తున్నారని, ఒక్కో బండికి రూ. 2,500 వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పరిటాల కుటుంబం రూ. 30 కోట్లు వసూలు చేసిందన్నారు. వీరి దురాగతాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సాగుతున్న రౌడీ రాజ్యాంగాన్ని అంతమొందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అనంతరం ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్లు విడుదల చేశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లను ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చిత్రంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ నేతలు,సమావేశానికి హాజరైన నాయకులు మోసం చేయడం ఆయన నైజం రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో తారస్థాయికి ‘పరిటాల’ దందాలు అక్రమ కేసులకు భయపడేది లేదు రౌడీ రాజ్యాంగాన్ని అంతమొందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ‘రామగిరి మండలంలో ఒక దళిత బాలికను టీడీపీ గూండాలు గ్యాంగ్రేప్ చేశారు. ఈ విషయంపై నిరసన తెలియజేసేందుకు వెళ్తుంటే అరెస్ట్లు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. ఎస్సీ నాయకులపై కూడా కేసులు బనాయించారు. మహిళలను మానభంగం చేస్తే ప్రశ్నించకూడదా? ఇటీవల అరవిందరెడ్డి అనే టీడీపీ కార్యకర్త ధర్మవరంలో ప్రెస్మీట్ పెట్టి పరిటాల రవీంద్ర వందమంది రెడ్లను హత్య చేయించాడన్నందుకు పరిటాల శ్రీరామ్ గూండాలు అతడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఇది రెడ్బుక్ రాజ్యాంగం కాదా? పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో తనకు ఎదురులేదనుకుంటున్నాడు. ధర్మవరం చరిత్రలో చేనేతల జోలికి ఎవరూ వెళ్లలేదు, కానీ శ్రీరామ్ వారినుంచి కూడా బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నాడు. ఆస్తులు కూడా లాక్కుంటున్నాడు’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అక్రమంగా తమ భూమిని కాజేసేందుకని తనకు ‘అమ్మా’ అనే పిలుపులేకుండా చేశారని రాప్తాడులో ఇటీవల టీడీపీ నాయకుల చేతుల్లో హత్యకు గురైన చిగిచెర్ల నారాయణరెడ్డి, చిగిచెర్ల ముత్యాలమ్మల కుమారుడు ప్రదీప్కుమార్రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. పరిటాల సునీత, ధర్మవరపు మురళీ అండతోనే హత్యకు పాల్పడ్డారని, తన కళ్లముందే కొడవళ్లు, కట్టెలతో తన తల్లిదండ్రులపై దాడి చేశారని వాపోయాడు. టీడీపీ నాయకులు కనికరం లేకుండా తనకు అమ్మా అనే పిలుపులేకుండా చేశారని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హత్య కేసులోని ముగ్గురు నిందితులు ఇప్పటికీ బయటే తిరుగుతున్నారని, నిందితుల ఇళ్లకు పరిటాల సునీత, మురళీ తదితరులు వెళ్లిపరామర్శించి వచ్చారని చెప్పాడు. ఇంకోవైపు తన తండ్రి టీడీపీ నాయకుడంటూ ప్రచారం చేసి రాజకీయం చేయాలని చూశారని, మరి వారు మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించాడు. ‘ప్రకాష్రెడ్డి మా కుటుంబానికి అండగా నిలిచారు. మా కుటుంబం చచ్చేదాకా వైఎస్సార్సీపీతోనే ఉంటుంది’ అని స్పష్టం చేశాడు. -
ఐదు మండలాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు
అనంతపురం అర్బన్: జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ–సర్వే, చుక్కల భూముల, పీజీఆర్ఎస్, పౌర సరఫరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని చెప్పారు. రెవెన్యూ సెక్టార్, పౌర సరఫరాలు, తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఎస్ఓ, తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుంత కల్లు, పుట్లూరు, కుందుర్పి, యల్లనూరు, కూడేరు మండలాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రకియకు సోలార్ ప్రవర్ ప్రాజెక్టుల అధికారులు సహకరించాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నారు. చౌక ధరల దుకాణాలను తహసీల్దార్లు, సీఎస్డీటీలు, ఎంఎల్ఎస్ పాయింట్లను ఆర్డీఓలు తనిఖీ చేయాలని ఆదేశించారు. రీ–సర్వే, రైల్వే, నెడ్క్యాప్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. కాన్ఫరెన్స్లో డీఆర్ఓ ఎ.మలోల, డీఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీకి సిద్ధంకండి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1 నుంచి పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అంశంపై బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్లో సమీక్షించారు. జిల్లాలో 2.80 లక్షల మంది పింఛనుదారులకు రూ.124.99 కోట్లు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పంపిణీ ప్రక్రియ ఒకటో తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించాలని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను సొమ్ము అందించాలని ఆదేశించారు. పింఛను పంపిణీ తీరుపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందన్నారు. ఏదేని కారణం చేత పింఛన్లు పంపిణీ కాకపోతే వాటి సొమ్మును రెండు రోజుల్లోగా బ్యాంక్లో కట్టాలని ఆదేశించారు. కొత్తగా చేరిన డీడీఓల నమూనా సంతకాలను ఆయా బ్యాంకు ఖాతాల్లో నవీకరించాలని ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో డీఆర్డీఏ పీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకద్రోహులకు బుద్ధి చెప్పండి
గుంతకల్లు టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన నమ్మకద్రోహుల కూటమికి తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. బుధవారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన తిలక్నగర్ తదితర ఏరియాల్లో పర్యటించారు. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు ఎంత మేరకు వస్తున్నాయని ప్రజలు, చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గమన్నారు. స్మార్ట్ మీటర్లను బిగిస్తే వాటిని పగలగొట్టాలని యువగళం పాదయాత్రలో పిలుపునిచ్చిన నారా లోకేష్.. ఇప్పుడు మాట తప్పాడని విమర్శించారు. రానున్న రోజుల్లో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల నిలువుదోపిడీని ఆపాలని, ప్రమాదకర స్మార్ట్మీటర్లు రద్దు చేయాలని, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించరాదని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల భారాల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న గుంతకల్లులోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు నాగరాజు, రమేష్, రంగమ్మ, చంద్ర, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ -
వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్: గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన అడ్డుకుంటారనే సాకు తో బుధవారం వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో విద్యార్థి విభాగం రాష్ట్ర నేత షెక్షావలి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు గూబనపల్లి నాగరాజు, కో ఆప్షన్ సభ్యుడు సల్లా మారుతి, మమతా సురేష్, నాయకులు బిక్కి హరి, చరణ్, దొడగట్ట మురళి, ఎరికల రమేష్, అజయ్, టైలర్ శీన, సూరి, వడ్డే అజయ్ ఉన్నారు. ఉదయం అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్ట్ను వైఎస్సార్సీపీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షుడు బొమ్మయ్య ఖండించారు. వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు చీకటి మయం అయ్యాయని మండిపడ్డారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. రైతుకు న్యాయం చేస్తాం పెద్దపప్పూరు: కళింగర పంట సాగు చేసి నష్టపోయిన రైతుకు న్యాయం చేస్తామంటూ హెచ్ఓ ఉమాదేవి, ఏఓ మహిత భరోసా ఇచ్చారు. పెద్దపప్పూరు మండలం పసలూరు గ్రామానికి చెందిన రైతు మద్దా ప్రసాద్ 43 రోజుల క్రితం సాగు చేసిన కళింగర పంట ఎదుగుదల లేక నష్టపోయిన అంశంపై ‘విత్తన లోపమా.. ప్రకృతి శాపమా’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై వారు స్పందించారు. బుధవారం ఉదయం పసలూరుకు చేరుకుని పంటను పరిశీలించారు. విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేసింది రైతు ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. పంట ఎదుగుదల లేదని నిర్ధారించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించే వరకూ పంట తొలగించరాదని సూచించారు. కుక్కల దాడిలో మేకల మృతి గుమ్మఘట్ట: కుక్కల దాడిలో 12 మేకలు మృతిచెందాయి. గుమ్మఘట్ట మండలం కోనాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేకల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్న గ్రామానికి చెందిన ఓబులేసు తన వద్ద ఉన్న 25 మేకలను మంగళవారం రాత్రి గ్రామంలోని పాకలో వదిలి ఇంటికెళ్లి నిద్రించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మందపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ కుక్కలను అదిలించారు. అప్పటికే 12 మేకలు మృతి చెందాయి. ఘటనతో రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. -
కనుల పండువగా రథోత్సవం
విడపనకల్లు: మండలంలోని పాల్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఉండబండ వీరభద్రస్వామి రథోత్సవం బుధవారం కనుల పండువగా సాగింది. మండలంలోని ఉండబండ, పాల్తూరు, చీకలగురికి, విడపనకల్లు, కరకముక్కల, గాజుల మల్లాపురం, ఉరవకొండ, కర్ణాటకలోని బళ్లారి, గదగ్, చిక్మంగుళూర్, శివమొగ్గ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఉదయం ఆలయంలో వీరభద్రస్వామి, కాళికాదేవి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం వేలాది భక్తుల గోవింద నామస్మరణ మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమపై కూటమి ప్రభుత్వానికి నిజంగా ప్రేమే ఉంటే పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయాలి. రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లతో హంద్రీ–నీవా, గాలేరు నగరి, హెచ్ఎల్సీ తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చు. పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయకుండా సీమకు అన్యాయం జరిగిందంటూ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడడం సరికాదు’ అని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తే ఎక్కడ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకొచ్చారన్నారు. రూ.81,900 కోట్లతో ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామంటున్నారని, కానీ కేవలం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ రైతాంగానికి మేలు చేసినవారవుతారని హితవు పలికారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉంటే..దాన్ని తామే చేపడుతామని చంద్రబాబు తెచ్చుకున్నారన్నారు. తన హయాంలో దివంగత నేత వైఎస్సార్ కేంద్రాన్ని ఒప్పించి 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం డ్యాం నిర్మించేలా అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ‘పోలవరం’ స్పిల్ వే పనులు పూర్తి చేశారన్నారు. డ్యాం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రం ఆమోదిస్తే.. అందుకు సీఎం చంద్రబాబు అంగీకరించి, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. బనకచెర్ల–పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తీరును తప్పుబడుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్టర్ మల్లూజీ ఉపాధ్యాయ 14 పేజీల లేఖ రాశారన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారని, నిజంగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలనుకుంటే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేసి న్యాయం చేయాలన్నారు. కేవలం మాటలకు పరిమితం కాకూడదన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేయడానికి ప్రజలు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రసాద్, దీపు, శివశంకర్, పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ -
ద్విచక్ర వాహనాల ఢీ – మహిళ మృతి
పెద్దపప్పూరు: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(60) బుధవారం ఉదయం తన కుమారుడు రామాంజనేయులుతో కలసి పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. రామాంజనేయులుతో పాటు ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. కాగా, నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎర్రిస్వామి సెల్ఫోన్లో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనపై ఎస్ఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జిల్లాకు 2,152 మెట్రిక్ టన్నుల ఎరువులు అనంతపురం అగ్రికల్చర్: వివిధ కంపెనీల నుంచి 2,152 మెట్రిక్ టన్నుల ఎరువులు బుధవారం జిల్లాకు సరఫరా అయ్యాయి. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్కు వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులను రేక్ ఆఫీసర్, ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్ పరిశీలించారు. కోరమాండల్ కంపెనీ నుంచి 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు 1,316 మెట్రిక్ టన్నులు, ఫ్యాక్ట్ కంపెనీ నుంచి 836 మెట్రిక్ టన్నుల అమ్మోనియం సల్ఫేట్ వచ్చిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ఎస్కేలు, సొసైటీలు, ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు సరఫరా చేయడంతో పాటు మిగిలినవి కంపెనీ గోదాముల్లో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. మట్కా బీటర్ల అరెస్ట్ తాడిపత్రి టౌన్: మండలంలోని చుక్కలూరు క్రాస్ వద్ద మట్కా రాస్తున్న ఇద్దరు బీటర్లను బుధవారం అరెస్ట్ చేసి, రూ.1,01,770 నగదు, పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ధరణీబాబు తెలిపారు. పట్టుబడిన వారిలో కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన కాకర్ల రాఘవేంద్ర, కాకర్ల మల్లికార్జున ఉన్నారు. రెండు నెలల క్రితం చుక్కలూరు క్రాస్కు వలస వచ్చిన వీరు అక్కడే నివాసముంటున్నారు. అందిన పక్కా సమాచారంతో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ టీ దుకాణం వద్ద మట్కా పట్టీలు చూసుకుంటున్న ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జగన్ నాయకత్వానికి ఎన్ఆర్ఐల అండ: ఆలూరి
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి ఎన్ఆర్ఐలు అండగా నిలుస్తున్నారని ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను పలువురు ఎన్ఆర్ఐలతో కలసి ఆలూరు సాంబశివారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో సుబ్బరామిరెడ్డి (డల్లాస్ – యూఎస్ఏ), మధు శ్రీధర్, చాళుక్య రెడ్డి, హుస్సేన్ (యునైటెడ్ కింగ్డమ్), గుణశేఖర్, అభిలాష్ (కెనడా), రమేష్ పనాటి (న్యూజిలాండ్), ప్రసన్నకుమార్ రెడ్డి (ఆస్ట్రేలియా), ఇలియాజ్ (గల్ఫ్ కన్వీనర్), సయ్యద్ అక్రం, గూడూరు కోటేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్లా, అరుణ్ చక్రవర్తి, చిన్న నాగముని గుండ్లూరు (దుబాయ్), షా హుస్సేన్ (కువైట్) ఉన్నారు. ఆర్టీసీ ఆర్ఎంకు ఆత్మీయ వీడ్కోలు అనంతపురం క్రైం: ఆర్టీసీ ఆర్ఎం సుమంత్.ఆర్.ఆదోనికి ఎన్ఎంయూ నేతలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్ఎం కార్యాలయంలో సుమంత్.ఆర్.ఆదోనిని ఎన్ఎంయూ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు మాట్లాడుతూ.. ఐదున్నరేళ్లుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి ప్రతాప్, శ్రీరామ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ– స్టాంపు నిందితులకు బెయిల్ కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం నకిలీ ఈ–స్టాంపుల కేసులో ముగ్గురు నిందితులకు బుధవారం బెయిల్ మంజూరైంది. ఏ1 కట్టా భార్గవి, ఏ2 ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు, ఏ3 మోహన్బాబులకు బెయిల్ ఇస్తూ కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి భాను ఉత్తర్వులిచ్చారు. దాదాపు నెల రోజుల తర్వాత వీరికి బెయిల్ రావడం గమనార్హం. -
అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
రాప్తాడు రూరల్: అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా దేశంలో ఓ పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లౌకిక, ప్రజాతంత్ర వాదులు, కుల సంఘాల నాయకులు, వామపక్ష భావజాలం కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, శింగనమల నియోజకవర్గ కార్యదర్శి కత్తి నారాయణస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, అనంతపురం రూరల్ మండల కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి నరేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ, నాయకులు దుర్గాప్రసాద్, ఆనంద్, మంజునాథ్, చందు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
సీమకు జరిగిన అన్యాయాన్ని మాటల్లో చెప్పలేం
అనంతపురం/టవర్క్లాక్: రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని మాటల్లో చెప్పలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అనంతపురంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953లో కేవలం మూడేళ్లు రాజధానిగా కర్నూలు ఉందని, 1956లో రాజధానిని తరలించే క్రమంలో శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాయలసీమకు అనేక ప్రయోజనాలను చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నేటికీ శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయకపోడం దురదృష్టకరమన్నారు. రాయలసీమ ప్రాంతంలోని అపరిష్కృత సమస్యలు, సీమ ప్రజల ఆలోచన, ఏంచేస్తే బాగుంటుందనే అంశాలను తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగిన రూట్మ్యాప్ను బీజేపీ రూపొందిస్తుందని తెలిపారు. ‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు మాధవ్ సూచించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి బీజేపీ మరింతగా కృషిచేస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కిసాన్ రైలును అనంతపురం నుంచి ప్రారంభించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీ చొరవతోనే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ఏర్పాటైందన్నారు. రాబోవు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. చరిత్రాత్మక ప్రదేశాల అభివృద్ధితో పాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. సంచార జాతుల పిల్లల చదువులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, మాజీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, అంకాల్రెడ్డి, చిరంజీవిరెడ్డి, రామచంద్రయ్య, ఫయాజ్ బాషా, లలిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ -
భద్రతా నియమాలను పాటించాలి : డీఆర్ఎం
గుంతకల్లు: భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ రైలు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా ఆదేశించారు. బుధవారం స్థానిక డివిజనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో అండర్ బ్రిడ్జిలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. సురక్షితం కాని ట్రాక్లు, వంతెనలు, భారీ వర్షాలు కురిసే ప్రదేశాల్లో తప్పనిసరిగా పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ఇటీవల తిరుపతి రైల్వేస్టేషన్ ఔటర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పొగను గుర్తించే పరికరాలు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం డాక్టర్ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. -
విత్తన లోపమా! ప్రకృతి శాపమా?
