Ananthapur
-
మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తల్లీకొడుకు బలి
హిందూపురం: వ్యాపారం కలిసిరాక.. సర్కారు ఆదుకోక.. ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వ్యాపారం కోసం అప్పు తీసుకున్న పాపానికి మైక్రోఫైనాన్స్ ప్రతినిధులు నరకం చూపారు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో ఆ తల్లి బలవన్మరణానికి తెగించింది. విషగుళికలు కలుపుకున్న కూల్డ్రింక్ను తాను తాగి కొడుకూ, కూతురికీ తాగించింది. తల్లీకొడుకు మృతిచెందగా, కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం బీరేపల్లిలో మంగళవారం జరిగిన ఈ ఘటన గుండెలను పిండేసింది.వ్యాపారం సాగక.. సర్కార్ సాయం అందక బీరేపల్లికి చెందిన ముద్దప్పకు భార్య లక్ష్మి (35), కుమారుడు రిషికుమార్ (13), కుమార్తె శ్రీనిధి ఉన్నారు. ముద్దప్ప భార్యతో కలిసి చిరుధాన్యాలను సంతల్లో విక్రయించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. వైఎస్సార్ సీపీ హయాంలో వివిధ పథకాల కింద ఆర్థిక సాయం అందేది. అలాగే ముద్దప్ప భార్య లక్ష్మి డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు సంఘం సాయంగా నిలిచేది. రెండేళ్లుగా ముద్దప్ప కుటుంబానికి సర్కారు నుంచి సాయం అందడంలేదు. మరోవైపు వ్యాపారమూ జరగడం లేదు. దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బంది కావడంతో ముద్దప్ప తొలుత ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అయితే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మైక్రో ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించాడు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడక అప్పులు వడ్డీతో కలిపి భారంగా మారాయి. ఈ క్రమంలోనే కుటుంబంలోనూ మనశ్సాంతి కరువైంది. మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెల్లించాల్సిన అప్పు తలచుకుని ముద్దప్ప నిత్యం ఆందోళన చెందేవాడు. ఇది చూసి భార్య లక్ష్మి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే తాను చనిపోతే పిల్లలు దిక్కులేని వారవుతారని భావించిన ఆమె మంగళవారం కూల్డ్రింక్ తీసుకురావాలని భర్తను కోరింది. ముద్దప్ప తెచ్చిన కూల్డ్రింక్లో అప్పటికే తెచ్చిపెట్టుకున్న విషపు గుళికలను కలిసి తాను తాగడంతోపాటు కుమారుడు రిషికుమార్, కుమార్తె శ్రీనిధికీ తాగించింది. శ్రీనిధి వాంతులు చేసుకోగా, తల్లీకుమారుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న ముద్దప్పకు భార్యాకుమారుడు విగతజీవులుగా కనిపించారు. కుమార్తె శ్రీనిధిని గ్రామస్తుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు. ప్రసుత్తం ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న హిందూపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ముఖ్యనేతలు గుడ్డంపల్లి వేణురెడ్డి, పార్టీ నాయకులు వెళ్లి ముద్దప్పకు ధైర్యం చెప్పారు. హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు ప్రభుత్వ చౌక ధరల దుకాణాల (స్టోర్ల)పై ఎక్కువగా ఆధారపడతారు. ఉచితంగా, రాయితీపై ఇచ్చే సరుకులే వారికి దిక్కు. అలాంటి సామాన్యులపై కనికరం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రెండేళ్ల పాలనలో దశల వారీగా సరుకుల సంఖ్యలో కోత
సరుకుల కోసం స్టోర్ వద్ద కార్డుదారుల క్యూ (ఫైల్) అనంతపురం అర్బన్/ రాయదుర్గం టౌన్/ ఉరవకొండ: పేదల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆడుకుంటోంది. అరకొర సంపాదనతో బతుకులీడుస్తున్న వారికి ప్రభుత్వం చౌకగా అందించే సరుకులను కుదిస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే విధానాన్ని రద్దు చేసింది. దీంతో కార్డుదారులు సరుకులు పొందాలంటే పాత పద్ధతిలో చౌకదుకాణాలు (స్టోర్ల)కు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చింది. ప్రస్తుతం కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, రాగులు అటకెక్కించేసి బియ్యం, పంచదార (చక్కెర) వరకే పరిమితం చేసింది. దీంతో పేదలు బయటి మార్కెట్లో ఆ సరుకులను అధిక ధరలు వెచ్చించి కొనాల్సి వస్తోంది. బెంబేలెత్తిస్తున్న ధరలు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ఇంధన ధరల పెంచడంతో అన్ని రకాల వస్తువులపై మరింత భారం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం చౌక డిపోల ద్వారా సబ్సిడీపై నిత్యవసరాలు సరఫరా చేస్తే పేదలకు ఎంతో చేయూతగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. పేదలపై ప్రతి నెలా రూ.10.23 కోట్ల భారం ప్రభుత్వం కార్డుదారులకు జొన్నలు, రాగులు పంపిణీ చేయకపోవడంతో బయటి మార్కెట్లో వాటిని పేదలు కొనుగోలు చేయక తప్పడం లేదు. మార్కెట్లో జొన్నలు కిలో రూ.50, రాగులు కిలో రూ.50తో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి కుటుంబం నెలసరి రెండు కిలోల జొన్నలు, ఒక కిలో రాగులు తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. తద్వారా 6.82 లక్షల మంది కార్డుదారులు కిలో జొన్నలు రూ.50 చొప్పున ప్రతి నెల రెండు కిలోల జొన్నలకు రూ.6.82 కోట్లు, ఒక కిలో రాగులకు రూ.3.41 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం జొన్నలు, రాగులు పంపిణీ చేయకపోవడంతో పేదలు ప్రతి నెలా రూ.10.23 కోట్ల అదనపు భారం భరిస్తున్నారు. ఉడకని కందిపప్పు పౌరసరఫరాల సంస్థ ద్వారా పేదలకు అందజేసే నిత్యావసర సరుకులు రానురానూ తగ్గిపోతున్నాయి. వాస్తవానికి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కందిపప్పు సరఫరాను నిలిపేసింది. ఎప్పటికప్పుడు ఈసారి కందిపప్పు ఇస్తున్నాం అంటూ పాలకులు ప్రచారం చేయడం తప్ప పేదలకు పంపిణీ చేసింది లేదు. ప్రైవేట్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు, జొన్నలు, గోధుమపిండి కట్ తాజాగా రాగుల పంపిణీకి బ్రేక్ వేసిన సర్కార్ బయట కొనుగోలుతో పేదలపై మోయలేని భారం చంద్రబాబు పాలనలో సరుకుల కోతలు.. ధరల మోతతో జనం కుదేలు -
టెంకాయ చెట్టుపై పడిన పిడుగు
గుత్తి రూరల్: జక్కలచెరువు ఆర్ఎస్ గ్రామంలో టెంకాయ చెట్టుపై పిడుగుపడి మంటలు వ్యాపించాయి. మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అంగడి రాజన్న ఇంటి ఆవరణలో ఉన్న టెంకాయ చెట్టుపై పెద్ద శబ్ధంతో పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో చెట్టుకింద ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు శబ్దానికి సమీపంలోని నివాస గృహాలు కంపించాయి. భూకంపమేమోనని భావించి పలువురు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకుని చెట్టుపై మంటలను ఆర్పివేశారు. ప్రయాణిస్తుండగా విడిపోయిన రైలు బోగీలు ● లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం గుత్తి: గుత్తి రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు (06571) బోగీలు విడిపోయాయి. ప్లాట్ఫారం–1పై వెళుతున్న సమయంలో ఎస్–6, ఎస్–7 మధ్య జాయింట్ కప్లింగ్ ఊడిపోవడంతో బోగీలు వేరయ్యాయి. లోకో పైలట్ గమనించి వెంటనే రైలును నిలిపివేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే టెక్నీషియన్స్ ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. అనంతరం రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. బోగీలు విడిపోయిన కారణంగా రైలు గంట ఆలస్యంగా నడిచింది. -
అర్హులైన ఓటర్లను తొలగిస్తే పోరాటం తప్పదు
● మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ గార్లదిన్నె/నార్పల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)– 2026 మాటున అర్హులైన ఓటర్లను తొలగిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం నార్పల మండలం దుగుమర్రి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం, బీఎల్ఏల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ ఓటరు జాబితాల పరిశీలనలో బీఎల్ఏలు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓటు విలువైందేనన్నారు. బూత్ స్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలన్నారు. నియోజకవర్గంలో తాము ప్రజలకు అండగా నిలవడాన్ని జీర్ణించుకోలేక కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు.. 2029 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎంమోహన్రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువ నాయకుడు రుత్విక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియతో ఎన్నికలు మొదలైనట్లేనన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతుంటే వెంటనే స్పందించి, అర్హులైన ఓటర్లకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, శింగ నమల నియోజకవర్గ బీఎల్ఏల ఇన్చార్జ్ మంజునాథ్, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, మండల కన్వీనర్లు ఖాదర్ వలి, ఎల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పరంధామ రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు ఫణీంద్ర, నాగేశ్వర రావు, రామాంజనేయులు, ఆంజనేయులు, ప్రభుదాస్, శివశంకర్, వేదాంత మోహన్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయం
● బోగస్, తప్పుడు ఓట్లపై నిఘా పెట్టండి ● ఎస్ఐఆర్పై అప్రమత్తత అనివార్యం ● బీఎల్ఏలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత దిశానిర్దేశం అనంతపురం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్త వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు, వైఎస్సార్సీపీ నేతలకు ‘ఎస్ఐఆర్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత వెంకటరామిరెడ్డి వారికి దిశానిర్ధేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు జరుగుతున్న కుట్రను తిప్పికొట్టాలన్నారు. అధికార పార్టీలు బోగస్, తప్పుడు ఓట్లను జాబితాలో ఎక్కించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దోహదపడే వివిధ రకాల దరఖాస్తులపై బీఎల్ఏలకు పూర్తి పట్టు ఉండాలని సూచించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపు వివాదాస్పదమైందన్నారు. అక్కడ అభ్యర్థులు గెలుపొందిన స్థానాలను పరిశీలిస్తే.. ఆయా నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల కన్నా.. మెజార్టీ తక్కువ ఓట్లు రావడమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు తిప్పేస్వామి మాట్లాడుతూ పార్టీ ఐడీ కార్డుల పరిశీలన ప్రక్రియ 100 శాతం పూర్తయిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా వ్యవహరించాలని కోరారు. ఎస్ఐఆర్ కో ఆర్డినేటర్ గోపీనాథ్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐఆర్ కమిటీ సభ్యుడు వెన్నం శివారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఎద్దుల అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్ గౌడ్, గోగుల రాధాకృష్ణ, మాజీ మేయర్ వసీం తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం టౌన్: ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో 7.23ఎకరాలు, కళ్యాణదుర్గం నియోజకవర్గం తిమ్మసముద్రంంలో 13.40 ఎకరాలు, తాడిపత్రి నియోజకవర్గం ఊరుచింతలలో 10.86ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో దాదాపు 293 ప్లాట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు 75 శాతం మేర రాయితీలను అందించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 96663 30666 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా శివప్రసాద్ అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శిగా జె. శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ అకేపాటి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు బెళుగుప్ప: మండల పరిధిలోని శ్రీరంగాపురంలో బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ పేర్కొన్నారు. శ్రీరంగాపురంలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నాంటూ మహిళలు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గ్రామానికి వెళ్లి బెల్టుషాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఏఐ సాయంతో పిల్లల సంరక్షణఅనంతపురం సెంట్రల్: కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆరేళ్లలోపు చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ది లోపాలను గుర్తించే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నట్లు మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) శశికళ తెలిపారు. మంగళవారం నగరంలోని పాతూరులో కస్తూరిబాయి పాఠశాలలో సీడీపీఓలు, సూపర్వైజర్లు, మాస్టర్ ట్రైనర్స్, అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ నిర్వహించారు. ఆరేళ్లలోపు పిల్లల సమగ్రాభివృద్ధి, ఎదుగుదలను ట్రాక్ చేయడంపై అవగాహన కల్పించారు. పోషణ్ ట్రాకర్ సాయంతో ఏఐ ఆధారిత సిస్టం ద్వారా మరింత స్పష్టమైన స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిపారు. పిల్లల కదలికలు, ప్రవర్తన, ఆటల వీడియోలను ఏఐ విశ్లేషించి, వారి వయస్సుకు తగ్గట్టుగా ఎదుగుదల ఉందో లేదో ఏఐ చెబుతుందన్నారు. -
దగా పాలనకు రెండేళ్లు
అనంతపురం: చంద్రబాబు సారథ్యంలోని దగా పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ పాలన కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాబు పాలనపై ముద్రించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్రెడ్డితో కలిసి అనంత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత ’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, భూదందాలు, దౌర్జన్యాలు, అకృత్యాలే లక్ష్యంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం నగరంలో భూ కబ్జాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆస్తులను కాజేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి మాట్లాడుతూ హామీల అమలును విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వ ‘వెన్నుపోటు పాలన’కు నిరసనగా జూన్ 4వ తేదీ నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బీసీ రమేష్ గౌడ్, గౌస్ బేగ్, మాజీ మేయర్ వసీం సలీం, సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, పూజారి రాజశేఖర్ యాదవ్, వీర రామకృష్ణారెడ్డి, సాకే చంద్రశేఖర్, బోయ కృష్ణమూర్తి, చింతకుంట మధు, ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, ఎల్లుట్ల మారుతీనాయుడు, గువ్వల రాజేష్రెడ్డి, పెన్నోబులేసు, చామలూరు రాజగోపాల్, ఎగ్గుల శ్రీనివాసులు, ఫయాజ్, కోన రాజారెడ్డి, మల్లెమీద నరసింహులు, కాగజ్ఘర్ రిజ్వాన్, మొఘల్ సైఫుల్లా బేగ్, లింగాల రమేష్, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, కొర్రపాడు హుస్సేన్పీరా, అనిల్కుమార్ గౌడ్, లక్ష్మన్న, దాదా ఖలందర్, ఆసిఫ్, కమల్ భూషణ్, జావెద్, మల్లెల వేణుగోపాల్, శేఖర్ బాబు, అనిల్కుమార్రెడ్డి, మాలపాటి శ్రీనివాసులు, వెన్నపూస రామచంద్రారెడ్డి, భాస్కర్రెడ్డి, రఫీ, హిదాయతుల్లా, రామకృష్ణ, బాల మారుతీ ప్రసాద్, శ్రీదేవి, కృష్ణవేణి, శివబాల, సాకే చంద్రలేఖ, జాహ్నవిరెడ్డి, భారతి, పార్వతి, దేవి, శోభారాణి, భానుమతి, సుహాసిని, హజరాంబీ, ఖమర్తాజ్, సుజాత, రాధ, కళావతి, పద్మ, వరలక్ష్మి, నాగమణి, లక్ష్మి, అంజలి, ఉష, పద్మావతి, దేవి, సుజాత, పాల్గొన్నారు. -
టీడీపీ మహిళా నేతల బూతు పురాణం
సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ కార్యాలయంలో మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. మహిళా నేతలు.. రెండు వర్గాలుగా విడిపోయారు. సంగా తేజశ్వణి - సరళ వర్గాలు పరస్పరం బూతులు తిట్టుకున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ మహిళా నేతల బూతు పురాణం వైరల్గా మారింది.టీడీపీకి చెందిన మహిళా నేతల మధ్య కొన్ని రోజలుగా వార్ కొనసాగుతోంది. పార్టీ కార్యాలయం వేదికగా రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు సంఘా తేజశ్వణి, మాజీ కార్పొరేటర్ సరళాలు ఒకరినొకరు దూషించుకున్నారు. అసభ్య పదజాలంతో మాటల యుద్ధం సాగించారు. సర్దిచెప్పేందుకు పలువురు మహిళలు ప్రయత్నించిన ఏమాత్రమూ వినకుండా వాదనలకు దిగారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో ‘అనంత’ విద్యార్థుల ప్రతిభ
అనంతపురం ఎడ్యుకేషన్: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు స్థానికంగానే చదువుకుని అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఓతూరి అబు సాజిద్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5,793వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1287వ ర్యాంకు సాధించగా, డి.ఫయాజ్ అహ్మద్ ఓబీసీ కేటగిరీలో 1421వ ర్యాంకు సాధించారు. జి.సుహాస్ 1951, బి.ప్రషిత 2,810, పునీత్ చౌదరి 3,765, మాలపాటి కీర్తి 5,534, రాజ్ నిఖిలేష్ 9,093 అఖిల భారత ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరవుతుండగా, అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు (ఐఐటీలు)లో ప్రవేశ అవకాశాలు లభిస్తాయి. ఐఐటీల్లో సీట్లకు అర్హత సాధించిన పలువురు విద్యార్థులు -
చిత్రావతిలో ఇసుక రీచ్ వద్దు
● ఇన్చార్జ్ కలెక్టర్కు రైతుల వినతి అనంతపురం అర్బన్/యల్లనూరు: చిత్రావతి నదిలో ఇసుక రీచ్ను రద్దు చేయాలని యల్లనూరు రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రైతులు బాలరంగయ్య, ఓబుళేసు, నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. కోడుమూర్తి గ్రామ పొలం సర్వే నంబరు 67–2ఏ, 68లో 3.90 ఎకరాలను గంపయ్యగారి పెద్ద నాగముని పేరున పట్టా భూమిగా చూపి ఇసుక రీచ్ మంజూరు చేశారన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది బంజరు భూమి అన్నారు. రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలతో ఇసుక రీచ్ మంజూరు చేయడం సరికాదన్నారు. ఆ సర్వే నంబర్లలోనే కాకుండా చిత్రావతిలో 20 అడుగుల లోతుకు తవ్వుతున్నారన్నారు. విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకెళితే తనకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారన్నారు. చిత్రావతి నది ఒడ్డున పండ్ల తోటలు, తాగునీటి బోర్లు ఉన్నాయని, ఇష్టారీతిన ఇసుక తవ్వకంతో భూగర్భ జలాలు అడుగంటి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్కు రైతులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతులు రమేస్, శివయ్య, వీరప్ప, పెద్ద రామాంజనేయులు, ఓబుళయ్య, తదితరులు పాల్గొన్నారు. ఆలయాల ఆదాయ పెంపే లక్ష్యంఉరవకొండ: దేవాలయాల స్థిరాస్తులపై ఆదాయం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. సోమవారం ఉరవకొండ గవిమఠంతోపాటు ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం పెన్నహోబిలాన్ని కమిషనర్ పరిశీలించారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జునప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతమైన, సంతృప్తికర దర్శనం కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. గవిమఠం భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భూములు, ఆస్తులు కాపాడతామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏసీ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. నేరేడు మొక్కల నరికివేత తాడిపత్రి రూరల్: ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎంచుకున్న విష సంస్కృతి తాడిపత్రి ప్రాంతంలో మళ్లీ మొదలైంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన ఆలూరులో పోలీసు బందోబస్తు ఉన్నా చెట్ల నరికివేత చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రామంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గోసు రామచంద్రారెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో 280 నేరేడు మొక్కలు పెంచుతున్నాడు. ఇందులో 200 మొక్కలు సోమవారం తెల్లవారుజామున నరికివేతకు గురయ్యాయి. బాధితుడు తోటను పరిశీలించిన అనంతరం ఇది రాజకీయ కక్షసాధింపులో భాగంగానే జరిగిందని నిర్ధారణకు వచ్చారు. టీడీపీకి చెందిన రవిచంద్రారెడ్డి, వరప్రసాద్రెడ్డి, బ్రహ్మయ్య, రమేష్, యోగీంద్రతోపాటు మరికొందరు కలిసి నేరేడు చెట్లను కొడవళ్లతో నరికివేశారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అప్గ్రేడ్ స్టేషన్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోన్ చేసి గోసు రామచంద్రారెడ్డితో మాట్లాడి సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. 40 సపోట చెట్ల నరికివేత: ఆలూరు గ్రామంలో రాజకీయాలకు దూరంగా, తటస్థంగా ఉంటున్న రైతు సుబ్బారెడ్డికి చెందిన 40 సపోట చెట్లను ఎవరో నరికివేశారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఈ పని ఎవరో చేశారో తెలియడం లేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
‘మెగా’ కాదు... దగా డీఎస్సీ
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ–25 పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను నిలువునా ముంచిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సర్టిఫికెట్లతో ఎంపికలు జరిగినట్లు వచ్చిన అభియోగాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్కు వినతిపత్రం అందజేశారు. లోకేష్ను బర్తరఫ్ చేయాలి.. ఎన్నికల ముందు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. తీరా 16 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, డీఎస్సీ నిర్వహణలోనూ అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందన్నారు. లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ పరీక్షలు జరిగినా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారని, కానీ ఏపీలో మాత్రం డీఎస్సీ పరీక్షలకు సంబంధించి మెరిట్ జాబితా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు నిజాయితీ ఉంటే తక్షణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేసి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి చేతగాని దద్దమ్మ.. రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి చేతగాని దద్దమ్మ అని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి యువత ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఎన్నికలకు ముందు ‘యువగళం’ కార్యక్రమంలో నారా లోకేష్ అనేక హామీలు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక యువతను అడుగడుగునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ ఇద్దరూ డీఎస్సీపై తొలి సంతకం చేశారని, అయితే పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ నేతలు అనంత చంద్రారెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రామాంజి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లుట్ల మారుతీనాయుడు, గుంతకల్లు అధ్యక్షుడు అబ్దుల్ బషీద్, కళ్యాణదుర్గం అధ్యక్షుడు తలారి చరణ్, శింగనమల అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ఉరవకొండ అధ్యక్షుడు బసవనగౌడ్, అనంతపురం అధ్యక్షుడు శ్రీనివాస్ గురుదత్త, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నాయకులు ఓబిరెడ్డి, సైఫుల్లా బేగ్, మల్లెమీద నరసింహులు, రాజేష్రెడ్డి, దాదా ఖలందర్, లోకనాథ్రెడ్డి, సాకే చిరంజీవి, గుజ్జల శివయ్య, అమర్నాథ్రెడ్డి, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, వెన్నం శివారెడ్డి, ఇసాక్, రమణారెడ్డి, సంపంగి రామాంజినేయులు, కై లాష్, అమ్మవారిపేట శ్రీకాంత్, సతీష్, శ్యాం పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై యువకులు, నిరుద్యోగుల మండిపాటు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన -
●తాగునీటి కష్టాలు ఇంకెన్నాళ్లు?
రాయదుర్గంటౌన్: తాగునీటి కోసం రాయదుర్గం పట్టణ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పది రోజులకు ఒకసారి మాత్రమే అదీ అరకొరగా కొళాయిలకు నీరు వదులుతున్నారు. అవి ఎవ్వరికీ చాలకపోవడంతో కష్టాలు పెరిగిపోతున్నాయి. సోమవారం 19వ వార్డు అంబేడ్కర్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో బీటీపీ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ట్యాంకర్లు కూడా పంపకపోతే తాగునీటి అవసరాలు ఎలా తీరుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ట్యాంకర్ పంపించి ఆందోళనను విరమింపజేశారు. -
షేర్ మార్కెట్ లాభాల ఆశ చూపి కుచ్చుటోపీ
అనంతపురం సెంట్రల్: షేర్ మార్కెట్లో లాభాల ఆశ చూపి ప్రజలకు కరూ.25 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన ఓ వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిండా మోసపోయిన బాధితులు సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెలిబుచ్చారు. బాధితుల కథనం మేరకు... బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్కుమార్రెడ్డి అనంతపురం నగరం సాయినగర్లో ఆరిజన్ సొల్యూషన్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు. సదరు కంపెనీలో పెట్టుబడులు పెడితే షేర్ మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ ద్వారా మంచి లాభాలు తీసుకొచ్చి మీ డబ్బును పదింతలు చేస్తానని నమ్మబలికాడు. ఇందుకు ఎక్కువ శాతం విద్యావంతులైన తన స్నేహితులను, కంపెనీలో పనికి కుదుర్చుకున్న సిబ్బందిని, బంధువులను వాడుకున్నాడు. తొలుత కొద్ది రోజుల పాటు పెట్టిన పెట్టుబడికి రూ.5, రూ.10లు చొప్పున వడ్డీ(లాభాల రూపంలో) చెల్లించాడు. డబ్బులు బాగా ఇస్తున్నాడు.. అందులోనూ తెలిసిన వ్యక్తేనన్న నమ్మకంతో బాధితులు వారికి తెలిసిన వాళ్లతో సైతం కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఒక్కొక్కరు రూ.4 లక్షలు మొదలుకుని రూ.60 లక్షలు, రూ.90 లక్షలు.ఇలా పెట్టుబడులు పెట్టారు. అయితే కొన్ని నెలల నుంచి నరేష్ కుమార్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బాధితుల వేదన వర్ణనాతీతం.. చాలామంది స్నేహితుల దగ్గర అప్పుగా, బ్యాంకు లోన్లు, బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని నరేష్కుమార్రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలోని బళ్లారి బైపాస్లో నివాసముంటున్న ప్రధానోపాధ్యాయుడు భాస్కర్బాబు కూడా బ్యాంకులు, లోన్ యాప్లలో డబ్బులు తీసుకొని దాదాపు రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నిండా మోసపోయిన ఇతను నెలనెలా ఈఎంఐలు చెల్లించలేక, ఒత్తిళ్లు తాళలేక కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని ఓ వెంచర్లో సూసైడ్నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి బాధితులు వందల్లో ఉన్నారు. తమకు న్యాయం చేయాలని, నిందితుని నుంచి డబ్బులు వసూలు చేయాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. రూ.90 లక్షలు నష్టపోయాం ఆరిజన్ సొల్యూషన్ కంపెనీలో రూ.90 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను. మా దగ్గర ఉన్న బంగారు మొత్తం తాకట్టు పెట్టాం. తెలిసిన వాళ్ల దగ్గర అప్పుగా తెచ్చి కూడా ఇచ్చాం. లాభాలు దండిగా వస్తాయని నరేష్కుమార్రెడ్డి ఆశ చూపాడు. తొలినాళ్లలో డబ్బులు సక్రమంగా ఇవ్వడంతో మరింత అప్పు చేసి ఇచ్చాం. మా లాంటి ఎంతోమంది బాధితులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులే న్యాయం చేయాలి. – నాగవేణి, ఆత్మకూరు మండలం నిండా ముంచిన ఆరిజన్ సొల్యూషన్ కంపెనీ రూ.25 కోట్లకు పైగా వసూలు బాఽధితుల్లో ఎక్కువ శాతం నిర్వాహకుడి స్నేహితులు, బంధువులే లబోదిబోమంటూ ఎస్పీ కార్యాలయానికి... -
రెవెన్యూలో వసూల్ రాజాలు
అనంతపురం అర్బన్: తహసీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది అవినీతి తారస్థాయికి చేరింది. రెవెన్యూ సేవలకు వెలకట్టి.. జేబులు నింపుకుంటున్నారు. కొందరైతే కాసుల కోసం జలగల్లా పీడిస్తారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు చేతిలో పడితేనే ఫైళ్లు కదులుతాయనే విమర్శలు ఉన్నాయి. అక్రమార్జనలో కొందరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఎంఆర్ఐ), గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ) రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వీరి అవినీతిపై 408 ఫిర్యాదులు అందాయి. ఇందులో 338 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు.. 70 పెండింగ్లో ఉన్నట్లు అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది. తహసీల్దారు కార్యాలయాల్లో ప్రతిపనికీ డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఇక్కడి కొందరు అవినీతి సిబ్బందికి పైసలిస్తేనే పనులు జరిగే పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి వచ్చే ప్రజలు, రైతుల అవసరాన్ని బట్టి వసూలు మొత్తం పెరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అడంగల్, 1బి సవరణలు, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు, మ్యుటేషన్, సర్వే నంబరు కరెక్షన్, సబ్ డివిజన్, ఇలా ప్రతి పనికీ డబ్బులు గుంజుతారనే ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి. తహసీల్దారు కార్యాలయాల్లోని కొందరు అవినీతి సిబ్బందికి 22ఎ (నిషేధిత భూములు), 08 (చుక్కల భుములు), మిగులు భూమి కరెక్షన్ ఫైళ్లు కల్పతరువుగా మారి కాసులు కురిపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఫైలు సిద్ధం చేయడం ప్రారంభించడంతోనే డబ్బులు వసూలు ప్రక్రియ సమాంతరంగా మొదలవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి సిబ్బందిపై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, ఇతర అధికారులకు ప్రతి వారం ఒకటో రెండో ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. రెవెన్యూ సేవలను ఆదాయ వనరుగా మార్చుకున్న అక్రమార్కుల కదలికలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నిఘా ఉంచింది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఏసీబీ ఉద్యోగి ఒకరు వచ్చి సాధారణ వ్యక్తిలా పరిసరాల్లో తిరుగుతుంటాడు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలతో, ముఖ్యంగా రైతులతో ఆ ఉద్యోగి మాట్లాడతాడు. ఏం పనిమీద వచ్చావు.. తహసీల్దారు కార్యాలయంలో పని ఎందుకు కాలేదు.. అక్కడ ఎవరైనా డబ్బులు ఇవ్వాలని అడిగారా.. ఎంత అడిగారు...? వంటి వివరాలను ఆ ఉద్యోగి సేకరిస్తాడు. ఇలా ఆదాయానికి మించిన ఆస్తులు, బినామీలకు సంబంధించి అవినీతి ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అడిగినంత డబ్బులిస్తేనే ఫైళ్లలో కదలిక కాసుల కోసం జలగల్లా పీడిస్తున్న వైనం ఆర్ఐలు, వీఆర్ఓలపై ఫిర్యాదుల వెల్లువ అక్రమార్కుల ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ నిఘా కల్పతరువుగా 22ఎ, 08 ఫైళ్లు.. ప్రతివారం ఏసీబీ నిఘా.. ప్రతి పనికీ పైసావసూల్.. -
ఆలిండియా 62వ ర్యాంకుతో మెరిసిన సమిత్
అనంతపురం ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్డ్–2026 పరీక్షల్లో అనంతపురం నగరానికి చెందిన కోనంకి సమిత్ చౌదరి అదరగొట్టాడు. ఆలిండియా స్థాయిలో 62వ ర్యాంకుతో మెరిశాడు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షలో సమిత్ చౌదరి సాధించిన విజయం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం సమిత్ చౌదరి విజయవాడలోని శ్రీచైతన్య విద్యాసంస్థల గోసాల వేదవ్యాస్ భవన్లో ఇంటర్ చదివాడు. సమిత్ చౌదరి స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా రామగిరి. తండ్రి కోనంకి అశోక్ కుమార్ గుడిబండ మండలం జంబులబండ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా, తల్లి అరుణాదేవి పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కృషి, క్రమశిక్షణే కారణమని సమిత్ చౌదరి తెలిపాడు. -
పోస్టింగ్ ఇస్తామన్నా ‘వద్దు సార్’ అంటున్న అధికారులు
ధర్మవరంలో పోస్టింగ్ కోసం ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్సాహం చూపేవారు. సిఫార్సు లేఖల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘కూటమి’ నాయకుల ఒంటెత్తు పోకడలు, ఒత్తిళ్ల గురించి తెలుసుకుని అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారులు తమ వద్దకు పిలిచి మరీ పోస్టింగ్ ఇస్తామన్నా ‘మాకొద్దు సార్’ అంటూ చేతులెత్తేస్తున్నారు. కాదని బదిలీ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ధర్మవరం: మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 5 నెలలుగా ఇక్కడ ఇన్చార్జ్ ఆర్డీఓ, ఇన్చార్జ్ డీఎస్పీతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత సమస్మాత్మక ప్రాంతాల్లో ధర్మవరం ఒకటి. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఇక్కడి పోలీస్ సబ్ డివిజన్కు 5 నెలలుగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడం గమనార్హం. పెనుకొండ డీఎస్పీ నర్సింగప్పను ఇన్చార్జ్గా నియమించినా, రెండు సబ్ డివిజన్లను పర్యవేక్షించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కిందిస్థాయి సిబ్బందిపై అజమాయిషీ సక్రమంగా లేక అంతా ఇష్టారాజ్యంగా మారింది. ఇదే అదనుగా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇటీవల వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు, పట్టపగలే రైతు కిడ్నాప్, సచివాలయంలో చోరీ ఘటనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అవస్థల పర్వం.. ధర్మవరం రెవెన్యూ డివిజన్లో సైతం పాలన అటకెక్కింది.తాడిమర్రిలో రెండేళ్లుగా, ధర్మవరంలో ఏడాదిగా తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రెండేళ్లుగా ఆర్ఐలు కూడా లేరు. ఇక.. నియోజకవర్గానికి రెగ్యులర్ ఆర్డీఓను నియమించకుండా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఆమె ఎప్పుడో ఒకసారి ధర్మవరం వచ్చి వెళ్తుండటంతో రెవెన్యూ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదు. భూముల రీ సర్వేలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్లు స్పందించకపోతే చెప్పుకునేందుకు ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పని కోసం కూడా ప్రజలు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. అంతులేని అవినీతి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాను ‘మామూలు’గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి నాయకుల ఒత్తిళ్లతోనే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తమ మాటంటే తమ మాటే జరగాలంటూ ‘కూటమి’ పారీ్టలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఇన్చార్జ్లు ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే పాటించాలని ఇప్పటికే హుకుం జారీ చేసినట్లు తెలిసింది. టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూధన్రెడ్డి సైతం పెత్తనం కోసం ప్రయతి్నస్తుండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికారులు సతమతమవుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం ఉన్నతాధికారులు లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆర్ఐలు అందుబాటులో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. వారాల తిరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. –గుండా ఈశ్వరయ్య, ధర్మవరంవాసిప్రజల్లో భయాందోళన ఏటీఎంలలో చోరీలు, రైతు కిడ్నాప్, సచివాలయంలో విధ్వంసం వంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి నిజాయితీ గల అధికారులను నియమించకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. –చందమూరి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం -
ఊపిరి తీశారు!
