breaking news
Ananthapur
-
కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, ఛైన్ స్నాచింగ్స్ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాలకు పోలీసు అధికారులు అలవాటు పడ్డారు. అందుకే తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారు. పోలీసు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. నేరాలకు పాల్పడటం. కౌంటర్ కేసులు పెట్టడం. జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటుగా మారింది. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది. జేసీ దౌర్జన్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈనెల 26వ తేదీన జరిగే సామూహిక దీక్ష విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు. -
‘పవన్వి దిగజారుడు మాటలు’
అనంతపురం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన స్థాయి మరిచి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.రమేష్ గౌడ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి పవన్ ఎక్కడ తిరుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మూడు రోజుల క్రితం సినిమా షూటింగ్కు వచ్చినట్లు కాకినాడకు వచ్చారన్నారు. ‘తాటతీస్తాం.. తోలుతీస్తాం.. అరచేతుల్లో రేఖలు లేకుండా చేస్తాం.. వైసీపీ గూండాల్లారా.. రౌడీల్లారా..’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. తాటాకు చప్పళ్లకు వైఎస్సార్సీపీ నేతలు ఎవ్వరూ భయపడబోరని హెచ్చరించారు. -
ఎంటీఎస్ కౌన్సెలింగ్లో పారదర్శకత ఎక్కడ?
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సిలింగ్లో తీవ్ర వివక్ష చోటుచేసుకుందని పలువురు ఉపాధ్యాయులు ఆరోపించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 14 మంది ఉపాధ్యాయులకు ఎలాంటి కౌన్సిలింగూ నిర్వహించకుండా వారు పనిచేస్తున్న పాఠశాలల్లోనే స్థానాలను యథాతథంగా కేటాయించారు. మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించడం అన్యాయమని వాపోయారు. ఈ మేరకు మంగళవారం పలువురు ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్కు హాజరు కాకపోయినా నిర్బంధంగా ప్రక్రియ పూర్తి చేశారని వాపోయారు. ఒకే కేడర్ ఉపాధ్యాయుల విషయంలో రెండు రకాల విధానాలు అమలు చేయడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది జిల్లాలో దాదాపు 80 మంది క్లస్టర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా, ఇప్పుడు తమకు కేటాయించిన పాఠశాలలను కూడా ఖాళీల జాబితాలో చూపించలేదన్నారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న పాఠశాలలను ఖాళీలుగా చూపించి ఎంపికకు అవకాశం కల్పించారని, కానీ అనంతపురం జిల్లాలో మాత్రం తాము పనిచేస్తున్న పాఠశాలలను పూర్తిగా మూసివేసి ఒక్క పోస్టును కూడా ఖాళీగా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీల జాబితా తయారీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహణ వరకు పారదర్శకత లోపించిందని ఆరోపించారు. నమ్మించి.. ఉసూరుమనిపించిన ఎమ్మెల్సీ డీఎస్సీ–1998 ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ వ్యవహారం మంగళవారం అనంతపురంలోని సైన్స్ సెంటర్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఖాళీలు బ్లాక్ చేశారని, అందుబాటులో ఉన్న పోస్టులను చూపడం లేదని ఆరోపిస్తూ ఎంటీఎస్ టీచర్లు సోమవారం జరగాల్సిన కౌన్సెలింగ్ను బహిష్కరించారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందిస్తూ ‘ఎవరూ ఆందోళన చెందొద్దు.. నేనున్నా.. ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తాను’ అంటూ హామీ ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న ఎంటీఎస్ టీచర్లలో కొత్త ఆశలు చిగురించాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, వందలాది మంది టీచర్లు కేంద్రానికి చేరుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కూడా అక్కడికి వచ్చి టీచర్లు, విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. తాను విద్యాశాఖ కమిషనర్తో మాట్లాడతానని, అప్పటిదాకా కౌన్సెలింగ్ నిర్వహించవద్దని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు కౌన్సెలింగ్ను నిలిపివేశారు. ఎమ్మెల్సీ నుంచి లేదా రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఏదైనా సానుకూల సమాచారం వస్తుందేమోనని టీచర్లు ఆశగా ఎదురుచూశారు. గంటలు గడిచిపోయాయి. సాయంత్రం వరకు ఎదురు చూసిన విద్యాశాఖ అధికారులు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ముందుగా ప్రకటించిన ఖాళీలతోనే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 14 మందికి మినహాయింపు... మిగతావారికి కౌన్సెలింగ్ ‘ప్రభుత్వ యాజమాన్య’ ఉపాధ్యాయుల స్థానాలు యథాతథం మండిపడుతున్న 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత కొనసాగుతోంది. గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
తాడిపత్రిలో మితిమీరిన టీడీపీ నేతల అరాచకం ● కేశవరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలి● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం అనంతపురం: తాడిపత్రిలో అధికార టీడీపీ నాయకుల అరాచకం మితిమీరిపోయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. అక్కడ మరోమారు దాడికి ప్రయత్నించారన్నారు. ఏకంగా ఆస్పత్రిపైనే రాళ్లతో దాడి చేశారని, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు రక్షణ కరువైందని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయన్నారు. విపక్ష పార్టీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలు, వారి ఆస్తుల విధ్వంసం రోజువారీ కార్యక్రమాల్లా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇకనైనా హింసాకాండను నిరోధించకపోతే రాష్ట్రంలో కొత్త దుష్ట సంప్రదాయానికి బీజం వేసిన వారవుతారన్నారు.కేశవరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
సంపద సృష్టి అంటే లాకప్డెత్లు, హత్యలేనా?
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవ్ ధ్వజం అనంతపురం: సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, లాకప్డెత్లు పెంచారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంపద సృష్టి సంగతి దేవుడెరుగు ఎమ్మెల్యేల దోపిడీ అధికమైందన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగితే, ఆయన కుమారుడు లోకేష్కు అహంకారం, పవన్ కల్యాణ్కు పిచ్చి పెరిగిందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం చంద్రబాబు గంజాయితో పాటు బెల్టుషాపులు పెంచారని మండిపడ్డారు. మెగా డీఎస్సీలో దగా చేసి నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. లాకప్డెత్లో బిడ్డను కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారిందన్నారు. ఆ తల్లిని సీఎం పిలిపించి నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హిందూ సంప్రదాయం ప్రకారం మృతి చెందిన మనిషికి సంబంధించి క్రతువులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులకు ఎలాగూ సమాచారం ఇవ్వలేదు. కనీసం సీఎం, డిప్యూటీ సీఎం అయినా సంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకోవాలి’ అని పేర్కొన్నారు. పోలీసుల భుజాలపై గన్ పెట్టి చంద్రబాబు తన శత్రువులపై గురి పెడుతున్నారని, ఈ క్రమంలో పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలని మాధవ్ సూచించారు. -
ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తే రిజిస్ట్రేషన్లు చేయాల్సిందే. అలా కాదంటే వారిపై వేటు తప్పదు. అలా అని ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తే ఉన్నతాధికారుల నుంచి ఉద్వాసన తప్పదు. ఇందుకు నిదర్శనం అనంతపురం రామ్నగర్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్–1 సబ్
అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పెత్తనం పెరిగిపోయింది. వారు చెబితేనే రిజిస్ట్రేషన్లు చేయాలి. లేకుంటే సబ్రిజిస్ట్రార్లకు చీవాట్లు, ఛీత్కారాలు లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఉమ్మడి జిల్లాలో 21 సబ్రిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 12, శ్రీసత్యసాయి జిల్లాలో 9 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇదివరకు సరిగా ఉంటే రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితి తారుమారైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు సాగుతున్నాయి. తమ అనుమతి లేకుండా ఏ ఒక్క రిజిస్ట్రేషన్నూ చేయవద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఒత్తిళ్లు భరించలేక చాలామంది సబ్రిజిస్ట్రార్లు సెలవుపై వెళ్లిపోతున్నారు. ● అనంతపురంలోని రామ్నగర్ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ఇస్మాయిల్ ఎక్కువ రోజులు అక్కడ పని చేయలేకపోయారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో, వారు చెప్పిన పనులు చేయలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వారు చెప్పినవి చేస్తే ఉద్యోగం ఊడిపోతుందనే భయంతోనే చాలామంది ఉద్యోగులు రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గడిచిన 8 నెలల కాలంలోనే ఏకంగా ఐదుగురికి పైగా సబ్ రిజిస్ట్రార్లు ఇన్చార్జ్లుగా బాధ్యతలు చేపట్టి.. పని చేయలేక వెళ్లిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ● కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా గతంలో పని చేసిన నారాయణస్వామి స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేవారు. దీంతో స్థానిక ప్రజలు సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని ఏసీబీ అధికారులకు పట్టించారనే ప్రచారం జరుగుతోంది. ● ఆరు నెలల క్రితం బుక్కపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న రామ్మోహన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తుల భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అన్నీ సక్రమంగా ఉన్నా ఎందుకు చేయడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ను నిలదీసినా ప్రయోజనం కనిపించకపోవడంతో జిల్లాలోని ఓ మంత్రిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆయన సిఫార్సుతో మాజీ ఎమ్మెల్యే వర్గీయుల స్థలాలను స్థానిక సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేకు చేరవేశారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక సబ్రిజిస్ట్రార్ను మందలించినట్లు సమాచారం. దీంతో కలత చెందిన సబ్రిస్ట్రార్ రామ్మోహన్నాయుడు ‘చేస్తే ఒకటి, చేయకపోతే మరోకటా’ అంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయాడు. మేము చెప్తేనే రిజిస్ట్రేషన్లు చేయాలి సబ్ రిజిస్ట్రార్లకు ఎమ్మెల్యేల దిశా నిర్దేశం వారి ఆగడాలు భరించలేక సెలవుపై వెళ్తున్న ఎస్ఆర్లు మొన్న అనంతపురం.. నేడు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ లీవుపై.. -
ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం
● మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అనంతపురం న్యూటౌన్: చంద్రబాబు ప్రభుత్వ కుట్రలను దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఆయన నివాసంలో ఉరవకొండ నియోజకవర్గ పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. విశ్వ మాట్లాడుతూ సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అరాచకాలను ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు, నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనకు మధ్య వ్యత్యాసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా ఉన్నాయని, వీటిపై పోలీసుల పాత్ర ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటరు సమగ్ర పరిశీలన (సర్) కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీఎల్ఏలకు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, సమస్యలు ఎదురైన వెంటనే అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో ఉరవకొండ మండల ఇన్చార్జ్ మూలగిరిపల్లి ఓబన్న, యువజన విభాగం నాయకులు ప్రణయ్ కుమార్ రెడ్డి, కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, విడపనకల్లు భీమిరెడ్డి, అన్ని మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
విత్తన వేరుశనగ కోసం నిరసన
కుందుర్పి: సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని మూడు వారాలు అవుతున్నా నేటికీ అందకపోవడంతో బెస్తరపల్లి రైతులు ఆగ్రహించారు. మంగళవారం సచివాలయం, రైతు సేవ కేంద్రం వద్ద నిరసన తెలియజేశారు. సిబ్బందిని బయటకు పంపి తలుపులకు తాళం వేశారు. 175 మంది రైతులు విత్తనకాయల కోసం డబ్బు చెల్లించామన్నారు. తమ కు విత్తన కాయలు అందించేవరకు కదిలేది లేదని రైతులు భీష్మించారు. వీరి ఆందోళనకు సీపీఐ నాయకులు బీకే గోపాల్ మద్దతు పలికారు. అనంతరం ఏఓ విజయ్కుమార్ జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలపడంతో వారు ఆందోళన విరమించారు. -
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా, జేసీ అనుచరులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని పార్టీ శ్రేణులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై జేసీ వర్గీయులు విచ్చలవిడిగా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు కళ్లముందే జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానికంగా, వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చేనేతల సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు
అనంతపురం అర్బన్: చేనేతల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని చేనేత కార్మిక సంఘం నాయకులు ధ్వజమెత్తారు. చేనేతల సమస్యలు పరిష్కరించాలంటూ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, నేతన్నలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీరాములు, పామిశెట్టి గోవిందు మాట్లాడారు. చేనేతలకు ఇచ్చిన హామీలు, సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం వందశాతం విఫలమయ్యిందని దుమ్మెత్తిపోశారు. నేతన్న నేస్తం రూ.25 వేలు తక్షణం అమలు చేయాలన్నారు. నేతన్నకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు చేయాలన్నారు. ఎన్హెచ్డీసీ యార్న్ సబ్సిడీ డిపోలను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు మూడు సెంట్ల స్థలంతో పాటు పక్కా గృహం, వర్క్ షెడ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలన్నారు. వయసు 50 ఏళ్లు నిండి చేనేత గుర్తింపు కార్డు ఉన్న భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో నెలకు రూ.5 వేల ప్రకారం 6 నెలలు పాటు అందించాలని డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలూరి లక్ష్మయ్య, నాయకులు నరసింహులు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. జీతాలు వెంటనే చెల్లించాలి అనంతపురం న్యూటౌన్: తమకు రావాల్సిన నాలుగు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులు బోర్డు అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు కార్మికులకు చెల్లించాల్సిన రూ. 2.5 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోర్డ్ అకౌంట్లో నిధులు ఉన్నా కార్మికులకు జీతాలు చెల్లించకుండా బోర్డు మెంబర్ సెక్రటరీ, అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సమర్థనీయం కాదన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే జూలై 6న బోర్డు ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్, సెక్రటరీ శ్రీరాములు, ట్రెజరర్ వన్నూరప్ప, వీరాంజనేయులు, వెంకటేశులు, చిన్న బాబయ్య, రవీంద్ర చారి, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఉద్యమమే
అనంతపురం అర్బన్: ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తామని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక బ్రాండ్ ఉందంటూ విమర్శించారు. వైఎస్సార్సీపీటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు బీసీ రమేష్గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్పీరా, నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే 3.50 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి ప్రభుత్వంలోకి విలీనం చేసిన ఘనత వైఎస్జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా సూపర్సిక్స్ హామీలు అమలు చేయకపోగా పేద, సామాన్య వర్గాల ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఆర్టీసీని ప్రైవేటీకరణకు సిద్ధపడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు మార్కెట్ ఖాజా, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, నాయకులు సంపంగి రామాంజనేయులు, శ్రీనివాసరెడ్డి, నాగార్జునరెడ్డి, గజ్జల నాగేష్, నిజాం, ప్రకాష్, సాకే చిరంజీవి, రాజశేఖర్రెడ్డి, కుళ్లాయప్ప, సతీష్, అనిల్కుమార్ గౌడ్, మహమ్మద్ హుసేన్, వెంకటేష్, శ్రీనివాస్నాయక్, రామాంజి, సంగమేష్, శ్రీనివాసులు, వెంకటరెడ్డి, రవికుమార్, సాకే రామాంజనేయులు, మన్సూర్, మణికంఠ, తేజ, ఆటో వెంకి, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీటీయూ నాయకుల హెచ్చరిక కలెక్టరేట్ ఎదుట ధర్నా -
రక్తమోడిన రహదారులు
పుట్లూరు: మండలంలోని అకటివేముల వద్ద సోమవారం ట్రాక్టర్, బైకు ఢీకొన్న ఘటనలో తాడిపత్రికి చెందిన జాఫర్ (19) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన జాఫర్ తన స్నేహితులు జితేందర్రెడ్డి, భరత్ రాజుతో కలిసి నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి దర్శనానికి బైకుపై వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో అరకటివేములలోని మలుపు వద్ద ఎదురుగా ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రగాయాలైన జాఫర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జితేందర్రెడ్డి, భరత్ రాజుకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామిళ్లపల్లి వద్ద యువకుడు..కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. తగరకుంట గ్రామానికి చెందిన నాగన్న, ఉమాక్క దంపతుల కుమారుడు బిల్లే మహేష్ (21), అతని మామ పెన్నప్ప, అత్త శ్రావణిలు చెన్నేకొత్తపల్లిలోని వారి బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లి వస్తుండగా, రాత్రి వేళ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి 108 ద్వారా ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్తుండగా, మహేష్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. గాయపడ్డ పెన్నప్ప, శ్రావణిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మృతుని తల్లిదండ్రులు నాగన్న, ఉమాక్క, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. సంఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోను ఢీకొని మెకానిక్..గార్లదిన్నె: మండల పరిధిలోని కల్లూరులో ఆటోను బైకు ఢీకొన్న ఘటనలో ఓ బైక్ మెకానిక్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామానికి చెందిన వీరన్న, ఆదెమ్మ దంపతుల కుమారుడు మహేష్ బాబు (37) బైక్ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సోమవారం బైక్ సామాన్ల కోసం ద్విచక్ర వాహనంలో అనంతపురం బయలుదేరాడు. మార్గమధ్యంలోని కల్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఆటోను ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్ఐ వెంకటేషులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయం చేసేందుకు వెళ్తే ప్రాణమే పోయిందినార్పల: సాయం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యు వాత పడిన ఘటన మండల పరిధిలోని నాయనపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. సోమవారం తెల్లవారుజామున పుట్లూరు మండలంలోని కొండాపురంలో రేణప్పకు చెందిన ట్రాక్టర్ను గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. అనంతపురం వైపు తీసుకెళ్లాడు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన రేణప్ప వెంటనే ఆ మార్గంలోని వెంకటాంపల్లికి చెందిన తన బంధువు బాలరాజుకి ఫోన్ చేసి దొంగను అడ్డుకోవాలని సూచించాడు. అప్రమత్తమైన బాలరాజు (45) వెంటనే తన కుమారుడు ప్రవీణ్తో కలిసి నాయనపల్లికి చేరుకుని మెయిన్ రోడ్డుపై ట్రాక్టర్ను ఆపేందుకు యత్నించాడు. అయితే, ట్రాక్టర్ దొంగ ఆపకుండా ఢీకొనడంతో తీవ్ర గాయాలైన బాలరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దొంగిలించిన వ్యక్తి ట్రాక్టర్ను వదిలి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలరాజు కూలీ పనులు చేసుకుని జీవించేవాడని, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబీకులకు తీరని వేదన మిగిల్చారు. -
ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
గుత్తి రూరల్: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుత్తి మండలం యంగన్నపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా సారా గ్రామానికి చెందిన మున్నా కుమారుడు అమన్ (20) అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. సదరు యువతి ప్రేమకు నిరాకరించడంతో ఎప్పుడూ పరధ్యానంగా ఉండేవాడు. కుమారుడిని మార్చాలని భావించిన తల్లిదండ్రులు గుత్తి మండలంలోని బేతాపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న సోలార్ ప్లాంటులో ఓ కాంట్రాక్టర్ వద్దకు కూలీ పనులకు పంపారు. అమన్తో పాటు ఇతర కూలీలు నివాసం ఉండేందుకు కాంట్రాక్టర్ చెట్నేపల్లిలో ఓ ఇల్లు చూపించాడు. అమన్ కూలీ పనులకు వెళ్లినా అక్కడ కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే ఉండేవాడు. తాను చనిపోతానని రోజూ తోటి కూలీలతో చెప్పేవాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి యంగన్నపల్లి శివారులోని బాలరాజు మామిడి తోటలో తన షర్ట్తో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి విచారించారు. ప్యాంటు జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు యూిపీకి చెందిన అమన్గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ హిందూపురం: హిందూపురం రైల్వేస్టేషన్లో కోయంబత్తూరుకు చెందిన వృద్ధురాలు నాగలక్ష్మి మెడలోని 2.50 తులాల బంగారు గొలుసును దొంగ లాక్కుపోయాడు. కోయంబత్తూర్ నుంచి హిందూపురం తూమకుంట వద్ద పెళ్లికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి నాగలక్ష్మి కుటుంబసభ్యులు వచ్చారు. రైలు దిగి మిగిలిన వారు కాస్త ముందు వైపు నడుస్తుండగా వృద్ధురాలు నిదానంగా వెళ్తోంది. గమనించిన దొంగ ఆమె మెడలోని గొలుసును లాక్కుని రైలెక్కి పరారయ్యాడు. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారని రైల్వేస్టేషన్ ఎస్హెచ్ఓ ఎర్రిస్వామి తెలిపారు. -
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘ టన డి.హీరేహాళ్ మండలంలోని తిమ్మలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన గంగప్ప, వండ్రమ్మ దంపతులకు మల్లికార్జున (27) కుమారుడు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంవత్సరం క్రితం కర్ణాటక రాష్ట్రం తిమ్మలాపురం గ్రామానికి చెందిన అనుషతో మల్లికార్జునకు వివాహం కాగా, ఐదు రోజుల క్రితం వీరికి మగబిడ్డ పుట్టాడు. కొడుకును హాస్పిటల్లో చూసి ఇంటికి వచ్చిన మల్లికార్జున కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి వండ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి తెలిపారు. జంతలూరులో మరో యువకుడుబుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జంతలూరు గ్రామంలో విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జంతలూరు గ్రామంలో కిష్టయ్య, ఓబులమ్మ కుమారుడు సాయి (26) ట్రాక్టర్లో కట్టెలు వేసుకుని వస్తుండగా స్కూల్ వద్ద కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో షాక్కు గురైన సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యం బలహీనం● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఉరవకొండ: బీజేపీ విధానాలతో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో సీపీఐ మూడు రోజుల రాజకీయ–సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తమిళనాడులో 70 లక్షల మంది, పశ్చిమ బెంగాల్లో 90 లక్షలు, కేరళలో 9 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారన్నారు. లోక్సభ, రాజ్యసభలో మెజార్టీ కోసం ఎంపీలను కొనుగోలు చేశారని, ఇందుకు సీఎం రమేష్ను మధ్యవర్తిగా పెట్టి ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు. సీఈసీని చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేవుడి పేరున కూడా దోపిడీ సాగిస్తున్నారన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో రూ. 5 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని, భక్తులు సమర్పించిన కేజీల కొద్దీ బంగారు, వెండిని మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా చరిత్రలో అసమర్థ సీఎంగా చంద్రబాబు నిలిచారన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం అమలు చేయకుండా మోసగించారన్నారు. 76 ఏళ్ల వయసులో చంద్రబాబు యోగా చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారని, నారా లోకేష్కు మాత్రం యోగా నేర్పించవద్దని ఎద్దేవా చేశారు. బీజేపీ విధానాలకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, రామకృష్ణ, పద్మావతి, పార్వతీప్రసాద్, నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల జాతీయ క్రికెట్ చాంపియన్షిప్ ప్రారంభం అనంతపురం: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో సోమవారం దివ్యాంగుల జాతీయ క్రికెట్ చాంపియన్షిప్ ప్రారంభమైంది. ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రోహిత్ సైనీ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రధాన కార్యదర్శి రఘు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, తెలంగాణ, కర్ణాటక జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు ఆంధ్రప్రదేశ్ –హర్యానా, తెలంగాణ–ఢిల్లీ, గుజరాత్– కర్ణాటక, ఉత్తరప్రదేశ్– మధ్యప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్లు జరిగినట్లు నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎస్. నాగరాజు తెలిపారు. -
నాడు సంక్షేమం.. నేడు సంక్షోభం
కష్టమైనా నష్టమైనా రైతు కోసం వెన్నుచూపేది ఉండదని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019–2024 మధ్య కాలంలో అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేశారు. ‘కరోనా’ మహమ్మారి విలయతాండవం చేస్తున్న అత్యంత విపత్కర పరిస్థితుల్లోనూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి అసలుసిసలైన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం రెండేళ్లుగా సకాలంలో విత్తనం ఇవ్వకుండా, అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచకుండా కష్టనష్టాలకు గురిచేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. అనంతపురం అగ్రికల్చర్: 2020 మార్చిలో కరోనావిజృంభించినా ఖరీఫ్లో రైతులు ఇబ్బంది పడకుండా ఏప్రిల్లోనే ముందస్తుగా విత్తనాలు, ఎరువుల సరఫరాకు అప్పటి జగన్ సర్కారు చర్యలు చేపట్టింది. ‘మన విత్తనం–మంచి విత్తనం’ నినాదంతో రబీలో రైతులు పండించిన వేరుశనగకు మద్ధతు ధర ఇచ్చి ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖ ద్వారా విత్తన సేకరణ చేయించారు. గ్రామ గ్రామాన తిరిగి రైతుల నుంచి నాణ్యమైన విత్తనం సేకరించి ప్రాసెసింగ్ ప్లాంట్లలో శుద్ధి చేసి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నిర్మించిన సచివాలయాలు, వాటికి అనుబంధంగా ఉన్న 867 ఆర్బీకేలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రూ.275 కోట్ల విలువ చేసే 3.44 లక్షల క్వింటాళ్ల మేర విత్తన వేరుశనగ, కందులు గ్రామాల్లోనే రైతుల ముంగిటకు చేర్చారు. మే 17న విత్తన పంపిణీ మొదలు పెట్టి జూన్ మొదటి వారంలోగా పూర్తి చేశారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 120 కిలోలు అందించారు. 40 శాతం మేర రాయితీ రూపంలో రైతులకు రూ.110 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. ‘కరోనా’ విపత్తులోనూ విత్తుకోసం రూ.275 కోట్లు ఇచ్చిన జగన్ సర్కారు మన విత్తనం–మంచి విత్తనం పేరుతో ముందస్తుగా నాణ్యమైన విత్తనం సకాలంలో 3.44 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 6 వేల క్వింటాళ్ల కందులు నేడు 50 వేల క్వింటాళ్లు కూడా ఇవ్వకుండా చేతులెత్తేస్తున్న చంద్రబాబు చంద్రబాబు హయాంలో కష్టాలు నేడుఅధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా రైతు సంక్షేమానికి చంద్రబాబు సర్కారు కంటితుడుపు చర్యలు మినహా పెద్దగా సాయం చేసింది లేదు. ఖరీఫ్, రబీలో రైతులకు విత్తనం కూడా ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు. 2025 ఖరీఫ్లో అరకొరగా రాయితీ వేరుశనగ ఇచ్చారు. 2025 రబీలో అయితే 2 వేల క్వింటాళ్లు మాత్రమే రాయితీ పప్పుశనగ అందించారు. ఈ ఖరీఫ్లో విత్తన వేరుశనగ, ఇతర విత్తనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనం కేటాయించినా, సరఫరా చేసింది మాత్రం 35 వేల క్వింటాళ్లు.. రైతులకు పంపిణీ చేసింది 15 వేల క్వింటాళ్లే కావడం గమనార్హం. గత ఖరీఫ్, రబీకి సంబంధించి సరఫరాదారులకు బకాయిలు చెల్లించకపోవడంతో విత్తన కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 50 వేల క్వింటాళ్లు కూడా పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన రాయితీ రూపంలో చంద్రబాబు సర్కారు రైతులకు రూ.20 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. -
ఇంటింటి ఓటు సర్వేకు మంగళం!
ధర్మవరం: ఓటరు జాబితాలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహిస్తున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో బీఎల్ఓలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ధర్మవరంలో బీఎల్ఓ (బూత్లెవల్ ఆఫీసర్)లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంటింటి సర్వేకు పూర్తిగా మంగళం పాడారు. అలాగే డోర్ నంబర్లు క్యాన్సిల్ అయిన ఇళ్ల అడ్రెస్లతో ఓట్లు ఎక్కించే విధంగా వ్యవహరిస్తున్నారు. అందరినీ ఒకే చోటకు పిలిపి 17వ వార్డులోని 8వ సచివాలయ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేయాల్సిన బీఎల్ఓ లీలావతి... ఓటర్లను స్థానిక బీఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణకు రమ్మని చెబుతున్నారు. అక్కడే ఓటరు గణన ఫారాలు అందజేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓటరు గణన దరఖాస్తులను అక్కడే పూర్తి చేస్తుండటంతో ప్రజలు నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా అయితే బీఎల్ఓ ఇంటింటికీ వెళ్లి ఓటర్లుకు దరఖాస్తులను అందించి... వారు నింపిన తర్వాత మళ్లీ వారి ఇంటి వద్దకే వెళ్లి స్వీకరించాల్సి ఉంది. ఇందుకుగాను ప్రభుత్వం వారికి టీఏ, డీఏలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తోంది. కానీ పట్టణంలో ఇష్టానుసారం చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
ఉత్సాహంగా ఐదో సరిగెత్తు
నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు భక్తుల కోలాహలం మధ్య ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమవారం ఐదో సరిగెత్తులో భాగంగా పీర్ల చావిడిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆలయం ముందు కోలాటం, ఆటపాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో ఈఓ శోభారాణి, శ్రీదేవి, నాగార్జున, భక్తులు పాల్గొన్నారు. యథేచ్ఛగా మద్యం.. జూదం నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలనుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇదే అదనుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోంది. బాటిల్పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు జూదం, పేకాట నిర్వహణ జోరందుకుంది. సులువుగా డబ్బు సంపాదించ వచ్చంటూ యువతకు గాలం వేస్తున్నారు. ఉత్సవాల వేళ భక్తితో స్వామివారిని దర్శించుకుందామని వచ్చిన భక్తులు ఆశకు పోయి జూదంలో డబ్బు కోల్పోయి ఉసూరుమంటున్నారు. దేవదాయ, పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు కోరుతున్నారు. డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం పొడిగింపు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో గత నెల 26న ఏడాది కాలం పూర్తి చేసుకున్న ముంటిమడుగు కేశవరెడ్డి మరో ఆరు నెలల పాటు డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా కొనసాగనన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయానికి జీరో ఇన్ఫ్లో బొమ్మనహాళ్: జిల్లాకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఎగువ భాగంలో నుంచి అడపాదడపా వస్తున్న వరద నీటి ఇన్ఫ్లో ఆదివారం ఉదయం జీరో స్థాయికి పడిపోయింది. ఎల్–నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతువపనాలు ప్రవేశించి రోజులు గడుస్తున్నా ఎగువ భాగంలోని శృంగేరి, వరనాడు, అగుంబే, శివమొగ్గ, చిక్మంగళూరు తదితర ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో టీబీ డ్యాంకు వరద రావడం లేదు. డ్యాంలో 9.71 టీఎంసీల నీటి నిల్వ తుంగభద్ర డ్యాంలో సోమవారం నాటికి 9.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 30,594 క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లోతో 44.46 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. సాగు–తాగునీటి కోసం తుంగభద్ర జలాలపై ఆధారపడిన రైతులు, ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మొక్కజొన్న వ్యాపారి అరెస్ట్ యాడికి: రైతులనుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న హైదరాబాద్కు చెందిన వ్యాపారి ఇండ్ల సంతోష్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం యాడికి మండలం రాయలచెరువు, తూట్రాళ్లపల్లి రైతుల వద్ద సంతోష్కుమార్ మొక్కజొన్న కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా పరారయ్యాడు. రైతుల ఫిర్యాదు మేరకు యాడికి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో వ్యాపారిని యాడికి పోలీసులు సోమవారం అరెస్టు చేసి, తాడిపత్రి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉండగా సదరు వ్యాపారిపై బనగానపల్లి, హైదరాబాద్, అనంతపురం, వెలుగోడు ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కారులో మంటలు పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కారులో మంటలు చెలరేగాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం సోమవారం కారులో ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రి వద్ద నిలిపిన కారులో నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
● మంత్రి పయ్యావుల ఇలాకాలో బరి తెగించిన టీడీపీ మద్దతుదారులు ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఆగడాలు శ్రుతిమించాయి. అధికారం ఉందన్న అహంకారంతో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఉరవకొండలోని సీవీవీ నగర్కు చెందిన ఆదికేశవ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను 15 మంది టీడీపీ మద్దతుదారులు ఆటోలో కిడ్నాప్ చేసి..హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఆదికేశవ చికెన్ షాపులో పనిచేస్తుంటాడు. ఈ నెల 12న ఉరవకొండలో పెద్దఎత్తున నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని నిరసన ర్యాలీలో పాల్గొనడంతో పాటు ఆ కార్యక్రమం విజయవంతమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీన్ని అదే కాలనీకి చెందిన కొంతమంది టీడీపీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. సోమవారం అనంతపురం బైపాస్లోని చికెన్ కబాబ్ సెంటర్ వద్ద ఉన్న ఆదికేశవను టీడీపీ మద్దతుదారులు ఆటోలో కిడ్నాప్ చే శారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. చేతి కడియంతో ముఖం మీద బాదడంతో ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆదికేశవను స్థానికులు గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై ఏఎస్ఐ శ్రీశైలం వివరాలు సేకరించారు. దాడి ఘటన గురించి తెలుసుకున్న వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, వైఎస్సార్పీపీ రాష్ట్ర నాయకులు బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, మండల కన్వీనర్ మూలగిరిపల్లి ఓబన్న, వేమన్న తదితరులు ఉరవకొండ ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
అన్నదాత ఆక్రందనలు పట్టవా?