పెద్దపప్పూరు: విత్తన లోపమో.. ప్రకృతి శాపమో తెలియదు కానీ, కళింగర సాగు చేసి 47 రోజులవుతున్నా పంట ఎదుగుదల లేక పిందె ధశ లోనే ఉండిపోయింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం పసలూరు గ్రామానికి చెందిన రైతు మద్దా ప్రసాద్ తనకున్న 8 ఎకరాల భూమిలోని 3 ఎకరాల్లో గత నెల 13న కళింగర పంట సాగు చేశాడు. ఇటీవల మరో మూడు ఎకరాల్లో అదే పంటను సాగు చేశాడు. సాధారణంగా విత్తనం వేసిన 60 రోజులకు పంట కోతకు వస్తుంది. ప్రస్తుతం 47 రోజులవుతున్న తొలి దశలో విత్తనమేసిన కళింగర పంట ఎలాంటి ఎదుగుదల లేదు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. పిందే దశలోనే మగ్గిపోతోంది. దీంతో సదరు రైతు విత్తన కంపెనీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా వారి నుంచి స్పందన లేదు. క్షేత్ర స్థాయిలో పండ్ల తోటలను పరిశీలించి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అధికారులు అటుగా దృష్టి సారించకపోవడంతో మండలంలోని ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు. పంట కోసం ఇప్పటి వరకూ రూ. 2 లక్షలకు పైగా అప్పు చేసి ఖర్చు పెట్టానని, పంటలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు మద్దా ప్రసాద్ వేడుకుంటున్నాడు. సాగు చేసి 45 రోజులవుతున్నా పిందె దశలోనే కళింగర పంట ఆదుకోవాలని వేడుకుంటున్న రైతన్న నివేదిక పంపుతాం కళింగర సాగు చేసి 43 రోజులవుతున్నా పంటలో ఎదుగుదల లేదని, పిందె పిడికెడు సైజులోనే మగ్గిపోతోందని ఫోన్ ద్వారా రైతు మద్దా ప్రసాద్ సమాచారం అందించారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి, లోపం ఎక్కడుందో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. – ఉమాదేవి, హెచ్ఓ, తాడిపత్రి -
‘పీ–4’ నిర్బంధం చేస్తే బహిష్కరిస్తాం : యూటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: పీ–4 (జీరో పావర్టీ) కార్యక్రమంలో భాగంగా విద్యార్ధి కుటుంబాలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా దత్తత తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు నిర్బంధం చేయడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పేరుతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ–4 కార్యక్రమంలో సంపన్నులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనే నిబంధన ఉందన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంపన్న వర్గాల నుంచి స్పందన రాకపోవడంతో ఆ భారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నెట్టడం సరికాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతాధికారులు ముందుగా పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలవాలన్నారు. కానీ, ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్బంధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై నిర్బంధం చేస్తే పీ–4 కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. డీఈఓను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు సుబ్బరాయుడు, చంద్రమోహన్, కోటేశ్వరప్ప, శ్రీనివాసులు, ముసలప్ప, పవన్ కుమార్, డీకే నారాయణ, రమేష్ ఉన్నారు. ‘ఫోరం’లో సీనియర్ టీచర్లకు ప్రాధాన్యతనివ్వాలి ● స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: మండల అకడమిక్ మానిటరింగ్ ఫోరం సభ్యులుగా సీనియర్ టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుతీప్రసాద్, జయకృష్ణ, వర్కింగ్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ నరేష్కుమార్, మక్కిశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఎంపికలో కొందరు ఎంఈఓల తీరును వారు ఆక్షేపించారు. సీనియర్లను విస్మరించి ఇష్టారాజ్యంగా తమకు నచ్చినవారిని, అనుకూలమైన వారిని మండల అకడమిక్ ఫోరం కమిటీలోకి తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులతో చర్చించకుండా ఉపాధ్యాయుల పేర్లు పంపడం సరైంది కాదన్నారు. మండలాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సీనియర్ ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మండల అకడమిక్ ఫోరం సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. -
గుక్కెడు నీటి కోసం పది రోజులుగా నిరీక్షణ
రాయదుర్గం టౌన్: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. పది రోజులుగా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు అందక ప్రజలు సతమతమవుతున్నారు. కరెంటు సమస్య, మోటార్ల మరమ్మతు కారణమంటూ అధికారులు బుకాయిస్తూ నీటి సరఫరాలో తీవ్ర జాప్యం వహిస్తుండడంతో మంగళవారం పట్టణంలోని మొలకాల్మూరు రోడ్డులో రెండు చోట్ల, మారెమ్మగుడి ఏరియాలో ఒకచోట ప్రధాన రహదారులపై మూడు చోట్ల స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. తమ కాలనీలకు దాదాపు పది రోజులు కావస్తున్నా కొళాయిల ద్వారా తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. కనీస అవసరాలకు సైతం నీరు లేక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, ఫిట్టర్లు అక్కడికి చేరుకుని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన కారులు వినకపోవడంతో చివరకు అవసరమైన ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని భరోసానిచ్చి, ఆందోళనను విరమింపజేశారు. రెండురోజుల్లోగా కరెంటు సమస్య, మోటారు మరమ్మతులు పూర్తి చేసి కాలనీలకు నీటి సరఫరాను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. దాహార్తి తీర్చాలంటూ రాయదుర్గం రహదారులపై ఖాళీ బిందెలతో మహిళల నిరసన -
వాహనాలు క్లియర్ చేయండి : ఎకై ్సజ్ డీసీ
హిందూపురం టౌన్: మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలు త్వరగా క్లియర్ చేయాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్తో కలసి హిందూపురం ఎకై ్సజ్ పోలీసుస్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లు దుకాణల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించాలని, కల్తీ కల్లు అరికట్టేలా అమ్మకందారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎక్కువ కేసులు నమోదైన వారిని వారిని జిల్లా బహిష్కరణకు సిఫార్సు చేయాలన్నారు. -
దంపతుల మృతి కేసులో వీడిన మిస్టరీ
బొమ్మనహాళ్: దంపతుల అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మనస్పర్థల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. వివరాలను మంగళవారం రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ పీఎస్ ఎస్ఐ నబీరసూల్ వెల్లడించారు. కర్ణాటకలోని హోస్పేట్కు చెందిన దంపతులు సోమవారం బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. హోస్పేట్ తాలూకా నాగేనహళ్లి గ్రామానికి చెందిన ఆఫ్రీనా (21), హోస్పేట పట్టణానికి చెందిన రహమాన్ (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను పెద్దలను ఒప్పించి 8 నెలల క్రితం పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. పెయింటింగ్ పనులతో రహమాన్ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో 4 నెలల క్రితం నేమకల్లు గ్రామంలోని ఆర్య వైశ్య కాంప్లెక్స్లో 21వ నంబర్ గదిని అద్దెకు తీసుకు ఆఫ్రీనా సోదరుడు షాబాషాతో కలసి ఉంటూ స్థానికంగా పెయింటింగ్ పనులో చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా రహమాన్ తాగుడుకు బానిస కావడంతో భార్య సర్దిచెబుతూ వచ్చింది. తాగుడు వల్ల కలిగే అనర్థాలను వివరించి, మద్యానికి బానిస కావొద్దని నచ్చచెబుతూ వచ్చింది. అయినా రహమాన్లో మార్పు రాలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం ఆఫ్రీనా తన సోదరుడితో కలసి స్వగ్రామానికి వెళ్లి, సోమవారం తిరిగి వచ్చింది. ఆ సమయంలో దంపతులిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుని రాజీ పడలేక ఇద్దరూ కలసి దుప్పట్టతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బళ్లారిలోని విమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. పైళ్లెన 8 నెలలకే మనస్పర్థలు రాజీ పడలేక ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య -
పీడిస్తున్న యూరియా కొరత
గుమ్మఘట్ట: జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంచనా వేయలేకపోయిన అధికారులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో రైతులు మొక్కజొన్న, వేరుశనగ, కంది, ఆముదం, వరి, పత్తి పంటలు సాగు చేశారు. ముఖ్యంగా హెచ్చెల్సీ పరిధితో పాటు వ్యవసాయ బోరుబావుల కింద మొక్కజొన్న, పత్తి, టమాట, మిరప, వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ పంటలకు యూరియా వినియోగం ఎక్కువగానే ఉంటోంది. దీంతో యూరియా కోసం పదిహేను రోజులుగా రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే పంట సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమవడంతోనే యూరియా కొరత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరతో యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధిక ధర ఇచ్చేందుకు సిద్ధపడుతున్నా... స్టాకు లేదని వ్యాపారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై రాయదుర్గం ఏడీఏ పద్మజ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు, డీలర్లు స్టాక్ వివరాలను ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమైందన్నారు. దీంతో అంచనా వేయలేకపోయినట్లు వివరించారు. అయితే యూరియా కొరత ఉన్నట్లు ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు చాలా బాధేస్తోంది సాగు చేసిన పంటలు ఎదుగుదల లేకుండా పోయాయి. వీటిని చూస్తుంటే చాలా బాధేస్తోంది. పంటల సాగు కోసం వేలాది రూపాయలు అప్పుటు చేసి పెట్టుబడి పెట్టాం. సకాలంలో యూరియా అందించకపోతే మొక్క ఎదుగుదల లేక దిగుబడులు చేతికి అందే పరిస్థితి ఉండదు. రోజూ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్దకెళ్లి అడిగితే యూరియా లేదని అంటున్నారు. – రైతు జంగలి ఎర్రిస్వామి, బేలోడు గ్రామం, గుమ్మఘట్ట మండలం బాధ్యత మరిచారు రైతుల అవసరాలపై పాలకులు, అధికారులు ముందస్తుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. అయితే ఈ విషయంలో వారు బాధ్యత మరిచారు. ఫలితంగా రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సమస్యకు పరిష్కారం చూపకపోతే పోరాటానికి సిద్ధమవుతాం. – మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, రాయదుర్గం ఇబ్బందుల్లో అన్నదాతలు పట్టించుకోని పాలకులు అప్పుల పాలవుతాం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత లేకుండా చూడాలి. పంటల సాగు కోసం ఇప్పటికే వేలాది రూపాలను అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. మొక్క ఎదుగుదలకు యూరియానే ముఖ్యం. సకాలంలో పంటలకు యూరియా అందిస్తే దిగుబడి కాస్తోకూస్తో చేతికి వస్తుంది. లేకుంటే అప్పులే మిగులుతాయి. – రైతు రామాంజనేయులు, గోనబావి గ్రామం, గుమ్మఘట్ట మండలం -
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
అబార్షన్ కారణంగా తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా అబార్షన్ చేయించుకుంటే రక్తహీనత ఏర్పడి ప్రాణం మీదకు వస్తుంది. ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమూ లేకపోలేదు. భవిష్యత్తులో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చినా గర్భ సంచి, ట్యూబ్స్, అండాశయానికి ఇన్ఫెక్షన్లు వచ్చి అబార్షన్ అయ్యే అవకాశం ఉంది. అర్ధంతరంగా అబార్షన్ చేయించుకుంటే మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు తక్కువవుతాయి. – డాక్టర్ షంషాద్బేగం, గైనిక్ విభాగం హెచ్ఓడీ, అనంతపురం సర్వజనాస్పత్రి -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
మళ్లీ బురిడీ కొట్టించేందుకు వచ్చి.. కాళ్లకు బుద్ధిచెప్పి! పామిడి: రైతు సభ్యత్వ కార్డు పేరుతో మరోసారి బురిడీ కొట్టించేందుకు వచ్చిన ఇద్దరు మోసగాళ్లు.. స్థానికులు తిరగబడడంతో కాళ్లకు బుద్ధి చెప్పారు. వివరాలు.. ప్రధాని మోదీ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోందని, ఇందుకు రైతు సభ్యత్వ కార్డు తీసుకోవాలంటూ ఐదు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు (వీరిలో ఒకరు మహిళ) పామిడి పంచాయతీలోని మజారా గ్రామమైన పి.కొత్తపల్లికి చేరుకుని రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రధాని స్కీమ్ అంటూ నమ్మబలకడంతో దాదాపు 500 మంది రైతులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున చెల్లించి సభ్యత్వ కార్డులు పొందారు. తమ ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన సెల్ఫోన్ నంబర్ అందజేశారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ రైతు అనుమానం వచ్చి నిలదీయగా మోసగాళ్లు ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. ఇదే క్రమంలో మళ్లీ మంగళవారం మండలంలోని పీ కొత్తపల్లి గ్రామానికి మోసగాళ్లు రావడం గమనార్హం. అయితే, కంత్రీగాళ్లపై స్థానికులు తిరగబడడంతో భయాందోళనకు గురైన వారు తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పరుగు లంకించారు. జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని యత్నిస్తున్న ఇలాంటి వారికి అధికారులు, పోలీసులు తగిన బుద్ధి చెప్పాలని మండలవాసులు కోరుతున్నారు. జర్మన్ భాషపై శిక్షణ అనంతపురం రూరల్: నర్సింగ్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థినులకు ఏపీ స్టేట్ స్కిల్ డెలప్మెంట్ ఆధ్వర్యంలో జర్మన్ భాషపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన గిరిజన విద్యార్థినులు https://naipunyam.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న వారికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 8 నుంచి 10 నెలల పాటు జర్మనీ భాషపై శిక్షణ ఇస్తారు. -
మిర్చి రైతులకు రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ
బొమ్మనహాళ్: మిర్చి రైతులకు ఓ వ్యాపారి రూ.2 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టాడు. చెమటోడ్చి పండించిన పంటను వ్యాపారి చేతిలో పెడితో డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడంటూ బాధితులు వాపోతున్నారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలంలోని గోవిందవాడ, దేవగిరి గ్రామాలకు చెందిన రైతుల నుంచి ప్రకాష్ అనే వ్యాపారి కొన్ని రోజుల క్రితం దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన మిర్చి కొనుగోలు చేశాడు. డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అడిగితే అదిగో ఇదిగో అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధిత రైతులు సూరి, రామచంద్ర, సుంకన్న, ఖలంధర్, గంగాధర, వన్నూరుస్వామి, కుమారి, మనోహర్, లోకేష్, మారెన్న, రామాంజి తదితరులు మంగళవారం బొమ్మనహాళ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై ఎస్ఐ నబీరసూల్ వివరణ కోరగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల అదుపులో నలుగురు వడ్డీ వ్యాపారులు ధర్మవరం అర్బన్: పట్టణంలోని శాంతినగర్లో రమణ, భారతి దంపతులపై దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారులు నలుగురు మంగళవారం లొంగిపోయారు. రమణ ఇంట్లోకి వడ్డీ వ్యాపారులు చొరబడి దాడి చేసిన వీడియో రాష్ట్రంలోనే సంచలనం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఏడుగురిపై కేసు నమోదు చేశారు. దాడి ఘటన తర్వాత నిందితులు పరారీలో ఉండగా.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు మంగళవారం ఓ న్యాయవాది ద్వారా డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. -
హవ్వ.. మరీ ఇంత బరితెగింపా!