అనంతపురం: అనంతపురం సర్వజన ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరెంటు సరఫరాలో అంతరాయం తలెత్తడం, జనరేటర్ సకాలంలో ఆన్ చేయకపోవడంతో అత్యవసర విభాగంలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మోహన్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మోహన్ కొన్ని నెలలుగా పక్షవాతం, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం సర్వజన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. డాక్టర్లు అత్యవసర విభాగంలో వెంటిలేటర్పై ఉంచారు. అయితే శనివారం అర్ధరాత్రి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆటోమేటిక్గా ఆన్ అయ్యే జనరేటర్ విధానం లేకపోవడంతో వెంటిలేటర్పై ఊపిరి అందక తమ కుటుంబ పెద్దదిక్కు కోల్పోయామని మోహన్ భార్య జయలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం రోగి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం ఒక ఎత్తయితే.. ప్రభుత్వ నిర్లక్ష్యమూ ఇందుకు కారణం అవుతోంది. ఆస్పత్రిలో కరెంట్ స్తంభాలు పాతపడిపోయాయి. ఇనుప స్తంభాలు తుప్పు పట్టిపోయాయి. తేలికపాటి గాలి వస్తేనే కూలిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రి ఉన్నతాధికారులు విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందారు. చిన్నపాటి గాలివానకే కరెంట్ స్తంభాలు కిందకు పడిపోయి..విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి రోగుల ప్రాణాలు పోతున్నాయి. మోహన్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. కాగా...మోహన్ అనారోగ్యంతోనే చనిపోయాడని, తమ నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు. అతన్ని స్వయంగా పరీక్షించానని, పెరాలసిస్, షుగర్, కిడ్నీ వ్యాధులు ఉండడంతోనే మృతి చెందాడని చెప్పారు. -
ముగిసిన గృహగణన
● 1,369 గృహాలకు తాళం, 84,301 గృహాలు ఖాళీ ● గణన మరోవారం పెంచే అవకాశం అనంతపురం అర్బన్: జనగణన–2027లో భాగంగా చేపట్టిన తొలిదశ గృహగణన కార్యక్రమం జిల్లావ్యాప్తంగా మే 30తో ముగిసింది. 32 మండలాలు, నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాల పరిధిలో 7,41,014 గృహాలు ఉన్నాయి. వీటిలో 5,47,438 గృహాల్లో నివాసముంటున్నారు. వీటిలో గడువు ముగిసే నాటికి 5,02,493 గృహాల గణన (91.789 శాతం) పూర్తి చేశారు. 44,945 గృహాలు సర్వే చేయాల్సి ఉంది. అయితే గృహగణన వందశాతం పూర్తికానందున కార్యక్రమాన్ని సెన్సస్ శాఖ మరో వారం రోజులు పెంచే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రావచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 84 వేల ఇళ్లు ఖాళీ.. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఉన్న 7,41,014 గృహాలలో 84,301 గృహాలు ఖాళీగా ఉన్నాయి. 1,369 గృహాలు తాళం వేసి ఉన్నాయి. ఇక 1,07,906 గృహాలను ఇతర పనులకు వినియోగిస్తున్నారు. 5,47,438 నివాస గృహాల్లో 5,02,493 గృహాలను లెక్కించారు. ఇకజిల్లాలో మొత్తం జనాభా 22,11,143 మంది ఉన్నారు. -
మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మాదిగ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాదిగ విద్యార్థులకు మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ‘పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రతిభా పురస్కారాలు’ పంపిణీ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నెపాకుల రమేష్ అధ్యక్షతన వహించారు. ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు, బండారు శ్రావణి మాట్లాడుతూ పేద విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు ఎన్టీ రామాంజినమ్మ, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు సురేష్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వై.కే. విశ్వనాథ్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు తదితరులు పాల్గొన్నారు. -
గాలివానకు విరిగిన విద్యుత్ స్తంభాలు
అనంతపురం టౌన్: గాలివాన బీభత్సం సృష్టించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్శాఖకు దాదాపు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. గుత్తి, గుంతకల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 11కేవీతో పాటు ఎల్టీ విద్యుత్ స్తంభాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే అనంతపురం నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగిపోయాయి. దాదాపు 220కి పైగా స్తంభాలు కూలిపోయినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం కురిసిన గాలి వానకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు తీగలు తెగిపోయాయి. విద్యుత్శాఖకు రూ.12 లక్షల నష్టం -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలని సూచించారు. అర్జీ వెంట ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. కొనసాగుతున్న గాలివాన అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో గాలివాన కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 21 మండలాల పరిధిలో 15.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గుత్తిలో 55.8, రాప్తాడు 41, యాడికి 40, తాడిపత్రి 40.2, అనంతపురం రూరల్ 39.4, అనంతపురం అర్బన్ 37, పుట్లూరు 36.6, బుక్కరాయసముద్రం 34, యల్లనూరు 31.4, నార్పల 28.4, గార్లదిన్నె 23.6, బెళుగుప్ప 18.2, కళ్యాణదుర్గం 13.2 మి.మీతో పాటు పామిడి, పెద్దపప్పూరు, శింగనమల, కంబదూరు, ఆత్మకూరు, కూడేరు, కణేకల్లు, పెద్దవడుగూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడ అరటి పంట దెబ్బతినగా... నగరంలో పెద్ద పెద్ద చెట్లు సైతం పడిపోయాయి. పెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఆదివారం సాయంత్రం విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నైరుతి రాకమునుపే తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. ఎల్–నినో అంటూ భయపెడుతున్నా ముందస్తు వర్షాలతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో బోగస్ హాజరుకు చెక్ ● ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి ● 75 శాతం అటెండెన్స్ లేకపోతే ఫీజురీయింబర్స్మెంట్ కట్ ● అక్రమార్జనకు కోతతాడిపత్రి రూరల్: ప్రైవేట్ కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ అటెండెన్స్) విధానం తప్పనిసరి చేస్తూ ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ బోగస్ హాజరు నమోదు చేసి.. విద్యార్థులకు మంజూరయ్యే ఫీజు రీయింబర్స్మెంట్ను సొమ్ము చేసుకుంటున్న పలు కళాశాలలకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది. జిల్లాలో 57 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, 14 ఇంజినీరింగ్ కళాశాలలు, 14 బీఈడీ కాలేజీలు, 35 ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎం.కామ్ కోర్సులు అందించే కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటిలోనూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయనున్నారు. ఎవరికి ఇబ్బంది అంటే... ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకున్న వారిలో కొందరు నేరుగా తరగతులకు హాజరవుతున్నారు. మరికొందరు గైర్హాజరవుతూ యాజమాన్యంతో ‘మేనేజ్’ చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో తరగతులకు హాజరయ్యేవారూ ఉన్నారు. ఇక డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఏంసీఏ, ఏంబీఏ తదితర కోర్సులు చదువుతున్న వారిలో అర్హులైన వారికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి. ఇలా తరగతులకు హాజరుకాని వారితో కళాశాల యాజమాన్యాలు లోపాయికారి ఒప్పందం చేసుకుని తగినంత ‘హాజరు’ వేస్తూ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటూ వస్తున్నాయి. ఇకమీదట 75 శాతం హాజరు లేకపోతే ఫీజురీయింబర్స్మెంట్ వర్తించదు. దీంతో ఆయా కళాశాలలు అక్రమార్జనను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రైతు సేవలకు కత్తెర
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు ఇతోధికంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకే/ఆర్ఎస్కేలను చంద్రబాబు ప్రభుత్వం కుదించింది. 25 శాతం కేంద్రాలను మూసేయడంతో రైతులు వ్యవసాయ సేవలు పొందడానికి ఇబ్బందులు తప్పేలా లేవు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి దేశంలోనే లేనివిధంగా రైతు బాగోగులే లక్ష్యంగా 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశారు. వ్యవసాయం, పట్టు, పాడి, పశుపోషణ, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్, ఏపీఎంఐపీ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రైతులు ఊరు దాటకుండా అన్ని రకాల సేవలూ ముంగిటకే అందించారు. వన్స్టాప్ హెల్ప్ సెంటర్లుగా విత్తు నుంచి విపత్తు వరకు, పంట సాగు నుంచి విఫణిలో పంట అమ్ముకునే దాకా రైతులకు విశేష సేవలు అందిస్తూ వచ్చాయి. ఆర్బీకే వేదికగా గ్రామస్థాయి పంట ప్రణాళిక అమలు చేస్తూ అడుగడుగునా రైతులకు అండగా ఉండేలా తీర్చిదిద్దారు. వాటిని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా సొంత భవనాలు నిర్మించారు. పల్లెసీమల్లో ఆర్బీకేలు రైతులకు ఆలయాలుగా మారిపోయాయి. అలా ఒకే విడతగా అనంతపురం జిల్లాలో ఏకంగా 451 ఆర్బీకేలు ఏర్పాటు చేసి.. అక్కడ వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు, అలాగే విదేశీ బృందాలు సందర్శించి ప్రశంసలు గుప్పించాయి. అయితే చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆర్బీకేలను ఆర్ఎస్కేలు పేరు మార్చేసింది. జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆర్ఎస్కేల నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఏడాది కిందట హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) అంటూ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. ఆర్ఎస్కేల సంఖ్యను పెంచాల్సింది పోయి తగ్గించడం గమనార్హం. హేతుబద్ధీకరణ ఏ ప్రాతిపదికన చేశారో కూడా తెలియని విధంగా మొదట 15 ఆర్ఎస్కేలను తొలగించారు. తర్వాత వాటి సంఖ్య 125కి చేరింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 451 ఆర్బీకేలు ఉండగా.. అందులో 125 మూతపడటంతో వాటి సంఖ్య 326కు పడిపోయింది. అందులో 126 ఆర్ఎస్కేల్లో వీఏఏలు, 180 ఆర్ఎస్కేలో వీహెచ్ఏలు, 12 ఆర్ఎస్కేల్లో వీఎస్ఏలు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న 8 ఆర్ఎస్కేల్లో ఎంపీఈఓలను నియమించారు. రెండేళ్లు తిరగకుండానే ఏకంగా 125 ఆర్ఎస్కేలను మూసివేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాయితీ విత్తన వేరుశనగ, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల కోసం గ్రామం వదలి వేరే గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. విత్తు, విపత్తు సమయాల్లో సకాలంలో సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకునే పరిస్థితి లేదు. మూతవేసిన ఆర్ఎస్కే గ్రామాల్లో ఇప్పుడు విత్తన వేరుశనగ సరఫరా చేస్తారా లేదా వేరే గ్రామాలకు అటాచ్ చేస్తారా అనేది కూడా అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. హేతుబద్ధీకరణ పేరుతో ఆర్ఎస్కేల కుదింపు 451 నుంచి 326కు తగ్గిన ఆర్ఎస్కేల సంఖ్య వన్స్టాప్ హెల్ప్ సెంటర్లుగా జగన్ హయాంలో రైతులకు విశిష్ట సేవలు 125 ఆర్బీకేలు మూత.. -
ఆర్బీకేలు పునఃప్రారంభించాలి
రేషనలైజేషన్ పేరుతో మూతబడిన 125 ఆర్ఎస్కేలు తెరిచి గతంలో మాదిరిగా అన్ని రకాల సేవలూ అందించాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి పథకాల ఫలాలు, ఇతరత్రా కార్యక్రమాలు రైతు ముంగిటకే చేరాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన వాటిని కుదించే ప్రయత్నాలు చేయడం మంచిదికాదు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నవాటిని మూసివేసి రైతులకు సేవలు దూరం చేయడం దారుణం. గతంలో మాదిరిగానే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతరత్రా ఇన్పుట్స్ వంటివి మూసివేసిన ఆర్ఎస్కేల్లో కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. – ఆర్.చంద్రశేఖర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
జల్లిపల్లి మారెమ్మ ఆలయంలో చోరీ
కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లిలో బస్టాండ్లో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారెమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆలయం ముందు రోజూలాగానే శుభ్రం చేస్తున్న వ్యక్తికి ఆలయం గేటు లోపలికి తోసి ఉండడం కనిపించింది. వెంటనే పూజారికి సమాచారం ఇవ్వడంతో ఆయనతో పాటు గ్రామస్తులు వచ్చి పరిశీలించారు. వెండి నాగపడగ, గొడుగులు, ఇతర ఆభరణాలు, బంగారు తాళిబొట్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో ఏఎస్ఐ సంజీవులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 3 కేజీల వరకు వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలు పోయి ఉండవచ్చని గ్రామస్తులు, ఆలయ పూజారి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 3 కేజీల వెండి, 3 తులాల బంగారం అపహరణ -
రైతు భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు
రాయదుర్గంటౌన్: పట్టణ శివారు గౌడ లేఅవుట్ జగనన్న కాలనీ సమీపంలోని 169 సర్వే నంబర్లో ఓ రైతు భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి జేసీబీలు, టిప్పర్లతో రైల్వే పనుల కోసం పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దగ్గరుండి మట్టి తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సదరు రైతు బంధువులతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకొని నిలదీశారు. దాదాపు 70 దాకా టిప్పర్ల మట్టిని తరలించి భూమిని గుంతలమయం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయని, ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తున్నట్లు బంగి శివ తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. -
విద్యతోనే సమాజంలో సముచిత స్థానం
వైన్ షాపులో చోరీ యాడికి: మండల పరిధిలోని రాయలచెరువులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక భాగాన ఉన్న బ్రాందీ షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. శనివారం రాత్రి దుండగులు వైన్ షాపు వెనుక భాగంలో గోడ పైన కన్నం వేసి షాపు లోపలికి చొరబడి రూ.2 లక్షల మద్యం బాటిళ్లు, రూ.23 వేల నగదును ఎత్తుకెళ్లారు. సీఐ శ్రీనివాసులు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించారు. అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గుత్తి రోడ్డులోని కనకదాస కల్యాణ మండపంలో నిర్వహించిన కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి, కురుబ కులానికి ఉపయోగపడాలన్నారు. సివిల్స్ చదవాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లే విద్యార్థులకు ఉచిత వసతి సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ విద్యా పరంగా అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మల్లికార్జున మాట్లాడుతూ మారుమూల గ్రామాల విద్యార్థులు కూడా విద్యలో రాణిస్తుండటం హర్షణీయమన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ వెంకటరాముడు మాట్లాడుతూ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురబ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు తుప్పటి ఈశ్వరయ్య, డాక్టర్ కేసీ మహేష్, మాస్టర్ మైండ్స్ బసవయ్య, డెప్యూటీ డీఈఓ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లింట విషాదం
● బాలుడిని రక్షించే క్రమంలో యువతి మృతి ఉరవకొండ: పెళ్లింట విషాదం నెలకొంది. కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడేందుకు యత్నించిన యువతి మృతితో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు.. ఉరవకొండ పట్టణంలోని పార్కు ఆంజినేయస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న రత్నమాచారి, కళావతి దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈనెల 7న పెద్ద కుమార్తె నీరజకు మంత్రాలయంకు చెందిన కాళప్ప ఆచారి కుమారుడితో వివాహం జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యులు ఈనెల 30న మంత్రాలయంలోని వరుడి ఇంట్లో సత్యనారాయణ పూజ ఏర్పాటు చేశారు. పూజ కోసం వెళ్లిన బంధువులు స్నానం కోసం తుంగభద్ర నదికి వెళ్లారు. పుష్కర ఘాట్ సమీపంలో స్నానాలకు దిగారు. ఇందులో హైదరాబాద్కు చెందిన సతీష్చంద్రతో పాటు అతని ఐదేళ్ల కుమారుడు యువన్ ఉన్నారు. యువన్ నీటిలో మెల్లగా కొట్టుకుపోవడం గమనించిన రత్నమాచారి, కళావతి దంపతుల మూడో కుమార్తె సంధ్య నదిలో దిగి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. అయితే నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో సంధ్య కూడా నీటిలో కొట్టుకుపోయింది. సంధ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ అమ్మాయి చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లి మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): వ్యవసాయతోటకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ను తాకి గొర్రెల కాపారి మురళి (42) మృతి చెందిన సంఘన కంబదూరు మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి గొర్రెలు మెపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం కూడా గొర్రెలను మోపుకుంటూ వెళ్లాడు. వ్యవసాయ తోట రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ వైరును ప్రమాదశాత్తూ తాకడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య అక్కమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బస్సు ఢీకొని ఒకరి మృతి కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాలమేరకు.. పర్వతదేవరపల్లికి చెందిన బాబాసాహెబ్ (65) ఆదివారం రాత్రి 7.30 సమయంలో నడుచుకొంటూ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఆ సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సేవలు తగ్గిపోయాయి
జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకేల్లో ఇప్పుడు సేవలు తగ్గిపోయాయి. గతంలో విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రైతు భరోసా, పీఎం కిసాన్, పశువుల మందులు, ఈ–క్రాప్, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలా వడ్డీ, సున్నా వడ్డీ... ఇలా రైతులకు సంబంధించి ఏది కావాలన్నా అక్కడికి వెళితే తెలిసేవి. గతంలో రైతులతో ఆర్బీకేలు కిటకిటలాడేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రైతులు పెద్దగా అటువైపు వెళ్లడం లేదు. రెండేళ్లుగా రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. – సత్యనారాయణరెడ్డి, రైతు, బోరంపల్లి, కళ్యాణదుర్గం మండలం -
తనయుడి మరణంతో ‘తల్లి’డిల్లి..
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడం ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ కనిపించే తనయుడు విగతజీవిగా పడి ఉండటాన్ని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. నువ్వులేని లోకంలో నేనుండలేనంటూ ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. తల్లీకుమారుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్యాణదుర్గం రూరల్ (కంబదూరు): ఈతకెళ్లి యువకుడి మృతి చెందగా.. కుమారుడి మరణవార్త విని తట్టుకోలేక తల్లి ఉరివేసుకున్న సంఘటన కంబదూరులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండల కేంద్రలో నివాసం ఉండే అనిత, హనుమంతు దంపతులు. వీరు వడ్డే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అజయ్ (16) కుమారుడు, కుమార్తె అశ్విని ఉన్నారు. పదో తరగతి పూర్తి చేసిన అజయ్ ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో తోటలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్లో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. వెంటనే స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణవార్తతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి అనిత (37)ను కుటుంబ సభ్యులు, బంధువులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కుమారుడి మరణం తట్టుకోలేక గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒకేసారి ఇద్దరి మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈతకెళ్లి బాలుడి మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య -
‘ముంగారు’కు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: కీలక ఖరీఫ్ (ముంగారు) సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఎల్–నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ప్రభుత్వం, వ్యవసాయశాఖ మూడు నెలలుగా విస్తృత ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్స్) కూడా ఇంకా పలకరించలేదు. ఈ వారాంతంలోపు ‘నైరుతి’ ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలపై ఖరీఫ్ ఆధారపడింది. ఈ ఖరీఫ్లో అన్ని రకాల పంటలు 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానపంట వేరుశనగ 1,47,382 హెక్టార్లు ఉండగా, ఆ తర్వాత కంది 78,274 హెక్టార్లు, పత్తి 42,119 హెక్టార్లు, మొక్కజొన్న 21,659 హెక్టార్లు, ఆముదం 17,490 హెక్టార్లుగా ఉంది. నీటి వసతి కింద 22,868 హెక్టార్లలో వరి నాట్లు వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలా ఐదు ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, ఉలవ, అలసంద, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు వంటి 20 నుంచి 22 రకాల పంటలు సాగులోకి రావచ్చని అంచనాలు తయారు చేశారు.పంటలు సకాలంలో సాగులోకి రావాలంటే రుతపవనాలు ప్రభావం చూపి జూన్ 15 నుంచి జూలైలో మంచి వర్షాలు పడాలి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల కాలాన్ని ఖరీఫ్గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ సాధారణ వర్షం నమోదు కావాలి. మొత్తం ఏడాది పొడవునా 512.5 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. జిల్లాలో 4,03,454 మంది రైతులు ఉన్నారు. అందులో ఒక హెక్టారులోపున్న చిన్నకారు రైతులు 1,27,584 మంది ఉండగా, ఒకటి నుంచి 2 హెక్టార్ల లోపున్న సన్నకారు రైతులు 1,47,044 మంది ఉన్నారు. ఇక రెండు నుంచి నాలుగు హెక్టార్ల లోపున్న మధ్యస్థ రైతులు 1,03,793 మంది ఉండగా, 4 నుంచి 10 హెక్టార్ల వరకు ఉన్న ఓ మాదిరి రైతులు 22,952 మంది, 10 హెక్టార్లు, అంతకన్నా ఎక్కువ కలిగిన పెద్ద రైతులు 2,081 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిన్నాయి. ఖరీఫ్ మొదలైనా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. సకాలంలో విత్తనం, ఎరువులు, అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పావలావడ్డీ, యంత్రపరికరాలు లాంటి వాటి రూపంలో సాయం చేయడానికి మనసు రావడం లేదు. పంట పెట్టుబడులకు అవసరమైన డబ్బు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు 56 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనం కేటాయించి, విత్తన వేరుశనగకు 40 శాతం సబ్సిడీ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. పాత బకాయిలు రూ.90 కోట్లు ఇస్తే కానీ తాము ఖరీఫ్కు విత్తనం సరఫరా చేయలేమని ప్రాసెసింగ్ప్లాంట్ల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా కంది, మొక్కజొన్న, ఆముదం విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నా రైతులకు మేలైన విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇక వేరుశనగతో పాటు ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు సరైన సమయమని ఏఆర్ఎస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.విజయశంకరబాబు, డాక్టర్ సాధినేని మల్లీశ్వరి, జేడీఏ ఎన్.సాలురెడ్డి తెలిపారు. నేటి నుంచి ఖరీఫ్–2026 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా ఎల్–నినో, ప్రతికూల పరిస్థితుల్లో ఆలస్యంగా ‘నైరుతి’ ఇంకా మొదలు కాని రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ విత్తన పంపిణీ ఎప్పుడో..? 3.43 లక్షల హెక్టార్లు అంచనా.. 4.03 లక్షల మంది రైతులు.. పెట్టుబడులకు తప్పని ఇబ్బందులు.. -
ఎమ్మెల్యే దగ్గుపాటితో వేగలేం!
అనంతపురం టౌన్: తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీ నాయకుల మనుగడ కష్టతరంగా మారింది. పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న తమను రాజకీయంగా ఎదగకుండా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ముస్లిం మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో వివక్ష, దాడులకు గురయ్యామని అంటున్నారు. ఆయన ఆగడాలను తెలుపుతూ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. ● నగరంలోని సాయినగర్లో అస్రా కంటి ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే అనుచరులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి.. ఆపైన నిర్వాహకులైన ముస్లిం మైనార్టీ కుటుంబంపై దాడులకు సైతం తెగబడ్డారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాన్ని, భవనాన్ని కాజేయాలనే కుట్రలు చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే నేరుగా మహిళా డాక్టర్ భర్త షరీఫ్కు ఫోన్ చేసి ‘చెప్పుతో కొడతా ల.. కొడకా. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే బావమరిది గురించి మాట్లాడతావా? నీ కథ చూస్తా’నంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ● నగరంలోని ఆజాద్నగర్కు చెందిన టీడీపీ నాయకుడు నూర్మహమ్మద్ రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక నాయకుని ఫొటో ఫ్లెక్సీలో లేదని స్థానిక నేతలు ఎమ్మెల్యేను విందుకు రాకుండా అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని మైనార్టీ నాయకుడు నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. నాకేమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణం.. టీడీపీ కోసం కష్టపడి పని చేసినా గుర్తింపు లేదంటూ ముస్లిం మైనార్టీ నాయకుడు సైఫుద్దీన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. ‘నాకు జరిగిన అన్యాయం గురించి బహిరంగంగా మాట్లాడితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు జీర్ణించుకోలేక దాడులకు తెగబడుతున్నారు. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణ’మంటూ ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మమ్మల్ని మీరే కాపాడండి.. ‘అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని రాజీవ్ కాలనీ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో రూ.లక్షల్లో ఖర్చు పెట్టి పోటీ చేశాను. సార్వత్రిక ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించాను. కానీ నేనేమీ పని చేయలేదంటూ ఎమ్మెల్యే దూషణలకు దిగుతున్నారు. మీరే మమ్మల్ని కాపాడండి’ అంటూ సర్పంచ్ అభ్యర్థి నబిరసూల్ చంద్రబాబు, లోకేష్లను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇవే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ నాయకులపై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ముస్లింల మనుగడ కష్టమే తమకేమైనా జరిగితే ఆయనే కారణం వైరల్ అవుతున్న ముస్లిం మైనార్టీ నాయకుల వీడియోలు -
ఫార్మా విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అఘాయిత్యం
ధర్మవరం: అనంతపురం జిల్లా కేంద్రంలో మహిళలపై తెలుగు తమ్ముళ్ల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసులమని చెప్పుకుని జనాన్ని బెదిరిస్తూ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే పార్కులో ఉన్న ఫార్మా విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి లైంగికదాడికి యత్నించాడు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధిత విద్యార్థిని ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు టీడీపీ కార్యకర్త కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 26న అనంతపురం రూరల్ పరిధిలోని టీవీ టవర్ వద్ద ఉన్న వనమిత్ర పార్కులో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో చదువుతున్న యువతి, ఆమె స్నేహితుడు మాట్లాడుకుంటున్నారు.అదే సమయంలో ధర్మవరానికి చెందిన టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి అక్కడికి వెళ్లాడు. ‘మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మేం పోలీసులం. విచారణ చేయాలి. స్టేషన్కు రండి’ అంటూ భయపెట్టే యత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థులు తామేం తప్పు చేశామని ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ కార్యకర్త హరి యువతిని బలవంతంగా పార్కు ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు.మరుసటి రోజు ఉదయం బాధితురాలు అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు హరిని అరెస్టు చేశారు. లైంగికదాడియత్నం కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించారు. కాగా.. ధర్మవరం పట్టణంలోనూ టీడీపీ కార్యకర్త హరి అనేక ఆగడాలకు ఒడిగట్టాడు. మంత్రి నారా లోకేశ్, పరిటాల శ్రీరామ్, ఇతర నాయకులకు హరి సన్నిహితుడని సమాచారం. వారి అండతో అనేక దౌర్జన్యాలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విహారయాత్రలో విషాదం
ఉరవకొండ: బక్రీద్ పండుగ నేపథ్యంలో కూడేరులోని పీఏబీఆర్ వద్దకు చేరుకున్న కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్కు చెందిన ఓ కుటుంబం శనివారం పీఏబీఆర్కు చేరుకుంది. తొమ్మిది మంది కుటుంబసభ్యులు కలసి విందు భోజనాలు చేసిన అనంతరం షేక్ ఫరీదా(35), ఆమె సోదరి కుమార్తె యాస్మిన్(13) సరదాగా జలాశయం చివరన నీటిలోకి దిగారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు గుర్తించి వెలికి తీసేలోపు విగత జీవులయ్యారు. పోలీసులు వచ్చి స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దుర్గంలో దాహం కేకలు
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో తాగునీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. నెలకు మూడు సార్లు కూడా కుళాయిలకు నీరు వదలడం లేదు. రెండు నెలలుగా పరిస్థితి అధ్వానంగా మారింది. విసుగుచెందిన బీటీపీ రోడ్డు, మొలకాల్మూరు రోడ్డు, లక్ష్మీబజార్, మధుటాకీస్ ఏరియా తదితర ప్రాంతాల మహిళలు ఆందోళనబాట పట్టారు. గత శుక్రవారం ఓబుళాచారి రోడ్డు, నేతాజీరోడ్డు, గోసాబావి వీధికి చెందిన మహిళలు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తాజాగా శనివారం ఐదో వార్డు మహిళలు సచివాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. ఆందోళన చేసిన ఏరియాలకు మాత్రం వెంటనే ట్యాంకర్లు పంపుతున్నారని, మరి తమ పరిస్థితి ఏమిటని మిగతా ప్రాంతవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెబుతున్న కారణాలివే.. కణేకల్లులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి రాయదుర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హెచ్చెల్సీ శాశ్వత మంచినీటి పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. తరచూ కరెంటు సరఫరాలో అంతరాయం, ఎస్ఎస్ ట్యాంకు నుంచి వీరాపురం వద్ద గల పంప్ హౌస్ వరకు విద్యుత్ లైన్ లోపంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. సమీక్షలతోనే సరి.. పరిష్కారమేదీ? డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మంచినీటి పథకం కింద మరో మూడు నెలలకు సరిపడ నీరు అందుబాటులో ఉన్నా రాయదుర్గం పట్టణవాసులకు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సమీక్షలతోనే అధికారులు, పాలకులు సరిపెడుతున్నారు గానీ క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి ప్రారంభం నుంచే సరైన ప్రణాళిక లేకపోవడమే తాగునీటి సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అవసరమైన చోట్ల బోర్లు వేసి కనీసం అవసరాలకు వినియోగించే నీటిని డిస్ట్రిబ్యూషన్ లైన్లకు లింక్ ఇస్తే సమస్య కాస్త అదుపులోకి వచ్చేది. దీంతోపాటు పట్టణంలో విరివిగా బోర్లు ఏర్పాటు చేసి సిస్టన్ ట్యాంకులు ఏర్పాటు చేసినా ఉపశమనం లభించేది. గతంలో నీటిని అందించిన పాత బోర్లు నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి. వీటిపై దృష్టి సారించకపోవడం కూడా నిర్లక్ష్యంగా ప్రజలు పేర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా లోపాలు అధిగమించే దిశగా చర్యలు తీసుకోకపోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాయదుర్గం పురపాలక సంఘంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పది రోజులకోసారి కూడా కుళాయిలకు తాగునీరు రావడం లేదు. సమస్యను అధిగమించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. మహిళలు ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పది రోజులకోసారి కూడా నీరు రాని దుస్థితి రెండు నెలలుగా మహిళల ఆందోళనబాట సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలం నీరు సక్రమంగా వదలాలి కాలనీలకు రెండు నెలలుగా తాగునీరు సకమ్రంగా రావడం లేదు. తాగునీటి విడుదల ఆలస్యమైన రోజుల్లో కనీసం ట్యాంకర్ నీరు కూడా పంపడం లేదు. అధికారులు స్పందించి నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి. – నాయకుల సుధ, గాంధీనగర్ కాలనీ, రాయదుర్గం తాగునీటి సరఫరా మెరుగుకు చర్యలు విద్యుత్ అంతరాయం, పైప్లైన్ లీకేజీలతో నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యుత్ సరఫరా లోపాన్ని నివారించేందుకు అధికారులతో సమీక్షించాం. ఒకే ఫీడర్తో విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తాం. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల సంఖ్య పెంచుతాం. – దివాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం -
రైతు సమస్యలు పట్టవా?
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు పని తీరులో చాలా మార్పులు వచ్చాయని, రైతుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ప్రధానంగా తాగునీరు, వ్యవసాయం, వైద్యం, విద్య, విద్యుత్, వెల్ఫేర్ వంటి అంశాలపై చర్చ సాగింది. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్ర మాట్లాడుతూ... ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ రైతులకు విత్తన వేరుశనగ పంపిణీపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఏ సాలురెడ్డి మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంగా ఆలస్యం చోటు చేసుకుందని, రైతులకు జూన్ 4 నుంచి విత్తన పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తీసుకెళ్లినా నేటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడాలని అధికారులకు చైర్పర్సన్ సూచించారు. రైతులకు పంట నష్ట పరిహారం, బీమా పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని జెడ్పీటీసీ నాగరాజు గుర్తు చేశారు. సర్వజనాస్పత్రిలో నెలకొన్న సమస్యలను జెడ్పీటీసీ చంద్ర ప్రస్తావిస్తూ... రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారన్నారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ అంబులెన్స్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్లు లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గిరిజమ్మ సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. సమగ్ర విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. కాగా, సమావేశానికి విద్యాశాఖాధికారులు గైర్హాజరు కావడంతో చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ.. ఐసీడీఎస్లో నెలకొన్న పలు సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు. స్థాయీ సంఘ సమావేశంలో అధికారులను నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ఎప్పుడు చేపడతారని నిలదీత తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశం సర్వజనాస్పత్రిలో రోగులకు భోజనం సక్రమంగా అందివ్వాలని డిమాండ్ -
అనంతలో భారీ వర్షం
వలస కూలీల వాహనం బోల్తా ● బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం రాప్తాడు రూరల్: వలస కూలీలతో బయల్దేరిన వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బాలుడితో సహా డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన 23 మంది కూలీలు కేరళలో ఉపాధి కోసం శుక్రవారం రాత్రి క్రూషర్ వాహనంలో బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున రాప్తాడు మండల పరిధిలోని కార్బన్ సిటీ వద్ద 44వ జాతీయ రహదారికి రాగానే అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. భారీ రాళ్ల మధ్య పల్టీలు కొట్టడంతో కూలీలందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏమి జరిగిందో అర్థం కాని పరిస్థితి. చీకటిలో సహాయం కోసం పలువురు ఆర్తనాదాలు చేశారు. ఈ ప్రమాదంలో కూలి పనుల కోసం వెళ్తున్న మహిపాల్ (16) అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రంజిత్ యాదవ్ (21)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరి కలలు, ఆశలు, కుటుంబాల భవిష్యత్తు ఒక్క క్షణంలో రోడ్డుపైనే చిధ్రమయ్యాయి. ఇంటి వద్ద వారి కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ వార్త గుండెల్ని పిండేసే విషాదంగా మారింది. ప్రమాదంలో గాయపడిన పలువురు కూలీలను స్థానికులు, పోలీసులు, 108 సిబ్బంది సకాలంలో స్పందించి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పలు మండలాల్లో మోస్తరుగా వర్షపాతం నమోదు లోతట్టు ప్రాంతాలు జలమయం అనంతపురం అగ్రికల్చర్: వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించిన తరుణంలో అనంతపురం నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పగలంతా ఉక్కపోతతో సూరీడు సెగలు పుట్టించినా.. సాయంత్రానికి వరుణుడు చల్లబరిచాడు. ఒక్కసారిగా భారీ ఉరుములు, మెరుపులకు తోడు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దాదాపు గంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. పలు లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బంది పడ్డారు. అనంతపురంలో 40 మి.మీ మేర వర్షం పడగా.. అనంతపురం రూరల్ మండలం, తాడిపత్రి, గుత్తి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, శింగనమల, బుక్కరాయసముద్రం, రాప్తాడు, పెద్దపప్పూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, బెళుగుప్ప, గార్లదిన్నె తదితర మండలాల్లో కూడా మోస్తరుగా వర్షపాతం నమోదైంది. 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో అక్కడక్కడా పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాకమునుపే ముందస్తుగా తొలకరి వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎల్లో అలర్ట్ నేపథ్యంలో రాగల మూడు రోజులు వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
వెధవల పర్మిషన్తో భూములు అమ్మాలా?
అనంతపురం టౌన్: భూములు అమ్ముకోవాలంటే వెధవల పర్మిషన్ కావాలట. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి ధ్వజమెత్తారు. నగరంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో భూకబ్జాలు అధికమయ్యాయని, దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. త్వరలోనే కలెక్టరుకు లిఖిత పూర్వకంగా ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ప్రస్తుతం వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారికి తాను అండగా ఉంటానని చెప్పారు. జేసీ, పరిటాల కుటుంబాలతో రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒక వ్యక్తి గ్రాఫ్తోనే ఎన్నికల్లో గెలుపొందినట్లు అహంకారంతో చంకలు గుద్దుకుంటున్నాడన్నారు. కార్యకర్తలందరి రెక్కల కష్టంతోనే పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అదే గ్రాఫ్తో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించి సదరు వ్యక్తి సత్తా ఏంటో చూపిస్తే సంతోషపడతామన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నా పోటీ చేయబోనని అధిష్టానానికి తెలియజేశానన్నారు. నగరంలో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తులే పోటీ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నగరంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదు ఎమ్మెల్యే దగ్గుపాటిపై పరోక్షంగా ధ్వజమెత్తిన ప్రభాకర్ చౌదరి -
AP: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే!
అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో వారి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ప్రభాకర్ చౌదరి ఘాటుగా ఆరోపణలు చేశారు. ‘గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ త్యాగం చేశాను. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నా వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అణచివేత కు పాల్పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఉండొచ్చు.. రేపు ఉండకపోవచ్చు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భూకబ్జాలు జరుగుతున్న మాట వాస్తవమే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలన్నీ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశా. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయను. డీలిమిటేషన్ జరిగితే... మరో నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం’ అని స్సష్టం చేశారు. -
విహార యాత్రలో విషాదం
● మున్నార్లో మృతి చెందిన ఉపాధ్యాయుడు సుధాకర్బాబు అనంతపురం ఎడ్యుకేషన్: కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని మున్నార్కు విహార యాత్రకు వెళ్లిన అనంతపురం రూరల్ మండలం పాపంపేట జెడ్పీహెచ్ఎస్ ఇంగ్లిష్ టీచరు సీడీ సుధాకర్ బాబు మృతి చెందారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతుండగా గురువారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి రాత్రి 11.30 గంటల సమయంలో కన్ను మూశారు. ఆయనకు భార్య నళిని (స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్), ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి తీరని లోటు అని, అంకిత భావంతో పనిచేసే టీచరుగా మన్ననలు పొందారని పాపంపేట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పి.లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు వనజ, శోభ, హరికిరణ్, పవన్, వెంకటేష్, కవిత, నాగవేణి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం అయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. -
కక్ష సాధింపు చర్యలు తగదు
● వైఎస్సార్సీపీ పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అనంతపురం: ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదంటూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హితవు పలికారు. జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని శుక్రవారం ఆయన ములాఖత్లో కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్నందుకే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్లు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలనుకోవడం సీఎం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజల హక్కుల పరిరక్షణకు వైఎస్సార్సీపీ నిరంతర సాగిస్తున్న పోరాటం మరింత ఉధృతంగా మారుతుందని హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం టౌన్: గృహ నిర్మాణ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న ఆ సంస్థ పీడీ శైలజ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 4 డేటా ఎంట్రీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. www. ananthapuramu.ap.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడు చేసుకున్న దరఖాస్తులను భర్తీ చేసి జూన్ 10వ తేదీలోపు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 08554–274456 లో సంప్రదించవచ్చు. విత్తనశుద్ధి మొదలు పెట్టండి : జేడీఏ అనంతపురం అగ్రికల్చర్: విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా వెంటనే విత్తనశుద్ధి మొదలు పెట్టాలని ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులను జేడీఏ సాలురెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ వెంకటసుబ్బయ్య, టెక్నికల్ ఏఓ రాకేష్నాయక్తో కలిసి అనంతపురంలోని విజయ, రామకృష్ణ మిల్లులను ఆయన సందర్శించారు. బకాయిలు విడుదల చేసే అవకాశం ఉన్నందున రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనశుద్ధి మొదలు పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. 40 శాతం రాయితీతో 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ జూన్ మొదటి వారంలోనే ప్రారంభించాల్సి ఉంటుందని, అలాగే రైతులకు ఉచితంగా మినీకిట్ల రూపంలో కందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 190 క్వింటాళ్ల జీలుగ, 474 క్వింటాళ్ల జనుము, 95 క్వింటాళ్ల పిల్లిపెసర లాంటి గ్రీన్మెన్యూర్ సీడ్ 50 శాతం సబ్సిడీతో ఇస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు చైన్స్నాచర్ల అరెస్ట్ తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి పట్టణంలో ఈ నెల 26న చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శుక్రవారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రానికి చెందిన రాజు, ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఓబన్న ఉన్నారు. నిందితుల నుంచి 60 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. చిరునామా అడిగే నెపంతో ఈ నెల 26న మధుగిరిలోని దొడ్డపేట దేవాంగ వీధిలో నివాసముంటున్న వృద్ధురాలు లక్ష్మమ్మ మెడలోని 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని బైక్పై ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో అనంతపురంలో ఒకరిని, తెలంగాణలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. -
స్వీయ రక్షణ సామర్థ్యాలు పెంపొందించుకోవాలి : ఎస్పీ
తాడిపత్రి టౌన్: స్వీయ రక్షణ సామర్థ్యాలు పెంపొందించుకోవాలని మహిళలకు ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రతకు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ దండయాన్ కార్యక్రమంపై తాడిపత్రిలో ఐసీడీఎస్, అంగన్వాడీ, పొదుపు సంఘాల మహిళలకు శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. శక్తి యాప్, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. గృహ హింస, మహిళలపై వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అపరిచిత వ్యక్తులఫోన్ కాల్స్కు స్పందించరాదని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచకోకూడదని సూచించారు. సమస్య ఎదురైతే భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎస్పీని తాడిపత్రి వాసవీ క్లబ్బు సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐలు శివగంగాధర్రెడ్డి, ఆరోహణరావు, రామసుబ్బయ్య, మార్కెట్యార్డు చైర్మన్ భూమా నాగరాగిణి, న్యాయవాదులు జ్యోతి, ఫరీదా, నబీనా, ఎస్ఐలు ధరణి, గౌష్, దయాకర్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. జంగంరెడ్డిపల్లిలో విషాద ఛాయలుశింగనమల(నార్పల): నార్పల మండలం జంగంరెడ్డిపల్లిలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కురుబ రాజా, లక్ష్మీదేవి దంపతుల ఏకైక కుమారుడు యశ్వంత్ కుమార్(17) విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ అదే కళాశాలలో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగమేఘాలపై విజయవాడకు తరలి వెళ్లారు. కాగా, శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన యశ్వంత్కుమార్ బెటర్మెంట్ పరీక్షలు రాయడానికి వెళ్లాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అరటి తోట దగ్ధం వజ్రకరూరు: మండలంలోని గంజికుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, రైతు ఆవుల వెంకట్రాముడు అరటి తోట మంటల్లో దగ్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఉరవకొండ నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు నాలుగు ఎకరాల్లోని 7 వేల అరటి చెట్లు, డ్రిప్ పరికరాలు, పైపులు, మోటారు కాలిపోయాయి. ఘటనతో రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. -
ఏపీఎల్ టోర్నీ కోచ్లుగా జిల్లా వాసులు
అనంతపురం: వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు ఫ్రాంచేజీ జట్లకు కోచ్లుగా జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది. కాకినాడ కింగ్స్ జట్టు హెడ్ కోచ్గా ఎల్ఎన్ ప్రసాదరెడ్డి, విజయవాడ సన్షైన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా గులామ్ ఖాదిర్ బాషా నియమితులయ్యారు. అలాగే అమరావతి రాయల్స్ జట్టు ఫిజియోగా జిల్లాకు చెందిన కె.అశోక్కు అవకాశం దక్కింది. కాగా, రంజీ ప్లేయర్గా రాణించిన ఎల్ఎన్ ప్రసాదరెడ్డి 53 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్ కోచ్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది కాకినాడ కింగ్స్ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఈ ఏడాది కూడా అదే జట్టుకు ఆయనకు అవకాశం దక్కడం గమనార్హం. ఇక గులామ్ ఖాదిర్బాషా రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ జట్లలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆంధ్రా రంజీ సీనియర్, జూనియర్ జట్లకు ఫిజియోగా అశోక్ పనిచేశారు. ప్రసాదరెడ్డి, గులామ్ ఖాదిర్బాషా, అశోక్ (ఫిజియో) -
యువకుడి దుర్మరణం
గుమ్మఘట్ట: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం నివాసి రిజ్వాన్ (32) శుక్రవారం వ్యక్తిగత పనిపై గుమ్మఘట్ట మండలం గోనబావికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన... 75 వీరాపురం గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన రిజ్వాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ చిన్నరాయుడు దర్యాప్తు చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు అనంతపురం: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగళూరులో ఉచితంగా ట్యాలీ, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు అడ్మిషన్ల కో–ఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 35 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. పూర్తి వివరాలకు 90004 87423 లో సంప్రదించవచ్చు. -
రైతుకు ఉచితం.. కానరాని వ్యాపారం
రైతులు కష్టపడి పండించిన పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయిస్తే తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుంతకల్లులో నిర్మించిన రైతు బజార్... ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. 2024, ఫిబ్రవరి 23న ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైతు బజార్లో గదులను అన్నదాతలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంది. అయినా నేటికీ ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు టౌన్: రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్వయంగా వారే విక్రయించుకునేందుకు వీలుగా రూ.50 లక్షల మార్కెట్ కమిటీ నిధులతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుంతకల్లులో అధునాతన రైతు బజార్ను నిర్మించింది. 2024, ఫిబ్రవరి 23న అప్పటి ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ లోపు ఎన్నికలు రావడంతో రైతు బజార్ ప్రజా వినియోగంలోకి రాలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబజార్ను పూర్తిగా గాలికొదిలేసింది. మార్కెట్కు వెళ్లాలంటే 3 కి.మీ దూరం.. పట్టణ శివారు కాలనీలైన దోనిముక్కల రోడ్డు ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీలు, జగ్జీవన్రామ్, టీచర్స్కాలనీ, సీఐటీయూ, శ్రీనివాసనగర్, బర్మశాల, ప్రశాంతినగర్ తదితర కాలనీలకు చెందిన ప్రజలు ప్రస్తుతం మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న మార్కెట్కు కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తదితరాలు కొనుగోలు చేయడానికి వెళుతుంటారు. కనీసం 2 నుంచి 3 కి.మీ దూరం ప్రయాణించాల్సి రావడంతో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారి ఆటోలో వెళ్లి రావాలంటే రూ.100 వరకు ఖర్చవుతోంది. దీంతో ఇళ్ల వద్దకు కూరగాయాలను తీసుకొచ్చే వ్యాపారులకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో నిర్మించిన రైతుబజార్ను వినియోగంలోకి తెస్తే శివారు ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. కలగా మారిన డీజీ రైతు బజార్ అధునాతన వసతులతో నిర్మించిన రైతుబజార్లో క్రయవిక్రయాలకు సంబంధించి గదులను రైతులకు పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. దీనికి తోడు ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకున్న మార్కెట్ యార్డు... ప్రత్యేకంగా డీజీ రైతు బజార్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా తమకు అవసరమైన కాయగూరలు, ఆకు కూరలు, పండ్లు తదితరాలను వినియోగదారులు బుక్ చేసుకుంటే వారి ఇంటి వద్దకే వాటిని సరఫరా చేయనున్నారు. అయితే రెండుళ్లు గడిచినా రైతు బజార్లో క్రయవిక్రయాలు సాగకపోవడంతో డీజీ రైతు బజార్ యాప్ కాస్త కలగా మారింది. అధునాతన వసతులు కలిగిన గుంతకల్లులోని వైఎస్సార్ రైతు బజార్, రైతులు స్వయంగా పంట ఉత్పత్తుల విక్రయాలు సాగించేందుకు నిర్మించిన గదులు రైతులే స్వయంగా పంట ఉత్పత్తులు విక్రయించుకునే వెసులుబాటు గత ప్రభుత్వంలో పూర్తయిన రైతు బజార్ ఎన్నికల కోడ్ రాకతో ప్రారంభానికే పరిమితం ఆ తర్వాత పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ప్రకటనలకే పరిమితమైన డీజీ రైతు బజార్ యాప్ -
ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం
గుమ్మఘట్ట: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. రాయదుర్గం మండలం 74ఉడేగోళం ఆర్టీటీ ఫీల్డ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూ సమస్యలకు తీర్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, వివిధ సమస్యలపై 25 వినతులు అందినట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. 31న కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానం అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కురుబ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 31న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆర్వేటి పద్మావతి, ప్రధాన కార్యదర్శి మంగళకుంట నాగరాజు, కోశాధికారి అట్టే ఓబులేసు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న కనకదాస కల్యాణ మంటపంలో జరిగే ఈ కార్యక్రమానికి కురుబ ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయిలో స్థిరపడిన ఉద్యోగులు హాజరు కానున్నారు. వనపర్తిలో గుత్తి వాసి మృతి గుత్తి: స్థానిక కోట వీధికి చెందిన బొలెరో డ్రైవర్ జగదీష్(24) తెలంగాణలోని వనపర్తి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి కొత్తిమీర, కరివేపాకు లోడుతో హైదరాబాద్కు వెళుతుండగా వనపర్తి సమీపంలో టైర్ పంచర్ కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. మరో ఇద్దరితో కలిసి టైర్ మారుస్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో జగదీష్తో పాటు మరో ఇద్దరూ మృతి చెందారు. -
అవమాన భారం.. ఆత్మహత్యాయత్నం
● పోలీస్స్టేషన్ ఎదుటే దివ్యాంగుడి కుటుంబం అఘాయిత్యం అనంతపురం సెంట్రల్: మాటలతో కించపరుస్తూ.. భౌతికదాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అవమానభారం భరించలేక దివ్యాంగుడి కుటుంబం పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం తెలిపిన మేరకు... మున్నానగర్లో షేక్ షాషావలి, ఎస్.రేష్మా అనే దివ్యాంగ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి మెట్లకు దగ్గరగా పబ్లిక్ ట్యాప్ ఉంది. అక్కడ నీళ్లు నిలబడటంతో పాచిపట్టింది. దివ్యాంగులు ఇంట్లోకి వెళ్లే సమయంలో అక్కడ పట్టుతప్పి కిందపడి గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. పబ్లిక్ కొళాయిని కాస్త దూరంగా మార్చి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని రేష్మా గత నెల 27న నగరపాలక సంస్థ కమిషనర్కు అర్జీ ఇచ్చి సమస్యను వివరించింది. అయితే కొళాయిని మరోచోటుకు మార్పు చేయడానికి పొరుగింటి వారు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇరు కుటుంబాల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ శారీరక లోపాన్ని ఎత్తిచూపుతూ దూషణలకు దిగుతున్నారని, వారి వేధింపులతో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని, విచారణ చేసి తమకు న్యాయం చేయాలని షాషావలి ఈ నెల ఏడో తేదీ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అండర్ సెక్షన్ 92 (దివ్యాంగుల చట్టం) కింద మున్నానగర్కు చెందిన రామాంజనేయులు, సాదగ్ని, శ్రీదేవి, మున్నీపై కేసు నమోదు చేశారు. అంతకు మించి చర్యలు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో గురువారం షాషావలి కుటుంబ సభ్యులపై పొరుగింటి వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి భౌతికదాడులకు పాల్పడ్డారు. దీన్ని అవమానభారంగా భావించిన షాషావలి కుటుంబ సభ్యులు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తామేమీ చేయలేమని పోలీసులు చెప్పడంతో స్టేషన్ బయటకు వచ్చిన వారు నడిరోడ్డుపై బైఠాయించారు. నిందితులకు అధికార టీడీపీ డివిజన్ ముఖ్య నాయకులు అండగా నిలుస్తున్నారని, ఇక న్యాయం జరగనప్పుడు తాము చనిపోవడమే మేలంటూ బాటిల్లోని పెట్రోలు ఒంటిపై పోసుకున్నారు. ఇంతలో సీఐ వెంకటేశ్వర్లు వచ్చి వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పంపించేశారు. ఇప్పటికై నా స్పందించి న్యాయం చేయకపోతే ఎస్పీని కలుస్తామని బాధితులు తెలిపారు. దివ్యాంగుల గోడును కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. -
కోటా మేరకు ఎరువులు సరఫరా చేయాలి
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి నెలవారీ కోటా మేరకు అన్ని రకాల ఎరువులు కచ్చితంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఆదేశించారు. ఎరువుల సరఫరా అంశంపై శుక్రవారం తన చాంబర్లో టెక్నికల్ ఏఓ వంశీకృష్ణతో కలిసి ఎరువుల కంపెనీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ ఖరీఫ్లో సెప్టెంబర్ ఆఖరు వరకు ఒక లక్ష మెట్రిక్ టన్నుల మేర ఎరువులతో ప్రణాళిక ఉన్నందున ఆయా కంపెనీలు తమ టార్గెట్ మేరకు సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 48,476 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో యూరియా 10,509 మెట్రిక్ టన్నులు, డీఏపీ 4,630 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 2,956 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,175 మెట్రిక్ టన్నులు ఉండగా అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 28,205 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు. త్వరలో కొత్త యాప్ అందుబాటులోకి రానుందని, దీని ద్వారా రైతులే స్వయంగా భూవిస్తీర్ణం, పంటల సాగును బట్టి వారికి అవసరమైన యూరియా, ఇతర ఎరువులను ఇండెంట్ పెట్టుకుని తీసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో జిల్లా వ్యాప్తంగా దుకాణాలను మ్యాపింగ్ చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకూ బయోమెట్రిక్ ద్వారా ఎరువుల అమ్మకాలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంటల వారీగా సాగు విస్తీర్ణంను బట్టి ఆర్ఎస్కేల్లో తగినంత ఎరువులు ముందస్తుగా నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. -
అర్హుల ఓట్లు ఏవీ తొలగిపోరాదు
రాయదుర్గం: ఓట్ల తొలగింపు, చేర్పులు, మార్పుల విషయంలో బీఎల్ఏల పాత్ర కీలకమని, అర్హులైన వారి ఓట్లు ఏ ఒక్కటీ జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో చేపట్టనున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శుక్రవారం రాయదుర్గంలోని నేషనల్ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన ‘సర్’పై వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక శిక్షకులుగా హాజరైన ‘సర్’ ఇన్చార్జ్ గోపీనాథ్, స్టేట్ వింగ్ రీజనల్ సెక్రెటరీలు మంజునాథ, శివారెడ్డితో క్లుప్తంగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వివరించారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ‘ప్రతి ఓటూ.. భవితకు మెట్టు’ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఓట్ల గోల్మాల్కు పాల్పడే అవకాశం ఉందని, ఈ విపత్తు నుంచి బయటపడే మార్గం చూసుకోవాలన్నారు. మన ఓటుకు మనమే భద్రతగా ఉండాలన్నారు. ముఖ్యంగా 2002– 2025 మధ్య ఓట్ల వ్యత్యాసాన్ని ప్రతి బూత్లోనూ సరిచూసుకోవాలన్నారు. ఇటీవల పశ్చిమబెంగల్లో సర్ ప్రోగ్రాం ద్వారా 90 లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. సీఎం అభ్యర్థి మమత బెనర్జీ నియోజకవర్గంలోనూ 48 వేల ఓట్లు తొలగిస్తే .. ఆమె 15 వేల ఓట్లతో మాత్రమే ఓటమి పాలయ్యారన్నారు. తమిళనాడులోనూ 78 లక్షల ఓట్లు కోత కోశారన్నారు. ఇలా ఈ రెండు చోట్లే కాదు మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగుచూశాయన్నారు. జూన్ 15 నుంచి ‘సర్’ ప్రక్రియ ప్రారంభం కాగానే బీఎల్ఏలు అధికారుల వెంటే ఉండాలన్నారు. కారణం లేకుండా ఒక్క ఓటు తొలగించినా ఉపేక్షించేది లేదన్నారు. మోసం, కుట్ర, దగా చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటాలని అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీ అధినేత ఈ విషయంపై దిశానిర్దేశం చేశారని, దీనికి ప్రతి కార్యకర్తా కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. రెండేళ్లు గడిచినా సూసర్ సిక్స్లోని ప్రధాన హామీలన్నీ అటకెక్కించారన్నారు. అభివృద్ధిని విస్మరిస్తూ దోపిడికే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు వైఎస్సార్సీపీదే నని, ప్రజలంతా జగన్ను మళ్లీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ‘సర్’ కార్యక్రమంపై మండలాల్లోనూ నాయకులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కళేకుర్తి ఉషారాణి, పొరాళ్ల శివకుమార్, సుదర్శనరెడ్డి, రాజగోపాల్రెడ్డి, బీటీపీ గోవిందు, రాజ్కుమార్, నాయక్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు మేకల శ్రీనివాసులు, గౌని కాంతారెడ్డి, రామాంజినేయులు, బ్రహ్మానందరెడ్డి, వాల్మీకి రామాంజినేయులు, రవీంద్రనాథ్రెడ్డి, మైనార్టీ నాయకుడు రహంతుల్లా, బూత్లెవెల్ అధ్యక్షుడు అంజిరెడ్డి, కేపీదొడ్డి రమేష్, ఆర్టీ కాంతారెడ్డి, ఎంపీపీ భవాని, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో మెట్టు గోవిందరెడ్డి, హాజరైన బీఎల్ఏలు, పార్టీ నాయకులు ఇటీవల ఐదు రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తొలగించారు ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలి బీఎల్ఏలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత సూచన -
కుట్రల ప్రభుత్వంపై కన్నెర్ర
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం కాదని, కుట్రల ప్రభుత్వం అని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా డీఎస్సీ’ పూర్తిగా అవ్యవస్థలు, అనుమానాలకు కేంద్రబిందువుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేంద్రరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన గందరగోళంతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అభ్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రశ్నపత్రాల లీకేజీ అనుమానాలు, టెక్నికల్ సమస్యలు అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ను బర్తఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పాల్సిన మంత్రి బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీయ ప్రతీకారాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవీన్రెడ్డి, విజయ్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాశీరాం నాయక్, రాష్ట్ర నాయకులు సుధీర్రెడ్డి, షెక్షావలి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రాయల్, మంజునాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిషాంత్రెడ్డి, అశోక్, గంగ శివుడు, సాయి నితిన్, నాగరాజు గౌడ్, నగర అధ్యక్షులు కై లాష్, రేవంత్ రెడ్డి, అజయ్, కాశీ మనోజ్, సాకే పురుషోత్తం, నగర ఉపాధ్యక్షులు అంజన్రెడ్డి, శివ దత్తాత్రేయ, నగర ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, రాహుల్ రెడ్డి, మనోజ్, హరీష్, చరణ్, ప్రకాష్, సాయిరెడ్డి, షరీఫ్, గన, నవీన్, దినేష్, రియాజ్, సుబ్బు, తరుణ్, లోకేష్, సురేంద్ర, ప్రసాద్, అరుణ్, రఫీ, కార్తీక్ పాల్గొన్నారు. డీఎస్సీ–25 నిర్వహణపై సీబీఐ విచారణ చేయించాలి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉరితాళ్లతో విద్యార్ధి నాయకుల నిరసన నారా లోకేష్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ -
గాలి మరకు మంటలు
ఆత్మకూరు: ఆత్మకూరు వద్ద ముట్టాల రోడ్డుకు వెళ్లే దారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున గాలి మరకు మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్నం వరకు గాలి మర పైన మంటలు చెలరేగాయి. టెక్నికల్ సమస్యల వల్ల అలా మంటలు వ్యాపించి ఉండవచ్చని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసింది. మధ్యాహ్నానికి మంటలు అదుపులోకి వచ్చి పూర్తిగా ఆగిపోయాయి. జూనియర్ కళాశాలలకు 5 వరకు సెలవులు అనంతపురం ఎడ్యుకేషన్: అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నేపథ్యంలో జూన్ 1న పున:ప్రారంభం కావాల్సిన జూనియర్ కళాశాలలు ఆరో తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అకడమిక్ కేలండర్ మేరకు ఒకటో తేదీ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఐదో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగనున్నాయి. చాలా కళాశాలలు పరీక్ష కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. దీనికితోడు అధ్యాపకులు, సిబ్బంది పరీక్షల విధుల్లో ఉన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేదాకా సాధారణ తరగతులు ప్రారంభించడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మరో 5 రోజుల అదనపు సెలవులు లభించాయి. అకడమిక్ క్యాలెండర్లోని మిగతా షెడ్యూళ్లు, సూచనలు యథాతథంగానే కొనసాగుతాయని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. జిల్లాకు ‘ఎల్లో’ అలర్ట్ ● ఈదురుగాలులు, తేలికపాటి వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించినట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నెల 30 నుంచి జూన్ 2 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. 30న 9 మి.మీ, 31న 4.3 మి.మీ, జూన్ ఒకటిన 6 మి.మీ, 2న 4 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. ఉరుములు, మెరుపుల సమయంలో పిడుగుపాటుకు గురికాకుండా అలాగే ఈదురుగాలులకు పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పీజీ సెట్ ఫలితాల విడుదల అనంతపురం: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 1338 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1154 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1040 (90.12 శాతం) మంది అర్హత సాధించారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన కె.భార్గవి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించారు. జనరల్ విభాగంలో వడ్డే అనిల్ కుమార్ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. సెరికల్చర్ విభాగంలో ఎస్. హర్షవర్ధిని రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు, శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన టి.మదీనా తస్లీం సెరికల్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు తెచ్చుకున్నారు. మొత్తం 30 బ్రాంచ్ల్లో అడ్మిషన్లు నిర్వహించడానికి ఏపీ పీజీసెట్ నిర్వహించారు. దీంతో ఈ దఫా కూడా పీజీ కళాశాలలు తగినన్ని సీట్లు భర్తీకాక వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ఆలింగనం చేసుకుని సెల్ఫోన్ కొట్టేశాడు గుత్తి: బక్రీద్ సందర్భంగా గుత్తిలో జేబు దొంగలు చెలరేగిపోయారు. సామూహిక ప్రార్థనల అనంతరం ఈద్గా మైదానం నుంచి బయటకు వస్తున్న స్థానికుడు మహమ్మద్ రఫీని ఓ అపరిచిత వ్యక్తి కలిసి ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకున్నాడు. పరిచయం లేని వ్యక్తి తనకు ఈద్ ముబారక్ చెప్పడంతో మహమ్మద్ రఫీ సైతం మురిసిపోతూ ఆలింగనం చేసుకున్నాడు. కాసేపటి తర్వాత చూసుకుంటే తన జేబులో ఉండాల్సిన రూ.15 వేలు విలువ చేసే సెల్ఫోన్ కనిపించలేదు. తనను ఆలింగనం చేసుకున్న వ్యక్తే మొబైల్ను అపహరించి ఉంటాడని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
విలేకరి ముసుగులో వసూళ్లు!
● ‘పరిటాల’ అనుచరుడు రవి దందా ● అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు సాక్షి, టాస్క్ఫోర్స్: పరిటాల అనుచరుడిగా చెప్పుకుంటూ విలేకరి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిని నంద్యాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...రామగిరి మండలం పీఆర్ కొట్టాలకు చెందిన వై.రవి తాను ప్రజాటీవీ చానల్ స్టాఫ్ రిపోర్టర్నని చెప్పుకుంటూ పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ భార్గవరెడ్డిని కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యుడు గతంలో రూ.4 వేలు ఇచ్చి పంపించాడు. రెండు రోజుల క్రితం మళ్లీ డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. అయితే డాక్టర్ లెక్కచేయకపోవడంతో గురువారం రాత్రి నేరుగా నంద్యాలలోని ఆస్పత్రికి వెళ్లి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు డాక్టర్ తిరస్కరించడంతో హంగామా చేశాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న నంద్యాల త్రీటౌన్ పోలీసులు వచ్చి రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి.. జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. రవి చరిత్ర అంతా నేరమయం రవి చరిత్ర అంతా నేరమయమేనని పీఆర్ కొట్టాల గ్రామస్తులు తెలిపారు. చేతికి ‘పరిటాల రవి’ అని పచ్చబొట్టు వేయించుకుని ఆ కుటుంబానికి తాను ముఖ్య అనుచరుడినంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడన్నారు. తరువాత కులసంఘాల పేరుతో దందాలు కొనసాగించాడన్నారు. ప్రస్తుతం ప్రజాటీవీ విలేకరినని వ్యాపారులను, ఇతరులను బెదిరిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అంతేకాకుండా అనంతపురం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనంలో వెళ్తూ మార్గమధ్యంలోని ప్రముఖులను బెదిరించేవాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రవిపై అనంతపురం వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా నమోదైనట్లు పీఆర్ కొట్టాల వాసులు తెలిపారు. తాజాగా నంద్యాలలోనూ వైద్యుడిని బెదిరించి కటకటాల పాలయ్యాడని వెల్లడించారు. -
ఏ ఒక్క ఓటరూ మిస్ కాకూడదు
● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గోపినాథ్ తాడిపత్రి టౌన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబిత పునః పరిశీలన ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్రామాల్లో ఏ ఒక్క ఓటరూ మిస్ కాకుండా చూడాలని వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గోపినాథ్ సూచించారు. ‘సర్’పై గురువారం పెద్దపప్పూరు, యాడికి మండలాలకు చెందిన పార్టీ బీఎల్ఓలకు తాడిపత్రిలోని పార్టీ కార్యాలయంలో గురువారం వారు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మారిన ఓటరు వివరాల అప్డేట్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఓట్ల తొలగింపుపై నిఘా ఉంచాలన్నారు. ఇంటింటీ పరిశీలన పక్కాగా చేపట్టాలన్నారు. పక్క రాష్ట్రల్లో ఓట్ల తొలగింపు కారణంగా ఎన్నికల ఫలితాలు ఎలా తారుమారయ్యాయో వివరించారు. ఇటీవల తాడిపత్రిలో నిర్వహించిన మహిళా సదస్సులో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి లం.. భాష మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలన్నా, వారి ఓట్లన్నా జేసీ ప్రభాకర్రెడ్డికి చులకన భావం అన్నారు. గతంలో మాదిరి గ్రామాల్లో ఫ్యాక్షన్ వర్గాలు లేవని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్తో పిల్లలు బాగా చదువుకుని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాప్ట్వేర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. తల్లిదండ్రులఅప్పులు తీర్చి గ్రామాల్లో గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, వేమనాథరెడ్డి, రామ్మూర్తిరెడ్డి, రామిరెడ్డి, యోగేశ్వరరెడ్డి, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, కాశి, సూర్యనారాయణరెడ్డి, లక్ష్మీరెడ్డి, మస్తాన్, రంగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సోమశేఖరరెడ్డి, రమేష్నాయుడు, సంజీవరాయుడు, లక్ష్మీదేవి, వెంకటరామిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మల్లికార్జున, అశోక్రెడ్డి, పెద్దయ్య, ప్రసాద్రెడ్డి, భాస్కరరెడ్డి, రంగ, లక్ష్మీనాథరెడ్డి, తలారి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై నేడు నిరసన
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై సీబీఐ విచారణ చేపట్టాలనే డిమాండ్తో శుక్రవారం వైఎస్సార్ఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల పేర్లు తుది ఎంపికలో లేకపోవడం, ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల విక్రయాల ఆరోపణలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, విద్యార్ధి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దర్గా కట్ట వద్ద యువకుడి మృతి యాడికి: మండల కేంద్రంలోని దర్గా కట్టపై కూర్చొన్న ఓ యువకుడు ఉన్నఫళంగా కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లికి చెందిన మద్దిలేటి కుమారుడు సుధాకర్(34)కు యాడికి మండలం కమలపాడుకు చెందిన యువతితో వివాహమైంది. ఈ క్రమంలో కమలపాడుకు వచ్చిన సుధాకర్ గురువారం యాడికి గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కమలపాడు మార్గంలోని దర్గా వద్దకు చేరుకుని కట్టపై కూర్చొన్న అతను ఉన్నఫళంగా కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, సుధాకర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. రైలు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు రాయదుర్గం టౌన్: రైలు ఢీకొన్న ఘటనలో స్థానిక సీబీఎన్ కాలనీకి చెందిన శంకరమ్మ(70) తీవ్రంగా గాయపడింది. కాలనీకి ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై పావగడ రైల్వేస్టేషన్ నుంచి రెండు బోగీలు ఉన్న తనిఖీ రైలు గురువారం సాయంత్రం రాయదుర్గం స్టేషన్కు చేరుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బహిర్భూమి కోసం పట్టాలు దాటుతున్న శంకరమ్మను రైలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తల, కాలుకు తీవ్ర రక్తగాయాలైన శంకరమ్మను 108లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ అనంతపురం సెంట్రల్: నగరంలోని అశోక్నగర్ హరిహరదేవాలయం సమీపంలో బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతూ 10 మంది పట్టుబడ్డారని వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.10,600 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాలిక ఆత్మహత్య ఎన్పీకుంట: తల్లి మందలింపుతో మనస్థాపం చెంది ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... ఎన్పీకుంట మండలం కటకంవారిపల్లికి చెందిన వల్లెపు నవ్య (14) ఇంటి పనులు సరిగా చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక గురువారం తెల్లవారుజామున బాత్రూమ్లో పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణమూర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
‘మహానాడు’లో పాల్గొన్న ఫీల్డ్ అసిస్టెంట్
వజ్రకరూరు: స్థానిక మినీ కల్యాణ మంటపంలో గురువారం నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో వజ్రకరూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఉస్మాన్బాషా పాల్గొనడం చర్చనీయాంశమైంది. పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొనడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం: గుమ్మఘట్ట మండలంలోని జే వెంకటంపల్లిలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. రెండు రోజుల కిత్రం కురిసిన వర్షానికి తాగునీటి పైపులు కొట్టుకుపోయాయి. ఫలితంగా గ్రామస్తులు బిందెడు నీటికి బండెడు కష్టాలు పడాల్సి వస్తోంది. పనులన్నీ మానుకుని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి మల్లికార్డునను వివరణ కోరగా వర్షానికి గ్రామంలో పైప్లైన్ దెబ్బతిందన్నారు. రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని, ఆ లోపు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తామని చెప్పారు. బిందెడు నీటికి బండెడు కష్టాలు -
●ముస్లింలపై ఎందుకీ వివక్ష?
బురదలోనే కూర్చొని ప్రార్థనలకు సిద్ధమవుతున్న ముస్లింలు ముస్లింలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో రెండు సార్లు వచ్చే రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ఎంతో పవిత్రంగా తాము సామూహిక ప్రార్థనలు జరుపుకునే ఈద్గా ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది రంజాన్ మాసంలో, తిరిగి గురువారం జరుపుకున్న బక్రీద్ ప్రార్థనల్లో తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి అనంతపురంలోని ఈద్గా మైదానం బురదమయమైందని, దీంతో గురువారం బురద మధ్యలోనే సామూహిక ప్రార్థనలు ముగించాల్సి వచ్చిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పర్వదినాల నాడు ఈద్గా మైదానాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించేవారని, ఆ ఐదేళ్లూ తాము ఎలాంటి అసౌకర్యాలకు లోను కాలేదని గుర్తు చేస్తున్నారు. ముస్లింలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
టీబీ డ్యాంలో 10 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వర ప్రదాయిని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2025 డిసెంబర్ 27న నిలిచిపోయిన ఇన్ఫ్లో డ్యాం ఎగువ ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి కురుస్తున్న వర్షాలతో మళ్లీ ప్రారంభమైంది. ఆశించిన రీతిలో వర్షాలు కురిస్తే జూన్ లేదా జూలైలో పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. డ్యాం నీటి మట్టం 1,633 అడుగులతో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా.. గురువారానికి 1,588.91 అడుగులతో 10.140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 623 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 54 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,590.76 అడుగుల వద్ద 11.680 టీఎంసీల నీరు నిల్వ ఉండి 2,574 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 131 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉండింది. అదిరిందయ్యా చంద్రం! అనంతపురం: నాయకుల ప్రసంగాలు విసుగు పుట్టించాయి. ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక ‘తెలుగు తమ్ముళ్లు’ సరదాగా చిందేశారు. పూటుగా మద్యం తాగి.. రోడ్డుపై ఎక్కడపడితే అక్కడే తాగి ఊగిపోయారు. మత్తులో తూలి పడిపోయి అచేతనావస్థలో ఉండిపోయారు. గురువారం అనంతపురం సప్తగిరి సర్కిల్లోని మూడు రోడ్ల కూడలిలో ఓ టీడీపీ కార్యకర్త పూటుగా మద్యం సేవించి రోడ్డుపైనే పడిపోయిన దృశ్యమిది. అనంతపురంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదికలో పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తుండగా, అక్కడ నుంచి కొందరు బయటకు వచ్చేసి మద్యం సేవించడానికి పోటీపడడం గమనార్హం. ఈ క్రమంలో మద్యం మత్తులో తూలుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల ఫొటోలు, వీడియోలను తీసిన పలువురు ‘అదిరిందయ్యా చంద్రం’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరలయ్యాయి. బెట్టింగ్రాయుళ్ల అరెస్ట్ కుందుర్పి: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం రాత్రి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. పట్టుబడిన ఐదుగురూ 18 నుంచి 19 సంవత్సరాల్లోపు వయసున్న వారే కావడం గమనార్హం. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. బెట్టింగ్రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.20,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
అధికారముంది ఆక్రమించుకుందాం!