అనంతపురం : వ్యవసాయంలో నష్టాలు.. అరకొరగా పండిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రమూ పట్టడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, వ్యవసాయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యతో కలిసి సోమవారం కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం డాక్టర్ సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పుట్లూరు మండలం ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగమయ్య, మడుగుపల్లిలో రైతు చంద్రమోహన్, నార్పల మండల కేంద్రంలో రైతు ఆదినారాయణ అప్పులు బాధ తాళలేక తనువులు చాలించారన్నారు. పంట ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడంతో పెట్టుబడులు తిరిగిరాక అప్పుల పాలవుతున్నారన్నారు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మడంపై ఉన్న శ్రద్ధ పంటలకు మంచి ధర కల్పించి రైతులను ఆదుకోవడంలో ఎందుకు చూపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమలకు ఎకరా భూమిని 99 పైసలకే ధారాదత్తం చేస్తారు కానీ రైతుల గురించి ఎందుకు ఆలోచించరని సూటిగా ప్రశ్నించారు. రైతులను రాజకీయాలకతీతంగా చూడాలని, వ్యవసాయ సంక్షోభ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరు చేయాలని, పంటల బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు వంశీ గోకులరెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, నాగేశ్వర్రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పార్టీ నాయకులు మహేశ్వర్రెడ్డి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, పరంధామరెడ్డి, ఎల్లారెడ్డి, పద్మావతి, బయపరెడ్డి, శివశంకర్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, బోనాల హరికృష్ణ, భాస్కర్రెడ్డి, వెంకటరాముడు, మధుసూదన్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, కాటమయ్య, రంగనాథ్, రేవంత్రెడ్డి, ఎల్లుట్ల శేఖర్, పవన్ కుమార్, శ్రీనివాసరెడ్డి, బయన్న, జయరామిరెడ్డి పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించడం అత్యంత దురదృష్టకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను సాధారణ ఘటనలుగా చూడకూడదన్నారు. బాధిత రైతు కుటుంబానికి తక్షణ ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్టుషాపులను విచ్చలవిడిగా నిర్వహిస్తూ ఒక్కో మద్యం బాటిల్పై రూ.50 నుంచి రూ.60 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. కానీ రైతు పండించిన పంటను మాత్రం కొనుగోలు చేయడానికి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. మొక్కజొన్నకు క్వింటాలు రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే రూ.1400కు కూడా కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే ధారాదత్తం చేస్తోందని, మరి రైతుల శ్రేయస్సును ఎందుకు విస్మరిస్తోందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం విఫలం పంటలకు గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతులు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య -
అసలే తక్కువ వేతనాలు. ఉద్యోగ విరమణకు చేరువవుతూ.. అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం బదిలీల కౌన్సెలింగ్లో వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. కక్ష కట్టి జిల్లా సరిహద్దుకు బదిలీ చేస్తోంది. దయ చూపండని గోడు వెల్లబోసుకున్న మినిమం టైం స్కే
అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీల్లో గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా సొంత లేదా సమీప మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని 1998 ఎంటీఎస్ టీచర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2008, 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు సోమవారం జిల్లా సైన్స్ సెంటర్లో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ 1998 ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్ను సామూహికంగా బహిష్కరించారు. ముందుగా 2008 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 187 మందికి పూర్తి చేశారు. అనంతరం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఖాళీలను చూసి కంగుతిన్న టీచర్లు.. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈసారి గతం కంటే దూరం ‘ఎంటీఎస్ టీచర్లకు గత ప్రభుత్వం సొంత మండలాలు, పొరుగు మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాది జిల్లా, మండల కేంద్రాలు, సమీప ప్రాంతాల్లోని ఖాళీలను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసి ఎంటీఎస్ టీచర్లను సరిహద్దు మండలాలకు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. రిటైర్మెంట్ పోస్టులు, క్లస్టర్ పాఠశాలల ఖాళీలు ఎందుకు చూపించడం లేదు. గతేడాది దూర ప్రాంతాలకు పంపారు.. ఈసారి అంతకంటే దూరం విసిరేస్తున్నారు.. ఇంకా ఎంత దూరం పంపుతారు?’ అంటూ పలువురు ఎంటీఎస్ టీచర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమను వయసు మీద పడిన ఈ దశలో జిల్లా సరిహద్దు మండలాలకు తరలించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని, కమిషనర్తో మాట్లాడామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీల విషయమై ప్రశ్నిస్తే విద్యాశాఖ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. బదిలీల కౌన్సెలింగ్ను 1998 ఎంటీఎస్ టీచర్ల సామూహిక బహిష్కరణ చాలా పోస్టులు బ్లాక్ చేశారంటూ ఆగ్రహం ‘పోస్టులు ఊడతాయ్’ అంటూ అధికారుల బెదిరింపులు తమ గోడు ఆలకించాలంటూ ఉపాధ్యాయుల నిరసన ఈ సరిహద్దు నుంచి ఆ సరిహద్దుకు.. ప్రస్తుతం కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, రాయదుర్గం, గుమ్మఘట్ట ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే రోజూ వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను పరిశీలిస్తే చాలామందిని మడకశిర, రొళ్ల, గుడిబండ, అగళి వంటి మరింత దూర ప్రాంతాలకు పంపించే పరిస్థితి తీసుకువస్తున్నారని వాపోయారు. ఈ సరిహద్దు నుంచి అ సరిహద్దుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ప్రస్తుతం పదవీ విరమణకు చేరువలో ఉన్నవారే. అలాంటి వారిని కుటుంబాలకు దూరంగా పంపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘1998 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల కన్నీళ్లను ప్రభుత్వం తుడుస్తుందా..? లేక మరోసారి దూరప్రాంతాల బాటే చూపిస్తుందా..?’ అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. కాగా ప్రభుత్వ నిబంధన మేరకే ఖాళీలను చూపించామని ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. తొలిరోజు 1998 ఎంటీఎస్ టీచర్లు హాజరుకాలేదు. మంగళవారం ఉదయం 10 గంటలకు వారికి కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటించారు. -
ప్రభుత్వ విద్యారంగం అస్తవ్యస్తం
● వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకుల ధ్వజం అనంతపురం అర్బన్: కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేశారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్ ధ్వజమెత్తారు. విద్యార్థుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం నగరంలోని సంగమేష్ సర్కిల్ నుంచి అర్ధనగ్న ప్రదర్శనతో కలెక్టరేట్ చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా సాకే చంద్రశేఖర్, చంద్రశేఖర్యాదవ్తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు విద్యాకానుక కింద నోట్ పుస్తకాలు, స్కూల్బ్యాగ్లు, యూనిఫాంలు, బూట్లు, సాక్సులు, బెల్టు, వర్క్బుక్లు, నిఘంటువులు అందించారన్నారు. క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చి.. తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. ఇక రెండో ఏడాది పథకం కింద ప్రతి విద్యార్థికీ రూ.15వేల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికీ కలిపి తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పిన చంద్రబాబు.. రూ.2వేలు కోత పెట్టారన్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు తల్లికి వందనం సొమ్ము కానీ.. విద్యార్థులకు పూర్తిస్థాయిలో విద్యాసామగ్రి కానీ అందించలేకపోయిందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని శాఖల్లో వేలుపెడుతూ సొంత శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదంటూ ఎద్దేవా చేశారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తూ పోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి నితిన్ కుమార్ రెడ్డి, నాయకులు దాదాఖలందర్, లోకనాథరెడ్డి, సూరి, మణికంఠ, అమర్నాథ్రెడ్డి, తలారి వినీత్, ఉదయ్, మైను, మసూద్, ప్రసాద్, హర్ష, రోహిత్, సుబ్బారావు, హరి, ఖాదర్, అబ్బాస్, ఓబులేసు, రాంభూపాల్, కోడూరు రాము, ఆర్య, హిద్దు, మోహన్నాయక్, ఆకాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇండ్ల విజయ్, నవీన్రెడ్డి, సుధీర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మంజూనాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, హరీష్, సుందర్, చరణ్, గౌతమ్, బాబా ఇమ్రాన్, బబ్లూ, అక్షయ్, రఫీ, రాహుల్రెడ్డి, సాయి యాదవ్, తేజు, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ హెచ్చరిక అనంతపురం అర్బన్: అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, రమేష్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కిరణ్మయి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 751 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూసమస్యలపై 259, ఇతర సమస్యలపై 492 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఏస్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. అర్జీల్లో మచ్చుకు .. ● తమ భూమి వేరొకరి పేరున ఆన్లైన్లో ఎక్కించారని అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన మాజీ సైనికుడు వై.ఆనంద్రెడ్డి ఫిర్యాదు చేశాడు. బ్యాంకులో లోన్ తీసుకుని నేరేడు, మామిడి, జామ సాగు చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడేమో తమ భూమికి కె.ఎం.డి.బషీర్ అనే వ్యక్తి పేరును ఆన్లైన్లో ఎక్కించారన్నారు. న్యాయం చేయాలని కోరాడు. -
దమనకాండపై నినదించాలి
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలన, దమనకాండపై నినదించాలి. బతకడం కంటే చావే శరణ్యం అనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందో ఊహించడానికే భయమేస్తోంది. నిత్యం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి ఆలోచన, వేదన ఒక్కటే.. రెండేళ్లుగా జరుగుతున్న ఆకృత్యాలు, అరాచకాలు ప్రజలకు తెలిసేలా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి. ఉద్యమాల పురిటిగడ్డ అయిన అనంతపురం నుంచే ప్రారంభం కావాలి. కలసిమెలసి సమష్టిగా పోరాడుదాం. సాయికృష్ణ మృతి లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. – రమేష్ గౌడ్, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
సజావుగా రీ నీట్
● హాజరు 88.58 శాతం నమోదు ● 3,508 మంది హాజరు, 492 మంది గైర్హాజరు అనంతపురం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) పునఃపరీక్ష సజావుగా జరిగింది. పరీక్ష నిర్వహణకు కటుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రబలగాలు బందోబస్తు నిర్వహించాయి. పరీక్షకు అభ్యర్థుల హాజరు 88.58 శాతంగా నమోదైంది. అనంతపురం నగర పరిధిలో 7 కేంద్రాలు, గుత్తి పట్టణ పరిధిలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు మొత్తం 3,960 మంది అభ్యర్థులకు గానూ 3,508 మంది హాజరుకాగా 452 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను, ప్రశ్నపత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ను కలెక్టర్ ఓ.ఆనంద్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల పాల్గొన్నారు. -
హైవేపై కాలిపోయిన కంటైనర్
గార్లదిన్నె: కల్లూరులో 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి కంటైనర్కు మంటలు రాజుకొని కాలిపోయింది. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. హర్యానాకు చెందిన తండ్రీ కొడుకులు రియాజ్, అహమ్మద్ కంటైనర్ను మహాలక్ష్మి లాజిస్టిక్స్ గూడ్స్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కంటైనర్ వాహనంలో ఫైబర్ నెట్ వస్తువులు, ద్విచక్ర వాహనాల బ్యాటరీలు, మెడిసిన్కు సంబంధించిన వస్తువులు బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. తీరా ఘటనాస్థలం కల్లూరు 44వ జాతీయ రహదారిపై వినాయక రైస్మిల్ సమీపంలోకి రాగానే వాహనం బ్యాటరీలో అర్త్ కావడంతో పొగలు కమ్ముకున్నాయి. వెనుకలే వెళ్తున్న మరో లారీ డ్రైవర్ గమనించి, వాహనంలో పొగలు వస్తున్నాయని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ రియాజ్ కంటైనర్ను రోడ్డు పక్కన ఆపి, తండ్రీ కొడుకులు సురక్షితంగా కిందకు దిగారు. నిమిషాల్లోనే కంటైనర్లో మంటలు వ్యాపించి, అందులోని బ్యాటరీలు, ఫైబర్ నెట్ వస్తువులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. స్థానికుల ద్వారా పోలీసులు, ఫైర్ సిబ్బంది సమాచారం అందుకొని ఘటనాస్థలానికి చేరుకొని నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. దాదాపు రూ.15 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఎస్ఐ తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వైఎస్సార్సీపీ నాయకుడి కార్యాలయంపై దాడి
తాడిపత్రిటౌన్: పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి కార్యాలయంపై టీడీపీకి చెందిన మౌలాలి, షఫీతోపాటు మరో ముగ్గురు ఆదివారం దాడి చేశారు. ఇనుప రాడ్లతో కార్యాలయ తాళాలు ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించారు. అందులోని టీవీ, రెండు ఏసీలతో పాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూటమి నేతల బాహాబాహీ సాక్షి టాస్క్ఫోర్స్: రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్ పెట్రోల్ బంకు వద్ద కూటమి నేతలు ఇద్దరు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. ఆదివారం సాయంత్రం పెట్రోల్ వద్ద టీడీపీ నాయకుడు బుడేపల్లి సుభాన్కు బీజేపీ నాయకుడు నాగిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదలు జరిగి, ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ గొడవ పడినట్లు తెలిసింది. గొడవ కారణంగా పెద్ద ఎత్తున జనం గూమిగూడారు. ఎస్ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువురినీ స్టేషన్కు తీసుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. రోడ్డుపైనే టీడీపీ, బీజేపీ నాయకులు భౌతిక దాడులకు దిగడంతో వారి మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోట ఊరువాకిలిలో పీర్ల ప్రతిష్టపై వివాదం రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ఊరువాలికిలో ఆదివారం పీర్ల ప్రతిష్టపై ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఊరువాకిలి స్థలంలో పీర్లను ప్రతిష్టిస్తూ వస్తున్నారు. మొహర్రం సందర్భంగా నిర్వాహకులు పీర్లను కొలువు దీర్చుతుండగా, వీహెచ్పీ, హెరిటేజ్ అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకొని అభ్యంతరం తెలిపారు. రూ.80 లక్షలతో కోట ముఖద్వారం ఊరువాకిలి జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్న ప్రదేశమని, ఇకపై ఇక్కడ పీర్ల పండుగ జరుపరాదని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశః ఉండడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. -
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం
అనంతపురం: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి.. ఆటవిక రాజ్యాన్ని అమలు చేస్తూ.. ఎవరు జీవించాలో..ఎవరు జీవించకూడదో.. నిర్ణయం తీసుకొని అందుకనుగుణంగా పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సగటు మనిషి బతకడం కంటే చావే శరణ్యం అనే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలిస్తాం అనే నియంతృత్వపు ధోరణి పెచ్చుమీరుతోందన్నారు. అనంతపురం నగరంలోని ప్రెస్క్లబ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ అధ్యక్షత వహించారు. చంద్రబాబూ అంబేడ్కర్ భావజాలమే గద్దె దింపుతుంది.. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవించే హక్కును కల్పించిన ఆర్టికల్ 21 .. మృతదేహాన్ని సైతం గౌరవించాలని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. అణగారిన వర్గాలు, పేదలు స్వేచ్ఛగా జీవించేలా ప్రసాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని అణిచి వేసే కుట్ర జరుగుతోందన్నారు. ఒక మనిషిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి.. చంపేసి.. అనాథ శవంగా బూడిద చేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించడానికే భయమేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..గాదె సాయికృష్ణ తల్లిదండ్రులను పరామర్శించకపోయినట్లయితే ఇప్పటి దాకా ఈ కేసుపై ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఉండేది కాదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలమే గద్దె దింపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు సంఘటితమై ప్రస్తుత ప్రభుత్వ అకృత్యాలు, అన్యాయాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సాయికృష్ణ లాకప్డెత్, పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి దీటుగా ఎదుర్కోకపోతే స్వేచ్ఛగా జీవించే పరిస్థితే ఉండదని పేర్కొన్నారు. జూలై 5న అనంతపురం జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కేపీ నారాయణ స్వామి, విష్ణు నారాయణ, న్యాయవాదులు వాల్మీకి హరి, పోతులయ్య, విద్యార్థి నాయకులు చంద్రశేఖర్ యాదవ్, పాపిరెడ్డి పల్లి పృథ్వి, హేమంత్ కుమార్, మహేష్, కట్టుబడి తానీషా తదితరులు మాట్లాడారు. అంబేడ్కర్ వ్యతిరేక భావజాలంతో అణగారిన వర్గాలపై దాడి రాష్ట్రంలో పెచ్చుమీరుతున్న నియంతృత్వ ధోరణి రెడ్బుక్ రాజ్యాంగాన్ని దీటుగా ఎదుర్కొందాం రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ జూలై 5న అనంతపురంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో బహిరంగ సభ -
కన్నీటి కష్టాలు కనిపించట్లేదా..?
రాయదుర్గంటౌన్: రాయదుర్గం పట్టణంలో రెండు నెలల నుంచి మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మున్సిపల్ అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. రాయదుర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కన్నీటి కష్టాలు తలెత్తాయి. తాగునీరు సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఎమ్మెల్యే కాలవ ఇంటి ముందు మహిళలు ధర్నా చేశారు. తాజాగా ఆదివారం ఉదయం పట్టణంలోని తహసీల్దార్ రోడ్డు ఏరియా, గోపాలస్వామి గుడి ఏరియా, వంట్లకుంట ఏరియాకు చెందిన మహిళలు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. వన్నూరుస్వామికట్ట బళ్లారి రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించడంతో గంటకుపైగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాలనీవాసులకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ నాయకులు నాగార్జున, రవి తదితరులు ఆందోళనలో పాల్గొని అధికారులు, పాలకుల తీరును ఎండగట్టారు. కాలనీల్లో రెండు వారాల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదని, అది కూడా రంగుమారి కలుషిత నీరు వస్తున్నట్లు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి కోసం కాలనీలవాసులు రోడ్డెక్కినా ఇంజినీరింగ్ అధికారులు ఎవరూ రాకపోవడం గమనార్హం. ఫిట్టర్లు, పోలీసులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. రాయదుర్గంలో మళ్లీ రోడ్డెక్కిన మహిళలు, స్థానికులు -
విద్యార్థుల ఉన్నత చదువుకు ఊతమివ్వాలి
అనంతపురం టవర్క్లాక్ : చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు చదువే నిజమైన ఆస్తి అని అన్నారు. ఆదివారం స్థానిక లలిత కళాపరిషత్లో ఏపీ రెడ్డి సంఘం, అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన రెడ్డి కుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా గంగులకుంట నరేష్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏటా ఏపీ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను కేవలం ప్రసంసలతోనే కాకుండా వారి పైచదువులకు మరింత ఊతం ఇవ్వాలన్నారు. అందుకోసం సంఘం తరఫున రూ.5వేల నగదు అందించామన్నారు. దాదాసు 30 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశామన్నారు. రెడ్డి సంఘం ఎల్లప్పుడూ విద్యార్థుల ఉన్నతికి, సమాజ వికాసానికి తోడ్పాటునందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు మెడియం పాల రాజశేఖర్ రెడ్డి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ రెడ్డి, నగర అధ్యక్షుడు దయ్యం హనుమంత రెడ్డి, నాయకులు శివారెడ్డి, బీఎస్ఎన్ఎల్ రాజశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి, రామోహన్ రెడ్డి, శ్రీరామిరెడ్డి, అలా మధుసూదన్ రెడ్డి, అరవింద రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దమనకాండను నిలువరించాల్సిందే..
రాష్ట్రంలో ఇంత దయనీయమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. పాశవికంగా మనిషిని చంపేసి.. కడచూపునకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉండడం దారుణం. గంగమ్మ అనే మహిళ లాకప్ డెత్ అయితే కనీసం ఆమె చనిపోయిందా.. లేదా అనే అంశం ఇప్పటికీ సమాచారం లేదు. ఆమె కొడుకును చిత్రహింసలకు గురిచేశారు. కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా కుటిల, దమనకాండను నిలువరించే ప్రయత్నం చేయాలి. – చామలూరు రాజగోపాల్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు -
సూక్ష్మం.. కానరాని మోక్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ చాలా మంది డీడీలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా ప్రాథమిక పరిశీలన, బిల్ ఆఫ్ క్వాంటిటీ(బీవోక్యూ),బెంచ్మార్క్సర్వే (బీఎంసీ), ఇతరత్రా డాక్యుమెంటేషన్ అంటూ జాప్యం చేస్తుండటంతో పరికరాల పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. ఎల్–నినో హెచ్చరికలు జారీ కావడం, భూగర్భజలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటివనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను కాపాడుకోవాలనే ఆత్రుతలో అన్నదాతలు ఉన్నా చంద్రబాబు సర్కారు మొద్దు నిద్ర పోతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాదివి పెండింగ్.. గతేడాది(2025–26)కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 18,180 మంది రైతులకు 23,356 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు మంజూరు చేశారు. ఈ రైతులందరూ తమ వాటా కింద డిజిటల్ పద్ధతిలో డీడీలు చెల్లించారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. 2026–27 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా ఇంకా 5 వేల మంది రైతులకు పరికరాలు అందని పరిస్థితి నెలకొంది. 22 వేల హెక్టార్లకు సరిపడా రైతులకు మెటీరియల్ అందించినట్లు చెబుతున్నా పొలాల్లో బిగించింది 18 వేల హెక్టార్లకే కావడం గమనార్హం. పాతవి పూర్తి చేయాలంటూ రెండు, మూడు నెలలుగా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి ఆదేశాలు ఇస్తున్నా ముందుకు కదలడం లేదు. బకాయిలతో సమస్య.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2024–25లో 17,609 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు ఇచ్చారు. గతేడాది(2025–26)లో 23,356 హెక్టార్లకు ఇచ్చారు. వీటికి సంబంధించి కంపెనీలకు కంటితుడుగా చెల్లింపులు చేసి రూ.వందల కోట్ల మేర బకాయిలు పెట్టడంతోనే పరికరాల సరఫరాకు మొండికేసినట్లు చెబుతున్నారు. ఆర్థికంగా ఉన్న కొన్ని కంపెనీలు చూద్దాంచేద్దాం అన్నట్లుగా ఉండగా, చాలా డ్రిప్ కంపెనీలు పరికరాల సరఫరాకు ససేమిరా అంటుండటం రైతులకు సమస్యగా మారింది. దరఖాస్తులు పెరిగే అవకాశం.. ఈ ఏడాది ఎల్–నినో ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యాన తోటలను కాపాడుకోవడం రైతులకు సవాల్గా మారింది. వర్షాలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలంటే డ్రిప్ అత్యవసరంగా మారింది. ప్రభుత్వం గతేడాదివే పెండింగ్ పెట్టడంతో ఈ ఏడాది మంజూరుకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే ఆర్ఎస్కేల్లోనూ, కంపెనీల వద్ద 35 వేల మంది రైతులు డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంజూరైన రైతులకే ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఎన్నడు అందుతాయనేది అంతుచిక్కడం లేదు. కంపెనీలకు బకాయిలు చెల్లిస్తే కాని సూక్ష్మసాగు ముందుకు పడని పరిస్థితి ఉన్నట్లు ఏపీఎంఐపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావొస్తోంది. అయినా, సూక్ష్మసాగు సేద్యానికి ఇంకా మోక్షం లభించలేదు. ఇదిగో అదిగో అంటున్నా ఒక రైతుకు కూడా మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 19 వేల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్ (బిందు, తుంపర) పరికరాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించినా ఇంకా కార్యాచరణ అమలు చేయకపోవడం గమనార్హం. ఈ ఏడాది 19 వేల హెక్టార్లకు సూక్ష్మ పరికరాలు ఇస్తామని ప్రకటన గతేడాది మంజూరు చేసిన రైతులకే ఇంకా అందని పరికరాలు డీడీలు చెల్లించిన 5 వేల మంది రైతుల ఎదురుచూపులు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరాకు కంపెనీల విముఖత -
నియంత ప్రభుత్వాలను నేలకూల్చాలి
యువకుడిని పాశవికంగా చంపేశారు. కనీసం బూడిద అయినా ఇవ్వండి అని బాధిత తల్లి కన్నీరు పెట్టడాన్ని చూస్తే బాధేస్తోంది. కేంద్రంలో అంబేడ్కర్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న మోదీ ప్రభుత్వం.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్నాయి. సనాతన ముసుగులో పవన్కళ్యాణ్ రోజుకో మాట, పూటకో మాట చెప్తున్నారు. ‘సర్’ పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగించడానికి కుట్ర జరుగుతోంది. నియంత ప్రభుత్వాలను నేలకూల్చడానికి సంఘటితం కావాలి. – దాదా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు -
విత్తన కార్తెలు మొదలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ విత్తుకు అదను మొదలైంది. ఆదివారంతో మృగశిర కార్తె ముగిసింది. సోమవారం నుంచి కీలకమైన ఆరుద్ర కార్తె మొదలవుతుంది. ఆరుద్రలో విత్తనం పడితే మంచి పంట దిగుబడులు వస్తాయని రైతుల్లో నమ్మకం. ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే ఆరుద్ర తర్వాత వచ్చే పునర్వసు కూడా విత్తుకునేందుకు మంచి అదనుగా చెబుతారు. వర్షాలు ఇంకా ఆలస్యమైతే ఆ తర్వాత వచ్చే పుష్యమి కూడా ఫరవాలేదంటున్నారు. మొత్తంగా ఆరుద్రతో పాటు పునర్వసు కార్తెలు పంటలు విత్తుకునేందుకు మంచి అదనుగా భావిస్తారు. ముంగారు వ్యవసాయ పనులు ప్రారంభించే ఏరువాక పౌర్ణమి కూడా ఆరుద్ర కార్తె మధ్యలో అంటే ఈనెల 29న రావడం విశేషం. జూలై 6న పునర్వసు, జూలై 20న పుష్యమి కార్తెలు వస్తాయి. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న, కొర్ర లాంటి ప్రధాన పంటల సాగుకు జూలై ఆఖరు వరకు వేసుకోవచ్చని, ఆగస్టు, సెప్టెంబర్లో ఉలవ, పెసర, అలసంద, మేత జొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రభావం చూపని ‘నైరుతి’.. ఆశల ‘నైరుతి’ జూన్ 6న జిల్లాలోకి ప్రవేశించింది. మొదటి వారంలో రుతుపవనాలు కాస్తంత ప్రభావం చూపినా... ఈనెల 14 తర్వాత మొహం చాటేశాయి. ఈనెల 7న 12.5 మి.మీ, 9న 5.7 మి.మీ, 13న 16.9 మి.మీ, 14న 26.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడంతో రైతులు ముందస్తుగా కంది, ఆముదంతో పాటు కొంత వేరుశనగ... ఇలా అన్ని పంటలు ప్రస్తుతానికి 50 వేల హెక్టార్లలో సాగు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఖరీఫ్లో 3.43 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే కీలకమైన సమయంలో వరుణుడు మొహం చాటేస్తుండటం పంటల సాగుకు అవరోధంగా మారింది. సాధారణం కన్నా తక్కువగానే.. జూన్ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా మొదటి 15 రోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే 63.9 మి.మీ నమోదైంది. అయినా బొమ్మనహాళ్, వజ్రకరూరు, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, డీ.హీరేహాళ్, రాయదుర్గం, యాడికి, కళ్యాణదుర్గం, నార్పల తదితర 12 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా అంతటా ఏరువాక మందకొడిగా ‘సాగు’తోంది. ఈనెలలో 8 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదైనా జిల్లా అంతటా ఒక రోజు కూడా వర్షం కురవని పరిస్థితి నెలకొంది. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు గతితప్పుతున్నట్లు అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనం, ఎరువుల కష్టాలు.. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రాయితీ విత్తన వేరుశనగ, కందులు, ఇతర విత్తనాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ పాటికి రైతులకు పూర్తిగా విత్తనం చేరాల్సివున్నా 20 శాతం మందికి కూడా వేరుశనగ, కందులు అందలేదు. యూరియా, డీఏపీ అమ్మకాలకు కొత్తగా యాప్ పెట్టి ఆంక్షలు విధించడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెంచేయడంతో పెట్టుబడి పెరిగి వ్యవ‘సాయం’ భారమైనట్లు ఆందోళన చెందుతున్నారు. ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్ గురించి పట్టించుకోకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. అరకొరగా ఇస్తున్న అన్నదాత సుఖీభవతోనే చేతులు దులుపుకునే పరిస్థితులు నెలకొన్నాయి. నేటి నుంచి విత్తనాలు విత్తుకునేందుకు శుభగడియలు ఆరుద్రతో పాటు పునర్వసు, పుష్యమి కార్తెలు ఏరువాకకు అదను ముందస్తు వర్షాలకు ఇప్పటికే 50 వేల హెక్టార్లలో పంటలు అరకొర విత్తనాలు, ఎరువుల ఆంక్షల నడుమ ఇబ్బందుల్లో రైతులు -
కుళ్లాయిస్వామి దర్శనం.. అవస్థల మయం
నార్పల: ముందు కష్టాలు దాటితేనే తర్వాత కుళ్లాయిస్వామి దర్శనం అన్నట్లుగా పరిస్థితి మారింది. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొహర్రం ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తుండగా, ఆలయ పరిసరాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడం భక్తులకు శాపంగా మారింది. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి రావడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు. భద్రతా సిబ్బంది తగినంత మంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో భక్తుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిద్రమత్తు వదిలి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. హుండీలు భద్రమేనా...? గత ఏడాది ఉత్సవాల సందర్భంగా గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో ఒకటి గల్లంతవడం అప్పట్లో కలకలం రేపింది. భక్తులు సమర్పించిన కానుకలతో నిండిన హుండీ అనుమానాస్పద రీతిలో మాయమైపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై విచారణ నిమిత్తం దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ గూగూడుకు వచ్చిన సమయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ల బ్యాకప్ లేదని స్థానిక సిబ్బంది తెలపడం, పలుమార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడడం అప్పట్లో సంచలనం కలిగించింది. ఈఓ శోభారాణి పాత్రపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో గూగూడు గ్రామస్తులు, కుళ్లాయిస్వామి భక్తుల్లో అనుమానాలు రేకెత్తాయి. మొహర్రంను పురస్కరించుకుని ఈ సారి ఆలయంలో నాలుగు హుండీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా హుండీలను భద్రంగా కాపాడాలని భక్తులు కోరుతున్నారు. గత ఏడాది హుండీ మాయమైన విషయంపై పొలీసులు, దేవదాయ శాఖ అధికారులను వివరణ కోరగా ఆర్డీఓ సమక్షంలో విచారణ జరిగిందని, ఖాళీ హుండీ అని తేలడంతో కేసు ముగించినట్లు తెలిపారు. -
బతకాలంటే బరితెగించి పోరాడాలా..?