రాప్తాడురూరల్: ఎక్కడైనా మట్టిరోడ్లు వేయాలంటే కొండ, గుట్టల నుంచి ఎర్రమట్టి తీసుకొస్తారు. అయితే అనంతపురం రూరల్ మండలానికి చెందిన కొందరు ‘తెలుగు తమ్ముళ్లు’ గతంలో వేసిన రోడ్లను చెరబట్టి అక్కడి మట్టిని తోలుతున్నారు. ఇంకా కొందరు మరింత బరి తెగించి ప్రైవేట్ స్థలాలకు మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ అసలు కథ.. అనంతపురం నగరంలో ఇంటిస్థలాలు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో అనంత పురం రూరల్ మండలం కామారుపల్లి పంచాయతీలో 160 ఎకరాల్లో జగనన్న లేఅవుట్ వేశారు. 7,384 మందికి పాట్లు కేటాయించి పట్టాలిచ్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కాలనీని అభివృద్ధి చేశారు. రూ. 80 లక్షల నిధులతోమట్టిరోడ్లు వేశారు. ప్రతి ప్లాటుకు హద్దులు కేటాయిస్తూ రాళ్లు నాటారు. మట్టి కొట్టుకుపోతున్నారు..కూటమి ప్రభుత్వం వచ్చాక కామారుపల్లి జగనన్న కాలనీపై టీడీపీ నాయకులు కన్నేశారు. కాలనీ అంతర్గత రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఎర్రమట్టిని ట్రాక్టర్లలో నింపుకుని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం రోడ్లను ధ్వంసం చేశారు. కొందరు ప్రైవేట్ ప్లాట్లకు ఉపయోగించుకుంటుండగా, మరికొందరు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు వినియోగిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి తోలుకోవాలంటే రవాణా ఖర్చు అవుతుందని జగనన్న లేఅవుట్లోని రోడ్లను చిదిమేస్తున్నారు. రూరల్ మండలంలోని కామారుపల్లి, చిన్నంపల్లి, సజ్జకాలువ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రోడ్లకు ఇదే మట్టిని తోలుకున్నట్లు తెలిసింది. అలాగే ప్లాట్లకు హద్దులు కేటాయిస్తూ నాటిన రాళ్లను సైతం ఎత్తుకెళ్లారు. ఇప్పటికే 30 శాతం పైగా రాళ్లు చోరీకి గురయ్యాయి. పట్టపగలే బరి తెగింపు... కామారుపల్లి జగనన్న లేఅవుట్ నుంచి పట్టపగలే బరి తెగించి ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు ఉంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే ‘తమ్ముళ్ల’ ధన దాహానికి ఉన్న రోడ్లన్నీ కర్పూర హారతిలా కరిగిపోనున్నాయి. నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి, వారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ కొందరు సాగిస్తున్న దందాపై సామాన్య ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలూ మండిపడుతున్నారు. కామారుపల్లి జగనన్న కాలనీని చెరబట్టిన ‘తమ్ముళ్లు’ అంతర్గత రోడ్లలో పట్టపగలే మట్టి దొంగతనం -
ఎస్బీఐలో రూ.12 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీ
హిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్లో జరిగిన భారీ చోరీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సమయంలో బ్యాంకులో భారీ ఎత్తున నగలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హిందూపురం డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది, పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాoకు లాకర్లో ఉన్న దాదాపు రూ.12 కోట్ల విలువచేసే 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బ్యాంకు లాకర్ గ్యాస్కట్టర్తో కత్తిరించినా కింది అర లాక్ తెరుచుకోలేదనీ, గట్టిగా ఉండటంతో తెరవలేక పోయారన్నారు. లేదంటే మరో పదికేజీల బంగారం కూడా చోరీకి గురయ్యేదన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రత్నం మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. నిర్లక్ష్యమే కారణమా? అయితే ఈ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు లేకపోవడం, లోపల అలారం పనిచేయకపోవడం, సీసీ కెమెరాలను బ్యాంకు అధికారుల సెల్ఫోన్లకు అనుసంధానించకపోవడం వంటి లోపాలు వెలుగు చూశాయి. ఇటీవల తనిఖీల నిమిత్తం హిందూపురం రూరల్ సీఐ పారిశ్రామికవాడలో తనిఖీలకు వచి్చన సందర్భంగా బ్యాంకు భద్రతపై అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ పటిష్టం చేయాలని సూచించారు. అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు. -
2,98,535
ప్రతి ఒక్కరూ పుత్తడికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆర్థికంగా బలవంతులైన వారు హోదాగా భావిస్తే.. సామాన్యులు బంగారాన్ని ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. తమ వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని ధరించినప్పుడు సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, కూటమి సర్కారు పుణ్యమా అని ఆర్థికంగా కుదేలైన అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారాన్ని కుదువ పెడుతున్నారు. కాసింత ఆర్థిక చేయూత కూడా కరువైన దైన్యంలో పుత్తడిని తీసుకుని బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. రైతు భరోసా కింద ఇచ్చిన సొమ్మురూ.1,879.29కోట్లు శ్రీ సత్యసాయి జిల్లాలో రైతు భరోసా లబ్ధిదారులు2,79,556రూ.1,767.09కోట్లు సాక్షి ప్రతినిధి, అనంతపురం: అదిగోఇదిగో అంటూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందించకుండా దాటవేస్తోంది. దీంతో పంటల సాగుకు అన్న దాతలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో కుదువ పెడుతున్నారు. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో నగలు తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడం పరిపాటి. కానీ ఈ ఏడాది ప్రభుత్వం నుంచి రైతుకు ఎలాంటి సాయమూ దక్కకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో నగలు తాకట్టు పెట్టి అప్పు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ ఉదయం నుంచే నగల తాకట్టుకు రైతులు క్యూ కడుతున్న దుస్థితి నెలకొంది. గతంలో మండలకేంద్రాల్లోని బ్యాంకుల్లో రోజూ పది దాకా దరఖాస్తులు వచ్చేవి. ఇటీవల 40 నుంచి 50 మంది వరకూ కుదువ పెట్టి రుణం తీసుకుంటున్నారు. సగటున రోజుకు 4 వేల మందికి పైగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులకు బంగారు రుణాలు ఇచ్చే బ్యాంకుల బ్రాంచ్లు రమారమి 229 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో రోజుకు 4 వేల మందికి పైగా రైతులు రుణాలు తీసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సగటున ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అనుకున్నా రోజుకు రూ.20 కోట్లపైన ఇస్తున్నట్టు అంచనా. నెలలో 20 రోజుల పాటు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బంగారం కుదువతో ఇప్పటివరకూ రూ.400 కోట్లకు పైగా బ్యాంకులు రుణాలిచ్చాయి. గతేడాదితో పోలిస్తే 22 శాతం పైగా బంగారు లోన్లు పెరిగినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. వివాహాల సీజన్ అయినా విధిలేక... ఇటీవల శ్రావణ మాసం మొదలైంది. ఈ క్రమంలో జిల్లాలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లి అంటే బంగారు నగలు ఎంత అవసరమో తెలిసిందే. పైగా సెంటిమెంటుతో ముడిపడింది. అయినా సరే నగలు తాకట్టు పెట్టి పంటల కోసం అప్పు తీసు కోవడం రైతుల దీనస్థితికి అద్దం పడుతోంది. ఓవైపు వర్షాభావం, మరోవైపు ఆర్థిక భరోసా లేకపోవడం వెరసి అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత సర్కారు హయాంలో రైతు సాయం ఇలా... అనంతపురం జిల్లాలో రైతు భరోసా లబ్ధిదారులు గుండె బరువు.. బంగారమే ఆదరువు ‘కూటమి’ ఆర్థిక సాయం కరువై అన్నదాత అగచాట్లు పెట్టుబడి సాయం అందక బ్యాంకుల్లో బంగారం కుదువ గడిచిన ఏడాదితో పోలిస్తే భారీగా గోల్డ్ లోన్లు వివాహాల సీజన్ అయినా రైతులకు విధిలేని పరిస్థితిపెట్టుబడుల కోసం తప్పలేదునాకు 8 ఎకరాల పొలం ఉంది.వేరుశనగ, మొక్కజొన్న , టమాట పంటలు సాగు చేశాను. పంటల పెట్టుబడి కోసం మలయనూరు యూని యన్ బ్యాంక్లో బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాను. బంగారం లేకపోయి ఉంటే పంటల పెట్టుబడికి ఇబ్బంది పడాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని చెప్తున్నా ఇంతవరకు పైసా అందించలేదు. – రుద్రప్పగారి పాలయ్య, శ్రీమజ్జనపల్లి, కుందుర్పి మండలం విధిలేని పరిస్థితిసొంత పొలంతో పాటు కౌలుకు తీసుకుని 5 ఎకరాల్లో కంది, ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశా. పెట్టుబడుల కోసం బయటి వ్యక్తులతో అధిక వడ్డీలకు అప్పు చేయలేక విధిలేని పరిస్థితుల్లో నా భార్య ఐదు తులాల బంగారు నగలు బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.2.30 లక్షల రుణం తీసుకున్నా. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. అన్నదాత సుఖీభవ నగదు జమ చేసి ఉంటే ఎంతో కొంత ఉపశమనం దక్కేది. – సంజీవరెడ్డి, రైతు, గుండిగానిపల్లి, బ్రహ్మసముద్రం మండలం -
ప్రైవేట్ బ్యాంక్లో దొంగలు!
అనంతపురం: ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలను తీసుకెళ్లి మరో ఫైనాన్స్ సంస్థలో కుదువపెట్టి నగదును కాజేస్తున్న ముఠా గుట్టును అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు రట్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ కె.జగదీష్తో కలసి అనంతపురం డీఎస్పీ వి.శ్రీనివాసరావు వెల్లడించారు. అనంతపురంలోని హెడ్డీఎఫ్సీ బ్యాంకు రాంనగర్ బ్రాంచ్లో ఖాతాదారుకు చెందిన ఒక గోల్డ్ ప్యాకెట్ ట్యాంపర్ అయింది. ఒరిజినల్ బంగారం స్థానంలో నకిలీ బంగారాన్ని పెట్టినట్లు గుర్తించారు. దీంతో బ్యాంకులో పనిచేస్తున్న వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ బ్యాంక్ మేనేజర్ పి వేణుగోపాలరెడ్డి ఈ నెల 14న నాల్గో పట్టణ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో కీలకమైన అంశాలను పసిగట్టారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో అనంతపురంలోని రాణినగర్కు చెందిన వి.రామాంజనేయులు కుమారుడు సతీష్ కుమార్, జాకీర్ కొట్టాల ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న నరసింహులు కుమారుడు బోయ హెచ్.జయరాములు, కళ్యాణదుర్గం రోడ్డు రాజా హోటల్ వెనుక గణేష్ నగర్లో నివాసం ఉంటున్న నాగరాజు కుమారుడు సాయి కృష్ణ, నందమూరినగర్కు చెందిన బి.ఓబులేసు కుమారుడు బోయ శ్రీనివాసులు అలియాస్ శీనను అరెస్ట్ చేశారు. అపహరించారు ఇలా... కీర్తన ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న నరేష్ (పరారీలో ఉన్నాడు), సతీష్కుమార్ ఇద్దరూ కలిసి కదిరిలో మణుప్పరం ఫైనాన్స్ సంస్థలో పనిచేసేవారు. ఇద్దరూ విలాసాలు, జల్సాలకు అలవాటుపడ్డారు. జల్సాలు తీర్చుకునేందుకు సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దీంతో సతీస్కుమార్ తన క్లాస్మీట్ సాయికృష్ణతో పాటు పరిచయమున్న బోయ శ్రీనివాసులు, హెచ్డీఎఫ్సీలో పనిచేస్తున్న జయరాంతో కలసి పథకం రచించారు. ఇందులో భాగంగా బ్యాంక్లో బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వచ్చిన ఖాతాదారులను ఏమార్చి ఆ బంగారాన్ని కీర్తన ఫైనాన్స్లో కస్టమర్లకు తెలియకుండా మళ్లించి రుణం పొందేవారు. గడువు పూర్తయిన ఖాతాలకు సంబంధించి నగలను కూడా ఖాతాదారులకు తెలియకుండానే నగదు చెల్లించి.. బంగారు తీసుకెళ్లి కీర్తన ఫైనాన్స్లో తాకట్టు పెట్టేవారు. ఇలా జయరాం పేరిట 330 గ్రాములు, బోయ శ్రీనివాసుల పేరిట 650 గ్రాములు, సాయి కృష్ణ పేరిట 1200 గ్రాములు కీర్తన ఫైనాన్స్లో తాకట్టు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఖాతాదారు తనఖా పెట్టిన బంగారానికి సంబంధించిన ప్యాకెట్ ట్యాంపర్ అయి ఉండడం గమనించిన హెచ్డీఎఫ్సీ మేనేజర్ ఫిర్యాదుతో మొత్తం బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్ కోసం గాలిస్తున్నారు. కేసులో మిస్టరీని ఛేదించి, నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్ఐలు ప్రసాద్, విజయ్ భాస్కర్ నాయుడును ఎస్పీ పి. జగదీష్ అభినందించారు. ఖాతాదారులకు తెలియకుండా తాకట్టు బంగారం స్వాహా నలుగురి అరెస్ట్ పరారీలో మరొకరు -
మచ్చుకు కొన్ని
ఎదుటి వ్యక్తి బలహీనత వారికి ఆసరాగా మారింది. ఇతరుల అవసరాలను ఆలంబనగా చేసుకున్నారు. మాయ చేశారు.. ఆశ చూపారు.. వల విసిరారు. అందులో చిక్కుకున్న సామాన్యులను నిట్టనిలువునా ముంచి రూ.కోట్లలో దోచుకున్నారు. ఇది ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తున్న వ్యవస్థీకృత ఆర్థిక నేరం. మాఫియాను తలదన్నేలా మోసగాళ్లు చెలరేగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అనంతపురం: కుటుంబ అవసరాలు, పిల్లల చదువులకు కాయకష్టంతో చిరువ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు సంపాదించిన సొమ్ము కాస్త పరుల పాలవుతోంది. భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేసుకోవాలనే వారిలోని తపనను మోసగాళ్లు తెలివిగా సొమ్ము చేసుకుని బోర్డు ఫిరాయిస్తున్నారు. అధిక వడ్డీలు ఇస్తామని కొందరు.. క్రిప్టో కరెన్సీతో డాలర్లు మూటగట్టుకోవచ్చని మరికొందరు ఉచ్చులోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో దాచుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. బలహీనతలే ఆసరాగా... డబ్బు సంపాదించాలనే సామాన్య, మధ్య తరగతి ప్రజల బలహీనతలను ఆసరా చేసుకున్న కొందరు క్రిప్టో కరెన్సీ ఉచ్చులోకి తాము చిక్కుకోవడం కాక... పలువురిని అందులోకి లాగేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే డాలర్లలో సంపాదన ఉంటుందన్న నమ్మబలికారు. ఈ మాయలో చిక్కుకున్న వారు తాము దాచుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. చివరకు మోసపోవడంతో మనోవేదనతో నలిగిపోతున్నారు. భారత ప్రభుత్వ ఆమోదం లేని కంపెనీలు కేవలం వెబ్సైట్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తూ రూ. కోట్లలో మోసానికి తెరలేపాయి. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి బోర్డు ఫిరాయించింది. లక్ష కడితే రోజూ 15 నుంచి 20 అమెరికన్ డాలర్లు వస్తాయని ఆశ చూపి రూ.లక్ష నుంచి కోటి రూపాయల వరకూ ఒక్కొక్కరి నుంచి డిపాజిట్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. సామాన్యుల నడ్డి విరిచిన అధిక వడ్డీ ఆశ సామాన్యుల ఆర్థిక అవసరాలను అనువుగా మార్చుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిట్టీ వ్యాపారం ఊపందుకుంది. చిట్టీ ఎత్తిన వారికి నగదు చెల్లించకుండా నిర్వాహకులు అధిక వడ్డీ ఆశ చూపుతున్నారు. ఇదే అసలు మోసానికి తెరతీస్తోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల ఉరవకొండలో వెలుగుచూసిన ఉదంతం. ఉరవకొండలోని రంగావీధిలో నివాసముంటున్న దంపతులు నగేష్బాబు, లావణ్య.. కిరాణా దుకాణం నిర్వహిస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ చిట్టీలు కట్టారు. చిట్టీలు ఎత్తిన వారికి అధిక వడ్డీ ఆశ చూపి నగదు చెల్లించకుండా మిన్నకుండిపోయారు. రెండు వారాల క్రితం కుటుంబంతో సహా నగేష్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా, డబ్బుతో ఉడాయించినట్లు తెలిసింది. ఈలోపు పలువురి సెల్ఫోన్ల వాట్సాప్ నంబర్కు నగేష్ బాబు దంపతుల లాయర్ పంపిన ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) నోటీసు అందింది. 57 మందితో రూ.6.22 కోట్ల వరకు నగదు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా ఉమ్మడి జల్లా వ్యాప్తంగా చిట్టీలు, క్రిప్టో కరెన్నీస అధిక వడ్డీల ఉచ్చులో పడి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో అధికమవుతున్న ఆర్థిక నేరాలు ప్రజల అవసరాలతో ఆటలు రూ.లక్షల్లో నష్టపోతున్న బాధితులు చిట్టీలు, క్రిప్టో కరెన్సీ, అధిక వడ్డీల మాయలో సామాన్యులు విలవిల 2021లో కళ్యాణదుర్గంలో ‘సహారా ఇండియా పరివార్’ పేరుతో ఓ బ్యాంక్ను ప్రారంభించారు. ఇందులో స్థానికులు ఆంజనేయులు, సలాం కీలకం. వీరు ఏజెంట్లను నియమించుకుని భారీ వడ్డీ ఆశ చూపి చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజల నుంచి వారం వారం డిపాజిట్ల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఐదేళ్లు, మూడేళ్ల కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రెట్టింపు మొత్తాన్ని ఇస్తామని ఆశ చూపడంతో దాదాపు వెయ్యి మంది సభ్యులుగా చేరారు. వారం వారం కంతులు చెల్లిస్తూ వచ్చారు. మెచ్యూరిటీ గడువు ముగియడంతో నగదు చెల్లించాలని ఖాతాదారులు ఒత్తిడి చేశారు. దీంతో ఆంజనేయులు, సలాం పత్తా లేకుండా పోయారు. ఏజెంట్లూ మాయమయ్యారు. ఈ దందాలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా బాధితులు మోసపోయినట్లు సమాచారం. ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి క్రిప్టో కరెన్సీ మోజులో పడ్డాడు. తొలుత భారీగా ఆదాయం వచ్చింది. దీంతో మరి కొంత మందిని చేరిస్తే మరింత లాభం వస్తుందని ఆశపడ్డాడు. బంధువులు, స్నేహితులు అందరికీ క్రిప్టో కరెన్సీ గురించి చెప్పి ఏకంగా రూ.10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించాడు. ఆ తర్వాత సదరు కంపెనీ బోర్డు తిప్పేయడంతో ప్రస్తుతం రోజూ బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లడం.. సాయంత్రానికి ధర్మవరానికి చేరుకోవడం పరిపాటిగా మారింది. అనంతపురం నగరంలో బ్లాక్మనీ అధికంగా ఉండే ఓ సామాజిక వర్గం వారు ఓ వెబ్సైట్ను నమ్మి క్రిప్టో కరెన్సీలో రూ.20 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. వారం కిందట అప్డేట్ చేస్తున్నామని చెప్పి లింక్ తొలగించారు. ఆ తర్వాత అడ్రస్ గల్లంతు కావడంతో తేలు కుట్టిన దొంగల్లా మారింది వారి పరిస్థితి. ఇలా వీరు మాత్రమే కాదు. ఒక్క అనంతపురం నగరంలోనే అత్యాశపరులు క్రిప్టో కరెన్సీ మోజులో పడి తక్కువలో తక్కువగా రూ.100 కోట్లు పైగానే మోసపోయినట్లు ప్రచారం జరుగుతోంది. -
విద్యార్థులపై ‘కూటమి’ చిన్నచూపు
అనంతపురం రూరల్: పేద విద్యార్థులపై కూటమి ప్రభుత్వం చిన్న పూపు చూస్తోందని, ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాద్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆద్వర్యంలో నగరంలోని బీసీ, ఎస్సీ ప్రభుత్వ వసతి గృహాలను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నరేంద్రరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. సరిపడ గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో బీసీ సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు పెద్ద పీట వేశారన్నారు. ప్రభుత్వ బడుల్లో మాదిరే వసతి గృహాల్లో సైతం నాడు–నేడు పనులు చేపట్టి సమూల మార్పులు చేశారన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి ఆద్వానంగా మారిందన్నారు. వసతి గృహాల్లో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పెరగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు అందించాలని, మెను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అద్యక్షుడు చంద్రశేఖర్యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సుల్తాన్, నగర అధ్యక్షుడు కై లాష్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ఎస్సీ సెల్ నగర మహిళా అధ్యక్షురాలు సాకే చంద్రకళ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు తిప్పలూరి సుధీర్రెడ్డి, నిషాంత్రెడ్డి, నవీన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకోని సర్కార్ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి -
బాధితులపైనే అక్రమ కేసు బనాయింపు
అనంతపురం: తమపై టీడీపీ నాయకులు దాడి చేసినా కేసు నమోదు చేయని పోలీసులు.. తమనే నిందితులుగా పేర్కొంటూ అక్రమ కేసు బనాయించారంటూ ఎస్పీ జగదీష్ ఎదుట బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీని కలసి తన గోడు వెళ్లబోసుకుంది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం ఎం. కొండాపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న కె.సుధారాణి, శ్రీనివాసాచారి దంపతులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వై. సురేష్, లాల్ కృష్ణ ఈ నెల 13న దాడి చేసి దుర్భాషలాడారు. దీనిపై అదే రోజు సుధారాణి కళ్యాణదుర్గం రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. నేటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా దాడి చేసిన వారి నుంచి ఫిర్యాదు తీసుకుని సుధారాణి దంపతులపై అక్రమంగా కేసు బనాయించారు. దీంతో న్యాయం కోరుతూ దాడి సమయంలో తీసిన ఫొటోలను జతపరుస్తూ సోమవారం ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. కాగా, ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 87 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా వినతులు స్వీక రించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు అనంతపురం అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాలు సిద్ధం చేసుకోవాలని, ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులను అవార్డులకు ఎంపిక చేసి జాబితాను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు. పంటల బీమా చేయించండి ‘వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపు ప్రక్రియ ఈనెల 31తో ముగుస్తుంది. 1,50,100 మంది రైతులకుగానూ ఇప్పటికి 10,194 మందే పంట నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోండి’ అని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. బీమా అంశంపై ఆయన సమీక్షించారు. పంట సాగు చేసిన ప్రతి రైతూ బీమా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ప్రతిష్టను కాపాడాలి ● ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీ అనిత అనంతపురం: ఎస్కేయూ ప్రతిష్టను కాపాడేలా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత అన్నారు. ఎస్కేయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘పీఎం ఉష’ పథకం కింద వర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రాముఖ్యతను వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. విశిష్ట అతిథిగా హాజరైన విక్రమ సింహపురి వర్సిటీ మాజీ వీసీ, ఎస్కేయూ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మంచి స్థానానికి చేరుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రీడల్లో సత్తా చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకట నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మా గోడు వినండి.. ఆదుకోండి
అనంతపురం అర్బన్: ‘మా గోడు వినండి.. ఆదుకోండి’ అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 560 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో ఇన్చార్జ్ కలెక్టర్ సమీక్షించారు.అర్జీల పరిష్కారంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు. వినతుల్లో కొన్ని... ● సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇప్పించాలని రాప్తాడు మండలం యర్రగుంట గ్రామా నికి చెందిన నారాయణమ్మ విన్నవించింది. యర్రగుంట గ్రామ పొలం సర్వే నంబరు 127లో 1.61 ఎకరాలను 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని చెప్పింది. పట్టా మంజూరు చేయాలని 2015 నుంచి అర్జీలు ఇస్తూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన చెందింది. ● తమ భూమికి సంబంధించి అడంగల్, 1బీ రావడం లేదని కళ్యాణదుర్గంలోని పార్వతి నగర్కు చెందిన సరోజమ్మ విన్నవించింది. 2006లో ప్రభుత్వం తమకు 5.01 ఎకరాల భూమి మంజూరు చేసిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపింది. పాసుపుస్తకం కూడా ఉన్నా 2017 నుంచి 1బీ, అడంగల్ రావడం లేదని చెప్పింది. ఈ వృద్ధురాలి పేరు కె.నల్లమ్మ. ఈమెది శింగనమల మండలం కల్లుమడి గ్రామం. ఈమె భర్త చనిపోయి 23 ఏళ్లు అవుతోంది. కల్లుమడి గ్రామ పొలం సర్వే నెంబరు 142/3లో తమ రిజిస్టర్ భూమి 3.09 ఎకరాలు విక్రయించగా మిగిలిన 85 సెంట్లు భూమి ఈమె అనుభవంలో ఉంది. 2021లోనే సర్వే చేసి భూమి కొలతల పటం ఇచ్చారు. పాసు పుస్తకం మంజూరు చేయండంటూ తహసీల్దారు కార్యాలయం చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా పట్టించుకోలేదు. కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం ఇచ్చినా పని జరగలేదు. ఈ క్రమంలో పాసుపుసక్తం ఇప్పించాలని కోరుతూ మళ్లీ అర్జీ ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచ్చింది. -
‘ఉపాధి’లో ప్రజాధనం లూటీ
అనంతపురం అర్బన్: ‘‘శింగనమల నియోజకవర్గ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఉపాధి పనులు అధికార పార్టీ నాయకుల దోపిడీ వనరులుగా మారాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అధికార పార్టీ నాయకులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. అక్రమాలు అరికట్టాలని కోరుతూ సోమవారం ఆయన కలెక్టరేట్లో ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ బుక్కరాయసముద్రం మండలంలో ‘ఉపాధి’ వాటాల చెల్లింపుల్లో తేడాలు రావడంతో టీడీపీ నాయకులు రోడ్డుపైనే కొట్టుకున్నారన్నారు. నార్పల మండల పరిధిలో అక్రమాలకు పాల్పడిన అధికారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించినా ఇంకా విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. పుట్లూరు మండలంలో చనిపోయిన వ్యక్తుల పేరు మీదా బిల్లులు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకున్నారని చెప్పారు. పనికి హాజరుకాని వారితో వారం రోజుల కూలీలో సగం సొమ్ము, పనికి హాజరైన వారితో వారానికి రూ.200 నుంచి రూ.300 చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది వసూలు చేస్తున్నారన్నారు. అక్రమ సొమ్ములో అధికారులకు వాటాలు ఇస్తున్నట్లు బాహాటంగానే చెబుతున్నారన్నారు. వాటాలు కుదరని చోట రోడ్లపైకి వచ్చి తన్నుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. జిల్లాలో అన్ని చోట్లా అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కూలీల శ్రమను దోపిడీ చేస్తున్న వారిపై ఇప్పటికై నా చర్యలు తీసుకుని నిబద్ధత చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ సభ్యులు ప్రతాపరెడ్డి, భాస్కర్, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నాయకులు శ్రీకాంత్రెడ్డి, పూల ప్రసాద్, మహేశ్వరరెడ్డి, ఖాదర్వలి, ఎల్లారెడ్డి, కొర్రపాడు భాస్కర్రెడ్డి, నాగలింగారెడ్డి, ముసలన్న, సాకే నారాయణస్వామి, బొమ్మన శ్రీరామరెడ్డి, కంచిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్వతమ్మ, శ్రీనివాసరెడ్డి, మంత్రి అంజి, అరిక నరేష్, పూలనారాయణస్వామి, బయపరెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకుల అంతులేని దోపిడీ మాజీ మంత్రి శైలజనాథ్ మండిపాటు శింగనమలలో అక్రమాలపై ఇన్చార్జ్ కలెక్టర్కు ఫిర్యాదు -
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
అనంతపురం: శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ అనంతపురం అడ్వొకేట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సి. హనుమన్న ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు బయట సోమవారం ధర్నా చేపట్టారు. లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు గత 14 నెలలుగా లబ్ధి చేకూర్చలేదన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బార్కౌన్సిల్ ఆఫ్ ఏపీకి అందాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలన్నారు. ధర్నాలో న్యాయవాదులు ఆర్.బాలాజీనాయక్, ఎం.కృష్ణప్ప, అజీజ్, ఎం.శ్రీనివాసులు, రేవతి, గంగాదేవి పాల్గొన్నారు. బహుజన యువసేన పార్టీ చంద్రశ్చర్ల హరి, బీఎస్పీ అధ్యక్షుడు అంపాపతి గోవిందు, హర్షవర్ధన్ రెడ్డి, రామలింగారెడ్డి (సీనియర్ న్యాయవాది), హ్యుమన్ రైట్స్ జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, న్యాయవాది నీరజ, జూటూరు సుధాకర్ రెడ్డి, రంగనాయకులు, సాకే నరేష్, లక్ష్మణ్, నారాయణరెడ్డి, అనంతపురం బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ విజయభాస్కర్, ఉమామహేశ్వరి తదితరులు సంఘీభావం తెలిపారు. వీఆర్కు కదిరి టౌన్ సీఐ! అనంతపురం: కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డిని వీఆర్కు పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. కదిరి టీడీపీలో రెండు గ్రూపులుండగా.. ఓ వర్గానికి సీఐ నారాయణరెడ్డి మద్దతుగా నిలుస్తూ.. మరో వర్గం వారిపై కేసులు బనాయిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సీఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందడంతో పోలీసు ఉన్నతాధికారులు నారాయణరెడ్డిని వీఆర్కు పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
హెచ్చెల్సీ అక్విడెక్ట్ కాలువ గట్టుకు కోత కణేకల్లు: మండలంలోని తుంబిగనూరు వద్ద హెచ్చెల్సీ 159/277 కి.మీ సమీపంలో అక్విడెక్ట్ కాలువ ఎడమవైపు గట్టు ఆదివారం రాత్రి కోతకు గురైంది. గస్తీ నిర్వహించే లస్కర్లు ఈ విషయాన్ని కణేకల్లు హెచ్చెల్సీ సబ్డివిజన్ డీఈఈ దివాకర్రెడ్డి, ఏఈఈ నరేంద్ర మారుతి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రిపూట అటుపై ఎవరూ వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం హెచ్చెల్సీ అధికారులతో పాటు చెరువు సంఘం అధ్యక్షుడు బీటీ రమేష్ ఘటన స్థలానికి చేరుకొని హెచ్చెల్సీ గట్టు మరింత కోతకు గురికాకుండా చర్యలు తీసుకొన్నారు. నీటి ప్రవాహానికి అవాంతరాలు కలగకుండా ఇసుక బస్తాలతో రింగ్బండ్ వేయించారు. గజ ఈతగాళ్లు, కూలీల సాయంతో కాలువ అడుగు భాగం నుంచి పైవరకు ఇసుక బస్తాలతో బండ్ వేశారు. హెచ్చెల్సీ అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లైంది. కాలువకు గండి పడకుండా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవడంతో ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. బెస్ట్ పీఎంశ్రీ స్కూల్గా గుత్తి ఏపీ రెసిడెన్షియల్ అనంతపురం ఎడ్యుకేషన్: బెస్ట్ పీఎంశ్రీ స్కూల్గా గుత్తి ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఎంపికై నట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ఈపీ) –2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా బెస్ట్ పీఎంశ్రీ స్కూళ్లను జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా గుత్తి ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని వెల్లడించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ హాజరు కానున్నారు. -
కార్లు కొంటారు.. ఈఎంఐ అంటే టీడీపీ నేతలంటారు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆర్థిక స్థాయిని మించి కార్లు కొనుగోలు చేసిన వందలాది మంది నెలవారీ కంతులు కట్టలేక చతికిలపడుతున్నారు. ప్రతి వంద మందిలో పది నుంచి పదిహేనుమంది డిఫాల్టర్గా మారుతున్న పరిస్థితి. ఈఎంఐలు సరిగా కట్టకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఏడాదిగా లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తలపట్టుకు కూర్చున్నాయి. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్) సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో బ్యాంకు సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా పోతోంది. కారు తీసుకున్నప్పుడు సిబిల్ స్కోరు బాగానే ఉన్నా తర్వాత.. కంతుల చెల్లింపుల్లో దారుణంగా విఫలమవుతున్నట్టు బ్యాంకింగ్ సంస్థలు చెబుతున్నాయి.అలా వాడి.. ఇలా కుదువకు..కొంతమంది యువకులు కారు తీసుకుని రెండు మూడు నెలలు జల్సాగా తిరుగుతున్నారు. ఆ తర్వాత కారును తక్కువ రేటుకు ఇతరుల దగ్గర కుదువకు పెడుతున్నారు. ఆ డబ్బుతో జల్సా చేయడం, బెట్టింగ్లు, క్రికెట్ పందేలు ఇలా రకరకాలుగా వెచ్చించి పోగొట్టుకుంటున్నారు. రికవరీ ఏజెంట్లు కారు స్వాధీనానికి వెళ్లినప్పుడు కుదువ పెట్టుకుని డబ్బు ఇచ్చిన యజమాని అడ్డం తిరుగుతున్నారు. కొన్ని చోట్ల రాజకీయ బలాలు ఉపయోగిస్తున్నారు.రికవరీ ఏజెంట్ల కళ్లు గప్పి..కార్లు లేదా ద్విచక్రవాహనాలు తీసుకున్న తర్వాత వరుసగా మూడు మాసాలు ఈఎంఐలు (నెలవారీ కంతులు) చెల్లించకపోతే రెపో ఏజెంట్లు వాహనం స్వాధీనానికి వస్తారు. కానీ ఏజెంట్లు ఎంత వెతికినా కార్లు దాచేస్తున్నారు. ఏజెంట్లు వస్తున్నారన్న విషయం తెలుసుకోగానే మరోచోటుకు తెలివిగా మారుస్తున్నట్టు ఏజెంట్లు చెబుతున్నారు. ఒక్కోసారి రికవరీకి వెళ్లినప్పుడు దాడికి యత్నించిన సందర్భాలూ ఉన్నాయని ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నారు..కంతులు చెల్లించకుండా ఉన్న కార్లను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు కొంతమంది రాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారు తీసుకుని కంతులు కట్టలేదు. దీంతో రెపో ఏజెంట్లు రికవరీ కోసం వచ్చారు. అప్పటికే సదరు కారు యజమాని బత్తలపల్లిలోని టీడీపీ నాయకుడి ఇంట్లో వాహనం పెట్టారు. అక్కడకు ఏజెంట్లు వెళ్లగా మీకు చేతనైతే తీసుకెళ్లండంటూ టీడీపీ నేత బెదిరించారు. పోలీసులు కూడా చేతులెత్తేయడంతో వెనుదిరిగారు. ఇక కోర్టుకు వెళ్లడం తప్ప చేసేదేమీ లేదని నిట్టూరుస్తున్నారు. -
●కళకళలాడుతున్న తుంగభద్రమ్మ
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం కళకళలాడుతోంది. డ్యాంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది. ఈ క్రమంలో డ్యాం 14 క్రస్ట్ గేట్ల 4 అడుగులు, 12 క్రస్ట్ గేట్లు 3 అడుగుల మేర పైకెత్తి 98,235 క్యూసెక్కులు నదికి, 13,583 వేల క్యూసెక్కులు వివిధ కాలువలకు మొత్తంగా 1,11,818 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. తుంగభద్రమ్మ కళకళలాడుతుండటంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు ఆనందంలో మునిగిపోయారు. సకాలంలో పంటలను సాగు చేసుకునేందుకు ఉత్సాహంగా నాట్లు వేసుకుంటున్నారు. ప్రసుత్తం టీబీ జలాశయంలో 1,633 అడుగుల నీటి నిల్వ గాను 1,624.62 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్ఫ్లో 82,874 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,11,818 క్యూసెక్కులుగా నమోదవుతోంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 75.260 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
● కొమ్మకొమ్మకూ గూడు
అందమైన ప్రకృతి రమణీయతలకు నెలవుగా నిలిచిన పెనకచెర్ల డ్యామ్ వద్ద పక్షి గూళ్లు ఆకట్టుకుంటున్నాయి. కిలకిల రావాలతో ఆహ్లాదాన్ని పంచే గిజిగాడు పక్షి తన పిల్లలను, గుడ్లను కాపాడుకునేందుకు ముళ్ల చెట్ల, నీటి వనరులకు దగ్గరలో ఉండే చెట్ల కొమ్మలకు కిందకు వేలాడేలా కట్టుకున్న గూళ్లు వాటి నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఒక్కొక్క గడ్డి పోచను తీసుకువచ్చి అల్లుకున్న గూడులో దాని అద్బుతమైన నైపుణ్యం కనిపిస్తుంది. మగ పక్షి మాత్రమే ఇలా గూడును అల్లే నైపుణ్యం, నేర్పు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అరుదైన బార్న్ స్వాలో పక్షులు మట్టితో మోరీల కింద నిర్మించిన గూళ్లు అబ్బురపరుస్తున్నాయి. ప్రకృతిలో ప్రతీది ఓ అద్భుతమేనంటూ చాటిచెబుతున్న బర్డ్ ఆర్కిటెక్ట్ను పరిశీలించాలంటే ఒకసారి పెనకచెర్ల డ్యామ్ను సందర్శించి తీరాల్సిందే. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
కార్లు సరే.. కంతుల్లేవ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆర్థిక స్థాయిని మించి కార్లు కొనుగోలు చేసిన వందలాది మంది నెలవారీ కంతులు కట్టలేక చతికిలపడుతున్నారు. ప్రతి వంద మందిలో పది నుంచి పదిహేనుమంది డిఫాల్టర్గా మారుతున్న పరిస్థితి. ఈఎంఐలు సరిగా కట్టకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఏడాదిగా లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తలపట్టుకు కూర్చున్నాయి. ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్) సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో బ్యాంకు సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా పోతోంది. కారు తీసుకున్నప్పుడు సిబిల్ స్కోరు బాగానే ఉన్నా తర్వాత.. కంతుల చెల్లింపుల్లో దారుణంగా విఫలమవుతున్నట్టు బ్యాంకింగ్ సంస్థలు చెబుతున్నాయి. అలా వాడి.. ఇలా కుదువకు.. కొంతమంది యువకులు కారు తీసుకుని రెండు మూడు నెలలు జల్సాగా తిరుగుతున్నారు. ఆ తర్వాత కారును తక్కువ రేటుకు ఇతరుల దగ్గర కుదువకు పెడుతున్నారు. ఆ డబ్బుతో జల్సా చేయడం, బెట్టింగ్లు, క్రికెట్ పందేలు ఇలా రకరకాలుగా వెచ్చించి పోగొట్టుకుంటున్నారు. రికవరీ ఏజెంట్లు కారు స్వాధీనానికి వెళ్లినప్పుడు కుదువ పెట్టుకుని డబ్బు ఇచ్చిన యజమాని అడ్డం తిరుగుతున్నారు. కొన్ని చోట్ల రాజకీయ బలాలు ఉపయోగిస్తున్నారు. రికవరీ ఏజెంట్ల కళ్లు గప్పి.. కార్లు లేదా ద్విచక్రవాహనాలు తీసుకున్న తర్వాత వరుసగా మూడు మాసాలు ఈఎంఐలు (నెలవారీ కంతులు) చెల్లించకపోతే రెపో ఏజెంట్లు వాహనం స్వాధీనానికి వస్తారు. కానీ ఏజెంట్లు ఎంత వెతికినా కార్లు దాచేస్తున్నారు. తాము వస్తున్నామన్న విషయం తెలుసుకోగానే మరోచోటుకు తెలివిగా మారుస్తున్నట్టు ఏజెంట్లు చెబుతున్నారు. ఒక్కోసారి రికవరీకి వెళ్లినప్పుడు దాడికి యత్నించిన సందర్భాలూ ఉన్నాయని ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నారు.. కంతులు చెల్లించకుండా ఉన్న కార్లను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు కొంతమంది రాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారు తీసుకుని కంతులు కట్టలేదు. దీంతో రెపో ఏజెంట్లు రికవరీ కోసం వచ్చారు. అప్పటికే సదరు కారు యజమాని బత్తలపల్లిలోని టీడీపీ నాయకుడి ఇంట్లో వాహనం పెట్టారు. అక్కడకు ఏజెంట్లు వెళ్లగా మీకు చేతనైతే తీసుకెళ్లండంటూ టీడీపీ నేత బెదిరించారు. పోలీసులు కూడా చేతులెత్తేయడంతో వెనుదిరిగారు. ఇక కోర్టుకు వెళ్లడం తప్ప చేసేదేమీ లేదని నిట్టూరుస్తున్నారు. ఫైనాన్స్ సంస్థల్లో కలవరం ఉమ్మడి జిల్లాలో భారీగా డిఫాల్టర్లు లోను తీసుకున్న మూణ్నెళ్లకే కారు కుదువకు అనంతపురంలో ఈఎంఐలు కట్టని వందల కార్లు స్వాధీనం ఏటా ఐదువేల కార్లకు లోన్లు ఇస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు ఇందులో 15 శాతం ఎన్పీఏలుగా ఉన్నట్టు తాజా గణాంకాల్లో వెల్లడి కార్లకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జల్లెడ పడుతున్న రికవరీ ఏజెంట్లు -