కుందుర్పి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలపై టీడీపీ నేతలు కన్నేసి, ఆక్రమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుందుర్పి నడిబొడ్డున ఉన్న పురాతన కాళికాంబ ఆలయానికి చెందిన స్థలాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేత ఆక్రమించుకుని గురువారం బండలు పాతేశాడు. ఈ అంశంపై కలెక్టర్కు నేరుగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా, కోట ఆంజనేయస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఆలయాలకు చెందిన మాన్యం భూములను సైతం కొందరు టీడీపీ నేతలు కబ్జా చేసి, గడ్డివాములు, కొట్టాలు వేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాక్రాంతమవుతున్న మాన్యం భూముల అంశంపై గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు స్థానిక టీడీపీ నేతలే ఫిర్యాదు చేయడం గమనార్హం. దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారుల తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అన్యాక్రాంతమైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. -
తీరని నష్టం.. దారుణ మోసం
భక్తిశ్రద్ధలతో బక్రీద్రైతులన్నా, వ్యవసాయమన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్దగా గిట్టడం లేదు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఇప్పటికే నాలుగు సీజన్లు ముగిశాయి. మూడు రోజుల్లో ఐదో సీజన్ కూడా మొదలుకానున్నా పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా దాటవేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అకాల వర్షాలు లేదంటే అధిక వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వాన ఇలా ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీరని గాయం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం చేస్తుండటంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది. బక్రీద్ను గురువారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో హాజీలు, మౌలానాలు ఖుద్బా చేశారు. ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఇమామ్లు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. చిన్నారులు, పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం బక్రీద్ సందర్భంగా దువా చేస్తున్న చిన్నారులునేడు 74 ఉడేగోళానికి ఇన్చార్జ్ కలెక్టర్ గుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి శుక్రవారం ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ విచ్చేయనున్నట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కారాల్యయ ఆవరణంలో జరిగే ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది. పొలాలు, శ్మశాన వాటికలు, బ్రిడ్జిల పక్కన ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చిత్రావతి నదిలో నీళ్లు పూర్తిగా తగ్గిపోతుండడంతో అక్రమార్కులు ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా పట్టణంలో పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో పాటు పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ కొందరు టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నాలుగు రోజులుగా రాయలవారిపల్లి, ఎనుములపల్లి సమీపంలోని చిత్రావతిలో హిటాచీలు ఏర్పాటు చేసి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇటీవల జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ముదిగుబ్బ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు పాలనలో వర్షాలు గతి తప్పాయి. అకాలంలో అధిక వర్షాలు కురవడం, పంట దిగుబడులు అరకొరగా రావడం, వచ్చిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకపోవడం వల్ల వ్యవసాయం భారంగా పరిణమించింది. పంట నష్టం భారీగా జరిగినా పరిహారం ఇవ్వడానికి వెనుకాడుతుండటం రైతులను కలచివేస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో గత నాలుగు సీజన్లలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుశనగతో పాటు అరటి, మామిడి, చీనీ, టమాట, ఇతర కూరగాయల పంటలు వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. 2024 ఖరీఫ్లో ఏడు, రబీలో ఏడు మండలాలను కరువు జాబితాలో చేర్చినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఈ సీజన్కు సంబంధించి మార్చి 19, 23, మే 1, 7, 22, 27 తేదీల్లో ఈదురుగాలుల బీభత్సానికి రూ.15 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. రెండేళ్లలో రూ.1,000 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు రూ.120 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా అధికారులు పలు దఫాలుగా ప్రతిపాదనలు పంపారు. ప్రకృతి కన్నెర్రకు పంటలు దెబ్బతిని తీరని నష్టం వాటిల్లుతున్నా చంద్రబాబు సర్కారు కరుణ చూపకపోవడం గమనార్హం. జగన్ హయాంలో రూ.380 కోట్ల ఇన్పుట్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 2019–2024 మధ్య కాలంలో మొదటి నాలుగేళ్లూ విస్తారంగా వర్షాలు కురిశాయి. మధ్య మధ్యలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, చివరి ఏడాది 2023లో ఎల్–నినో కారణంగా వర్షాలు తక్కువై పంటలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్ ముగిసేలోపు పెట్టుబడి రాయితీ పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.380.20 కోట్లు అందించారు. వ్యవసాయ పంటలకు సంబంధించి 2,65,290 మంది రైతులకు రూ.364.85 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి 8,997 మంది రైతులకు రూ.15.35 కోట్లు జమ చేశారు. వీటికి తోడుగా ఇన్సూరెన్స్, రైతు భరోసా, సున్నావడ్డీ కింద పెద్ద మొత్తంలో సాయం చేస్తూ రావడంతో వ్యవసాయం ఇబ్బంది లేకుండా సాగిపోయిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పంట నష్ట ఉపశమనం ఇలా.. ఆగస్టు 2024 నుంచి అమలులోకి వచ్చిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) ప్రకారం ఎన్ని హెక్టార్లు దెబ్బతిన్నా కేవలం రెండు హెక్టార్లకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం ఖరారు చేశారు. అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్బూజా, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్రపెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈనెల 23న అనంతపురం రూరల్ మండలం కామారుపల్లిలో గాలులకు నేలవాలిన అరటి తోట, 27న బెళుగుప్ప మండలంలో పడిపోయిన బీర పందిర్లు రైతులతో చంద్రబాబు సర్కారు పరిహాసం నాలుగు సీజన్లు ముగిసినా రూపాయి అందించని వైనం రూ.120 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దగా వైఎస్ జగన్ హయాంలో సీజన్ ముగిసేలోపు నష్ట పరిహారం ఐదేళ్లలో జిల్లా రైతులకు రూ.380 కోట్లకు పైగా అందజేత -
చెరువులో వృద్ధురాలి మృతదేహం
గార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె చెరువు సమీపంలో ముళ్లకంపల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విణ్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కౌలుట్లయ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 20 రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని ఖననం చేశారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే గార్లదిన్నె పోలీసులను సంప్రదించాలని కోరారు. నగరంలో ఇద్దరి బలవన్మరణం అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... నగరంలోని నవోదయకాలనీలో నివాసముంటున్న గుజ్జల నాగార్జున భార్య గాయత్రి (35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇందిరానగర్లో నివాసముంటున్న కొలిమి మహమ్మద్ రఫి(36) గురువారం వేకువజామున ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రఫీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ‘దుర్గం’లో పోలీసుల దందా!కళ్యాణదుర్గం రూరల్: స్థానిక అర్బన్ పోలీసులు తీరు వివాదాస్పదమవుతోంది. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న యువకులను విచారణ పేరుతో స్టేషన్కు పిలుచుకెళ్లి అందిన కాడికి డబ్బు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం బక్రీద్ సందర్భంగా కొందరు యువకులు పట్టణ సమీపంలో మద్యం సేవిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని, వారి సెల్ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం విచారణ పేరుతో స్టేషన్కు తీసుకెళ్లి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఒక్కొక్కరి ద్వారా వసూలు చేసుకుని వదిలేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులను వివరణ కోరగా స్పందించలేదు. కేబుల్ కత్తిరిస్తూ పట్టుబడిన దొంగ డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వ్యవసాయ బోరుబావి వద్ద కేబుల్ కత్తిరిస్తూ రైతులకు ఓ దొంగ పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామ శివారున ఉన్న రైతు పొలంలో బోరు బావి వద్ద బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి కేబుల్ కత్తిరిస్తుండగా రైతులు గుర్తించి, వెంటనే బంధించారు. విచారణలో బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్గా గుర్తించారు. రైతుల నుంచి సమాచారం అందుకున్న డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గురువారం కేసు నమోదు చేశారు. గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్ తలుపుల: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. గురువారం వివరాలను ఆయన వెల్లడించారు. తలుపుల మండలం పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్దపులి కొండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తుండగా స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో రాజనాలవాండ్లపల్లికి చెందిన గంగాద్రి పారిపోగా, ముఠా సభ్యుల్లో ఎనిమిది మంది పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి పోలీసులు రెండు కార్లు, పార, గునపం, రెండు గోలాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంగాద్రి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గంగమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ ఓడీచెరువు: నారప్పగారిపల్లిలో గంగమ్మ ఆలయంలో వెండి కిరీటం చోరీ అయినట్లు గ్రామస్తులు గురువారం తెలిపారు. నారప్పగారిపల్లిలోని గంగమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి వెండి కిరీటాన్ని చోరీ చేశారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
17 నుంచి కడపలో ఏపీఎల్
కడప వైఎస్పార్ సర్కిల్: ఆంఽధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టోర్నీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోని మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. విశాఖపట్నంతో పాటు కడప, మంగళగిరి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళగిరిలో ఫైనల్స్ నిర్వహించనున్నారు. కడప వేదికగా తొమ్మిది మ్యాచ్లు .... జూన్ 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులపాటు మొత్తం కడపలో 9 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇందుకు వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. మూడేళ్ల క్రితం స్టేడియంలో రూ.8 కోట్ల వ్యయంతో ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డే అండ్ నైట్ మ్యాచ్ ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను నిర్వహించేలా జిల్లా క్రికెట్ సంఘం చేసిన కృషి ఫలించింది. తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో ఏపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తుడటంతో క్రీడాభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా క్రికెట్ అసోసియేషన్ చేస్తుంది. -
గంజాయి ముఠా అరెస్ట్
● 7 కిలోల గంజాయి స్వాధీనం అనంతపురం సెంట్రల్: అనంతపురం నగరంలో గంజాయి విక్రయిస్తున్న 14 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన షికారి సురేష్, షికారి మల్లప్ప, షికారి భరత్, షికారి పరుశురాం, షికారి రవి, షికారి అర్జున్, షికారి అశోక్, షికారి జంపా, బుడ్డప్పనగర్కు చెందిన షికారి రాము, షికారి ఉజ్జులు, షికారి భగవాన్, షికారి జయమ్మ, షికారి సునందన, వెంగమనాయుడు కాలనీకి చెందిన షికారి రాజమ్మలను అరెస్ట్ చేశారు. ఇందులో షికారి సురేష్ కీలక నిందితుడు. గతంలో అనంతపురం వన్టౌన్, టూటౌన్, నాల్గవ పట్టణం, రాప్తాడు పోలీసు స్టేషన్లలో ఐదు దొంగతనాలు, ఎకై ్సజ్, గంజాయి కేసులు ఉన్నాయి. గుంతకల్లు రైల్వే స్టేషన్ కేంద్రంగా గంజాయి నెట్వర్క్ నడుపుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి ద్వారా కిలో గంజాయి రూ.10 వేలు చొప్పున కొనుగోలు చేసి.. పాత నేరస్తుల సాయంతో నగరానికి తీసుకొస్తున్నాడు. ముఠాలోని మిగిలిన నిందితుల ద్వారా గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా నగరంలో పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారిపై నిఘా పెట్టి లోతుగా విచారణ చేయగా అసలు నిందితులు పట్టుబడ్డారు. నిందితుల అరెస్టులో కీలకంగా పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు వెంకటేశ్వర్లు, రాగిరి రామయ్య, జయపాల్రెడ్డి, శేషగిరి, ఎస్ఐలు కరిష్మా, శరత్చంద్ర, ఆర్ఎస్ఐ హనుమంతు, పలువురు పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. -
మొన్నటి వరకు నిప్పుల కుంపటిలా మారిన జిల్లాపై వరుణుడు కరుణ చూపాడు. నైరుతి రుతు పవనాల రాకకు ముందే వర్షాలతో మురిపించాడు. వాగులు, వంకలు, చెక్డ్యాంలు ప్రవహించాయి. ఈదురుగాలులకు అరటి, మామిడి, బొప్పాయి, బీర, టమాట తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
● 17 మండలాల పరిధిలో 16.1 మి.మీ సగటు వర్షపాతం నమోదు ● ఈదురుగాలులకు దెబ్బతిన్న ఉద్యాన పంటలు అనంతపురం అగ్రికల్చర్: భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. 17 మండలాల పరిధిలో 16.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 78 మి.మీ, బుక్కరాయసముద్రంలో 65 మి.మీ భారీ వర్షం కురిసింది. అనంతపురం అర్బన్ 56.2 మి.మీ, కణేకల్లు 52, అనంతపురం రూరల్ 48.6, రాయదుర్గం 42.6, రాప్తాడు 38.8, బెళుగుప్ప 33.6, కుందుర్పి 22.6, కళ్యాణదుర్గం 17.4, గుమ్మఘట్ట 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 51.2 మి.మీ నమోదైంది. మొత్తం మీద గత జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 507.9 మి.మీ గానూ 3.8 శాతం అధికంగా 527.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 48 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. ఉద్యాన పంటలకు భారీ నష్టం భారీ వర్షాలు కురిసిన మండలాల్లో వాగులు, వంకలు, చెక్డ్యాంలు నిండి ప్రవహించాయి. ఉరుములు, మెరుపులతో పాటు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులకు ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. చాలాచోట్ల పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. కొన్ని ఇళ్లు పాక్షకింగా దెబ్బతినడంతో ఆస్తినష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. చెట్లు పడిపోవడంతో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం, రాప్తాడు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు తదితర మండలాల్లో 200 హెక్టార్లలో అరటి, మామిడి, బీర, టమాటా తదితర పంటలు దెబ్బతినడంతో రూ.4కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మునుపెన్నడూ లేని విధంగా అనంతపురం నగర పరిధిలో ఈదురుగాలులకు 300కు పైగా చెట్లు పడిపోవడం గమనార్హం. ఖరీఫ్కు ఊరట నైరుతి రుతుపవనాలు రాకమునుపే తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావడానికి ఈ వర్షాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు డాక్టర్ విజయశంకరబాబు, డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ వర్షాలకు లోతుగా దుక్కులు చేసుకోవడంతో పాటు గత ఖరీఫ్ పంట అవశేషాలు తొలగించుకుని సాగుకు సిద్ధం కావాలని సూచించారు. ఎల్–నినో ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అండమాన్ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారాంతం లేదా రెండో వారం మొదట్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఖరీఫ్కు ఉపకరించేలా వర్షాలు కురిసినా ఉద్యాన రైతులకు తీరని నష్టం వాటిల్లేలా చేసింది. ఈ నెలలో ఈదురుగాలులకు ఏకంగా రూ.12 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లింది. బెళుగుప్ప మండలం కోనంపల్లి వద్ద నేలవాలిన అరటి పంటను చూపుతున్న రైతు రామదాసురెడ్డి విద్యుత్శాఖకు రూ.4 లక్షల నష్టం అనంతపురం టౌన్: గాలినవానకు విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. మంగళవారం రాత్రి వీచిన గాలికి జిల్లా వ్యాప్తంగా 80కి పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. అనంతపురంలో దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, తాడిపత్రి ప్రాంతంలో 30కిపైగా విద్యుత్ స్తంభాలు గాలివాన బీభత్సానికి నేల కూలిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు దశలవారీగా విద్యుత్ను పునరుద్ధరించారు. -
గంజాయి అడ్డాగా తాడిపత్రి
తాడిపత్రిటౌన్: సరదాగా మొదలై ఆరోగ్యాన్ని దెబ్బతీసి జీవితాన్ని అంధకారంలోకి నెట్టే గంజాయికి తాడిపత్రి ప్రాంతం అడ్డాగా మారింది. నెల వ్యవధిలో రెండు చోట్ల గంజాయి పట్టుబడటంతో పాటు నివాసాల మధ్య గంజాయి మొక్కలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. పైగా పలు వార్డుల్లో యువకులు గంజాయి బ్యాచ్లుగా మారి అర్ధరాత్రి వేళ అలజడి సృష్టిస్తున్నారు. అయితే గంజాయి గ్యాంగ్లు పట్టుబడిన ప్రతిసారీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. గంజాయి గూండాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవాల వక్రీకరణ ఎందుకో..? తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్రాంతంలో గత నెల 29న నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రజలు మరోలా అంటున్నారు. తాడిపత్రిలోని గంజాయి ముఠాలకు విక్రయించేందుకు వచ్చిన ఒడిశా వాసులు లాడ్జీలో బస చేయడంతో వారిని పోలీసులు పట్టుకున్నారని, అయితే ముఠాలు లేదా లాడ్జీ యజమానిని రక్షించడం కోసమో పోలీసులు వాస్తవాన్ని వక్రీకరణ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఈ నెల 24న పట్టణానికి చెందిన గోర హాజీ, సాయిలు దాదాపు ఒకటిన్నర కేజీ గంజాయితో నందలపాడు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జ్ వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి మొక్కల కలకలం పట్టణంలోని టైలర్స్ కాలనీ, పాతకోట కాలనీల్లో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలు గతంలో కలకలం రేపాయి. పట్టణ శివారులోని పలు దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారు. పరిచయం ఉన్న వ్యక్తులకే గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. గంజాయి బ్యాచ్లతో పట్టణ ప్రజలు భయం భయంగా గడపాల్సిన పరిస్థితి. గంజాయి బ్యాచ్ల హల్చల్ చీకటి పడితే చాలు పట్టణంలోని యల్లనూరు రోడ్డు, టైలర్స్ కాలనీ, పాతకోట, క్రిష్ణాపురంతో పాటు పలు శివారు కాలనీల్లో గంజాయి గ్యాంగ్లు హల్చల్ చేస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ.. ప్రశ్నించిన కాలనీవాసులపై దాడులకు తెగబడుతున్నాయి. కొంత మంది అధికారపార్టీ నాయకులు యువకులను గంజాయికి అలవాటు చేసి వారి వెంట తిప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు నాయకుల చేష్టలను ప్రశ్నించినా.. వ్యతిరేకంగా మాట్లాడినా గంజాయి గ్యాంగ్లను అర్థరాత్రి పూట దాడులకు ఉసిగొల్పుతున్నారు. తాడిపత్రిలో ఐపీఎస్ స్థాయి అధికారి ఉన్నా.. గంజాయి గ్యాంగ్ల ఏరివేతలో కిందిస్థాయి అధికారులు తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో రెండు చోట్ల గంజాయి పట్టివేత పలు కాలనీల్లో మొక్కలు ప్రత్యక్షం పోలీసుల తీరుపై అనుమానాలు -
‘ఉపాధి’ అవినీతి లెక్క తేలేనా?
కణేకల్లు: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 43 ఉడేగోళం గ్రామంలో చేపట్టిన పనుల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు నిగ్గు తేల్చడంలో జిల్లా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. అవినీతి సొమ్ము తేలిస్తే.. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు భాగస్వామిగా ఉన్న టీడీపీ నేత నుంచి రికవరీ చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే విచారణను నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి 43 ఉడేగోళం ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్కుమార్, టీడీపీ నేత పీవీ మారుతిప్రసాద్ కుమ్మకై ్క ఉపాధి హామీ పథకాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ గ్రామం హెచ్చెల్సీ ఆయకట్టు ప్రాంతం కావడంతో పంట పొలాల్లో పూడికతీత పనులే ఎక్కువ చేశారు. 300 మంది కూలీల్లో 120 మంది పనులకే రారు. అయినా వారు పనులకు వస్తున్నట్లు మస్టర్లు తయారు చేశారు. ఇలా 2024–25 సంవత్సరంలో రూ.65 లక్షలు, 2025–26లో రూ.58లక్షలు, 2026 (ఏప్రిల్, మే నెలలు)లో రూ.24.64లక్షలు చొప్పున కూలీలకు వేతనాల రూపంలో చెల్లించారు. కూలి రూపంలో మంజూరు చేయించిన సొమ్ములో వాటాలు పంచుకున్నారు. పర్యవేక్షణ లోపంతోనే అక్రమాలు 43 ఉడేగోళం గ్రామంలో ఉపాధి హామీ పనులపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఒక పొలంలో పని ప్రారంభిస్తే... ఆ పని పూర్తయ్యేందకు కనీసం వారం, పది రోజుల సమయం పడుతుంది. ఉపాధి కూలీల బిల్లులు వారానికోసారి తయారు చేస్తారు. పని ప్రారంభ సమయంలో ఒక సారి.. పని పూర్తయ్యాక మరోసారి అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏదో ఒక రోజు టెక్నికల్ అసిస్టెంట్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి కొలతలు తీసుకోవాలి. తర్వాత ఎం.బుక్ సిద్ధం చేయాలి. ఇందులో ఉన్నవి కరెక్టా కాదా అని ఇంజినీరింగ్ కన్సలెంట్(ఈసీ) చెక్ మేజర్ (పునఃపరిశీలన) చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మస్టర్లు అప్లోడ్ చేయించి బిల్లులు మంజూరు చేయించాల్సి ఉంది. బిల్లుల మంజూరుకు ఏపీఓ, పీఓ (ఎంపీడీఓ) డీఎస్కీ (డిజిటల్ సిగ్నేచర్ కీ) ఇచ్చి కూలీల బిల్లులు మంజూరు చేస్తారు. ఉపాధి కూలీల బిల్లుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు అక్రమాలకు కొత్తదారులు వెతుక్కుంటుండటంపై ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామాతోనే వదిలేస్తారా? 43 ఉడేగోళం గ్రామంలో భారీస్థాయిలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చకుండా ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామాతోనే వదిలేస్తారా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కూలి పనులకెళ్లని వారు ఎంతమంది ఉన్నారు? వారి బ్యాంకు అకౌంట్లకు వంద రోజుల్లో ఎంత డబ్బులు మళ్లించారు.. రెండేళ్లలో ఎంత మొత్తంలో ఉపాధి సొమ్ము పక్కదారి పట్టిందనే విషయాన్ని లోతుగా విచారణ చేసి.. అవినీతి లెక్కలు రికవరీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కు సహకరించిన ఉపాధిహామీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా.. లేకుంటే వారిని కాపాడుతారా అనేది వేచి చూడాల్సి ఉంది. మీనమీషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం అక్రమాలు తేలాక.. సొమ్ము రికవరీ సాధ్యమేనా..! అవినీతికి సహకరించిన టీఏ, ఈసీలపై చర్యలుండవా? -
ఏఎస్పీగా శ్రీనివాసరావుకు పదోన్నతి
అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీగా అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావుకు పదోన్నతి దక్కింది. కాగా ఈ నెల 30న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో జిల్లాలోనే ఆయన అదనపు ఎస్పీగా బాధ్యతలు తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. దత్తతకు చిన్నారులు అనంతపురం సెంట్రల్: కణేకల్లులోని ఆర్డీటీ హోం, ఎస్వీ పురం హోంలో ఆశ్రయం పొందుతున్న ముడావత్ సెల్వనాయక్(15), ప్రియదర్శిని(14) తల్లిదండ్రులు, సంబంధీకులు ఎవరైనా ఉంటే 30 రోజుల్లోపు సంప్రదించాలని ఐసీడీఎస్ పీడీ శశికళ కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధీకులు ఎవరూ ముందుకు రాకపోతే బాలల సంక్షేమ సమితి నిబంధనల మేరకు అనాథలుగా ప్రకటించి దత్తతకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సెల్వనాయక్, ప్రియదర్శిని -
శక్తి యాప్తో సంపూర్ణ రక్షణ : ఎస్పీ
గార్లదిన్నె: శక్తి యాప్ వినియోగంతో సంపూర్ణ రక్షణ లభిస్తుందని మహిళలకు ఎస్పీ జగదీష్ సూచించారు. శక్తి యాప్ వినియోగంపై బుధవారం గార్లదిన్నె మండలం మర్తాడు క్రాస్లోని పి.కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు సేవలపై చైతన్య పరిచారు. సమాజంలో పెరుగుతున్న వివిధ నేరాల నేపథ్యంలో మహిళలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా తక్షణ సాయంపొందే అవకాశముందన్నారు. ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఓటీపీ మోసాలు వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, యాప్లకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి, మారక ద్రవ్యాలు నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వెంకటేశ్వర్లు, కౌలుట్లయ్య, ఎస్ఐలు గౌస్ మహమ్మద్ బాషా, సాగర్, విజయ్కుమార్, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
శిథిల గదుల్లో బోధన ఇంకెన్నాళ్లు?
విడపనకల్లు: చంద్రబాబు పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. చాలాచోట్ల శిథిల దశకు చేరుకున్న భవనాల్లోనే పాఠశాలలు నడుపుతున్నారు. వర్షాలకు కారుతున్నా.. పైకప్పు పెచ్చులు ఊడి మీద పడుతున్నా ఉపాధ్యాయులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉండిపోతున్నారు. పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దశల వారీగా అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు 266 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఐదు గదులను ప్రాథమిక పాఠశాలకు.. మూడు గదులు ఉన్నతపాఠశాలకు వినియోగించుకుంటున్నారు. దశాబ్దాల కిందటి ఈ భవనం దెబ్బతింది. పైకప్పు స్లాబ్ పెచ్చులూడి.. కడ్డీలు కనిపిస్తున్నాయి. తరగతులు జరుగుతున్న సమయంలోనే పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని మొన్నటి వరకు వరండాలో చదువులు కొనసాగించారు. భవన నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడో..? ఉన్నతపాఠశాల నిర్వహణ కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్లో పక్కా భవనాలు మంజూరయ్యాయి. రూ.66లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. చంద్రబాబు సర్కారు కొలువు దీరడం.. నిర్మాణ పనులు ఆగిపోవడం జరిగిపోయాయి. రెండు సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగలేదు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించడం లేదు. రెండు వారాల తర్వాత బడులు పునఃప్రారంభం కానున్నాయి. నూతన విద్యా సంవత్సరంలో కూడా పక్కా భవనంలోకి వెళ్లే పరిస్థితులు కనిపించం లేదు. చీకలగురికిలోనే కాదు.. మండలంలోని పాల్తూరు, కరకముక్కల, హావళిగి, వి.కొత్తకోట, పొలికి తదితరగ్రామాల్లో కూడా పాఠశాలల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు నిలిచిపోయాయి. మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ తీసుకుని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. చీకలగురికి ఉన్నత పాఠశాల తరగతి గదిలో పెచ్చులూడిన దృశ్యం అర్ధంతరంగా ఆగిపోయిన భవనాల నిర్మాణం పూర్తికాని అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఈ విద్యా సంవత్సం కూడా వరండాలోనే పాఠాలు ఎప్పుడు కూలుతుందో అంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదీ మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి -
ఎరువుల దుకాణాల తనిఖీ
కూడేరు: మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. రెండు దుకాణాల్లో ఈ–పాస్ స్టాక్కు, నిల్వకు తేడాలు గుర్తించి, రూ.1,10,271 విలువైన 6.31 టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ గోపాలుడు, ఏఓ వాసుప్రకాష్, మండల ఏఓ శుభకర్, సిబ్బంది పాల్గొన్నారు. స్కూటీ ఢీ.. వ్యక్తి మృతి గుత్తి: స్థానిక తాడిపత్రి మార్గంలో స్కూటీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లప్ప (45)గా ధ్రువీకరించారు. తాడిపత్రి మార్గంలో రోడ్డు దాటుతుండగా స్కూటీపై వేగంగా దూసుకెళ్లిన మైనర్ బాలుడు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై సీఐ రామారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలిపై దాడి కళ్యాణదుర్గం రూరల్: బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన మాజీ డీలర్, వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు రాము భార్య అచ్చుతపై టీడీపీ నేతలు దాడి చేశారు. గాయపడిన అచ్చుతను చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీడీపీ నాయకులు లోపలకు చొరబడి తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు గోళ్ల సూరి, చంద్రశేఖర్రెడ్డి, నాయకులు గణేష్, అభిలాష్రెడ్డి డిమాండ్ చేశారు. వివాహిత దుర్మరణం యాడికి: ఆటో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామానికి చెందిన రమీజా (45) బుధవారం తన కుమారుడు కరీంబాషాతో కలిసి ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన వారు యాడికి మండలం వేములపాడు వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో రమీజా కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. కరీంబాషా తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడిని ప్రైవేట్ వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్యసాయి సన్నిధిలో సినీ నటులు ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా మహా సమాధి దర్శనార్థం సినీ నటులు రాధిక, శరత్కుమార్ బుధవారం సాయంత్రం పుట్టపర్తికి విచ్చేశారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారు నేరుగా శాంతి భవన్ చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం దర్శన వేళల్లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా వారికి ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికారు. -
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
అనంతపురం: ముస్లింలందరికీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పేదల పట్ల దయ, జాలి కలిగి ఉండడమే ఈ పండుగ ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. దైవ పరీక్షలో కన్నకొడుకు ప్రాణాలను బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుని త్యాగానికి గుర్తుగా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. ముస్లింలందరిపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రీసర్వే పనులను వేగవంతం చేయండి శింగనమల(నార్పల): రీసర్వే పనులను వేగవంతం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నార్పల మండలం చాములూరులో రీసర్వే పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ రైతులతో మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పిస్తూ ఇబ్బందులు లేకుండా రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. బీఎల్ఓలతో మాట్లాడారు. మొబైల్ ఆప్లికేషన్లో ఫ్యామిలీ మ్యాపింగ్ ఎంత శాతం పూర్తయ్యిందో పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీధర్మూర్తి, మండల సర్వేయర్ బ్రహ్మానందం, సచివాలయ సిబ్బంది ఉన్నారు. డ్రైల్యాండ్ హార్టికల్చర్ పనులకు గ్రీన్ సిగ్నల్అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద పండ్ల తోటల పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 2026–27ఆర్ధిక సంవత్సరంలో 16 రకాల పండ్లతోటలు, రెండు రకాల పూల తోటలతోపాటు మునగ సాగుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 7,500ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకాన్ని చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ఐదు ఎకరాల్లోపు మెట్టభూములన్న రైతులు పండ్ల మొక్కల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల రైతులు గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలను సంప్రదించాలని సూచించారు. జూన్ 1 నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ అమలు అనంతపురం టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) చట్టాన్ని జూన్ 1 నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) సలీంబాషా తెలిపారు. వీబీ జీ రామ్ జీ చట్టం కింద కూలీలకు ఏడాదిలో 125 పని దినాలు కల్పించడంతోపాటు రోజువారి వేతనాన్ని రూ.311 చెల్లించనున్నారు. 2026–27ఆర్థిక సంవత్సరంలో రూ.117.64కోట్ల మేర నిధులను అనంతపురం జిల్లాకు కేటాయించారు. ఇందులో కూలీల వేతనాలకు రూ.70.54కోట్లు, మిగిలిన మొత్తం వివిధ రకాల మెటీరియల్ కోసం వెచ్చించనున్నారు. కూలీల వేతనాల సొమ్ము సైతం 15 రోజుల్లో ఖాతాల్లో జమ చేయనున్నారు. పనులు కావాలని అడిగిన 15రోజుల్లోపు స్థానికంగానే పనులు కల్పించనున్నారు. పనులు కల్పించకపోతే భృతి అందించనున్నారు. నూతన చట్టంలో ఉపాధి అక్రమాలను ఆరికట్టేందుకు కేంద్రం నూతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది.అనంత వెంకటరామిరెడ్డి -
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ తనిఖీల్లో ఉద్రిక్తత
● మున్సిపల్ ఎస్ఐపై దాడి అనంతపురం క్రైం: నగరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అనంతపురం నగరపాలక సంస్థ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ఉద్రిక్తతకు దారితీసింది. వారం రోజులుగా నగరపాలక సంస్థ అధికారులు, వార్డు సచివాలయ ఉద్యోగులు నగరంలోని వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఫుడ్ సెంటర్లు, ఓళిగ సెంటర్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బుధవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అలహాబాద్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓళిగ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అధికారులతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పి 4వ సర్కిల్కు చెందిన మున్సిపల్ ఎస్ఐ విజయ్కుమార్, శానిటేషన్ సెక్రటరీపై దాడికి పాల్పడ్డారు. విజయ్కుమార్కు గాయాలైనట్లు తెలిసింది. ఘటనపై మూడో పట్టణ పీఎస్లో మునిసిపల్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. -
‘పసుపు’ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులు
● టీడీపీ కార్యకర్తలతో కలిసి కూడేరు సీఐ హల్చల్ సాక్షి టాస్క్ఫోర్స్: తెలుగుదేశం పార్టీ ‘పసుపు పండుగ’ మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులు తరించారు. కొందరు కార్యకర్తలు మాదిరిగా మారిపోతే.. మరికొందరు అదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా విధులు నిర్వర్తించి విమర్శలు మూటగట్టుకున్నారు. బుధవారం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో నాయకులు, కార్యకర్తల మధ్యలో సీఐ రాజు ఆశీనులయ్యారు. అంతేకాదు సెల్ఫీలు దిగి.. కేకులు కట్ చేశారు. దీంతో ఖాకీ ముసుగులోని ‘పసుపు రంగు’ను ప్రదర్శించినట్లయ్యింది. గతంలో కూడేరు పోలీస్స్టేషన్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చడం విమర్శలకు దారి తీసింది. అప్పట్లో సీఐ తీరును ఎండగడుతూ ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, యువనేత ప్రణయ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అయినా సీఐ తన పద్ధతి ఏమాత్రమూ మార్చుకోకుండా మహానాడులో హల్చల్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసుపు జెండాలు కట్టిన ‘పంచాయతీ’ ఉరవకొండలోని దేవాంగ కల్యాణ మండపం, టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడు ఏర్పాట్లలో పంచాయతీ సిబ్బంది పాలుపంచుకున్నారు. ఆవరణమంతా టీడీపీ జెండాలు కట్టారు. -
రాబడి తక్కువ.. ఖర్చు ఎక్కువ
ఒకప్పుడు భారీ షెడ్యూల్తో కిలోమీటర్ల మేర బస్సులు నడిపి ఆదాయంలో కీలక రీజియన్ గా గుర్తింపు పొందిన అనంతపురం పరిస్థితి నేడు తారుమారు అయింది. ఇప్పుడు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయి. ఇటీవల ఆర్టీసీ సంస్థ విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ● అనంతపురం ఆర్టీసీ రీజియన్ తీరిది ● వార్షిక పనితీరులో మరింత దారుణం అనంతపురం క్రైం: ఉమ్మడి జిల్లా పరిధిలోని చాలా డిపోల్లో సిబ్బంది కొరత, కాలం చెల్లిన బస్సుల నిర్వహణతో మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య లేకపోవడం కూడా ఆర్టీసీ నష్టాలకు కారణమవుతోంది. మొత్తంగా ఈ పరిస్థితి అనంతపురం ఆర్టీసీ రీజియన్లో నెలకొంది. దుస్థితికి అద్దం పట్టిన గణాంకాలు ఏటా ఫిబ్రవరిలో ఆదాయ, వ్యయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గణాంకాలు విడుదల చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి–2026లో విడుదల చేసిన ‘రీజియన్స్ అండ్ జోన్స్ ఆన్ ప్రాఫిటబిలిటీ’ గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాస్ రీయింబర్స్మెంట్ను కలుపుకుని కోస్తాంధ్ర జిల్లాలు భారీ లాభాలతో ముందంజలో ఉండగా, రాయలసీమ జిల్లాలు ఆర్థిక ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఫిబ్రవరి నెల గణాంకాల ప్రకారం అనంతపురం రీజియన్ రూ.331.01 లక్షల ఆదాయం గడించగా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే సుమారు రూ.220 లక్షల మేర తగ్గుదల ఉండడం గమనార్హం. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో అనంతపురం రీజియన్ 13వ స్థానానికి దిగజారింది. అదే సమయంలో కాకినాడ రూ.1,586.66 లక్షలతో అగ్రస్థానానికి ఎగబాకింది. కోనసీమ, విజయనగరం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలు కూడా బలమైన లాభాలను నమోదు చేశాయి. ఏడాది సమీకృత లెక్కల్లో అనంతపురం రీజియన్ రూ.3,349.39 లక్షల నష్టాలతో పూర్తిగా వెనుకబడింది. రాయలసీమ పరిధిలోని తిరుపతి, నంద్యాల, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలు కూడా నష్టాల్లో ఉన్నా... అనంతపురం పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రైవేట్ పెత్తనంతో ఆదాయానికి గండి ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని గ్రామాల మధ్య దూరం అధికంగా ఉంటోంది. బస్సులు ఎక్కువ కిలోమీటర్లు నడిచినా ప్రతి ట్రిప్పై ఆదాయం తక్కువగానే ఉంటోంది. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్కు అడ్డుకట్ట వేయడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు, హైదరాబాద్, ధర్మవరం, హిందూపురం వంటి రూట్లలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆధిపత్యం పెరగడంతో ఆర్టీసీ ప్రయాణికులను కోల్పోతోంది. దీనికి తోడు కాలం చెల్లిన బస్సులు, పెరిగిన నిర్వహణ వ్యయం కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకపోవడం కూడా ఆర్టీసీ నష్టాలకు కారణమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నష్టాల్లో ఉన్న రూట్లపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించడంతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెడ్యూల్ మార్పు చేస్తూ బస్సులు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరిగితే నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయం పొందేలా కార్యాచరణను అమలు చేయాలని అంటున్నారు. -
●ఇంకెంత కాలమీ ‘గ్యాస్’ ట్రబుల్
కళ్యాణదుర్గం రూరల్: పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా నెల క్రితం వరకూ వంట గ్యాస్ కోసం వినియోగదారులు నానా తిప్పలు పడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య లేకున్నా... కళ్యాణదుర్గం వాసులు మాత్రం ‘గ్యాస్’ ట్రబుల్తోనే ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్ల సరఫరా సక్రమంగా ఉన్నా ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు సాగిస్తుండడమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. బుక్ చేసుకుని 20 రోజులైనా సిలిండర్లను అందజేయడం లేదని వాపోతున్నారు. సిలిండర్ కోసం ఉదయం 6 గంటలకే ఏజెన్సీ వద్దకు చేరుకుంటే మధ్యాహ్నం వరకూ పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత ధరకంటే ఎక్కువ చెల్లించిన వారికి క్షణాల్లో సిలిండర్లను ఏజెన్సీ నిర్వాహకులు అందజేస్తున్నారని, ఈ అక్రమాలను ఇప్పటికై నా అధికారులు అరికట్టాలని కోరుతున్నారు. -
సామాన్యుడిపై ధరాఘాతం !
రాయదుర్గం: పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొద్ది రోజులు ఇంధన, గ్యాస్ కొరత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగో దఫా పెంచేశారు. జిల్లాలో 50 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో గృహ, వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు 10 లక్షల వరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో రోజువారీగా పెట్రోల్ 2.60 లక్షలు, డీజిల్ 3.83 లక్షల లీటర్లు వినియోగిస్తున్నారు. డీజిల్తో నడిచే భారీ వాహనాలు 17 వేలు, లారీలు 5,100, ట్రాక్టర్లు 14,900, డీజిల్ కార్లు 10 వేలు, ఆటోలు 8 వేలు, పెట్రోల్ కార్లు 4వేల దాకా ఉన్నాయి. అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలపై పెనుభారం జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, ఇతర చేతివృత్తిదారులు ఉన్నారు. వీరికి కొద్దిపాటి ధరలు పెరిగితేనే జీవనం కష్టంగా మారుతుంది. ఇప్పటికే ఉప్పు, పప్పులు, నూనెలు, రోజూ వాడే వంట సామగ్రి ధరలు మంటలు రేపుతున్నాయి. ఏది కొనాలన్నా సామాన్యులు భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడంతో రవాణా రంగంపై భారీగా ప్రభావం చూపుతోంది. రవాణా చార్జీలు పెంచడం ద్వారా నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్నాయి. కూరగాయలతో పాటు మాంసం, పండ్లు ఒక్కటేమిటి ధరలన్నీ పెరిగిపోయాయి. నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ప్రైవేటు బస్సు చార్జీలకు రెక్కలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చైన్నె లాంటి మహా నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గం నుంచి జీన్స్ వస్త్ర ఉత్పత్తుల విక్రయాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో బస్సు చార్జీలు కూడా అమాంతం పెంచారు. ప్రయాణికులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వరుసగా నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే మంట రేపుతున్న వంటగ్యాస్ సరఫరా నిలకడలేని నిత్యావసర ధరలు గగ్గోలు పెడుతున్న పేదలు పట్టించుకోని ప్రభుత్వాలు -
కమిషనర్ శాడిజంపై నిరసనాగ్రహం
తాడిపత్రి రూరల్: మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ శాడిజంపై వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనాగ్రహం పెల్లుబికింది. తీవ్ర పనిఒత్తిడి కారణంగా తాడిపత్రి టైలర్స్ కాలనీలోని స్వర్ణ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కొర్రపాడు అనిల్కుమార్ సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మృతికి సంతాప సూచికంగా వార్డు సచివాలయ ఉద్యోగులు మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మానవత్వం మరిచి పని ఒత్తిడి పెంచి పైశాచికత్వం ప్రదర్శిస్తున్న కమిషనర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి కితాబు వస్తే తన వల్లేనని చెప్పుకుంటారని, ఏవైనా లోటుపాట్లు ఉంటే సిబ్బందిని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం నిమిత్తం సెలవు కావాలని కార్యాలయానికి వెళితే గంటల తరబడి బయటే ఉంచి మానసిక వేదనకు గురిచేస్తున్నారని, మహిళా ఉద్యోగుల వ్యక్తిగత ఇబ్బందులను కూడా వినకుండా పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ సమయాల్లో ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. 4 రోజులూ వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం తెలిపారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 31 వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే సూచన ఉందని పేర్కొన్నారు.ముత్యాలమ్మ దేవరలో తోపులాట ● పోలీసులపై పలువురి దాడి గుంతకల్లు: క్యూలైన్లో భక్తుల మధ్య జరిగిన తోపులాటను నియంత్రిస్తున్న పోలీసులపై పలువురు దాడిచేశారు. జి.కొట్టాలలో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో పూజారి గంగరాజు మంగళవారం దేవర నిర్వహించారు. ఈ సందర్భంగా మాంసాహార విందు ఏర్పాటు చేశారు. పూజారి ఆహ్వానం మేరకు బంధుమిత్రులతో పాటు గ్రామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముత్యాలమ్మ భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు జాగ్రత్తగా గుంతకల్లు రూరల్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం భోజనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోవడంతో ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా నియంత్రించేందుకు విధుల్లో ఉన్న హోంగార్డ్ పీరా రంగంలోకి దిగారు. రద్దీని నియంత్రిస్తున్న సమయంలో కోపోద్రిక్తులైన పూజారి బంధువులైన గంగరాజు, నరేష్తో పాటు కొందరు భక్తులు హోంగార్డుపై చేయి చేసుకున్నారు. దీన్ని గమనించిన హెడ్కానిస్టేబుల్ ఓబుళపతి అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆయనపైనా దాడిచేసి బట్టలు చించేశారు. ఈ సమయంలో మిగిలిన సిబ్బంది, భక్తులు కల్పించుకుని బాధిత పోలీసులను అక్కడి నుంచి పక్కకు తీసుకురావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయమై రూరల్ సీఐ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ క్యూలైన్లో తలెత్తిన వివాదం కారణంగా హోంగార్డ్, హెడ్కానిస్టేబుల్పై దాడి చేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు గంగరాజు, నరేష్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని చెప్పారు. సాగుకు సమాయత్తం చేయండి గుత్తి రూరల్: ఖరీఫ్లో తొలకరి జల్లులు పడగానే రైతులను సాగుకు సమాయత్తం చేయాలని వ్యవసాయ శాఖ జేడీ సాలురెడ్డి సూచించారు. పట్టణంలోని సీఎల్ఆర్సీ భవనంలో మంగళవారం గుత్తి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బందితో జేడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటించి ఎక్కువ మంది రైతులు విత్తన సాగు చేసేలా సన్నద్ధం చేయాలన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
పెనుకొండ రూరల్: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కియా పీఎస్ ఎస్ఐ డి.రాఘవయ్య తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం అనంతపురం నుంచి బెంగళూరుకు 15 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ధాన్యం తరలింపులకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపకపోవడంతో డ్రైవర్ ప్రకాష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్డీటీ ప్రభావతికి అప్పగించారు. -
తాగునీటి కోసం ఆందోళన
రాయదుర్గం టౌన్: స్థానిక మొలకాల్మూరు మార్గంలోని గాంధీ నగర్ కాలనీ, చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత నీరు వదిలినా పట్టుమని పది నిమిషాలు కూడా సరఫరా చేయలేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, ఫిట్టర్లు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పది నిమిషాలు కూడా నీటిని సరఫరా చేయకపోతే అవసరాలు ఎలా తీరుతాయని నిలదీశారు. ప్రస్తుతానికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తామంటూ భరోసానిచ్చి, ఆందోళనను విరమింపజేశారు. రాధేయకు జాతీయ కవితా పురస్కారం అనంతపురం కల్చరల్: పల్లా జాతీయ పురస్కారానికి జిల్లాకు చెందిన సీనియర్ కవి ఉమ్మడిశెట్టి రాధేయ ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వాహకులు డాక్టర్ పల్లా కృష్ణ మంగళవారం వెల్లడించారు. రాధేయ రచించిన ‘పావుకోళ్లు’ కవితా సంపుటిని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యువసాహితి సంస్థ వారు జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాధేయను తెలుగు వెలుగు సాహిత్య సంస్థ, డాక్టర్ ఉమర్ఆలీషా సాహితీ సమితి ప్రతినిధులు అభినందించారు. ఫోన్ హ్యాక్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): ఓ వ్యక్తి ఫోన్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు... అతని బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. డి.హీరేహాళ్ మండలం హోసగుడ్డం గ్రామానికి చెందిన వ్యక్తి అదే మండల కేంద్రానికి సమీపంలోని ఓ కర్మాగారంలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 22న అతడి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి రూ. 97 వేలు, 24న కెనరా బ్యాంకు ఖాతా నుంచి మరో రూ. 45,800 మాయమయ్యాయి. మొబైల్కు వరుసగా అందిన ఎస్ఎంఎస్లు చూసి బాధితుడు ఉలిక్కిపడ్డాడు. తన ఫోన్ హ్యాక్ అయినట్లుగా గుర్తించి, వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేసి నగదు కాజేసినట్లుగా నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించాడు. విద్యుదాఘాతంతో కూలీ మృతి ఉరవకొండ: మండలంలోని నెరిమెట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వన్నూరుస్వామి (41) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య సురేష్, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంటి పైభాగంలో ఉన్న ఇనుమ చువ్వలను కిందకు దించే క్రమంలో ఆ పక్కనే విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై కింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి బెళుగుప్ప: వడదెబ్బ సోకి ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బెళుగుప్పలోని ఫాదర్ ఫెర్రర్ కాలనీలో నివాసముంటున్న బోరంపల్లి శివ(36)కు భార్య లలిత, ఓ కుమారుడు, కుమార్తె, తల్లి వన్నూరమ్మ ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఉదయం గ్రామ శివారున చేపట్టిన ఉపాధి పనుల్లో పాల్గొన్న శివ... మధ్యాహ్నానికి తీవ్ర అస్వస్థతకు లోనై ఇంటికి చేరుకున్నాడు. కోలుకోలేకపోవడంతో మంగళవారం ఉదయం కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయండి అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయాలంటూ విద్యుత్ శాఖ అధికారులను ఆ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండలాలు యూనిట్గా ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. కాంట్రాక్టర్లతో చర్చించి జూన్ ఆఖరులోపు 100 శాతం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆర్డీఎస్ఎస్ పనులపై రోజు వారీ నివేదికలు సేకరించాలన్నారు. -
ఎరువుల సమస్య తలెత్తనీయొద్దు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి కీలక సమయంలో ఎరువుల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, రోజువారీ పర్యవేక్షణ కొనసాగించాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఆదేశించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి ఏడీఏలు, ఏవోలతో ఆయన గూగుల్ మీట్ నిర్వహించారు. ఎల్–నినో వాతావరణ పరిస్థితులు ఉన్నందున ప్రకృతి పద్ధతుల్లో పంటలు సాగు చేయించేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నందున పీఎండీఎస్, హాప్మూన్ పద్ధతులు రైతులు పాటించేలా చూడాలన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పీఎండీఎస్ కింద పంటలు వేయించాలన్నారు. త్వరలోనే విత్తన పంపిణీ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ప్రధానంగా గతేడాది ఉత్పన్నమైన ఎరువుల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎరువుల సరఫరా, అమ్మకాలపై రోజువారీ నిఘా ఉంచాలన్నారు. అందులోనూ యూరియా, డీఏపీ ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. డిమాండ్ ఉన్న ఆర్ఎస్కేల్లో తగినంత ఎరువులు నిల్వ చేసుకోవాలన్నారు. మార్క్ఫెడ్ దగ్గర బఫర్స్టాక్ ఎక్కువగా ఉన్నందున ఇండెంట్ ఇవ్వాలని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏవోలు, ఏఈవోలు, ఆర్ఎస్కే అసిస్టెంట్లు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీగా గంజాయి స్వాధీనం అనంతపురం సెంట్రల్: నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో ఉన్న పలు కాలనీలో మంగళవారం వన్టౌన్ పోలీసులు నాకాబందీ చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. షికారీల ఇళ్లలో భారీగా నిల్వ చేసిన గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని నిల్వ చేసిన వారిని స్టేషన్కు తరలించి, విచారణ చేస్తున్నారు. ఇద్దరి అరెస్ట్ గార్లదిన్నె: పంట పొలాల్లో డ్రిప్ ల్యాడర్, పరికరాలను అపహరించుకెళుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ.50 వేలు విలువ చేసే డ్రిప్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం వారు వెల్లడించారు. ఈ నెల 5న ముంటిమడుగు గ్రామంలో రైతు తమ్మినేని కోదండ పొలంలో డ్రిప్పు పరికరాలు చోరీకి గురయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో ముంటిమడుగు కొత్తూరుకు చెందిన నరసింహులు, శ్రీనివాసులును అరెస్ట్ చేసి, డ్రిప్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. -
జిల్లాలో గాలివాన బీభత్సం
● ఆత్మకూరులో భారీ వర్షం● అనంతపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగు ● నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలుఅనంతపురం అగ్రికల్చర్/ అనంతపురం క్రైం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి గాలివాన బీభత్సం సృష్టించింది. భయం గొల్పే ఉరుములు, మెరుపులతో పాటు 25 నుంచి 35 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే వరుణుడు తోడు కావడంతో పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు మండలంలో 62 మి.మీతో పాటు అనంతపురం, రాప్తాడు, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, శింగనమల, బెళుగుప్ప, యల్లనూరు, ఉరవకొండ, కూడేరు, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో వర్షం కురిసింది. రాప్తాడు, అనంతపురం, పెద్దపప్పూరు, నార్పల, కూడేరు, బెళుగుప్ప, తాడిపత్రి, ఆత్మకూరు, యల్లనూరు తదితర మండలాల్లో ఈదురుగాలుల ధాటికి పంటనష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. దీంతో అంధకారం అలుముకుంది. అనంతపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నవోదయ కాలనీలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జీసస్నగర్లో కూలిన భారీ వృక్షం కారణంగా ప్రభుత్వ సర్వజనాస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
సామూహిక సస్యరక్షణ చేపట్టాలి
కొబ్బరిలో ఆశించిన తెగుళ్ల నివారణకు రైతులు సామూహిక సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు పసుపు అట్టలను చెట్లకు కట్టాలి. వేపనూనె పిచికారీ చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన మందులు పిచికారీ చేయకూడదు. కాండం తొలుచు పురుగు ఆశించిన చెట్టు మొదలులో ఏర్పడిన రంధ్రం ద్వారా సన్నని ఇనుప సూదిని గుచ్చి పురుగును చంపాలి. ఆ తర్వాత సెవిడాల్ 8జీ అనే మందు పొడిని ఇసుకలో కలిపి రంధ్రాలను కప్పివేయాలి. – ఇ.చండ్రాయుడు, కేవీకే కో ఆర్డినేటర్, కళ్యాణదుర్గం -
‘భవిత’కు బాటలు వేద్దాం!
● జిల్లాలో 248 మంది ‘ప్రత్యేక పిల్లల’ గుర్తింపు ● రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిన ‘అనంత’ అనంతపురం ఎడ్యుకేషన్: చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని బయటపెట్టడానికి ఇప్పటికీ వెనుకడుగు వేస్తున్నారు. ‘సమాజం ఏమనుకుంటుందో?’, ‘మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందేమో?’ అనే భయాలు వారిలో కనిపిస్తున్నాయి. అయితే నేటి సమాజంలో పరిస్థితులు మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రభుత్వం మాత్రమే కాదు సమాజం కూడా ఆదరించే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సమగ్రశిక్ష ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్) ప్రత్యేక నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి మండలంలో ఐఈఆర్పీలు ఇంటింటికీ వెళ్లి పిల్లల వివరాలు సేకరిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటిదాకా జిల్లాలో 1,318 మందిని గుర్తించగా.. వీరిలో 396 మంది కొత్త పిల్లలు ఉన్నారు. మంగళవారం నాటికి మన జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. మే 4న ప్రారంభమైన ఈ ‘స్పెషల్ డ్రైవ్’ జూన్ 10 దాకా కొనసాగనుంది. నమోదు చేస్తేనే పథకాలు ప్రత్యేక అవసరాల పిల్లల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు వారికి చేరువవుతాయి. అర్హులను గుర్తించడమే లక్ష్యం ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపునకు చేపడుతున్న ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఐఈ కోఆర్డినేటర్ ఫణిరాజ్ తెలిపారు. -
ముమ్మాటికీ కక్ష సాధింపే
అనంతపురం ఎడ్యుకేషన్: తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా అరెస్టు చేశారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏడాది క్రితం జరిగిన ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య కేసులో అనంతపురం రూరల్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున తోపుదుర్తి రాజశేఖర్రెడ్డితో పాటు జయపాల్రెడ్డి అనే యువకుడిని అరెస్ట్ చేశారు. మహేశ్వరరెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ వారిని అరెస్టు చేసి..కోర్టులో హాజరుపరిచారు. అయితే..ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట నడిరోడ్డుపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి శిఖండి రాజకీయాలు చేస్తోందన్నారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో మూడు హత్యలు, దళిత బాలికపై సామూహిక అత్యాచారం, అనేక దొమ్మీలు, దోపిడీలు, దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. వీటిని ప్రశ్నిస్తున్న క్రమంలో తమను భయపెట్టేందుకే తన సోదరుడిని అరెస్ట్ చేశారన్నారు. ‘మహేశ్వరరెడ్డి మా వాడని గతంలో చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా. అతను తప్పుదోవలో వెళ్తుంటే రాజశేఖర్రెడ్డి చక్కదిద్దాలని చూశారు. అయితే మావైపు ఉన్న కొందరిని పరిటాల శ్రీరామ్ తనవైపు తిప్పుకుని మాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. మహేశ్వరరెడ్డిని పరిటాల శ్రీరామ్ హత్య చేశాడనే అనుమానం మాకు ఉంది. వారికి అనుకూలంగా లేని సీఐని బదిలీ చేసిన తర్వాత చర్యలకు పూనుకున్నారు. రాజశేఖర్రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రకాష్రెడ్డిని కట్టడి చేయొచ్చని, నియోజకవర్గంలో కేడర్ భయపడుతుందని భావించి చేసిన కుట్ర ఇది. రెడ్ల మధ్య పరిటాల కుటుంబం చిచ్చు పెడుతోంది. అవసరమైతే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని అంతమొందించాలని కూడా చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేయిస్తా’మని అన్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అక్రమ కేసు! తోపుదుర్తి రాజశేఖర్రెడ్డిపై నమోదు చేసిన కేసు విషయమై నిశితంగా పరిశీలిస్తే ఇది పూర్తిగా అక్రమ కేసు అని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. మహేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచి ఈ కేసులో తోపుదుర్తి కుటుంబ సభ్యులను చేర్చాలంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేసినట్లు తెలిసింది. ఆత్మహత్య అనేది పూర్తిగా స్పష్టత ఉన్న పోలీసులు అక్రమంగా కేసు నమోదు విషయంలో తర్జనభర్జన పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆలస్యం చేశారనే ప్రచారం ఉంది. సీఐ మొదలు జిల్లాస్థాయి అధికారి దాకా ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాప్తాడుకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి నేరుగా డీజీపీ, మంత్రి లోకేష్ను కలిసి ఎలాగైనా కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చారనే టాక్ నడుస్తోంది. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి వ్యవహారం, దూకుడు అధికార పార్టీకి చాలా ఇబ్బందిగా ఉందని, కట్టడి చేయకపోతే కష్టమని చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి గన్మెన్లను తొలగించేలా పావులు కదిపారు. తాజాగా ఆయన సోదరుడిని అక్రమ కేసులో ఇరికించినట్లు తెలుస్తోంది. కాగా రాజశేఖర్రెడ్డిపై కేసు నమోదును చాలామంది టీడీపీ నేతలు కూడా తప్పు పట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి నిరసన పార్టీ శ్రేణులతోరోడ్డుపై బైఠాయింపు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు అక్రమ అరెస్టులకు భయపడబోమన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
ఎబోలాపై అప్రమత్తం
● అనంతలోనూ 70 మందికి పైగా ఆఫ్రికా విద్యార్థులు ● జేఎన్టీయూఏ పరిధిలోని ఫార్మసీ కళాశాలల్లో అడ్మిషన్లు అనంతపురం: ఎబోలా వైరస్ వ్యాప్తితో హెల్త్ ఎమర్జెన్సీ తప్పదనే సంకేతాలు బలపడుతున్నాయి. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా, సూడాన్ దేశాలకు చెందిన 70 మంది విద్యార్థులు జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని పలు ఫార్మసీ కళాశాలల్లో బీఫార్మసీ చదువుతున్నారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది ఇక్కడ వసతి గృహాల్లో ఉన్నారు. మరికొందరు సొంత దేశాలకు వెళ్లారు. వీరింతా తిరిగి ఆయా కళాశాలలకు త్వరలో రానున్నారు. ఈ నేపథ్యంలో వీరికి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. నిర్ధారణ అయితే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించనున్నారు. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఆఫ్రికాలోని పలు దేశాల్లో వ్యాపారం, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న వీరి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాల్లో వస్తున్న స్వదేశీ ప్రయాణికులకు సైతం విధిగా పరీక్షలు చేయనున్నారు. విదేశీ ప్రయాణికులతో పాటు స్వదేశీ ప్రయాణికులకు ఎబోలా స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. ప్రధాన లక్షణాలివీ.. ఎబోలా వైరస్ సోకినప్పుడు ప్రాథమికంగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. గొంతునొప్పి, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వ్యాధి ముదిరిన దశలో ముక్కు, నోరు, కళ్ల నుంచి లేదా అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా ’బుండిబుగ్యో’ రూపానికి ఇప్పటి వరకు నిర్దిష్టమైన వ్యాక్సిన్ కానీ, కచ్చితమైన చికిత్స కానీ అందుబాటులో లేదని, అందువల్ల ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. -
●రాయలేలిన ‘దుర్గం’
రాయదుర్గంటౌన్: రాయలేలిన రాయదుర్గంలో అడుగడుగునా శిల్పకళా సంపద ఉట్టి పడేలా అనేక ఆలయాలు ఉన్నాయి. విజయనగర రాజుల కాలంలో రాయదుర్గం ప్రాంతాన్ని మహామంత్రి తిమ్మరుసు తమ్ముడు గోవిందామాత్యుడు పాలించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో నిర్మించిన ఆలయాలు నేటికీ చెక్కుచెదరలేదు. కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం, జంభుకేశ్వరస్వామి, దశభుజ గణపతి, పాదరస శివలింగం, పశుపతినాథ ఆలయాలతో పాటు లక్ష్మమ్మ సమాధి, కొండపై లక్ష్మీనరసింహస్వామి, కోదండరామస్వామి, మాధవరాయస్వామి, రససిద్దేశ్వరస్వామి ఆలయాలతోపాటు ఇతర కట్టడాలు చూడమనోహరంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాయదుర్గం పట్టణానికి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఉరవకొండ నుంచి 60 కిలోమీటర్లు, కళ్యాణదుర్గం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. పట్టణానికి చేరుకుంటే కొండ సమీపంలోనే ఉంటుంది. కాలినడన వెళ్లాల్సి ఉంటుంది. -
లారీ ఢీ – రైతు మృతి
గార్లదిన్నె: మండలంలోని ఎగువపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన రైతు పెద్ద ఓబయ్య (80) మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జాతీయ రహదారికి అవతలి వైపు ఉన్న తన పొలానికి రోజూ కాలి నడకన వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం పొలానికి వెళ్లిన ఓబయ్య... అక్కడ పని ముగించుకుని ఇంటికి వెళుతూ.. జాతీయ రహదారిపై రైస్ మిల్లు వద్ద రోడ్డు దాటుతుండగా గుత్తి వైపుగా వెళుతున్న హర్యానాకు చెందిన లారీ ఢీకొంది. పెద్ద ఓబయ్యకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు 108 ద్వారా అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ ఆచూకీ కోసం గాలిస్తుండగా కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద ఆపి డ్రైవర్ పరారైనట్లుగా గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించారు. ఘటనపై ,కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వెంటాడి.. వేటాడి
బత్తలపల్లి: సినిమాలో గూండాలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేసే సీన్లను తలపించేలా పులివెందుల నుంచి బత్తలపల్లి వరకు మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై సుమారు 60 కిలోమీటర్ల మేర పందుల దొంగల వేట ఉత్కంఠను రేపింది. గత రెండేళ్లుగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో గుర్తు తెలియని వ్యక్తులు పందుల దొంగతనాలు చేస్తూ కలకలం రేపుతుండగా.. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘటనతో దొంగల ముఠా గుట్టు రట్టయ్యింది. ప్రత్యక్ష సాక్షులు, బత్తలపల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... పులివెందుల వాసి అంజినప్పకు సంబంధించిన పందులను గత రెండేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు అపహరించుకుని పోతున్నారు. సీసీ కెమెరాల్లో, ఇతరత్రా పరిశీలించినప్పుడు వాహనాలకు నెంబర్ లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టమైంది. అయితే.. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంజినప్పకు చెందిన పందులను బొలెరో వాహనంలో ఎక్కించి తరలిస్తుండగా, యజమాని బంధువైన ఓ పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా ఉన్న ఆ వాహనాన్ని గుర్తించారు. వెంటనే ఆయన అంజినప్పకు సమాచారం అందించారు. అంజినప్ప తక్షణమే పులివెందుల పోలీసులకు తెలియజేశాడు. దీంతో అంజినప్ప, పోలీసులు వేర్వేరుగా దొంగలను వెంబడించారు. దాడులు చేస్తూ తప్పించుకునే యత్నం తమను వెంబడిస్తున్న వాహనాలపైకి దొంగలు రాళ్లతోనూ, బీరు సీసాలతోనూ దాడులకు దిగారు. అప్పుడప్పుడు పందులను ఆ వాహనాలపైకి వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అంజినప్ప బంధువైన పులివెందుల కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. మార్గమధ్యంలోని ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఎదురుపడ్డ రెండు ద్విచక్ర వాహనాలను సైతం పందుల దొంగల వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. ముదిగుబ్బ వైపునకు దొంగల వాహనం వెళుతుండడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముదిగుబ్బ వద్ద కూడా పోలీసుల కళ్లుగప్పి దొంగలు బైపాస్ మీదుగా బత్తలపల్లి వైపు పరారయ్యారు. దీంతో ముదిగుబ్బ సీఐ శివరాముడు వెంటనే ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్గౌడుకు సమాచారం ఇచ్చారు. ఆయన బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, పోలీసులను అప్రమత్తం చేశారు. సిబ్బందితో కలిసి ఎస్ఐ టోల్గేట్ వద్ద కాపు కాశారు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దొంగలు జాతీయ రహదారి వదిలేసి గుమ్మల్లకుంట ఎస్సీ కాలనీ మార్గంలో గంటాపురం గ్రామంలోకి వెళ్లి, అక్కడి నుంచి బైపాస్కు చేరుకున్నారు. వెంబడిస్తున్న పోలీసులు బత్తలపల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు గంటాపురం వద్దకు చేరుకున్నారు. ఆలోపు బైపాస్ చేరుకున్న దొంగల వాహనం ఎలాగైనా తప్పించుకునే అవకాశముందని భావించిన యజమాని అంజినప్ప ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు. దొంగలు వాడిన బొలెరో వాహనం, ఛేజింగ్ చేసే క్రమంలో దెబ్బతిన్న పందుల యజమాని కారు బైపాస్లో సర్వీసు రోడ్డులో వెళ్తున్న దొంగల వాహనాన్ని యజమాని అంజినప్ప తన కారుతో ఓవర్టేక్ చేసి అడ్డంగా నిలిపాడు. దీంతో బొలెరో వాహనం అంజినప్ప కారును బలంగా ఢీ కొట్టి రోడ్డు పక్కనున్న డ్రైనేజీని ఎగిరి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. బొలెరో ముందు చక్రాలు ఊడిపోయాయి. పందుల యజమాని కారు నుజ్జునుజ్జు అయింది. వాహనాలు ఆగిన వెంటనే దొంగలు రాళ్ల దాడికి దిగారు. యజమాని వైపు నుంచి సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. ఇంతలోనే బత్తలపల్లి, పులివెందుల పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఏడుగురు దొంగలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాలోని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు పందులను పులివెందుల పోలీసులకు అప్పగించారు. ఇరువురి వాహనాలను బత్తలపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పరారైన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆరా తీశారు. ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించిన ముదిగుబ్బ, బత్తలపల్లి పోలీసులను అభినందించారు. దొంగలు అనంతపురానికి చెందిన వారుగా గుర్తించారు. ఓవర్టేక్ చేసి..అడ్డంగా నిలిపి పందుల దొంగల కోసం సినీ ఫక్కీలో వేట పులివెందుల నుంచి బత్తలపల్లి వరకు కొనసాగిన ఛేజింగ్ యజమాని సాహసం.. పోలీసుల చాకచక్యం ఏడుగురు దొంగల పరారీ.. ఒకరిని బంధించిన పోలీసులు -
తోపుదుర్తి సోదరుడి అక్రమ అరెస్ట్
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువకుడి ఆత్మహత్య కేసులో తోపుదుర్తి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో రైల్వే పీఎస్ నుంచి అనంతపురం రూరల్ పీఎస్కు కేసును బదిలీ చేశారు. తోపుదుర్తి రాజాపై 108 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.తోపుదుర్తి రాజాకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన్ని కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి ఇటీవల గన్మెన్లను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆయన సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి ప్రోద్భలంతోనే మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తోపుదుర్తి రాజాను ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. గుత్తి వద్ద కేకే ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. బోల్తాపడింది.ఆంధ్రప్రదేశ్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల నక్కపల్లి జాతీయపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, తిరుపతి జిల్లాలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పూతలపట్టు –నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో ఘటన జరిగింది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగింది. -
‘ప్రైవేట్ స్కూళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదు’
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రైవేట్ స్కూళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) నాయకులు వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలల నుంచి తప్పనిసరిగా టీసీలు తీసుకున్న తర్వాతే విద్యార్థుల బదిలీలు జరగాల్సి ఉందన్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల పేర్లను సంబంధిత యాజమాన్యాల అనుమతి లేకుండా ఆన్లైన్లో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించబడే అవకాశముందని తెలిపారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యా సంస్థలకు న్యాయం జరిగేలా చట్టపరంగానే వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో అపుస్మా రాష్ట్ర కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు నాయుడు, అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, ట్రెజరర్ శ్రీనాథ్, నాయకులు నాగరాజు, శశిభూషణ్, శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్ ఉన్నారు. -
కాగితాలకే ఖరీఫ్ విత్తన ప్రణాళిక
● బకాయిలు ఇవ్వకపోవడంతో మొదలుకాని విత్తనశుద్ధి ● రైతుల కోసం రూ.90 కోట్లు ఇవ్వని సీఎం చంద్రబాబు అనంతపురం అగ్రికల్చర్: కీలకమైన ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడానికి ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇటీవల జిల్లా అంతటా మోస్తరుగా తొలకరి వర్షాలు పలకరించాయి. దీంతో రైతులు పొలంబాట పట్టి సాగుకు సమాయత్తమతువున్నారు. వేసవి ఇంకా కొనసాగుతుండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు అండమాన్లో ఆగిపోయినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. నెలాఖరు లేదా జూన్ ఒకట్రెండు తేదీల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో వర్షాధారంగా 6.75 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి రానున్నాయి. అయితే ఖరీఫ్ విత్తన ప్రణాళిక, కార్యాచరణ కాగితాలకే పరిమితం కావడంతో ఈసారి కూడా రైతులకు విత్తనం సకాలంలో అందే పరిస్థితి కనిపించడం లేదు. విత్తన పంపిణీపై నిర్లక్ష్యం ఖరీఫ్ పంటల సాగు కోసం జిల్లాకు 56,423 క్వింటాళ్ల విత్తనం కేటాయించారు. అలాగే క్వింటా విత్తన వేరుశన పూర్తి ధర రూ.10,200కు పెంచేసి.. అందులో 40 శాతం రాయితీ పోను రైతులకు రూ.6,120 ప్రకారం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. సేకరించే బాధ్యతలు ఏపీ సీడ్స్ తీసుకోగా... విత్తనశుద్ధి చేసి సరఫరా చేయాలని అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న 24 ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు కూడా నిర్దేశించారు. అయితే గత ఖరీఫ్, రబీకి సంబంధించి విత్తనం సరఫరా, ప్రాసెసింగ్ బకాయిలు రూ.90 కోట్లు చెల్లిస్తే కానీ విత్తనశుద్ధి మొదలు పెట్టేది లేదని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. బకాయిల చెల్లింపు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. ● ఇటీవల కొందరు రైతులు మందుస్తు సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలపై నమ్మకం లేని రైతులు జూన్ మొదటి వారంలోనే వేరుశనగ, ఆముదం, కంది, పత్తి లాంటి పంటలు విత్తుకోవాలని భావిస్తున్నారు. అంతలోపు విత్తనం అందించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–నినో ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విత్తనం, పంటల ప్రణాళిక అమలు చేస్తామని చెబుతున్నా... ఇప్పటి వరకు ఎలాంటి సన్నాహక చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం. -
మూగజీవాల ఆకలిచావులు
అనంతపురం అగ్రికల్చర్: ప్రతి ఆదివారం అనంతపురంలోని మార్కెట్ యార్డులో పశువుల సంత జరుగుతుంది. జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు వస్తుంటారు. పెద్ద ఎత్తున పశువులు, గేదెలు, జీవాల క్రయవిక్రయాలు సాగుతుంటాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడానికి తోడు పంటల సాగు విస్తీర్ణం తగ్గి పశుగ్రాసం కొరత నెలకొంది. దీంతో బళ్లారి, కర్నూలు, నంద్యాల, కణేకల్లు ప్రాంతాల నుంచి వరిగడ్డి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నా చాలడం లేదంటున్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు గడ్డి, దాణా, టీఎంఆర్ సరఫరా చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆకలితో అలమటిస్తున్న పశువులను చూడలేక విక్రయానికి పెడుతున్నట్లు తెలిపారు. పట్టించుకునే వారేరి? ప్రతి వారమూ అనంతపురం మార్కెట్ యార్డు నుంచి కబేళాలకు పశువులు, గేదెలు, దున్నలు, ఎద్దులను తరలిస్తున్నారు. పెంచి పోషించిన పాడి ఆవులు, గేదెలను సైతం గడ్డి లేక అయినకాటికి అమ్ముకుంటున్న దుస్థితి నెలకొంది. వీటికి తోడు ఈసారి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు దాదాపు మూడు నెలల పాటు మండిపోవడంతో మనుషులతో పాటు పశుసంపద, ఇతర మూగజీవాలూ అలమటించాయి. తాగునీటికి కూడా చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడటంతో పశుసంపద, జీవ సంపద మనుగడ సమస్యగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 24న (ఆదివారం) సంతకు విక్రయానికి తెచ్చిన ఓ పశువు, గేదె చనిపోవడంతో రైతులు అక్కడే వదిలేసిపోయారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా... వెలుగు చూడకుండా అధికారులు తొక్కి పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పశువులు చనిపోయి రైతులకు నష్టం వాటిల్లుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మేత లేక భారమైన పశుపోషణ అయినకాటికి అమ్ముకునేందుకు సిద్ధమైన రైతులు ఈ లోపు ఆకలితో చనిపోతున్న పశువులువ్యవసాయాధారితమైన అనంతపురం జిల్లాలో మూగజీవాల ఆకలి చావులు హృదయవిదారకంగా మారాయి. వెలుగు చూస్తున్నవి కొన్నయితే.. వెలుగు చూడనవి మరిన్ని ఉంటున్నాయి. ఓ వైపు మండే ఎండల ప్రభావం కారణంగా దాహంతో అలమటిస్తున్న పశువులు, జీవాలు.. చివరకు మేత కరువై మృత్యువాత పడుతున్నాయి. -
కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రజల జీవనాడి భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ). రెండు నియోజకవర్గాలలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. కాలువ తవ్వకం కోసం బడ్జెట్లో ఒక్క పైసా కే
కళ్యాణదుర్గం: బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 93 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణం, ఎనిమిది లిఫ్ట్లు, ఎనిమిది సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇందుకోసం భూ సేకరణకు కాకుండా రూ.542 కోట్ల నిధులు అవసరం. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు నింపడానికి 1.7 టీఎంసీలు, భైరవాని తిప్ప ప్రాజెక్టుకు 2 టీఎంసీలను తరలించి ఆ ప్రాంత తాగు, సాగు నీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు లక్ష్యం. అంతా ప్రచార ఆర్భాటమే.. టీడీపీ ప్రభుత్వం బీటీపీ కాలువ నిర్మాణం పేరిట మొదటి నుంచి ఆర్భాటమే చేస్తూ వస్తోంది. 2018లో భూ సేకరణ చేయకుండానే హడావుడిగా ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అప్పట్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ తిరిగి కొలువుదీరింది. కాలువ పనులను దక్కించుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ సంస్థ మాత్రం పనులను పూర్తి చేయలేకపోయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ– స్టాంప్ కుంభకోణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనకు ఆ మరకలు అంటకుండా ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఆర్భాటంగా బీటీపీ కాలువ పనులు మొదలు పెట్టించారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా తన సొంత డబ్బుతో కాలువ పనులు పూర్తి చేస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అర్ధంతరంగా ఆగిన పనులు సొంతంగా కాలువ పూర్తి చేస్తానని చెప్పిన అమిలినేని మాటపై నిలబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ ఆయనకు చెందిన కాంట్రాక్టు సంస్థ ఎస్ఆర్సీ బీటీపీ కాలువ పనులను అర్ధంతరంగా ఆపేసింది. కాలువ పనుల కోసం కళ్యాణదుర్గం ప్రాంతానికి తీసుకువచ్చిన భారీ యంత్రాలను చంద్రబాబు మెప్పు కోసం కుప్పంకు నీటిని తీసుకెళ్లే పనుల నిమిత్తం తరలించినట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్లో బీటీపీ కాలువ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అసలు ఇంతకూ బీటీపీ కాలువ నిర్మాణం ఈ ప్రభుత్వ హయాంలో సాకారమవుతుందో లేదోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలువ కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం కింద రూ.128.85 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. రెండేళ్లయినా దీనిపై ఎటువంటి ప్రకటనా లేదు. రూ.208.8580రూ.భూసేకరణకు అవసరమైన నిధులు కోట్లు రూ.గత వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు అందించిన పరిహారం చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందించాల్సిన పరిహారం128.85ముందుకు కదలని బీటీపీ కాలువ పనులు నిధులు రాలేదంటూ పనులు ఆపేసిన ఎస్ఆర్సీ సొంతంగా పూర్తి చేస్తానని మాట తప్పిన ఎమ్మెల్యే అమిలినేని -
‘పరిష్కార వేదిక’లో వెల్లువలా అర్జీలు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. తమ మొర ఆలకించి పరిష్కరించండని ప్రజలు వేడుకున్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్రెడ్డి, మల్లికార్జునరెడ్డి ప్రజల నుంచి 596 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. ప్రతి అర్జీనీ పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో కొన్ని.. ● భార్యా పిల్లలు తనను ఇంటి నుంచి గెంటేసి.. పింఛన్ సొమ్ము లాగేసి.. తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని డి.హీరేహాళ్ మండలం సోమలాపురం గ్రామానికి చెందిన మహదేవప్ప అనే వృద్ధుడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో గోడు వెల్లబోసుకున్నాడు. ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ మండల ఎస్ఐతో మాట్లాడి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ● గ్యాంగ్రిన్ కారణంగా రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు కాళ్లు తొలగించారని, తనకు సొంత ఇల్లు, భూమి ఏదీ లేదని, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని తనకు పింఛన్ అందజేయాలని గుంతకల్లు మండలం పూలగుట్టపల్లికి చెందిన బండారు ఉసేన్ అర్జీ అందజేశాడు. ● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జి.ముత్యాలప్ప అధికారులకు అర్జీ అందజేశారు. బాధితులను కౌంటర్ కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, పునరావాస సహాయం సకాలంలో అందడం లేదని తెలిపారు. ● ఇంటిస్థలం మంజూరు చేయించాలని అనంతపురంలోని సునీత నగర్కు చెందిన దివ్యాంగుడు పసుపుల రఘు విన్నవించాడు. తనకు ముగురు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. సంపాదనలో సగం ఇంటి అద్దెకే కట్టాల్సి వస్తోందని పేర్కొన్నాడు. -
కాలువ పూర్తిపై శ్రద్ధేదీ?
సొంత డబ్బుతో బీటీపీ కాలువ తవ్వుతామని గొప్పలు చెప్పిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పనులు ఎందుకు ఆపేశాడు? ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రధాన రహదారులలో బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాడు. కళ్యాణి వైన్స్, బెల్టుషాపులపై ఉన్న మమకారం ఆయనకు కాలువ పూర్తి చేయడంపై లేదు. చంద్రబాబు మెప్పు కోసం కుప్పంలో పనులు చేస్తావు కానీ, నిన్ను గెలిపించిన ప్రజల కల సాకారం చేసే తీరిక లేదా అమిలినేని? అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా భూములిచ్చిన ఏ ఒక్క రైతుకై నా పరిహారం అందించావా..? – డాక్టర్ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం -
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్ సెక్షన్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.దిలీప్ కుమార్, ప్రొఫెసర్ టి.నారాయణరెడ్డి, ఎగ్జామినేషన్స్ ఇన్చార్జ్ కె.మాధవి, ప్రొఫెసర్ ఆర్.రాజశేఖర్, ప్రొఫెసర్ జయలక్ష్మి, డాక్టర్ కళ్యాణి రాధ తదితరులు పాల్గొన్నారు. -
మా స్థలాన్ని కానిస్టేబుల్ ఆక్రమించాడు
● ఎస్పీ ఎదుట వృద్ధుడి ఆవేదన అనంతపురం సెంట్రల్: తాము కొనుగోలు చేసిన స్థలాన్ని ఏఆర్ కానిస్టేబుల్ ఆక్రమించుకున్నాడని కళ్యాణదుర్గం మండలం కడదరకుంట గ్రామానికి చెందిన వృద్ధుడు సర్దానప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జగదీష్ను కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అనంతపురం రూరల్ మండలం పాపంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 27లో 5 సెంట్ల స్థలాన్ని 1971లో కొనుగోలు చేసినట్లు వివరించారు. సదరు స్థలాన్ని ఏఆర్కానిస్టేబుల్ ప్రసాద్, అతని బంధువు శ్రీరాములు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 140 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని జూమ్ కాన్ఫరెన్స్లో డివిజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ మహబూబ్బాషా, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. గ్యాస్ మిత్ర యాప్ను రూపొందించిన 14 ఏళ్ల బాలుడు అనంతపురం: గోరంట్లకు చెందిన శ్రీధర్, చందన దంపతుల కుమారుడు, 14 ఏళ్ల గంధం ధీరజ్.. పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే 8వ తరగతి అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో గ్యాస్ మిత్ర యాప్కు రూపకల్పన చేశాడు. సామాన్య ప్రజల్లో ఎల్పీజీ భద్రత, పొదుపు, సైబర్ మోసాలపై అవగాహన పెంపొందించేలా ఈ యాప్ను రూపొందించడం గమనార్హం. ఎల్పీజీ బుకింగ్ అర్హత కాలిక్యులేటర్, గ్యాస్ లీకేజీపై భద్రత సూచనలు, గ్యాస్ పొదుపు చిట్కాలు, డీఏసీ మోసాలపై 12 భారతీయ భాషలకు వాయిస్ సపోర్ట్ చేసేలా అందుబాటులోకి తెచ్చారు. యాప్ రూపకర్త ధీరజ్ను సోమవారం జేఎన్టీయూ (ఏ)లోని రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కార్యాలయంలో సీఈఓ డాక్టర్ ఆర్.హఫీజ్ బాషా అభినందించారు. సచివాలయంలో ల్యాప్టాప్ అపహరణ ● రికార్డుల కాల్చివేత ధర్మవరం అర్బన్: మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గ కేంద్రంలోని శివానగర్లో ఉన్న 5వ వార్డు సచివాలయంలో దుండగులు చొరబడి ల్యాప్టాప్ను అపహరించారు. పలు రికార్డులను కాల్చి వేశారు. సోమవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సచివాలయానికి చేరుకున్న ఉద్యోగులు తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాలో భద్రపరిచిన ల్యాప్టాప్ కనిపించలేదు. బూడిదగా మారిన రికార్డులను గమనించి సమాచారం ఇవ్వడంతో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా, ఇన్చార్జ్ డీఎస్పీ నర్శింగప్ప, టూ టౌన్ సీఐ రెడ్డప్ప, వన్టౌన్ ఎస్ఐ ఉమాదేవి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. -
అమ్మవారి వెండి ఆభరణాల అపహరణ
సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం : జేసీ అనంతపురం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంగా అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. అక్షరాంధ్ర ఫేజ్–2 కార్యక్రమం అమలు, లక్ష్యాలు, కార్యక్రమ షెడ్యూల్, యాప్ అనుసంధాన ప్రక్రియ, తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం జేసీ మాట్లాడారు. జిల్లాలో 1.34 లక్షల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చేలా లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించిందన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విజయ లక్ష్మి, డీపీఓ నాగరాజునాయుడు, ఎస్జీఎస్డబ్ల్యూ అధికారి నాసరరెడ్డి, డ్వామా పీడీ సలీమ్బాషా, వయోజన విద్యాశాఖ డీడీ వెంకటేశ్వర్లు, సీపీఓ అశోక్కుమార్, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఐసీడీఎస్ పీడీ శశికళ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మత్స్యశాఖ డీడీగా విజయకృష్ణఅనంతపురం అగ్రికల్చర్: మత్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు (డీడీ)గా ఎం.విజయకృష్ణ నియమితులయ్యారు. విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ ఏడీగా ఉన్న ఆయనకు పదోన్నతిపై జిల్లాకు బదిలీ చేస్తూ ఆ శాఖ కమిషనరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు మూడు రోజుల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్చార్జ్ డీడీగా శ్రీసత్యసాయి జిల్లా ఏడీ చంద్రశేఖర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. యాడికి: మండలంలోని కేశవరాయునిపేట సమీపంలో ఉన్న సుంకులమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దుండగులు చొరబడి అమ్మవారి మూలవిరాట్ను అలంకరించిన 40 తులాల వెండి కిరీటం, ఆభరణాలను అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి నారాయణమ్మ చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 40 కిలోల బరువైన వెండి ఆభరణాలను అపహరించికెళ్లినట్లుగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఆలయంలో చోరీ పెద్దవడుగూరు: మండలంలోని లక్ష్ముంపల్లిలో వెలసిన పెద్దమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి ప్రతిమ, 500 గ్రాముల వెండి గొడుగు, 5 గ్రాముల బంగారు తాళిబొట్లను అపహరించారు. ఉదయాన్నే గుడికి వెళ్లిన భక్తులు చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పూజారి గురుస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
30న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 30న స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమావేశ భవన్లో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ఒకటి నుంచి ఏడు వరకు స్థాయీ సంఘాల సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సూచించారు. రేపటి నుంచి కలెక్టర్ సెలవులోకి.. అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం నుంచి ఈ నెల 30 వరకు సెలవుపై వెళ్లనున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఇన్చార్జ్ కలెక్టర్గా వ్యవహరించనున్నారు. ప్రశాంతంగా టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,039 మంది విద్యార్థులకు గాను 3,161 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షకు 364 మందికి గాను 314 మంది, ఇంటర్ పరీక్షకు 298 మందికి గాను 252 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి అనంతపురం అర్బన్: జిల్లా రెవెన్యూ శాఖలో ఇద్దరు తహసీల్దార్లు ఎ.హరికుమార్, పి.విజయకుమారికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హరికుమార్ ప్రస్తుతం రాయదుర్గం తహసీల్దారుగా ఉన్నారు. విజయకుమారి రాప్తాడు తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చేంత వరకు వీరు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతారు. తాగునీటి ఇబ్బంది రాకూడదు ● కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు పూర్తి చేయాలి ● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: ప్రజలకు తాగునీటి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జూలై నెల వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటికి సంబంధించి రూ.50 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో పాటు మంజూరు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో, వసతిగృహాల్లో నీటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరైన 940 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాల్లో, గురుకుల పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణాల పనులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయాలు, తహసీల్దారు కార్యాలయాలు. అంగన్వాడీ కేంద్రాల్లో, బస్టాండు, తదితర అవసరమైన ప్రాంతాలు, మండల సమాఖ్యల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కె.శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నాగరాజు నాయుడు, డ్వామా పీడీ సలీంబాషా, డీఈ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నిధులు వంక పాలు
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కందుకూరు పంచాయతీ పరిధిలోని కృష్ణంరెడ్డిపల్లిలో వంకలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజలకు పెద్దగా ఉపయోగం లేని రహదారిని వంకలో నిర్మించడం వల్ల రైతుల జీవనోపాధికి తీరని నష్టం వాటిల్లుతుందని గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం కారణంగా గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు నీరు అందించే సహజ ప్రవాహం దెబ్బతింటుందన్నారు. భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేసినా... ఆదివారం రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా భారీ యంత్రాలతో పనులు కొనసాగించారని ఆరోపించారు. వెంటనే వంకలో రహదారి నిర్మాణాన్ని నిలిపివేసి, ఆ ప్రాంతంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి చెక్డ్యాం నిర్మించాలని నారాయణరెడ్డి, రామానాయుడు, సోమశేఖర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, లక్ష్మీ నాయుడు, హరీష్ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ
కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ మొదలైంది. అధికార టీడీపీ నేత అండదండలతో ఫీల్డ్ అసిస్టెంట్ మస్టర్లు మాయ చేసి.. కూలీల హాజరు అమాంతం పెంచేసి.. వచ్చిన కూలి సొమ్ము స్వాహా చేస్తుండటంపై ‘కూలీల సొమ్ముకు కన్నం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి డ్వామా పీడీ స్పందించి, విచారణకు ఆదేశించారు. సోమవారం కళ్యాణదుర్గం డివిజన్ ఏపీడీ రాజారావు గ్రామంలో పర్యటించారు. సచివాలయంలోకి కూలీలను పిలిపించి విచారణ చేశారు. అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. నాటకీయంగా ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో చోటు చేసుకొన్న అక్రమాలు వెలుగులోకి రావడంతో 43 ఉడేగోళం ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్కుమార్ సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను అంగీకరించాలంటూ ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఏపీఓ సుధాకర్కు లేఖ సమర్పించారు. సమగ్ర విచారణ చేస్తాం: ఏపీడీ 43 ఉడేగోళంలో ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకొన్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపడతామని కళ్యాణదుర్గం డివిజన్ ఏపీడీ రాజారావు పేర్కొన్నారు. గ్రామంలో కూలీలతో విచారణ చేపట్టిన అనంతరం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సెల్ఫోన్లో ముందుగానే తీసుకున్న ఫొటోలను సెల్ఫోన్పై మరో సెల్ఫోన్ కెమెరా ఆన్ చేసి ఫోటోలు తీసి అప్లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. ఎన్ఎంఎంఎస్ యాప్లో వారం రోజుల ఫోటోలు మాత్రమే ఉంటాయని, పూర్తిస్థాయిలో విచారణ చేయాలంటే బ్యాక్ ఫీడ్ అవసరమన్నారు. ప్రాథమిక విచారణ నివేదికను పీడీకి సమర్పిస్తామన్నారు. పక్కా ప్లాన్తోనే తప్పించారా? ఉపాధి పనుల మస్టర్ల తయారీలో మాయ చేశారు. కూలీల హాజరు, ఫొటోల అప్లోడ్లో అక్రమాలకు పాల్పడ్డారు. క్షేత్రస్థాయిలో టెక్నికల్ అసిస్టెంట్ కొలతలు వేసి.. పనులు ఎంతమేరకు జరిగాయో ఎం.బుక్కులో రికార్డు చేయాలి. ఆ వివరాల ప్రకారం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) పనులు పరిశీలన చేయాలి. అయితే ఎవ్వరూ పరిశీలన చేయడం కానీ, అక్రమాలు గుర్తించకుండా అంతా సవ్యంగా ఉన్నట్లు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ అక్రమాలన్నీ బహిర్గతం కావడంతో తమ మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు ఫీల్డ్ అసిస్టెంట్తో రాజీనామా చేయించి అధికారులు ముందుజాగ్రత్త పడినట్లు సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తప్పుకుంటే తాము కూడా సేఫ్ కావొచ్చని పక్కా ప్లాన్ వేశారని తెలుస్తోంది. 43 ఉడేగోళంలో విచారణ చేపట్టిన ఏపీడీ ముందుగా తీసుకున్న ఫొటోలే మళ్లీ మళ్లీ అప్లోడ్ మస్టర్లు, ఎం.బుక్ నమోదులో అన్నీ అవకతవకలే ఫీల్డ్ అసిస్టెంట్ రాజీనామా -
● ఇదెక్కడి ‘పచ్చ’పైత్యం?
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గ కేంద్రం ఉరవకొండలో ప్రజల ఆస్తిగా పరిగణించబడే ప్రభుత్వ కార్యాలయాలకు పచ్చరంగు వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి పూర్తిగా పచ్చ రంగు వేశారు. అలాగే చౌడేశ్వరీ కాలనీ సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్నీ పచ్చరంగుతో నింపేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే ఈ చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు వేయడాన్ని నివారించాలని 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం... ప్రభుత్వ కార్యాలయాలను పచ్చ రంగుతో నింపేయడం గమనార్హం. అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తోందని, దీనికన్నా టీడీపీ కార్యాలయమంటూ బోర్డులు పెట్టుకోవడం ఉత్తమమని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. -
పయ్యావుల.. నీ కుటుంబ చరిత్ర తెలుసుకో: విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, అనంతపురం: మంత్రి పయ్యావుల కేశవ్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి, సోదరుడి దారుణహత్య వెనుక మంత్రి పయ్యావుల కేశవ్ హస్తం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్ ముందుగా తన కుటుంబ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ఉరవకొండ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేసింది మంత్రి పయ్యావుల కేశవ్. దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబానిదే. పయ్యావుల కేశవ్ తాత, తండ్రి దుర్మార్గాలపై కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. పయ్యావుల ఆగడాలపై ఆందోళన చేపట్టిన నా తండ్రి రాకెట్ల నారాయణ రెడ్డి, సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలను దారుణంగా హత్య చేశారు.వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్న మంత్రి పయ్యావుల కేశవ్కు తన కుటుంబ చరిత్ర తెలుసా?. వైఎస్ జగన్ను విమర్శించే అర్హత మంత్రి పయ్యావుల కేశవ్కు లేదు. ఫ్యాక్షనిజానికి వైఎస్ జగన్ వ్యతిరేకం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పారదర్శకంగా ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి’ అని ఘాటు విమర్శలు చేశారు. -
నిమ్మ ధరలు పతనం
● 40 కిలోల బస్తా రూ.7 వేల నుంచి రూ.2వేలకు డౌన్ తాడిపత్రిటౌన్: ఆకాశాన్నంటిన నిమ్మ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. 40 కిలోల నిమ్మ బస్తా రూ.7 వేలు ఉండేది. పది రోజుల వ్యవధిలో రూ.2వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లో దాదాపు 2,500 ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ సాగులో ఉంది. దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. అయితే మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం కోత కోసిన కూలీలకు, ఆటో బాడుగలకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు రాకపోతే ట్యాంకరు నీరు రూ.700 చొప్పున వెచ్చించి చెట్లను కాపాడుకున్నారు. ఇప్పుడు మార్కెట్లో నిమ్మ ధరలు పతనం కావడంతో అప్పులు తీర్చేదారి కానరావడం లేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వమే కోరుతున్నారు. -
సామాజిక న్యాయానికి పాతర
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో ఉన్నతస్థాయి పదవుల భర్తీలో సామాజిక న్యాయానికి పాతర వేశారు. ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతికుమార్ పూర్తిస్థాయి వీసీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రిజిస్ట్రార్గా రిజర్వేషన్ కేటగిరీ వర్గాలకు కేటాయిస్తారని అందరూ భావించారు. ఇందు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన ఔత్సాహిక ప్రొఫెసర్లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే రిజిస్ట్రార్గా ఉన్న రమేష్బాబును మార్పు చేయకుండా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లే లేనట్లు నాన్ టీచింగ్ విభాగంలో రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్గా ఉన్న రమేష్బాబును ఎలా రిజిస్ట్రార్గా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా రిజిస్ట్రార్ పదవి రిజర్వేషన్ వర్గాలకు దక్కనీయకుండా సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇంతకుముందు రెక్టార్గా ప్రొఫెసర్ వెంకటనాయుడు ఉండేవారు. దీంతో వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్గా ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కొలువుదీరడంతో... ప్రొఫెసర్ వెంకటనాయుడు రెక్టార్ పదవికి రాజీనామా చేశారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ బి.అనితకు రెక్టార్ పదవిని అప్పగించారు. గతంలో పెద్దపీట గత వైఎస్సార్సీపీ హయాంలో ఎస్కేయూ కీలక పదవుల్లో ఎస్సీ, బీసీ కేటగిరి వర్గాలకు న్యాయం జరిగింది. అప్పట్లో వీసీగా రహంతుల్లా, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డిని నియమించారు. రహంతుల్లా రాజీనామా చేయడంతో ఇన్చార్జ్ వీసీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ అయిన అహ్మద్బాబుకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ జయరాజ్ను నియమించారు. ఆయన గుండెపోటుతో చనిపోయాక తిరిగి ఇన్చార్జ్ వీసీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మల్లికార్జునరెడ్డి రిజిస్ట్రార్గా రాజీనామా చేశారు. మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి వీసీగా నియమితులైన తరువాత రిజిస్ట్రార్గా బీసీ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ రమణ (కెమిస్ట్రీ)ను నియమించారు. అనంతరం బీసీ కేటగిరీకి చెందిన ప్రొఫెసర్ కృష్ణకుమారి, ఎస్సీ కేటగిరికి చెందిన ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య రిజిస్ట్రార్లుగా పనిచేశారు. ఆనాడు వీసీ ఓపెన్ కేటగిరీ వారు అయితే.. బీసీ, ఎస్సీ కేటగిరీ వర్గాలకు రిజిస్ట్రార్గా బాధ్యతలు అప్పగించారు. ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్గా ఒకే సామాజికవర్గం వారు రిజర్వేషన్ కేటగిరీలకు రిజిస్ట్రార్ పదవి అందని ద్రాక్షేనా? -
ప్రభుత్వ టీచర్లపై ‘అడ్మిషన్ల’ కత్తి
● రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తీవ్ర ఒత్తిళ్లు అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ల కోసం ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. విద్యాశాఖతో సంబంధం లేని మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, ఐసీడీఎస్ ఉద్యోగులను రంగంలోకి దింపి ‘టార్గెట్ అడ్మిషన్స్’ పేరుతో అధికార యంత్రాంగం ఊపిరాడకుండా చేస్తోందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ఏటా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ఆనవాయితీ. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిందని టీచర్లు చెబుతున్నారు. ప్రతి స్కూల్కూ టార్గెట్లు నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావాలంటూ రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ‘ఈరోజు మీ స్కూల్కు ప్రైవేట్ స్కూల్ నుంచి ఎంతమంది వచ్చారు?’ అంటూ ఆన్లైన్ లింకులు పంపి వివరాలు నమోదు చేయిస్తున్నారని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెబెక్స్లతో వేధింపులు ఉదయం గ్రామాల్లో తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చాక గంటల తరబడి వెబెక్స్లో సమీక్షలు చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. కలెక్టర్ నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారుల వరకు తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ‘ఎందుకు వెనుకబడ్డారు?’, ‘మీ టార్గెట్ ఎంత?’, ‘ఈరోజు ఎన్ని అడ్మిషన్లు?’ అయ్యాయంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని ఎంఈఓలు, హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు మీదపడిన ఉపాధ్యాయులు ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా, ఈస్థాయి ఒత్తిళ్లు మరింత మానసిక వేదనకు గురిచేస్తున్నాయని సహచరులు చెబుతున్నారు. కొంతమంది సెలవులపై వెళ్లిపోతుండగా, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న పలువురు వీఆర్ఎస్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇంత పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు కొనసాగుతున్నా, ప్రధానోపాధ్యాయుల సంఘం, ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదపకపోవడంపై సాధారణ టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘సంఘాల ఉనికి కోసం మాత్రమే నాయకత్వమా? ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడరా?’ అంటూ మండిపడుతున్నారు. -
తూకాల్లో మోసం
● కాటా నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ కళ్యాణదుర్గం రూరల్: తప్పుడు తూకాలతో రైతులను మోసం చేస్తున్న వ్యక్తి గుట్టు రట్టైంది. వివరాలు... కళ్యాణదుర్గం పట్టణం సమీపంలోని అక్కమాంబ కొండ దగ్గర బ్రహ్మసముద్రం మండలానికి చెందిన రామ్మూర్తి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తూ కాటా (వేబ్రిడ్జి) నిర్వహిస్తున్నాడు. అయితే వాహనాలు కాటా వేసే సమయంలో 15 శాతం వ్యత్యాసం వచ్చే విధంగా యంత్రాన్ని సెట్ చేశాడు. ఆదివారం గూబనపల్లికి చెందిన చీనీ రైతు ప్రతాప్ తమ పంటను లారీల్లో వేసుకుని కాటాకు వచ్చారు. కాటా వేసుకుని వెళ్లారు. తన లారీ సాధారణంగా 22.50 టన్నులు రావాలని, ఇక్కడ కాటా వేస్తే 20 టన్నులే రావడంతో అనుమానం వచ్చి మరోచోట కాటాను వేశాడు. అయితే అక్కడ 22.50 టన్నులు వచ్చింది. దీంతో రైతులు కాటా నిర్వాహకుడు రామ్మూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనకు ఏమీ తెలీదని, కాటా రిపేరీలో ఉందని సమాధానం ఇచ్చాడు. దీంతో రైతులు పట్టణ పోలీసుస్టేషన్కు వెళ్లి రామ్మూర్తిపై ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కాటా నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. అయితే.. గతంలోనే కాటా నిర్వాహకుడు రామ్మూర్తి మోసం బయట పడినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కేసు లేకుండా చేశారని రైతులు మండిపడ్డారు. రంగంలోకి టీడీపీ నేతలు కాటా నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే స్థానిక టీడీపీ బడా నేతలు రంగంలోకి దిగారు. కాటా నిర్వాహకుడిపై ఎలాంటి కేసు లేకుండా బయటకు తీసుకురావాలని, చిన్నపాటి కేసును నమోదు చేయాలని పోలీసులపైన ఒత్తిడి తెచ్చినట్లు రైతులు ఆరోపించారు. రైతులను మోసం చేసిన రామ్మూర్తిని కఠినంగా శిక్షించాలన్నారు. -
పిల్లలను విద్యావంతులను చేయండి
అనంతపురం టవర్క్లాక్: బలిజలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ పిల్లలను విద్యావంతులు చేయాలని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు తొండపునాటి శంకరయ్య అన్నారు. ఆదివారం స్థానిక శ్రీనివాసనగర్లోని బాలజీ కల్యాణ మంటపంలో రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. శంకరయ్య మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలిజ కులానికి చెందిన విద్యార్థులకు 20 ఏళ్లుగా ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. కష్టపడి, ఇష్టపడి చదివి మంచి ఉన్నతస్థాయికికి చేరుకోవాలని, తల్లిదండ్రులతో పాటు బలిజ జాతికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో దాదాపు 900 మంది విద్యారులు, వారి తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి, మాజీ అధ్యక్షుడు పామురాయి వెంకటేష్, వెంకటరాముడు, విజయ్ భాస్కర్, తొండపునాటి రమేష్, చలపతి, జీవీ రమణ, శివయ్య రంగనాయకులు, నగేష్, పవన్కుమార్, సూర్యనారాయణ, పద్మజ, మురళీకృష్ణ, గిరిధర్ ప్రసాద్, సాయి ప్రసాద్, కృష్ణమూర్తి, సత్యనారాయణ, నాగేంద్ర కుమార్, రవికుమార్, లెనిన్, రామకృష్ణ, అనిల్కుమార్, పెద్దన్న, మనోజ్కుమార్, పూల సుధాకర్, రామాంజి నేయులు, దండు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై అడవి పిల్లి దాడి
పుట్లూరు: చూడటానికి చిన్న సైజు చిరుతలా ఉండే అడవి పిల్లి అరటి తోటలో పనులు చేసుకుంటున్న వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటన మండలంలోని దోసలేడు గ్రామ సమీపంలోని మడుగుపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలు .. పుట్లూరు మండలం దోసలేడుకు చెందిన రామాంజినమ్మ అనే వృద్ధురాలు మరో మహిళతో కలిసి గ్రామ సమీపంలోని అరటి తోటలో కలుపుతీత పనులకు వెళ్లింది. వారు పనుల్లో నిమగ్నమైన సమయంలో విచిత్రమైన అరుపులతో పిల్లి ఒక్కసారిగా రామాంజినమ్మ మొహం, తల, చేతులపై దాడి చేసింది. భయబ్రాంతులకు గురైన కూలీలు కర్రలు తీసుకుని అడవి పిల్లిపై దాడి చేయడంతో చనిపోయింది. రామాంజినమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే
ఉరవకొండ: ‘ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలి. ప్రతి ఓటునూ కీలకంగా భావించాలి’ అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గోవర్ధన్రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీరశైవ కల్యాణ మండలపంలో నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశించే వారి పై కూటమి నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో పాటు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న శ్రీహరి, కొమ్మసాని, ప్రొఫెసర్ నాగేశ్వరావు లాంటి సీనియర్ జర్నలిస్టులపై కూడా కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అందురు సిద్ధం కావాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా టీడీపీ నేతలు కుట్ర పన్నే అవకాశం ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ సర్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తూ ఓట్లు తొలగించకుండా చూడాలన్నారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్రెడ్డి మాట్లాడుతూ సర్ కార్యక్రమం పై ఏమరపాటుగా ఉంటే సరిదిద్దుకొనే అవకాశం ఉండదని, ప్రతి బీఎల్ఎ జూన్ 15 నుంచి జూలై 15 వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క ఎలాంటి పొరపాట్లు చేసినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం సర్పై పార్టీ అబ్జర్వర్లు గోపీనాథ్యాదవ్, శివారెడ్డి స్క్రీన్ పై బీఎల్ఎలకు డెమో ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జోనల్ అధికార ప్రతినిధి బెస్త రమణ, ఎంపీపీలు దేవిబాయి, కరణం పుష్పవతి, నరసింహులు, త్రిలోక్నాథ్, ఏసీ ఎర్రిస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బసవరాజు, డిష్ సురేష్, ఓబన్న, కౌడిగి గోవిందు, ఎర్రిస్వామిరెడ్డి, గొట్కూరు మల్లికార్జున, మఠం వీరేష్, ఐదు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ, గోవర్ధన్రెడ్డి, ప్రణయ్రెడ్డి, సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ ఏజెంట్లు ఎస్ఆర్ఐపై అప్రమత్తత అవసరం అధికార పార్టీ నేతల కుట్రలు తిప్పికొట్టాలి బూత్ ఏజెంట్లకు వైఎస్సార్సీపీ నేతల దిశా నిర్దేశం -
‘అరసం’ రాష్ట అధ్యక్షుడిగా రాచపాలెం
అనంతపురం కల్చరల్: అరసం (అభ్యుదయ రచయితల సంఘం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈనెల 23, 24 తేదీల్లో తిరుపతిలో అరసం 20వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అరసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్కేయూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అనంత సాహితీక్షేత్రంలోనే దశాబ్దాలుగా స్థిరనివాసమేర్పరచుకున్న డాక్టర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డిని అరసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లాకు చెందిన సీనియర్ రచయితలు గుత్తా హరిసర్వోత్తమనాయుడు, ఈశ్వరరెడ్డి, వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి, తన్నీరు నాగేంద్రలకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. తిరుపతి మహాసభల్లో అనంత రచయితలు ద్విభాషా కవి డాక్టర్ జూటూరు షరీఫ్, చెట్ల ఈరన్న పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని పెద్ద కౌకుంట్లలో విద్యుదాఘాతంతో లక్ష్మి (35) మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాలమేరకు... ఆదివారం పెద్ద కౌకుంట్లలోని ఇంటి వద్ద ఉన్న మంచినీటి కుళాయి మోటారు ఆన్ చేసే క్రమంలో లక్ష్మి విద్యుదాఘాతానికి గురైందన్నారు. వెంటనే ఆమెను ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు చెప్పారన్నారు. మృతురాలికి భర్త కురుబ భీమిరెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యూరియా ద్రావణం తాగి 12 మేకల మృతి బెళుగుప్ప: మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన హెచ్.వన్నూరుస్వామికి చెందిన 12 మేకలు యూరియా ద్రావణం తాగి చనిపోయాయి. మరో 19 మేకలు అస్వస్తతకు గురయ్యాయి. వివరాలు... ఆదివారం గంగవరం సమీపంలోకి జీవాలను వన్నూరుస్వామి మేపునకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో అరటి తోట కోసం తొట్టెలో కలిపిన యూరియా ద్రావణాన్ని మేకలు తాగాయి. 12 మేకలు మృతి చెందగా... మరో 19 మేకలు అస్వస్తతకు గురయ్యాయి. మండల పశు వైద్యాధికారి మంజునాథ్కు సమాచారం అందించగా గ్రామ పశువైద్య సహాయకుడు మారుతి వెళ్లి అస్వస్థతకు గురైన మేకలకు చికిత్స అందించారు. మేకల మృతితో సుమారు రూ.2 లక్షల పైగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. గవిమఠం ఏజెంట్ రాజన్నగౌడ్ మృతి ఉరవకొండ: ఉరవకొండ గవిమఠం ఏజెంట్ పాటిల్ రాజన్నగౌడ్ (72) అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆదివారం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. 20 ఏళ్లుగా గవిమఠం ఏజెంట్గా పనిచేస్తూ ప్రస్తుత పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి సేవలందిస్తున్నారు. గవిమఠం పీఠాధిపతులు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, ఆదోని చోకి మఠం పీఠాధిపతులు కల్యాణస్వామీజీ, మఠం సిబ్బంది గోపి, నారాయణస్వామి, మధు తదితరులు రాజన్నగౌడ్ మృతికి సంతాపం తెలిపారు. యువకుడి ఆత్మహత్య తాడిపత్రి రూరల్: మండలంలోని భోగసముద్రం వద్ద ఉన్న సుగుణ స్వాన్ ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కార్తీక్రాయ్ (24) ఆదివారం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలమేరకు... ఉత్తరప్రదేశ్కు చెందిన కార్తీక్రాయ్కి వివాహం జరుగలేదు. ఏడాది కాలంగా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఎదురుగా ఉన్న కల్యాణ మండపం పైభాగంలో అద్దెకు ఉంటున్నాడు. డిప్రెషన్ కారణంగా కల్యాణ మండపం ఎదురుగా ఖాళీగా ఉన్న ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
● 34 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఉరవకొండ: స్థానిక ఎస్కే ప్రభుత్వ ఉన్నత జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ 1990–92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చదువులు చెప్పిన గురువులకు మేళాతాళలతో ఊరేగింపుగా కళాశాలకు తీసుకొచ్చారు. అనంతరం చదువుకున్న కళాశాలలో తమకున్న జ్ఞాపకాలను, యోగ క్షేమాలను ఒకరికొకరు తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులు వెంకటేశ్వర్లు, చలమారెడ్డి, సలామ్, ఇమామ్వలి తదితరులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. -
రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లోనూ..
కణేకల్లు : గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉన్నచోటే పనులు కల్పించి వలసలు నివారించాలని ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. పథకం అమలులో అవినీతి అక్రమాలు అరికట్టేందుకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చినా.. అందులోని లొసుగులను సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుని నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. కణేకల్లు మండలం 43 ఉడేగోళంలో భారీ ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక అంతవరకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి.. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని నియమించారు. ఇందులో భాగంగా ఉడేగోళంలో అనిల్కుమార్కు ఫీల్డ్ అసిస్టెంట్గా అవకాశం వచ్చింది. ప్రభుత్వ రంగంలో పారదర్శకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఇతను అక్రమార్జన కోసం వెంపర్లాడటం విమర్శలకు తావిస్తోంది. మీకు సగం.. నాకు సగం.. పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ కూలీలు 300 మంది దాకా ఉన్నారు. ఇందులో కూలి పనులపైనే ఆధారపడి జీవనం సాగించేవారు 150 నుంచి 160 మంది ఉన్నారు. మిగిలిన వారు ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు, కూలి పనులు చేయడానికి ఇష్టం లేనివారే. ఇలాంటి వారితో ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఒప్పందం చేసుకున్నాడు. పనికి వచ్చినట్టు రికార్డుల్లో రాసి.. కూలి డబ్బులు మంజూరు చేయిస్తానని, అందులో సగం మీరు తీసుకుని.. మిగతా సగం తనకు ఇస్తే చాలని ఆఫర్ ఇచ్చాడు. ఊరికే వస్తుంది కదా అని చాలామంది సరేనన్నారు. ఇంటి వద్దకే వెళ్లి ఫొటోలు 43 ఉడేగోళం హెచ్చెల్సీ ఆయకట్టు ప్రాంతం కావడంతో ఉపాధి హామీ పథకం కింద ఫీడర్ చానల్, ఫీల్డ్ చానల్లో పూడికతీత పనులు చేయిస్తుంటారు. రోజు కూలి పనిని బట్టి రూ.250 నుంచి గరిష్టంగా రూ.307 వస్తుంది. పని ప్రదేశం నుంచే కూలీల హాజరు నమోదు చేసి, ఫొటోలు యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. అయితే పనికి వచ్చిన కూలీలకు అక్కడికక్కడే ఫొటోలు తీస్తుండగా... పనికే రానివారి ఫొటోలను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఒకే ఫొటోను యాప్లో అప్లోడ్ చేసినా టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ, పీఓలు పట్టించుకోకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ తంతు సాగుతోంది. అవినీతి సొమ్ములో వాటాలు.. 43 ఉడేగోళంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.65లక్షలు, 2025–26లో రూ.58 లక్షలు, 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రూ.24.64 లక్షలు చెల్లింపులు చేశారు. పనులు చేయని కూలీల వద్ద నుంచి సగం సొమ్ము వసూలు చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో తనకు అండగా ఉన్న టీడీపీ నేత, మాజీ సర్పంచ్ లావణ్య భర్త అయిన పీవీ మారుతీ ప్రసాద్కు కొంత వాటా ఇస్తున్నట్లు తెలుస్తోంది. మస్టర్లలో ఫీల్డ్ అసిస్టెంట్ మాయాజాలం పనులకు రాకపోయినా వచ్చినట్టు నమోదు ప్రత్యేకంగా ఇళ్ల వద్దకే వెళ్లి ఫొటోలు అప్లోడ్ మంజూరైన కూలి సొమ్ములో సగం నొక్కుడు తనకు అండగా ఉన్న అధికార టీడీపీ నేతకూ మేత 43 ఉడేగోళంలో వెలుగుచూసిన ‘ఉపాధి’ అక్రమాలు ఇక్కడ కనిపిస్తున్న వారంతా కణేకల్లు మండలం 43 ఉడేగోళంలో ఈ నెల 12న ఉపాధి హామీ పనులు చేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ మస్టర్లో నమోదు చేశారు. వీరి ఫొటోలను ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేశారు. అయితే ఇందులో వృత్తంలో ఉన్న పీవీ మారుతీ ప్రసాద్ టీడీపీ నాయకుడు. లావణ్య ఆయన భార్య, మాజీ సర్పంచ్. ఆర్థిక స్థిరత్వం కలిగిన వీరు ఏనాడూ కూలి పనులు చేయలేదు. వీరికి ఆ అవసరం కూడా లేదని గ్రామప్రజలు అంటున్నారు. ఇలా వీరిద్దరే కాదు పనుల్లోకి ఏనాడూ రాని వారిని వందల సంఖ్యలో మస్టర్లలో చేర్చి.. కూలి సొమ్ము వచ్చాక అందులోంచి 50 శాతం దండుకుంటున్నట్లు తెలుస్తోంది. -
హనుమా.. భక్తుల కష్టాలు కనుమా..
గుంతకల్లు రూరల్: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో వసతి గదుల లేమి పట్టిపీడిస్తోంది. ఆలయంలో భక్తులకు అవసరమైన వసతి గదులు లేకపోవడం, అంతంత మాత్రంగా ఉన్న వసతి గదులు కాస్తా అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చిన వర్కర్లకే సరిపోతుండటంతో భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేటు అద్దె గదులకు భారీ మొత్తంలో ఖర్చుచేయలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆలయ ప్రాంగణంలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఏటా రూ.12.47 కోట్ల వార్షిక ఆదాయం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఏటా రూ.12.47 కోట్ల వార్షిక ఆదాయం కలిగి ఉంది. అయినా కూడా దేవస్థానంలో ముందునుంచి వసతి గదుల లేమి భక్తులను వెంటాడుతూనే ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఆలయంలో భక్తుల వసతి కోసం, లక్ష్మణ సదనంలో 39 రూములు (అద్దె రూ.50), కేసరి సదనంలో 28 అద్దె గదులు (అద్దె రూ.500), ఉండేవి. గంగా నిలయం ప్రాంగణంలో దాదాపు 12 కాటేజీలు ఉండేవి. రామదూత నిలయంలో 20 ఏసీ, నాన్ ఏసీ అద్దె గదులు (అద్దె రూ.1500) మాత్రమే ఉండేవి. అయితే 9 నెలల క్రితం ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టిన మేడేపల్లి విజయరాజు దాతల సహకారంతో ఆలయంలో నూతన గర్భాలయం, విమాన గోపురం, ముఖ మండపం, గోశాల, ప్రసాదాల తయారీశాల వంటి వాటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆలయంలో మాడ వీధుల ఏర్పాటులో భాగంగా అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న లక్ష్మణ సదనంలోని 39 అద్దె గదులను కూల్చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాక ఆ పనుల నిమిత్తం వచ్చిన వర్కర్లకు కేసరి సదనంలోని అద్దె గదులను, హోదా గల వారికి గంగా నిలయంలోని కాటేజెస్ను కేటాయించారు. దీంతో ప్రస్తుతం కేసరి సదనంలో 13 అద్దె గదులు, రామదూతలో ఉన్న 20 అద్దె గదులు మాత్రమే భక్తులకు కేటాయిస్తున్నారు. మంగళ, శనివారాల్లో వేలాదిగా భక్తులు మంగళ, శనివారాల్లో వేల సంఖ్యలో ఆలయానికి వచ్చే భక్తులకు ఉన్న అద్దె గదులు ఏమాత్రం సరిపోకపోవడంతో భక్తులు ఆలయ ముందు భాగంలో ఆరుబయటనే నిద్రించాల్సి వస్తుంది. అయితే శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మొదలైన వర్షం రాత్రంతా జల్లులతో కొనసాగడంతో భక్తులు షెడ్ల దగ్గరికి పరుగులు తీశారు. భక్తులు భారీ సంఖ్యలో ఉండటంతో పడుకోవడం మాట అటుంచితే కనీసం షెడ్ల కింద కూర్చోవడానికి కూడా స్థలం లేక నానా అవస్థలు పడ్డారు. త్వరలోనే వర్షాకాలం ప్రారంభమవుతుందని, అప్పుడు ఇంకెన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వసతి గదుల సముదాయం నిర్మాణం ఎన్నడో... ఆలయ అభివృద్ధిలో భాగంగా దాతల సహకారంతో వివిధ రకాల పనులను చేపడుతున్న ఆలయ అధికారులు రూ.17.60 కోట్ల అంచనా వ్యయంతో 107 వసతి గదులతో జీప్లస్టు సముదాయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అయితే అన్ని రకాల పనులు ప్రారంభం అయినప్పటికీ వసతి గదుల సముదాయ నిర్మాణం మాత్రం ఫ్లెక్సీలకే పరిమితమైంది. దీంతో భక్తుల కష్టాలు కొనసాగుతూనే వస్తున్నాయి. భక్తులకు అవసరమైన వసతులు సమకూరితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్న విషయం ప్రభుత్వానికి, అధికారులకు తెలియదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వసతి గదుల లేమితో ఆలయ ప్రాంగణంలోనే సేదదీరుతున్న భక్తులు కసాపురంలో వసతి గదుల లేమితో భక్తుల ఇక్కట్లు ఆలయ ప్రాంగణంలోనే నిద్ర ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అవస్థలు -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష అనంతపురంలో సజావుగా జరిగింది. అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. రెండు సెషన్లుగా ఏడు కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,514 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఉదయం సెషన్కు 1,658 మంది అభ్యర్థులు (66 శాతం) హాజరవగా 856 మంది (34 శాతం) గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం సెషన్కు 1,635 మంది అభ్యర్థులు (65 శాతం) హాజరుకాగా 879 మంది (35 శాతం) గైర్హాజరయ్యారు. రెండు సెషన్లూ కలిపి అభ్యర్థుల హాజరు 65.5 శాతం నమోదయ్యింది. యూపీఎస్సీ జిల్లా పరిశీలకులు గంధం చంద్రుడు, కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. ఆలస్యమై బాధతో వెనుదిరిగి.. యూపీఎస్సీ నిబంధన మేరకు ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని స్పష్టంగా చెప్పారు. ఆర్ట్స్ కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షకు మహబూబ్, చరిత్ర, మౌళి, హర్ష, కుమార్, నందకిషోర్, నరేష్, యువరాజ్, శ్రావణ్ (కర్నూలు), మరికొంత మంది అభ్యర్థులు తొమ్మిది గంటల తరువాత కేంద్రానికి చేరుకున్నారు. నిబంధన ప్రకారం వారిని లోనికి అనుమతించలేదు. ఇలాగే మిగతా ఆరు కేంద్రాల్లోనూ కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో లోనికి అనుమతించలేదు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల వద్ద అభ్యర్థుల సందడి... బయోమెట్రిక్ తీసుకుంటున్న సిబ్బంది -
బీ‘మాయ’.. రైతులకు ధీమా లేకపాయ
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినపుడు రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించేది పంటల బీమా. అటువంటి పథకాన్ని చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తం చేసేంది. అసలు బీమా పథకం అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా స్పష్టత ఇవ్వకుండా మాయ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఖరీఫ్, రబీకి సంబంధించి నాలుగు సీజన్లు ముగిసినా రైతుకు పైసా కూడా బీమా అందలేదు. ప్రీమియం చెల్లించినా.. రిక్తహస్తమే రాష్ట్రంలో పంటల బీమా పథకాలు 1999లో అమలులోకి వచ్చాయి. నిబంధనలు మారుతూ వస్తున్నా ఏటా బీమా పథకం మాత్రం అమలు చేస్తూ వచ్చారు. కానీ 2025 రబీలో తొలిసారిగా బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. అంతకు మునుపు 2025 ఖరీఫ్లో బీమా కోసం జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. 2024 రబీలో కూడా 35 వేల మంది పప్పుశనగ రైతులు ప్రీమియం చెల్లించారు. పంటలు దెబ్బతిన్న సమయంలో బీమా పరిహారం మాత్రం అందలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. ఇప్పుడు 2026 ఖరీఫ్ మొదలవుతుండగా పంటల బీమా పథకాలు ఉన్నాయా లేదా అనేది అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల పంపిణీలో ప్రీమియం కట్టాలా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో 18 పంటలకు బీమా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులపై పైసా భారం పడకుండా ప్రీమియం కూడా ప్రభుత్వమే భరించి నిబంధనల మేరకు బీమా కింద పరిహారం ఇస్తూ వచ్చారు. ఏటా ఖరీఫ్లో 12 రకాల పంటలు, రబీలో ఆరు రకాల పంటలకు అటు వాతావరణ బీమా, ఇటు ప్రధానమంత్రి ఫసల్బీమా పథకాలు వర్తింపజేశారు. ఈ–క్రాప్ ఆధారంగా నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసి నిబంధనలకు అనుగుణంగా నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా రైతులకు ఏకంగా రూ.1,882 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చారు. అందులో అనంతపురం జిల్లా రైతులకు రూ.1,160.19 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా రైతులకు రూ.722.61 కోట్ల బీమా పరిహారం జమ అయింది. రెండేళ్లుగా పంటల బీమా పరిహారం ఇవ్వని చంద్రబాబు సర్కారు ఉచితానికి మంగళం పాడేసి ప్రీమియం భారం మోపినా ప్రయోజనం నిల్ వైఎస్ జగన్ హయాంలో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.1,882 కోట్ల బీమా ప్రీమియం లేకుండా ఉచితంగా పంటల బీమా పథకాలతో అప్పట్లో రైతుల్లో ధీమా -
టైరు పేలి కారు బోల్తా
గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఇన్నోవా కారు టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా, ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఏఎస్ఐ నూర్ మహ్మద్ వివరాలమేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందిన మహమ్మద్ సిరాజ్ కుమారుడు లుక్మాన్ బీజాపూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో గ్రాడ్యుయేషన్ వేడుకకు కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. తిరిగి కారులో బెంగళూరు బయలుదేరారు. వన్నేదొడ్డి గ్రామ శివారు దగ్గర కారు ముందు టైరు ఒక్కసారిగా పేలింది. కారు అదుపు తప్పగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డుగా బోల్తా పడింది. ఘటనలో మహమ్మద్ సిరాజ్, అబ్దుల్ ఖాదర్, లుక్మాన్, జోహా, అర్షియా, ఆరిఫ్ బాష, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండటంతో అర్షియా, ఆరీఫ్ బాషాలను అనంతపురంకు తరలించి అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దెబ్బతిన్న కారు, తీవ్రంగా గాయపడిన అర్షియా, ఆరిఫ్ బాషా -
కళ్యాణదుర్గంలో పలువురి ఫోన్ల హ్యాక్
● డబ్బు పంపాలని బంధువులు, స్నేహితులకు మెసేజ్లు కళ్యాణదుర్గం రూరల్: పట్టణ పరిధిలో పలువురికి చెందిన ఫోన్లు ఆదివారం హ్యాక్కు గురయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది, దేవాదులకొండ గ్రామాలకు చెందిన పలువురి ఫోన్ల నుంచి ‘తాను ఆస్పత్రిలో ఉన్నానని, ఫోన్పే ద్వారా డబ్బు పంపండి’ అంటూ స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు వెళ్లాయి. వెంటనే సదరు వ్యక్తులు ఫోన్ చేసి నిజమా అని కనుక్కోవడంతో అలాంటిదేమీ లేదని, తమకు తెలియకుండానే తమ ఫోన్ నుంచి మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పడంతో హ్యాక్ విషయం బయటకు వచ్చింది. ఆందోళన చెందిన కొందరు వెంటనే తమ ఖాతాలో ఉన్న నగదును మరో ఖాతాకు జమచేశారు. అయితే హ్యక్ అయిన ఫోన్ల్లో నగదు పోయినట్లు ఎవరూ చెప్పలేదు. దీనిపై క్రైంబ్యాచ్ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా... నగదు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే సెల్ఫోన్లో అనవసరమైన లింక్లు, ఫైళ్లు ఓపెన్ చేయొద్దని ప్రజలకు సూచించారు. గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణ పోలీసులు ఆదివారం గంజాయి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టణానికి చెందిన సాయి, ఘోరా హాజీ నందలపాడులోని రైల్వే బ్రిడ్జ్ వద్ద దాదాపు కేజీన్నర గంజాయితో ఉండగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కథా రచయిత్రి బాల భారతమ్మ కన్నుమూత అనంతపురం కల్చరల్: అనంత సాహితీలోకంలో అందమైన కథలను వండివార్చిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త భాస్కర బాల భారతమ్మ (86) అనారోగ్య కారణాలతో విజయవాడలో కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి తీసుకొచ్చారు. అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, సాహితీప్రియులు ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. కేఎస్ఆర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్గా, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ విభాగం ఇన్చార్జ్గా, ఇంటర్మీడియెట్ బోర్డు మెంబర్గా పనిచేసిన భాస్కర బాల భారతమ్మ వేల సంఖ్యలో కవితలు, 120 కథలను రచించి ‘కవితా భూషణ్’ అవార్డు అందుకున్నారు. సొంతంగా మూడు స్కూళ్లను స్థాపించారు. బాల భారతమ్మ కుమార్తె రాధిక ప్రస్తుతం ఐపీఎస్ అధికారిణిగా సేవలందిస్తున్నారు. అనంత సాహిత్యానికి తీరని లోటు బాల భారతమ్మ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన కవియిత్రులు డాక్టర్ ప్రగతి, డాక్టర్ అనంత మాలతి, డాక్టర్ ప్రసూన, నిర్మలారాణి తదితరులు మాట్లాడుతూ అనేక హృద్యమైన కథా సంపుటాలతో, ఆలోచనాత్మకమైన వ్యాసాలతో అనంత సాహిత్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బాల భారతమ్మ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలోనూ ఎంతో మంది యువ రచయిత్రులకు స్ఫూర్తినింపారన్నారు. -
బీటెక్, ఎం ఫార్మసీ, బీబీఏ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీటెక్, ఎంఫార్మసీ, బీబీఏ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23), రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, బీటెక్ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, ఎం ఫార్మసీ ఒకటో సెమిస్టర్ (ఆర్–21) రెగ్యులర్, సప్లిమెంటరీ, రెండో సంవత్సరం (ఆర్–21) సప్లిమెంటరీ, బీబీఏ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు ప్రకటించారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ ఎస్.శారద, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలను జేఎన్టీయూ అనంతపురం వెబ్సైట్లో చూడాలని సూచించారు. విద్యార్థినికి ఎట్టకేలకు న్యాయం ● రీ వెరిఫికేషన్లో బయటపడిన ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం ● 88 నుంచి 95కి పెరిగిన మార్కులు అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థినికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన ఓ విద్యార్థినికి ఇంగ్లిష్ సబ్జెక్టులో 88 మార్కులు వచ్చాయి. అయితే బాగా రాసినా మార్కులు తక్కువ వచ్చాయని రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంది. అయితే రీ వెరిఫికేషన్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో విద్యార్థినికి రావాల్సిన అదనపు మార్కులు నమోదు కాకుండా పాత మార్కులనే కొనసాగిస్తూ ఆన్సర్షీట్ను పంపించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఈ నెల 18న ‘రీ వెరిఫికేషన్లోనూ నిర్లక్ష్యం’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనం చర్చనీయాంశమైంది. దీంతో ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ నాయక్ స్పందించారు. విద్యార్థిని నుంచి పూర్తి ఆధారాలతో రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించి, బోర్డు పరీక్షల విభాగ అధికారులతో స్వయంగా మాట్లాడి విచారణ చేపట్టారు. విద్యార్థినికి ఎక్కడెక్కడ మార్కులు పెరగాల్సి ఉందో పరిశీలించిన అనంతరం ఫిర్యాదును బోర్డుకు పంపించారు. చివరకు విద్యార్థినికి న్యాయం జరుగుతూ ఇంగ్లిష్ సబ్జెక్టులో 88 మార్కుల స్థానంలో 95 మార్కులు వేశారు. శనివారం సాయంత్రం బోర్డు అధికారులు విద్యార్థిని తండ్రికి సమాచారం అందించగా, మార్కుల జాబితా పరిశీలించిన తర్వాత 7 మార్కులు పెరిగిన విషయం స్పష్టమైంది. ఈ ఘటనతో ఇంటర్ బోర్డు మూల్యాంకన విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు మూల్యాంకనంలో తప్పులు, మరోవైపు రీ వెరిఫికేషన్లోనూ అదే నిర్లక్ష్యం కొనసాగడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నోటిఫికేషన్ విడుదలైంది
అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు గడువు ఉంది. ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. మా కళాశాలలో చదివిన పిల్లలు చాలా మంది ఉద్యోగాల్లో ఉన్నారు. కోర్సు పూర్తయిన తర్వాత కేవలం ఉద్యోగాలే కాకుండా అధునాతన వ్యవసాయం, డెయిరీ ఫాం, పాడి, ఎరువుల కంపెనీలు తదితర రంగాల్లో రాణించవచ్చు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చు. – డాక్టర్ వసుంధర, ప్రిన్సిపాల్, రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల -
‘హద్దులు’ దాటిన దందా
ఈ నెల 8న అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు రవాణా చేస్తున్న రెండు లారీలు సరిహద్దు చెక్పోస్టు వద్దకు వచ్చాయి. బియ్యం దందా కొనసాగిస్తున్న ఓ టీడీపీ నాయకుడు లారీ దిగి చెక్పొస్టు డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడి ‘మామూళ్లు’ ఇచ్చి దర్జాగా లారీలను కర్ణాటకకు తీసుకెళ్లారు. ఇలా నిత్యం వందలాది వాహనాలు సరిహద్దు చెక్పోస్టులు దాటుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉరవకొండ: కర్ణాటక సరిహద్దులోని చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు అడ్డాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా సరుకులు రవాణా చేసే వాహనాలను గుర్తించి, జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు, సిబ్బంది సొంత జేబులు నింపుకుంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దున ఉన్న విడపనకల్లు, డొనేకల్లు చెక్పోస్టుల్లో అక్రమాల దందా యథేచ్ఛగా సాగుతోంది. రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగానే గండిపడుతోంది. ప్రైవేట్ వ్యక్తులతో దందా.. చెక్పోస్టుల వద్ద డ్యూటీ కోసం రవాణా శాఖ సిబ్బంది పోటీ పడుతున్నారు. చెక్పోస్టుల వద్ద సిబ్బంది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏదైనా వాహనం సరిహద్దులో నుంచి లోపలికి రావాలన్నా.. బయటకు వెళ్లాలన్నా అధికారులకు ముడుపులు ఇవ్వాల్సిందేనన్న చర్చ జోరుగా సాగుతోంది. అక్రమ బియ్యం, ఇసుక, మట్టి, గంజాయి, కర్ణాటక, గోవా మద్యం తదితర వాహనాలు వస్తున్నాయంటే సదరు అధికారులు, సిబ్బందికి పండగే. ● ముందుగా నిబంధనలకు విరుద్ధంగా వచ్చే వాహనాలను తనిఖీ పేరుతో సిబ్బంది ఆపుతారు. ఆ వాహనాలను పక్కన నిలపాలని సూచిస్తారు. ఆ తరువాత అక్కడే ఉండే ప్రైవేట్ వ్యక్తులు సదరు వాహనం వద్దకు వచ్చి ‘బేరం’ మాట్లాడుతారు. రోజూ విడపనకల్లు, డొనేకల్లు చెక్పోస్టుల వద్ద అక్రమ రవాణా వాహనదారుల నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలా దాటించేస్తున్నారు.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటకకు వెళ్తున్నాయి. అలాగే కర్ణాటక, గోవా మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చేస్తున్నాయి. వీటిని సాఫీగా సరిహద్దు చెక్పోస్టులు దాటించే పనిని ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు చేస్తున్నారు. అక్రమార్కుల నుంచి వసూళ్లు చేసి.. కొంత చెక్పోస్టు సిబ్బందికి ఇచ్చి.. మిగిలింది జేబుల్లో వేసుకుని సరుకును సరిహద్దు దాటించేస్తున్నారు. హెవీ లోడు వాహనాలు (6, 10, 14, 16 టైర్లు) నిబంధనల ప్రకారం 10 నుంచి 35 టన్నుల వరకు సరుకులను రవాణా చేయొచ్చు. కానీ అందుకు విరుద్ధంగా లారీల్లో 5 నుంచి 20 టన్నుల అదనపు లోడుతో వెళ్తూ..వస్తున్నాయి. అలాగే పర్మిట్, ఫిట్నెస్ లేని వాహనాలు నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాహనదారులకు చెక్పోస్టు సిబ్బంది అధికారికంగా జరిమానా విధించకుండా ‘మామూళ్లు’ తీసుకుని పంపించేస్తున్నారు. ఏదో కొన్నింటికి మాత్రం నామమాత్రపు ఫైన్ వేసి రశీదులు ఇస్తున్నారు. గట్టి నిఘా ఉంచాం కర్ణాటక సరిహద్దు చెక్పోస్టులైన విడపనకల్లు, డొనేకల్లు చెక్పోస్టుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఉంచాం. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ముఖ్యంగా కర్ణాటక, గోవా మద్యం సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రామ్మోహన్రెడ్డి, ఈఎస్, ఎక్సైజ్శాఖ, అనంతపురం డ్యూటీల కోసం అధికారులు, సిబ్బంది పోటీ నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలే లక్ష్యం అక్రమ బియ్యం, ఇసుకతో పాటు కర్ణాటక, గోవా మద్యం సరఫరా విడపనకల్లు, డొనేకల్లు సరిహద్దు చెక్పోస్టుల్లో అక్రమ వసూళ్లు -
●మెటీరియల్ ఉన్నా.. అసంపూర్తిగానే
విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేశారు. అదనపు గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నాంది పలికారు. అయితే అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులు పూర్తి కావాల్సిన తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పెండింగ్లో ఉన్న 10 నుంచి 30 శాతం పనులు పూర్తి చేయని చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుక, కంకర, స్టీల్ తదితరాలు సమృద్ధిగా ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు. కనీసం ఈ ఏడాదైనా ఈ పనులు పూర్తి చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంఅనంతపురంలోని పొట్టి శ్రీరాములు స్కూల్లో వృథాగా పడేసిన ఇసుక, ఇటుకలు, శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో పెండింగ్లో ఉన్న భవనం పనులు -
తాగునీటి కోసం ఘర్షణ
గుత్తి: తాగునీటి కోసం మహిళల మధ్య ఘర్షణ జరిగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని బండగేరికి మూడు వారాలుగా తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో శనివారం కొళాయిలకు నీరు వదిలారు. అయితే పైప్లైన్ డ్యామేజీ కావడంతో తాగునీరు సక్రమంగా సరఫరా కాలేదు. ఇదే సమయంలో నీటిని పట్టుకునే విషయంలో మహిళల మధ్య ఘర్షణ జరిగింది. కాలనీ పెద్దలు సర్దిజెప్పడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. అయితే కాసేపటి తర్వాత మరోసారి ఇరువర్గాల వారు ఘర్షణ పడటంతో లక్ష్మీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
వైఎస్ జగన్తోనే మహిళా సాధికారత
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి అనంతపురం: మహిళా సాధికారితకు ఆద్యుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి కొనియాడారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మ ఒడి వంటి పథకాలతో మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. ప్రజాదరణ పొందిన జగన్ ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా నలుగురు బిడ్డల్ని కనండి.. రూ.30 వేలు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి తొలుత ఆయన ఇంటి నుంచే మొదలు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. సవాలక్ష నిబంధనలతో సీ్త్ర శక్తి పథకాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేశారన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో.. ఉన్న బస్సుల్లోనే మహిళలు ఇబ్బందికరంగా ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీని తొలి ఏడాది పూర్తిగా అమలు చేయలేదని, రెండో ఏడాదిలో సగం మందికి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. లోకేష్ యువగళంలో పేర్కొన్న నిరుద్యోగ భృతి పథకం ఊసేలేకుండా పోయిందన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలపై దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో యువత నాశనమైపోతోందన్నారు. కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి యాదవ్, రేవతి (తాడిపత్రి), దేవి, శోభారాణి, భారతి, అనూరాధ, అంజలి, హేమలత, మహేశ్వరి, చంద్రకళ, సుగుణమ్మ పాల్గొన్నారు. -
పారిశుధ్యం మరింత మెరుగుపడాలి
● కలెక్టర్ ఓ.ఆనంద్ గుంతకల్లు టౌన్: పారిశుధ్యం మరింత మెరుగుపడాలని గుంతకల్లు మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. శనివారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన స్థానిక హనుమేష్నగర్, గంగానగర్ కాలనీల్లో పర్యటించారు. జనవాసాల మధ్యన ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ ఖాళీ స్థలాల యజమానులందరికీ నోటీసులు జారీ చేసి చెత్తాచెదారాన్ని, కంపచెట్లను తొలగించుకుని స్థలాలను శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నోటీసులకు స్పందించకపోతే జరిమానా విధించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని శానిటేషన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, ఏఈ హరికృష్ణ తదితరులు ఉన్నారు. శుభ్రం చేయడంతోనే ఆడుకుంటున్నాం హనుమేష్నగర్లో పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతూ చిన్నారులు కలెక్టర్ను ఆకట్టుకున్నారు. దీంతో ఆయన కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. ఎండలో ఆడొద్దని సూచించడంతో... ‘ఈ రోజు ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించారని, అందుకే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నామ్ సార్’ అని పిల్లలు పేర్కొనగానే అధికారులు గట్టిగా నవ్వారు. అనంతరం ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. -
ఆదరణ పొందుతున్న అగ్రి కోర్సులు
● తక్కువ ఫీజులకే వ్యవసాయ విద్య బుక్కరాయసముద్రం: తక్కువ ఖర్చుతో విశేష ఆదరణ ఉన్న వ్యవసాయ విద్యను అభ్యసించడం ద్వారా త్వరగా ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. 10 తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తర్వాత ఇంటర్ చేసి డిగ్రీలు, పీజీ, బీఈడీ, బీటెక్ కోర్సులంటూ చదివి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేకంటే వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. 2 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే మరో 2 ఏళ్లలో ఉద్యోగాలు పొందడానికి చాలా మార్గాలున్నాయని నిపుణులు అంటున్నారు. జిల్లాలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. అదే విధంగా మడకశిరలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. వీటితో పాటు అనంతపురం, కదిరి, తాడిపత్రి పట్టణాలలో ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం, బాలికలకు 33 శాతం సీట్లు, అంగవైకల్యం కలిగిన వారికి 3 శాతం సీట్లు కేటాయించారు. మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. కావలసిన విద్యార్హతలు అగ్రికల్చర్ కోర్సులు చదవడానికి పెద్ద విద్యా అర్హతలతో పని లేదు. వీటిలో ప్రవేశానికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ ద్వారా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తారు. వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఇప్పటికే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హర్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తులను www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా అందజేయాలి. పూర్తి సమాచారం వెబ్సైట్లో పొందుపరిచారు. -
గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎస్ఆర్ఐటీ విద్యార్థి
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) కళాశాలకు చెందిన విద్యార్థి ముఖేష్చౌదరి.. గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ పోగ్రాం–2026కు ఎంపియ్యాడు. ఈ మేరకు ఆ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి శనివారం వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు గూగుల్ నిర్వహించిన కఠనమైన స్కీనింగ్, వీడియో కాన్ఫిరెన్స్ రౌండ్లలో ముఖేష్ చౌదరి అత్యంత ప్రతిభ కనబరిచారన్నారు. ఈ పోగ్రాం ద్వారా ఏఐ సాంకేతిక పరిజ్ఞానమైన జెమినీ టూల్స్ను తోటి విద్యార్థులకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాడన్నారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి ఎస్ఆర్ఐటీ కళాశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతిభ కనబచిరిన విద్యార్థిని ఆలూరి సాంబశివారెడ్డి, కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, ఐఐఐ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్కుమార్ యాదవ్, సీఎస్ఈ ఎఐఎంఎల్ విభాగ అధిపతి చిత్ర లింగప్ప, అధ్యాపకులు అభినందించారు. అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్ తాడిపత్రి రూరల్: జల్సాలు తీర్చుకునేందుకు ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి యూజీపీఎస్ ఎస్ఐ ధరణి బాబు తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో తాడిపత్రిలోని నంద్యాల మార్గంలో నివాసముంటున్న పూల మహబూబ్ బాషా, ఆంజనేయ స్వామి మాన్యంలో నివాసముంటున్న పందికోన ఈరన్న, శ్రీనివాసపురం నివాసి మణిపటి శివప్రసాద్ ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు తొలుత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ద్విచక్రవాహనాన్ని అపహరించారు. రెండోసారి అనంతపురంలో, చివరిగా తాడిపత్రి పట్టణంలో ద్విచక్ర వాహనాలను అపహరించి, తక్కువ ధరకు విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకున్నారు. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో శనివారం ఉదయం తాడిపత్రిలోని కాఫీబార్లో నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బైక్లు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి మోటర్సైకిళ్లను రికవరీ చేశారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. గోవా మద్యం తరలిస్తూ పట్టుబడిన అనంత వాసులు ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న రెండు సెల్ఫోన్లు, రెండు కార్లతో సహా అనంతపురం జిల్లాకు చెందిన ఇరువురిని అరెస్ట్ చేశారు. వివరాలను ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్, నందిండ్ల బాషా ఉన్నారు. రెండు కార్లలో 750 ఎంఎల్ కలిగిన 480 గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారు సీట్లను తొలగించి మద్యం సీసాల కేసులను అమర్చినట్లుగా గుర్తించారు. గోవా మద్యం అక్రమ రవాణాకు సంబంధించి గతంలో నందిండ్ల బాషాపై ప్రొద్దుటూరు రూరల్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పీఎస్ల్లో కేసులు నమోదయ్యాయి. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించనున్నట్లు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రితో భేటీ గుంతకల్లు: రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను శనివారంకలెక్టర్ ఓ. ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, నాయకులు శ్రీదేవి, అంజి, వడ్డే రమేష్, షేకన్న, కొలిమి రామాంజనేయులు, హరినాధ్, విజయలక్ష్మి, పురంధర్ తదితరులు బండి సంజయ్ను కలిసి పుష్పాగుచ్చాలు అందజేశారు. గుంతకల్లు–చిక్జాజూర్ ప్యాసింజర్ రైలు రద్దు రాయదుర్గం టౌన్: ఈ నెల 24, 25, 30, 31 తేదీల్లో రాయదుర్గం మీదుగా రాకపోకలకు సాగించే గుంతకల్లు–చిక్జాజూర్ ప్యాసింజర్ రైలును (57415/57416) రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఉద్యోగాల కల్పనే మోదీ ధ్యేయం గుంతకల్లు: దేశంలోని యువతకు అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ధ్యేయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. శనివారం గుంతకల్లు రైల్వే క్లబ్లో జరిగిన రోజ్ గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 120 మంది యువతకు బండి సంజయ్తోపాటు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా నియామక పత్రాలు అందజేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా 47 కేంద్రాల్లో రోజ్గార్ మేళాలను నిర్వహించి దాదాపు 51వేల మందికి పైగా యువతీ యువకులకు ఉద్యోగ నియామక ప్రతాలు అందజేశామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద శక్తిగా ఎదగడానికి 2047 వికత్ భారత్ లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారన్నారు. డీఆర్ఎం గుప్తా మాట్లాడుతూ రోజ్గార్ మేళా ద్వారా 93 మంది అసిస్టెంట్ లోకోపైలట్లు, రైల్వేలో కాంపాషనేట్ గ్రౌండ్ కింద మరో 13 మంది, పోస్టల్ సర్వీస్ కింద 9 మంది, బ్యాంక్ ఆఫ్ బరోడాకు నలుగురు, సివిల్ ఏవియేషన్ శాఖలో ఒకరు చొప్పున ఉద్యోగాలు పొందారని వివరించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శివప్రసాద్, డీపీఓ హెచ్ఎల్ఎన్ ప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే వాల్మీకులకు గుర్తింపు
● వాల్మీకి ప్రతిభా పురస్కారాల ప్రదానంలో వక్తలు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే వాల్మీకులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.సి.అక్కులప్ప అధ్యక్షతన శనివారం స్థానిక వాల్మీకి భవన్లో పది, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కాలవ శ్రీనివాసులుతో పాటు జెడ్పీచైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ హాజరై, మాట్లాడారు. విద్యాపరంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల్లోని వాల్మీకి విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందేలా సమాజంలోని విద్యావంతులు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు విద్యార్థులు కష్టపడే తత్వంతో పాటు ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్యా, ఉద్యోగ పథకాలను, స్కాలర్షిప్లను వాల్మీకి యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేష్, గుమ్మనూరు నారాయణస్వామి, పామిడి వీరా, కుంటిమద్ది రంగయ్య, అపెక్స్ తిరుపాలు, ముత్యాలు, డాక్టర్ శంకరనారాయణ, వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ. చైతన్యకుమార్, ట్రెజరర్ జి. పవన్ కుమార్, డాక్టర్ నివేదిత పాల్గొన్నారు. -
బల్లా పదవికి ఎసరు!
అనంతపురం అగ్రికల్చర్: అధికార తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. తన ఆశీస్సులతో అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ పదవిని అలంకరించిన బల్లా పల్లవి.. ఇప్పుడు తన మాటనే బేఖాతరు చేస్తుండటాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస ఘటనలతో ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను పదవి నుంచి దించేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బల్లా పల్లవి ఈ ఏడాది జనవరి 8న చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె బాధ్యతలు చేపట్టకమునుపే ఎమ్మెల్యే సమీప బంధువులు మార్కెట్యార్డులో ఉన్న వేబ్రిడ్జి నిర్వహణను ఐదేళ్ల పాటు వ్యూహాత్మకంగా దక్కించుకున్నారు. చైర్పర్సన్ అయ్యాక వేబ్రిడ్జి నిర్వహణ బాధ్యతల నుంచి ఎమ్మెల్యే అనుచర వర్గాలను తప్పించేందుకు బల్లా పల్లవి, ఆమె భర్త బల్లా సురేష్ ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం సాగింది. అలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ● మార్కెట్ యార్డులో నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యేను కాదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సహకారం తీసుకోవడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గీయులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటికి తెలిసింది. వీటికి తోడు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ హర్షదుల్లాతో పాటు డైరెక్టర్లకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని కొందరు డైరెక్టర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దారిలోకి రాలేదని.. కుర్చీ దింపేందుకు..! తన మాటకు గౌరవం ఇవ్వని చైర్పర్సన్ పల్లవిని దింపేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా డైరెక్టర్లను తనవద్దకు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. బల్లా పల్లవికి వ్యతిరేకంగా శనివారం నాటికి 10 మంది డైరెక్టర్ల నుంచి సంతకాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్తో పాటు 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. మొత్తం 13 మందిలో ఓ పార్టీకి చెందిన ఇరువురు డైరెక్టర్లు సంతకాలు చేయలేదని, మరో పార్టీకి చెందిన ఓ డైరెక్టర్తో పాటు తొమ్మిది మంది టీడీపీ డైరెక్టర్లు ఇప్పటికే సంతకాలు చేశారని తెలుస్తోంది. మరొక డైరెక్టర్ గురించి ఇంకా తెలియరాలేదు. చైర్పర్సన్ బల్లా పల్లవి వద్దంటూ సంతకాలు చేసిన ఆ లేఖలను టీడీపీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు రేపోమాపో పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎత్తులు ఫలించేనా..? ఎమ్మెల్యే దగ్గుపాటి ఎత్తులను ముందుగానే పసిగట్టిన మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్తో పాటు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసివచ్చినట్లు ఆ పార్టీలోని నేతలే చెబుతున్నారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రి ఆశీస్సులు కూడా పల్లవి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఎత్తులు పారుతాయా..? లేక చైర్పర్సన్ పదవిని బల్లా కాపాడుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ యార్డు చైర్పర్సన్ పల్లవిని పదవి నుంచి దించేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రయత్నం డైరెక్టర్ల సంతకాలతో టీడీపీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు సిద్ధం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయాలు -
ఎస్కేయూలో పలు పదవుల భర్తీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా పలు పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రమేష్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సీడీసీ డీన్గా డి.ప్రభాకర్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్గా ఎంవీ లక్ష్మయ్య, ఫార్మాసూటికల్స్ డైరెక్టర్గా సి.సురేష్కుమార్, యూజీసీ డీన్గా జి.నరసింహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా జీవీ రమణ, అడిషనల్ వార్డెన్ (మెన్) ఎన్ఆర్ సదాశివారెడ్డి, అడిషనల్ వార్డెన్ (ఉమెన్) జె.ఖేజియారాణి, ఉమెన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్గా ఎస్.అనిత (బయోటెక్నాలజీ), డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ను దాశరథి రవీంద్ర, పీఆర్వోగా డాక్టర్ మాధవికు అప్పగించారు. ఉత్సాహంగా జాతీయ స్థాయి రాతి దూలం పోటీలు పెద్దవడుగూరు: మండలంలోని ఆవులాంపల్లిలో జాతీయ స్థాయి వృషభాల బల ప్రదర్శన మూడో రోజు సీనియర్ విభాగం పోటీలు హోరాహోరీగా సాగాయి. 11 జతల వృషభాలు పోటీలో పాల్గొనగా తెలంగాణలోని హుజునగర్కు చెందిన రైతు సుంకి సురేంద్రరెడ్డి ఎస్ఎస్ఆర్ బుల్స్ ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్కే బుల్స్, తృతీయ స్థానంలో హైదరాబాద్లోని ప్రగతి రీస్టార్ట్ బుల్స్, నాల్గో స్థానంలో అనంతపురం జిల్లా చౌటపల్లి రైతు ఓబుళరెడ్డి, అక్కంపల్లి ఇంద్రారెడ్డి వృషభాలు, ఐదో స్థానంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్కే బుల్స్, ఆరో స్థానంలో అనంతపురం జిల్లా రేగడికొత్తూరు ఆలగనురు గౌతమిరెడ్డి వృషభాలు, ఏడో స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ వృషభాలు, ఎనిమిదో సాఓ్థనంలో పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి రైతు తోట తిరుపాల్రెడ్డి వృషభాలు, కామాలాపురం ఆదిల్కు చెందిన వృషభాలు, తొమ్మిదో స్థానంలో వైఎస్సార్ జిల్లా కల్లూరు శివకృష్ణయాదవ్ వృషబాలు నిలిచాయి. విజేతలకు ఎస్ఐ ఆంజనేయులు, నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే ఆవులాంపల్లి చుట్టు ప్రక్కల గ్రామాల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు డోజర్ రమేష్రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. -
బూదగవి చెరువును తోడేస్తున్నారు
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి పార్టీలకు చెందిన కొందరు నాయకులు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా హంద్రీ–నీవా కాలువ సమీపంలోని మట్టి, పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని కొండలు ధ్వంసం చేసి రాళ్లను దోపిడీ చేశారు. ప్రైవేట్ వెంచర్లకు, కాంట్రాక్టర్లకు విక్రయించుకుని రూ.లక్షల్లో పోగేసుకున్నారు. తాజాగా ఉరవకొండ మండలంలోని బూదగవి చెరువుపై కూటమిలోని ఓ పార్టీ నేత సోదరుడు కన్నేశాడు. చెరువు సమీపంలోనే ఈయనకు పొలం ఉంది. ఇంకేముంది రెండు రోజుల క్రితం ఐదు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో చెరువులో మట్టి తవ్వకాలు – అక్రమ రవాణా సాగిస్తున్నాడు. అదీ రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సాగుతోంది. అడ్డుకునేవారే లేరా..? బూదగవి చెరువు 92 ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షాధారంతోనే చెరువు నిండాలి. చెరువు నిండితే ఆయకట్టు పరిధిలోని 60 ఎకరాల్లో వరి, వేరుశనగ తదితర పంటలు సాగవుతాయి. సమీపంలో భూగర్భజలాలూ పెంపొందుతాయి. సాధారణంగా ఉపాధి హామీ కింద చెరువు పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తారు. చెరువులో తీసిన పూడిక సారవంతమైనది. సమీపంలోని రైతుల పొలాలకు ఉచితంగా తోలుతారు. త్వరలో జలధార కింద పనులు చేయాలని అధికారులు భావిస్తుండగా.. కూటమిలోని ఓ పార్టీ నేత సోదరుడు చెరువులోకి దౌర్జన్యంగా ప్రవేశించి మట్టి తవ్వకాలు చేపట్టాడు. ఏకంగా యంత్రాలను తీసుకొచ్చి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు ఎకరాలు తవ్వేశాడు. ఇలాగే వదిలేస్తే త్వరలోనే చెరువు గుల్లవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలతో తవ్వడం నేరం బూదగవి చెరువులో యంత్రాలతో మట్టిని తవ్వి తరలించడం నేరం. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి.. మట్టి తరలింపు ఆపేయాలని సూచించాం. చెరువు మట్టిని యంత్రాలతో తవ్వి అక్రమంగా సరఫరా చేయడం సరైనది కాదు. బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. – రవిప్రసాద్, ఎంపీడీఓ 5 జేసీబీలు, 20 ట్రాక్టర్లతో అక్రమ తవ్వకాలు సొమ్ము చేసుకుంటున్న కూటమి నేత సోదరుడు సహజ వనరుల దోపిడీ నేరమని తెలిసినా చర్యలు శూన్యం -
‘ఆప్టా’ నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) జిల్లా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతపురంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్రావు అధ్యక్షతన శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కె. వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా సి. గోపాలరెడ్డితో పాటు ఆర్థిక కార్యదర్శిగా బీఏ శంకరమూర్తి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా కేవీ ప్రభాకరరెడ్డి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శిగా కె.నారాయణ, ఉపాధ్యక్షులుగా ఐదుగురిని, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఏడుగురిని, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నలుగురిని ఎన్నుకున్నారు. నాయకులు శివానంద, మస్తాన్ వలి, కుళ్లాయప్ప, సూర్యనారాయణ, శ్రీనివాసులు, కోటేశ్వరరాజు, శిజ, రామకృష్ణ, మల్లారెడ్డి, కె.నాగేంద్ర పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తాం
గుమ్మఘట్ట: రెవెన్యూ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలకు పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. రాయదుర్గం మండలం 74ఉడేగోళం గ్రామంలోని ఆర్టీటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ఒక నెల ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని తెలిపారు. రాబోయే 15 నుంచి 20 నెలల్లో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిద్దిడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాలో రీ సర్వే పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన గ్రామాల్లో సంవత్సరంలోగా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో ఎడారి ఛాయలు అలుముకున్నాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఉంతకల్లు రిజర్వాయర్ను నిర్మిస్తే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. వేదావతి హగరిలో భూగర్భజలాలు తగ్గిపోకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో 36 అర్జీలను స్వీకరించినట్లు తహసీల్దార్ హరికుమార్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆర్డీఓ వసంతబాబు, మండల అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అక్రమాలపై చర్యలు అనంతపురం అర్బన్: మైనింగ్ అక్రమాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర ఎకై ్సజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మైనింగ్, ఎకై ్సజ్ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాటుసారా, మద్యం అక్రమ రవాణా, దుకాణాల సమయాలు, ఎంఆర్పీ విషయంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. ఉచిత ఇసుక పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పామన్నారు. ఇసుక పాలసీ అమలులో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు నామ మాత్ర రుసుముతో అందిస్తున్నామన్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ కార్యక్రమం జరుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో రామగిరి ప్రాంతంలోనూ గనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో కలర్ గ్రానైట్ సమస్యలు పరిష్కరించి, కర్ణాటకతో ఉన్న రాయల్టీ వివాదాలను పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో రెండు రేర్ ఎర్త్ మినరల్స్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మద్యం దుకాణాల్లో అన్ని రకాల బ్రాండ్లనూ అందుబాటులోకి తెచ్చామన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆర్టీసీ జోనల్ మేనేజర్ పూల నాగరాజు, డీఆర్ఓ మలోల, అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థి డీబార్ అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షలో కాపీలు కొడుతూ ఓ విద్యార్థి డీబార్ అయ్యాడు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6,657 మందికి గాను 6,360 మంది హాజరయ్యారు. 296 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 665 మందికి గాను 641 మంది హాజరై, 24 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విద్యార్థులు 2,214 మందికి గాను 2,036 మంది హాజరుకాగా, 178 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 176 మందికి గాను 163 మంది హాజరై, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో భాగంగా కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఆరు పరీక్షా కేంద్రాలు తనిఖీ చేయగా, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి ఎస్వీఎస్ గురవయ్య శెట్టి ఆరు కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఆరు కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు ఎనిమిది కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థిని మాల్ప్రాక్టీస్ కింద అధికారులు బుక్ చేశారు. -
పల్లెకు వెలుగు కరువు
అధికారుల లెక్కలు.. సామాన్యులకు చుక్కలు అనంతపురం క్రైం: తెల్లవారితే పట్టణాలకు ఉపాధి కోసం, చదవుల కోసం వచ్చే పేదల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఆర్టీసీ పేదలకు చుక్కలు చూపిస్తోంది. సకాలంలో పల్లెకు బస్సులు నడవక, నడిచినా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల చివరి దాకా వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు పెరిగారనో, అడిగేవారెవరనో కారణాలు ఏవైనా కావచ్చు తిరగాల్సిన కిలోమీటర్లకన్నా తక్కువగా బస్సులను తిప్పుతున్నారు. అలాగే పలు డిపోల పరిధిలో భారీ స్థాయిలో బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. 986 కిలో మీటర్లు కట్.. జిల్లా వ్యాప్తంగా రోజు మొత్తంలో దాదాపుగా 3,094 కిలో మీటర్ల మేర బస్సులు తిరగాల్సి ఉంది. అయితే 2,108 కి.మీ మాత్రమే బస్సులు తిప్పుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఆధారమైన పల్లె వెలుగు సర్వీసులే అధికంగా ప్రభావితమవడంతో గ్రామీణులు పడరాని పాట్లు పడుతున్నారు. పల్లె వాసుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పల్లె వెలుగు బస్సెక్కడ అనే పరిస్థితులు దాపురించాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని తెలిపే రెండు, మూడు డిపోల పరిధిలో తిరిగిన బస్సుల మొత్తం కిలో మీటర్ల పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గుంతకల్లు డిపోకు చెందిన ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ గుంతకల్లు – అనంతపురం మార్గంలో 492 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అయితే అందులో 164 కిలోమీటర్లు రద్దయ్యాయి. అలాగే తాడిపత్రి డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులు తాడిపత్రి – గుత్తి మార్గంలో ఒక్కోటి 114 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కళ్యాణదుర్గం – నంద్యాల మధ్య నడిచే ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్లో 456 కిలోమీటర్లలో 216 కిలోమీటర్లు రద్దయ్యాయి. ఉరవకొండ డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులు కూడా భారీగా ప్రభావితమయ్యాయి. అనంతపురం – పులకుంట మార్గంలో నడిచే సర్వీస్ కూడా కొంత మేర రద్దయింది. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, రోజువారీ కూలీలు ఈ సర్వీసులపై ఆధారపడుతుండగా... ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ రవాణా కోసం ప్రజలు అధిక ఖర్చుతో పాటు ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్టీసీ తన సేవలను పల్లెలకు విస్తరించలేకపోతోంది. ప్రధానంగా కిలో మీటర్ల మేర రద్దయిన బస్సుల్లో ఎక్కువ శాతం గ్రామీణ మార్గాలుండటం విచారకరం. లాభదాయక మార్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్లే సర్వీసులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు ఉన్న బస్సులు కూడా సిబ్బంది కొరత, డ్రైవర్లు–కండక్టర్ల లోటు, బస్సుల్లో సాంకేతిక సమస్యలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాల వల్ల తరచూ సర్వీసులు రద్దవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సర్వీసులు నిలిపేస్తుండటంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రజా రవాణాను బలోపేతం చేస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒక రోజులోనే దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర సర్వీసులు రద్దు కావడం చిన్న విషయం కాదని రవాణా నిపుణులు అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం, పాడైన బస్సులను మరమ్మతు చేయించడం, గ్రామీణ మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లాభదాయక రూట్లపైనే ఆర్టీసీ అధికారుల దృష్టి గ్రామాలను గాలికి వదిలేసిన వైనం అనంతపురం రీజియన్లో రోజూ దాదాపు 986 కి.మీ మేర బస్సు సర్వీసుల రద్దు తీవ్ర ఇబ్బందుల్లో గ్రామీణ ప్రజలు -
ప్రేమ పేరుతో బాలికలపై అత్యాచారం?!
● పోలీసుల అదుపులో నిందితులు తాడిపత్రిటౌన్: సెల్ఫోన్, టీవీలను చూస్తూ ప్రేమకు ఆకర్షితులై అభం శుభం తెలియని బాలికలు కేటుగాళ్ల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. శుక్రవారం తాడిపత్రి పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. తాడిపత్రి పట్టణం సంజీవనగర్కు చెందిన 8వ తరగతి విద్యార్థినిని అదే కాలనీకి చెందిన 10వ తరగతి చదివి మానేసిన బాలుడు ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో పాటు బాలికతో దాదాపు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు ఇప్పించుకొని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి జల్సా చేశారు. అలాగే టైలర్స్ కాలనీకి చెందిన మరో 8వ తరగతి విద్యార్థినిని.. ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ప్రేమ పేరుతో వంచించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక నుంచి దాదాపు 6 తులాలు బంగారు ఆభరణాలు ఇప్పించుకొని ఇంటికి ఏసీ, తల్లిదండ్రులకు విలువైన సెల్ఫోన్లను కొనిచ్చినట్లు తెలిసింది. అయితే ఇంట్లోని బంగారం మాయం కావడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు బాలికలను గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. విషయాన్ని బాలికల తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితులతో పాటు వారి స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గుట్టుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. సెల్ఫోన్ చూస్తూ కానరాని లోకాలకు... ● నీటి సంపులో పడి యువకుడి మృతి బ్రహ్మసముద్రం: నీటి సంప్లో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పిల్లలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు... మండల పరిధిలోని పిల్లలపల్లికి చెందిన మాల మల్లన్న నూతనంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. వారింట్లో టైల్స్, గ్రానైట్ బండలు వేసే పనికి అనంతపురం నుంచి యువకులు వచ్చారు. వారిలో అనంతపురంలోని చంద్రబాబునగర్కు చెందిన మహ్మద్ గౌస్ (25) కూడా ఉన్నాడు. గురువారం రాత్రి మహ్మద్ గౌస్ సెల్ఫోన్ చూసుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నించే గొంతును నొక్కడమే...
● నారా లోకేష్ మౌఖిక ఆదేశాలతోనే గన్మెన్లను తొలగించారు ● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసుకున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్కు తనపై తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. అనంతపురం పరిసర ప్రాంతాల్లో తిరగనీయకుండా కట్టడి చేయాలనే కుట్ర జరిగిందని ఆరోపించారు. లోకేష్ మౌఖిక ఆదేశాలతోనే ఎస్పీ కార్యాలయం ఎలాంటి నోటీసూ లేకుండా తనకు గన్మెన్లను తొలగించిందని విమర్శించారు. రాప్తాడు అరాచకాలపై గళమెత్తా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన హత్యలు, దళిత బాలికపై అత్యాచారం, భూవివాదాలు, ఇసుక దోపిడీ, టమాట మార్కెట్లో అక్రమ వసూళ్లు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం వంటి అంశాలపై తాను గళమెత్తానని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్, పేరూరు డ్యాంలో నీరు లేక రైతుల బోర్లు ఎండిపోవడం వంటి అంశాల్లో కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపానన్నారు. రాప్తాడులో జరుగుతున్న అన్యాయాలపై కూడా స్పందించాలని లోకేష్ను కోరారు. ప్రజలే నాకు రక్షణ ‘నా ప్రాణానికి ముప్పు ఉందని భావించి పదేళ్లుగా గన్మెన్లను కొనసాగించిన అధికారులు, ఇప్పుడు ఒక్కసారిగా తొలగించడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. గన్మెన్లు లేకపోయినా ప్రజలే నాకు రక్షణ’ అని ప్రకాష్రెడ్డి అన్నారు.పాపంపేటలో ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం ‘పాపంపేటలో ఇళ్లన్నీ కూల్చేస్తామని ఇటీవల ఎవడో ఒకడు అక్కడికి వచ్చి అన్నాడంట. వాడి తల నేలకూల్చుతాం తప్ప ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం’ అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి స్పష్టం చేశారు. 1991, 1997 మధ్యనే 106, 119 సర్వే నంబర్లలోని భూములను పూర్తిగా శోత్రియంధారులకు స్వాధీనం చేసిందన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించి తెచ్చుకున్న ఆర్డర్తో ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ భూములు స్వాధీనం చేసుకుని అప్పట్లోనే అమ్ముకున్నారన్నారు. 30 ఏళ్ల తర్వాత తాను వారసుడినని ఒకడు వచ్చాడన్నారు. గత ప్రభుత్వంలో కోర్టు నుంచి జడ్జిమెంట్ వస్తే... ప్రజల తరఫున వెళ్లి అప్పటి కలెక్టర్ నాగలక్ష్మిని కలిశానన్నారు. జడ్జిమెంట్ పట్టణానికి సంబంధించిన సర్వే నంబరుదని, సదరు వ్యక్తి అధికారికంగా వారసుడు కాదని, వారు పేర్కొన్న భూములన్నీ 1990–97 మధ్యే స్వాధీనం చేసినట్లు ఆధారాలతో కలెక్టర్ కోర్టుకు సమర్పించడంతో జడ్జి దీన్ని పక్కన పెట్టారన్నారు. ప్రభుత్వం మారాక హైకోర్టు పీపీని లోబరుచుకుని ప్రభుత్వాన్ని నమ్మించి, ఇక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో 14 ఇళ్లను కూల్చివేయించారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, బండి వపన్, నీరుగంటి నారాయణరెడ్డి, పాపంపేట ప్రసాద్రెడ్డి, ఈశ్వరయ్య, ఎంపీటీసీలు వెంకటేశులు, సందీప్యాదవ్, పాపంపేట భూముల బాధితులు పాల్గొన్నారు. -
‘పోలీస్’ ప్రక్షాళన చేసేదెప్పుడో?
అనంతపురం సెంట్రల్: అనంతపురం నగరంలోని పోలీసుస్టేషన్లలో పాలన పూర్తిగా గాడి తప్పింది. త్రీటౌన్, నాల్గవ పట్టణ, రూరల్ పోలీసుస్టేషన్లకు సీఐలు లేకపోవడం.. మిగతా స్టేషన్లను పట్టించుకునే వారు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలలు దాటిపోయినా ఆయా స్టేషన్లకు ఎస్హెచ్ఓల నియామకం జరగకపోవడంపై ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న పరిస్థితిపై సామాన్య ప్రజలే కాదు.. పోలీసు సిబ్బంది కూడా నిట్టూరుస్తున్నారు. ● నెలరోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హనీట్రాప్ వ్యవహారం పోలీసు శాఖకు మాయని మచ్చ తీసుకొచ్చింది. కొంతమంది ముఠాలుగా ఏర్పడి అమాయకులకు వల వేసి రూ.లక్షలు దోచుకోవడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉండడంపై దుమారం రేగింది. సీరియస్గా పరిగణించిన అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి కఠిన చర్యలు తీసుకున్నారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, ముగ్గురు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించగా, అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్, రూరల్ సీఐ శేఖర్ను వీఆర్కు పంపించారు. ఎస్ఐ రాంబాబు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగిన దాదాపు నెలన్నర రోజులు పూర్తయింది. కొరవడిన పర్యవేక్షణ హనీట్రాప్ వ్యవహారంలో పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాత ఆయా స్టేషన్లకు తాత్కాలికంగా ఇన్చార్జ్ సీఐలను నియమించినా వారు అంటీముట్టనట్లుగా పనిచేస్తున్నారు. అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు త్వరలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో రెండు,మూడు నెలలుగా ఆయన స్టేషన్లపై పెద్దగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. అసలు డీఎస్పీ ఉన్నారా? లేక పోస్టు ఖాళీగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కువశాతం ఆయన సెలవులు, ఇతర ప్రాంతాల పర్యటనల్లోనే గడుపుతున్నారు. సీఐలు లేని పోలీసుస్టేషన్లే కాదు ఉన్న స్టేషన్లలో కూడా పాలన అస్తవ్యస్తంగా తయారవుతోంది. పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలేవీ బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. ఎక్కువశాతం పంచాయితీలతోనే సెటిల్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అస్తవ్యస్తంగా నగర పోలీసు స్టేషన్లు నెలరోజులు దాటినా చేపట్టని సీఐల నియామకం మూడు, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లలో దయనీయం ఉద్యోగ విరమణ మూడ్లో అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు పోలీసు స్టేషన్లపై కొరవడిన పర్యవేక్షణ -
●తాగునీటి కోసం మహిళల నిరసన
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. తాజాగా శుక్రవారం పట్టణంలోని మొలకాల్మూరు రహదారిపై మహిళలు, కాలనీవాసులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వారం రోజులవుతున్నా నీరు సరఫరా చేయకపోతే నీటి అవసరాలు ఎలా తీరుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
బంధువును పరామర్శించి వస్తూ పరలోకాలకు..
● లారీ ఢీ కొనడంతో మహిళ మృతి రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో అక్కమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్ల ముందే భార్యను కోల్పోయాడో భర్త. పోలీసుల వివరాలమేరకు... బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్లకు చెందిన నాగవేణి (36), రామచంద్ర దంపతులు సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులను చదివిస్తూ జీవనం సాగిస్తున్నారు. బంధువుకు తేలు కుట్టడంతో అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి దంపతులు పరామర్శించేందుకు వెళ్లారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. అనంతపురం నగరం దాటిన తర్వాత అక్కమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బైకును బలంగా ఢీకొంది. వెనుక కూర్చున్న నాగవేణి రోడ్డుపై పడిపోయింది. అంతలోనే లారీ ఆమైపె నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మృతదేహాన్ని చూసి రామచంద్ర కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనం ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదం ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. -
‘స్పాట్ బిల్లింగ్’ టెండర్లు పిలిచేవారేరీ?
అనంతపురం టౌన్: నెలవారీ విద్యుత్ వినియోగాన్ని బట్టి బిల్లులు ఇచ్చే స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టు గడువు ముగిసినా కొత్త కాంట్రాక్టులకు టెండర్లు పిలవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇద్దరే కాంట్రాక్టర్లు స్పాట్ బిల్లింగ్ టెండర్లు దక్కించుకున్నారు. మార్చి నెలకు టెండర్ గడువు ముగిసింది. అయితే అధికారులు కొత్తగా టెండర్లు పిలవకుండా పాత వారికే నెలనెలా పొడిగిస్తూ వస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు విద్యుత్ డివిజన్ల పరిధిలో దాదాపు 16 లక్షలకు పైగా సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. వీటిని 24 సబ్ డివిజన్లుగా విభజించి.. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టుకు టెండర్లు పిలవాల్సి ఉంది. నిబంధనలు పాటించని అధికారులు స్పాట్ బిల్లింగ్ టెండర్ల విధానంలో విద్యుత్శాఖ అధికారులు నిబంధనలు పాటించడంలేదు. టెండర్ల గడువు ముగిసిన వెంటనే టెండర్లు పిలవకుండా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పాతవారినే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ‘చిన్న బాస్’గా పిలిచే ఓ మంత్రితో విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి గతంలో టెండర్లు పొందారు. 413 మందిపైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొంటే అందరినీ పక్కన పెట్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 24సబ్ డివిజన్లను వీరికే కట్టబెట్టారు. టెండర్లు దక్కించుకున్న నాటి నుంచి నేటి వరకు విద్యుత్ సంస్థకు సక్రమంగా డిపాజిట్లు సైతం చెల్లించలేదని తెలుస్తోంది. అలాంటి కాంట్రాక్టర్లనే కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రతి నెలా రూ.90 లక్షలకు పైగా బిల్లులు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు బిల్లింగ్ రీడర్లకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. జీతాలు అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నా విద్యుత్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి స్పాట్ బిల్లింగ్కు టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంది. ఆదేశాలు రాగానే టెండర్లు పిలుస్తాం ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి ఆదేశాలు రాగానే స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టుకు సంబంధించి టెండర్లు పిలుస్తాం. ప్రస్తుతం బిల్లింగ్ ఆలస్యమతుందనే ఉద్దేశంతోనే నెల నెలా పొడిగించుకుంటూ వస్తున్నాం. వినియోగదారులకు సకాలంలో విద్యుత్ బిల్లులు ఇచ్చే బాధ్యత మాపై ఉంది. – శేషాద్రిశేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ గడువు ముగిసి రెండు నెలలు పూర్తి పాత కాంట్రాక్టర్లకే ప్రతి నెలా పొడిగింపు బిల్లు రీడర్లకు సకాలంలో వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్లు -
టార్గెట్ల కోసం తంటాలు
● ప్రభుత్వ బడుల అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ స్కూళ్లపై ఒత్తిళ్లు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలంటూ సర్కారు ఆదేశించడంతో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఉన్నతాధికారులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. కలెక్టర్ ఆనంద్ స్వయంగా రంగంలోకి దిగి రోజూ టెలీకాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ అడ్మిషన్ల పురోగతిపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ అడ్మిషన్లు ఉన్న మండలాల అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను బలవంతంగా ప్రభుత్వ బడులకు బదిలీ చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల జోలికి వెళ్లకుండా.. ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించి, ‘సీ’ గ్రేడు స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఒకటో తరగతి అడ్మిషన్లు తప్ప ఇతర తరగతుల విద్యార్థుల బదిలీల విషయంలో యూడైస్లో ప్రత్యేక ప్రక్రియ ఉందని అధికారులు చెబుతున్నా.. వాస్తవంలో టీసీలు లేకుండానే విద్యార్థుల పేర్లు ఆన్లైన్ నుంచి తొలగిస్తామంటూ ఎంఈఓలు సమావేశాలు, వాట్సాప్ ద్వారా సూచనలు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డబ్ల్యూపీ నంబరు 9606/2021 కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన మెమో ప్రకారం టీసీలు తీసుకోకుండా విద్యార్థుల పేర్లు తొలగించకూడదని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గుర్తు చేస్తున్నాయి. అనుమతి లేకుండా ఆన్లైన్లో పేర్లు తొలగించడం కోర్టు ధిక్కారమేనని హెచ్చరిస్తున్నాయి. కాగా శుక్రవారం నాటికి జిల్లాలో 762 మంది విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల సమ్మతి, సరైన విధానం పాటిస్తే తమకు అభ్యంతరం లేదని, కానీ బలవంతపు బదిలీలు మాత్రం అంగీకరించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. -
గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి
శెట్టూరు: మండలంలోని ఎర్రబోరేపల్లికి చెందిన గొల్ల నాగేంద్ర కుమారుడు శ్రీకాంత్ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకోంది. గ్రామస్తుల వివరాలమేరకు.. గ్రామ సమీపంలోని నల్లకొండ ప్రాంతంలోకి శ్రీకాంత్ గొర్రెలను మేపు కోసం తీసుకెళ్లాడు. అదే సమయంలో పొదల చాటున దాగి ఉన్న ఎలుగుబంటి శ్రీకాంత్పై ఒక్కసారిగా దాడిచేసి గాయపర్చింది. చుట్టు పక్కల రైతులు గమనించి ఎలుగుబంటిని తరిమివేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సుధాకర్రెడ్డి అనంతపురం: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగమైన పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎం. సుధాకర్రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎం.సుధాకర్రెడ్డికి కీలకమైన పదవి దక్కడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు. గంజాయి విక్రేత అరెస్టు గుత్తి: పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన తపిల రఘు అనే గంజాయి విక్రేత, మట్కా బీటరును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 1,10,000 నగదుతో పాటు 50 గ్రాముల గంజాయి, మట్కా చీటీలు, బాల్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ గతంలో కొందరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశామన్నారు. అయితే తపిల రఘుతో పాటు మరో ఇద్దరు పరారయ్యారన్నారు. వారిలో తపిల రఘును అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. హోరాహోరీగా రాతిదూలం పోటీలు పెద్దవడుగూరు: మండల పరిధిలోని ఆవులాంపల్లిలో శుక్రవారం జాతీయస్థాయి ఒంగోలు జాతి వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. రెండవరోజు న్యూ కేటగిరి విభాగంలో వృషభాల పోటీలు ప్రారంభం కాగా పోటీల్లో 17 జతలు పాల్గొన్నాయి. హోరా హోరీగా జరిగిన పోటీలో మొదటిస్థానంలో కడప జిల్లా చౌటపల్లె మూర్థల చంద్ర ఓబుళరెడ్డి, రెండో స్థానంలో పల్నాడు జిల్లా ఇర్లపాడు మంగు రమాదేవి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా ఏ.నారాయణపురంకు చెందిన షేక్ మహ్మద్ ఫరీద్ ఎద్దులు నిలిచాయి. వారికి వరుసగా రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు నగదు బహుమతులను అందజేశారు. -
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
యల్లనూరు: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీడీ చెన్నకేశవులు హెచ్చరించారు. యల్లనూరు మండలవ్యాప్తంగా ఉపాధి పనుల్లో సాగుతున్న అక్రమాలపై ‘దోచెయ్.. వాటాలేసెయ్’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై కలెక్టర్ ఆనంద్ ఆరా తీశారు. ఈ క్రమంలో ఏపీడీ చెన్నకేశవులు హుటాహుటిన యల్లనూరు చేరుకుని ఎంపీడీఓ కరుణసాగర్, ఏపీఓ ఓబిరెడ్డి, ఈసీ సత్యమూర్తి, టెక్నికల్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బినామీ పేర్లు రాస్తే మస్టరు రద్దు చేస్తామని హెచ్చరించారు.కూలీల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. పీడీ సలీంబాషా దృష్టికి తీసుకెళ్లి ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. టీబీ డ్యాంకు ఇన్ఫ్లో బొమ్మనహాళ్: కర్ణాటక రాష్ట్రంలో హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో ప్రారంభమైంది. డ్యాం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీరు వచ్చి చేరుతోంది. బుధవారం 515 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 9.730 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,633 అడుగులకు గాను 1,588.38 అడుగులకు నీటి మట్టం చేరింది. ● తొలకర్ల కోసం రైతన్న ఎదురుచూపు ● వానల్లేక వేసవి దుక్కులు చేసుకోలేని దుస్థితి అనంతపురం అగ్రికల్చర్: వర్ష‘మే’ లేకుండా పోయింది. ఖరీఫ్కు సన్నద్ధం కావడానికి రైతుకు ఇబ్బందిగా మారింది. మేలో సాధారణంగా 36.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా కేవలం 11.5 మి.మీ కురిసింది. పెద్దపప్పూరు, రాప్తాడులో మాత్రమే సాధారణం కన్నా కాస్త అధికంగా వర్షం పడింది. 15 మండలాల్లో తుంపర్లు పడగా మిగతా 15 మండలాల్లో చినుకు రాలలేదు. జూన్ నుంచి 2026 ఖరీఫ్ మొదలు కానుంది. ముంగారు వ్యవసాయానికి పొలాలు దక్కులు చేసుకోవాల్సిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవిలో కురిసే వర్షాలకు లోతుగా దుక్కులు చేసుకోవడం, గత ఖరీఫ్ పంట అవశేషాలు తొలగించుకుని ఖరీఫ్కు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మునుపెన్నడూ లేనంతగా 42 నుంచి 44 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రెండు నెలలకు పైగా ‘అనంత’ వేడెక్కిపోయింది. వరుణుడి జాడ మాత్రం కనిపించడం లేదు. 10 రోజుల్లో ముంగారు వ్యవసాయం మొదలు కానుండగా... తొలకరి చినుకు కోసం అన్నదాత ఎదురుచూస్తున్నాడు. 15 ఏళ్లలో మొదటిసారి.. మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీగా అంచనా వేసినా అంతకు మించి వర్షాలు పడుతూ వస్తున్నాయి. 15 ఏళ్లుగా మేలో సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడటంతో పంట పొలాలు దుక్కులు చేసుకుని సాగుకు వెసులుబాటు లభించింది. ఈ సారి సీజన్ సమీపిస్తున్నా ‘తొలకర్లు’ వెనుకాడుతున్నాయి. ‘ఎల్–నినో’ మొదలైందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు నెలాఖరు నాటికి ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదని అంచనా వేస్తున్నారు. కనీసం మే నెలలో మోస్తరు వర్షాలు నమోదై ఉంటే రైతులు పొలంబాట పట్టే పరిస్థితి ఉండేది. ఈనెలలో రెండు మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి తుంపర్లు మినహా సరైన తొలకర్లు నమోదు కాలేదు. గతేడాది, అంతకు మునుపు ఏడాది మే నెలలో అయితే భారీ వర్షాలు కురిశాయి. 2021, 2022, 2023 మేలో కూడా మంచి వర్షపాతం నమోదైంది. అయితే, 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఎల్–నినో మొదలు కావడంతో జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ను కబళించే ప్రమాదం ఉన్నట్లు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
చింతల రాయుని సన్నిధిలో తెలుగు శాసనం
తాడిపత్రి రూరల్: పట్టణంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఆలయంలో తెలుగు శాసనం వెలుగు చూసినట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయ ప్రవేశ మార్గం వద్ద ఉన్న గాలి గోపురంలో కొణిదెల చిన క్రిష్ణమనాయుని తెలుగు శాసనం కనుగొన్నామన్నారు. సామాన్య శకం 1554 డిసెంబర్ అనంతనామ సంవత్సరం మార్గశిర మాసంలో శాసనాన్ని రాశారన్నారు. ప్రాకార గోపుర నిర్మాణానికి గుత్తి తిరుమల నాయుడు 510 వరహాలు, కొణిదెల చెన్నమశెట్టి కుమారుడు ఓబయ్య 210 వరహాలు దానంగా ఇచ్చారని తెలిపారు. గుత్తి తిరుమలనాయుడు అరవీటి రామరాయల మనవడన్నారు. శాసనంలో చింతల వెంకటరమణస్వామి దేవాలయాన్ని శ్రీతల తిరువెంగళనాథ గుడిగా పేర్కొన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అర్చకుడు శ్రీనివాసదేశికన్ పాల్గొన్నారు. ‘సత్యసాయి’ కార్మికుల సమ్మె విరమణ కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులు గురువారం సమ్మె విరమించారు. పీఏబీఆర్ నుంచి గ్రామాలకు తాగునీరు సరఫరా చేశారు. కలెక్టర్ ఆనంద్, బోర్డు అధికారులు, ఎస్ఈ ప్రభాకర్, డీఈ రామారావుతో జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమించారు. నెలాఖరుకు పెండింగ్ వేతనాల విడుదల, జిల్లా పరిషత్లో విలీనం చేయకుండా చర్యలు, సమ్మె కాలంలోనూ వేతనం ఇవ్వడం తదితర డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా అధ్యక్షుడు ఆర్వీ నాయుడు, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, అధ్యక్షుడు మధు తెలిపారు. -
24న సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్: ‘‘యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఏడు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 2,515 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. పరీక్ష నిర్వహణపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫ రెన్స్ హాలులో యూపీఎస్సీ అధికారి ప్రవీందర్ సింగ్, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్–1 ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఇన్విజిలేటర్లకు 23న శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షకు కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతారని, ఇందుకు అనుగణంగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు మూడు వందల మీటర్ల పరిధిలో సైబర్ కేఫ్లు, జిరాక్స్ కేంద్రాలు, ప్రింటింగ్ షాపులను బంద్ చేయించాలని చెప్పారు. పరీక్ష సమయం కంటే 30 నిమిషాల ముందే కేంద్రాల గేట్లను మూసివేస్తారని, నిర్దేశిత సమాయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోరని అభ్యర్థులకు కలెక్టర్ స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండండి అనంతపురం అర్బన్: జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయట తిరగకూడదన్నారు. తరచూ మంచినీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమై బయటికి రావాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి వాడాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జనసమూహం ఉండే ప్రదేశాల్లో తాగునీరు, నీడ సదుపాయం కల్పించాలన్నారు. వీధి కుక్కలు, పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
వైఎస్సార్ సీపీ నాయకులే టార్గెట్
తాడిపత్రిటౌన్: తాడిపత్రి సీఐ ఆరోహణరావు తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్ల వద్దకు అర్ధరాత్రి వేళ వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారిని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నెల 18న పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును నిరసిస్తూ తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ కౌన్సిలర్, పార్టీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ బాబుపై వేధింపులకు దిగడమే ఇందుకు నిదర్శనం. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రభాకర్ బాబు ఇంటి వద్దకు వెళ్లిన సీఐ ఆరోహణరావు బలవంతంగా ఆయనను పోలీసుస్టేషన్కు తరలించారు. గంట పాటు స్టేషన్లో ఉంచుకుని ఫొటోలను తీసుకున్న అనంతరం పంపించారు. ఎలాంటి కారణం చెప్పకుండా తీసుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ప్రభాకర్బాబును పోలీసుస్టేషన్కు తీసుకెళ్లాక ఫొటోలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే సీఐ చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే.. మూడు రోజులుగా పదుల సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారిని సైతం పిలిచి కేసులు నమోదు చేయడం గమనార్హం. రౌడీషీట్లున్న టీడీపీ నాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా ప్రతి ఏడాది చేసినట్లుగానే వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్కు పిలిపిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో 20 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేశామని, మరో 20 మందిని బైండోవర్ చేస్తామన్నారు. టీడీపీ నాయకుల బైండోవర్పై మాత్రం మాట దాటవేయడం గమనార్హం.ప్రభాకర్బాబును అర్ధరాత్రి స్టేషన్కు తీసుకెళ్లడంపైనా ఆయన స్పందించలేదు. వివాదాస్పదమవుతున్న తాడిపత్రి సీఐ ఆరోహణరావు తీరు ప్రతిపక్ష పార్టీ నాయకులను అర్ధరాత్రి స్టేషన్కు తరలిస్తూ భయభ్రాంతులు ‘పచ్చ’ నేతల మెప్పు కోసమే రెచ్చిపోతున్నారనే విమర్శలు -
అరబిక్ కళాశాలకు వందేళ్లు
రాయదుర్గం టౌన్: స్థానిక కణేకల్లు మార్గంలో నెలకొల్పిన అరబిక్ కళాశాల శతవార్షికోత్సవానికి ముస్తాబైంది. పది దశాబ్దాలుగా విద్యార్థులకు అత్యుత్తమ ఇస్లామిక్ విద్యా బోధనను అందిస్తున్న ఈ కళాశాలను జామియా మహమ్మదీయ అరబిక్ కళాశాలగా పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఈ కళాశాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఇస్లామిక్ విద్యను అభ్యసిస్తున్నారు. చాలా కాలంగా బళ్లారి మార్గంలో ఉన్న ఈ కళాశాలలను ఇటీవల కణేకల్లు మార్గంలోని నూతన భవన సముదాయంలోకి మార్చారు. గురువారం శతవార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. సౌదీ అరేబియా వర్సిటీ అనుబంధంగా... రాయదుర్గానికి చెందిన మౌలానా సయ్యద్ ఇస్మాయిల్ సాహెబ్ 1926లో అరబిక్ కళాశాలను స్థాపించారు. ఆ రోజుల్లో ఆయన సేకరించిన గ్రంథాల్లో అక్బర్ కాలం నాటి ఓ గ్రంథం ఉండడం విశేషం. ఆయన మరణానంతరం కుటుంబసభ్యులే కళాశాలను నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం సయ్యద్ ఇస్మాయిల్ సాహెబ్ మనవడు సయ్యద్ అమీర్ హమ్జా ఆ కళాశాల కరస్పాండెంట్గా కొనసాగుతున్నారు. ఇక్కడ ఉర్దూ, అరబిక్తో పాటు పర్షియా, ఇంగ్లిష్ భాషల్లో విద్యా బోధన సాగుతోంది. ప్రధానంగా అరబిక్ భాషలో అలిమ్ ఫాజిల్ (8 ఏళ్ల కోర్సు), మున్ఫిఫాజిల్ (మూడేళ్ల కోర్సు)తో పాటు హఫీజ్ కోర్సులూ అందజేస్తున్నారు. సౌదీ అరేబియాలోని మదీనా యూనివర్సిటీ అనుబంధంగా ఈ కోర్సులను అమలు చేస్తున్నారు. అలీమ్ ఫాజిల్ కోర్సులో 90 శాతం మార్కులతో ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు మదీనా యూనివర్సిటీలో ఉన్నత విద్యకు అవకాశం కల్పిస్తున్నారు.తొలి రోజుల్లో ఈ కళాశాలలో చదివిన విద్యార్థి మాల్దీవుల గవర్నర్గా పనిచేయడం రాయదుర్గానికే గర్వకారణంగా నిలిచింది. హాజరుకానున్న ప్రముఖులు గురువారం జరిగే అరబిక్ కళాశాల శతవార్షికోత్సవానికి ఇస్లామిక్ పండితులు హాజరవుతున్నట్లు ఆ కళాశాల అభివృద్ధి కమిటీ సెక్రటరీ సయ్యద్ అమీర్ హమ్జా తెలిపారు. షార్జా నుంచి ప్రముఖ ఇస్లామిక్ పండితుడు షేక్ జఫురుల్ హసన్, బెంగళూరు నుంచి అసిమ్ ఖాన్, గుల్బర్గా నుంచి షేక్ జవాద్ హాజరవుతున్నారన్నారు. విద్యాబోధన పూర్తి చేసిన విద్యార్థులకు అలిమ్ ఫాజిల్, ఖురాన్ హఫీజ్ సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. నేడు శతవార్షికోత్సవం హాజరుకానున్న ఇస్లామిక్ పండితులు -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు : జేసీ
బొమ్మనహాళ్: యజమానికి తప్ప ఇతర ఏ సంస్థ, వ్యక్తులకు చట్టబద్ధంగా ఎలాంటి అధికారాలు ఉండని ఫ్రీహోల్డ్ భూ సమస్యలకు రెండు, మూడు నెలల్లో పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. బొమ్మనహాళ్ మండలం కొలగానహాళ్లి, ఏలంజి గ్రామాల్లో కొనసాగుతున్న రీ–సర్వే పనులను బుధవారం జేసీ పరిశీలించారు. జాయింట్ ఎల్పీ నంబర్లు, ఫ్రీహోల్డ్ రికార్డులకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నాలుగో విడత రీసర్వే కొనసాగుతుందని త్వరలో ఐదో విడత సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ఫ్రీహోల్డ్, జాయింట్ ఎల్పీ నంబర్ల సమస్యలకు పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ చర్యలు వేగవంతం చేసిందన్నారు. రీ సర్వేలో 5 సెంట్ల వరకు తేడాలు కనిపించడం సహజమని పేర్కొన్నారు. అయితే కొందరు రైతుల రికార్డులో ఉన్న విస్తీర్ణానికి మించి సాగు చేస్తున్న భూములు ప్రస్తుతం రీ సర్వే ద్వారా బయటపడుతున్నాయని తెలిపారు. అనంతరం మండలంలోని నేమకల్లులో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. డీఎస్ఎల్ఏ కనకప్రసాదరావు, సర్వే ఇన్స్పెక్టర్ అంజలీదేవి, బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలు, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ, సర్వేయర్ రవితేజ, వీఆర్వో యుగంధర్, పంచాయతీ కార్యదర్శి యల్లప్ప పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఎద్దుల మృతి
శింగనమల: మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఏకులనాగేపల్లిలో పిడుగుపాటుకు రైతు వసంతకుమార్ రెడ్డికి చెందిన రెండు ఎద్దులు చనిపోయాయి. రెండు వారాల క్రితమే రూ.1.50 లక్షలతో వాటిని కొనుగోలు చేసినట్లు బాధిత రైతు వాపోయాడు. టెంకాయ చెట్టుపై పిడుగు గార్లదిన్నె: మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. ఎం.కొత్తపల్లి గ్రామంలో రైతు కిష్ట ఇంటి వెనుక ఉన్న టెంకాయ చెట్టుపై పిడుగు రాలడంతో మంటలు చెలరేగాయి. అలాగే కల్లూరు, ఇల్లూరులో వడగండ్ల వర్షం కురిసింది. వ్యక్తి దుర్మరణం అనంతపురం సెంట్రల్: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో శింగనమల మండలం నిదనవాడకు చెందిన శేషానందరెడ్డి(40) దుర్మరణం పాలయ్యాడు. బుధవారం అనంతపురంలోని తపోవనం నుంచి బళ్లారి మార్గం వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కొండుపల్లి గనుల్లో విచారణపెద్దవడుగూరు: మండలంలోని కొండుపల్లిలో సర్వే నంబర్ 313ఏ లో ఉన్న మైనింగ్ ప్రాంతాన్ని తాడిపత్రి మైనింగ్ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగుతున్నాయనే ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏడీఏ ఓబుళరెడ్డి, సిబ్బంది, మండల సర్వేయర్ ప్రసాద్, వీఆర్వోలు పాల్గొన్నారు. తాగునీటి కోసం నిరసనగుమ్మఘట్ట: తాగునీటి సమస్య తీర్చాలంటూ బుధవారం భైరవానితిప్ప గ్రామస్తులు స్థానిక సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పంచాయతీ బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి ఇమ్రాన్ అక్కడకు చేరుకుని తాగునీటిని సరఫరా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
నాణ్యత లోపిస్తే సహించను
● మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశంఅనంతపురం అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తే సహించబోనని కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అంగన్వాడీ భవనాలు, మూత్రశాలలు, గ్రామ సమైక్య భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయాలన్నారు. కేజీబీవీల్లో చేపట్టిన పనులు. హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు, హెల్త్ క్లినిక్ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంశ్రీనిధి కింద మంజూరైన నిధులతో పాఠశాలల్లో చేపట్టిన పనులు గడువులోగా పూర్తవ్వాలని చెప్పారు. ఎంపీ నిధులతో చేపట్టి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పీఎంఏజేవై కింద కణేకల్లులో చేపట్టిన వసతి గృహం జూలై ఆఖరుకు పూర్తి చేయాలన్నారు. గుతకల్లులోని మైనారిటీ గురుకుల పాఠశాలను రెండు రోజుల్లోగా మైనారిటీ సంక్షేమ శాఖకు అప్పగించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ సుబ్బరాయుడు, ఆర్అండ్బీ ఎస్ఈ మురళీకృష్ణ, మైనర్ ఇగిరేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, సీపీఓ అశోక్కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ సాగు పట్టాలు కూడేరు: అసైన్డ్ భూమిని సాగు చేసుకుంటున్న వారిలో అర్హత కల్గిన పేదలందరికీ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం మరుట్ల–2వ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ అధికారులు అసైన్డ్ పట్టాల ఎంపిక జాబితా తయారీపై గ్రామ సభ నిర్వహించారు. కలెక్టర్ విచ్చేసి మాట్లాడారు. మరుట్ల పంచాయతీ పరిధిలో అసైన్డ్ భూమిని సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు మంజూరు చేయాలని కలెక్టరేట్లో, మండల కేంద్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలామంది అర్జీలు అందజేశారన్నారు. వీటిపై రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి 47 మందిని అర్హులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. వారి పేర్లను అధికారులు చదివి వినిపించారు. ఇంకా అర్హత ఉండి జాబితాలో పేర్లు లేకపోతే మరోమారు విచారణ చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ ఉదయ్ భాస్కర్, మండల సర్వేయర్ ఆయేషా సిద్ధిఖీ, వీఆర్వో వెంకట శివారెడ్డి పాల్గొన్నారు.