చేతికి రక్తపు మరక అంటకుండా.. నచ్చని వ్యక్తులను అంతం చేసే కుట్ర జరుగుతోంది. పోలీసుల భుజంపై గన్ను పెట్టి కాల్చే పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో దళిత విలేకరిపై దాడులు చేస్తే ఇప్పటి దాకా చర్యలు లేవు. ఈ సమాజంలో బతకాలంటే బరితెగించి పోరాడాల్సిన అవసరం ఉంది. పోలీసులు, పాలకులను వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కాపాడుకుందాం. – సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. అర్జీతో పాటు ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap. gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. నేడు ఎంటీఎస్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పని చేస్తున్న ఎంటీఎస్ టీచర్లకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం స్థానిక సైన్స్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు, మధ్యాహ్నం 2 గంటలకు 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు హాజరుకావాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో అనధికారికంగా గైర్హాజరు అయినవారు, ఈనెల 12న స్కూల్లో జాయిన్కాని ఎంటీఎస్ టీచర్లకు రెన్యూవల్ చేయరని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన టీడీపీ నాయకులు ● వైఎస్సార్ సీపీ నాయకుడిపై కట్టెలతో విచక్షణారహితంగా దాడి కూడేరు: టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ నాయకుడిపై కట్టెలతో విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండల పరిధిలోని మరుట్ల–1 కాలనీలో మూడు రోజుల క్రితం వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు దొడ్డప్ప కుమారుడు కౌశిక్, టీడీపీ నాయకుడు పవన్ కుమారుడు త్రిలోక్ గొడవపడ్డారు. త్రిలోక్ తన తండ్రిని పిలుచుకొని రావడంతో కౌశిక్ను కొట్టి వెళ్లాడు. విషయం దొడ్డప్పకు తెలియడంతో పవన్ ఇంటికి వెళ్లి తన కుమారుడిని ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. స్థానికులు సర్దిచెప్పడంతో దొడ్డప్ప వెనక్కి వచ్చాడు. తన ఇంటిపైకి వైఎస్సార్ సీపీ నేతలు దాడికి వచ్చారని పవన్ పోలీసులను ఆశ్రయించగా.. తన కుమారున్ని కొట్టాడని దొడ్డప్ప ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి పొలంలో నుంచి దొడ్డప్ప,ఆయన అల్లుడు బాలచంద్ర వస్తుండగా టీడీపీ నేతలు పవన్, రమేష్, నగేష్, ప్రసాద్, వెంకటేష్తో పాటు మరో 10 మంది కర్రలతో దాడికి దిగారు. బాలచంద్ర ఎలాగోలా తప్పించుకుని బయటపడగా, దొడ్డప్పను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు అతన్ని అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలందించారు. ఎలుగుబంటి హల్చల్ మడకశిర రూరల్: మండల పరిధిలోని మెళవాయి పంచాయతీలోని సింగేపల్లిలోని బీసీ కాలనీ వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఆదివారం ఉదయం బీసీ కాలనీ వద్దకు వచ్చిన ఎలుగు బంటిని గమనించిన కుక్కలు మొరగడంతో కాలనీ వాసులు చూసి కేకలు వేశారు. దీంతో ఎలుగు పొలాల వైపు పరుగులు తీసింది. రాత్రి సమయంలో బయటికి వెళ్లేందుకు భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని గ్రామం వైపు ఎలుగుబంటి రాకుండా చూడాలన్నారు. -
కళ్యాణదుర్గంలో రెండిళ్లలో చోరీలు
కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో శనివారం రాత్రి వరుస దొంగతనాలు జరిగాయి. స్థానిక జయనగర్ కాలనీలోని సుధాకర్ ఇంటి తాళం ధ్వంసం చేసి, లోపలికి ప్రవేశించి బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే ఇంట్లో మరో గదిలో ఉన్న లాకర్ తెరిచేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. అదే కాలనీల్లో మరో ఇంట్లో దొపిడీకి యత్నించారు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంట్లో ఎలాంటి నగదు దొరక్క వెళ్లిపోయారు. ఉదయం ఇంటి యజమానులు ఇంటితాళాలు తెరిచి ఉండటతో దొంగతనం జరిగినట్లు భావించి పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో పశువుల దొంగలు ఉరవకొండ: ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగలు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని వై.రాంపురం గ్రామానికి చెందిన కొందరు రాత్రి సమయాల్లో గ్రామాల్లో పశువులను ఎత్తుకెళ్లి, వాటిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దొంగలను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి గుమ్మఘట్ట: మండలంలోని గౌనికుంట గ్రామానికి చెందిన గంగమ్మ (60) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గంగమ్మకు హనుమక్క, బొమ్మక్క సంతానం. వీరికి వివాహాలు అయ్యాయి. అత్తంటిట్లోనే అల్లుళ్లు కూడా ఉంటున్నారు. గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమెను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, మార్గంమధ్యలో మృతి చెందింది. కాగా, గంగమ్మ మృతిపై కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో నుంచి జారిపడి వ్యక్తి మృతి పెద్దవడుగూరు : మండలంలోని గుత్తి అనంతపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆటో నుంచి జారిపడి సాకే శ్రీనివాసులు (36) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలోని అక్షయ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆటోలో ప్యాపిలి వెళ్లి తిరిగి వస్తుండగా షుగర్ అధికమై, కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక వస్తున్న గుర్తు తెలియని వాహనం అతనిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉనానరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ● కుమారుడిని నీట్ పరీక్షకు తీసుకెళ్లి తిరిగొస్తుండగా ఘటన తాడిపత్రి రూరల్ : చుక్కలూరు క్రాస్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వనాథ్ (45) మృతి చెందాడు. అప్గ్రెడ్సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన విశ్వనాథ్ విజయబార్ అండ్ రెస్టారెంట్లో మేనేజర్గా పని చేస్తున్నాడు. గుత్తిలో కుమారుడు శ్రీనాథ్ను ద్విచక్రవాహనంపై నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. పరీక్ష రాయించుకొని తిరిగి వస్తుండగా, మార్గంమధ్యలో స్నేహితుడి కారులో కుమారున్ని ఎక్కించాడు. ద్విచక్రవాహనంపై వస్తున్న విశ్వనాథ్ను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి
అనంతపురం కల్చరల్: ఒక్క రోజుకు పరిమితం కాకుండా నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు యోగాసనాలు వేశారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఒత్తిడి లేని జీవితానికి యోగా చక్కటి పరిష్కార మార్గమన్నారు. ఈ ఏడాది 4 వేల ప్రదేశాల్లో 5 లక్షల మందికి పైగా యోగాపై శిక్షణ, అవగాహన కల్పించామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో పాల్గొన్న 50 మందికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలనందించి సత్కరించారు. కార్యక్రమంలో వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, బ్రహ్మకుమారీల ఇన్చార్జ్ సిస్టర్ శారద, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి లాట్యనాయక్, ఇన్చార్జ్ ఆర్డీఓ రామమోహన్, ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, కమిషనర్ జశ్వంత్రావు, డీఎంహెచ్వో డాక్టర్ ఈబీదేవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్ -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఉంటుందని సీఎండీ శివశంకర్ లోతేటి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్: 8977716661లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలన్నారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. పీఏబీఆర్ జలాశయంలో తగ్గిన నీటి మట్టం కూడేరు: మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2.1 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు ఆదివారం తెలిపారు. డ్యాంలోకి ఇన్ప్లో లేదు. పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి, అనంత, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి, లీకేజీ రూపంలో మరో 75 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. అవుట్ ఫ్లో మాత్రమే ఉండడంతో నీటి మట్టం రోజు రోజుకూ తగ్గిపోతోంది. నీటి మట్టం తక్కువున్నా తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని డ్యాం ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఆనవాయితీ పేరిట చెట్లను అంతం చేయొద్దు ● జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహరం సందర్భంగా అగ్ని గుండాల ఏర్పాటు చేసే ఆనవాయితీ పేరిట చెట్లను నరికి గుండాల్లో పడేయొద్దని ఉమ్మడి జిల్లాల అటవీ అధికారి (డీఎఫ్ఓ) చక్రపాణి సూచించారు. ఆదివారం ఆయన అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో పీర్ల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని, పీర్ల చావిడి ఎదుట అగ్నిగుండంలో పెద్ద ఎత్తున చెట్లు నరికి, మొద్దులు వేసి అంటించడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇటీవల కురిసిన గాలివానకు చాలాచోట్ల పెద్ద చెట్లు పడిపోయాయని, అలాంటివి గుండంలోకి వేయాలన్నారు. లేదా విచ్చలవిడిగా కంపచెట్లు పెరిగాయని, వాటిని వాడుకోవాలని డీఎఫ్ఓ తెలిపారు. ఎవరికై నా అగ్నిగుండంలో వేసేందుకు ఎండిన కట్టెలు, వంట చెరకు కావాల్సి వస్తే అటవీ సిబ్బందిని సంప్రదిస్తే సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల అవగాహన కల్పిస్తున్నాం.. ఎఫ్ఆర్ఓ శివరాం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పచ్చని పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా రేంజి పరిధిలోని కూడేరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల, నార్పల తదితర మండలాల పరిధిలో ’చెట్లను నాటుదాం– పర్యావరణాన్ని కాపాడుకుందాం’ నినాదంతో ప్రజలకు ర్యాలీలు, జీపుజాతా, సదస్సులు, బీట్ కమిటీల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొహర్రం పండుగకు పచ్చని చెట్లను నరికకుండా ఎండిన వాటిని వినియోగించాలన్నారు. రేబిస్ వ్యాక్సిన్ లేదట!బొమ్మనహాళ్: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఆదివారం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మండలంలోని ఉంతకల్లుకు చెందిన ప్రతిభ అనే చిన్నారిని కుక్క కరవడంతో ఆమె తండ్రి వ్యాక్సిన్ వేయించేందుకు బొమ్మనహాళ్ పీహెచ్సీకి తీసుకెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. సిబ్బంది వద్దకు వెళ్లి చిన్నారి తండ్రి విషయం చెప్పాడు. ఇక్కడ కుక్కకాటుకు మందు లేదని సమాధానం చెప్పారు. దీంతో చిన్నారి తండ్రి దిక్కుతోచని స్థితిలో ఉండగా, పీహెచ్సీ డీడీఓ డాక్టర్ శ్రావణ్కుమార్ చొరవ తీసుకొని శ్రీధరఘట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కుక్క కాటు వ్యాక్సిన్ తెప్పించి, చిన్నారికి వేయించారు. చిరుత కలకలం కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని రాయదుర్గం రోడ్డు సమీపంలో ఆదివారం చిరుత స్థానికులకు తారస పడింది. దీంతో చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో చిరుత పక్కనే ఉన్న కొండల్లోకి పరుగుతీసింది. -
విషాదం.. రైలుకింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాప్తాడు మండలం గంగులకుంట వద్ద రైలు కింద పడి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రేమ జంట మృతికి పెళ్లికి అంగీకరించకపోవడం కారణమా లేదా మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. -
ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
అనంతపురం క్రైం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని వీకే భవన్లో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ఉద్యమ సన్నాహక సదస్సులో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, జి.వి.నరసయ్య, కోకన్వీనర్లు పి.వి.రమణారెడ్డి, సి.సుందరయ్య, ఎం.పురుషోత్తం పాల్గొన్నారు. సమావేశానికి జోనల్ కార్యదర్శి ఎం.చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన వారిలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న భారీ రాయితీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తున్నారని విమర్శించారు. జి.వి.నరసయ్య మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా కొత్త బస్సులు, సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం 12 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రతి నెల సుమారు 250 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నా నియామకాలు చేపట్టలేదన్నారు. నెల్లూరు–2, గుంటూరు–2, విద్యాధరపురం డిపోలను తిరిగి ప్రారంభించాలని, మంగళం డిపోను ఖాళీ చేయించే చర్యలను నిలిపివేయాలని కోరారు. శక్తి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన రీయింబర్స్మెంట్ నిధులను పూర్తిగా విడుదల చేయాలని కోరారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు: ప్రభుత్వానికి ఇప్పటికే వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందన లేకపోతే ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, గేట్ మీటింగ్లు, ధర్నాలు నిర్వహిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరికలు చేశారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన రాష్ట్ర, జోనల్, జిల్లా, రీజియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు, డిపో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి -
రైతుల ఆత్మహత్యలు పట్టవా?
● సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజంపుట్లూరు: సీఎం చంద్రబాబుకు రైతుల ఆత్మహత్యలు పట్టడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. పుట్లూరు మండలంలోని మడు గుపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కామి శెట్టి చంద్రమోహన్ కుటుంబాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ పరామర్శించారు. శనివారం మడుగుపల్లి గ్రామంలో బాధిత రైతు ఇంటికి వెళ్లి చంద్రమోహన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి భార్య శాంతి, కుమార్తె సంధ్య, కుమారుడు అభికుమార్ను ఓదార్చి ధైర్యం చెప్పారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. చంద్రబాబుకు రైతుల ఆత్మఘోస పట్టదా..? : శైలజానాథ్ మాట్లాడుతూ జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 రైతు ఆత్మహత్యలు జరిగాయని, ఈ ఆత్మహత్యలు వ్యవసాయం ఎదుర్కొంటున్న సంక్షోభానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు రైతుల ఆత్మగోషలను తెలుసుకోవాలని హితవు పలికారు. కామిశెట్టి చంద్రమోహన్ అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు ప్రభుత్వం తరఫున అధికారులు కూడా పట్టించుకోలేదన్నారు.అనంతరం రెవెన్యూ, వ్యవసాయ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి, బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు, వర్షాభావ పరిస్థితులు, ధరల లేమి, పెట్టుబడుల భారం, తెగుళ్ల బెడదతో రైతులు ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నారన్నారు. రైతులు నష్టపోయిన సమయంలో వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తల్లీ.. నీబిడ్డ చదువు మధ్యలో ఆగిపోనివ్వనమ్మా.. : తల్లీ.. నీ బిడ్డ చదువు ఆగిపోనివ్వనమ్మా.. రెండేళ్లపాటు కాలేజీ ఫీజు చెల్లిస్తాను.. ధైర్యంగా ఉండాలని బాధితురాలికి శైలజానాథ్ భరోసా ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కామిశెట్టి చంద్రమోహన్ కుమార్తె సంధ్య డిప్లమో చదువుతుండగా కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉందని తెలుసుకున్న ఆయన.. చదువు మధ్యలో ఆగిపోకుండా రెండేళ్ల ఫీజు తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. మండల కన్వీనర్ పొన్నపాటి మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సువర్ణ, పలు విభాగాల నాయకులు వంశీగోకుల్రెడ్డి, మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, శేఖర్, కాటమయ్య, సురేష్, మధుసూదన్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా నేమకల్లు అంజన్న ప్రతిష్టాపన
బొమ్మనహాళ్: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం అంజన్న ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గర్భాలయ నిర్మాణం నేపథ్యంలో మూలవిరాట్ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. ఆలయ ప్రాంగణంలోని భోజన శాలలో బాలాలయాన్ని నిర్మించి ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్టింపజేశారు. శనివారం వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ధర్మకర్త శ్రీనాథ్ ఆధ్వర్యంలో బాలాలయంలో స్వామిని ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంజన్న ప్రతిష్టాపన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామంజనేయులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎంసీహెచ్ రాజ్కుమార్, సుదర్శన్రెడ్డి, మాజీ సర్పంచ్ పరమేష్, నాయకులు కోటేశ్వరరెడ్డి, కలేకుర్తి జయరామ్రెడ్డి, హంపారెడ్డి, లక్ష్మీనారాయణ, ఫొటో బసవరాజు, బడిగే వన్నూరుస్వామి, అంజి, సిద్దనగౌడ్, రామాంజనేయులు, నాగరాజు, జగన్ పాల్గొన్నారు. కుక్ పోస్టుకు దరఖాస్త్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న కుక్ పోస్టు– 1 భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న వారు http:// ananthapuramu.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, భర్తీ చేసి, సంబంధిత సర్టిఫికెట్లను జరపరచాలన్నారు. ఈనెల 30లోపు డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు అందించాలన్నారు. సమర్థవంతంగా సేవలు అందించాలి అనంతపురం అర్బన్: రెవెన్యూ ఉద్యోగులు సేవలు సమర్థవంతంగా అందించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో రెవెన్యూడే నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జేసీ విష్ణుచరణ్కు డీఆర్ఓ మలోల, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎన్.దివాకర్రావు కేక్ తినిపించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు శాఖపై విశ్వనీయత పెంచాలన్నారు. అనంతరం జేసీని అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, పద్మావతి, పరిపాలనాధికారి అలెగ్జాండర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దివాకర్రావు, కోశాధికారి పునీత్బాబు, విభాగాల సూపరింటెంట్లు, తహసీల్దార్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’విడపనకల్లు: అర్హత ఉన్న ప్రతి రైతుకూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం మండలంలోని వి.కొత్తకోటలో 2026–27 సంవత్సరం మొదటి విడతగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. పీఎం కిసాన్ 23వ విడత నిధులను వెస్ట్ బెంగాల్ తారకేశ్వర్ హుగ్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విడుదల చేస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల నుంచి విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా, మండల వ్యవసాయాధికారులు, తహసీల్దారు వెంకటరమణమ్మ, రైతులు పాల్గొన్నారు. -
అటకెక్కిన ‘పెరటి తోటలు’
తాడిపత్రి రూరల్: అంగన్వాడీ కేంద్రాల వద్ద చేపట్టిన పెరటి తోటల పెంపకం అధికారుల పర్యవేక్షణ లోపంతో అటకెక్కింది. చిన్నారుల్లో రక్తహీనత, పోషణ లోపాలను సరిదిద్దేందుకు వారికి అందించే ఆహారం పోషకాలతో నిండి ఉండాలన్న లక్ష్యంతో న్యూట్రీ కిచెన్ గార్డెన్ పేరిట పెరటి తోటల పెంపకానికి సీ్త్ర శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5,126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సొంత భవనాలు కలిగిన 339 అంగన్వాడీ కేంద్రాలను పెరటి తోటల పెంపకానికి ఎంపిక చేశారు. ఇందులో అనంతపురం జిల్లాలో 185 కేంద్రాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 154 కేంద్రాలు ఉన్నాయి. గత ఏడాది రూ.33.90 లక్షల నిధులు విడుదల చేసి.. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేల చొప్పున అంగన్వాడీ టీచర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల వద్ద గోరుచిక్కుడు, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు, గోంగూర, మెంతికూర, పాలకూర, చుక్కాకు, కొత్తిమీర, తదితర వాటిని పండించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలను అదేశించింది. అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ అందించింది. అయితే కొద్ది రోజులకే అనేకచోట్ల సంరక్షణ కరువైంది. పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, వీధి కుక్కలు చొరబడి మొక్కలను నాశనం చేశాయి. మరికొన్ని చోట్ల నీటి సౌకర్యం లేక మొక్కలు దెబ్బతిన్నాయి. అధికారులు కూడా పర్యవేక్షణను గాలికొదిలేశారు. పెరటి తోటలు కనుమరగవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరకుండా పోయింది. పెరిగిన పనిభారం అంగన్వాడీ వర్కర్లు ఉదయం నుంచి రాత్రి వరకు యాప్లతో కుస్తీ పడుతున్నారు. సర్వేలు, ప్రాజెక్టు మీటింగ్లు, సెక్టార్ సమావేఽశాలు తదితర వాటితో పనిభారం విపరీతంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పెరటి తోటల పెంపకం మరింత భారంగా పరిణమిందని పలువురు అంగన్వాడీ వర్కర్లు వాపోయారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం అంగన్వాడీ కేంద్రాల వద్ద ధ్వంసమైన మొక్కలు ఇదీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో న్యూట్రీ కిచెన్ గార్డెన్ల దుస్థితి -
ఉమ్మడి జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజులూ ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీ 3.2 మి.మీ, 22న 3.8 మి.మీ, 23న 2.2 మి.మీ, 24న 1.7 మి.మీ సగటువర్షపాతం నమోదు కావొచ్చన్నారు. అక్కడక్కడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీస్తుందన్నారు. కనీసం 20 మి.మీ వర్షపాతం నమోదైతే పంటలు విత్తుకునేందుకు అనుకూలమని పేర్కొన్నారు. 15 మందికి డీటీలుగా పదోన్నతి అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 15 మంది సీనియర్ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు డీటీలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మందికి రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్లుగా (ఆర్ఎస్డీటీ), ఒకరికి రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఆర్ఎస్డీటీలుగా పదోన్నతి పొందిన వారిలో తొమ్మిది మందిని అనంతపురం జిల్లాకు, ఐదుగురిని శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. రెగ్యులర్ డీటీగా షేక్షావలికి పదోన్నతి కల్పిస్తూ కలెక్టరేట్లో కేఆర్ఆర్సీ విభాగంలో నియమించారు. పదోన్నతి పొందినవారు వీరే.. ఆర్ఎస్డీటీలుగా పదోన్నతి పొందిన వారిలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన హెచ్ఎం హేమంత్, నరేష్కుమార్రెడ్డి, బి.షాషావలి, పి.షేక్షావలి, కె.అశోక్ ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వారిలో ఒ.భాస్కర్రెడ్డి, డి.నాగరాజశేఖర్, వి.వరలక్ష్మి, సి.ఎం.చిన్ననారాయణమ్మ, జీవన్విజయ్కుమార్, టి.భారతి, లహరిక, ఎస్.సరళ, టి.సంధ్య ఉన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు బుక్కరాయసముద్రం: రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శనివారం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం 2026–27లో భాగంగా మొదటి విడత పెట్టుబడిసాయం మంజూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం, సీఎంల కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ ఆనంద్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ సదాశివం, ఆర్టీసీ జోనల్ చైర్మన్ నాగరాజు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి, నాయీబ్రాహ్మణ అభివృద్ధి సంఘం డైరెక్టర్ ఆదినారాయణ, మార్కెట్ యార్డు వైస్ చైర్పర్సన్ శైలజ, ఎంపీపీ సునీత, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, రేకులకుంట పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి, శాస్త్రవేత్తలు, అధికారులు రైతులు పాల్గొన్నారు. పీఎం కిసాన్–సుఖీభవ సొమ్ము విడుదల అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ కింద 23వ విడతగా... అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిసాయం కింద శనివారం సొమ్ము విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి తెలిపారు. పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున 2,542,269 మంది రైతులకు రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. తప్పుల్లేని ఓటరు జాబితా లక్ష్యం అనంతపురం అర్బన్: తప్పులు లేని ఓటరు జాబితా లక్ష్యంగా జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్–సర్) 2026 పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ‘సర్’పై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్ఓ మలోలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అర్హుల ఓట్లు తొలగించడం జరగదని స్పష్టం చేశారు. ఓటు నమోదులో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దగా చేసినందుకు సంబరాలా..?
● కూటమి పార్టీలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం అనంతపురం: హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలనూ దగా చేసినందుకు కూటమి పార్టీలు విజయోత్సవాలు నిర్వహించాయా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి హామీలను విస్మరించి నయవంచన చేశామనే ఆనందంలో సంబరాలు చేశారా అని ఎద్దేవా చేశారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంత మాట్లాడారు. అనంతపురంలో విజయోత్సవం పేరుతో నిర్వహించినది నయవంచన సభ అంటూ విమర్శించారు. ఏకంగా కలెక్టర్ను కూడా టీడీపీ కార్యకర్తలా మార్చేశారని విరు చుకుపడ్డారు. వేదికపై కలెక్టర్ సమక్షంలోనే రాజకీయ ఉపన్యాసాలు చేయించి.. హోదాను తగ్గించారన్నారు. ఫించన్లలోనూ కోత వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో 66 లక్షల మంది సామాజిక భద్రత పింఛన్ అందుకునే వారని గుర్తు చేశారు. రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకపోగా.. ఉన్నవాటిలో 6 లక్షల పింఛన్లు తొలగించినందుకు విజయోత్సవ సభ నిర్వహించారా అని అనంత విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. సూపర్ సిక్స్ హామీల్లోని నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఎక్కడ? ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.1500 ఏదీ? అంటూ నిలదీశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రైతులకు రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేంద్రంతో ముడిపెట్టారని.. పైగా తొలి ఏడాది ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అందించలేదని మండిపడ్డారు. రెండో ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టారని విరుచుకుపడ్డారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్లో అవినీతి హంద్రీ–నీవా తొలి దశ కాలువ వెడల్పు అనుకున్న స్థాయిలో చేయలేదని, రెండో దశ లైనింగ్ పనుల్లో అవినీతి పెరిగిపోవడంతో నాణ్యత లేకుండాపోయిందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. చంద్రబాబు మాత్రం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్పరం చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులనూ అమ్మకానికి పెడుతోందన్నారు. డైవర్షన్ పాటిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. డీఎస్సీ కుంభకోణం, విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, దళితుడు క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం సునీల్ను అరెస్ట్ చేసిందన్నారు. ఈ అరెస్ట్ను ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమాల పుట్టగా డీఎస్సీ నియామకాలు చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ నియామకాలను అక్రమాలకు నిలయంగా మార్చిందని అనంత ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒకే నోటిఫికేషన్తో సచివాలయాల్లో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా రాలేదని గుర్తు చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు, లోకేష్ను విమర్శించిన తీరును అర్థం చేసుకోవాలన్నారు. ఏ ఎండకా గొడుగు పట్టుకునే నైజం ఉన్న వారిని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యరద్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు కేశవరెడ్డి, యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి మసూద్, సోషల్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంటీఎస్ టీచర్లకు తొలి ప్రాధాన్యత
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల బదిలీల్లో 2008 డీఎస్సీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 22లోపు పూర్తి చేయనున్నారు. సీనియార్టీ జాబితా తయారీపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్లో పాల్గొ నని అభ్యర్థులు, అనధికారికంగా విధులకు గైర్హాజరైన, అనుమతించిన సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరని ఎంటీఎస్ టీచర్లు పునర్నియామకానికి అర్హులు కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎంటీఎస్ టీచర్ల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఏడాది మే 31 నాటికి ఉన్న స్పష్టమైన ఖాళీలను గుర్తించనున్నారు. 2026 జూన్ 20 నాటికి విద్యార్థుల నమోదు, ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) మేరకు ఖాళీలను కౌన్సెలింగ్లో ప్రదర్శించనున్నారు. ప్రాథమిక/ ఫౌండేషనల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 18 మాత్రమే ఉండి, రెండు ఎస్జీటీ పోస్టులు మంజూరై ఒక పోస్టు ఖాళీగా ఉంటే, పీటీఆర్ ప్రకారం ఒక ఎస్జీటీ సరిపోతే ఆ ఖాళీ పోస్టును బ్లాక్ చేయనున్నారు. అయితే నమోదు 21 నుంచి 59 మధ్య ఉంటే ఆ ఖాళీని కౌన్సెలింగ్లో చూపనున్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలో నమోదు 55 ఉండి, ఒక పీఎస్ హెచ్ఎంతో పాటు నాలుగు ఎస్జీటీ పోస్టులు మంజూరైనప్పటికీ పీటీఆర్ ప్రకారం ఒక పీఎస్హెచ్ఎం, మూడు ఎస్జీటీలు సరిపోతే మిగిలిన ఖాళీ పోస్టును బ్లాక్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. నమోదు 60 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఆ ఖాళీని కౌన్సెలింగ్లో చూపవచ్చని స్పష్టం చేశారు. జూన్ 20 నాటికి విద్యార్థుల నమోదు ‘0’ ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న మంజూరిత పోస్టులను ఎంటీఎస్ కౌన్సెలింగ్లో ప్రదర్శించరాదని ఆదేశించారు. 2008 డీఎస్సీ వారికి ప్రథమ ప్రాధాన్యం కౌన్సెలింగ్లో ముందుగా 2008 డీఎస్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే సింగిల్ టీచర్ స్కూల్లో ఎంటీఎస్ టీచర్ పనిచేస్తుంటే, ప్రత్యామ్నాయ టీచర్ను కేటాయించే వరకు ఆ ఉపాధ్యాయుడిని రిలీవ్ చేయరాదని సూచించారు. అన్ని ఖాళీల కేటాయింపులు పూర్తిగా సీనియారిటీ ఆధారంగానే జరగాలని, ఎలాంటి మినహాయింపులూ ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి, జూన్ 22 నాటికి పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గతేడాది కౌన్సెలింగ్కు గైర్హాజరైన వారికి అవకాశం లేదు సీనియర్ జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు ఈ నెల 22లోపు ప్రక్రియ పూర్తికి ఆదేశం కీలక మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్ -
చిన్న సమస్యలూ కలెక్టర్ చెంతకే
● క్షేత్రస్థాయిలో నోచుకోని పరిష్కారం ● ‘పరిష్కార వేదిక’లో వెల్లువలా అర్జీలు ● అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపం అనంతపురం అర్బన్: స్థానికంగా పరిష్కారం కావాల్సిన చిన్న సమస్యలను కూడా అధికారులు అశ్రద్ధ చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లవలా వస్తున్నాయి. గ్రామ, పట్టణ స్థాయిలో రోడ్లు, కాలువలు, పారిశుధ్యం వంటి చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దృష్టికి వస్తుండడమే ఇందుకు నిదర్శనం. ప్రజల సమస్యలపై గ్రామ, మండలస్థాయి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోంది. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రెండున్నర నెలలో 15 వేల అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూయేతర సమస్యలకు సంబంధించి దాదాపు 9 వేలు ఉన్నాయి. అందిన అర్జీల్లో చాలా వరకు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నా... వారి చూపిన పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందడం లేదు. దీంతో అవి రీ–ఓపెన్ అవుతూనే ఉన్నాయి. అలా రీ– ఓపెన్ అయినవే దాదాపు 3 వేల వరకు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవీ స్థానిక సమస్యలు... ● ‘ఊర్లోని నీరు ఎస్సీ వీధిలో ఇళ్ల మధ్యకు చేరుతోంది. దోమల సమస్య అధికంగా ఉంది. నాలుగు ఏళ్లుగా అర్జీ ఇస్తున్నాము. ఎంపీడీఓకి చెబితే రోడ్డు మధ్య కాలువ తీశారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కరించాలని’ కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కూడేరు మండలం కమ్మూరుకు చెందిన పెద్ద ఓబులేసు విన్నవించాడు. ● ‘మా ఇంటి పక్క వీధిలోని వారు చెత్త, చెదారం, కుళ్లిన వంట పదార్థాలు తీసుకొచ్చి మా కాంపౌండు దగ్గర వేస్తున్నారు. దుర్వాసనతో మా కుటుంబ సభ్యులందరమూ ఇబ్బంది పడుతున్నాం. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి’ అని నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామానికి చెందిన షమీమ్ ‘పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేసింది. ● ‘బుక్కరాయసముద్రం చెరువు కట్ట రోడ్డు పాడయ్యింది. ఈ రహదారిలో ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా ఉంది. రోడ్డు బాగు చేయాలని రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎండార్స్మెంట్ ఇస్తున్నారే తప్ప రోడ్డు మరమ్మతు చేయలేదు. ఇప్పటికై నా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం’ అంటూ అనంతపురం పరిధిలోని నవోదయ కాలనీకి చెందిన జె.కాటమయ్య ‘పరిష్కార వేదిక’లో విన్నవించాడు. ● ‘మా వీధిలో సిమెంట్ రోడ్డు, మురికి కాలువ లేదు. నీటి సమస్య ఉంది. ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో నివాసముంటున్నాం. పంచాయతీ అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు’ అని అనంతపురంలోని భైరవనగర్కు చెందిన వై.మహేశ్వరరెడ్డి ‘పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేశాడు. ప్రతి వారం ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్ దృష్టికి ఇలాంటివి చాలానే వస్తున్నాయి. -
నీట్ పునఃపరీక్షకు సర్వం సిద్ధం
● నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ● జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలు అనంతపురం సెంట్రల్/ అనంతపురం అర్బన్: జిల్లాలో నీట్–2026 పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం నగరంలోని శ్రీ సాయిబాబా నేషనల్ (ఎస్ఎస్బీఎన్) డిగ్రీ కళాశాలలోని నీట్ సెంటర్లో ఏర్పాట్లను ఎస్పీ జగదీష్, కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ శాంత తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నీట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్షా కేంద్రంలో ఉండాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు తప్ప బయటవారిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరాదన్నారు. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా బయోమెట్రిక్ పరిశీలన చేయాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, నెట్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని, సీసీటీవీలు సజావుగా పనిచే సేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు సజావుగా నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. హాజరుకానున్న 3,959 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. 3,959 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జేఎన్టీయూ, పాలిటెక్నిక్ కళాశాల, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల, ఎస్కేయూ, ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, గుత్తిలో కేంద్రీయ విద్యాలయం, గుత్తి జెడ్పీ బాలికల హైస్కూల్లో నీట్ పరీక్ష జరుగుతుందన్నారు. ● డీఆర్వో మలోల నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని, కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఈ– అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని ప్రభుత్వ గుర్తింపుకార్డుతో పరీక్షకు హాజరుకావాలన్నారు. ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేపర్ లీక్ను అరికట్టేందుకు కేంద్ర బలగాల ఎస్కార్ట్, జిల్లా పోలీసు బందోబస్తు మద్య ప్రశ్నపత్రం, జవాబు పత్రాలు తరలిస్తామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆద్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షను సజావుగా నిర్వహించేలా అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మరాదన్నారు. దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు కల్పించాలనే దిశగానే జిల్లాలో చాలామంది యువ పారిశ్రామికవేత్తలు విస్తృతంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలకు సకాలంలో ప్రోత్సాహ
అనంతపురం టౌన్: ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం పారిశ్రామికవేత్తలు రెండేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. రాయితీల మంజూరులో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2023–27 పారిశ్రామిక పాలసీలో జిల్లా వ్యాప్తంగా 1,200 మందికి పైగా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వీటిద్వారా ప్రత్యక్షంగా 4 వేల మందికి, పరోక్షంగా 2వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా రాయితీలు మంజూరు చేయకపోవడంతో పారిశ్రామిక వేత్తలు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,200 చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు మాత్రమే దాదాపు రూ.75 కోట్ల మేర రాయితీలను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. పెద్ద తరహా పరిశ్రమలు జిల్లాలో 17కు పైగా ఉన్నాయి. వీటికి సైతం ప్రోత్సాహకాలు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి యూనిట్లు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పరిశ్రమలు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందని మాట వాస్తవమే. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా వ్యాప్తంగా రూ.75కోట్లకు పైగా రాయితీలు రావాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు 20 శాతం మేర రాయితీలు అందించారు. పరిశ్రమ వివరాలు, యూనిట్ కాస్ట్, ఉపాధి కల్పన తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాం. రాయితీల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – నాగరాజ, ఇన్చార్జ్ జీఎం, పరిశ్రమల శాఖ పరిశ్రమలకు రూ.75 కోట్ల మేర బకాయిలు రాయితీలు విడుదలలో ప్రభుత్వం మీన మేషాలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న పారిశ్రామికవేత్తలు -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత కొనసాగుతోంది. గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
యోగా సాధన చేయండి గుత్తి: ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం అలవాటు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. చారిత్రక గుత్తి కోటలోని ఏనుగుల శాల, గుర్రపు శాల ప్రాంగణంలో శనివారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా మాస్టర్లు కృష్ణయ్య, రామకృష్ణ, తిప్పయ్య, ఆయా శాఖల అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనారోగ్యాలు దరి చేరవన్నారు. కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ ఓబులమ్మ, తహసీల్దార్ పుణ్యవతి, ఎండీఓ ప్రభాకర్, కోట గైడ్ మంగే రమేష్, గేట్స్ కాలేజీ కరస్పాండెంట్ పద్మావతమ్మ, మున్సిపల్ మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు. కోర్టుల ప్రాంగణంలో... గుత్తి కోర్టుల ప్రాంగణంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది యోగా కార్యక్రమం నిర్వహించారు. ఏడీజే శంకర్రావు, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథాచారి, జూనియర్ సివిల్ జడ్జి శ్వేత యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏడీజే వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా చేయాలన్నారు. -
విద్యాశాఖలో ఇన్చార్జ్ల పాలన
నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్–సుఖీభవ సొమ్ము అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిసాయం కింద శనివారం సొమ్ము విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి తెలిపారు. పీఎం కిసాన్ కింద 2,542,269 మంది రైతులకు రూ.2 వేల ప్రకారం రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్ల్లు అందజేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.7 వేల ప్రకారం రూ.188.67 కోట్లు విడుదల కానున్నట్లు తెలిపారు. కౌలు రైతులు, దేవదాయ, అటవీభూమి సాగుదారులకు కిసాన్–సుఖీభవ సొమ్ము అందే పరిస్థితి లేదు. అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలోనే కీలక పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉన్నవారికే రెండు, మూడు బాధ్యతలు అప్పగించడం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన అత్యంత కీలక సమయంలో మొత్తం ‘ఇన్చార్జ్ పాలన’లో నడుస్తుండటంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురి పని ఒక్కరికే జిల్లాలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు పూర్తిస్థాయి అధికారులతో కాకుండా ఇన్చార్జ్లతో నడుస్తున్నాయి. డీఈఓగా కొనసాగుతున్న శ్రీనివాసరావు ఒకేసారి డీఈఓ, అనంతపురం డిప్యూటీ డీఈఓ, విడపనకల్లు ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కణేకల్లు ఎంఈఓ కృష్ణయ్య గుత్తి డిప్యూటీ డీఈఓ బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఒకే అధికారి రెండు నుంచి మూడు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుండటంతో ఏ పోస్టుకూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. కాగితాలపైనే పర్యవేక్షణ పెద్దపప్పూరు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కుందుర్పి, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కంబదూరు, రాయదుర్గం వంటి మండలాల్లో పూర్తిస్థాయి ఎంఈఓలు లేరు. యాడికి, గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల్లో ఎంఈఓ–2 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండల విద్యా పరిపాలన, పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల జీతాల బిల్లులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలు అన్నీ ఇన్చార్జ్ల భుజాలపై పడటంతో వ్యవస్థ స్తబ్దుగా మారింది. స్కూల్ అసిస్టెంట్లే ఎంఈఓలు బెళుగుప్ప, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కంబదూరు, కుందుర్పి మండలాల్లో స్కూల్ అసిస్టెంట్లనే ఇన్చార్జ్ ఎంఈఓలుగా నియమించారు. దీంతో వారు పనిచేస్తున్న పాఠశాలల్లో ఆయా సబ్జెక్టల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. హెచ్ఎంలపై రెట్టింపు భారం కొన్ని మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జ్ ఎంఈఓలుగా పనిచేస్తున్నారు. ఒకవైపు తమ పాఠశాల నిర్వహణ, మరోవైపు మండలంలోని అన్ని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. రెండు వేర్వేరు వ్యవస్థలను ఒకేసారి పర్యవేక్షించడం ఆచరణలో అసాధ్యమని విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అడ్మిషన్లు, కిట్లు, పథకాల అమలుపై ప్రభావం విద్యా సంవత్సరం ప్రారంభ దశలో అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు, విద్యా కిట్లు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల పరిశీలన వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఖాళీ పోస్టులు, అదనపు బాధ్యతల కారణంగా ఈ కార్యక్రమాల అమలులో జాప్యం చోటుచేసుకుంటోందని సమాచారం. ‘ఆంధ్ర మోడల్’నా.. ‘ఫెయిల్యూర్ మోడల్’నా? విద్యారంగంలో సంస్కరణలు, నాణ్యమైన విద్య అంటూ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అని గొప్పులు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘ఫెయిల్యూర్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అన్న చందంగా తయారైందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కీలక పోస్టులన్నీ ఖాళీ ఇన్చార్జ్ల అధీనంలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు 8 మండలాల్లో లేని ఎంఈఓలు మరో 3 మండలాల్లో ఎంఈఓ–2 పోస్టుల ఖాళీ పర్యవేక్షణ లేక పరిపాలన గందరగోళం -
‘సర్’ పారదర్శకతపై సందేహాలు
అనంతపురం: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల పారదర్శక ఓటరు జాబితాపై సందేహాలు తలెత్తుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును అర్హులు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వీరు కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ ఆనంద్ను కలిసి.. ‘సర్’పై అభ్యంతరాలను తెలియజేశారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి చెందిన బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లు తమకు తెలియకుండా ఏమీ చేయకూడదని బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)లపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. శింగనమలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఐదు రోజులుగా వెలుగుచూసిన ఘటనలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. బీఎల్ఓలు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరామని చెప్పారు. చాలా చోట్ల బీఎల్ఓలు, ఈఆర్ఓలకు ‘సర్’ ప్రక్రియపై ఇప్పటికీ అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందిగా మారుతోందని అన్నారు. డబుల్, డెత్ ఓటర్లతో పాటు వలస వెళ్లిన వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగామని తెలిపారు. అనంతపురం నగరంలో డెత్, వలస ఓట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఎలా రాయాలో తెలియని వారి కోసం ఎన్నికల సంఘం నుంచే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కోరారు. అధికార పార్టీ బీఎల్ఏలు రాకపోతే కొన్నిచోట్ల ‘సర్’ ప్రక్రియను వాయిదా వేస్తున్నారని తెలియజేశారు. ‘సర్’ ముగిశాక కూడా ఇంకా డెత్, వలస ఓట్లు అలాగే ఉంటే ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరనట్టేనని స్పష్టం చేశారు. దీంతో రెండ్రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అర్హుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం శింగనమల నియోజకవర్గంలో బీఎల్ఏలు కాని వ్యక్తులు ‘సర్’ ప్రక్రియలో పాల్గొని తమకు అనుకూలం కాని వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులలో ఏ ఒక్క ఓటు తొలగించినా ఉపేక్షించేది లేదన్నారు. బీఎల్ఏ కాని వ్యక్తి ‘సర్’ ప్రక్రియలో పాల్గొని ఓటర్లను బెదిరించిన ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను కలెక్టర్కు అందించామని చెప్పారు. అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలు.. బీఎల్ఓలతో పాటు ఓటర్లపై పెత్తనం చేస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలను కలెక్టర్కు అందించినట్లు తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో అధికార పార్టీ ప్రమేయం లేకుండా చూడాలని కోరామని, అదే సమయంలో తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక ఓటరుకు రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉండడానికి వీల్లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో తప్పులు జరిగితే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటు తొలగించకుండా చూడాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సాకే రుత్విక్, వైఎస్సార్సీపీ బూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్ నాథ్రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం శింగనమల నియోజకవర్గంలో ఓటర్లకు బెదిరింపులు డబుల్ ఓట్లు, మైగ్రేట్, చనిపోయిన వారి ఓట్ల కొనసాగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
పడిగాపులు.. పడరాని పాట్లు
అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రిలో నెలకొన్న అధ్వాన పరిస్థితులు రోగులు, వారి సహాయకులను చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రధానంగా స్కానింగ్కు రెఫర్ చేసినప్పుడు పరిస్థితి దారుణంగా తయారై ఘర్షణ పడాల్సి వస్తోంది. ఇది ప్రతి రోజూ కొనసాగుతూ వస్తున్నా సంబంధిత అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇరుకై న గదుల్లో స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తుండడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కొన్నేళ్లుగా ఒకే గదిలో 2డీ ఎకో, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. గదిలో ఇద్దరు, ముగ్గురుకంటే ఎక్కువ మంది ఉండలేని పరిస్థితి. ఒకేసారి ముగ్గురు రోగులను లోపలికి అనుమతించడంతో పాటు వారి సహాయకులు కూడా వెంట ఉండాల్సి వస్తోంది. దీంతో గందగోళం నెలకొని స్కానింగ్ ఆలస్యమవుతోంది. ఈ క్రమంలోనే గది బయట వేచి ఉండే రోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే ఏ ఒక్కరికీ టోకన్లు ఇవ్వకుండా అందరినీ వేచి ఉండాలని చెప్పడం తప్ప స్కానింగ్ వేగవంతం చేసే చర్యలు ఏవీ చేపట్టకపోవడంతో రోగులు, వారి సహాయకుల్లో అసహనం రేకెత్తుతోంది. గది బయట స్కానింగ్ రోగులు కిక్కిరిసి ఉండడంతో ఇతర వార్డులకు వెళ్లే వారికీ తిప్పలు తప్పడం లేదు. వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి ఉన్న తమను కాదని వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత నిస్తున్నారంటూ తరచూ రోగుల సహాయకులు వాగ్వాదానికి దిగుతున్నారు. అత్యవసరమంటూ కొందరు.... ఆస్పత్రి సిబ్బంది సిఫారసులతో వెనకొచ్చిన మరికొందరు దర్జాగా గదిలోకి చొరబడి స్కానింగ్ చేయించుకుని వెళుతుంటే తాము మాత్రం మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. టోకన్లు అందజేసి, ఆ మేరకు స్కానింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు. సర్వజనాస్పత్రిలో స్కానింగ్ కష్టాలు రోగులకు తప్పని అవస్థలు సిఫారసులకు తలొగ్గి వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న సిబ్బంది -
నేడు నేమకల్లు అంజన్న ప్రతిష్టాపన
బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో బాలాలయంలో శనివారం స్వామివారి ప్రతిష్టాపన జరగనుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో స్వామిని ప్రతిష్టిస్తున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ప్రధాన అర్చకులు అనిల్కుమార్ చార్యులు, ధర్మకర్త శ్రీనాథ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో శనివారం ఉదయం 7.37 గంటల నుంచి 11.17 గంటలకు బాలాలయాన్ని ఏర్పాటు చేసి, స్వామివారిని ప్రతిష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడే నిత్య పూజలు, అర్చనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నుట్లు తెలియజేశారు. ఆలయ జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం పెద్దపప్పూరు: అప్పుల వాళ్ల బెదిరింపులు తాళలేక పురుగుల మందుతాగి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన పెద్దపప్పూరు మండలంలోని పసలూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గురునాథ్, రాజేశ్వరి దంపతులు. గురువారం సాయంత్రం ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు గురునాథ్ పోలీసుస్టేషన్కు వెళ్లాడు. అయితే పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న రాజేశ్వరిని కొందరు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు చికిత్స నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల వాళ్లు బెదిరింపులకు దిగడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. -
ఐచర్ ఢీకొని యువకుడి మృతి
రాప్తాడు రూరల్: మండల పరిధిలోని రామినేపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కనగానపల్లికి చెందిన పూజరి ఉజ్జినప్ప కుమారుడు రంజిత్ (25) బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. వ్యవసాయ పంట పొలాలకు అవసరమైన మందుల కోసం స్నేహితుడు ప్రసాద్తో కలిసి అనంతపురం వచ్చారు. అనంతరం ఇద్దరూ బైకుపై స్వగ్రామానికి బయలుదేరారు. రామినేపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డుకు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడగా, ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరాచకాలు, హత్యలు తప్ప ఏం చేశారు?
● చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం ఉరవకొండ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన అరాచకాలు, హత్యలు, దోపిడీలతోనే సాగిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల విజయోత్సవ సభలు నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ కార్యక్రమం దిగ్విజయం అయిందన్నారు. దీంతో చంద్రబాబు సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిందన్నారు. సభలకు వచ్చిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పకోలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో పూర్తి మద్దతిచ్చిన ఉద్యోగులు, అమరావతి రైతులు సైతం చంద్రబాబు పాలన అధ్వానంగా ఉందనడం చంద్రబాబు నికృష్ట పాలనకు నిదర్శనమన్నారు. మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం అభాసుపాలైందన్నారు.రైతులకు అందించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, రైతు ఆత్మహత్యల పరిహారాల చెల్లింపులు విషయాన్ని ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతాంగం నిరాశలో ఉన్నారన్నారు. మద్దతు ధర కల్పించడంలో పయ్యావుల విఫలం ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల ఉరవకొండ ప్రాంతంలో అధికంగా సాగయ్యే పప్పుశనగకు మద్దతు ధర కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కనీసం సబ్సిడీ విత్తనాలు ఇప్పించలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కంది రైతులు పంటను వందల కి.మీ వెళ్లి అమ్ముకోవాల్సిన దీనస్థితి నెలకొందని చెప్పారు. 16 లక్షల మంది కౌలు రైతులకు వరుసగా మూడోసారి సబ్సిడీ ఎరువులు అందజేయకుండా మొండి చేయి చూపారని మండిపడ్డారు. సాగునీటి అభివృద్ధి నిధులను చంద్రబాబు ప్రభుత్వం వేలాది కోట్లు వృథా చేసిందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న ‘సర్’లో వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సహకారం అందించకూడదని వీఆర్ఓలకు కూటమి నేతలు ఆదేశాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి మాటలకు సహకరించి నిజమైన ఓటర్లను తొలగిస్తే వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి కేవీ.రమణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తలూరి అశోక్, మండల సమన్వయకర్త ములగిరిపల్లి ఓబన్న, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు గందోడి మారేష్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ప్రాథమిక అంశాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఫేక్ వీడియో చూసిన పలువురు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వీరి సంఖ్య రోజూ వందల్లో ఉండడం బాధాకరం. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే రూ. లక్షలు ఎలా అవుతాయో ముందుగా తెలుసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అసత్య ప్రచారాలను నమ్మొద్దు. నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. – అక్కిరెడ్డి, సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్, అనంతపురం ప్రచార హోరు... మోసాల జోరు గ్లోబల్ షేర్ మార్కెట్ పేరుతో వల తక్కువ సమయంలోనే రూ.లక్షల్లో లాభం అంటూ ప్రచారం ప్రముఖుల ఫేక్ వీడియోలతో నయవంచన -
జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే ఆ ప్రభావం ఆయకట్
అనంతపురం సెంట్రల్: జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర హైలెవెల్ కెనాల్ (హెచ్చెల్సీ). దశాబ్దాలుగా సాగు– తాగునీటి అవసరాలు తీరుస్తున్న అతిపెద్ద వనరు. కర్ణాటక రాష్ట్రం హొస్పేటలోని తుంగభద్ర జలాశయం నుంచి గ్రావిటీ (హెచ్చెల్సీ) ద్వారా జిల్లాకు నీరందుతోంది. ఏటా సగటున దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీటిని కూడా అందిస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి 32 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఏటా జలాశయంలోకి వచ్చే నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి దామాషా ప్రకారం కేటాయింపులు చేస్తారు. 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు అందిస్తున్నారు. ఈ నీటితో దాదాపు 40వేల ఎకరాల్లో వరి, 80 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా పీఏబీఆర్ కుడి కాలువ కింద 48 చెరువులు, హెచ్చెల్సీ కింద లోకలైజేషన్ చెరువులకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగి రైతులకు, ప్రజలకు సాగు–తాగు నీటికి ఇబ్బందులు రాకుండా తుంగభద్ర జలాశయం ఆదుకుంటోంది. ఎల్–నినోతో తీవ్ర వర్షాభావం ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగానే ఉంటాయని శాస్త్రవేత్తలు ముందే వెల్లడించారు. కర్ణాటకలో తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు రాలేదు. అనంతపురం జిల్లాలోనే కాస్తోకూస్తో ఇప్పటి వరకూ వర్షాలు పడ్డాయి. కర్ణాటకలో ఆ పరిస్థితి కూడా లేనట్లు కనిపిస్తోంది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నేటికీ అరకొర నీటితోనే దర్శనమిస్తోంది. ఏటా మే, జూన్ నెలల నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. దీంతో ప్రతి జూన్ మొదటి వారంలో తుంగభద్ర బోర్డు సమావేశం నిర్వహించి జలాశయానికి నీటి లభ్యత, కేటాయింపులు, నీటి విడుదల తేదీలను నిర్ణయిస్తారు. కానీ ఈసారి జరిగిన బోర్డు సమావేశంలో అలాంటి నిర్ణయాలేవీ లేకుండానే ముగించారు. కారణం జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడమే. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలతో తుంగభద్ర జలాశయం గేటు ఒకటి కొట్టుకుపోయింది. ఈ ఏడాది దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నూతన గేటు ఏర్పాటు చేశారు. ఈ పనులు చేపట్టేందు కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ప్రస్తుతం 480 క్యూసెక్కుల కనిష్ట ఇన్ఫ్లోతో జలాశయంలో 9.741 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 51,261 క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లోతో 38.608 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. ఆయకట్టుపై తీవ్ర ప్రభావం ఈసారి వర్షాలు పెద్దగా లేకపోవడంతో హెచ్చెల్సీ ఆయకట్టు తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలో రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర జలాలపై ఆధారపడే ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేస్తారు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై తొలుత అధికారుల్లోనే ఆందోళన మొదలైంది. ఇక రైతుల పరిస్థితి భవిష్యత్లో కురిసే వర్షాలను బట్టి తెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొందరపడి నార్లు పోసుకోవద్దు తుంగభద్ర జలాశయానికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్ఫ్లో లేదు. దీని వల్ల ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నా... మరికొద్దిరోజులు వేచిచూస్తే తప్ప అంచనాలు వేయలేం. అదృష్టవశాత్తు పెద్ద వర్షాలు వస్తే తుంగభద్ర జలాశయంలో 40 టీఎంసీలకు చేరుకున్న తర్వాత నీటిని విడుదల చేస్తారు. హెచ్చెల్సీ (కాలువ) ఆధునికీకరణ పనులు, షట్టర్ల ఏర్పాటు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తొందరపడి నార్లు పోసుకోవడం లాంటివి చేయవద్దు. నీటి లభ్యతను బట్టి తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చెల్సీకి కేటాయింపులు, నీటి విడుదల తేదీలను ప్రకటిస్తారు. – సుధాకర్రావు, ఎస్ఈ, హెచ్చెల్సీ ఎల్–నినో ఎఫెక్ట్.. నేటికీ కనిష్టస్థాయిలోనే నీటి మట్టం ప్రస్తుతం 480 క్యూసెక్కుల ఇన్ఫ్లో 9.741 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ గతేడాది 38.608 టీఎంసీల నీటి నిల్వ జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
బెళుగుప్ప: మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన ఈశ్వర్రెడ్డి (55) విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నక్కలపల్లికి చెందిన జి.ఈశ్వర్రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మోటార్ను ఆన్ చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే విద్యుత్ తీగలు కొంత తెగిపోయి ఉండటాన్ని గమనించకుండా ఎడమచేతితో పట్టుకుని ఆన్చేయగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన బెళుగుప్ప పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఈశ్వర్రెడ్డి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ వన్నూరస్వామి తెలిపారు. కుటుంబ యజమాని ఉన్న ఫలంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
‘ రాష్ట్రంలో దళితులపై దమనకాండ’
అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దమన కాండ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్బుక్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అండదండలతో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని విమర్శించారు. దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల హత్యలు జరుగుతుంటే కనీసం ఖండించలేని స్థితిలో ఉన్న హోం మంత్రి వంగలపూడి అనితకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చిన్న సంఘటన జరిగినా వీధులకెక్కి గొంతులు చించుకున్న టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దళితులపై ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దళితుల హత్యలు, దాడుల ఘటనలపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు, నాయకులు ప్రభుదాస్, నారాయణ స్వామి, విజయ్ కుమార్, సురేష్, సాకే అనిల్కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐఆర్ హామీ అమలు చేయండి అనంతపురం అర్బన్: ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి. అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎన్.దివాకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను నగరంలోని ఆయన స్వగృహంలో నాయకులు శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మూడేళ్లు గడుస్తున్నా పీఆర్సీ కమిషనర్ను నియమించకపోవడంతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రకటిస్తామని చెప్పిన ఐఆర్ హామీ అమలు కాలేదన్నారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణం పీఆర్సీ కమిషన్ వేయాలని కోరారు. పీఆర్, ఐఆర్, డీఏ, తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాఽధికారి వి.పునీత్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.ప్రసాద్, ఏపీ జేసీ అమరావతి మహిళ విభాగం జిల్లా చైర్పర్సన్ బి.సురేఖరావు, ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి, 14వ బెటాలియన్ జిల్లా అధ్యక్షుడు టి.పెద్దయ్య, ఎస్ఎల్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.శివానందరెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, వాణిజ్య పన్నులశాఖ హరి, వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓబుళేసు, తదితరులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో జింకకు గాయాలునార్పల: మండల పరిధిలోని తుంపెర గ్రామ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి జింకపై కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో రైతు సంజీవరాయుడు అప్రమత్తమై కుక్కల బారి నుండి జింకను కాపాడి అటవీశాఖ అధికారులుకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను అటవీశాఖ అధికారులు ఉషారాణి, తేజేశ్వర్రెడ్డి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డాక్టర్ సాయి సుప్రజ పర్యవేక్షణలో రాజారెడ్డి, ధనమ్మ, గురుప్రసాద్ చికిత్స చేశారు. -
ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
గుత్తి: పట్టణంలోని కోట నేసే వీధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని అఫ్రీన్ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలమేరకు.. అఫ్రీన్ తల్లి ఖైరూన్బీతో కలిసి కోట నేసే వీధిలో నివస్తోంది. ఆమె తండ్రి హైదరాబాద్లో పనికోసమని ఆర్నెళ్ల క్రితం వెళ్లాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా.. మొదటి కుమార్తెకు వివాహమైంది. అఫ్రీన్ గుంతకల్లులోని ఓ డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఫ్రీన్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లి ఖైరూన్బీ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ అమీర్ఖాన్ పరిశీలించారు. అయితే ఉరి వేసుకున్న ప్రాంతంలో అఫ్రీన్ కాళ్లు ఫ్లోర్కు ఉన్న బండలకు ఆనుకుని ఉన్నాయి. దీంతో ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల చేతిలో సూసైడ్ నోట్ పోలీసులకు అఫ్రీన్ రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తండ్రి సరిగా చూసుకోవడం లేదని, ఒంటరిగా ఉండాల్సి వస్తోందని, తల్లికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నానని నోట్ రాసింది. ఇక జీవించడం తనకు ఇష్టం లేదని, చనిపోతున్నానని రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సూసైడ్ నోట్ను పోలీసులు బయటకు పెట్టలేదు. -
రేపు రీ–నీట్
అనంతపురం అర్బన్: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రీ ఎగ్జామ్ను ఈ నెల 21న నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణకు స్థానిక అధికారులకు కాకుండా ప్రత్యేకంగా తన అధికారులను ఎన్టీఏ నియమించుకుంది. చివరకు బందోబస్తులోనూ కేంద్ర బలగాలను ఏర్పాటు చేసుకుంది. కేంద్రాల్లో ఎన్టీఏ ముద్ర ఉన్న గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదిరిగా స్థానిక అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. అంతా ఎన్టీఏ కంట్రోల్లో రీ–ఎగ్జామినేన్ జరగనుందని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ‘రీ–నీట్’ కంట్రోల్ రూమ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రీ– ఎగ్జామినేషన్ నిర్వహణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సందేహాల నివృత్తి, అత్యవసర సహాయం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు, సంబంధిత సిబ్బంది టోల్ ఫ్రీ నంబర్ 85002 92992లో సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ 20వ తేదీ ఉదయం 10 నుంచి 21వ తేదీ రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘సర్’ పర్యవేక్షక అధికారుల నియామకం అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. అన్ని జిల్లాలకూ పర్యవేక్షక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం జారీ చేశారు. అనంతపురం జిల్లా పర్యవేక్షక అధికారిగా మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ, గోదావరి కెనాళ్ల మేనేజింగ్ డైరెక్టర్ జి.క్రిస్ట్ కిషోర్కుమార్ను నియమించారు. అదనపు ఎస్పీ బాధ్యతల స్వీకరణ అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఎస్పీ జగదీష్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 1991 బ్యాచ్కు చెందిన ఆయన సుదీర్ఘకాలం పాటు కర్నూలు, కడప జిల్లాల్లో ఎస్ఐగా, సీఐ, డీఎస్పీగా ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, అవినీతి నిరోధక శాఖ విభాగాల్లో పనిచేశారు. ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతిపై అనంతపురానికి నియమితులయ్యారు. విజిలెన్స్ ఏఎస్పీగా స్నేహిత అనంతపురం సెంట్రల్: రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ఏఎస్పీగా స్నేహిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో వెయిటింగ్లో ఉన్న ఆమెను ఇటీవల జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు విజిలెన్స్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. -
పక్కాగా రీసర్వే పనులు
పెద్దవడుగూరు: మండలంలోని రీసర్వే పనులను వేగంగా, పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అప్పేచర్ల, క్రిష్టిపాడు గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేసే సమయంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దవడుగూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకం అందించడంలో అధికారుల తీరుపై రైతులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి, సర్వేయర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వామీ.. మా అత్త త్వరగా చనిపోయేలా చూడు!..కోడలి వింత లేఖ వైరల్!
సాక్షి, అనంతపురం: సాధారణంగా భక్తులు కోర్టు కేసులు గెలవాలనో, అప్పులు తీరాలనో, ఉద్యోగాలు రావాలనో లేదా కుటుంబాలు చల్లగా ఉండాలనో కోరుకుంటూ హుండీలలో ఉత్తరాలు వేస్తుంటారు. కానీ, ఓ భక్తుడు ఏకంగా తన అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ కరెన్సీ నోటుపై అభ్యర్థనతో రాసిన వింత లేఖ వెలుగులోకి వచ్చింది.ఆలయ అధికారులు,స్థానిక భక్తుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారుఅయితే ఆ వింత లేఖ రాసిన సదరు మహిళ ఎవరు అనేది తెలియరాలేదు. ఆమె అత్తగారి నుంచి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, వేధింపులు ఏ స్థాయికి చేరితే.. చివరికి ఎవరికీ చెప్పుకోలేక ఇలా నేరుగా భగవంతుడికే తన ఆవేదనను నివేదించుకుందనే కోణంలో సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, హుండీ లెక్కింపులో దొరికిన ఈ రూ. 20 నోటు తాలూకు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని హాస్యాస్పదంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం సమాజంలో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లోపించడానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో భక్తులు తమ వ్యక్తిగత బాధలను, దేవాలయాల లోపాలను హుండీ లేఖల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడం పెరిగిపోతోందని, ఇటీవల కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలోనూ ఇలాంటి వింత లేఖలే బయటపడిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ‘ఆలయంలో భక్తులకు కనీస వసతులు కల్పించే వరకు తాము హుండీలో ఒక్క రూపాయి కూడా వేయం’ అని భక్తులు స్పష్టం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయి, హుండీని వేదికగా చేసుకుని భక్తులు డిమాండ్లతో కూడిన వినూత్న నిరసన లేఖలు వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. -
గనుల, భూగర్భశాఖ నిర్ణయం తీసుకోవాలి
మన్నీల సర్వే నంబరు 26లోని ప్రభుత్వ భూమిలో మైనింగ్ అనుమతుల కోసం సదరు కంపెనీ వారు దరఖాస్తు చేసుకున్నారు. దానిపై గతంలో ఉన్న అధికారులు నివేదిక ఇచ్చారు. గ్రామస్తులు, రైతుల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించాం. మైనింగ్ అనుమతులపై గనుల భూగర్భ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెద్ద భవనం నిర్మించడం, కుంటను పూడ్చేయడం, చుట్టూ ఫెన్సింగ్ వేయడంపై గనుల భూగర్భ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారేమో కనుక్కోవాలి. – ఉదయ్భాస్కర్, తహసీల్దారు, అనంతపురం రూరల్ -
యోగాతో
ఆనందకర జీవితం తాడిపత్రి టౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని పురాతన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులతో పాటు విద్యార్థులు హాజరై యోగాసనాలు వేశారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ యోగాతోనే ఆనందకర జీవితం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన అవసరమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి ఓబుళమ్మ, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● 17 మందికి గాయాలు గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లిలో గురువారం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి ధర్మవరానికి బయలుదేరింది. మార్గమధ్యంలో బసినేపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ను లారీ దాటుతుండగా, వెనుక నుంచి ఢీకొంది. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలకు చెందిన కవిత, ఐజకు చెందిన జయమ్మ, గోపాల్, ఫిలిప్, కీర్తన, కవిత, అశ్విని, అంకిత, సింధుజా, అనంతపురం నగరానికి చెందిన ఇమామ్బీ, షాజహాన్, సానియా, షబానా, సావిత్రి, గుత్తికి చెందిన సుజాత, ఎమ్మిగనూరుకు చెందిన నాగవేణి, పత్తికొండ మండలం హోసూరుకు చెందిన వంశీకృష్ణ గాయపడ్డారు. వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన కవిత, జయమ్మ, నాగవేణి, వంశీకృష్ణను అనంతపురం, కర్నూలుకు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని గుత్తి ఆర్టీసీ డిపో అధికారులు పరిశీలించారు. బస్సు ఢీకొన్నా లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నాగవేణి,వంశీకృష్ణ -
వేలం పెడతారు..పాడుకోండప్పో!
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఊరూరా మద్యం బెల్టుషాపులు వెలిశాయి. వీటి కోసం ‘తమ్ముళ్ల’ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముకునే వెసులుబాటు ఉండడంతో మంచి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో బెల్టుషాపుల నిర్వహణకు టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో వేలం పాట నిర్వహించి మరీ బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో బెల్టు షాపుల ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు గురువారం రాత్రి వేలం పాట నిర్వహణకు సిద్ధమయ్యారు. అంతకుముందు గ్రామంలో దండోరా వేయించారు. వేలంలో పాల్గొనేవారికి స్థానికంగా ఓటు హక్కు ఉండాలని, ఆధార్, పాసుపోర్టు సైజ్ ఫొటోలు కలిగి ఉండాలని, వారి వివరాలు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారని చాటింపు వేయడం గమనార్హం. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధి సూచన మేరకు వేలంపాట నిర్ణయాన్ని ‘తమ్ముళ్లు’ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు గ్రామాల్లో బెల్టుషాపులు పెడితే తాట తీస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తుండగా..మరోవైపు ఆయన పార్టీ వారే పల్లెల్లో దండోరా వేయించి మరీ బెల్టు షాపులకు వేలం నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలపై బండ బూతులు ● రెచ్చిపోయిన మంత్రి పయ్యావుల అనుచరుడు ! సాక్షిటాస్క్ఫోర్స్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరుడు, ఉరవకొండ మండల టీడీపీ నాయకుడు రవి మద్యం మత్తులో బుధవారం రాత్రి వీరంగం సృష్టించాడు. ఉరవకొండలోని అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి వద్ద ఉన్న ఓ ధాబా వద్ద మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే అక్కడే ఉన్న కొందరు మైనార్టీలను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని, ముస్లింలు ఏం పీక్కోలేరని రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఉరవకొండ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం
ఎన్యుమరేషన్ విషయంలో బీఎల్ఓలపై వస్తున్న ఫిర్యాదులపై ఈఆర్ఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాం. బీఎల్ఓ లకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని చెప్పాం. 2002లో ఓటరు ఎక్కడ ఉన్నారనే వివరం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తనకు ఓటు లేకపోతే వారి నాన్న లేదా తాత ఓటు ఎక్కడ ఉండేదనే విషయం చెప్పినా సరిపోతుంది. కచ్చితంగా ఈ వివరాలే ఇవ్వాలని, లేదంటే మీ ఓటు ఉండదు అంటూ ఓటర్లను బీఎల్ఓలు ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా హెచ్చరించాం. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలి. – ఎ.మలోల, జిల్లా రెవెన్యూ అధికారి -
‘ఫస్ట్’లో 34 శాతం, సెకండ్లో 51 శాతం
● ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 147 కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ప్రథమ సంవత్సరంలో కేవలం 34 శాతం, ద్వితీయ సంవత్సరంలో 51 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కొన్ని యాజమాన్యాలు ఆశించిన ఫలితాలు సాధించగా, మరికొన్ని జిల్లా సగటును కూడా అందుకోలేకపోయాయి. జిల్లాలో 23 ప్రభుత్వ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరంలో 1,265 మంది పరీక్షలకు హాజరుకాగా 450 మంది (35.57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,042 మందిలో 540 మంది (51.82 శాతం )ఉత్తీర్ణత సాధించారు. రెండు ఎయిడెడ్ కళాశాలల ఫలితాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.ప్రథమ సంవత్సరంలో 398 మంది హాజరుకాగా కేవలం 88 మంది మాత్రమే 22.11 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 50.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 48.64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69.56 శాతం ఉత్తీర్ణత, 15 ఏపీ మోడల్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 31.89 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 53.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక 32 కేజీబీవీల్లో ప్రథమ సంవత్సరంలో 53.28 శాతం, ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. 66 ప్రైవేట్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 34.07 శాతం, ద్వితీయ సంవత్సరంలో 50.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. పట్టపగలే కొల్లగొట్టారు! యాడికి: మండలంలోని చందన గ్రామంలో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఇంట్లోకి చొరబడి కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. చందన గ్రామానికి చెందిన తంగసాని పెద్ద యల్లారెడ్డి గురువారం ఉదయం తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని తాడిపత్రికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగొచ్చిన వారికి తాళం పగుల గొట్టి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా, బీరువాలోని 36 తులాల బంగారు, రూ.4 లక్షల నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్తో వివరాలు సేకరించారు. బాధితుడు పెద్ద యల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచినట్లు సీఐ తెలిపారు. -
టీచర్ల విభజన కసరత్తు వేగవంతం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లా విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఉపాధ్యాయులను అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు విభజించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని కేడర్ల ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తోంది. డివిజన్ల వారీగా.. మొదటి రోజు అనంతపురం విద్యా డివిజన్ పరిధిలోని వివరాలను పరిశీలించిన అధికారులు, రెండో రోజు గురువారం గుత్తి డివిజన్కు చెందిన ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో అనంతపురం సైన్స్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. సీనియార్టీ జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రతి పేరును పరిశీలిస్తూ ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టారు. ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు, గుత్తి డీవైఈఓ లక్ష్మన్న, డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఐటీ విభాగం అధికారులు పాల్గొని సీనియార్టీ జాబితాల పరిశీలన చేపట్టారు. శుక్రవారం, శనివారం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించి సీనియార్టీ జాబితాలు, ఖాళీల వివరాలను ఖరారు చేయనున్నారు. కేడర్లో చేరిన తేదీనే ప్రాతిపదిక ప్రస్తుతం ఉపాధ్యాయుడు ఉన్న కేటగిరీలో సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేపట్టను న్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను యూనిట్గా తీసుకుని ప్రక్రియ చేపడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు సంబంధించి వారు ఇక్కడ విధుల్లో చేరిన తేదీ నుంచే సీనియార్టీ లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ఉపాధ్యాయుల స్థానాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సస్పెన్షన్లో ఉన్నవారు, అనధికారంగా గైర్హాజరైన ఉపాధ్యాయుల పేర్లను కూడా సీనియార్టీ జాబితాల్లో చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విభజన ప్రక్రియలో ముందుగా వారిని ఏదో ఒక జిల్లాకు కేటాయించి, అనంతరం క్రమశిక్షణ చర్యలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. 100 శాతం ఆప్షన్లు తప్పనిసరి జిల్లా విభజన ప్రక్రియలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లు, సీనియార్టీ, ఖాళీల ఆధారంగా తుది కేటాయింపులు చేపట్టే అవ కాశం ఉంది. జిల్లా విభజనతో తమ సేవా ప్రాంతం మారుతుందా.. సీనియార్టీపై ప్రభావం ఉంటుందా? అనే అంశాలపై ఉపాధ్యాయుల్లో ఆసక్తి నెలకొంది. -
అధికారులే అండగా నిలుస్తున్నారు
సర్వే నంబరు 26లో ఎలాంటి అనుమతులు లేకుండానే కంకర మిషన్ యాజమాన్యం రెండంతస్తుల భవనం నిర్మించింది. 30 అడుగుల ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. నీటి కుంటను పూడ్చివేసి, మైనింగ్ నుంచి వచ్చిన వేస్ట్ మట్టిని డంపింగ్ చేశారు. దీనిపై అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి రైతులు, ప్రజా నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేయించారు. – టి.రామాంజనేయులు, సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి, మన్నీల -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఆ ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు ● రాసిన పరీక్షనే మళ్లీ రాయించడంపై ఎస్కేయూ వీసీ ఆగ్రహం ● 9 మంది విద్యార్థులకు నేడు అదే కేంద్రంలో పరీక్ష అనంతపురం: రాసిన పరీక్షనే విద్యార్థులతో మళ్లీ రాయించిన ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం నగరంలోని శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరీక్షను మంగళవారం మళ్లీ నిర్వహించారు. తప్పును గుర్తించిన ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు 15 నిమిషాల అనంతరం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రశ్నపత్రాన్ని మెయిల్ ద్వారా పంపినా సదరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆదినారాయణ రెడ్డి నిర్లక్ష్యం వహించారు. బలవంతంగా 9 మంది విద్యార్థులతో పరీక్ష రాయించారు. విద్యార్థులు బతిమలాడినా కనికరించలేదు. ఈ అంశంపై ‘సాక్షి’లో గురువారం కథనం వెలువడడంతో ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆయా విద్యార్థులకు శుక్రవారం అదే కేంద్రంలో మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల విభాగం అధికారులపై చర్యలేవీ..? షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన ప్రశ్నపత్రాన్ని ఆయా కళాశాలలకు పంపాల్సిన బాధ్యత ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులపై ఉంటుంది. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక సబ్జెక్టుకు బదులు మరొక సబ్జెక్టు ప్రశ్నపత్రం పంపి వర్సిటీ ప్రతిష్టను మసకబార్చారు. దీనిపై ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు చేసిన తప్పును తేలికగా తీసుకుని, కేవలం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వారం తర్వాత అతడిని విధుల్లోకి తీసుకున్నా ఎవరూ ప్రశ్నించలేరు. కానీ, ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే చర్చనీయాంశంగా మారింది. ఖాళీల భర్తీకి చర్యలు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా టీచర్ల ఖాళీల భర్తీకి తొలి అడుగు వేసింది. ఈ నెలాఖరులోగా ఎంటీఎస్ టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి చేసి, అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్షారియా ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఎంటీఎస్ టీచర్లకే అవకాశం గురువారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలను ముందుగా గుర్తించి, వాటికి ఎంటీఎస్ టీచర్ల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించడం ద్వారా విద్యార్థులకు బోధనలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. బదిలీలు, సర్దుబాట్ల తర్వాత కూడా ఉపాధ్యాయుల కొరత కొనసాగితే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 550 మంది.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1998, 2008 డీఎస్సీ ద్వారా నియమితులైన ఎంటీఎస్ టీచర్లు 665 మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం సుమారు 100 మంది పదవీ విరమణ చేశారు. 550 మంది ఎంటీఎస్ టీచర్లు వివిధ పాఠశాలల్లో సేవలందిస్తున్నారు. -
పాప బతకాలంటే రూ .17 కోట్ల ఇంజెక్షన్ కావాలి!