12వ పీఆర్సీని నియమించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పండ్రెండవ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యంతర భృతి (ఐఆర్) 30 శాతాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ‘స్టడీ సర్కిల్ వర్క్షాపు’ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏడాదవుతున్న వారి సమస్యలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు, రిటైర్డ్ అయిన వారికి అందాల్సిన రూ. 20 వేల కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించుకోబోమని చెబుతూనే మరోవైపు రకరకాల యాప్లు, వివిధ రకాల శిక్షణలు, ఇతర కార్యక్రమాలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, నాయకులు రామప్ప, రాఘవేంద్ర, హనుమంతరెడ్డి, ప్రమీల, రవికుమార్, అబ్దుల్ వహాబ్ఖాన్, సంజీవకుమార్, శేఖర్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ -
● వాన కురవక.. ఆశ చావక
పెద్దవడుగూరు మండలంలోని పెద్దవడుగూరు, లక్ష్ముంపల్లి, దిమ్మగుడి, చిన్నవడుగూరు గ్రామాల్లో చాలామంది రైతులు పత్తి, కొర్ర తదితర పంటలు సాగు చేశారు. అయితే, సరిగ్గా మొక్కలు మొలకెత్తాక వానలు కరువయ్యాయి. ఇటీవల మేఘాలు ఊరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో పంట ఎండుముఖం పట్టింది. వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన పంట ఎండిపోతుండడాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు ఎలాగైనా పంటను బతికించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనంలో బిందెలతో నీటిని తీసుకెళ్లి మొక్కలకు పోస్తున్నారు. లక్ష్ముంపల్లి గ్రామం వద్ద ఓబుళరెడ్డి అనే రైతు తన పొలంలోని పత్తి మొక్కలకు నీటిని పోయిస్తుండగా తీసిన చిత్రమిది. – పెద్దవడుగూరు -
ఎంపీఆర్లోకి తుంగభద్ర జలాలు
గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల వద్ద ఉన్న మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్)లోకి తుంగభద్ర జలాలు చేరుతున్నాయి. దీంతో రిజర్వాయర్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం రిజర్వాయర్ ఏఈ సురేంద్ర మాట్లాడుతూ.. కణేకల్లు నుంచి మోపిడి కాలువ ద్వారా రోజూ 500 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్లోకి చేరుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా తెలిపారు. కుమార్తెలతో కలసి తండ్రి ఆత్మహత్యాయత్నం బెళుగుప్ప: కుటుంబ కలహాల నేపథ్యంలో విసుగు చెందిన వ్యక్తి.. తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన రమేష్రెడ్డి, దివ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న పాటి విషయానికి ఆదివారం దంపతులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్రెడ్డి.. తన ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకుని వ్యవసాయ తోటలోకి వెళ్లి విషపు గుళికలు తాను తిని, చిన్నారులకూ తినిపించాడు. కాసేపటి తర్వాత పిల్లలను పిలుచుకుని ఇంటికి చేరుకున్నాడు. విషయాన్ని తల్లికి చిన్నారులు తెలపడంతో కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, ఆరేళ్ల వయసున్న కుముద్విని, మూడేళ్ల వయసున్న ఛైత్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
మహిళ దుర్మరణం
గుమ్మఘట్ట: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో గుమ్మఘట్ట మండల కో–ఆప్షన్ సభ్యుడు హిదతుల్లా తల్లి మసీదా బేగం (55) దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన మేరకు.. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం తన మనవడితో కలసి ద్విచక్రవాహనంపై కణేకల్లులో ఉన్న కుమార్తెను చూసి వచ్చేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో రాయదుర్గం మండలం కదరంపల్లి వద్దకు చేరుకోగానే మసీదాబేగం చీర కొంగు వాహనం చక్కానికి చుట్టుకోవడంతో అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆ గ్రామానికి చేరుకుని మసీదా బేగం మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెం మున్సిపల్ మాజీ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గౌని లక్ష్మీకాంత రెడ్డి, కాంట్రాక్టర్ ఆర్టీ లక్ష్మీకాంతారెడ్డి, హేమారెడ్డి, స్వామి, చమ్మా ఇబ్రహీం తదితరులు ఉన్నారు. -
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
గుంతకల్లు: తరుచూ సెల్ఫోన్ చూస్తుండటం, మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గుంతకల్లు తిలక్నగర్లోని వేద ఆస్పత్రి వెనుక వీధిలో నివాసముంటున్న మోహన్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. మోహన్ స్థానిక వాసవీ పైప్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన కుమార్తె శృతి (18) పట్టణంలోని శస్త్ర కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. కొన్ని రోజులుగా శృతి తరచూ సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఆదివారం ఉదయం కూడా ఫోన్లో మాట్లాడుతున్న ఆమెను మందలించారు. అనంతరం భార్యాభర్తలిరువురు మార్కెట్కు వెళ్లారు. శృతి తమ్ముడు తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.ఈ నేపథ్యంలోనే శృతి బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుంది. మార్కెట్ నుంచి ఇంటికి చేరుకున్న మోహన్, లక్ష్మీలు బిడ్డ ఉరికి వేలాడుతుండడం చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి శృతిని కిందికి దింపారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టూటౌన్ సీఐ ఏపీ మస్తాన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. టీచర్ల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం తగదు: వైఎస్సార్టీఏ అనంతపురం ఎడ్యుకేషన్:బదిలీ అయిన వేలాదిమంది టీచర్లకు రెండు నెలలవుతున్నా జీతాల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్టీఏ) నాయకులు వాపోయారు. ఈ మేరకు అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్గౌడ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ కేడర్స్ట్రెన్త్ అప్డేట్ చేయకుండా అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని జీతాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలను కష్టాలు నీడలా వెన్నంటే ఉంటూ పీడిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఏ విషయంలోనూ తాము సంతోషంగా లేమంటూ రైతులు వాపోతున్నారు. రైతులను ఇబ్బందికి గురిచేయడంలో మేమేమి తక్కువ కాదన్నట్లుగా ప్రభుత్వంతో జిల్లా యంత్రాంగం పోటీ పడుతోంది. ఫలితంగా రై
అనంతపురం అర్బన్: రైతులకు చుక్కుల భూముల తిప్పలను తొలగించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ‘ఫైళ్లు బారెడు... పరిష్కారం మూరెడు’ అన్నట్లుగా చుక్కల భూముల ఫైళ్ల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రతి శుక్రవారం చుక్కల భూముల ఫైళ్లను పరిష్కరిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నా.. ఆ సంఖ్య నాలుగైదుకు మించి ఉండడం లేదు. మరో వైపు చుక్కల భూములకు సంబంధించి 1,950కు పైగా ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. చుక్కల జాబితా నుంచి తమ భూములకు విముక్తి ఎప్పుడు కల్పిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. మొక్కుబడి తంతు.. చుక్కల భూములకు సంబంధించి అత్యధికంగా అనంతపురం డివిజన్లో బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, శింగనమల మండలాలతో పాటు కళ్యాణదుర్గం డివిజన్లో కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప మండలాల్లో సమస్యలు ఉన్నట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది. చుక్కలు భూములకు సంబంధించి 1,953 ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి డీఎల్సీ సమావేశం నిర్వహించి ఒక్కసారిగా 150 నుంచి 200 వరకు ఫైళ్లకు పరిష్కారం చూపినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం చుక్కల భూముల ఫైళ్ల పరిష్కార ప్రక్రియ మొక్కుబడి తంతుగా సాగుతోందనే విమర్శలు ఇటు రెవెన్యూవర్గాలు, అటు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆమోద ముద్రకు నిబంధనలిలా... చుక్కల భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం డీఎల్సీ ఆమోద ముద్ర తప్పనిసరి. ఆమోదం పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ● సాగు చేస్తున్నట్లుగా పేర్కొన్న ప్రభుత్వ భూమి వివరాలు ఆర్ఎస్ఆర్లో చుక్కలుగా ఉండాలి. ఆ భూమి ఎవరి పేరునా అసైన్ చేసి ఉండకూడదు. ● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం... ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి.. చట్టం వచ్చిన 12 ఏళ్లకు ముందే ఆ భూమిపై సాగు హక్కు, అనుభవం కలిగి ఉండాలి. ● చట్టం నిబంధనల ప్రకారం సాగు చేస్తున్న వారు తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ అనంతరం ఆర్డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దీని ఆధారంగా ఆర్డీఓ విచారణ చేసి కలెక్టర్ కార్యాలయానికి సిఫారసు చేస్తారు. ● ఆర్డీఓ సిఫారసులను కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ విచారణ చేసి నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నవాటిని జాబితా నుంచి తొలగిస్తూ అమోద ముద్ర వేస్తారు. పెండింగ్ ఫైళ్లు ఇలా... అనంతపురం డివిజన్ 1,183 కళ్యాణదుర్గం డివిజన్ 763 గుంతకల్లు డివిజన్ 7 మొత్తం 1,953 మొక్కుబడిగా చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారం డీఎల్సీలో నాలుగైదుకు మించి పరిష్కారం కాని వైనం పెండింగ్లో 1,950కు పైగా ఫైళ్లు విముక్తి కోసం రైతుల ఎదురు చూపు -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట సమీపంలో అనంతపురం – తాడిపత్రి రహదారిపై శనివారం అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని వాహనం ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఉడాయించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని అటుగా వెళుతున్న వారు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా జీజీహెచ్కు తరలించారు. చికిత్సకు స్పందించక ఆదివారం ఉదయం మృతి చెందాడు. కాగా, మరణానికి ముందు తన పేరు రవిచంద్ర అని, రాయదుర్గం పట్టణ వాసిగా ఆయన పేర్కొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఖరీఫ్ కల్లోలం
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ కల్లోలంగా మారింది. వర్షాలు లేక ఏరువాక మందకొడిగా ‘సాగు’తోంది. జూన్ 15 నుంచి దాదాపు నెలన్నర రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పదును వర్షం ఎక్కడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. తేలికపాటి వర్షాలకే పంటల సాగు కొనసాగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘ముంగారు’ మందగించడంతో అన్నదాత మరోసారి కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. పరిస్థితి ఘోరంగా కనిపిస్తున్నా కూటమి సర్కారు మాత్రం ఎలాంటి సాయం చేయకుండా చేతులెత్తేస్తుండటంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సాగు 32 శాతం.. వ్యవసాయశాఖ తాజా నివేదిక ప్రకారం 32 శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3,43,232 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి 1.08 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. నెలాఖరు నాటికి 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. అయినా ఇంకా 1.90 లక్షల హెక్టార్లు పంటలు లేక బీళ్లుగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, సజ్జ, కొర్ర లాంటి ప్రధాన పంటల సాగుకు ఈ నెలాఖరుతో గడువు ముగియనుండంతో రైతుల ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రత్యామ్నాయమే శరణ్యమని చెబుతున్నారు. నెలాఖరు నాటికి 40 శాతం విస్తీర్ణంలో పంటలు వచ్చినా ఇంకా 60 శాతం మిగిలిపోనుందని అంచనా వేస్తున్నారు. ముఖం చాటేసిన వరుణుడు.. ‘నైరుతి’ ఈ సారి మే 26న ముందస్తుగా పలకరించి మురిపించినా... విత్తు సమయం వచ్చే సరికి వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15 నుంచి ఒక్క మంచి వర్షం కూడా నమోదు కాకపోవడం గమనార్హం. జూన్లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. కీలకమైన జూలైలో 63.9 మి.మీ గానూ ప్రస్తుతానికి 37 శాతం తక్కువగా 35 మి.మీ నమోదైంది. జూన్, జూలైలో వరుణుడు కరుణించకపోవడంతో తేలికపాటి నడుమ పంటలు వేశారు. రెండు మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. 40 వేల హెక్టార్లకు వేరుశనగ పరిమితం.. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన పంట వేరుశనగ ఈ సారి కేవలం 40 వేల హెక్టార్లకు పరిమితమైంది. సాధారణ విస్తీర్ణం 1.82 లక్షల హెక్టార్లు అంచనా వేయగా అందులో 22 శాతం విస్తీర్ణంలో మాత్రమే వేరుశనగ వేయడం గమనార్హం.అయితే కంది పంట సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు కాగా ఇప్పటికే 75 శాతం విస్తీర్ణంతో 42 వేల హెక్టార్ల సాగుతో సాధారణానికి చేరువైంది. ప్రస్తుతం సజ్జ పంట మాత్రమే 2,054 హెక్టార్లకు గానూ 2 వేల హెక్టార్లలో వేశారు. ఇక పత్తి పరిస్థితి దారుణంగానే ఉంది. 44 వేల హెక్టార్లకు గానూ 28 శాతంతో 12 వేల హెక్టార్లలో పత్తి విత్తుకున్నారు. ఆముదం పంట 16,293 హెక్టార్లకు గానూ 30 శాతంతో 4,800 హెక్టార్లలో వేశారు. మొక్కజొన్న 14,653 హెక్టార్లకు గానూ 58 శాతంతో 8,500 హెక్టార్లలో వేశారు. మిగతా పంటలు నామమాత్రంగా సాగులోకి వచ్చాయి. ఓవరాల్గా కంది, సజ్జ మినహా మిగతా పంటల సాగు పూర్తిగా చతికిలపడింది. వర్షాభావం, విత్తన సమస్య, పెట్టుబడి భారం తదితర కారణాలతో చాలా మంది రైతులు వేరుశనగ సాగుపై అనాసక్తి ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. 30 శాతం తక్కువగా వర్షపాతం 32 శాతం విస్తీర్ణంలోనే సాగులోకి పంటలు 40 వేల హెక్టార్ల కనిష్ట స్థాయికి వేరుశనగ -
ఇంజినీరింగ్తో బంగారు భవిష్యత్తు
బుక్కరాయసముద్రం: ఇంజినీరింగ్తో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ఆచార్య డాక్టర్ హేమచంద్రారెడ్డి అన్నారు. బీకేఎస్ మండలం రోటరీపురం సమీపంలో ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాల 3వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ హేమచంద్రారెడ్డి, కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ చదవడానికి ముందు మంచి కళాశాల ఎంపిక ముఖ్యమన్నారు. నాలుగేళ్ల పాటు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటే నాలుగు దశాబ్దాల పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో 3వ స్నాతకోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా తాను, తన భార్య జొన్నలగడ్డ పద్మావతి 2008లో ఈ కళాశాలను స్థాపించినట్లు గుర్తు చేశారు. దినదినాభివృద్ధి చెందుతూ నాణ్యతా ప్రమాణాలతో అటానమస్ హోదా దక్కించుకుందన్నారు. కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న 620 మందికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశామన్నారు. వీరిలో 430 మందికి దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో రూ.4 లక్షల నుంచి రూ.9లక్షల వరకు ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ(ఏ) ప్రతనిధి వేణుగోపాలరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఐటీ స్నాతకోత్సవంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డి -
అప్పుల ఊబిలో రాష్ట్రం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రం రూ.1.50 లక్షల కోట్ల అప్పల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్తో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తోందన్నారు. అమరావతి పేరుతో రూ.31 వేలు కోట్లు అప్పు తెచ్చారన్నారు. మరో రూ.31 వేల కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. చంద్రబాబు ఢిల్లీ, సింగపూర్ పర్యటనల వల్ల రాష్ట్రానికి మేలు జరగకపోగా.. అప్పుల భారం మరింత పెరుగుతోందన్నారు. 21సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించినా నోరుమెదపలేకపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సహకరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ట్రూఅప్ చార్జీల పేరుతో ఆరు నెలల్లోనే రూ.15,480 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. సమావేశంలో సీపీఐ ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్యయాదవ్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, కార్యదర్శివర్గ సభ్యుడు రాజారెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. -
వేడుకగా చందన షాపింగ్ మాల్ ప్రారంభం
● సందడి చేసిన నిధి అగర్వాల్ అనంతపురం కార్పొరేషన్: నగరంలోని సూర్యనగర్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన చందన షాపింగ్ మాల్ను ఆదివారం సినీనటి నిధి అగర్వాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చందన షాపింగ్ మాల్లో మెన్స్, ఉమెన్స్, కిడ్స్ వస్త్రాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. వస్త్ర వ్యాపారంలో వినియోగదారులతో చందన షాపింగ్ మాల్కు 40 ఏళ్ల అనుబంధముందన్నారు. ఈ క్రమంలో సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ను అనంతపురానికి తీసుకువచ్చామన్నారు. సొంత మగ్గాలతో నేయించిన చీరలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రారంభం సందర్భంగా కొనుగోలుదారులకు ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక చీర కొంటే మరో చీరపై 99 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్, నిర్వాహకులు ఎంవీ సంతోష్ రాంమోహన్, ఎంవీ గణేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మాల్ ప్రారంభానికి విచ్చేసిన నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ పాటలకు స్టెప్పులు వేసి ప్రజలను అలరించారు. -
అనగనగా ఓ బిహారి!
అనంతపురం మెడికల్: ఊరుకాని ఊరు... నా అనుకున్న వారు ఉన్నారో లేదో కూడా తెలీదు. కాలిన గాయాలు మానినా.. బిక్కుబిక్కుమంటూ జీజీహెచ్లోనే దోకాడుకుంటూ తిరుగుతోంది ఓ అభ్యాగురాలు. హిదీలో మాట్లాడితే.. తనకెవరూ లేరని సమాధానం ఇస్తోంది. కాస్త టీ ఇప్పించండి, ఆకలిగా ఉందంటూ అటు వెళ్తున్న వారిని పలకరిస్తూ దీనస్థితిలో వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సర్జరీ విభాగంలో 30 ఏళ్ల వయసున్న బిహార్కు చెందిన జ్ఞాని ఉంటోంది. ఈ ఏడాది మార్చి 24న రైలులో ప్రయాణిస్తుండగా విద్యుత్ షాక్కు గురై 50 నుంచి 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి చేరింది. అందరూ బతకదనుకున్నారు. అయితే సర్జరీ వైద్యులు, స్టాఫ్నర్సులు వైద్యం అందించి ఆమెకు ఊపిరి పోశారు. కోలుకున్న తర్వాత తన వారి గురించి అడిగితే ‘పతా నహీ’ అంటూ సమాధానం ఇస్తోంది. దీంతో ఆమెను ఎక్కడికి పంపాలో తెలియని అయోమయంలో వైద్యులు పడ్డారు. మహిళలకు భద్రత లేని ప్రస్తుత రోజుల్లో ఆమెను బయటకు పంపిస్తే ఎలాంటి ఆపదలో పడుతుందోననే ఆందోళన వైద్యులు, నర్సుల్లో నెలకొంది. దీంతో మానవతా దృక్పథంతో ఆలోచించి సర్జరీ విభాగంలోనే ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సర్జరీ విభాగం వైద్యులు, నర్సులను అభినందిస్తున్నారు. నాలుగు నెలలుగా జీజీహెచ్ వార్డులోనే ఆశ్రయం యువతి సంబంధీకుల ఆచూకీ తెలియని వైనం భద్రత దృష్ట్యా వార్డులోనే ఉంచిన సర్జరీ విభాగం వైద్యులు -
కసాపురంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధిగా, భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనార్థం భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. శోభాయమానంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్న నెట్టికంటుడి సేవలో భక్తులు తరించారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా సీతారామలక్ష్మణులతో కలిసి ఆంజనేయస్వామి వారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం వేకువజామునే అర్చకులు స్వామివారి మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని స్వర్ణ కవచ అలంకరణ, ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను శేషవాహనంపై కొలువుదీర్చి అందంగా అలంకరించారు. ఆలయ ఈఓ కే.వాణి, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. శేషవాహనంపై కొలువుదీరిన స్వామివార్లు ఆలయం చుట్టూ ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. -
అక్రమాలకు పాల్పడితే చర్యలు
● శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఎస్ఆర్ఓకు అవినీతి అధికారిగా పేరుంది. గతంలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అరోపణలు ఉన్నాయి. క్రయ, విక్రయదారులు లేకుండానే థర్డ్ పార్టీ వ్యక్తులతో కుమ్మకై ్క భారీస్థాయిలో డబ్బులు దండుకొని గతంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ను రద్దు చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో.. కిందిస్థాయి ఉద్యోగులపై తప్పును నెట్టారు. ఉన్నతాధికారులు మరోమారు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఉందంటూ నివేదిక ఇవ్వడంతో సస్పెండయ్యారు. ప్రస్తుతం బుక్కపట్నంలో సైతం అదే పంథాలో విధులు నిర్వర్తిస్తున్నారు. టీడీపీ నేతల అండతో పెద్ద ఎత్తున అసైన్డ్, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. క్రయవిక్రయాలకు సంబంధించి డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే అధికారులకు చేయి తడపాల్సిందే. లేదంటే కొర్రీలు వేసి రిజిస్ట్రేషన్లు కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 12, శ్రీసత్యసాయి జిల్లాలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు చెబితే ఎలాంటి భూములకై నా రిజిస్ట్రేషన్లు చేస్తారు. వారి ఆజ్ఞ లేకుంటే పట్టా భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయకుండా కొర్రీలు చూపుతారు. ఇటీవల చిలమత్తూరులో సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తూ ఇటీవలే కదిరికి బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ పెద్ద మొత్తంలో డబ్బు దండుకుని చిలమత్తూరు పరిధిలో ఓ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం కాస్తా పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లడంతో ఆయన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగమేఘాలపై ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు. ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఫ్రీ హోల్డ్ భూములను అక్కడి సబ్ రిజిస్ట్రార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశారు. కూడేరు మండలం కమ్మూరులో డైక్లాట్లో రోడ్డుగా ఉన్న 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం ఓ సబ్ రిజిస్ట్రార్ భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ రోడ్డు స్థలంలో ఓ వెంచర్ వెలిసిందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టంగా అర్థం అవుతోంది. నామమాత్రంగా ఏసీబీ దాడులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏడాదికి, రెండేళ్లకోసారి నామమాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అనంతపురం రామ్నగర్ కార్యాలయంలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రారు సత్యనారాయణపై ఏసీబీ దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. బుక్కపట్నంలో ఎస్ఆర్ఓ శ్రీనివాసులు ఏడాది క్రితం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే ఆయన ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకొని చైన్నె వెళ్లి అక్కడ ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కాసులు ఇవ్వాల్సిందే టీడీపీ నేతల కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులు ఉమ్మడి జిల్లాలో భారీగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రూ.లక్షల్లో దండుకుంటున్న సబ్ రిజిస్ట్రార్లు భూ యజమానులపైనే కేసులు.. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి పొలం రుద్రంపేట పరిధిలో అత్యంత విలువైన 5 ఎకరాల పొలం లావాదేవీలపై భూ యజమానులు కోర్టులో దావా వేశారు. కోర్టులో దావా నడుస్తున్న ఆ భూమిని ఓ మిల్క్ డెయిరీ నిర్వాహకుడు కొనుగోలు చేశాడు. డెయిరీ నిర్వాహకునితో రూరల్, అనంతపురం రామ్నగర్ కార్యాలయాల్లో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు కుమ్మకై ్క రూ.లక్షల్లో డబ్బులు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. బాధిత భూయజమానులు రామ్నగర్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తే.. విధులకు ఆటంకం కలిగించారని వారిపైనే పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడితే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వ అదాయాన్ని పెంచే విధంగా వ్యవహరించాలి. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిస్తే సహించేది లేదు. కళ్యాణదుర్గం సబ్రిజిస్ట్రార్పై ఏసీబీ దాడుల నివేదిక ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం. – విజయలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అనంతపురం -
వ్యక్తిపై వేట కొడవలితో దాడి
గుంతకల్లు రూరల్: పొలం రస్తా వివాదంలో గుర్రబ్బాడు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తిపై శనివారం అదే గ్రామానికి చెందిన గోవిందు అతడి కుటుంబ సభ్యులు వేట కొడవలితో దాడి చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గుర్రబ్బాడు గ్రామానికి చెందిన కదిరప్ప, ప్రమీలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు సుధీర్ పేరున నాలుగు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన బాలిరెడ్డి అనే రైతు వద్ద నుంచి 1.48 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. పక్క పొలం రైతు అయిన గోవిందుతో ఆరోజు నుంచి రస్తా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం కదిరప్ప భార్య ప్రమీలమ్మ, పెద్ద కుమారుడు సూర్యనంద, అతడి భార్య హేమలతలు వారి పొలంలో కందిపంట సాగు చేయడానికి వెళ్లారు. అప్పటికే పక్క పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న గోవిందు, అతడి భార్య రామాంజినమ్మ, కుమారులు రాజమోహన్, అజయ్కుమార్లు ‘మీ పొలానికి రస్తా లేదం’టూ వారిని అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో గోవిందు అతడి కుమారులు ప్రమీలమ్మతోపాటు, కొడుకు, కోడలును కొట్టి ఇంటికి పంపారు. విషయం తెలుసుకున్న కదిరప్ప రెండో కుమారుడు మధు వారిని వెంటబెట్టుకొని మరోసారి పొలానికి వెళ్లాడు. రస్తా సమస్యపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మధుపై వేటకొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
బదిలీ టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులు బోధనకంటే బోధనేతర పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందన్నారు. యోగాంధ్ర, మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం, శిక్షణ తరగతులు పేరుతో బోధనకు దూరం చేస్తున్నారన్నారు. ఇవి కాకుండా రోజూ ఏదో ఒక సమాచారం అడుగుతున్నారని, అత్యవసరమంటూ యాప్లలో అప్లోడ్ చేయాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తోందన్నారు. విద్యా కిట్ల పంపిణీ అప్లోడ్ చేయాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు. ఇవికాకుండా ఉపాధ్యాయులకు ఏ మాత్రం సంబంధంలేని పీ–4 వంటి కార్యక్రమాలను కూడా అప్పగిస్తున్నారన్నారు. యాప్ల భారం తగ్గిస్తామని చెబుతూనే ఒకే యాప్లో అనేక సమాచారాలు పెట్టమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు జరిగి నెలరోజులు గడచినా ఇప్పటికీ వేలాదిమంది ఉపాధ్యాయులు రిలీవింగ్కు నోచుకోలేదన్నారు. పేరుకు ఐదుగురు టీచర్లను ఇచ్చినా చాలా పాఠశాలల్లో ఇద్దరే పనిచేస్తున్నారన్నారు. వారిపై బోధనా భారం ఎక్కువగా ఉందన్నారు. బదిలీ అయిన టీచర్లకు జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమణయ్య, సరళ, సుబ్బరాయుడు, చంద్రమోహన్, నాగేంద్ర, శ్రీనివాసులు, ఆదిశేషయ్య, సుభాషిణి, శ్రీకాంత్, సంపత్ కుమార్ పాల్గొన్నారు. టీచర్ల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహులు మాట్లాడారు. ముందుచూపు లేకుండా ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించడంతో బదిలీ అయిన టీచర్లకు నేటికీ జూన్ నెల జీతాలు రాలేదన్నారు. జూలై నెల జీతం కూడా క్లెయిమ్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంటి అద్దెలు కట్టలేక నెలసరి ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు. తక్షణమే జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తదుపరి జరిగే నష్టాలకు ఉపాధ్యాయులనే బాధ్యులు చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సభ్యులు దేశాయి నాగరాజు, మోహన్రెడ్డి, భాస్కర్, నరేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సర్దార్ వలి పాల్గొన్నారు. మచ్చా దత్తారెడ్డి మెరుపు సెంచరీ ● ప్రాబబుల్స్ పోటీల్లో సత్తా అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ వన్డే ఆంధ్రా జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న ప్రాబబుల్స్ పోటీల్లో అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి సత్తా చాటాడు. 60 బంతుల్లో 10 సిక్సర్లు, 11 ఫోర్లతో 127 పరుగులతో చెలరేగాడు. ప్రాబబుల్స్ పోటీలు విజయనగరంలో నిర్వహిస్తున్నారు. టీమ్–డీ, టీమ్– సీ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న టీమ్–డీ 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోరు చేసింది. (వర్షం కారణంగా మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు). మచ్చా దత్తారెడ్డి టీమ్–డీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్–సీ జట్టు 166 పరుగులు మాత్రమే చేసింది. టీమ్–డీ 94 పరుగులతో భారీ విజయం సాధించింది. -
పాఠశాలలో పెచ్చులూడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
గుంతకల్లుటౌన్: స్థానిక ఆలూరు రోడ్డులోని సెయింట్ పాల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శనివారం మధ్యాహ్నం తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడి 7వ తరగతి చదువుతున్న ఓంకార్, స్టీఫెన్జాయ్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మస్తాన్రావు విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ప్రమాదం జరిగిన తరగతి గదిని ఆయన పరిశీలించారు. ఎంఈఓ మస్తాన్రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం అనంతరం ఏడో తరగతి గదిలో క్లాసులు జరుగుతుండగా పైకప్పు పెచ్చులూడి పడిందన్నారు. దీంతో విద్యార్థుల తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. ఇద్దరికీ తలకు కుట్లు పడ్డాయని చెప్పారు. పాఠశాల కరస్పాండెంట్ అందుబాటులో లేరని, సోమవారం మరోసారి పాఠశాలను తనిఖీ చేసి జరిగిన ఘటనపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపుతానని పేర్కొన్నారు. ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. -
సాయం చేయబోయి మృత్యువాత
● రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ దుర్మరణం గార్లదిన్నె: తోటి డ్రైవర్ పడుతున్న ఇబ్బంది చూసి టైరు మార్చేందుకు సాయం చేయడానికి వెళ్లిన బొలెరో డ్రైవర్ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కర్నూలు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం సంజీవపురానికి చెందిన నరసింహులు (32) బొలెరో వాహనం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేడు. గురువారం కళ్యాణదుర్గం నుంచి బీరకాయల లోడ్తో హైదరాబాద్ మార్కెట్కు బయల్దేరాడు. శుక్రవారం అన్లోడ్ చేశాడు. అనంతరం ఎరువులు లోడ్ చేసుకుని కర్నూలు జిల్లా బేతంచెర్లకు వస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున కోదండపూర్ సమీపంలోకి రాగానే అప్పటికే అక్కడ మరొక బొలెరో వాహనం టైరు పంక్చర్ అవడంతో రోడ్డు పక్కన ఆపారు. టైరు మార్చేందుకు డ్రైవర్ ఇబ్బంది పడుతుంటే నరసింహులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వాహనం ఢీకొనడంతో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
సైనికుల త్యాగం స్ఫూర్తిదాయకం
గుంతకల్లు: భారత సైనికుల త్యాగం, ధైర్యం నేటితరానికి స్ఫూర్తిదాయకమని వన్టౌన్ సీఐ మనోహర్, లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా గరీబ్ నవాజ్, మహేష్రాజు పేర్కొన్నారు. శనివారం కార్గిల్ దివస్ సందర్భంగా దాదాపు 500 మీటర్ల జాతీయ జెండాను గుంతకల్లు పురవీధుల్లో భారీ ర్యాలీతో ఊరేగించారు. ఈ సందర్భంగా రైల్వే గ్రౌండ్లో ఏర్పాటు సమావేశంలో పలువురు వీరసైనికులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ బలానికి, సహనానికి కార్గిల్ విజయగాథ నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కోశధికారి బాలాజీ, లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఇల్లూరు గోపాలకృష్ణ, మెంబర్లు రాము, రంగస్వామి, జగన్నాథ్, దినేష్, విజయ్బాస్కర్, రవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్రమ్మ ఉగ్రరూపం
బొమ్మనహాళ్: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. టీబీ డ్యాంకు వరద పోటెత్తింది. జలాశయానికి ఎగువన ఉన్న తుంగ డ్యాం నుంచి 70 వేల క్యూసెక్కులు, భద్ర డ్యాం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. ఇదే క్రమంలో పరివాహక ప్రాంతాల్లో వర్షం భారీగా కురవడంతో వదర ఉరకలెత్తుతూ డ్యాంకు చేరుతోంది. ఈ క్రమంలో టీబీ బోర్డు అధికారులు డ్యాం గేట్లన్నీ తెరిచి లక్ష క్యూసెక్కుల నీటిని నదికి వదిలేస్తున్నారు. నీటి విడుదల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. నది వైపు రైతులు, జాలర్లు, మత్య్సకారులు వెళ్లరాదని సూచించారు. తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 1,625.43 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, డ్యాం 19వ గేటు సరిగా లేని కారణంగా దాన్ని కుదించారు. 80 టీఎంసీలు నిల్వ చేసి మిగిలిన నీరు నదికి విడుదల చేస్తున్నారు. 19వ గేటు మినహా అన్ని గేట్లు తెరిచి నీటిని నదికి వదులుతున్నారు. -
జస్టిస్ సురేష్ రెడ్డికి ఘన స్వాగతం
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేష్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆర్ అండ్బీ అతిథి గృహంలో శనివారం జస్టిస్ సురేష్ రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. రేపు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు అర్జీలను meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలిపారు. వృద్ధులు, నిస్సహాయకులకు ఇంటివద్దే రేషన్ పంపిణీ అనంతపురం అర్బన్: 65 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులకు వారి ఇళ్ల వద్దకే డీలర్లు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. డీలర్లు సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అని అధికారులు తనిఖీ చేయాలన్నారు. శనివారం స్థానిక నాయక్నగర్లోని 37వ చౌక ధరల దుకాణం పరిధిలోని వృద్ధుల ఇళ్లవద్దకు ఇన్చార్జ్ కలెక్టర్ వెళ్లి బియ్యం, సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31లోపు చౌక దుకాణాల పరిధిలో బియ్యం కార్డులున్న వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులకు రేషన్ అందించాలని చెప్పారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో క్షేత్రస్థాయిలో పర్యటించి పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్రెడ్డి, తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోండి అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025– 26 విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ కోరారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి, ఏవైనా పనులు చేసుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటూ రెగ్యులర్గా పాఠశాల, కళాశాలలకు వెళ్లలేని వారికి ఇదో మంచి అవకాశమన్నారు.ప్రచారంలో భాగంగా శనివారం గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జి. రామసుబ్బారెడ్డి, అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూ కొఠారి చేతుల మీదుగా వారివారి కార్యాలయాల్లో ఓపెన్ స్కూల్కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లాకు 594 మెట్రిక్ టన్నుల ఎరువులు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు మాధవన్ కంపెనీకి చెందిన 594 మెట్రిక్ టన్నుల ఎరువులు చేరినట్లు రేక్ అధికారి, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో 24–24–0–3–0 రకం 248 మెట్రిక్ టన్నులు, 24–24–0 రకం 282 మెట్రిక్ టన్నులు, 20–20–0–13 రకం 64 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ మేరకు ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. -
లడ్డూలో నాణ్యత ఎంత?