తాడిపత్రిటౌన్: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయని, రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయ్యింది. అంత డబ్బులేక, కళ్ల ముందే అచేతనంగా పడుకున్న బిడ్డను చూస్తూ వారు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లికి చెందిన నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం నెలలోనే ఆవిరవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఊయల్లో పడుకొని కాళ్లు ఆడించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా వైద్యులకు చూపించారు. హైదరాబాద్కు వెళ్లమని చెప్పడంతో అక్కడి రెయిన్బో ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు ఎస్ఎమ్ఏ టైప్–1 జబ్బు సోకినట్లు చెప్పారు. మొదట కాళ్లు, చేతులకు తర్వాత శరీరంలోని వివిధ అవయవాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని చెప్పడంతో నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆశల దీపాన్ని ఎలా రక్షించు కోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. చిరుజీవులలైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల ఆపన్నహస్తం కోసం దీనంగా అర్థిస్తున్నారు. -
10 రోజుల్లో మీ వాదన సమర్పించండి
● డీఆర్ఓ మలోలకు ప్రభుత్వం ఆదేశం అనంతపురం అర్బన్: ‘సీరియస్ మీటింగ్లో రమ్మీ’ అడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై డీఆర్ఓ మలోల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. 10 రోజుల్లోగా లిఖితపూర్వక వాదన పత్రాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జనవరి 20న ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లాకు విచ్చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించడంతో పాటు ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్ఓ మలోల తన మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని దుష్ప్రవర్తనగా ప్రభుత్వం పరిగణిస్తూ వివరణ కోరింది. అంగీకరించబడని అభియోగ అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతుందని ఉత్తర్వులో పేర్కొంది. కాబట్టి ప్రతి అభియోగ అంశాన్నీ ప్రత్యేకంగా అంగీకరించాలి లేదా తిరస్కరించాలని ఆదేశించింది. నిర్దేశించిన వ్యవధిలో లిఖితపూర్వక వాదన సమర్పించని పక్షంలో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
ప్రకృతి సాగుతో దేశానికే ఆదర్శంగా నిలవాలి
అనంతపురం న్యూటౌన్: ప్రకృతి వ్యవసాయంతో మేలైన పంట దిగుబడులు సాధించి జిల్లా రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవం సందర్భంగా యాక్షన్ఫ్రాటెర్నా –ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రస్తుతం జిల్లాలో 85 వేల ఎకరాల్లో సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వచ్చే ఏడాదికి 2 లక్షల ఎకరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ను 2 లక్షల ఎకరాల్లో అమలు చేయడమే లక్ష్యమన్నారు. యాక్షన్ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి. మల్లారెడ్డి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము జిల్లాలోని 12 గ్రామాల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ సంరక్షకురాలు ఆర్. యశోదాబాయి మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత ఎక్కువగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. జూలై 1 నుంచి నాటేందుకు అటవీ శాఖ 10 లక్షల మొక్కలు సిద్ధం చేసిందన్నారు. ముందుగా కలెక్టర్ ఆనంద్ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంట విధానాల ప్రదర్శన, వ్యవసాయ నమూనాల స్టాళ్లను సందర్శించారు. నిజవల్లి గ్రామానికి చెందిన బాలవర్ధన్, పి.యాలేరు గ్రామానికి చెందిన శ్రీలత, అపిలేపల్లికి చెందిన అతాఉల్లా వంటి సహజ వ్యవసాయ రైతులు తమ అనుభవాలు, విజయగాథలను సదస్సులో వివరించారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురుప్రభాకర్, డ్వామా పీడీ సలీం బాషా, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. సాలు రెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. రఘునాథ రెడ్డి, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు, నాబార్డ్ డీడీఎం కె.అనూరాధ, సీటీవో లక్ష్మానాయక్, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం మిల్లెట్స్ శాస్త్రవేత్త నర్సింహులు, వైఎస్సార్ సీపీ రాయలసీమ అధికార ప్రతినిధి కె.వి. రమణ, పర్యావరణ ప్రేమికులు భాషా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్ పిలుపు -
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలి
అనంతపురం అర్బన్: ఈ ఏడాది ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు ఆరుతడిపంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు వచ్చినప్పటికీ ఎల్నినో ప్రభావం కారణంగా రాబోయే నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ శాఖలు కరువు ప్రణాళికలు, ఉపశమన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల వరకు పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) అమలు చేయాలని చెప్పారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరిసాగు స్థానంలో ఆరుతడి పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చీనీ సాగునూ తగ్గించి ఇతర పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అలాగే ఖరీఫ్ సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీ పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధకశాఖ జేడీ ప్రేమ్చంద్, అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాలు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ డీఆర్డీఏ, మెప్మా అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూణాలు పొందిన పీఎంఎఫ్ఎంఈ యూనిట్లు గ్రౌండింగ్ కావాలని చెప్పారు. మండలానికి ఐదు యూనిట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా పరిధిలో రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఎఫ్పీఓలు, సమీకృత ఫార్మింగ్ క్లస్టర్ల సర్వే, కస్టమ్హైరింగ్ సెంటర్లు, తదితర అంశాలపై సమీక్షించారు. సీ్త్రనిధి పారామీటర్లకు సంబంధించి ఏపీఎంలతో రోజూ సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ, మెప్మా అధికారులు పాల్గొన్నారు. ‘సర్’లో 3.53 లక్షల ఫారాల పంపిణీ అనంతపురం అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు ఓటర్లకు 3,53,890 ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు పంపిణీ చేశారని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉనారన్నారు. 2,226 మంది బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి, వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ ఆనంద్ ఆరుతడి పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి కరువు ప్రణాళికలు, ఉపశమన చర్యలు చేపట్టాలి కలెక్టర్ ఆనంద్ -
‘సర్’ కుట్రలను తిప్పికొట్టాలి
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో చేస్తున్న ఓటు తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన బుధవారం పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఎస్ఐఆర్పై నిర్వహించిన సదస్సుకు రాంభూపాల్తో పాటు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్, సీపీఎం సీనియర్ నాయకుడు జి.ఓబుళు, రాష్ట్ర ముతవల్లిల అధ్యక్షుడు షకిల్ షఫీ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మొదటి విడతలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘ఎస్ఐఆర్’ నిర్వహించి 5.50 కోట్ల ఓట్లను తొలగించారన్నారు. ఇందులో 50 శాతం ముస్లిం మైనారిటీలవే ఉన్నాయన్నారు. రెండో దశలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహించి మరో 10 కోట్ల ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపు జరిగితే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలనూ తొలగించే ప్రమాదం ఉందన్నారు. మునుముందు పౌరసత్వాన్ని కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల మోదీ పరిపాలనలో చెప్పుకోదగ్గ ఒక్క మంచిపనీ లేదన్నారు. మన ఓట్లను మనమే కాపాడుకోవాలన్నారు. ఇంటి వద్దకు బీఎల్ఓలు వచ్చినప్పుడు ప్రజలు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఇమామ్, వలి, ప్రకాష్, ముత్తుజ, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానశాఖ ఏడీ దేవానందకుమార్ బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీహెచ్) ఆర్.దేవానందకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ అయ్యారు. అక్కడ ఏపీఎంఐపీ పీడీగా ఉన్న సుదర్శన్ గత నెలలో ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో డిప్యుటేషన్ కింద దేవానంద్కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ పీడీగా ఏపీఎంఐపీ ఏపీడీ బీసీ ధనుంజయ పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణంగుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామానికి చెందిన ఆశ (25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి కర్ణాటకలోని చిన్న ఓబనహళ్లి గ్రామానికి చెందిన ఆశతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వన్నూరుస్వామి మంగవారం రాత్రి మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. రోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆశ ఇంట్లో ఉరివేసుకుంది. ఇంటి బయట నిద్రించిన వన్నూరుస్వామి బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించిన భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యపుట్లూరు: మండలకేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన మల్లేశ్వరి (40) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సురేంద్రబాబు తెలిపిన మేరకు.. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మల్లేశ్వరి జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై బుధవారం మృతురాలి కుమారుడు నాగశివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డబ్బుల కోసం యూట్యూబర్ వేధింపులు ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ గుంతకల్లు: డబ్బుల కోసం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న యూట్యూబర్ మంజునాథనాయుడుపై బుధవారం గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ షామీర్బాషా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. మంజునాథనాయుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించి బ్లాక్మెయిల్ చేయడంతోపాటు విధులకు అడ్డు తగులుతున్నాడని షామీర్బాషా పేర్కొన్నారు. అడిగినంత ఇవ్వని పక్షంలో లేనిపోని ఆరోపణలతో వీడియోలు చేసి సోషియల్ మీడియా ద్వారా వైరల్ చేస్తానని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. 2023లో కూడా ఇదే విధంగా బెదిరించగా, జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మంజునాథనాయుడుపై కేసు నమోదు చేయాలని కోరారు. స్పందించిన ఎస్పీ జగదీష్ విచారణ చేపట్టాలని టూటౌన్ సీఐ వంశీకృష్ణను ఆదేశించారు -
ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..?
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి వాసులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూపకల్పనకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృషి చేశారు. 2021లో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీడిపల్లివాసుల సమస్యను విన్నవించి వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కు ఆమోదం పొందారు. అదే యేడాది అక్టోబర్ 14న గ్రామసభ ఏర్పాటు చేయించి యూనిట్కు రూ.10 లక్షల చొప్పున గ్రామస్తులతో ఆమోద ముద్ర వేయించారు. మొత్తంగా 657 యూనిట్లకు సంబంధించి రూ.131.20 కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపించారు. అయితే, ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిధులు మంజూరు కాలేదు. అభివృద్ధి గగనం,పథకాలు దూరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించి గెజిట్ ఉండడంతో జీడిపల్లి గ్రామంలో అబివృద్ధి పనులు జరగడం లేదు. సీసీ రోడ్ల నిర్మాణం ఊసేలేకుండా పోయింది. గ్రామానికి ఆర్టీసీ బస్సు రాక 20 సంవత్సరాలు గడిచింది. హౌసింగ్ స్కీమ్కు కూడా జీడిపల్లివాసులు దూరమయ్యారు. గ్రామంలో ఊట నీటితో విష పురుగుల బెడద ఎక్కువైంది. అధిక తేమ శాతం కారణంగా తరచూ విద్యుత్ అర్త్ అవుతుండడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు విద్యుదాఘాతంతో మరణించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హుల జాబి తాలోని పది మంది వరకూ కాలం చేయడం గమనార్హం. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కారణంగా ఉంటామో లేదో తెలియకపోవడంతో గ్రామంలో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక.. రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తమ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా మొర ఆలకించడం లేదని జీడిపల్లివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. వివరాలు ప్రభుత్వానికి పంపాం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల గ్రామంలో వివరాలు సేకరించాం. ఓటీఎస్ జాబితాలో 657 మందిని చేర్చాం. వివరాలను రెవెన్యూశాఖ ద్వారా ప్రభుత్వానికి పంపాం. – వసంతబాబు, కళ్యాణదుర్గం ఆర్డీఓ పునరావాసం కల్పించాలి జీడిపల్లి వాసులు దశాబ్ద కాలంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పటికై నా డబ్బును వారి ఖాతాలకు జమ చేయాలి. ఊటనీటి బాధలను అధిగమించడానికి నివేశ స్థలాలు, ఇళ్లకు ప్యాకేజీ వర్తింపచేసి పునరావాసం కల్పించాలి. – చిన్న మచ్చన్న, వైఎస్సార్సీపీ బెళుగుప్ప మండల కన్వీనర్ పయ్యావుల కేశవ్ చొరవ చూపాలి జీడిపల్లి గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందకపోవడం పాలకుల నిర్లక్ష్యమే. ఈ విషయంపై ఆర్థికశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి. నిధులను విడుదల చేసి స్థానికులను ఆదుకోవాలి. – బీ.హనుమంతరాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఆశల దీపం.. అయ్యో పాపం
చిన్నారి చికిత్స కోసం సాయం చేయదలిస్తే .. ● అకౌంట్ నంబర్ 30830783425 ● ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 001125కు డబ్బు పంపవచ్చు తాడిపత్రిటౌన్: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయని, రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయ్యింది. అంత డబ్బులేక, కళ్ల ముందే అచేతనంగా పడుకున్న బిడ్డను చూస్తూ వారు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లికి చెందిన నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం నెలలోనే ఆవిరవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఊయల్లో పడుకొని కాళ్లు ఆడించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా వైద్యులకు చూపించారు. హైదరాబాద్కు వెళ్లమని చెప్పడంతో అక్కడి రెయిన్బో ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు ఎస్ఎమ్ఏ టైప్–1 జబ్బు సోకినట్లు చెప్పారు. మొదట కాళ్లు, చేతులకు తర్వాత శరీరంలోని వివిధ అవయవాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని చెప్పడంతో నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆశల దీపాన్ని ఎలా రక్షించు కోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. చిరుజీవులలైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల ఆపన్నహస్తం కోసం దీనంగా అర్థిస్తున్నారు. రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు చచ్చుబడిన కాళ్లు, చేతులు ఆలస్యం చేస్తే శరీరమంతటికీ సోకుతుందని డాక్టర్ల హెచ్చరికలు రూ. 17 కోట్ల ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని సూచన ఆపన్నహస్తం కోసం బాధిత తల్లిదండ్రుల ఎదురుచూపు -
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ పరలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం తాడిపత్రి రూరల్: మండలంలోని పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గంగాదేవిపల్లికి చెందిన సతీష్ (25), నాగేంద్ర ద్విచక్రవాహనంలో మంగళవారం రాత్రి తాడిపత్రిలో నిర్వహించిన తమ స్నేహితుడు సతీష్ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్కు ఆస్పత్రిలో చికిత్సలందించారు. ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మృతుడు సతీష్కు భార్య పుష్పతో పాటు రెండు నెలల చిన్నారి ఉన్నట్లు తెలిసింది. పశుగ్రాసం కోసం ప్రోత్సాహం అనంతపురం అగ్రికల్చర్: ‘హరిత గోపాలం’ పేరుతో ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్ తెలిపారు. అందుకు సంబంధించి పోస్టర్లను బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేయించారు. పశు, జీవ సంపద పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
వరుస ఘటనలు.. పోలీసులకు సవాళ్లు
● బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఎస్బీఐ ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్)ను దొంగలు అపహరించారు. పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంతో పాటు తాడిపత్రి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మెషీన్ను బొలెరో సాయంలో పెకలించుకొని వెళ్లి శింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీప పొలాల్లో పడేసి నిప్పు పెట్టారు. దాదాపు రూ.10 లక్షల నగదు పోయి ఉంటుందని భావిస్తున్నారు. ● ఈ నెల 13న గుంతకల్లులో రద్దీగా ఉండే ట్రావెల్స్ బంగ్లా సర్కిల్లో ఎస్బీఐ ఏటీఎం మిషన్ చోరీకి విఫలయత్నం జరిగింది. అర్దరాత్రి సమయంలో బొలెరో వాహనం సహాయంతో మిషన్ను లాగడంతో పెద్దగా శబ్దం వచ్చింది. దీంతో సమీపంలో ఓ వ్యక్తి లేచి గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. అనంతపురం సెంట్రల్: నగదుతో కూడిన బ్యాంకు ఏటీఎంలను కొల్లగొట్టే నార్త్ గ్యాంగ్ (ఉత్తరాది ముఠా)లు జిల్లాలో తిష్ట వేశాయి. పోలీసుల నిఘా లేని ప్రదేశాలను ఎంచుకుని పలు చోట్ల ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నాయి. గుంతకల్లు, బుక్కరాయసముద్రం, తాడిపత్రితో పాటు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ ఈ తరహా దొంగతనాలు జరిగాయి. ఈ ఘటనలన్నీ ఒకటే గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాజస్తాన్, బిహార్ రాష్ట్రాలకు చెందిన దొంగలే ఈ తరహా నేరాలకు పాల్పడతారని భావిస్తున్నారు. నిఘా వైఫల్యంతోనే .. జిల్లాలో రాత్రి సమయాల్లో పోలీసుల నిఘా ఏ మాత్రం ఉండడం లేదు. నేరాలు జరిగినప్పుడు హడావుడి తప్ప.. తక్కిన సమయంలో ఎలాంటి తనిఖీలు చేసే పరిస్థితి లేదు. కనీసం తీవ్రమైన నేరం జరిగినప్పుడు కూడా మేల్కోవడం లేదు. తొలి ఏటీఎం కేంద్రంపై దొంగతనానికి యత్నించినప్పుడు నిఘా వ్యవస్థలను పటిష్టం చేస్తే పునరావృతం కాకుండా ఉంటాయి. ఆ స్థాయిలో దృష్టి సారించకపోవడం వలన వరుస ఏటీఎం దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం పోలీసు అధికారులు స్టేషన్లలో తిష్ట వేసి పంచాయితీలకే పరిమితమవుతున్నారు. లేదంటే రోడ్లపైకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మందుబాబులు తాగింది దిగేలా రూ.10వేల చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. అంతే తప్ప నేరాల కట్టడిపై పోలీసులు దృష్టి సారించడం లేదు. ఇదే దొంగలకు కలిసి వస్తోంది. పక్కా స్కెచ్తోనే రంగంలోకి దిగుతున్నారు. ముందు రోజు ప్లాన్ రెడీ చేసుకోవడం.. తర్వాత అమలు చేయడం జరిగిపోతోంది. మొత్తం ఈ టీం సభ్యులు ఐదుగురులోపే ఉంటారని తెలుస్తోంది. ఒక బొలెరో సాయంతోనే ఏటీఎం దొంగతనాలు చాకచక్యంగా చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి తొలుత లోపలికి వెళ్లి సైరన్ మోగే వైర్లను కట్ చేస్తారు. తర్వాత బొలెరో వాహనం సాహయంతో ఏటీఎం కేంద్రాన్ని పెకలించేస్తారు. దర్జాగా బొలెరో వాహనంలో తీసుకుపోయి అందిన కాడికి దోచుకుంటున్నారు. భద్రతపై నిర్లక్ష్యం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, బంగారు దుకాణాలు తదితర ప్రాంతాల చోట సీసీ కెమెరా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఇటీవల కాలంలో సాధారణ ప్రజల ఇళ్లకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ రూ.లక్షలు, కోట్లు విలువైన డబ్బు, ఇతరత్ర వస్తువులు ఉన్న ప్రదేశాల్లో పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇందుకు నిదర్శనమే బుక్కరాయసముద్రం ఎస్బీఐ ఏటీఎం దొంగతనం. సదరు కేంద్రంలో ఎలాంటి సీసీ కెమెరా, అలారం వ్యవస్థ లేకపోవడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ప్రతి ఏటీఎం కేంద్రానికీ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేవారు. ఇటీవల కాలంలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తొలగించారు. కనీసం సీసీ కెమెరా, అలారం వ్యవస్థ అయిన పటిష్టంగా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. దొంగలను పట్టుకుంటాం : ఎస్పీ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం దొంగతనం జరిగిన ఘటనా స్థలాన్ని ఎస్పీ జగదీష్ పరిశీలించారు. జిల్లాలో కొద్దిరోజులుగా ఇదే తరహా ఏటీఎం దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దొంగతనాలను చాలెంజింగ్ తీసుకొని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మీడియాకు వెల్లడించారు. జిల్లాలో నార్త్ గ్యాంగ్ తిష్ట! ఏటీఎంలే లక్ష్యంగా చోరీలు గుంతకల్లులో దొంగతనాన్ని ఛేదించే పనిలో ప్రత్యేకబృందం అంతలోనే బుక్కరాయసముద్రంలో మరో దొంగతనం -
ఎంతకు తెగించార్రా....
● బీకేఎస్లో దోపిడీ దొంగల బీభత్సం ● ఎస్బీఐ ఏటీఎం అపహరణ ● పొలాల్లో ధ్వంసం చేసి రూ.15.84 లక్షల దోపిడీ బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రంలో దోపిడీ దొంగలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏకంగా ఎస్బీఐ ఏటీఎంను వాహనంలో ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. బీకేఎస్లోని అనంతపురం– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ పగలు చాలా రద్దీగా ఉంటుంది. దీనికి వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. రహదారిపై బ్రిడ్జి పనులు జరుగుతుండడంతో వాహనాలు కూడా ఏటీఎం ఎదుట నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నిమిషాల్లోనే దోపిడీ రద్దీ ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎంను దుండగులు కేవలం ఐదు నిమిషాల్లోనే దోపిడీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాహనం వెనుక భాగాన ముందుగానే తాడు కట్టుకుని అక్కడికి చేరుకున్నారు. వాహనం నుంచి ఒకరు దిగి ఏటీఎం సెంటర్ గ్లాస్ డోర్లను పగలగొట్టాడు. ఏటీఎంకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు తొలగించాడు. తర్వాత వాహనాన్ని రివర్స్ చేశారు. అందులో నుంచి మరొక వ్యక్తి దిగి వాహనంలోని తాడును ఏటీఎంకు కట్టాడు. ఇదే సమయంలో అంబులెన్స్, టూరిస్ట్ వాహనం, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సదరు వాహనం ముందు నుంచే వెళ్తున్నా దోపిడీ తీరును గుర్తించకపోవడం గమనార్హం. దుండగులు ఏటీఎంకు తాడు కట్టిన తర్వాత వాహనంతో లాగారు. ఏటీఎం గది నుంచి బయట పడడంతో వెంటనే వాహనంలోకి ఎత్తారు. ఈ పనంతా ఐదు నిమిషాల్లోనే చేశారు. తర్వాత స్థానిక తేరుబజార్, కొట్టాలపల్లి, గోవిందపల్లి, రేగడి కొత్తూరు మీదుగా శింగనమల మండల పరిధిలోని ఆకులేడు గ్రామ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం ధ్వంసం చేసి.. అందులోని రూ.15.84 లక్షల నగదు దోచుకున్నారు. మిషన్పై పెట్రోలు పోసి తగులబెట్టారు. తర్వాత అదే వాహనంలో పారిపోయారు. ఏటీఎం దోపిడీ దృశ్యాలు ఇటీవల పెద్దమ్మ జాతర సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల ముఖాలు, వాహనం నంబరు సరిగా కనిపించలేదు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, బీకేఎస్ సీఐ సుబ్బ రాయుడు, సీసీఎస్ సీఐ జయపాల్రెడ్డి, ఎస్ఐలు రాం ప్రసాద్, రాజశేఖర్రెడ్డి సిబ్బందితో కలసి పరిశీలించారు. ఏటీఎం చోరీ ఘటనలను త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. వాహనం సాయంతో ఏటీఎం చోరీకి పాల్పడుతున్న దొంగలు (సీసీ కెమెరా దృశ్యం) దుండగులు ధ్వంసం చేసిన ఎస్బీఐ ఏటీఎంనగదు తీసుకున్న తర్వాత ఏటీఎం మిషన్ను తగులబెట్టిన దృశ్యం -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటితో నాకు ప్రాణహాని
అనంతపురం టౌన్: ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ముస్లిం, మైనార్టీలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని న్యాయంగా అడిగా.. ఇందుకు నాపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కక్ష గట్టారు. తన అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు కూడా నన్ను స్టేషన్కు తీసుకువెళ్లి దారుణంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని ఉంది’ అంటూ టీడీపీ మైనార్టీ విభాగం అనంతపురం నగర మాజీ అధ్యక్షుడు ఐఎంఎం మహబుబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా ఆ పార్టీ జిల్లా కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఫోన్లో బెదిరించారని తెలిపారు. సోమవారం సాయంత్రం నమాజ్కు వెళ్తే పోలీసులు వచ్చి అనంతపురం వన్ టౌన్ స్టేషన్కు తీసుకెళ్లి పట్టాలివ్వాలని ఎమ్మెల్యేను కోరుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను తొలగింపజేశారన్నారు. తనకు ఇంటి పట్టాలివ్వాలని తాను అడగలేదని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు నిరుపేద మైనార్టీలకు పట్టాలివ్వాలని అడిగితే దాడులు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని నిలదీశారు. అనంతపురంలోని ముస్లిం, మైనార్టీలపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులు వివక్ష చూపిస్తున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పార్టీ కార్యాలయానికి చేరుకుని మహబూబ్ బాషాతో మట్లాడి, బుజ్జగించారు. దీంతో బాషా నిరసన దీక్షను విరమించుకున్నారు. -
బాబు పాలనలో సంక్షోభంలో రైతాంగం
● సమస్యలపై 30న చలో విజయవాడ ● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం అర్బన్: ‘‘రెండేళ్ల చంద్రబాబు పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల ముందు రంగురంగుల హామీలు గుప్పించి గద్దెనెక్కిన తరువాత అటకెక్కించారు’’ అని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజమెత్తారు. రైతుల సమస్య పరిష్కారానికి ఈనెల 30న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల కాలంలో రైతుల కష్టాలను తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. సిండికేట్ మార్కెట్ మాయాజాలంలో రైతులు నష్టపోతున్నారని, చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రూ.2 లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేయాలన్నారు. స్వామినాథన్ సిఫారసు మేరకు సమగ్ర ఉత్పత్తి వ్యవసాయానికి 50 శాతం అదనంగా అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్నారు. పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు లింగమయ్య,రాజేష్గౌడ్,కుళ్లాయిస్వామి, కృష్ణుడు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 23 నుంచి ఉరవకొండలో శిక్షణా శిబిరాలు ఉరవకొండ: స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ–సైద్ధాంతిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. మంగళవారం శిక్షణా శిబిరాల ఏర్పాట్లను జిల్లా కార్యదర్శితో పాటు సీపీఐ ముఖ్యనాయకులు పరిశీలించారు. 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, 23న శిక్షణా తరగతులకు పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాలుకా కార్యదర్శి చెన్నరాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, నాగేంద్ర, సుల్తాన్, మల్లేష్, బసరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
ఉరవకొండ: మండల పరిధిలోని వెలిగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గేట్ పడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి చండ్రాయుడుకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు నాయకులు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలకు పాల్పడి పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బడులు ప్రారంభమైనా పిల్లలకు యూనిఫాం, నోటు పుస్తకాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్పకు నాయకులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సాకే పురుషోత్తం,ఏఐఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నందు, తరుణ్, భాస్కర్, నరసింహ, నాగరాజు, పవన్, దేవా, రవి, సుధాకర్ పాల్గొన్నారు. జూదరుల అరెస్టు పెద్దపప్పూరు: మండలంలోని తబ్జూలలో మంగళవారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. తబ్జూల, శింగనగుట్టపల్లి గ్రామాలకు చెందిన 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.52,650 నగదుతో పాటు ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బరితెగించిన దొంగలు ● బళ్లారి బైపాస్లో పట్టపగలే చోరీ అనంతపురం సెంట్రల్: నగరంలోని బళ్లారి బైపాస్లో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున బళ్లారి రోడ్డులోని ఎంజీ పెట్రోలియం బంకు పక్కన ఆర్వీ వైన్స్ దుకాణంలో విలువైన వైరింగ్ సామాన్లు, వంట సామగ్రిని ఎత్తుకెళ్లిన విషయం విదితమే. బాధితుడు అశోక్బాబు గమనించి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. దీంతో త్రీటౌన్ కానిస్టేబుళ్లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే మరోసారి అదే దుకాణంలో చొరబడ్డారు. అది కూడా మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో చొరబడి దొరికిన సామాన్లు తీసుకెళ్లిపోయారు. ఏకంగా ఆటో తీసుకొచ్చి అందులో వేసుకెళ్లడం గమనార్హం. స్థానికంగా ఉంటున్న కొంతమందే నేరాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం
● దంపతులకు గాయాలు కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంప తులు శోభ, తిప్పేస్వామి గాయపడ్డారు. హైదరాబాద్లో నివాసముంటున్న తిప్పేస్వామి వచ్చే నెలలో జరగనున్న తన కుమార్తె చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కారులో మండలంలోని మాల్యం గ్రామానికి వచ్చాడు. పెళ్లి పత్రి కలు పంచి కారులో బళ్లారికి వెళ్తూ మార్గమధ్యంలోని ఆలూరు వద్ద పైప్లైన్ పనులు చేస్తున్న హైడ్రాలిక్ క్రేన్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. శోభ, తిప్పేస్వామికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
రైల్లో దోపిడీ షోలాపూర్ గ్యాంగ్ పనేనా?
● గతంలో ఇదే తరహా దోపిడీలు ● తాజా ఘటనతో మళ్లీ చర్చనీయాంశం గుత్తి రూరల్: గుత్తి శివారులో రైలులో దోపిడీకి పాల్పడింది షోలాపూర్ గ్యాంగ్ పనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బాపట్ల వద్ద, గుత్తి శివారులో ఒకే రోజు ఒకే సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారి బంగారు, విలువైన వస్తువులు, సెల్ఫోన్లను అపహరించారు. గుత్తి శివారులో 2025 ఏప్రిల్లో ఇదే తరహాలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిలిపి ఉంచిన రైళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి నుంచి గుత్తి శివారులోని పెద్ద బ్రిడ్జి వద్ద ప్రతి రోజూ ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను గస్తీకి ఉంచేవారు. ఇటీవల ఎక్కడా గస్తీ లేకపోవడం పసిగట్టిన దొంగలు కార్యాచరణ అమలు చేశారు. గుత్తితో పాటు జాతీయ రహదారిపై హోటళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఈ నెల 14 ఆదివారం రాత్రి నుంచి గుత్తి – తురకపల్లి వైపు వెళ్లిన వాహన వివరాలు ఆరా తీస్తే పోలీసులకు ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికుల ముసుగులో చేరతారు.. ముఠాలోని ఇద్దరు సభ్యులు రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణిస్తూ బందోబస్తు పోలీసులు లేని కోచ్లలోకి ప్రవేశించి, ఎంతమంది మహిళలు బంగారు ధరించారు అనే విషయాలను ముఠా సభ్యులకు చేరవేసి దోపిడీలకు పాల్పడటం వారి నైజం. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ పోలీసులు గస్తీకి వెళ్లి ఉంటే దోపిడీ జరిగేది కాదని పలువురు చెబుతున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో బందోబస్తు ఉన్న పోలీసులు ఏసీ బోగీలోకి వెళ్లి పడుకుంటారని, దీంతో దొంగలకు దోపిడీ సులువవుతోందంటున్నారు. గుత్తి శివారులో రైల్వే ట్రాక్లకు సమాంతరంగా జాతీయ రహదారులు ఉండటంతో సులువుగా ఉడాయిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుని గుత్తి శివారులో పెద్ద బ్రిడ్జి, తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, గుత్తి–జక్కలచెరువు మధ్యలో రోజూ రాత్రి సమయాలలో గస్తీ పెంచి దోపిడీలను అరికట్టాలని కోరుతున్నారు. -
శారీరక దృఢత్వంతో ఏ రంగంలోనైనా రాణింపు
కూడేరు: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని క్యాంప్ కమాండర్ మేజర్ భూమన్య అరుణ్ సూచించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్సీసీ నగర్లో కర్నూల్ గ్రూప్ వన్ ఆంధ్ర ఆధ్వర్యంలో సీఏటీసీ–5 ఎన్సీసీ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. మంగళవారం ఎన్సీసీ అధికారులు క్యాడెట్లకు డ్రిల్, వ్యాయామంపై శిక్షణ ఇచ్చారు. వ్యాయామం, డ్రిల్తో శరీర దృఢత్వం పెంపొందడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. దీంతో చురుకుదనం పెరిగి మనం ఎంచుకున్న రంగంలో రాణించి లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని క్యాంప్ కమాండర్ మేజర్ భూమన్య అరుణ్ తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ అడ్జుటెంట్ దాసరి సుధీర్, ఎన్సీసీ అధికారులు విజయ కుమార్, వెంకటేశ్వర్లు, అనీల్ కుమార్, కాశీం, రాజ్యలక్ష్మీ, ప్రతాప్, కేపీ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో బంగారు నగల అపహరణ ● 6 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు అనంతపురం సెంట్రల్: ఇంట్లో బంగారు నగ లను అపహరించిన ఘటన నగరంలోని కోవూరునగర్లో జరిగింది. 6 నెలల తర్వాత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నాల్గో పట్టణ ఎస్ఐ కె.గోపి తెలిపిన మేరకు.. గతేడాది డిసెంబర్లో కోవూరునగర్లో నివాసముంటున్న మహబూబ్బాషా నివాసంలో దొంగతనం జరిగింది. బీరువాలో ఉంచిన 13.5 తులాల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని బాధితులు మంగళవారం నాల్గవ పట్టణ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. మహిళ ఆత్మహత్య గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామానికి చెందిన మునగాల ప్రవల్లిక (27) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునగాల ఆదిశంకర్ భార్య మునగాల ప్రవల్లిక కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. గుత్తితో పాటు పలు ఆసుపత్రులతో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలను బయటకు పంపి తలుపులు మూసుకుని ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుంది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ప్రవల్లికను కిందకు దింపిన అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవల్లిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కటకటాల్లోకి గంజాయిబ్యాచ్ తాడిపత్రిటౌన్: తాడిపత్రి రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్న బ్యాచ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి పట్టణానికి చెందిన కరీమ్, ప్రకాష్నాయుడు, అస్రాబ్, మరో ఇద్దరు రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 5 మందిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు వెల్లడైంది. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, నకిలీ నోట్ల పట్టివేత : ఇద్దరి అరెస్టు గుత్తి: గంజాయితో పాటు నకిలీ నోట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్ తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామా నికి చెందిన సి.గోపాల్, దిమ్మగుడికి చెందిన బద్రి బైక్లో గంజాయి, నకిలీ నోట్లు తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలోనే గుత్తి అనంత పురం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్లు వారిని పట్టుకున్నారు. బైక్లో ఉన్న 20 గ్రాముల గంజాయి, 47 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుత్తికి చెందిన రమేష్కు గంజాయి, నకిలీ నోట్లు ఇచ్చి కేసులో ఇరికించాలని నిందితులు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వారిని జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. -
‘జననేత జగనన్న ప్రజాసంకల్ప పాదయాత్ర’ పుస్తకావిష్కరణ
అనంతపురం: వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా రచించిన ‘జననేత జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర’ పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆవిష్కరించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రతో పాటు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాల గురించి పుస్తకంలో వివరించినట్లు రచయిత కట్టుబడి తానీషా పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ సాకే శైలజానాథ్, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి, డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ టీచర్ పొలమడ రమేష్ బాబు, రవి తదితరులు పాల్గొన్నారు. -
స.హ చట్టం పక్కాగా అమలు కావాలి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలవ్వాలని డీఆర్ఓ ఎ.మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సమాచార హక్కు చట్టంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా కార్యాలయాల వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అపిలేటివ్, అసిస్టెంట్ అపిలేటివ్ అధికారులు సక్రమంగా ఇవ్వాలన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు రాయల కొండయ్య, లాల్యనాయక్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నగరాజునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు.. సమాచార హక్కు చట్టం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటైంది. జిల్లా సమన్వయ అధికారిగా కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా ఎస్పీ, నోడల్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి, సభ్యులుగా జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, డీఈఓ, సమాచార హక్కు చైతన్య వేదిక రాయలకొండయ్య, సమాచార హక్కు ఐక్యవేదిక అధ్యక్షుడు లాల్యనాయక్ వ్యవహరిస్తారు. -
మెరుగైన వైద్య సేవలందించండి
కళ్యాణదుర్గం రూరల్: వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, మహిళల వార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలతో రోగులకు వైద్య సేవలు అందజేయాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఆవసరం ఉందని వైద్యులు తెలపడంతో.. త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం పట్టణ సమీపంలోని ఉన్న నగర వనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎరువుల అమ్మకాలపై కాల్సెంటర్ అనంతపురం అగ్రికల్చర్: ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, డీలర్లు, ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తికి వ్యవసాయశాఖ కార్యాలయంలో కాల్సెంటర్ ఏర్పాటు చేసినట్లు జేడీఏ సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కాల్సెంటర్ నంబర్ 83310 57714లో సిబ్బంది జి.ఆదినారాయణ, జి.రాఘవేంద్రరెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకుని యూరియా, డీఏపీ అమ్మకాలు సాఫీగా జరిగేలా సహకరించాలని కోరారు.వ్యక్తిపై పోక్సో కేసు గుత్తి రూరల్: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మంగళవారం గుత్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు వ్యక్తిని గతంలోనే తీవ్రస్థాయిలో మందలించారు. అయితే వారం రోజుల నుంచి తిరిగి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం శ్రీనివాసులుపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. మాతాశిశు మరణాలు నివారిద్దాం అనంతపురం సిటీ: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తి స్థాయిలో నివారిద్ధామంటూ సంబంధిత వైద్యాధికారులకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఆరు శిశు మరణాలపై మంగళవారం తన చాంబర్లో సంబంధిత వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. శిశు మరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భస్థ ప్రారంభ దశ నుంచే నాణ్యమైన ప్రసూతి పూర్వ సేవలు అందించడం ద్వారా మాతాశిశు మరణాలను నివారించవచ్చన్నారు. అలాగే హైరిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా గర్భిణుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సీఏఎస్ పోస్టుల భర్తీకి చర్యలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) చైర్మన్, కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 16, సీఏఎస్ జనరల్ పోస్టులు 10 చొప్పున మొత్తం 26 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ఆసక్తి, తగిన అర్హత ఉన్న వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://ananthapuramu. ap. gov. in వెబ్సైట్ను పరిశీలించవచ్చు. -
మేల్కోకపోతే పెనుముప్పే
ప్రపంచం సాంకేతికంగా ఎంత వేగంగా పరుగులు తీస్తుందో.. ప్రకృతి అంతే వేగంగా తన సమతుల్యాన్ని కోల్పోతోంది. విలాసవంతమైన జీవనశైలి, విచక్షణారహిత ప్రకృతి వినియోగం, అడవుల నరికివేత, భూగర్భ జలాల అధిక వినియోగం, రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వంటి కారణాలు పర్యావరణాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ, కరువులకు మారుపేరుగా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాపై మరింత తీవ్రంగా పడుతోంది. ● మానవాళి మనుగడకే పెను ముప్పుగా ‘సాంకేతిక’ జీవనం ● ఉమ్మడి అనంత జిల్లాపై తీవ్ర ప్రభావం అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను పరిశీలిస్తే కరువు ఇక్కడ కొత్త కాదు. దశాబ్దాలుగా ప్రతి రెండో లేదా మూడో ఏడాది అనావృష్టి పరిస్థితులు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. మధ్య మధ్యలో అతివృష్టి రూపంలో కురిసే భారీ వర్షాలు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడి రైతుల జీవనాధారం ప్రధానంగా వర్షాధార వ్యవసాయమే. వేరుశనగ సాగు జిల్లాకు గుర్తింపుగా నిలిచినా, వాతావరణ మార్పుల కారణంగా రైతులు క్రమంగా చీనీ, దానిమ్మ, అరటి వంటి వాణిజ్య పంటల వైపు మళ్లాల్సి వచ్చింది. అయితే ప్రకృతి అనిశ్చితి పెరుగుతుండడంతో ఆ పంటలూ రైతుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. భూగర్భ జలాలపై పెరిగిన భారం.. వానలు కురవని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రైతులు భూగర్భ జలాలపై ఆధారపడ్డారు. బోర్లు తవ్వి సాగు సాగించినా, క్రమంగా నీటి మట్టాలు వందల అడుగుల లోతుకు పడిపోయాయి. ఒకప్పుడు కొద్ది అడుగుల్లో లభించిన నీరు నేడు వేల అడుగుల లోతులో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బోర్లు వట్టిపోతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. చివరకు రైతు జీవితం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశంగానే మిగిలిపోయాయి. అటకెక్కిన ఎడారీకరణ నివారణా పథకాలు.. అనంతపురాన్ని ఎడారీకరణ నుంచి కాపాడేందుకు గతంలో పలు పథకాలు రూపొందించారు. వాటర్షెడ్ కార్యక్రమాలు, చెక్డ్యాంల నిర్మాణం, భూసార పరిరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అనేక పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తులో వ్యవసాయాన్ని కాపాడాలంటే సాంప్రదాయ పద్ధతుల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక విత్తనాల వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, సహజ వ్యవసాయం,పంటల వైవిధ్యం, చెట్ల పెంపకం వంటి చర్యలు మాత్రమే స్థిరమైన పరిష్కారాలుగా నిలుస్తాయి. కణేకల్లు మండలంలో ఎడారీకరణ ప్రభావంతో పొలాల్లో ఇసుక మేటలు సందర్భంనేడు ప్రపంచ కరువులు– ఎడారి నివారణా దినోత్సవం -
రైతాంగాన్ని ఆదుకోవాలి
జిల్లాలో కరువు కారణంగా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సంక్షోభంలో ఉన్నారు. భూసారం, తేమ, పచ్చదనం క్షీణించి, జీవ వైవిధ్యం వేగంగా నశించి, ఎడారీకరణ జరుగుతోంది. సుస్థిర వ్యవసాయ విధానమే ఇందుకు పరిష్కారం. ప్రకృతిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంతో పాటు రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెనుముప్పు నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. – డాక్టర్ వై.వీ.మల్లా రెడ్డి, డైరెక్టర్, ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ -
పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేక బలవన్మరణం
యాడికి: పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి ఆసుపత్రి కాలనీలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న నేత కార్మికులు శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు కుమారుడు జగదీష్, కుమార్తె పల్లవి ఉన్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తాండా సమీపంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో పల్లవి 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 12 నుంచి పాఠశాలకు విద్యార్థులందరూ వెళ్తున్న నేపథ్యంలో నీవెప్పుడు వెళ్తావని పల్లవిని మంగళవారం తల్లి లక్ష్మి అడిగింది. ఆశ్రమ గిరిజన పాఠశాలలో చదవడం తనకు ఇష్టం లేదని పల్లవి చెప్పడంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శ్రీనివాసులు, లక్ష్మిలు తమ ఇంటి సమీపంలోని షెడ్డులో మగ్గం నేసేందుకు వెళ్లగా, పల్లవి ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చెట్టుకు వేలాడుతున్న పల్లవిని కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నాసిరకం విత్తనం అంటగట్టారు!
● ఇదీ సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ తీరు అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తన వేరుశనగ పంపిణీలో చాలాచోట్ల రైతులకు నాసిరకం అందాయి. పేరు కు 40 శాతం రాయితీ అంటున్నా బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకు ఏమీ తేడా లేదంటున్నారు. క్వింటా పూర్తి ధర రూ.10,200 ఖరారు చేసి, అందులో 40 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద క్వింటా రూ.6,120 ప్రకారం చెల్లిస్తున్నారు. ఒక్కో రైతుకు 30 కిలోల బస్తా రూ.1,816 ప్రకారం గరిష్టంగా మూడు బస్తాలు (90 కిలోలు) పంపిణీ చేస్తున్నా రు. నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే 9 శాతం లోపు తేమ ఉండాలని, ఫిజికల్ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు 4 శాతం లోపు, మొలకశాతం 70 శాతం పైన, ఇతరత్రా విత్తనాలు ఉండకూడదని నిబంధనలు పెట్టారు. ప్రధానంగా అవుటన్ 74 శాతం అంతకన్నా అధికంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాణ్యతకు తిలోదకాలు జిల్లాకు 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. గత ఖరీఫ్, రబీకి సంబంధించి సరఫరాదారులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు చెల్లించకపోవడంతో ప్రస్తుత సీజన్లో విత్తన సమస్య తలెత్తింది. ప్రాసెసింగ్ ప్లాంట్లలో పరిమితంగా నిల్వలు ఉండటంతో వాటిని శుద్ధి చేసి ఆర్ఎస్కేలకు సరఫరా చేశారు. అయితే కేటాయింపుల మేరకు సేకరించాలని బలవంతం చేస్తుండటంతో ఎక్కడపడితే అక్కడి నుంచి నాణ్యత లేని చెనక్కాయలు తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించి నాసిరకం సేకరించారు. దీంతో కొన్ని మండలాలు, ఆర్ఎస్కేల నుంచి కాయలు బాగలేవని వాహనాలు వెనక్కి పంపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో దించుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ మండలానికి వచ్చిన వాటిలో కాయలు బాగలేనందున వాహనాల లోడును వెనక్కు పంపినట్లు ఏఓలు ‘సాక్షి’కి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, అవసరం మేరకు యూరియా, డీఏపీ పంపిణీ విషయంపై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు. చెనక్కాయలు బాగుంటే తమ ఖాతాల్లో వేసుకోవడం, నాసిరకమైతే అధికారులను నిందించడం చేస్తున్నారు. సకాలంలో బకాయిలు చెల్లించి ఉంటే నాణ్యమైన విత్తనాలు సేకరించే పరిస్థితి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● కాగా జిల్లాకు కేటాయించిన 56 వేల క్వింటాళ్లలో ఆర్ఎస్కేలకు సరఫరా చేసింది 15 వేల క్వింటాళ్లు. అందులో రైతులకు పంపిణీ చేసింది 4 వేల క్వింటాళ్లలోపే కావడం గమనార్హం. -
పారదర్శకమైన, సమగ్రమైన ఓటరు జాబితాలు రూపొందించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–‘సర్’) ప్రక్రియ ఈ నెల 15న మొదలైంది. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా.. లేదా.. విచారించ
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘సర్’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ‘సర్’ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ‘ఎస్ఐఆర్ (సర్)’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు ఉన్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయినవారు, వలసలు, డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లూ తిరిగి వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తే.. వాటిని పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్ చేయాలి. సెప్టెంబర్ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14వ తేదీకే అనంతపురం జిల్లాలో 77.55 శాతం మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బీఎల్ఓలు ఏంటికి వెళ్లారు.. ఎవరిని విచారించారు.. అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకూ తెలీదు. మీడియాకు సమాచారమూ లేదు. అలాంటప్పుడు జూన్ 15 కంటే ముందుగానే మ్యాపింగ్ను బీఎల్ఓలు ఎలా చేశారు.. అందులో పారదర్శకత ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడితోనే హడావుడి మ్యాపింగ్ ఓ జిల్లా అధికారి ఒత్తిడితోనే ఓటరు మ్యాపింగ్ను హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే స్వయంగా చెబుతున్నారు. ‘ఏం చే స్తాం సార్. మాపై అలాగే ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్ చేశాం’ అని చెబుతున్నారు. ఇప్పటికే 77.55 శాతం పూర్తయింది. అంటే మిగిలింది 22.45 శాతం మాత్రమే. రాయదుర్గంలో 82.73, ఉరవకొండలో 73.18, తాడిపత్రిలో 76.94, శింగనమల 79.80, కళ్యాణదుర్గం 78.11, రాప్తాడు (అనంతపురం జిల్లాలోని పరిధి) 73.29 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మ్యాపింగ్లో కుట్రకోణం మ్యాపింగ్ ముందుగా చేయడంలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. మొదట ఓట్లు మ్యాపింగ్ చేస్తే ఆపై రాజకీయపార్టీల పరిధిలోని బీఎల్ఏలు అభ్యంతరాలు ఉంటే లేవనెత్తుతారు. అప్పుడు ఓట్లు తొలగిద్దామనే ఆలోచనను అధికారులు చేసినట్లు తెలిసింది. ఈ లెక్కన అధికారపార్టీ బీఎల్ఏలు ఇచ్చిన జాబితా ప్రకారం ఓట్లు తొలగిస్తే.. విపక్షపార్టీల ఓట్లు మాత్రమే గల్లంతయ్యే అవకాశం ఉంది. పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరు మరో బూత్ పరిధిలోకి ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్ చేయాలి. చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి. జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరాబాద్, బెంగళూరులో కూడా ఉన్నాయి. అంతర్రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్ చేసి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా గుర్తిస్తారు. డబుల్ ఓట్లు తేలితే అప్పుడు ఫాం–ఏ, బీ ఇచ్చి.. ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి. సెప్టెంబర్ 22న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఫారం–6 ఇస్తారు. అప్పుడు కొత్త ఓట్లు చేరుస్తారు. ఫారం–6 ఇప్పుడు కూడా ఓటరు అడిగితే ఇవ్వాలి. ఫారం–6 అనేది నిరంతర ప్రక్రియ. ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం. అప్పుడు డబుల్ ఓట్లు తగ్గుతాయి. కచ్చితమైన ఓటరు జాబితా తేలుతుంది. పొలింగ్శాతం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కూర్చుని మ్యాపింగ్ చేసినట్లు చేస్తే ‘సర్’ చేసినా ప్రయోజనం ఉండదు. అనంతపురం నియోజకవర్గంలో 2002లో ఉన్న ఓట్లు 1,86,925. ఈ ఓట్లు 2025కు 2,82,463కు పెరిగాయి. ప్రస్తుతం మ్యాపింగ్ చేసిన ఓట్లు 1,86,214. ఇక మ్యాపింగ్ చేయాల్సింది 96 వేలపై చిలుకు ఓట్లు. ఇక్కడ 65.93 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. 2002లో రాప్తాడు.. అనంతపురం నియోజకవర్గంలోనే ఉండేది. అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా పెరిగింది. కొత్త ఓటర్లు భారీగా చేరారు. రాప్తాడు పూర్తిగా దూరమైంది. ఉద్యోగులు, బదిలీలతో పాతవారు వెళ్లడం, కొత్తవారు చేరడం ఇక్కడ అధికం. అయినప్పటికీ దాదాపు 66 శాతం మ్యాపింగ్ చేశారు. ఇది నమ్మశక్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. ‘సర్’ సర్వేపై రాజకీయపార్టీల్లో సందేహాలు ఈ నెల 15 నుంచి ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్ఓలు, బీఎల్ఏలు 14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 77.55 శాతం పూర్తి చేసిన అధికారులు రాష్ట్రంలో మరే జిల్లాలో కూడా ఈ స్థాయిలో మ్యాపింగ్ కాని వైనం ఓ జిల్లా అధికారి ఒత్తిడితో ఓటరు జాబితాలు పెట్టుకుని ఇంటిపేరు పోలితే చాలు మ్యాపింగ్ -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత కొనసాగుతోంది. గంటలకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
ఈ–స్టాంప్ కేసు హైకోర్టులో నేడు విచారణ కళ్యాణదుర్గం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం ఈ– స్టాంప్ కుంభకోణం కేసు బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ఈ– స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో 2025 నవంబర్ 17న ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ కేసు అడ్మిషన్ స్టేజ్లో ఉంది. కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ధీరజ్సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్ విచారించనున్నారు. పిటిషనర్ డాక్టర్ తలారి రంగయ్య ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు, హోం శాఖ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను చేర్చారు. ఈ కేసు 2025 నవంబర్ 19న, 2026 ఫిబ్రవరి 18న, 2026 మార్చి 11న విచారణకు వచ్చింది. తాజాగా మరోమారు విచారణకు రావడంతో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో గుబులు పుడుతోంది. కాగా పిటిషనర్ తరఫున సీనియర్ కౌన్సిల్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అయితే ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన న్యాయవాదులతో కేసును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. అదనపు ఎస్పీగా నాగభూషణం అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీగా నాగభూషణం నియమితులయ్యారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనకు ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తాజాగా అనంతపురం అదనపు ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
నేత్రపర్వంగా కొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవం
బొమ్మనహాళ్: తారకాపురంలో కొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవం మంగళవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం గంగా జలంతో అమ్మవారికి అభిషేకించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 101 మంది గొరవయ్యల ప్రదర్శనలతో పాటు నందికోలు, వీరభద్ర కుణిత, మహిళా వీరకాశి నాట్యాల మధ్య రథోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
నేటి నుంచి గూగూడు ఉత్సవాలు
నార్పల : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ రాష్ట్రంలోనే పేరుగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి వార్షిక ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 13 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు ఈ నెల 29వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో (పీర్ల పండుగలో) భాగంగా ఈ నెల 17న గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం ఉంటుంది. 18న స్వామికి నిత్యపూజ నివేదన, 19న అగ్నిగుండం ఏర్పాటు, 20న పీర్లను కొలువుదీర్చడం, 21న నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదవ సరిగెత్తు, 23న నిత్యపూజ నివేదన, 24న ఏడవ సరిగెత్తు, రాత్రికి మెరవణి, 25న నిత్యపూజ నివేదన, విడిదినం, 26న గ్రామోత్సవం, పెద్దపరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. 27న సాయత్రం 4 గంటలకు జలధికి పోవుట, 29న స్వామివారి చివరి దర్శనం ఉంటుంది. అరకొరగానే సదుపాయాలు : గూగూడు కుళ్లాయిస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏటా గణనీయమైన ఆదాయం వస్తున్నా సౌకర్యల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఉత్సవాలకు వచ్చే మహిళలు, వృద్ధులు చిన్నారుల కోసం సరిపడ మరుగుదొడ్లు లేకపోవడం, స్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం తీవ్రమైన లోపంగా మారింది. తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, వసతి గదులు లేకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాథమిక అంశాలపైనా దృష్టి సారించలేదు. మందుబాబులతో జాగ్రత్త! ఉత్సవాల వేళ జూదం, అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో మందుబాబు చేష్టల వల్ల మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బాబ్బాబూ.. యోగా చేద్దాం రండి
అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి స్పందన కరువైంది. నిర్ణీత సమయం సమీపిస్తున్నా ప్రజలు ఎవరూ రాకపోవడంతో సమగ్రశిక్ష ఏపీసీ శైలజ కంగారు పడ్డారు. వెంటనే డీఆర్డీఏ, మెప్మా సిబ్బందిని పిలిచి కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని అభ్యర్థించారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి యోగా కార్యక్రమానికి రావాలని ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో అరగంట ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీలతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్ అకృత్యాలకు అద్దంపడుతోంది. ఓ ఎన్ఆర్ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.అరాచకానికి కేరాఫ్ అడ్రస్ చింతమనేని అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్చల్ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ రౌడీరాజ్యంగా మార్చివేశారు.అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? – ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణికబ్జాల ప్రత్తిపాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్ సిటీ సెంటర్ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్ఆర్ఐ మురళీమోహన్ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేశ్కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్ యజమానులను బెదిరించారు.ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబునరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా సృష్టించారు.ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. కేజీబీవీ ప్రిన్సిపాల్కు కూన రవికుమార్ వేధింపులు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్కు రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి గత ఏడాది చెక్పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. నైరుతి దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది.
దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం ● మూడు చక్రాల స్కూటర్ ఇవ్వలేదని మనస్తాపం అనంతపురం అర్బన్: మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేయలేదన్న మనస్తాపంతో ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన పి.విరూపాక్షి దివ్యాంగుడు సోమవారం కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ వద్దకు వచ్చాడు. అర్జీల స్వీకరణ కౌంటర్లకు కొద్ది దూరంలో కూర్చుని సంచిలో నుంచి డీజిల్ బాటిల్ బయటకు తీశాడు. అదే సమయంలో విరుపాక్షి చర్యను ఏఎస్ఐ వెంకటేష్ గమనించి వెంటనే వచ్చి బాటిల్ను లాగేసుకున్నాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే.. తాను దివ్యాంగుడినని, తన భార్య క్యాన్సర్తో బాధపడుతోందని చెప్పాడు. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే వాహనాలు అద్దెకు తీసుకునే స్థోమత లేదని, తనకు మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని విరూపాక్షి చెప్పాడు. ఏడాదిన్నర కాలంగా అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నానని, అయితే పదో తరగతి సర్టిఫికెట్ లేదని మంజూరుకు ససేమిరా అంటున్నారని తెలిపాడు. సర్టిఫికెట్ లేకపోతే మాలాంటి వారు నేలమీద దోక్కుంటూ వెళ్లాల్సిందేనా అంటూ ఆవేదన చెందాడు. పీజీఆర్ఎస్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు విరూపాక్షిని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. ఆయనకు విరుపాక్షి తన గోడును వినిపించాడు. స్పందించిన జేసీ మూడు చక్రాల స్కూటర్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆలోచించండి ఓ అమ్మానాన్న!
యాడికి: తండ్రి అందనంత దూరం వెళ్లిపోయాడు. ప్రేమగా చూసుకునే తల్లి జైలు పాలైంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే అడుగంటాయి. తల్లిదండ్రులు దూరమై ప్రేమ కరువై అమాయకంగా చూస్తున్న ఆ నలుగురు పిల్లలను చూసి కన్నీరు పెట్టని వారు లేరు. యాడికి మండలంలోని పెద్దపేట గ్రామంలో ఈ నెల 12న శివప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన శివప్రసాద్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తుండడం, తనను, నలుగురు పిల్లలను సరిగా చూసుకోకపోవడానికి తోడు తాగొచ్చి గొడవకు దిగడంతో క్షణికావేశంలో భార్య హైమావతి రోకలి బండతో అతని తలపై బాదడంతో మరణించాడు. ఈ క్రమంలో నిందితురాలిని సోమవారం పోలీసులు అరెస్టు చేయగా, నలుగురు పిల్లలు అనిత (ఫస్ట్ ఇయర్), నాగవర్దిని (8వ తరగతి), వినిత (6వ తరగతి), కంబగిరి రాముడు (3వ తరగతి) అనాథలయ్యారు. పిల్లల దీన స్థితిని కళ్లారా చూసిన సీఐ శ్రీనివాసులు స్థానిక అగాపే వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు పసాద్కు పిల్లల బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఆశ్రమం వద్దకు పిల్లలను తీసుకొచ్చి ప్రసాద్ భోజనం వడ్డించగా, బాధను దిగమింగుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నం తింటున్న వారిని చూసి అందరి కళ్లు చెమర్చాయి. కాగా, గతంలో శివప్రసాద్ తన కుటుంబాన్ని బాగానే చూసుకునే వాడని, మద్యానికి బానిసయ్యాక ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడని పలువురు చెప్పడం చూస్తే, ‘మత్తు’ అనేది బతుకులను ఎంతలా చిత్తు చేస్తుందో అర్థమవుతుంది. ప్రస్తుతం వీధివీధినా దొరుకుతున్న మద్యానికి అలవాటు పడి, కుటుంబాలను గాలికి వదిలేస్తున్న మందుబాబుల్లో ఈ దీనగాథను చూశాకైనా మార్పు వస్తుందో లేదో చూడాలి! హైమావతిని అరెస్టు చూపుతున్న సీఐ శ్రీనివాసులు నలుగురు చిన్నారులతో అగాపే వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రసాద్ -
ఖరీఫ్ ఏరువాకకు ఎన్ని కష్టాలో!
● విత్తనాలు, ఎరువులు అందక అన్నదాతల అవస్థలుఅనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ప్రారంభం కావడం, వర్షాలు పడుతుండటంతో సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా విత్తన వేరుశనగ, కందులు, యూరియా, డీఏపీ కోసం అవస్థలు పడుతున్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో మే చివరి వారంలోనే విత్తన వేరుశనగ, కందుల పంపిణీ మొదలు పెట్టేవారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 451 ఆర్బీకేల్లో రైతులకు తగినంత విత్తనం, ఎరువులు అందుబాటులో పెట్టడంతో ఏ సమస్యా లేకుండా ఖరీఫ్ ఏరువాక కొనసాగింది. కానీ చంద్రబాబు ప్రభత్వం వచ్చిన ఈ రెండేళ్లలో రైతులకు సమస్యలు పెరిగిపోయాయి. విత్తన కేటాయింపులు చాలా వరకు తగ్గించారు. ఈసారి అరకొరగా కేటాయించిన 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు కూడా సకాలంలో పంపిణీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. అలాగే 451 ఉన్న ఆర్బీకేల్లో 125 మూసేయడంతో ఇపుడు 326 ఆర్ఎస్కేలు (రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) – రైతు సేవ కేంద్రాలు (ఆర్ఎస్కేలు)గా పేరు మార్చారు) పనిచేస్తున్నాయి. అక్కడ కూడా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టడం లేదు. ప్రస్తుతానికి 159 ఆర్ఎస్కేల్లో మాత్రమే 12 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ నిల్వ చేశారు. తాడిపత్రి డివిజన్ మినహా ఇంకా అనంతపురం, రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్కేలకు ఇంకా విత్తనం చేరలేదు. ఇదిగో అదిగో అంటున్నా మినీకిట్ల కింద కందులు, రాయితీ కింద కందులు కూడా ఇంకా సరఫరా కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక వేరే విత్తనాలు ఏవీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 20 వేల మంది రైతులు 18 వేల క్వింటాళ్ల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నా విత్తన సరఫరా మందకొడిగా చేపడుతున్నారు. విత్తన కొరత కారణంగా మిల్లర్లు పెనుకొండ, పావగడ, చెళ్లకెరె లాంటి ప్రాంతాల నుంచి కల్తీ, నాసిరకం సేకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులు అందేది గగనమే యూరియా, డీఏపీ ఎరువులు అందడం గగనంగా మారింది. కొత్తగా యాప్ను అందుబాటులోకి తేవడంతో ఒక బస్తాకు కూడా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్కేల్లో 1,700 మెట్రిక్ టన్నుల యూరియా, 80 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉండగా పీఏసీఎస్, డీసీఎంఎస్, ఎఫ్పీఓల్లో 400 మెట్రిక్ టన్నుల యూరియా, 400 మెట్రిక్ టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. మళ్లీ పెరగనున్న ఎరువుల ధరలు ఎరువుల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాంప్లెక్స్ ఎరువులు ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారు. డీఏపీ బస్తా రూ.1,350 కాగా.. రూ.1,600 నుంచి రూ.1,800 మధ్య వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇక 20–20–0–13, 10–26–26, 15–15–15, 28–28–0, 24–24–0, 14–35–14, 16–16–16, 16–20–0–13, 12–32–16 తదితర కాంప్లెక్స్ ఎరువుల (ఎన్–పీ–కే) ధరలు కొండెక్కాయి. గతేడాదితో పోల్చితే బస్తా మీద రూ.200 నుంచి రూ.500 వరకు పెంపు చేయడంతో రైతులకు భారంగా పరిణమిస్తోంది. గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా వచ్చే నెల నుంచి కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10–26–26 రకం ఇప్పుడు 2,250 ఉండగా వచ్చే నెలలో రూ.2,400 కావచ్చంటున్నారు. అలాగే 20–20–0–13 రకం గతేడాది రూ.1,550 ఉండగా ఇప్పుడు రూ.2,250కు పెంచారు. వచ్చే నెలకు 2,450కు చేరవచ్చని చెబుతున్నారు. ఇలా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు మరోసారి పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సూపర్ఫాస్పేట్ కూడా ఇప్పు డు రూ.735 ఉండగా వచ్చేనెలకు రూ.1,000 కావచ్చని, పొటాష్ ప్రస్తుతం 1,850 ఉండగా వచ్చే నెల రూ.2 వేలు కావచ్చని చెబుతున్నారు. -
ఖతర్నాక్ యానిమేటర్
● 10 మహిళా సంఘాల నుంచి రూ.లక్షలు మింగిన వైనం శెట్టూరు: మండల పరిధిలోని మాకోడికి గ్రామ యానిమేటర్ విజయ్ కుమార్ చేసిన ఖతర్నాక్ పనులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సోమవారం మాకోడికి తండాకు చెందిన 10 మహిళా సంఘాల సభ్యులు స్థానిక వెలుగు కార్యాలయం ముట్టడించడంతో బాగోతం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. మాకోడికి తండాలో 10 మహిళా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. సంఘాల లీడర్లకుగాని, సభ్యులకు గాని విషయం తెలపకుండా రుణాలను యానిమేటర్ విజయ్కుమార్ తీసుకున్నాడు. దివ్యా మహిళా సంఘానికి రూ. 4 లక్షలు మంజూరు కాగా, కేవలం రూ. 1.5 లక్షలు ఇచ్చి ఇంతే అని చెప్పా డు. రూ. 1.5 లక్షలు చెల్లించినా పొదుపు ఖాతా నుంచి ప్రతి నెలా కంతు జమవుతూ ఖాతా ఖాళీ కావడంతో అప్రమత్తమైన సభ్యులు బ్యాంక్లో వివరాలు అడి గారు. ఇంకా రూ.3లక్షల అప్పు ఉందని చెప్పడంతో కంగుతిన్నారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ చేసిన మరిన్ని ఖతర్నాక్ పనులు వెలుగులోకి వచ్చాయి. ● లక్ష్మీ మహిళా సంఘానికి సంబంధించి సభ్యుల అనుమతి లేకుండా రూ. 5 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిసింది. సరస్వతి సంఘంలో సభ్యులకు తెలియకుండా అదనంగా రూ.లక్ష పొందాడు. మరో 7 సంఘాలకు సంబంధించి రూ. లక్ష, రూ. 2 లక్షల చొప్పున కాజేశాడు. ఈ సొమ్మును బ్యాంక్ వారు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడంతో లబ్ధిదారులు సోమవారం లబో దిబోమంటూ శెట్టూరులోని వెలుగు కార్యాలయం వద్దకు చేరుకుని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, 100 మందికిపైగా మహిళలు వచ్చి ఫిర్యాదు చేస్తే బాధ్యతగా తీసుకోవాల్సిన ఏపీఎం హుసేన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని సభ్యులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే యానిమేటర్ విజయ్కుమార్ మాట్లాడుతూ ‘అంతా మావారే సర్దుకుంటాము’ అంటూ చెప్పడం కొసమెరుపు. -
ఓట్ల గల్లంతుకు కుట్ర
రాప్తాడు రూరల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ఓట్ల గల్లంతుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని, దీనివల్ల వేలాది మంది ఓటర్ల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా మ్యాపింగ్ సగటు 80 శాతం దాటితే, పాపంపేటలో మాత్రం కేవలం 30 శాతం మాత్రమే నమోదవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాపంపేట నలుగురు బీఎల్ఓలు ఇప్పటివరకు విధులకు హాజరుకాలేదని, వారిస్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆరోపించారు. అందుబాటులో ఉన్న కొందరు బీఎల్ఓలకు కూడా పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్ల ప్రక్రియ మరింత నెమ్మదిగా సాగుతోందన్నారు. ఓటర్లు అప్రమత్తం కావాలి ముఖ్యంగా పాపంపేటలోని 76, 77, 80, 82 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓట్లు కలిగి ఉన్నవారు, అక్కడ నివాసాలు లేదా ఆస్తులు ఉన్నవారు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ‘మీ ఓటు మీ భవిష్యత్తు. మీ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కలిగే నష్టాన్ని అంచనా వేయలేరు. ప్రతి ఒక్కరూ బీఎల్ఓలను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ దృష్టికి సమస్య వివిధ ప్రాంతాల్లో బీఎల్ఓలు అందుబాటులో లేకపోవడం, ఓటరు జాబితా మ్యాపింగ్ ఆశించినస్థాయిలో జరగకపోవడంపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాపంపేటలోని 76, 77, 80, 82 బూత్లతో పాటు ఆలమూరు 68, ఆకుతోటపల్లి 109, రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి 130, ఆత్మకూరు మండలం బి.యాలేరు 31 పోలింగ్ స్టేషన్లలో మ్యాపింగ్ నెమ్మదిగా సాగుతోందని వివరించారు. మొత్తం 17 పోలింగ్ స్టేషన్లలో 30 శాతం కన్నా తక్కువ స్థాయిలోనే మ్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయమై రాప్తాడు ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ ఆనంద్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. పాపంపేటలో 33 శాతం మాత్రమే మ్యాపింగ్ ఓటును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
గేటు పడి విద్యార్థికి గాయాలు
ఉరవకొండ: పాఠశాల గేటుపడి విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వెలిగొండకు చెందిన చెన్నకేశువులు కుమారుడు చండ్రాయుడు స్థానిక ప్రభుత్వ పాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం విరామ సమయంలో చండ్రాయుడు పాఠశాల గేట్పై నిల్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గేట్ ఊడి చండ్రాయుడిపై పడింది. సమీపంలో చిల్లర కొట్టు యజమాని గమనించి ఉపాధ్యాయులకు సమాచారం చేరవేశాడు. ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థిని ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఫీల్డ్ అసిస్టెంట్పై దాడి ఉరవకొండ: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్పై గ్రామస్తులు దాడి చేశారు. లత్తవరం తండాలో ఉపాధి హామీ పథకం కింద ఇటీవల రూ.5 లక్షల వ్యయంతో ఇంకుడు గుంతల పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో వెండర్తో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడని, కూలి సొమ్ములో తమకూ ఇంకా కొంత రావాల్సి ఉందని కూలీలు రోజూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం తండావాసులు నేరుగా ఉరవకొండలోని ఉపాధి హామీ ఏపీఓ కార్యాలయంలో ఉన్న రవినాయక్ను చితకబాదారు. కార్యాలయం బయటకు వచ్చాక మరోమారు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు దాడిచేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హతమారుస్తామంటూ బెదిరించారు : బీజేపీ నేత విష్ణుఅనంతపురం సిటీ: తనను హతమారుస్తామంటూ ఐదు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని బీజేపీ నేత ఎస్.విష్ణువర్దన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తనకు కాల్ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడారని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ వారు పట్టించుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆరోపణలు సరికాదు మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదని విష్ణు అన్నారు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదిరిపికొండలో కూడేరు సీఐకు ఓటు హక్కు సాక్షి టాస్క్ఫోర్స్: విధులు ఒక చోట.. నివాసం మరొకచోట.. స్వస్థలం ఇంకో చోట.. ఇవన్నీ కాదని ఓ గ్రామంలో సీఐ ఓటు హక్కు కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. కూడేరు సీఐ రాజు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్సార్సీపీ వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన అనంతపురంలో నివాసముంటూ కూడేరులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయనకు ఓటు హక్కు కూడేరు మండలం ఉదిరిపికొండలోని 2–42 చిరునామా కింద ఓటరు ఐడీ (వైడబ్ల్యూబీ3309457)తో 1245 క్రమ సంఖ్యలో ఉంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎవ్వరూ పోటీలో లేకుండా చేయడంతో పాటు గ్రామంలో టీడీపీ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా చేర్చడంలో సీఐ కీలకంగా వ్యహరించబోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటు హక్కు విషయమై బీఎల్ఓ రమణను వివరణ కోరగా.. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వే జరుగుతోందని, సీఐకు మరోచోట కూడా ఓటు ఉంటే ఎక్కడైనా ఒక చోట ఉంచి, మరొకటి తొలగిస్తామని చెప్పారు. కరువుపై రేపు సదస్సు అనంతపురం: కరువు, ఎడారీకరణ నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న నగరశివారు పంగల్ రోడ్డు వద్ద గల ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. ‘కరువు, వాతావరణ మార్పులు, ప్రకృతి వ్యవసాయం రైతుల అనుభవాలు’ అనే అంశంపై జరిగే సదస్సుకు కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. -
లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..!
అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా కూడా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఎటువంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ఈనెల 8వ తేదీన మోకా పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన యువకుడుని ఎవరు చంపారన్న దానిపై తీవ్రంగా చర్చానీయాంశమైంది. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ దిశానిర్దేశంతో స్థానిక డీవైఎస్పీ, సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో బసవన గౌడ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవన గౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగిక వేధింపులు భరించలేకే యువకుడి హత్య
సాక్షి, బళ్లారి: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద ఈనెల 7న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డకు చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. 8న మోకా పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు హత్య కేసు మిస్టరీని ఛేదించారు. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బసవనగౌడ హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురి అరెస్ట్ -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలపై రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. అర్జీలో ఆధార్, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలియజేశారు. టీబీ డ్యాంకు 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఆదివారం 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. టీబీ డ్యాంలో మొత్తం 9,910 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువన ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో తొలిసారిగా ఆదివారం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 6,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి, జలాశయంలో 26.140 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జలాశయంలో 1,588.61 అడుగల వద్ద 9.910 టీఎంసీల నీరు నిల్వతో 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 180 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1603.33 అడుగుల నీటి మట్టంతో 26.410 టీఎంసీల నీరు నిల్వ ఉండి, 6,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 128 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేందని బోర్డు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మడకశిర రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మడకశిర మండలంలోని తడకలపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన గంగరాజు కుమారుడు మహేంద్ర (24), అతని బావ, రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన ఆదినారాయణ (28)తో పాటు మరో యువకుడితో కలిసి ఆదివారం కారు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలో తడకలపల్లి వద్ద 544–ఈ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్ర, ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలైన మరో యువకుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆదినారాయణకు భార్య మమత, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నట్లు తెలిసింది. మడకశిర మండల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో గంజాయి సరఫరాదారులు గుత్తి: గుత్తి పోలీసులు ఆదివారం రాత్రి ఇద్దరు గంజాయి సరఫరాదారులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పట్టణంలోని ఓ షాపులో గంజాయి, నకిలీ నోట్లు దొరికాయి. షాపు నిర్వాహకుడిని విచారించగా.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ వాటిని ఇక్కడ ఉంచినట్లు చెప్పాడు. దీంతో గోపాల్తో పాటు దిమ్మగుడికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ లోతుగా విచారణ చేస్తున్నారు. -
కవ్వించిన టీడీపీ నేతలపై చర్యలకు డిమాండ్
కళ్యాణదుర్గం రూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా వంచించినందుకు నిరసనగా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నాయకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ హరినాథ్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాకుండా.. తిరిగి వైఎస్సార్సీపీ నేతలే దాడికి యత్నించినట్టుగా సమన్వయకర్త తలారి రంగయ్యతో పాటు పలువురిపై కేసు నమోదు చేయించడం అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అనుమతి తీసుకుని ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టి.. అలజడి సృష్టించాలని ప్రయత్నించిన 15 మంది టీడీపీ నాయకులపై విచారణ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత దొడగట్ట నారాయణ, కన్వీనర్లు సుధీర్, గోళ్ళ సూరి, యువజన విభాగం నాయకుడు రామాంజినేయులు, మున్సిపల్ విభాగం నాయకులు దొడగట్ట మురళి, చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
కష్టకాలంలో స్నేహ హస్తం
రాప్తాడు రూరల్: కష్టకాలంలో స్నేహితుడికి స్నేహ హస్తం అందించారు. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అయ్యాడు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జయకృష్ణ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సపర్యలు చేసేందుకు భార్య తోడు తప్పనిసరి అయింది. కూలి పనులు మానేసి ఆమెకూడా ఇంటివద్దే ఉంటోంది. ఇటీవల ఆమె కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. వారికి 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్న కుమారులున్నారు. ఆ కుటుంబ దుస్థితిపై ఇటీవల ‘సాక్షి’లో ‘కష్టాల సుడిగుండం...కన్నీటి ప్రయాణం’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మానవతావాదులు స్పందించారు. ఇప్పటికే గ్రామస్తులు, ఇతరులు సుమారు రూ. 1.20 లక్షల దాకా ఆర్థిక చేయూత అందించారు. ఆదివారం జయకృష్ణ చిన్ననాటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకుంటూ రూ.31 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామానికి చేరుకుని జయకృష్ణను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. కట్టకిందపల్లి బుర్రా జయకృష్ణకు రూ.31 వేలు సాయమందించిన స్నేహితులు -
సర్.. అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అర్బన్/ రాయదుర్గం టౌన్: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. బీఎల్ఓలు జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ మాదిరిగా కాకుండా ప్రత్యేక సమగ్ర సర్వే (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియలో బీఎల్ఓలు ప్రతి ఓటరునూ కలుస్తారు. 2002 ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలిస్తారు. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చి వివరాలను సేకరిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 20.38 లక్షల ఓటర్లు ఉంటే అందులో 4.57 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. దీంతో ఈ ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు.. జిల్లాలో ప్రస్తుతం 2,226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 20,38,523 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 10,06,651 మంది, మహిళా ఓటర్లు 10,31,611 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 256 మంది ఉన్నారు. బీఎల్ఓల ఇంటింటి సర్వే ప్రకారం కొత్తగా నమోదైన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆ తరువాత అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని సెప్టెంబరు 18వ తేదీలోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. మ్యాపింగ్ కాని ఓటర్లు 4.57 లక్షలు.. జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే 15,80,798 మంది ఓటర్లు మ్యాపింగ్ అయ్యారు. మ్యాపింగ్ కాని ఓటర్లు 4,57,725 మంది ఉన్నారు. అత్యధికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 96,249 మంది రాప్తాడులో 67,534 మంది ఓటర్లు, ఉరవకొండ 60,659 మంది, తాడిపత్రిలో 58,081 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. అదే విధంగా రాయదుర్గంలో 46,009 మంది ఓటర్లు, గుంతకల్లులో 27,494 మంది, శింగనమలలో 50,572 మంది, కళ్యాణదుర్గంలో 51,127 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. మ్యాపింగ్ కాని ఓటర్లు ‘ప్రస్తుతం అందుబాటులో లేరు’ అనే కారణంతో తొలగించే అవకాశం ఉంది. బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. సర్ ప్రక్రియ నిర్వహణపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ)కి సహకరించాలి. తమ బూత్ పరిధిలో మ్యాపింగ్ కాకుండా ఉన్న ఓటర్లను మ్యాపింగ్ చేయించాలి. అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించకుండా చూడాలి. అదే విధంగా వయసు 18 ఏళ్లు నిండిన వారి ఓటు నమోదు చేయించాలి. నేటి నుంచి ‘సర్’ జూలై 14 వరకు ఇంటింటికీ బీఎల్ఓలు జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లు 4.57 లక్షల మంది రాయదుర్గం పట్టణానికి చెందిన నూరుల్లా అనే వ్యక్తి గుంటూరులో వివాహం చేసుకున్నాడు. తన భార్యకు ఇక్కడ ఓటు హక్కు ఉంది. కానీ 2002లో నివాసం ఉన్న గుంటూరులో తల్లిదండ్రుల చిరునామాను (ఓటు సీరియల్ నంబర్ లేదా డోర్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్) ప్రస్తుతం జాబితాకు సరిపోలిస్తే సరిపోతుంది. ఒక వేళ వారు బీఎల్ఓ ఇచ్చిన ఫారంలో ధ్రువీకరణ ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. సర్ అంటే కేవలం మ్యాపింగ్ ప్రక్రియ మాత్రమే కాదు. కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు, చిరునామాల మార్పుపై కూడా జరుగుతుంది. అవగాహన, అప్రమత్తతోనే ఓటు హక్కును పరిరక్షించుకోగలం. -
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా ఆఫ్లైన్ విధానంలో టెట్ నిర్వహించాలని యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దేవేంద్రమ్మ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1)లో మార్పులు తీసుకొచ్చేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రస్తుతం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ‘కిట్–5’ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేయడం, తదుపరి దశలో మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకుని, ఇప్పటికే విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్తో పాటు ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సహాధ్యక్షుడు రామప్ప చౌదరి , రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, కార్యదర్శులు అర్జున్, ప్రమీల, రవికుమార్, శేఖర్, సుబ్బరాయుడు, చంద్రమోహన్, రామాంజనేయులు, ఓబులేసు పాల్గొన్నారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముగ్గ్గురు మహిళలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అలివేలమ్మ అనే మహిళ గన్నెవారిపల్లి కాలనీలో గత కొద్ది నెలలుగా అద్దెకు ఇళ్లు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆదివారం స్థానికులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అలివేలమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బురదలోనే పశువుల సంత అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారింది. అసలే ఆదివారం పశువుల సంత కావడంతో పరిస్థితి ఘోరంగా తయారైంది. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో యార్డు ప్రాంగణం రొచ్చు రొచ్చుగా మారింది. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలు చిన్నపాటి చెరువులను తలపించాయి. వర్షపునీరు, డ్రైనేజీ సజావుగా వెళ్లడానికి సరైన సదుపాయం లేకపోవడంతో సంతకు వచ్చిన పశువులు, ఎద్దులు, గేదెలతో పాటు రైతులు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షపునీరుకు పేడ, మూత్రం తోడు కావడంతో ఆ ప్రాంతమంతా కంపు కొట్టింది. ముందు రోజు శనివారం కూడా జీవాల సంతలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంతలో సమస్య లేకుండా చూడాల్సిన మార్కెట్యార్డు పాలకులు, అధికారులు, సిబ్బంది మాత్రం మార్కెట్ రుసుం వసూలు చేసుకుని నింపాదిగా వెళ్లిపోయారు. -
కంది సాగు.. భలే భలే
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కంది సాగు ఊహకందని విధంగా అనూహ్యంగా పెరిగిపోయింది. అంచనాలకు మించి పంట సాగు చేస్తున్నారు. పెరిగిన పంట పెట్టుబడులతో వేరుశనగను బాగా తగ్గించేసి, ఎక్కువ మంది రైతులు కంది సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. 2019–2024 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామం యూనిట్గా కంది పంటకు ఉచితంగా పంటల బీమా అమలు చేసి.. పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వడంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. బీమా చరిత్రలో ఎపుడూ లేని విధంగా ఎకరాకు రూ.10 వేలకు పైగా పరిహారం జమ చేశారు. గత ఏడాది తొలిసారిగా.. గత ఖరీఫ్ (2025)లో కంది సాధారణ సాగు 55 వేల హెక్టార్లుగా అంచనా వేయగా.. సీజన్ ముగిసేసరికి అంచనాకు మించి ఏకంగా 1.37 లక్షల హెక్టార్లకు ఎకబాకింది. 30 యేళ్ల జిల్లా వ్యవసాయ చరిత్రలో తొలిసారిగా వేరుశనగ పంటను వెనక్కినెట్టి కంది పంట అగ్రస్థానంలో నిలిచింది. ఈ సారి కూడా చాలా మంది రైతులు కంది సాగుపై దృష్టి సారించడంతో బహిరంగ మార్కెట్లో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం అందించే పాతకాలపు ఎల్ఆర్జీ రకాలు కాకుండా హైబ్రిడ్ విత్తన రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత, చీడపీడలు, మార్కెటింగ్ సమస్యతో వేరుశనగ తగ్గించేసి కందిపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కందికి పంట రుణం కింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.30 వేలు ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గతేడాది క్వింటా రూ.8 వేలు ఉండగా ఈ ఏడాది రూ.8,450కు పెంచారు. కేరాఫ్గా వజ్రకరూరు.. కంది పంటకు కేరాఫ్గా వజ్రకరూరు మండలం నిలిచింది. పోయిన ఖరీఫ్లో మండల వ్యాప్తంగా మొత్తం వర్షాధారిత సాగు భూమి 25 వేల హెక్టార్లు ఉండగా, అందులో 22 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో రైతులు కంది సాగు చేయడం విశేషం. మండలంలో 7,900 హెక్టార్లలో రావచ్చని ముందస్తు అంచనాలను తారుమారు చేసి గ్రామగ్రామానా కంది సాగు చేశారు. గుంతకల్లు మండలంలో కూడా 14 వేల హెక్టార్లు, కళ్యాణదుర్గం మండలంలో 13,500 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో కంది సాగులోకి వచ్చింది. బెళుగుప్ప 7,900 హెక్టార్లు, ఉరవకొండలో 7,700, విడపనకల్లో 7 వేలు, రాయదుర్గంలో 5,800, అనంతపురం రూరల్లో 5,400, గుత్తిలో 4,900, కూడేరులో 4,900, కణేకల్లులో 4,800 హెక్టార్లు, ఆత్మకూరులో 4,200 హెక్టార్లు... ఇలా చాలా మండలాల్లో కంది సాగు బాగా పెరిగింది. చాలా తక్కువగా అంటే అనంతపురం అర్బన్ పరిధిలో 25 హెక్టార్లు, యల్లనూరులో 230 హెక్టార్లు, పెద్దపప్పూరులో 376 హెక్టార్లు, నార్పలలో 615 హెక్టార్లు, పుట్లూరులో 724 హెక్టార్లలో వేశారు. మిగతా మండలాల్లో కూడా 1,200 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు కంది పంట సాగు చేశారు. ఈ ఖరీఫ్లో 78,274 హెక్టార్లు అంచనా.. ఖరీఫ్లో కంది పంట 78,274 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఐదేళ్ల పంట సాగు లెక్కల ఆధారంగా ప్రణాళిక, వ్యవసాయశాఖ ఈ మేరకు సాధారణ సాగు కింద గుర్తించారు. ఈ సారి కూడా వజ్రకరూరులో 12 వేల హెక్టార్లు, గుంతకల్లులో 8 వేల హెక్టార్లు, కళ్యాణదుర్గంలో 6,300 హెక్టార్లు, బెళుగుప్పలో 5 వేల హెక్టార్లు...ఇలా అన్ని మండలాల్లో కూడా కంది సాగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. విత్తన వేరుశనగ, ఇతరత్రా విత్తనాలు, ప్రభుత్వం నుంచి సుఖీభవ, ఇతరత్రా సాయం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సారి కూడా కంది విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జూన్, జూలైలో కురిసే వర్షాలను బట్టి పంటల సరళి తెలుస్తుందని చెప్తున్నారు. పెరిగిన పెట్టుబడులతో వేరుశనగ తగ్గించి కందిపై రైతుల ఆసక్తి గత ఖరీఫ్లో 22 వేల హెక్టార్లలో సాగు ఈ ఏడాది 78,274 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వైఎస్ జగన్ హయాంలో పెద్ద మొత్తంలో బీమా -
రాప్తాడులో కుండపోత
అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులుగా చాలా మండలాల్లో మోస్తరుగా కురిశాయి. ఆదివారం తెల్లవారుజామున 28 మండలాల పరిధిలో 26.7 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడు మండలంలో ఏకంగా 102.2 మి.మీ కుండపోత వర్షం కురిసింది. యాడికి 63.4 మి.మీ, అనంతపురం రూరల్ 62.4, అనంతపురం అర్బన్ 60.2, పామిడి 55.4, తాడిపత్రి 52.4, కూడేరు 52 మి.మీ భారీ వర్షం కురిసింది. గార్లదిన్నె 44.8 మి.మీ, గుంతకల్లు 42.4, విడపనకల్లు 40.2, బుక్కరాయసముద్రం 40.2, పెద్దవడుగూరు 39, ఉరవకొండ 35.2, వజ్రకరూరు 29.2, గుత్తి 26.8, నార్పల 19.6 మి.మీ తోపాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కాగా జూన్ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా ఇప్పటికే 69.1 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చెక్డ్యాంలు, చిన్నపాటి వంకలు ప్రవహిస్తున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో వర్షాలు తక్కువగా నమోదు కాగా మిగతా మండలాల్లో పదను వర్షం కురవడంతో ఖరీఫ్ సాగు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 28 మండలాల్లో 26.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు -
నేటి నుంచి ‘ముంగారు’కు అనుకూలం
అనంతపురం అగ్రికల్చర్: ముంగారు పంటల సాగుకు వేళయింది. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు సోమవారం నుంచి అనుకూలమని అధికారులు, శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలు కొంచెం ఆలస్యమైనా జూలై ఆఖరు వరకు ఖరీఫ్ ఏరువాకకు మంచి అదనుగా తెలిపారు. ఇప్పుడు నడుస్తున్న మృగశిరతో పాటు ఈ నెల 22న ఆరుద్ర, ఆ తర్వాత వచ్చే పునర్వసు, పుష్యమి కార్తెల్లో పంటల సాగుకు అనుకూలమని చెబుతున్నారు. మూడు రోజులుగా చాలా మండలాల్లో మోస్తరుగా వర్షాలు పడడటంతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ ఖరీఫ్లో 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. విత్తుకు వేళయినా... అందని విత్తనం ఈసారి జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా రాయితీ విత్తనం కేటాయించింది. 56 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ, మరో 2 వేల క్వింటాళ్లు కందులు, పెసలు, మినుములు, కొర్రలు, రాగులు కేటాయించింది. అయితే వేరుశనగ పంపిణీ ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలు పెట్టడంతో ఇప్పటికీ రైతులకు విత్తనం అందని పరిస్థితి నెలకొంది. సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా వేరుశనగ విత్తనం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే కందుల పరిస్థితి అలాగే ఉంది. జూలై నెలాఖరు వరకు పంటలు విత్తుకునేందుకు అదను ఈ ఖరీఫ్లో 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా -
ఇసుకను తన్నుకుపోతున్న ‘పచ్చ’ గద్దలు
శింగనమల: సంపాదన కోసం అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు శింగనమల మండలం ఉల్లికల్లు వద్ద పెన్నానదీ పరివాహక ప్రాంతంలోని వంకలో పది రోజులుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని ఓ ప్రదేశంలోకి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి తాడిపత్రి, అనంతపురం ప్రాంతాలకు చెందిన టిప్పర్ల వారికి టిప్పర్ ఇసుక రూ.5వేల చొప్పున విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన టిప్పర్ నిర్వాహకులు రూ.12 వేల దాకా అమ్ముకుంటున్నారు. రోజుకు 20 నుంచి 30 టిప్పర్ల వరకు ఇసుకను బయటకు పంపుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎవ్వరూ క్షేత్రస్థాయిలో విచారణ చేయడానికి ముందుకు రాలేదు. టీడీపీ నేతలతో అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని.. వారి అక్రమాలకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఉల్లికల్లు వద్ద అక్రమ తవ్వకాలు గ్రామస్తుల ఫిర్యాదులు బుట్టదాఖలు పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు -
రైతుల జీవితాలతో ఆటలు!
రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఇప్పటికీ విత్తన వేరుశనగ కాయల పంపిణీ చేపట్టలేదు. జిల్లాలో 436 ఆర్ఎస్కేలు ఉండగా ఇప్పటి వరకూ కేవలం 135 ఆర్ఎస్కేలకు 8,683 క్వింటాళ్ల విత్తనకాయలే సరఫరా చేయడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇష్టారాజ్యంగా విత్తనకాయలు సేకరించి రైతులకు కట్టబెట్టేందుకు ఏజెన్సీలు పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్టపర్తి అర్బన్: ప్రస్తుతం వేరుశనగలో కే6తో పాటు కదిరి లేపాక్షి, నారాయణి, కే7, కే9 గోల్డ్, డబుల్ కే6, తిరుపతి రకాలు, గుజరాత్ తదితర రకాలు అందుబాటులో ఉన్నా విత్తన నాణ్యత, ఆయిల్ అధికంగా ఉండడం, తిరిగి విత్తుకునేందుకు వీలుండడం, గిట్టుబాటు ధర తదితర కారణాలతో రైతులు కే6పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ ఖరీఫ్లో పొలాల్లో విత్తుకునేందుకు సింహ భాగం రైతులు కే6 కోసమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 17,500 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇష్టారాజ్యంగా సేకరణ.. గత ఏడాది రైతులకు సబ్సిడీపై సరఫరా చేసిన విత్తన కాయలకు సంబంధించిన బిల్లులను చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో రబీ సీజన్లో పండించిన వేరుశనగ కాయలను ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేయలేదు. అయితే, ఖరీఫ్ ముంచుకు రావడం, రైతులకు పంపిణీ చేసేందుకు ఏపీ సీడ్స్ వద్ద సరిపడా విత్తన కాయలు లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ సేకరిస్తున్నారు. జిల్లాలో ధర్మవరం, కదిరిలో మాత్రమే ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి తదితర చోట్ల ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు.ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా సరిపడా కే6 రకం విత్తనాలు లేకపోవడంతో తక్కువ ధరకు లభించే ఇతర కాయలను కే6 బస్తాల్లో కలుపుతున్నట్లు తెలిసింది. ధరలు పెంచినా.. జిల్లాలో రైతులకు ఏటా కే6తో పాటు టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి 1812 రకాలను సరఫరా చేస్తున్నారు. అయితే, గత ఏడాదితో పోల్చితే ఈ సారి 30 కేజీల వేరుశనగ విత్తన కాయల బస్తా ధర దాదాపు రూ.120 మేర పెంచారు. అయినా, నాణ్యత గల విత్తన కాయలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. విత్తనకాయలు కల్తీ జరిగితే పంట పూర్తిగా ఎత్తిపోయినట్లేనని నిట్టూరుస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిశ్చింత.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా మే నెలలోనే విత్తన కాయల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి జూన్ ఒకటో తేదీ నుంచే రైతులకు పంపిణీ చేసేవారు. దీనికి తోడు సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారంతో ఆదుకోవడంతో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేది. నిశ్చింతగా పంట సాగు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులకు ఎటూ పాలుపోవడంలేదు. విత్తన ఏజెన్సీ నిర్వాహకుల ఇష్టారాజ్యం విత్తన కాయలను ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తున్న వైనం కే6 బస్తాలో ఇతర కాయలు కలిపి సరఫరా చోద్యం చూస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్న అన్నదాతలు కల్తీ చేస్తే చర్యలు కే6 రకం కాయల్లో ఇతర రకాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం ఆయా ప్రాసెసింగ్ యూనిట్లకు వెళ్లి పరిశీలిస్తా. ఇతర రకాలు పంపిణీ చేస్తే రైతులు వెనక్కు ఇవ్వాలి. కొనుగోలు చేసే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. – నారాయణనాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అర్హత సాధించి, ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను తిరిగి టెట్ రాయాలని ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే నియమించి, న్యాయమైన వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రత, వేతన స్కేలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ గత బదిలీలలో బదిలీ పొంది రిలీవ్ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని అధికారులను కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, ప్రసాద్, రాజశేఖర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మల్లికార్జున, సురేష్, ఫణిభూషణ్, కృష్ణమోహన్, మల్లికార్జున గౌడ్, రవికుమార్, నాగభూషణ్, సీనియర్ నాయకులు అజయ్ కుమార్, శివయ్యచారి తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలని కోరారు. -
రెడ్క్రాస్ చరిత్రలో రికార్డు
నార్పల: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చరిత్రలో నార్పల మండలం సరికొత్త రికార్డు సృష్టించింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డికి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది డిసెంబర్ 21న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నార్పలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధిక రక్తం సేకరించిన కేంద్రంగా రాష్ట్రంలోనే నార్పల ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. శైలజానాథ్, సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు రికార్డుస్థాయిలో 752 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏలూరులో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రస్థాయి అవార్డును మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు అందజేశారు. అలాగే అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాతలు, యువత, పార్టీ శ్రేణులు, వైద్య సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా 756 యూనిట్ల రక్తదానం వైఎస్సార్సీపీ నేతలకు అవార్డులు -
అన్నదమ్ముల సాహస ప్రదర్శన
తాడిపత్రిటౌన్: గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారులు సాహస ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తైక్వాండోలో శిక్షణ పొందుతున్న సాయి నరసింహారెడ్డి, గౌతమ్కుమార్రెడ్డి అన్నదమ్ములు. ఆదివారం ఈ పిల్లల స్టంట్ ఈవెంట్ జరిగింది. కృష్ణాపురం జీరో రోడ్డులో జరిగిన ప్రదర్శనకు సీఐ శివగంగాధర్రెడ్డి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కో ఆర్డినేటర్ ఆనంద్ హాజరయ్యారు. గౌతమ్కుమార్రెడ్డి (విక్కీ) తన కడుపుపై నుంచి 4.6 నిమిషాల్లో వంద బైకులు వెళ్లే స్టంట్ చేయగా.. సాయి నరసింహారెడ్డి (లక్కీ) చేతివేళ్లపై 16 నిమిషాల్లో వంద కార్లు పోనిచ్చి భళా అనిపించారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తెరచుకున్న అక్రమాల ‘కాటా’
కళ్యాణదుర్గం రూరల్: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ రైతులను మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తి .. నెల తిరక్కుండానే మళ్లీ దుకాణం తెరిచేశాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వ్యాపారి రామ్మూర్తి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అక్కమ్మగార్ల దేవాలయం ఎదుట మొక్కజొన్న వ్యాపారంతో పాటు వేబ్రిడ్జి (కాటా)ను నిర్వహిస్తున్నాడు. 20 రోజుల క్రితం సమీప గూబనపల్లికి చెందిన రైతుల చీనీ పంటను కాటాకు తరలించగా తూకాల్లో తేడారావడంతో వేబ్రిడ్జి నిర్వాహకుడిని నిలదీసి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిర్వాహకుడిపై నామమాత్రపు కేసు నమోదు చేసి నిమిషాల వ్యవధిలో స్టేషన్ నుంచి బయటకు పంపారు. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీగా ముడుపులు ముట్టాయన్న విమర్శలున్నాయి. వ్యాపారిపై అనేక ఆరోపణలు... ● మూడు నెలల క్రితం చాపిరి గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటను అమ్మేందుకు కాటాకు వచ్చాడు. అయితే తూకాల్లో తేడా రావడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది నిముషాల్లో నామమాత్రం కేసుతో రామ్మూర్తి బయట పడ్డాడు. ● రెండు నెలల క్రితం మల్లికార్జునపల్లికి చెందిన రైతు వేరుశనగ పంటను అమ్మడం కోసం వ్యాపారి వద్దకు వచ్చాడు. తూకాల్లో తేడా రావడంతో ఆగ్రహించిన రైతు వ్యాపారిని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ● మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్టకు చెందిన రైతు మొక్కజొన్న పంట అమ్మకం విషయంలో తూకాల్లో మోసం జరగడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులే దగ్గరుండి పంచాయితీ చేశారన్న ఆరోపణలున్నాయి. చక్రం తిప్పిన వ్యాపారి రామ్మూర్తి పోలీసులకు మామూళ్లిచ్చి వ్యాపారం ?! సామాన్య ప్రజలకు ఏదైనా సమస్య వస్తే గంటైనా ఘటనా స్థలానికి రాని పోలీసులు.. మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తికి చిన్నపాటి సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కరిస్తారన్న విమర్శలున్నాయి. ఎంతోమంది రామ్మూర్తిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వివాదం జరిగి నెలగడవకనే రామ్మూర్తి మళ్లీ కాటాను తెరవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తూకాల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఏ ఒక్కరూ నష్టపోకుండా వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాటా తెరవడంపై పట్టణ సీఐ హరినాథ్ని ‘సాక్షి’ వివరణకోరగా ఆయన స్పందించలేదు. పోలీసుల అండ -
కరువు రైతు కన్నీటి వ్యథ
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకుపోవడం కోసం హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు శాపంగా మారింది. సిమెంటుతో లైనింగ్ వేస్తే పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయని, బోర్లలో నీళ్లు తగ్గిపోతాయని ఆనాడే రైతులు భయాందోళన చెందారు. రైతులతో పాటు రైతుసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనబాట పట్టారు. అయినా ప్రభుత్వం మొండిగా సిమెంట్ లైనింగ్ చేపట్టింది. ఫలితంగా కాలువ పరిసర ప్రాంతాల వ్యవసాయ బోర్లలో నీరు తగ్గిపోయింది. నీరందక పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ● హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ ● అడుగంటిన భూగర్భజలాలు.. బోర్లల్లో తగ్గిన నీరు ● నీరందక ఎండుముఖం పట్టిన ఉద్యాన పంటలు కూడేరు: హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. కళ్లెదుటే నీరు పారుతున్నా బోర్లల్లో నీరు లేని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే కుప్పంకు కృష్ణాజలాలు తీసుకెళ్లింది. ఇందుకోసం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా నీరు తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులు చేపట్టారు. హంద్రీనీవా 216వ కిలోమీటరు (జీడిపల్లి వద్ద) నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి సమీపంలోని పట్నం (400వ కి.మీ) వరకు లైనింగ్ పనులు చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ –నీవా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ చేయడం వల్ల కాలువలో నీరు వేగంగా ముందుకెళ్లిపోయింది. మట్టికాలువ అయితే నీరు సమీపంలోకి ఇంకి సహజసిద్ధంగా భూగర్భజలాలు పెరిగి బోర్లు రీచార్జ్ అయ్యేవి. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో బోర్లలో నీరు తగ్గిపోయి రైతుల కళ్లెదుటే చీనీ, దానిమ్మ, మామిడి, అరటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయి. -
ఒకటో తరగతికే రూ.లక్ష ఫీజు
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. ఫీజు నియంత్ర చట్టాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు. ట్యూషన్, బస్, పుస్తకాలు, యూనిఫామ్, స్నాక్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక బ్రాంచ్కు అనుమతి తీసుకుని నాలుగైదు బ్రాంచులు నడుపుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఒకటో తరగతికి రూ.లక్ష ఫీజు వసూలు చేస్తున్నారు. – కుళ్లాయిస్వామి, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏఐఎస్ఎఫ్ -
ఖాకీల ‘పచ్చ’పాతం
కళ్యాణదుర్గం: పోలీసుల ఏకపక్ష తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్సీపీ గొంతు నొక్కడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు అక్రమ కేసుల బనాయింపునకు పూనుకున్నారు. పోలీసులు చూపుతున్న ‘పచ్చ’పాతంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచనకు గురిచేసిన తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో కళ్యాణదుర్గంలో ఈ నెల 12న నిరసన ర్యాలీ నిర్వహించారు. అనుమతి తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు అప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ అడ్డు తగిలారు. ఇదే క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగైనా వైఎస్సార్సీపీ ర్యాలీని భగ్నం చేయడానికి కుట్ర పన్నారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు బైకులపై శబ్దాలు చేస్తూ టీ సర్కిల్లో బాణసంచా పేల్చుతూ రెచ్చ గొట్టేలా ప్రవర్తించారు. ఇదంతా పోలీసులు చూస్తున్నా అడ్డుకోకపోగా.. వైఎస్సార్సీపీ శ్రేణులను అక్కడి నుంచి తరిమివేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు. నిరసన ర్యాలీలో అవతలి పార్టీ వారిని రెచ్చగొడుతున్నారని, ప్రజలకు, వాహనదారులకు ఆటంకం కలిగించారంటూ పట్టణ పోలీసు స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ కేఎస్ లింగరాజుతో ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, మున్సిపల్ కన్వీనర్ ఐ.సుధీర్, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ గోళ్ల సూరి, బ్రహ్మసముద్రం, కుందుర్పి, శెట్టూరు కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, కురబ హనుమంత రాయుడు, ఎంఎస్ రాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు, కంబదూరు ఎంపీపీ తనయుడు భీమేష్, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులుతో పాటు మరికొంత మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఘర్షణ వాతావరణం నెలకొనేలా రెచ్చగొట్టిన టీడీపీ నాయకులపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనకాడుతున్నారు. గతంలో కూడా తిరుమల లడ్డూపై దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించినందుకు, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. పథకం ప్రకారం రెచ్చగొట్టిన టీడీపీ నేతలు ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు -
ప్రాణం తీసిన మద్యం భూతం
యాడికి: మద్యం భూతం ఓ ప్రాణం తీసింది. మండల కేంద్రంలోని పెద్దపేటలో శుక్రవారం రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త మృతి చెందాడు.సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. పెద్దపేటకు చెందిన నేత కార్మికుడు ప్రసాద్, హైమావతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల ప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. మగ్గం పనులు చేయకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో హైమావతి తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. మద్యం తాగేందుకు తెలిసిన వారి వద్ద అప్పులు చేయటమే కాకుండా ద్విచక్ర వాహనాన్ని సైతం ప్రసాద్ తాకట్టు పెట్టడంతో వారం క్రితం హైమావతి తన పుట్టింట్లో డబ్బు తీసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని విడిపించి ఇచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన ప్రసాద్ ఇంకా మద్యం తాగేందుకు ఇంట్లోని సిలిండర్ను వేరే వారికి విక్రయించేందుకు పూనుకున్నాడు. దీంతో హైమావతి అతనితో గొడవకు దిగింది. ‘పిల్లల పాఠశాలలు తెరుస్తారు.. వాళ్లకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి. మద్యం కోసం ఇలా ఇంట్లో వస్తువులు అమ్ముకుంటే ఎలా బతకాలి’ అంటూ వాపోయింది. అయినా, ప్రసాద్ వినకపోవడంతో ఆగ్రహానికి గురై భర్తను తోసేసింది. అనంతరం బాధతో ముగ్గురు కుమార్తెలు, కుమారుడిని వెంట బెట్టుకొని తన పుట్టింటికి వెళ్లి పోయినది. శనివారం ఉదయం ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న ప్రసాద్ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైమావతి తోయడంతోనే గాయాలై ప్రసాద్ మృతి చెందాడని అతని బంధువు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హైమావతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, తండ్రి మృతి చెందటం, తల్లిని పోలీసులు అరెస్టు చేయటంతో వారి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అనాథలుగా మారారు. ఇక తమకు దిక్కెవరంటూ విలపిస్తున్న వారిని చూసి గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. నిత్యం తాగొస్తున్నాడని భర్తతో భార్య గొడవ ఆవేశంలో భార్య తోయడంతో కిందపడి భర్త మృతి తండ్రి మృతి, తల్లి జైలు పాలవడంతో అనాథలైన ముగ్గురు పిల్లలు -
మాయమాటలతో వంచిస్తున్నారు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. విద్యా వ్యాపారాన్ని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాయమాటలతో విద్యార్థులు, తల్లిదండ్రులను వంచిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలల పేరుతో, భవనాలు నిర్మాణంలో ఉండగానే అడ్మిషన్లు చేస్తున్నారు. పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు. – ఓతూరు పరమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
సందర్భం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
అది 1999 సంవత్సరం. నార్పల మండలానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కాక ఇబ్బంది పడుతుంటే కుటుంబసభ్యులు ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పేదరికం కారణంగా సరైన పౌష్టికాహారం లేక రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే రక్తం ఇవ్వాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మానవత రక్తదాతల సంఘం కో–కన్వీనర్ సలీం మాలిక్ వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రి ఆమెకు రక్తాన్ని దానంగా ఇచ్చారు. అయినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో గంట వ్యవధిలో మరోసారి ఆయన తన రక్తాన్ని దానంగా ఇవ్వడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. తెల్లవారిన తర్వాత రక్తదాతలు అందుబాటులోకి రావడంతో మరో ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేశారు. దీంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. రక్తదానంతో ప్రాణం పోసిన దాతలను ఇప్పటికీ ఆ పేద కుటుంబం తలచుకుంటూనే ఉంటుంది. ... మానవత్వానికి అద్దం పట్టే ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రక్తదాతలు సహకరించడం గమనార్హం. అనంతపురం సిటీ: మానవత్వం అనేది కేవలం ఒక చుక్కలా కనిపించవచ్చు. కానీ ఆ చిన్న చుక్కల కలయికే విశాలమైన సముద్రమై.. ఆపదలో ఓ ఉన్న నిండు ప్రాణాన్ని కాపాడు తుంది. తోటివారి కష్టాన్ని చూసి చలించిపోయి స్వార్థాన్ని పక్కన పెట్టి సాయం చేసే మానవతావాదులు చేతల్లో చూపించే గొప్పదనమే రక్తదానం. అలాంటి వారి సేవలకు గుర్తుగా ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రయోజనాలు ఎన్నో.. రక్తదానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అనంతపురంలోని సర్వజనాస్పత్రి రక్తనిధి మెడికల్ ఆఫీసర్, అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.లక్ష్మి అంటున్నారు. రక్తదానం వల్ల ఐరన్ నిల్వలు తగ్గి ధమనుల పనితీరు మెరుగు పడుతుందని, దీంతో గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు. అలాగే క్యాన్సర్ కారకాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. తరచూ రక్తదానం చేస్తుండడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశముంటుందన్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న రక్త దానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. సమృద్ధిగా నిల్వలు.. జిల్లా సర్వజనాస్పత్రిలోని రక్తనిధిలో అవసరమైన మేరకు రక్త నిల్వలు ఉన్నాయి. శనివారం నాటికి అన్ని గ్రూపులకు సంబంధించి 320 యూనిట్ల రక్తం నిల్వలు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా ‘ఓ’ పాజిటివ్, ‘బీ’ పాజిటివ్ రక్తం అవసరమవుతుంటుందని రక్తనిధి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. తలసేమియా బాధితులకు అండగా... జీజీహెచ్లోని రక్తనిధికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుత్తితో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి. అలాగే తలసేమియా బాధితులకు అండగా జీజీహెచ్లోని రక్తనిధి నిలుస్తోంది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు పూర్తి ఉచితంగా అవసరమైన రక్తాన్ని అందజేస్తున్నారు. ప్రతి నెలా 60 నుంచి 70 మంది తలసేమియా బాధితులకు రక్తాన్ని అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడుతున్నారు. జీజీహెచ్లో రక్తదానం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శనివారం సర్వజనాస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ హాజరై, ప్రారంభించారు. పాథలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ శివశంకర్నాయక్, రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రావణి, డాక్టర్ దివ్య, మైక్రోబయాలజీ విభాగం ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు. పలువురు మెడికోలు, యువకులు స్వచ్ఛందంగా తరలి వచ్చి రక్తదానం చేశారు. 70 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆదర్శంగా నిలుస్తున్న పలువురు రక్తదాతలు విపత్కర సమయంలో మేమున్నామంటూ ముందుకు రక్తదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహణ -
‘ఆ టీచర్లకు టెట్ మినహాయించాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: 2010కు ముందు చట్టబద్ధంగా నియమితులైన ఉపాధ్యాయుల సేవా హక్కులు, సీనియారిటీ, పదోన్నతులు, ఇతర చట్టబద్ధ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇటీవల వైఎస్సార్టీఏలో చేరిన ఏపీటీఎఫ్–1938 నాయకులు విశ్వనాథరెడ్డి, మునిరెడ్డి, రమణారెడ్డి, రమేష్, రామసుబ్బారెడ్డి, చింతలరెడ్డి, నరేంద్రారెడ్డి, ఓబుళప్ప, ఓబిలేసు, బాలనాయక్, అంజనరెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితరులకు శనివారం సభ్యత్వాలను అందజేశారు. స్థానిక ఉపాధ్యాయ భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010 ఆగస్టు 23న జారీ చేసిన టెట్ నోటిఫికేషన్, 2026 మే 29న గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు. 2010కు ముందు అప్పటి నిబంధనలు, అర్హతలు, ఎంపిక విధానాల ప్రకారం నియమితులైన ఉపాధ్యాయులకు తర్వాత అమల్లోకి వచ్చిన టెట్ అర్హతను వర్తింపజేయడం సహజ న్యాయం, సమానత్వం, న్యాయనిశ్చితి సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. గోవిందరెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు గోపాల్, సిద్ధ ప్రసాద్, రామకృష్ణ, కృష్ణానాయక్, కృష్ణ, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. -
అనంతపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఒకటో తరగతి విద్యార్థికి మెస్ ఫీజు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట రూ.30 వేలుగా ఉన్న ఈ మొత్తం, గత ఏడాది రూ.35 వేలకు పెరిగి, ఇప్పుడు రూ.40 వేల మార్కును చేరుకుంది. విద
అనంతపురం ఎడ్యుకేషన్: విద్య వ్యాపారమయంగా మారింది. ఎంత కష్టమైనా సరే పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాలనుకున్న తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఐదో తరగతి విద్యార్థికే రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు 460, కార్పొరేట్ విద్యాసంస్థలు 45 ఉన్నాయి. ఐఐటీ, నీట్ ఫౌండేషన్, సీబీఎస్ఈ, టెక్నో, ఐకాన్, సీ–బ్యాచ్, ఐపీఎల్, ఎస్.బ్యాచ్, ఒలింపియాడ్, పీఓ, కోస్పార్క్, ఇస్రో, డిజిటల్ క్లాస్రూమ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వంటి ఆకర్షణీయ పేర్లతో తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి. అయితే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని కోర్సులు? కొన్ని విద్యాసంస్థలు ఐసీఎస్ఈ, అంతర్జాతీయ సిలబస్, విదేశీ ప్రమాణాల విద్య అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఆసలు ఆయా కోర్సులకు సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లోని ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారంటూ ప్రచారం చేస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నా, వాటిపై అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అప్పులపాలవుతున్న తల్లిదండ్రులు కరువు పరిస్థితులతో సతమతమవుతున్న జిల్లాలో కూలి పనులు, వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే అధికం. అయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చాలామంది కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న పరిస్థితి నెలకొంది. విద్య ఒక అవసరంగా ఉండాల్సిన సమయంలో, అది కుటుంబాలపై ఆర్థిక భారం అవుతోందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ ఎక్కడ? ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ.. వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు ఫీజుల నిర్మాణం, అదనపు వసూళ్లు, మెస్ చార్జీలు, ప్రత్యేక కోర్సుల పేరుతో జరుగుతున్న దోపిడీపై సమగ్రంగా పరిశీలించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్య హక్కు అయినప్పుడు, అది కొందరి వ్యాపార సాధనంగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించడం, మెస్ ఫీజులు, ఇతర అదనపు వసూళ్లపై పారదర్శకత తీసుకురావడం, అనుమతులు లేని కోర్సులపై చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు ౖపైపెకి పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం -
విద్యను వ్యాపారంగా మార్చారు
కరువు జిల్లా అనంతపురంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థపై సరైన నియంత్రణ లేకపోవడంతో అధిక ఫీజులు, విద్యార్థులు–తల్లిదండ్రులపై ఆర్థిక భారం ఆందోళనకరంగా మారింది. నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును లాభార్జనకు బలి చేయకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. – చంద్రశేఖర్యాదవ్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
‘తమ్ముళ్ల’ బరితెగింపు
● చెరువు మట్టి యథేచ్ఛగా దోపిడీ ● నెల రోజులుగా టిప్పర్లతో రవాణా ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరలేపారు. చెరువు మట్టిపై కన్నేసి తవ్వేస్తున్నారు. టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విడపనకల్లు మండలం డొనేకల్లు గ్రామంలోని చెరువులో సారవంతమైన మట్టి ఉంది. దీన్ని కొందరు టీడీపీ నాయకులు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టిప్పర్ల ద్వారా గడేకల్లు, ఎన్.తిమ్మాపురం, హంచనహాళ్, పొలికి గ్రామాలతో పాటు కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టి లోడులు వెళ్తున్నాయి. నెల రోజులుగా ఇలా చెరువు మట్టిని కొల్లగొడుతున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో అక్రమ తవ్వకాలు ఆపి.. చెరువును పరిరక్షించాలని ఈ నెల ఒకటో తేదీన గుంతకల్లు ఆర్డీఓకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది. ఆయన విచారణకు ఆదేశించారు. అయితే కిందిస్థాయి అధికారులు టీడీపీ నాయకులకు అనుకూలంగా ఒక తీర్మానం సృష్టించి, చెరువు మట్టి అక్రమంగా తవ్వడం లేదని నివేదికలో పొందుపరిచి విచారణను ‘మమ’ అనిపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి చెరువు మట్టి దందాకు చెక్పెట్టాలని డొకనేకల్లు గ్రామస్తులు కోరుతున్నారు. -
బోర్లలో నీరు తగ్గిపోయింది
నాకు హంద్రీ– నీవా కాలువ సమీపాన ఐదు ఎకరాల పొలం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం మూడు ఎకరాల్లో చీనీ చెట్లు పెట్టా. రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. హంద్రీ–నీవా కాలువ గుండా మూడు నుంచి నాలుగు నెలల పాటు నీరు ప్రవహిస్తే భూగర్భ జలాలు బాగా పెరిగేవి. బోరు కేసింగ్ పైపు నుంచి నీరు ఉబికి వచ్చేది. కానీ హంద్రీ–నీవా కాలువకు సిమెంట్తో లైనింగ్ చేపట్టడంతో భూమిలోకి నీరు ఇంకలేదు. రెండు బోర్లలోనూ నీరు తగ్గిపోయింది. చీనీ చెట్లకు నీటి తడులు ఎలా అందించాలో దిక్కుతోచడం లేదు. – కొల్లన్న ,రైతు, పి,నారాయణపురం,కూడేరు మండలం ఇక పంటలు సాగు చేయలేం హంద్రీ– నీవా కాలువకు కొంతదూరంలో నాకు పది ఎకరాల పొలం ఉంది. కాలువ గుండా నీరు ప్రవహిస్తుండడంతో రెండు బోర్లలో నీరు బాగా వచ్చేది. ధైర్యంగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసేవాడిని. కానీ కాలువకు సిమెంట్తో లైనింగ్ చేయడంతో బోర్లలో నీరు బాగా తగ్గిపోయింది. ఐదు ఎకరాల్లో వేరుశనగ, టమాట పంటలను సాగు చేశా. అరకొరగా వచ్చే నీరు పంటలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. భవిష్యత్లో నీటి కొరతతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. – పెద్ద అక్కులన్న, రైతు, ఎంఎంహళ్లి, కూడేరు మండలం -
పామిడిలో భారీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావం మొదలైనట్లు చెబుతున్నా నైరుతి రుతుపవనాల వల్ల జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 16.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పామిడిలో 84.6 మి.మీ భారీ వర్షం కురిసింది. కొబ్బరిచెట్టుపై పడిన పిడుగు ఆత్మకూరు: పి.యాలేరులో శుక్రవారం అర్ధరాత్రి వర్షం పడుతున్న వేళ గురుస్వామి అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు బయటకు రాగా.. కొబ్బరిచెట్టుపై మంటలు చెలరేగడం కనిపించింది. 1న రాష్ట్రపతి ముర్ము రాక అనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై ఒకటో తేదీన బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీని సందర్శించనున్నారు. విజిటర్ హోదాలో ‘జ్ఞాన సీమ’ ప్రాంగణంలో జరగనున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. 2020లో ఉత్తీర్ణులైన తొలి బ్యాచ్ నుంచి 2026 బ్యాచ్ వరకు మొత్తం 1,200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అలాగే 61 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు హాజరు కానున్నారు. అభ్యర్థులు https:// cuap.ac.inలో వివరాలు తెలుసుకోవచ్చు. నెలాఖరుకు ‘ఉపాధి’ సొమ్ము రికవరీ అనంతపురం న్యూటౌన్: ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధులను బాధ్యుల నుంచి ఈ నెలాఖరులోగా రికవరీ చేస్తామని జిల్లా విజిలెన్స్ అధికారి (డీవీఓ) శ్రీనివాసులు వెల్లడించారు. ‘రూ.3.61 కోట్లు హాంఫట్ ’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని 31 మండలాల్లో ‘ఉపాధి’ అవకతవకలు, దానిపై వేసిన జరిమానా (ఫైన్) మొత్తం రూ.61,40,285 ఉందన్నారు. ఇందులో రికవరీ రూపంలో రూ.31,94,120 ఉండగా, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై రూ.29,46,165 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005 స్థానంలో ‘వికసిత్ భారత్–రోజ్గార్ అజీవికా మిషన్(గ్రామీణ) (వీబీ–జీ రామ్ జీ)–2025’ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుందన్నారు. ఆ లోపే ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన 1,233 మందిని వ్యక్తిగతంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న కళ్యాణదుర్గం, 18న తాడిపత్రి, 19, 23 తేదీల్లో రాయదుర్గం, 25న అనంతపురంలో గ్రామసభలు నిర్వహించి, నిధులను రాబడతామని చెప్పారు. -
గొడవ పడొద్దంటే కొట్టి చంపేశారు..!
● తాడిపత్రి యువకుడిపై పలువురి దాడి ● ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచిన బాధితుడుమైదుకూరు: హైవే రోడ్డు నిర్మాణంలో ఏర్పడే తుక్కు కొనుగోలు విషయంలో వ్యాపారుల మధ్య జరిగిన గొడవల్లో తాడిపత్రికి చెందిన ఇస్మాయిల్ వివేకా నంద (35) అనే యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఉలందకొండకు చెందిన రోషన్ తుల్లా అనే బిడ్డర్,కమిషన్ ఏజెంట్ బెంగళూరు–విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్ప్రెస్ హైవే నిర్మాణ కంపెనీ మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద ఉన్న తుక్కును కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో బిడ్ వేశాడు. దానికోసం 1. 50 కోట్లు డిపాజిట్ చెల్లించాడు. నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి సూచనతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూరిబాబు, పోతురాజు అనేవారికి తుక్కును అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. వారి వద్ద నుంచి రూ.1.10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అగ్రిమెంటు రాసుకునేందుకు రూ .10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు ఆ మొత్తం ఇవ్వకుండా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని పిలిపించి తుక్కును అమ్మాలని చూశారు. అయితే హైదరాబాద్కు చెందిన వ్యక్తి రోషన్ తుల్లా తోనే డీల్ చేసుకొని 21 టన్నుల తుక్కును రూ.6. 67 లక్షలకు కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. ఇంకా కొంత తుక్కు ఉందని దానిని అమ్మేందుకు తాడిపత్రి భగత్ సింగ్ కాలనీకి చెందిన వివేకానంద, హైదరాబాద్లోని మల్కాజ్ గిరిలో ఉంటున్న కమలాపురం నివాసి ఇల్లూరు సురేష్ బాబు అనే వారిని పిలిపించాడు. ఇదిలావుండగా తామిచ్చిన రూ 1. 10 లక్షలు అడ్వాన్స్ను తిరిగి ఇవ్వాలని సూరిబాబు, పోతురాజు రోషన్ తుల్లాను అడిగారు. అతను వాయిదాలు వేస్తుండడంతో తమకు తెలిసిన బ్రహ్మంగారిమఠం మండలం టి. రామాపురం గ్రామానికి చెందిన బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని పిలిపించారు. బ్రహ్మనాయుడు అడ్వాన్స్ డబ్బు కోసం రోషన్ తుల్లాను నిలదీయగా రూ. 40 వేలు ఫోన్ పే చేశాడు. మిగిలిన రూ.70 వేలు శుక్రవారం రాత్రి ఇస్తానని చెప్పాడు. వీరంతా శుక్రవారం రాత్రి మైదుకూరులోని ఓ లాడ్జీలో కలిశారు. రూ .70 వేలు ఇవ్వాలని బ్రహ్మనాయుడు, సూరిబాబు, పోతురాజు రోషన్ తుల్లాను బెదిరిస్తూ దాడికి దిగారు. అక్కడే ఉన్న సురేష్ బాబు, ఇస్మాయిల్ వివేకానంద కలగజేసుకోవడంతో వారు వివేకానందను తీవ్రంగా కొట్టారు. అతన్ని సురేష్ బాబు లాడ్జీ నుంచి కారులో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. వివేకానంద సోదరుడు రవి ప్రతాప్ మైదుకూరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ భూములను పరిరక్షించండి
అనంతపురం అర్బన్: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డీఆర్ఓ మలోలకు ప్రజాబలం సంఘం నాయకులు విన్నవించారు. డీఆర్ఓని శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్గఫూర్, ఇతర నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గార్లదిన్నె మండలం పెనకచర్లలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అక్కడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూమి పంపిణీ చేయాలన్నారు. ఆక్రమణదారులపై చట్టరపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మేఘన, వీరతేజ, మహబూబ్బాషా, పవన్, పాల్గొన్నారు. -
చీనీ టన్ను రూ.33 వేలు
అనంతపురం మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.33 వేలు, కనిష్టం రూ.10 వేలు, సరాసరి రూ.20 వేలు పలికాయి. బాధ్యులెవరు.. బాధితులెవరు..?అనంతపురం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అమ్మకానికి పెట్టిన బాగోతం చర్చనీయాంశంగా మారింది.కళ్యాణదుర్గంలో రెచ్చగొట్టిన టీడీపీ కార్యకర్తలుశనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026అనంతపురం రూరల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహా నిరసన శింగనమలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ -
ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
తాడిమర్రి:మండలంలోని చిత్రావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణవేణి శుక్రవారం తెలిపారు. దాడితోట, నాయనపల్లి పరిధిలోని చిత్రావతి నది నుంచి ఇసుక తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులకు అప్పగించగా, ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేలు జరి మానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. 15 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం రొద్దం: పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లను పరిగి ఇన్చార్జ్ ఎస్ఐ రవికుమార్ శుక్రవారం తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. పెద్దమంతూరు, పి.రొప్పాల గ్రామాలకు చెందిన 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఇరువర్గాల ఘర్షణలో 11 మందికి గాయాలు
విడపనకల్లు: మండలంలోని పాల్తూరులో ఇరువర్గాల ఘర్షణలో శుక్రవారం 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. పాల్తూరుకు చెందిన సునీల్, మహేశ్, నాగలక్ష్మి, పెన్నయ్య, రవి, వన్నూరుస్వామి, ముత్తక్క కలిసి చీకలగురికికి చెందిన గంగమ్మ, రాజు, సుంకమ్మ,చంద్ర ఘర్షణపడ్డారు. ఈదాడిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పాల్తూరు పోలీసులు విచారణ చేపట్టారు. 21న ప్రతిభా పురస్కారాలు అనంతపురం: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ నెల 21న లలిత కళాపరిషత్లో ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 580 మార్కులపైగా సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, ఇంగ్లిష్ డిక్షనరీ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17లోపు సెల్: 9502097181లో వివరాలు తెలియజేయాలని కోరారు. మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీగా గీతాబాయి కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) రీజినల్ డైరెక్టర్గా డాక్టర్ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి రానున్నారు. ఇక్కడ పని చేస్తున్న రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో డాక్టర్ గీతాబాయి రానున్నారు. -
యూనిఫాం లేదు.. బ్యాగులూ ఇవ్వలేదు
అనంతపురం ఎడ్యుకేషన్: నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ప్రకటించిన ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల సాదాసీదాగా జరిగింది. స్వాగత తోరణాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల హాజరు వంటివి అనేక పాఠశాలల్లో కనిపించలేదు. ● కొత్త బ్యాగులు, యూనిఫాంలు, బెల్టులు, షూ–సాక్సులు, నోట్బుక్కులు అందుతాయన్న ఆశతో బడులకు వచ్చిన విద్యార్థులకు ఏవీ అందలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఏ ఒక్క పాఠశాలలోనూ పంపిణీ కాలేదు. జిల్లాకు బ్యాగులే చేరకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. కొన్ని మండలాలకు యూనిఫాం క్లాత్ చేరినా విద్యార్థులకు అందించలేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,93,223 మంది విద్యార్థులు ఉన్నారు. తొలిరోజే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, చాలా పాఠశాలల్లో పంపిణీ పూర్తికాలేదు. జిల్లాకు అవసరమైన 10,16,544 పుస్తకాలలో 9,92,672 టైటిల్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మండలాల నుంచి ఆన్లైన్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే విద్యార్థులకు అందిన పుస్తకాల శాతం 50కి కూడా చేరలేదు. ● ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ, చాలా చోట్ల అలాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఇక మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చేపట్టిన పాఠశాలల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. భవనాల మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల పను లు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులను ప్రభుత్వం పట్టించుకోలేదని హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలకాల్సిన పాఠశాలలు కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులను ఆహ్వానించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడులకొచ్చిన విద్యార్థులకు నిరాశే స్వాగతం జిల్లాలో సాదాసీదాగా ‘మనబడి–మన పండుగ’ తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలతో తప్పని ఇబ్బందులు -
తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రిటౌన్: వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి కోరుతూ ఎస్పీకి మెయిల్ చేశామని పెద్దారెడ్డి చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా జీపులోకి ఎక్కించి, నియోజకవర్గం దాటించి పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట వద్ద వదిలేశారు. కాగా గురువారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను ర్యాలీకి రావద్దంటూ పోలీసులు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసేశారు. శుక్రవారం తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరింపజేసి కార్యక్రమం జరగకుండా నిలువరించారు. -
అలవికాని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయకుండా వంచన చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ తదితర హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా అరాచక పాలన సాగించడంపై జనం మండిపడ్డారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు
అనంతపురం: అనంతపురంలో అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. చంద్రబాబు మోసాలకు నిరసనగా లలిత కళాపరిషత్ వద్ద వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో కలిసి అనంత నల్లబెలూన్లు ఎగురవేశారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించి ప్రజలను దగా చేసిన చంద్రబాబు తీరును ఎండగట్టారు. మండుటెండలోనే భారీ ర్యాలీ చేపట్టారు. సప్తగిరి సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి టవర్క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆంక్షలు విధిస్తూ దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండేళ్లుగా సీఎం చంద్రబాబు చేసిన మోసాలను అనంత వెంకటరామిరెడ్డి ఎండగట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయన్నారు. రెండేళ్లు గడిచినా హామీల అమలులో విఫలమయ్యాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సంతకం చేసిన డీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చాన్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసులతో పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. అనంతపురంలో ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతున్నారని, నకిలీ రిజిస్ట్రేషన్లు, భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్ కుమార్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు బోయ తిప్పేస్వామి, అనంత చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్, ఎస్ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు. ఎగిసిపడిన నిరసన కెరటం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ మహా నిరసన కెరటంలా ఎగసిపడింది. అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం నుంచి జాతీయ రహదారి–44 వరకు వేలాదిమందితో ర్యాలీ సాగింది. రోడ్డు పొడవునా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన వంచనను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చివరకు డ్వాక్రా సంఘాలే లేకుండా చేస్తున్నారని చంద్రబాబుపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. నయవంచనపై నిరసనాగ్రహం రాయదుర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ విజయవంతమైంది. కార్యక్రమానికి వేలాది మంది పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. లక్ష్మీ బజార్ నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వినాయక సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు, సూపర్ సిక్స్ హామీల అమలు అటకెక్కించడంపై మెట్టు గోవిందరెడ్డి మండిపడ్డారు. అసత్యానికి ప్రతీక చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యానికి ప్రతీక అని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడు శివశంకర్రెడ్డి అన్నారు. గుంతకల్లులో ‘చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హనుమేష్ నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, పొట్టి శ్రీరాములు సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’పై తిరుగుబాటు జిల్లా వ్యాప్తంగా వైఎసార్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన ప్రజలు నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబుపై భగ్గుమన్న యువత, మహిళలు మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారంటూ మండిపాటు -
ఇక విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
అనంతపురం టౌన్: ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రీపెయిడ్ రీచార్జ్ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. మొబైల్ ఫోన్కు రీచార్జ్ చేసుకుంటేనే వ్యాలిడిటీ పెరిగి ఫోన్ మాట్లాడుకునేందుకు ఎలా వీలవుతుందో.. అదే తరహాలోనే రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ వృథాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా స్మార్టు మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 24 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విధానం అమలులోకి వచ్చింది. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ప్రతి నెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లును ర్యాండమ్గా తీసుకొని నెల వారీగా విద్యుత్ ఖర్చు (యూనిట్లు) ఏమాత్రం ఉంటుందో అంఛనా వేసి, అందుకనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే వినియోగదారునికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే వినియోగదారుడు ఎంత మేర విద్యుత్ వినియోగించారు.. అందు కోసం పెట్టిన ఖర్చు మిగిలిన బ్యాలెన్స్ వివరాల సమాచారం మొత్తం వినియోగదారునికి మొబైల్లో సందేశాన్ని పంపుతారు. అలా మెసేజ్ వచ్చిన వెంటనే విద్యుత్ వినియోగించడం తగ్గించుకోవడమో..లేదంటే రీచార్జ్ చేసుకోవడమో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. ఒక వేళ రీచార్జ్ చేసుకునేందుకు ఆలస్యమైతే గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేసుకుంటే కొన్ని నిమిషాల్లోనే విద్యుత్ పునరుద్ధరిస్తారు. ఇందు కోసం స్మార్ట్ మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, తమ సిబ్బంది చేత మానటరింగ్ చేస్తారు. 200 యూనిట్లు వాడే వినియోగదారులకు.. అనంతపురం జిల్లాలో 14 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 వేల కార్యాలయాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రీపెయిడ్ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్ స్మార్టు మీటర్ల పనితీరు ఎలా ఉంది? అనే వివరాలు జూలై మొదటి వారంలో తెలియనుంది. ఈ విధానంపై ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా సర్వీసులకు స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు. అందులో జూన్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంపై అన్ని శాఖల ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి, స్మార్టు మీటర్ల విధానం బాగుదంటే మలివిడతలో 200 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 17 లక్షలకు పైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 200 యూనిట్లు విద్యుత్ వినియోగం ఉన్న సర్వీసులు 2.50 లక్షలకు పైగానే ఉన్నాయి. వాటికి సైతం ప్రీపెయిడ్ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ వృథా అరికట్టడంలో కీలకం.. విద్యుత్ వృథా ఖర్చు, దుర్వినియోగాన్ని ప్రీ పెయిడ్ స్మార్టు మీటర్లతో పూర్తి స్థాయిలో అరికట్టడంలో కీలకంగా పనిచేస్తాయి. వీధి దీపాలు ప్రతి రోజు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉంటాయి. స్మార్టు మీటర్లకు వీధి దీపాలను అనుసంధానం చేయడంతో సాయంత్రం 6 గంటలకు వెలుగునిచ్చి ఉదయం 6 గంటలకు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. దీంతో విద్యుత్ ఖర్చు సైతం అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రీపెయిడ్ స్మార్టు మీటర్ల విధానం అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యుత్ వినియోగం సైతం పొదుపుగా వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేస్తున్నాం. వచ్చే నెల 1 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగించే సర్వీసులకు అమలు చేయనున్నాం. స్మార్టు మీటర్ల ఏర్పాటుకు వినియోగదారులు సహకరించాలి. – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం ఉమ్మడి అనంత జిల్లాలో 2 లక్షల కనెక్షన్ల ఏర్పాటు మలి విడతలో 200 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారులకు -
బాధ్యులెవరు.. బాధితులెవరు?
అనంతపురం క్రైం: నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల విక్రయాల విషయం చర్చనీయాంశమైంది. వరుసగా కథనాలు వెలువడినా.. బాధితుల నుంచి ఫిర్యాదులు అందినా.. బాధ్యులెవరు.. బాధితులెవరు అనే విషయాలు వెల్లడించకుండా అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అమ్మకాల బాగోతం చాలాకాలంగా సాగుతోంది. ఈనెల 10న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అమ్మకాల వ్యవహారం మరోమారు వెలుగుచూసింది. తన తల్లి మరణ ధువ్రీకరణ పత్రం జారీ కోసం రూ.1800 డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేశారని నగరంలోని మారుతీనగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో బాగోతం మరోమారు వెలుగుచూసింది. మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారంపై వరుసగా ఆరోపణలు, ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2025 నవంబర్ 26న మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సంబంధిత ఆధారాలు, పత్రాలు బయటకు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపడతామని అధికారులు చెప్పినా.. ఇప్పటికీ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జారీ చేయాల్సిన మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మధ్యవర్తుల ద్వారా రూ.1,800 వసూలు చేసినట్లు డిజిటల్ చెల్లింపు ఆధారాలతో సహా ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. చెల్లింపులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఒకటి కాదు... రెండు కాదు... వరుసగా ఒకే విభాగంపై ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందాయి. అయినా బాధ్యులు ఎవరు?, వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? విచారణ ఎక్కడ ఆగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లభించడం లేదు. ఉన్నతాధికారులు ఈ అక్రమార్కులను, లంచావతారులను ప్రోత్సహిస్తున్నారా? లేక ఈ తీగ లాగితే ఎవరి డొంక ఎక్కడ కదులుతుందోనని మౌనంగా ఉన్నారో తెలియాల్సి ఉంది. డిజిటల్ చెల్లింపులు చేశారు తాజాగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి ఉద్యోగులు, సిబ్బంది ఏ ఒక్కరూ డబ్బు డిమాండ్ చేయలేదు. మహేష్ అనే వ్యక్తి తనకు ఎక్స్ట్రా కాఫీలు కావాలని అడిగితే వాటికి సంబంధించి మీ సేవ సెంటర్లో తీసుకోవాలని చెప్పారని తెలిసింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. వాస్తవాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం. ప్రజలు ఎవరు లంచం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి. – సునీత, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ ‘అమ్మకానికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఫిర్యాదులందినా నగరపాలక సంస్థ అధికారుల మౌనం -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: పట్టణంలోని డీఎల్ఆర్ కాలనీ సమీపంలో రైలు కిందపడి టీడీపీ కార్యకర్త, స్టోర్ డీలర్ గుద్దిటి అనిల్కుమార్ (36) శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం రైల్వే హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన మేరకు.. ధర్మవరం పీఆర్టీ వీధికి చెందిన గుద్దిటి నాగార్జున, వరలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు గుద్దిటి అనిల్కుమార్. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. డీఎల్ఆర్ కాలనీ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధా రాలు లేకపోవడంతో శవాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడు అనిల్కుమార్గా గుర్తించారు. అప్పులు ఎక్కువగా చేయడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దివ్యాంగురాలి ఆత్మహత్య ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దివ్యాంగురాలు రాజ్యలక్ష్మి(21) ఉరివేసుకొని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన మేరకు..పట్టణంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన రామంజనేయులు, అవేట పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు రాజ్యలక్ష్మి ఉన్నారు. కూతురు పుట్టుకతోనే చెవుడు, మూగ. ఈమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