బొమ్మనహాళ్: శ్రావణ మాసంలో శని, మంగళవారాల్లో నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ప్రసాదంగా లడ్డూలు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇక్కడ బయటి ప్రాంతాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా తెప్పించిన లడ్డూలను ఎవరికి తోచినట్టు వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఇలా సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శుచి–శుభ్రతతో రుచికరంగా తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ విక్రయాల కోసం ఆలయ అధికారులు దేవదాయ శాఖ అనుమతి తీసుకుని వేలం పాట నిర్వహించాలి. వేలం దక్కించుకున్న వారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు నాణ్యతను పరిశీలించిన తర్వాత లడ్డూలను విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా బయట నుంచి లడ్డూలు తెప్పించి భక్తులకు ప్రసాదం పేరుతో అమ్ముతున్నారు. రెండు చిన్న సైజు లడ్డూలు రూ.50 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రసాదంతో పాటు స్వామి ఫొటోలను ఎవరు పడితే వారు.. ఎంత పడితే అంత ధరలకు విక్రయిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి లడ్డూ ప్రసాద ప్రాశస్త్యం, పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. నేమకల్లులో అనధికారిక విక్రయాలు ఇష్టమొచ్చిన ధరలతో భక్తుల జేబులకు చిల్లు పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు -
అధికారుల కనుసన్నల్లోనే ‘ఉపాధి’ అక్రమాలు
బుక్కరాయసముద్రం: మండలంలో ‘ఉపాధి’ అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఉపాధి కూలీలు పనులకు రాకున్నా వారి పేరున ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు బిల్లులు రాసుకుంటున్నారని ఆరోపించారు. కూలీల వద్ద వారం వారం డబ్బు వసూలు చేస్తూ దందాకు తెరలేపారన్నారు.అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరుతున్నాయని, ఎంపీడీఓ,ఏపీఓ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీకేఎస్లో జాబ్ కార్డుల పంపకాల్లో తేడాలు వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు దాడులు చేసుకుంటున్నారన్నారు. ఉపాధి అక్రమాలను అరికట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేష్, చంద్ర, బయపరెడ్డి, రంగా, నాగరాజు, నాగ, సాకే లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
బుక్కరాయసముద్రం: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి’ అన్నట్టు... అక్రమ ఆదాయం కోసం టీడీపీ కార్యకర్తలు అర్రులు చాస్తున్నారు. వారిలో వారే కలహాలు పెంచుకుని గొడవలకు దిగుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద దొంగ మస్తర్ల నమోదులో తేడాలు రావడంతో మేట్ల అవతారం ఎత్తిన ‘తమ్ముళ్లు’ ముష్టియుద్ధానికి దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల అవతారం ఎత్తి భారీఎత్తున దోపిడీకి తెరతీశారు.పనులకు రాని వారి పేరుతో దొంగ మస్తర్లు సృష్టించి నిధులు కాజేస్తున్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు సురేశ్, బాలు, చితంబరి, నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి సీనియర్ మేట్లుగా ఉన్నారు. వీరిలో నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, చితంబరి ‘ద్విసభ్య కమిటీ సభ్యుల’ వర్గీయులు కాగా.. బాలు, సురేశ్ ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులు. వీరికి జాబ్ కార్డుల పంపకాల్లో తేడాలు వచ్చాయి. తమ పరిధిలోని జాబ్ కార్డులపై ఎందుకు దొంగ మస్తర్లు తయారు చేస్తున్నారంటూ నారాయణస్వామి, చెరుకూరి నారాయణస్వామి, చితంబరి కలిసి ఎమ్మెల్యే వర్గీయులను ప్రశ్నించారు.నివారం మండలంలోని రెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులు జరుగుతుండగా అక్కడ పరస్పరం గొడవకు దిగి, కొట్టుకున్నారు. తర్వాత రెండువర్గాల వారు రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో పేరిట హంగామా సృష్టించారు. విషయం తెలుసుకున్న సీఐ పుల్లయ్య ఘటన స్థలానికి వెళ్లి వారిని చెదరగొట్టారు. ఐదుగురు సీనియర్ మేట్లనూ తొలగిస్తున్నట్లు ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించే వరకు ఉపాధి పనులను నిలిపివేస్తున్నట్టు ఆయన చెప్పారు. -
ప్రభుత్వ భూమిపై 'పచ్చ'గద్ద
అధికారంలో ఉన్నాం... తమకు ఎదురు లేదనుకున్నాడో ఏమో ఓ పచ్చ నేత బరితెగించాడు.ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పన్నాడు. సెంటు, రెండు సెంట్లు కాదు ఏకంగా రూ. 5 కోట్లకు పైగా విలువ చేసే 3.80 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించాడు. మొన్నటిదాకా ఎలాంటి అనుమతులు లేకుండా, ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యుల పేరు చెప్పుకుంటూ ఎర్రమట్టిని యథేచ్ఛగా తరలించి ‘క్యాష్’ చేసుకున్న ఈయన... తాజాగా ప్రభుత్వ భూమిపై కన్నేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కందుకూరు పొలం 90–3 సర్వే నంబరులో 3.86 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో తహసీల్దార్ కార్యాలయంలో పని చేసిన ఓ అధికారి తన బినామీ పేరుతో 3.86 ఎకరాలకు నకిలీ ‘మిల్ట్రీ’ పట్టా తయారు చేయించి రికార్డుల్లోకి ఎక్కించాడు. ఎవరి పేరుమీద పట్టా ఉందో ఆ వ్యక్తి ఇప్పటిదాకా తహసీల్దార్ కార్యాలయానికి కానీ, ఈ భూమివైపు కానీ తొంగిచూడలేదు. దీంతో పట్టా రద్దుకు గత ప్రభుత్వంలో సిఫార్సు చేశారు. అలాగే, కృష్ణంరెడ్డిపల్లికి చెందిన పేదలకు ఇంటి పట్టాల కోసం ఈ భూమిలో ఎకరన్నర భూమిని ‘జగనన్న కాలనీ’కి కేటాయించారు. 48 మంది లబ్దిదారులకు ప్లాట్లు కేటాయించేలా స్కెచ్ కూడా తయారు చేశారు. లబి్ధదారులను ఎంపిక చేసి పట్టాలు తయారు చేసే క్రమంలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వంలో పచ్చ నేత కన్ను.. ప్రభుత్వం మారగానే కృష్ణంరెడ్డిపల్లికి చెందిన ఓ చోటా నేత ఈ భూమిపై కన్నేసి కబ్జా చేసేందుకు పూనుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ట్రాక్టర్తో దున్ని చదునుచేసేందుకు వెళ్లాడు. ట్రాక్టర్తో అర ఎకరా వరకు దున్నాడు. ఇంతలో సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. భూమి తమదేనంటూ పచ్చ నేత బుకాయించే ప్రయత్నం చేశాడు. అధికారులు తిరగబడడంతో మెత్తబడ్డాడు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే సీరియస్గా పరిగణిస్తామని హెచ్చరించారు. కుప్పలుగా నకిలీ పట్టాలు.. గతంలో కొందరు రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ‘మిల్ట్రీ’ పట్టాల పేరుతో పెద్ద ఎత్తున దందా చేశారు. ‘మిల్ట్రీ’ పట్టాల పంపిణీలో కనీస నిబంధనలు పాటించలేదు. ఎవరో ఒకరిమీద.. అదికూడా పదేళ్ల కిందటే మిల్ట్రీ పట్టా పుట్టించి వాటిని రికార్డుల్లోకి ఎక్కించేందుకు కొందరు బాగా సహకరించారు.పదేళ్లు పూర్తికావడంతో వారి నుంచి మరొకరు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మకాలకు తెర తీశారు. ఈ ముసుగులో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట, ఉప్పరపల్లి, కందుకూరు, కొడిమి, ఎ.నారాయణపురం సర్వే నంబర్లలో నకిలీ పట్టాదారులు ఎక్కువగా ఉన్నారు. మాజీ సైనికులకు ప్రభుత్వ భూమి కేటాయించాలంటే ముందుగా సైనిక సంక్షేమశాఖ నుంచి పేర్లు కలెక్టర్కు సిఫార్సు చేయాలి. కలెక్టర్ పరిశీలించి సంబంధిత మండలాల తహసీల్దార్లను ఆదేశిస్తారు. వారు తమ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించి తిరిగి కలెక్టర్కు.. అక్కడి నుంచి సైనిక సంక్షేమశాఖ అధికారులకు పంపుతారు. ఆ తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు భూములను అర్హులైన మాజీ సైనికులకు ‘అసైన్డ్’ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ఎక్కడా లేకుండానే కొందరు ఘనులు పట్టాలిచ్చారు. ‘మిల్ట్రీ’ పట్టా భూములపై లోతుగా విచారణ జరిపితే అక్రమాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తాయని స్వయంగా రెవెన్యూ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఉరవకొండలో బరితెగింపుఉరవకొండ: అధికార అండ చూసుకుని తమ్ముళ్లు బరి తెగిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. ఉరవకొండ పట్టణంలో రూ.లక్షలు విలువ చేసే 20 సెంట్ల ప్రభుత్వ భూమిలో రాత్రికే రాత్రే జేసీబీల సాయంతో చదును చేసి పసుపు రంగు రాళ్లు పాతడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీలోని సర్వే నం. 552లో 2023లో పేదలకు పట్టాలు ఇచ్చారు. ఇంకా కొంత స్థలం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఈ స్థలంపై కన్నేశారు. నకలీ పట్టాలు సృష్టించుకుని ఇటీవల అందులోకి చొరబడ్డారు. హద్దుల రాళ్లు పాతి వాటికి పసుపు రంగు కొట్టారు. గతంలో ఉరవ కొండ పట్టణానికి చెందిన ఓ ప్రయివేట్ సర్వేయర్ సాయంతో నకలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గతంలో శివరామిరెడ్డి కాలనీలోనే సదరు సర్వేయర్ అనేక నకలీ పట్టాలు తయారు చేసి లక్షలాది రూపాయలు దోచుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఆయనకు ఏమాత్రం సంబంధం లేదుకృష్ణంరెడ్డిపల్లి సమీపంలో 90–3 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారనే సమాచారంతో వెళ్లి పరిశీలించాం. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. చదును చేస్తున్న వ్యక్తికి, ఆ భూమికి ఏమాత్రం సంబంధం లేదు. వెంటనే ట్రాక్టర్ తీసుకుని భూమిలో నుంచి బయటకు పంపించాం. ఫారం–1,2 నోటీసులు జారీ చేశాం. మళ్లీ భూమిలో కనిపిస్తే ట్రాక్టర్ను సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయిస్తాం. – మోహన్కుమార్, తహసీల్దార్, అనంతపురం రూరల్ మండలం -
బండారు శ్రావణి వర్గం Vs ఫీల్డ్ అసిస్టెంట్లు.. తన్నుకున్న తమ్ముళ్లు!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో భారీగా అవినీతి జరుగుతోంది. తాజాగా అవినీతి డబ్బులు కోసం టీడీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. టీడీపీ నేతలు అవినీతి డబ్బు కోసం తన్నుకున్నారు. టీడీపీలోని రెండు వర్గాలు ఇలా తన్నుకోవడంపై స్థానికులు ఆశ్చర్యపోయారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రెండు వర్గాలు విడిపోయారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గం ఒకటి కాగా, టీడీపీ టూమెన్ కమిటీ వర్గాల మరొకటిగా విడిపోయింది. తాజాగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అవినీతి డబ్బుల కోసం తన్నుకున్నారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరు
విడపనకల్లు: ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి మోసగాడని, అబద్ధాలకోరని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం విడపనకల్లులో గౌరమ్మబావి మైదానంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యకమంపై వైఎస్సార్సీపీ కార్యకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక పజలను వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సూపర్ సిక్స్లో ఒక్కటైన ‘తల్లికి వందనం’ పథకాన్ని అరకొరగా అమలు చేసి.. అన్ని పథకాలూ అమలు చేసేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. మహిళలను, విద్యార్థులను, రైతులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి నిస్సిగ్గుగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ‘సుపరి పాలనలో తొలి అడుగు’ అని కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటన్నారు. ఏడాది పాలనకే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన మహా ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. అనతికాలంలోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని అన్నారు. రెడ్బుక్ మాటున అక్రమ కేసులు.. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్న కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చూపని ఉత్సాహం ‘రెడ్బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో గిన్నిస్ బుక్ ఎక్కారని మండిపడ్డారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామని ఇంతవరకూ ఇవ్వకుండా దగా చేశారన్నారు. కూటమి నేతల అరాచకాలను, పథకాల అమలు విషయంలో చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కురుబ రమేష్, ఎంపీపీ పుష్పావతి, నాయకులు భరత్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరన్న, మండల అధ్యక్షుడు కురుబ గిరిబాబు, ఉప కన్వీనర్ బోయ నాగేంద్ర, సీనియర్ నాయకులు కరణం భీంరెడ్డి, దేశాయ్ సిద్దార్థ, ఎస్సీసెల్ జిల్లా నాయకులు సుంకన్న, సర్పంచులు రామాంజనరెడ్డి, ఉమాశంకర్, కేశన్న, గాజుల చిన్న వెంకటేశులు, కుళ్లాయిస్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి -
జంట ఆత్మహత్యాయత్నం
గార్లదిన్నె: ఉపాధి అవకాశాలు దక్కకపోవడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. కదులుతున్న రైలు నుంచి దూకి వివాహిత మృతి చెందగా.. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని స్థానికుల సాయంతో పోలీసులు కాపాడారు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ఐలూరుకు చెందిన మహేష్ బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే వివాహమై భర్త మృతిచెంది ఒంటరిగా జీవిస్తున్న దీపిక పరిచయమైంది. ఇద్దరూ కలసి సహజీనం సాగించేవారు. ఈ క్రమంలో పని కోసం వారం రోజుల క్రితం ఇద్దరూ గుంటూరుకు వెళ్లారు. అక్కడ పని దొరక్కపోవడంతో గుంతకల్లు మీదుగా గురువారం అనంతపురానికి చేరుకున్నారు. అక్కడ కూడా పని దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్కు వెళ్లేందుకు సిద్ధమై అదే రోజు రాత్రి కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. మార్గమధ్యంలో దీపిక కదులుతున్న రైలు నుంచి కిందకు దూకేసింది. పక్క స్టేషన్లో రైలు ఆగగానే కిందకు దిగిన దీపక్ రోడ్డు మార్గంలో గార్లదిన్నె మండలం ఎగువపల్లి సమీపంలోకి శుక్రవారం తెల్లవారుజామున చేరుకున్నాడు. జాతీయ రహదారి పక్కన వాకింగ్ చేస్తున్న స్థానికులను కలసి రైల్వే స్టేషన్కు మార్గాన్ని అడిగి, అటుగా కాకుండా నేరుగా రైల్వే ట్రాక్పై చేరుకుని పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో గార్లదిన్నె ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా, సిబ్బంది అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జరిగిన విషయం తెలిపి తన సహచరి రైలు నుంచి దూకిందని, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడినట్లు వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు గార్లదిన్నె – కల్లూరు మధ్య ట్రాక్పై పరిశీలన చేపట్టారు. కల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రామదాస్పేట వద్ద పట్టాలపై యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతురాలిని దీపికగా మహేష్ నిర్ధారించాడు. ఘటనపై రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కదులుతున్న రైలు నుంచి దూకి వివాహిత మృతి రైల్వే ట్రాక్పై పడుకొని యువకుడి ఆత్మహత్యాయత్నం సకాలంలో అక్కడికి చేరుకుని కాపాడిన పోలీసులు -
యంత్రం కింద పడి కూలీలకు గాయాలు
బొమ్మనహాళ్: వేరుశనగ నూర్పిడి యంత్రం కిందపడి పలువురు కూలీలు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన వండ్రప్ప, రామలింగ, గణేష్, శీన, రామాంజనేయులు, కిరణ్తో పాటు మరో నలుగురు కూలీలు శుక్రవారం ఉదయం రైతు చెన్నప్ప పొలంలో వేరుశనగ కాయలు ఆడించేందుకు ట్రాక్టర్ సాయంతో నూర్పిడి యంత్రాన్ని తీసుకుని బయలుదేరారు. వేరుశనగ యంత్రంపై ఇరువైపులా కూలీలు కూర్చొని ప్రయాణిస్తున్నారు. కొద్ది దూరం వెళ్లగానే ట్రాక్టర్కు అనుసంధానించిన రాడ్ కట్ కావడంతో నూర్పిడి యంత్రం కిందపడింది. దానిపై కూర్చొన్న కూలీలందరూ రోడ్డుపై పడి, తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో వండ్రమ్మ, రామలింగ, శీన, గణేష్కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
వ్యాపారి ఘరానా మోసం
ఉరవకొండ: పట్టణంలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పలువురి నుంచి నగదు తీసుకుని.. తిరిగి వారికి చెల్లించకుండా ముఖం చాటేశాడు. దాదాపు రూ.6.22 కోట్లకు ఐపీ పెట్టేసి టోకరా వేశాడు. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలోని రంగావీధిలో బొమ్మశెట్టి నగేష్బాబు, లావణ్య దంపతులు నివాసముంటున్నారు. వీరు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అలా ప్రజలతో ఏర్పడిన పరిచయాలతో చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు. వీరిపై నమ్మకం కలగడంతో చాలామంది పరిచయస్తులు, చిరువ్యాపారులు, చేనేత కార్మికులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వారు అవసరాలకు పనికి వస్తుందని, పొదుపు చేసుకుందామని భావించి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా చిట్టీలు వేశారు. ఉరవకొండతో పాటు ధర్మవరం, గుంతకల్లు, అనంతపురం తదితర ప్రాంతాలకు చెందిన వారు అప్పుల రూపంలోనూ వారికి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అనారోగ్యంగా ఉందని చెప్పిన నగేష్ తర్వాత కనిపించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరూ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా.. డబ్బుతో ఉడాయించినట్లు తెలిసింది. కలకలం రేపిన ఐపీ నోటీసు.. బాధితుల అనుమానాలకు ఊతం ఇచ్చేలా శుక్రవారం పలువురి సెల్ఫోన్లకు నగేష్బాబు– లావణ్య దంపతుల తరఫున అడ్వొకేట్ నుంచి ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) నోటీసు పంపారు. ఐపీ నోటీసు అలా ఒకరి నుంచి మరొకరికి చేరడంతో కలకలం రేగింది. కిరాణా వ్యాపార విస్తరణ కోసం 57 మంది నుంచి రూ.6.22 కోట్ల వరకు నగదు తీసుకున్నట్లు.. ప్రస్తుతం వ్యాపారంలో నష్టం కారణంగా తిరిగి చెల్లించలేకపోతున్నట్లు, నగదు రికవరీ కోసం ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పెరిగి పోతుండటంతో భరించలేక ఐపీ పెడుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. నమ్మకంతో చిట్టీలు వేసినందుకు.. అప్పులు ఇచ్చినందుకు ఇప్పుడు ఐపీ పెట్టేసి నట్టేటముంచితే తమ పరిస్థితి ఎలా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రూ.6.22 కోట్లకు టోకరా లబోదిబోమంటున్న బాధితులు న్యాయం కోసం పోలీసుస్టేషన్కు.. మాకు న్యాయం చేసేదెవరు..? తన కూతురుకు మూడుసార్లు బైపాస్ సర్జరీలు జరిగాయని, తదుపరి వైద్య అవసరాల కోసమని నగేష్బాబు వద్ద దాదాపు రూ.14 లక్షలు చిట్టీ వేశానని, ఇప్పుడిలా ఐపీ పెట్టేస్తే ఎలా అని ఉరవకొండకు చెందిన కిరణ్కుమార్ అనే హోటల్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని అర్బన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. తామేమీ చేయలేమని పోలీసులు తెలిపారని, ఇక తాము ఎక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతమయ్యాడు. -
జల చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు
కణేకల్లు: హెచ్చెల్సీ నీటిని చౌర్యం చేస్తే చర్యలు తప్పవని నాన్ ఆయకట్టుదారులను కణేకల్లు హెచ్చెల్సీ సబ్డివిజన్ డీఈఈ దివాకర్రెడ్డి హెచ్చరించారు. కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని హెచ్చెల్సీపై శుక్రవారం ఏఈఈలు నరేంద్రమారుతి, అల్తాఫ్తో కలసి ఆయన పర్యటించారు. కాలువ గట్టు ఇరువైపులా నాన్ ఆయకట్టుదారులు మోటార్లు, పైపులు వేసి జల చౌర్యానికి పాల్పడుతున్న తీరును గుర్తించి దాదాపు 40 చోట్ల పైపులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో డీఈఈ మాట్లాడుతూ.. హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు సాగు నీరందించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. నీటిచౌర్యాన్ని కట్టడి చేయడానికి నిరంతరం హెచ్చెల్సీపై గస్తీలు నిర్వహిస్తామన్నారు. మోటార్లు వేయడం, పైపుల ద్వారా నీటిని తోడటం లాంటివి చేస్తే ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తామన్నారు. నేటి నుంచి నిస్సహాయులకు ఇంటి వద్దే రేషన్ అనంతపురం, అర్బన్: వయసు 65 ఏళ్లుపైబడిన వారికి, దివ్యాంగులు, నిస్సహాయులకు శనివారం నుంచి ఇళ్ల వద్దకే డీలర్లు వెళ్లి రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి పౌర సరఫరాలు, విజిలెన్స్, తూనికలు కొలతల శాఖల అధికారులు, తహసీల్దార్లు, సీఎస్డీటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయుల ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులను ఈ నెల 30లోగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చౌక ధరల దుకాణాల రెన్యూవల్, కార్డుల్లో సభ్యుల తొలగింపు, ఆధార్ సీడింగ్లో తప్పులు సరిజేత, బియ్యం కార్డు అప్పగింత, కార్డుల విభజన, ఈ–కేవైసీకి సంబంధించి పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా చౌక ధరల దుకాణాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎం రమష్రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, డీజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ శంకర్, డిప్యూటీ తహసీల్దారు శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
కళ్యాణదుర్గం: ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నేతృత్వంలోని బృందం శుక్రవారం కూడా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా సోదాలు కొనసాగించింది. గురువారం రాత్రి నాగేంద్ర నాయక్ నుంచి భూమి కన్వర్షన్కు రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా అనంతపురంలో ఏసీబీ అధికారులు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని పట్టుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన అధికారులు రెండో రోజూ కూడా కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో కీలక ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల చేసిన భూముల కన్వర్షన్, మున్సిపాలిటీ పరిధిలో చేసిన రిజిస్ట్రేషన్ తదితర ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని భూముల కన్వర్షన్ లేకుండానే ఎన్ని ఫైళ్లు రిజిస్ట్రేషన్ చేశారు.. డబుల్ రిజిస్ట్రేషన్లు.. ఇటీవల కళ్యాణదుర్గం, కంబదూరు, బ్రహ్మసముద్రం తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి సృష్టించిన డాక్యుమెంట్లు తదితర వాటికి సంబంధించిన కీలక ఫైళ్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. ఎవరెవరికి వాటా వెళ్లింది.. అనే కోణంలో కూడా సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించినట్లు సమాచారం. తనిఖీల అనంతరం ఫైళ్లను కర్నూలుకు తీసుకెళ్లనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు తెలిపారు. -
జిల్లా రైతులను ఆదుకోవాలి : సీపీఎం
అనంతపురం అర్బన్: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3.40 లక్షల హెక్టార్లలో పంటల సాగు కావాల్సి ఉండగా... ఇందులో కేవలం 70 వేలు హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయన్నారు. జూన్, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ఇప్పటికే సాగైన పంటలు ఎండిపోయేపరిస్థితి నెలకొందన్నారు. యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో వేసిన పత్తి పంట వర్షాభావం కారణంగా ఎదుగుదల లేకపోవడంతో రైతులు తొలగిస్తున్నారన్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. వర్షం కురిస్తే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు పరిహారం, పంటల బీమా, ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు తక్షణమే ప్రతి రైతుకూ చెల్లించి ఆదుకోవాలన్నారు. సమావేశంలో కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
గుప్త నిధుల ముఠా అరెస్ట్
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామ సమీపంలో ఉన్న కొండపై వెలసిన చౌడమ్మ ఆలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొబేషనరీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ తెలిపారు. గుంతకల్లు రూరల్ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ రాఘవేంద్రప్పతో కలసి వివరాలను ఆయన వెల్లడించారు. పథకం ప్రకారం తవ్వకాలు.. నాగసముద్రం కొండపై వెలసిన చౌడమ్మ ఆలయం సమీపంలో గుప్త నిధులు వెలికి తీసేందుకు నాగసముద్రం గ్రామానికి చెందిన ఇద్దరు, వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన రాము, కమలపాడు గ్రామానికి చెందిన బురుజుల బోయ శ్రీనివాసులు, గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డులో నివాసముంటున్న మేకల దేవేంద్ర, పామిడి మండలం గజరాంపల్లికి చెందిన జె.పరశురాముడు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలోని శంషాబాద్ మండలం బహుదూర్గూడ ప్రాంతానికి చెందిన పసుపుల మహీందర్, వికారాబాద్ జిల్లా, పరిగి మండలం రూపాన్పేట్ గ్రామానికి చెందిన ఇరికల వెంకటేశులు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి చెందిన మాడ మహేందర్, నారాయణపేట జిల్లా కోసిగి మండలం బిజ్జారం గ్రామానికి చెందిన భట్టగిరి అంజులయ్య, రంగారెడ్డి జిల్లా బోరబండ గ్రామానికి చెందిన ముద్దనూరి సురేంద్రతో కలసి పథకం రచించారు. ఇందులో భాగంగా ఈ నెల 24న గుప్త నిధుల తవ్వకాలకు అవసరమైన పరికరాలతోపాటు, నిధి నిక్షేపాలను గుర్తించే మెటల్ డిటెక్టర్లను సైతం గుంతకల్లులోని బోయ శ్రీనివాసులుకు చెందిన ఏపీ02 టీబీ 2351 నంబర్ ఉన్న అప్పీ ఆటోలో నాగసముద్రం కొండపైకి తరలించారు. మరికొందరు ఏపీ 09 బీసీ 3031 నంబర్ గల ఇన్నోవా కారులో కొండపైకి చేరుకున్నారు. మెటల్ డిటెక్టర్ సాయంతో నిధి నిక్షేపాల కోసం గాలించిన ముఠా సభ్యులు ఓ చోట తవ్వకాలను ప్రారంభించారు. బయటపడిన నాగ పడిగ ప్రతిమ.. కొండపై అనుమానితుల సంచారాన్ని పసిగట్టిన నాగసముద్రం గ్రామస్తుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, గ్రామ పెద్దలతో కలసి గురువారం కొండపైకి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, మిగిలిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో గుప్త నిధులు వెలికి తీస్తున్నట్లుగా వారు అంగీకరించారు. అప్పటి వరకూ తవ్వకాల్లో బయటపడిన వస్తువులను పోలీసులకు చూపారు. అందులో ఓ మట్టి కుండలో 8 సీసపు గోలీలు, సీసపు కడ్డీలు, పురాతన కాలానికి చెందిన రెండు చిన్న ఉంగరాలు, నాగ పడగ కలిగిన ప్రతిమ, చతురస్రాకారంలో ఉన్న ఒక మట్టి ప్రతిమ ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారైన వారిలో నాగసముద్రం గ్రామానికి చెందిన సూరి, నారాయణస్వామి ఉన్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తవ్వకాల్లో వెలికి తీసిన వస్తువుల స్వాధీనం -
తహసీల్దార్ నిర్దయ.. వీధిన పడిన కుటుంబం
ఆత్మకూరు: మండల తహసీల్దార్ నిర్దయ.. ఓ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది. తహసీల్దార్ కార్యాలయ ప్రహరీకి అనుకుని షెడ్డు వేసుకుని ముగ్గురు చిన్నారుల అలనాపాలన చూసుకుంటున్న వృద్ధురాలి పట్ల కఠినత్వాన్ని చూపుతూ అధికారులు షెడ్డును కూల్చేశారు. వివరాలు.. తల్లి మృతితో ముగ్గురు చిన్నారుల పోషణ భారం ఆత్మకూరులో నివాసముంటున్న వృద్ధురాలు గిరిజమ్మ (చిన్నారులకు అమ్మమ్మ)పై పడింది. అల్లుడు మద్యానికి బానిసై జులాయిగా మారాడు. దీంతో తనకు వచ్చే పింఛన్తోనే పిల్లల ఆలనాపాలన చూసుకుంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. తనకు ఇల్లు లేకపోవడంతో ఎలాగైనా సాయం చేయాలని నెల రోజుల క్రితం తహసీల్దార్ లక్ష్మీనాయక్ను కలసి వేడుకుంది. దీంతో అప్పట్లో సానుకూలంగా స్పందించిన తహసీల్దార్... తన కార్యాలయం పక్కన ప్రహరీని అనుకుని షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో గిరిజమ్మ అప్పు చేసి బండలు పాతుకుని రేకుల షెడ్డు వేసుకుంది. శుక్రవారం ఉన్నఫలంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అక్కడకు చేరుకుని షెడ్డును తొలగించారు. పిల్లలు అన్నం తింటున్నారని కాస్త సమయం ఇవ్వాలని వృద్ధురాలు వేడుకున్నా వినలేదు. తహసీల్దార్ చెప్పారంటూ ఇంట్లోని సామగ్రిని బయటకు విసిరేశారు. రేకులను తొలగించి పక్కన వేశారు. దీంతో కన్నీటి పర్యంతమైన వృద్ధురాలిని చూసి స్థానికులు కొందరు తహసీల్దార్ను నేరుగా కలసి నిలదీశారు. దీంతో తప్పు సరిదిద్దుకుంటానని, ఆ ముగ్గురు పిల్లలను తానే దత్తతకు తీసుకుంటానని భరోసానిచ్చారు. రెండు సెంట్ల స్థలం కేటాయించి, అందులో షెడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు అప్పటి వరకూ అద్దె ఇంట్లో ఉండే ఖర్చునూ భరిస్తానని హామీనిచ్చారు. -
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రోడ్డు భద్రతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రమాదాలు అధికంగా చోటు చేసుకునే ప్రదేశాల్లో (బ్లాక్స్పాట్) హెచ్చరిక సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతస్థాయిలో నిర్వహించాలన్నారు. ప్రధానంగా హెల్మెట్ ధారణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రయాణికులను చేరవేసే వాహనాల్లో అధికలోడ్ నియంత్రించాలని సూచించారు. సమావేశంలో ఆర్టీఓ వీర్రాజు, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీఓ కేశవనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి.. జిల్లాలో పారిశ్రామిక రంగం పటిష్టం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులకు సకాలంలో అన్ని రకాలు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అనువైన భూమిని గుర్తించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రతన్టాటా ఇన్నొవేషన్ హబ్ ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2020–23, 2023–27 ఇండస్ట్రియల్ పాలసీ కింద 13 యూనిట్లకు సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస్యాదవ్, ఏడీ రాజశేఖర్రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అధికారి కృష్ణారెడ్డి, డీఎస్డీఓ ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొనానరు. -
రైతు సభ్యత్వమంటూ ఘరానా మోసం
పామిడి: రైతు సభ్యత్వ కార్డు ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూ.లక్షల్లో బ్యాంక్ రుణాలు ఇస్తుందంటూ ఓ జంట మోసానికి తెరలేపిన ఘటన పామిడి మండలంలో వెలుగు చూసింది. వివరాలు.. నాలుగు రోజులుగా ఇద్దరు వ్యక్తులు (వీరిలో ఒకరు మహిళ) ద్విచక్ర వాహనంపై పామిడి మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ రైతు సభ్యత్వ కార్డులంటూ పలువురి నుంచి డబ్బు వసూళ్లకు తెరలేపారు. శుక్రవారం ఉదయం పి.కొత్తపల్లికి చేరుకుని రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రధాని స్కీమ్ అంటూ నమ్మబలికారు. దీంతో దాదాపు 500 మంది రైతులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున చెల్లించి సభ్యత్వ కార్డులు పొందారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ రైతు అనుమానం వచ్చి వారిని నిలదీయడంతో ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. -
జేసీ ప్రభాకర్రెడ్డిది నీచ సంస్కృతి
అనంతపురం మెడికల్: ‘తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ‘గుడ్ విల్’ కోసం డీపీఓ, ఏఎస్పీలను బెదిరిస్తున్నారు. ఆయన భార్యను నేను తిట్టానని ప్రచారం చేస్తున్నాడు. రాజకీయాల్లోకి ఆడవారిని తీసుకువచ్చే నీచ సంస్కృతి జేసీ ప్రభాకర్రెడ్డిది. నిజంగా నేను తిట్టానని ఆమె చెబితే వారి ఇంటి వద్దకు వెళ్లి క్షమాపణ చెబుతా’ అని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లే అవుట్ల అనుమతులకు సంబంధించి డీపీఓను, పవర్ గ్రిడ్ పనుల్లో తనకు మేలు జరగలేదని ఏఎస్పీను జేసీ ప్రభాకర్రెడ్డి దుర్భాషలాడారన్నారు. తాడిపత్రిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్ల అనుమతులకు సంబంధించి కలెక్టర్కు జేసీ ఫిర్యాదు చేయాలని, తాను ప్రతిపక్ష పార్టీ తరపున ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కలెక్టర్ విచారణలో అసలు నిజాలు వెలుగు చూస్తాయన్నారు. ఇటీవల తాడిపత్రిలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి తన కోడలను పంపితే.. ఆమె ప్రసంగం పూర్తవగానే పోలీసుల ద్వారా ఇంటికి పంపించేశారని అన్నారు. ఇది జేసీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. దొంగే దొంగ అన్నట్లుంది జేసీ తీరు తనపై వంద కేసులున్నాయని, తనకు న్యాయం చేయాలని జేసీ ప్రతిసారీ పరితపిస్తున్నారని పెద్దారెడ్డి విమర్శించారు. వాస్తవానికి ఫేక్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్లతో అక్రమాలకు పాల్పడి ఆయన కటకటాల్లోకి వెళ్లి వచ్చారన్నారు. ఆయనేమైనా పార్టీ కోసమో, కార్యకర్తలు, నాయకుల కోసమే జైలుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. వందల సంఖ్యలో ఉన్న కేసుల పూర్వాపరాలను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పరిశీలిస్తే జేసీ నీచ సంస్కృతి బయటపడుతుందన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా జేసీ ప్రభాకర్రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. పోలీసు అధికారుల వద్దకు వెళ్లి కేసు నమోదు చేయించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి