Ananthapur
-
1962 హెల్ప్లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మారుమూల పల్లెల్లో సైతం అందించే విశిష్ట పశువైద్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి మూగజీవాలకు ప్రాణదానం చేసిన మొబైల్ అంబులెన్స్లు నేడు రోడ
అనంతపురం అగ్రికల్చర్: దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్లు ప్రవేశపెట్టారు. పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. తండ్రి స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగ జీవాల కోసం సైతం మొబైల్ అంబులెన్స్లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో నియోజకవర్గాలకు అదనంగా మరొకటి సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు.అర్హత కలిగిన పశువైద్యులు, ఒక పారా వెట్, పైలెట్ కింద డ్రైవర్ను నియమించారు. 1962 టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ రాగానే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు వెళ్లి రైతు ఇంటి వద్దే మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలు మరీ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారానే సమీప పశువుల ఆస్పత్రికి తీసుకువచ్చి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు. కక్ష గట్టి నిలిపివేత.. ఉన్నతాశయంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్స్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 14 అంబులెన్స్లను ఈనెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన అంబులెన్స్లు కూడా నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఉన్నపళంగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంపై రైతులు, కాపర్లు మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిల సంగతి కూడా తేల్చకుండానే కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన చెందుతున్నారు. 1962 అంబులెన్సులపై కూటమి సర్కారు కక్ష ఉమ్మడి జిల్లాలో 14 మొబైల్ అంబులెన్స్ల నిలిపివేత 108 మాదిరిగా పశువుల కోసం అంబులెన్స్లు తెచ్చిన జగన్ సర్కారు మారుమూల ప్రాంతాల్లో సైతం విశిష్ట సేవలు అందించేలా చర్యలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం -
రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: ‘‘రెవెన్యూశాఖ పరిధిలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏ ఒక్క అర్జీ పెండింగ్లో ఉండడానికి వీలులేదు’’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ రెవెన్యూ డివిజన్, మండలస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలకు సంబంధించి చుక్కల భూములు, మ్యుటేషన్ దరఖాస్తులు, వివాహ, సమీకృత, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, మ్యుటేషన్ ఫార్ ట్రాన్సాక్షన్, పాసుపుస్తకం సేవలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీలు పరిష్కరించారా.. లేదా? ఆత్మకూరు: రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలను పరిష్కరించారా లేదా అని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ వినోద్కుమార్ పరిశీలించారు. ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన జింకల నరసింహులు అనే రైతు తన భూమికి దారి చూపించాలంటూ అందించిన అర్జీపై ఆరా తీశారు. ఇరు వర్గాలతో మాట్లాడారు. ప్లాన్ మార్క్ ప్రకారం రస్తా చూపించాలని ఆర్డీఓ, తహసీల్దార్ను ఆదేశించారు. మిగిలిన భూమిలో చట్ట ప్రకారం హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎవరూ గొడవలు చేసుకోరాదని హితవు పలికారు. న్యూస్రీల్ -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఉరవకొండ: మండల పరిధిలోని లత్తవరం తండా గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కావ్యబాయి (16) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. లత్తవరం తాండా గ్రామానికి చెందిన ఈశ్వర్నాయక్, జానకిబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె కావ్యబాయి ఉరవకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం (సీఈసీ) చదువు తోంది. మూడు రోజుల నుంచి కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. బుధవారం ఉదయం కూలి పనులకు వెళ్లిన ఈశ్వర్నాయక్, జానికిబాయిలు మధ్యాహ్నం ఇంటికి రాగా, కావ్యబాయి ఫ్యాన్కు ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కుమార్తెను కిందికి దించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థిని మృతికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ఎస్ఐ జనార్దన్నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొప్పాయి చెట్ల నరికివేత బ్రహ్మసముద్రం: మండలంలోని రాయలప్పదొడ్డి పంచాయతీ యనకల్లు గ్రామ సమీపంలో సర్పంచ్ రామ్మోహన్ సాగు చేసిన బొప్పాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తనకున్న 5 ఎకరాల్లో రామ్మోహన్ బొప్పాయి సాగు చేపట్టారు. గిట్టని వారు తోటలోకి చొరబడి పిందె దశలో ఉన్న 70కి పైగా చెట్లను నరికి వేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు. -
1 నుంచి ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారంతో ప్రాక్టికల్ పరీక్షలు ముగియడంతో థియరీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. మార్చి 20 వరకు థియరీ పరీక్షలుంటాయి. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 25,730 మంది కాగా 12,397 మంది బాలురు, 13,333 మంది బాలికలు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,960 మంది కాగా వీరిలో 11,064 మంది బాలురు, 11,896 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుతున్నాయి. స్థానిక కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో భద్రపరుస్తున్నారు. పరీక్షలపై ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం (నం.08554– 274256) ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల సమయంలో ప్రశ్రపత్రాలను లీక్ చేస్తే అడ్డంగా దొరికిపోతారు. ప్రశ్నాపత్రాలపై క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. పొరపాటున బయట ప్రశ్నపత్రం దొరికిందా... దానిపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అది ఏ కేంద్రానికి కేటాయించిందో ఇట్టే తెలిసిపోతుంది. వెబ్సైట్లో హాల్ టికెట్లు.. విద్యార్థులు హాల్టికెట్లు https://bie.ap.gov.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులకు, హాల్ టికెట్లకు ముడిపెట్టొద్దని, ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఎం. వెంకటరమణనాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను ముందురోజే వెళ్లి సంబంధిత కళాశాల యాజమాన్యంతో నిర్ధారించుకోవాలని సూచించారు. వర్సిటీ పురోగతికి సమష్టి కృషి అనంతపురం: జేఎన్టీయూ(ఏ) పురోగతికి సమష్టిగా కృషి చేద్దామని నూతన వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి సహకారంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. -
రోడ్డున పడేయొద్దు
తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని 1962 మొబైల్ అంబులెన్స్ డాక్టర్లు, పారావెట్స్, డ్రైవర్లు వేడుకున్నారు. ఉన్నపళంగా మొదటి విడత అంబులెన్స్లు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం అనంతపురం పశుసంవర్ధక శాఖ జేడీ కార్యాలయంలో జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముందస్తు సమాచారం లేకుండానే అంబులెన్స్లు నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు సంస్థ మారినా మళ్లీ తమనే విధుల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు. జేడీని కలిసిన వారిలో డాక్టర్ శృతి, డాక్టర్ హైమ, డాక్టర్ కరణ్, డాక్టర్ మంజుశ్రీ, సిబ్బంది మహదీప్, ఆకాష్, వినోద్, షరీఫ్, పవన్సాయి, కళ్యాణ్బాబు తదితరులు ఉన్నారు. -
No Headline
● అనంతపురం రాజు రోడ్డులోని ఓ ఆప్టికల్ (కళ్లద్దాల) షాపు భవనాన్ని భాస్కర్రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. అనంతరం అమ్మిన వ్యక్తికే అద్దెకిచ్చారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డికి సదరు వ్యక్తి అద్దె ఇవ్వకుండా మొండికేశారు. తన బంధువులతో కోర్టులో కేసు వేయించారు. అష్టకష్టాలు పడిన భాస్కర్ రెడ్డి మూడేళ్ల తర్వాత భవనాన్ని సొంతం చేసుకోగలిగారు. ● భవనానికి బాడుగ ఇవ్వక, ఖాళీ చేయక ఇబ్బంది పెడుతున్నారంటూ ఇటీవల ఓ ఫిర్యాదుదారు అనంతపురం త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు ఓ న్యాయవాదిని పిలవగా.. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ రెండే కాదు.. జిల్లాఅంతటా ఇదే పరిస్థితి. అద్దెకు తీసుకున్న వారు సరిగా బాడుగ చెల్లించక, భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో ఓనర్లు నానా తంటాలు పడుతున్నారు. -
బాడుగకిస్తే బాధే మిగులుతోంది!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనవాళ్లే కదా.. అంతా బాగుంటుంది లే’ అనుకుంటూ భవనాన్ని అద్దెకిచ్చిన పాపానికి ఓనర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అద్దెదారులు చివరకు ‘ఖాళీ చేయం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ ధిక్కరిస్తున్న పరిస్థితి. పైగా కోర్టుకు వెళ్లడం.. ఇప్పుడే ఖాళీ చేయలేమని గడువుతో కూడిన స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం.. ఆ గడువు కూడా ముగిసినా ఖాళీ చేయకపోవడం... ఇదీ దుస్థితి. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో భవన యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అద్దె కరెక్టుగా ఇచ్చేవారికి కూడా కొందరి ఆగడాలతో బాడుగకు భవనం దొరకడం కష్టతరమవుతోంది. ‘క్రాంతి’.. భ్రాంతి అనంతపురం గుత్తిరోడ్డులోని ఓ అద్దె భవనంలో క్రాంతి హాస్పిటల్ నడు స్తోంది. నెలకు అద్దె రూ.3.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. 2021లోనే భవనం అద్దె లీజు ముగిసింది. ఈ క్రమంలో భవనాన్ని ఖాళీ చేయాలని అనేక సార్లు ఓనరు అడిగినా స్పందన లేకుండా పోయింది. పైగా గడిచిన 14 నెలల నుంచి అద్దె కూడా చెల్లించలేదు. దీంతో భవన యజమాని నగేష్ 2024 డిసెంబరులో ఎస్పీకి ఫిర్యాదు చేయ గా... పరిష్కారం చూపాలంటూ అనంతపురం త్రీ టౌన్ పోలీసులను ఆయన ఆదేశించారు. అయితే, సదరు పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో ఆస్పత్రి వద్ద భవన యజమాని బుధవారం ధర్నాకు దిగారు.ఈ క్రమంలో ఆస్పత్రి నిర్వాహకుడు మురళి దిగిరాకపోగా బాధితుడిపైనే దౌర్జన్యం చేశారు. ‘దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ బెది రించాడని నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది కేసులు.. అనంతపురంలోనే కాదు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు పట్టణాల్లోనూ ఇలాంటి కేసులు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సగటున రోజుకు 10 కేసులు నమోదవుతున్నాయి. అద్దెకున్న వారు ఖాళీ చేయకపోవడంతో బిల్డింగ్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది విదేశాల్లో ఉంటూ ఇక్కడ అద్దెకిస్తే ఆ ఇళ్లకు ఏకంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కుదువకు పెట్టిన వారూ ఉన్నట్లు సమాచారం. భవనాలను ఖాళీ చేయని అద్దెదారులు అవసరమైతే కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లు పోలీసులను ఆశ్రయిస్తున్న ఓనర్లు రోజుకు 10 పైనే కేసులు అద్దె ఇప్పించే ఉద్యోగం కాదు మాది అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇప్పించడమో, ఖాళీ చేయించడమో చేసే ఉద్యోగం కాదు మాది. ఇలాంటి వాటి జోలికొస్తే సివిల్ పంచాయితీల్లో ఎందుకు తలదూరుస్తారు అంటారు. అందుకే కోర్టుకెళ్లి తేల్చుకోండి అని చెబుతున్నాం. మా పరిధిలో ఉన్నవి మాత్రమే పరిష్కరిస్తాం. –శాంతిలాల్, సీఐ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ -
1962 హెల్ప్లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మారుమూల పల్లెల్లో సైతం అందించే విశిష్ట పశువైద్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి మూగజీవాలకు ప్రాణదానం చేసిన మొబైల్ అంబులెన్స్లు నేడు రోడ
అనంతపురం అగ్రికల్చర్: దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్లు ప్రవేశపెట్టారు. పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. తండ్రి స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగ జీవాల కోసం సైతం మొబైల్ అంబులెన్స్లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో నియోజకవర్గాలకు అదనంగా మరొకటి సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు.అర్హత కలిగిన పశువైద్యులు, ఒక పారా వెట్, పైలెట్ కింద డ్రైవర్ను నియమించారు. 1962 టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ రాగానే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు వెళ్లి రైతు ఇంటి వద్దే మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలు మరీ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారానే సమీప పశువుల ఆస్పత్రికి తీసుకువచ్చి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు. కక్ష గట్టి నిలిపివేత.. ఉన్నతాశయంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్స్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 14 అంబులెన్స్లను ఈనెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన అంబులెన్స్లు కూడా నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఉన్నపళంగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంపై రైతులు, కాపర్లు మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిల సంగతి కూడా తేల్చకుండానే కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన చెందుతున్నారు. 1962 అంబులెన్సులపై కూటమి సర్కారు కక్ష ఉమ్మడి జిల్లాలో 14 మొబైల్ అంబులెన్స్ల నిలిపివేత 108 మాదిరిగా పశువుల కోసం అంబులెన్స్లు తెచ్చిన జగన్ సర్కారు మారుమూల ప్రాంతాల్లో సైతం విశిష్ట సేవలు అందించేలా చర్యలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం -
సుత్తితో మోది.. బంగారు నగల అపహరణ
ఓడీచెరువు: ఇంటి తలుపుతట్టిన దుండగులు...డోరు తీసిన మహిళ నెత్తిపై సుత్తితో మోది ఆమె వంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఓడీచెరువులో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... వైద్య,ఆరోగ్యశాఖ విశ్రాంత ఉద్యోగి లక్ష్మమ్మ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో దుండగులు తలుపుతట్టి పేరుపెట్టి పిలిచారు. దీంతో ఆమె తలుపుతీయగానే సుత్తితో తలపై కొట్టడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమె మెడలోని గొలుసు, చేతికున్న బంగారు గాజులను దుండగులు తీసుకెళ్లిపోయారు. కాసేపటి తర్వాత మెలుకున్న లక్ష్మమ్మ తన కూతురుకు ఫోన్ చేసి విషయం తెలిపడంతో ఆమె వచ్చి తల్లిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అనంతరం స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మొత్తంగా 14 తులాల బంగారు నగలు దుండగులు అపహరించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సత్యసాయి నగర్కు చెందిన అశోక్ (35) ఇటుకల బట్టీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా మదన పడుతున్న అశోక్ బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై చెన్నేకొత్తపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ప్యాదిండి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కొరవడిన ముందుచూపు
గుంతకల్లు టౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు గానూ బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఇంటర్వ్యూలు నిర్వహించలేక అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా ఇంటర్వ్యూలు వాయిదాపడ్డాయి. ఇంటర్వ్యూలకు ఒక్క రోజు ముందు పత్రికా ప్రకటన ఇవ్వడం... ప్రణాళిక లేకుండా అర్ధ రోజులోనే ఇంటర్వ్యూలను ముగించాలనుకోవడం అధికారిక వైఫల్యాలకు కారణంగా తెలుస్తోంది. ముందుచూపులేని అధికారులు హడావుడిగా తీసుకున్న నిర్ణయాల వల్ల మండుటెండల్లో అభ్యర్థులు నానా తిప్పలు పడ్డారు. ఒకానొక దశలో తోపులాట చోటు చేసుకోవడంతో తోపులాటను చూసి బ్యాంకు అధికారులు భయాందోళనలకు గురయ్యారు. బీసీ, ఈబీసీ కింద 117 యూనిట్లకు సుమారు 1,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ ఇంటర్వ్యూలకు హాజరవుతారని తెలిసి కూడా కార్యాలయ ఆవరణలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. కాగా, మున్సిపల్ కమిషనర్ నయీమ్ బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని సీఐటీయూ పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మండిపడ్డారు. ఇంటర్వ్యూలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తున్నట్లుగా ముందస్తుగా తమకు ఎందుకు సమాచారమివ్వలేదని మున్సిపల్ కమిషనర్ నయీమ్, సంబంధిత అధికారులను పోలీసు అధికారులు నిలదీశారు. తొక్కిసలాట జరిగితే బాధ్యత వహిస్తారా అంటూ టూటౌన్ సీఐ మస్తాన్ ప్రశ్నించారు. ఇంటర్వ్యూ తేదీ ఒక్క రోజు ముందు ఖరారు కావడంతో మౌలిక వసతులు కల్పించలేకపోయినట్లు మెప్మా టీపీఆర్ఓ మోహన్ తెలిపారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇంటర్వ్యూలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంటర్వ్యూలు నిర్వహించలేక చేతులెత్తేసిన అధికారులు -
ఉచిత ఎంబీఏ విద్య కోసం 23న పరీక్ష
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి కళాశాలలో ఉచిత ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే సాయి ప్రుడెంట్ స్కాలర్షిప్ పరీక్ష ఈ నెల 23 ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం విద్యాసంస్థల చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి విడుదల చేశారు. అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రశాంతి, ప్రిన్సిపాల్ అండ్ డీన్ డాక్టర్ బాలకోటేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల ఎంబీఏ విద్యతో పాటు హాస్టల్ సౌకర్యాలను పొందడానికి సాయి ప్రుడెంట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ కోర్సు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 91000 64545, 91009 74544, 91009 74537 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జర్మనీకి చెందిన అన్హటా స్టప్టుంగ్ ఫౌండేషన్ సహకారంతో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
మాతాశిశు సంరక్షణ చర్యలు చేపట్టండి
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో మాతాశిశు సంరక్షణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రకారం తల్లీబిడ్డల వైద్య సేవలు, గర్భిణుల వివరాల నమోదుపైబుధవారం ఆయన డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవితో కలసి వైద్యాధికారులతో సమీక్షించారు. వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ రవిశంకర్, ఎస్ఓ మహ్మద్ రఫీ, కిషోర్ పాల్గొన్నారు. పామిడి: మండల కేంద్రంలోని సీహెచ్సీతో పాటు రామరాజుపల్లిలోని హెల్త్ క్లినిక్ను బుధవారం ఉదయం డాక్టర్ అనిల్కుమార్ తనిఖీ చేశారు. ముందుగా పామిడిలోని గుప్తా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా 11 రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. అనంతరం సీహెచ్సీలో పలు రికార్డులు పరిశీలించారు. రామరాజుపల్లిలో హెల్త్ క్లినిక్ను పరిశీలించి 14 రకాల ల్యాబ్ పరీక్షల విధానం, ఎన్సీడీ సీడీ సర్వేపై ఆరోగ్యసిబ్బందికి అవగాహన కల్పించారు. ఆయన వెంట ఆర్బీఎస్కే సీఓ నారాయణస్వామి, ఎద్దులపల్లి వైద్యాధికారి సుధాకర్, సిబ్బంది ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అనిల్కుమార్ -
నేడు
నాడు వన్యప్రాణుల సంరక్షణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వేసవిలోనే కాదు.. మిగిలిన అన్ని సీజన్లలోనూ నీటి కోసం వన్యప్రాణులు విలవిల్లాడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తొట్టెలు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా వాటిని నీటితో నింపుతూ వచ్చింది. ఈ చర్యలతో అటవీ ప్రాంతాన్ని వీడి ఏనాడూ వన్యప్రాణులు గ్రామాల బాట పట్టింది లేదు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రస్తుత కూటమి సర్కార్ ఉదాసీనత కనబరుస్తోంది. వేసవి ప్రారంభం కాక ముందే ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నా ఇప్పటి వరకూ వన్యప్రాణుల దాహార్తీని తీర్చే చర్యలు చేపట్టలేదు. ఫలితంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడంతో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు గ్రామాల బాట పడుతున్నాయి. మానిరేవు బీట్లో తొట్టెలోకి నీరు పడుతున్న అటవీ సిబ్బంది (ఫైల్) రాయదుర్గం: వేసవి ప్రారంభానికి ముందే ఫిబ్రవరి రెండో వారంలోనే భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకకపోవడంతో గ్రామాల బాట పడుతున్నాయి. దాహార్తీ తీరేలోపు చాలా మూగజీవాలు మృత్యువాత పడుతుండగా, మరికొన్ని వీధి కుక్కలు, వేటగాళ్ల బారిన పడి చనిపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణపై కూటమి సర్కార్ ఉదాసీనత కనబరుస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, కణేకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కూడేరు తదితర గ్రామాల్లో ఇప్పటికే ఎలుగుబంట్లు, చిరుతలు, తాడిపత్రి, యాడికి, యల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో జింకలు, దుప్పిలు, కుందేళ్లు. ఇతర మూగజీవాలు దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన నీటి వసతిని ప్రభుత్వం కల్పించకపోవడంతోనే సమీప పొలాల్లోని ట్యాంకుల్లో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు వస్తుంటాయని రైతులు అంటున్నారు. వంద తొట్టెల నిర్మాణం జిల్లాలోని మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలో 74,400 హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతం వేలాది వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని ఫారెస్ట్ రేంజ్లలో సుమారు వందకు పైగా నీటి తొట్టెలను నిర్మించింది. ఇందు కోసం రూ.లక్షలు వెచ్చించింది. వీటికి తోడు సాసర్ రింగ్స్, చెక్డ్యామ్లు, పెర్కోలేషన్ ట్యాంకులు, నీటి కుంటల్ని నిర్మించి సీజన్తో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా నీటితో నింపుతూ వస్తుండడంతో ఏనాడూ వన్యప్రాణాలు అటవీ ప్రాంతాన్ని వీడి జనావాసాల్లోకి వచ్చింది. లేదు. అడవుల సరంక్షణ, వన్యప్రాణుల చట్టాలపై సమీప గ్రామాల ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చింది. దీంతో కారుచిచ్చు నుంచి అడవుల్ని కాపాడుకునే బాధ్యత ప్రజలే స్వచ్ఛందంగా తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వన్యప్రాణి సంరక్షణ చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదని గ్రామీణులు అంటున్నారు. దీంతో అడవికి అందాలుగా చెప్పుకునే వన్యప్రాణులు దాహంతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేవు వన్యప్రాణుల సంరక్షణకు కంపా, బయోసాట్ పథకాల కింద నిధులు అందాల్సి ఉంది. ప్రస్తుతం కంపా పథకం కింద రూ.50 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతకు మించి నిధులేమీ లేవు. అన్నీ రేంజీల పరిధిలోనూ వన్యప్రాణుల తాగునీటి అవసరాలను గుర్తించాం. దానికి తగినట్లుగా నీటి వసతి ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. వన్యప్రాణులతో పాటు అడవులను కాపాడుకునే బాధ్యత తీసుకున్నాం. అవసరమైనచోట సాసర్రింగ్స్ను అందుబాటులోకి తీసుకోస్తాం. – విజ్ఞేష్ అప్పావు, డీఎఫ్ఓ, అనంతపురం -
గొంతు తడవక సొమ్మసిల్లి...
పుట్టపర్తి: గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్కపోవడంతో ఓ మామిడి తోటలో వాలిన జాతీయ పక్షి నెమలి... అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. బుక్కపట్నం గ్రామానికి చెందిన రైతు చిట్రా నారాయణస్వామి తోటలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విపరీతమైన దాహంతో సొమ్మసిల్లిన నెమలిని గమనించిన కొత్త చెరువుకు చెందిన విశ్రాంత సైనికోద్యోగి రవిచంద్ర వెంటనే దానికి సపర్యలు చేపట్టారు. బిందెలతో నీటిని దానిపై పోసిన కాసేపటికి తేరుకుంది. అయినా పైకి స్వేచ్ఛగా ఎగరలేక ఇబ్బంది పడుతుంటే రైతు నారాయణస్వామితో కలసి పోలీసులకు అప్పగించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గొంతు తడుపుకునేందుకు మూగజీవాలు పడుతున్న ఇబ్బందులకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలో కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నా.. వెలుగులోకి కొన్ని మాత్రమే వస్తున్నాయి. సకాలంలో రైతులు గుర్తించడంతో నెమలికి ప్రాణాపాయం తప్పింది. దాహంతో అలమటిస్తున్న పలు వన్యప్రాణులు నీరు అందక మృత్యువాత పడుతుండడం బాధాకరం. -
అన్ని సౌకర్యాలుంటేనే సబ్సిడీ పరికరాలు
● ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ఖాన్ కూడేరు: బోరు, మోటార్, విద్యుత్ తదితర అన్ని సౌకర్యాలున్న రైతులకే ప్రభుత్వం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలు అందిస్తుందని ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ఖాన్ అన్నారు. బుధవారం ఆయన కూడేరు, ఇప్పేరులోని రైతు సేవాకేంద్రాలను సందర్శించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల పొలాల్లో బోరు వద్ద ఫొటోలు తీసి అప్లోడ్ (పీఏఆర్) చేసే అంశంలో చోటు చేసుకున్న జాప్యంపై సిబ్బందితో సమీక్షించారు. మార్చిలోపు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూడేరు మండల వ్యాప్తంగా ఇంకా 405 మంది రైతుల పొలాల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయడం, జియో టాగింగ్ చేయడం ఉన్నాయన్నారు.రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరిస్తే ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ హార్టికల్చర్ ఆఫీసర్ నెట్టికంటయ్య, వీహెచ్ఏ సాజియా, ఎంపీఈఓ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం పెద్దవడుగూరు: మండలంలోని అప్పేచర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై స్థానిక టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన టీడీపీ నేత ప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్త విజయభాస్కరరెడ్డి మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్లో విజయభాస్కరరెడ్డి పని చేస్తుండగా అక్కడికి టీడీపీ నేతలు ప్రకాష్రెడ్డి, నాగేశ్వరరెడ్డి చేరుకుని వాగ్వాదానికి దిగారు. మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడాన్ని గమనించిన విజయభాస్కరరెడ్డి అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకుని వేట కొడవలి, ఇనుప పైపులతో దాడి చేశారు. ఘటనలో విజయభాస్కరరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన ఆయన తమ్ముడు రామ్మోహన్రెడ్డిపై సైతం టీడీపీ నేతలు దాడిచేయడంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళితే.. దాడికి పాల్పడిన వారు సైతం అక్కడకు చేరుకుని ప్రతిగా ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
సీసీ కెమెరాల్లేవు.. రికార్డుల ఊసే లేదు
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో డొల్లతనం బయట పడింది. రెసిడెన్షియల్ కళాశాల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస చర్యలు పాటించడం లేదని వెల్లడైంది. కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థి మృతిపై అనుమానాలు తలెత్తుతుంటే, మరోవైపు కళాశాలలో కనీస భద్రత చర్యలు లేకపోవడంపై చర్చ జరుగుతోంది. కళాశాలలో సీసీ కెమెరాలు లేవు. కాంపౌండ్ ఎత్తు లేదు. విద్యార్థుల అటెండెన్స్ నిర్వహణ లేదు. సెక్యూరిటీ లేడు. గేటు వద్ద కచ్చితంగా రిజిస్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి బయటకు వెళ్లాలంటే యాజమాన్యంతో అనుమతి తీసుకోవాలి. బంధువులు వస్తే వారి ఊరు, పేరు, సంతకం, వచ్చిన సమయం రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాతనే విద్యార్థిని బయటకు పంపాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. రాత్రి విద్యార్థి బయటకు పోతే వార్డెన్ ఏం చేస్తున్నాడు?ఎందుకు గుర్తించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇక.. రాత్రి పడుకునే ముందు అన్ని గదుల్లోకి వెళ్లి విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవాలి... అలా జరిగి ఉంటే విద్యార్థి శ్రీకాంత్ లేడనే విషయం అప్పుడే వెలుగు చూసేది. కానీ ఇక్కడ మాత్రం మరుసటి రోజు ఉదయం విద్యార్థి చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించేదాకా ఆ విద్యార్థి బయటకు వెళ్లాడనే సమాచారమే లేకపోవడం గమనార్హం. ప్రిన్సిపాల్ సెల్ స్విచ్చాఫ్.. కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్బాబు మంగళవారం ఉదయం 7.45 గంటలకు కళాశాలకు వచ్చాడు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలీగానే అక్కడి నుంచి వెళ్లిపోయి తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్తే అందుబాటులో లేరు. తీరిగ్గా బుధవారం ఉదయం కళాశాలకు రావడం విమర్శలకు తావిచ్చింది. డీఎస్పీ ఆగ్రహం.. విద్యార్థుల భద్రతకు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఏజీఎం జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజులు వసూళ్లు చేసినంతగా విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి బయటకు పోయిన విద్యార్థి ఉదయం శవమై తేలేంతవరకూ తెలీదా అని ప్రశ్నించారు. ‘తరచూ రౌండ్స్కు వస్తుంటారు కదా... కళాశాలలో విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది పరిశీలించక పోతే ఎలా?’ అని రూరల్ పోలీసులపైనా అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఇంటర్ బోర్డు అధికారులు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని, తరచూ కళాశాలలను తనిఖీలు చేసి, లోపాలుంటే సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేసి ఉంటే ఈరోజు ఇంతటి పరిస్థితి ఉండేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఐఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తక్షణమే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ఐఓ వెంకటరమణనాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కుళ్లాయిస్వామి, పరమేష్, పృథ్వి, సురేష్, హనుమంతరాయుడు, వంశీ, చందు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ కళాశాలలో భద్రత డొల్ల రోజంతా పత్తా లేకుండా పోయిన ప్రిన్సిపాల్ -
అహుడా వార్డు ప్లానర్ అనుమానాస్పద మృతి
అనంతపురం: అహుడాలో వార్డు ప్లానర్గా పనిచేస్తున్న నాగశ్రీ(38) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురంలోని మారుతీనగర్లో నివాసముంటున్న ఆమె తన ఇంట్లోనే మంగళవారం ఉరికి వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు గమనించి పెద్దాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర వైద్య విభాగంలో చేర్చారు. చికిత్సకు స్పందించక బుధవారం ఆమె మృతిచెందింది. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రీ సర్వే పారదర్శకంగా సాగాలి ● జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ నార్పల: గ్రామాల్లో రీ సర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జేసీ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. నార్పల మండలం దుగుమర్రిలో చేపట్టిన రీ సర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, బ్లాక్ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాల సరిహద్దులు పక్కగా నిర్ణయించాలన్నారు. రీ సర్వే చేసే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. వారి సమక్షంలోనే రీసర్వే పనులు చేపట్టాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల అడ్డగింత కనగానపల్లి: హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎవరికో మేలు చేసేందుకు తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తగరకుంట సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద లైనింగ్ పనులు చేపట్టేందుకు బుధవారం కాంట్రాక్టర్లు యంత్రాలతో రాగా, విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అక్కడికి వెళ్లి పనులు చేపట్టకూడదన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణాజలాలు తరలించేందుకు తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాలువ వెడల్పు, జంగిల్ క్లియరెన్స్కు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ కాలువలో సిమెంట్ వేసి లైనింగ్ చేస్తే ఒప్పుకోబోమన్నారు. కార్యక్రమంలో తగరకుంట, పాతపాల్యం గ్రామాల సర్పంచ్లు మాధవరాజులు, రాజాకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు. -
No Headline
ల్లలు కాస్త మారాం చేయగానే సెల్ఫోన్ చేతికి ఇచ్చేసి తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్. అయితే ఇందుకు భిన్నంగా ఓ చిన్నారి బుధవారం ఉదయం 7 గంటల సమయంలో కలెక్టరేట్ ఎదురుగా తోపుడి బండిపై ఇలా పలకా బలపం చేతపట్టి తనకు వచ్చిన అక్షరాలు రాస్తూ కనిపించింది. చదువుకోవాలన్న ఆకాంక్ష బలంగా ఉన్న చిన్నారి కుటుంబ పెద్దలతో కలసి తోపుడు బండిపై కలెక్టరేట్ వద్దకు చేరుకుని అక్కడే అక్షరాలు నేర్చుకుంటోంది. ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న వారు ఆసక్తిగా గమనించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం ఆకాంక్ష బలీయంపి -
భూ సమస్యలు పునరావృతం కారాదు
ప్రశాంతి నిలయం: జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా రూపొందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, రీ సర్వే, రెవెన్యూ సదస్సులతో పాటు పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ టీఎస్ చేతన్తో కలసి అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భూముల వర్గీకరణతో కూడిన మ్యాప్లు తయారు చేయాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్, 22ఎ, డి.నోటిఫైడ్, భూసేకరణ, సమీకరణ, ఫ్రీహోల్డ్, డిజిటలైజేషన్, జాయింట్ ఎల్పీఎంల రూపకల్పనతో పాటు ఇతర రెవెన్యూ అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, మహేష్, ఆనంద్కుమార్, 32 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా -
గంజాయి విక్రేతల అరెస్ట్
గుంతకల్లు టౌన్: ఒడిశా నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో విక్రయిస్తున్న గుంతకల్లుకు చెందిన షికారి నాగులు, అశోక్కుమార్, తాడిపత్రి నివాసి యర్రగుడి అల్తాఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన పక్కా సమాచారంతో బుధవారం ఉదయం గుంతకల్లులోని ఆలూరు రోడ్డులోని దర్గా ఆర్చ్ వద్ద తచ్చాడుతున్న ముగ్గురినీ అదుపులోకి విచారణ చేయడంతో గంజాయి విక్రయం బయటపడినట్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. వీరి నుంచి 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
రుణ మంజూరులో ఎందుకింత నిర్లక్ష్యం?
అనంతపురం సిటీ: తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, పదేపదే చెబుతున్నా బ్యాంకర్ల పని తీరులో మార్పు రావడం లేదని కలెక్టర్ వినోద్కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ డీపీఆర్సీ భవన్లో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ విద్యా రుణాలకు సంబంధించి యూకో బ్యాంక్ 109 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, కేవలం ముగ్గురికి మంజూరు చేయడం చూస్తే బ్యాంకర్ల పని తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుందన్నారు. స్టాండప్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి కేవలం 39.34 శాతం రుణాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కింద రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఆయా పథకాల కింద లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లతో తరచూ సమీక్షలు చేయాలని ఎల్డీఎం, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలకు చెందిన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ కోసం ప్రభుత్వం లక్ష్యాలను కేటాయించిందని, గడువులోగా రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో 34 బ్యాంకులకు సంబంధించి 290 బ్రాంచీలు ఉండగా, 51 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి, ఏర్పాటయ్యేలా చూడాలని ఎల్డీఎంను ఆదేశించారు. రైతులకు విరివిగా పంట రుణాలు అందించి, వారికి మేలు చేసేలా చొరవ చూపాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సౌకర్యార్థం మినీ బస్సు ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. గిట్టుబాటుపై ఒత్తిడి తీసుకురండి జిల్లాలో మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు సంఘం నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరారు. ఖరీఫ్, రబీ పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించి బాధిత రైతులతో పాటు కౌలు రైతులనూ ఆదుకోవాలని కోరుతూ ఎంపీకి వినతిపత్రం అందజేశారు. బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ వినోద్కుమార్ అసహనం -
చెలరేగిన ‘కేబుల్’ దొంగలు
యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. సరైన చికిత్సతో వంకర పాదాల సమస్య దూరం అనంతపురం మెడికల్: సరైన చికిత్సను అందివ్వడం ద్వారా చిన్నారుల్లో వంకర పాదాల సమస్యను నయం చేయవచ్చునని అమెరికాకు చెందిన క్యూర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ట్రైనర్ డాక్టర్ బ్రూస్స్మిత్ సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థో విభాగాన్ని పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్నారులకు స్వయంగా చికిత్స చేయడంతో పాటు చికిత్స విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వంకరపాదాలతో ఇబ్బంది పడిన 78 మంది పిల్లలకు క్యూర్ ఇండియా సంస్థ తరఫున డీబీ స్ల్పిట్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ సతీష్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు. -
పథకాలు దూరం చేసేందుకే ‘భూ ఆధార్’
అనంతపురం అర్బన్: రైతులకు సంక్షేమ ఫలాలు దూరం చేసేందుకే రైతు విశిష్ట సంఖ్య (భూ ఆధార్) నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వెంటనే ఈ ప్రక్రియను ఆపేయాలంటూ కూటమి సర్కార్ను సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆగమేఘాలపై రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే గడువు నిర్దేశించి, ఈ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూ ఆధార్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, పంటల బీమా వంటి సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, నమోదు చేసుకోకపోతే పథకాలు వర్తించవంటూ ఓ విధంగా రైతులను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో 70 శాతం మంది రైతులు ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ భూములను పొందినవారే ఉన్నారన్నారు. భూ ఆధార్ నమోదు ప్రక్రియతో వీరంతా తీవ్రంగా నష్టపోతారన్నారు. భూమి లేని లక్షల మంది కౌలురైతులకు ఎలాంటి గుర్తింపు ఉండదన్నారు. వీరికి సంక్షేమ పథకాలు వర్తించవన్నారు. అలాగే చుక్కల భూములు ఉన్న రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చూపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని నల్లప్ప డిమాండ్ చేశారు. విద్యార్థులకు రక్షణ కల్పించడంలో, సమస్యల పరిష్కారంలో విఫలమైన వీసీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నమోదు ప్రక్రియను వెంటనే ఆపేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ -
రోగులకు నాణ్యమైన సేవలందాలి
● వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ అనంతపురం మెడికల్: రోగులకు నాణ్యమైన సేవలందించాలని సంబంధిత అధికారులను వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన అనంతపురంలోని ఆదిమూర్తినగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రుద్రంపేటలోని విలేజ్ హెల్త్ క్లినిక్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ విధానానికి సంబంధించిన రిపోర్టులు, ఓపీ సేవల వివరాలు, మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల అమలుపై సిబ్బందితో సమీక్షించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డీఐఓ డాక్టర్ యుగంధర్, ఎన్హెచ్ఎం కిషోర్, ఫణి ఉన్నారు. అమ్మలా లాలిస్తూ అక్షరాలు నేర్పండి కూడేరు: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను అమ్మలా లాలిస్తూ అక్షరాలు, మంచి నడవడిక నేర్పుతూ వారి ఉజ్వల భవితకు పునాదులు వేయాలని కార్యకర్తలకు అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పిలుపునిచ్చారు. ‘పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం(ఎఫ్ఎల్ఎన్)’ కార్యక్రమం అమలుపై అంగన్వాడీ కార్యకర్తలకు కూడేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణా తరగతులను మంగళవారం డీఈఓ ప్రసాద్బాబుతో కలసి ఆమె ప్రారంభించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్(ఎస్ఎస్ఏ ఏపీసీ) శైలజ, ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ హాజరయ్యారు. వినూత్న మాట్లాడుతూ.. అంగన్వాడీ స్థాయిలోనే పిల్లలకు చదువులపై ఆసక్తి పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లల పోషణపై అలసత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఏసీడీపీఓ యల్లమ్మ, ఎంఈఓలు–1, 2 మహమ్మద్ గౌస్, సాయికృష్ణ, సూపర్ వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎస్ఈ సంపత్ బదిలీ అశాసీ్త్రయం
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అనంతపురం కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) సంతప్కుమార్ బదిలీ పూర్తి అశాసీ్త్రయంగా ఉందని, వెంటనే ఈ బదిలీని ఆపాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సంపత్కుమార్ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించేవారన్నారు. ఎలాంటి తప్పుడు ఆరోపణలు లేకున్నా కొందరి ప్రయోజనాల కోసం ఆయనను బదిలీ చేయడం సరికాదన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. ఆచరణలో కనీసం కనుచూపు మేరలోనూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సంపత్ కుమార్ విషయంలో ఉన్నతాధికారుల తీరును తప్పుబట్టారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి మృతదేహం లభ్యం గుంతకల్లు రూరల్: కనిపించకుండా పోయిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు 24 గంటలు గడవక ముందే హంద్రీనీవా కాలువలో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లుకు చెందిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు తిరుమలరెడ్డి (45) గత ఆదివారం బుగ్గ సంగాల క్షేత్రం సమీపంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం గుంతకల్లు–మద్దికెర మార్గంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువలో సోమవారం కొట్టుకువచ్చింది. తల, ముఖం, కాళ్లపై ఉన్న గాయాలను బట్టి తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తిరుమలరెడ్డి అదృశ్యమైన ప్రాంతంలో దెబ్బతిన్న ఆయన బైక్ తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వ్యక్తుల పేర్లను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని ఇప్పటికే తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ నేత మంజునాథరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చేరుకుని తిరుమలరెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. హతుడి భార్య, కుమార్తె, కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. రైతు ఆత్మహత్య యల్లనూరు: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంధ్ర శ్రీనివాసుల నాయుడు (62) భార్య పదేళ్ల క్రితమే మృతిచెందింది. అప్పటి నుంచి తన కుమారుడితో కలసి ఆయన ఉంటున్నాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయితే వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న శ్రీనివాసుల నాయుడు సోమవారం రాత్రి తన పాత ఇంట్లో నిల్వ చేసిన పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత తన స్నేహితుడు సద్దల చంద్రమౌళీశ్వరరెడ్డి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే స్పందించిన ఆయన, శ్రీనివాసులు నాయుడు కుమారుడు మధుసూదన్నాయుడు, బంధువులతో కలసి పాత ఇంటి వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీనివాసుల నాయుడిని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. మధుసూదన్నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
యువకుడి ఆత్మహత్య
కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన బోయ ఈశ్వర్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వర్కి రెండేళ్ల క్రితం డి.హిరేహళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కావేరితో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకునే ఈశ్వర్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయమని భార్య పలుమార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె కుమారుడిని పిలుచుకుని మంగళవారం సాయంత్రం తన పుట్టింటికెళ్లింది. దీంతో అత్తింటి వారు మందలిస్తారేమోననే అనుమానంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు తాము నివాసముంటున్న గుడిసెలోనే ఈశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
చెలరేగిన ‘కేబుల్’ దొంగలు
యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. సరైన చికిత్సతో వంకర పాదాల సమస్య దూరం అనంతపురం మెడికల్: సరైన చికిత్సను అందివ్వడం ద్వారా చిన్నారుల్లో వంకర పాదాల సమస్యను నయం చేయవచ్చునని అమెరికాకు చెందిన క్యూర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ట్రైనర్ డాక్టర్ బ్రూస్స్మిత్ సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థో విభాగాన్ని పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్నారులకు స్వయంగా చికిత్స చేయడంతో పాటు చికిత్స విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వంకరపాదాలతో ఇబ్బంది పడిన 78 మంది పిల్లలకు క్యూర్ ఇండియా సంస్థ తరఫున డీబీ స్ల్పిట్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ సతీష్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు. -
ఉద్యోగులతో బంతాట
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఉన్నతాధికారులు సైతం ఉద్యోగం చేయాలంటే భయపడుతున్నారు. ఎప్పటివరకూ ఉంటామో.. ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. శాఖల హెచ్ఓడీలకే దిక్కులేకుండా పోయిన పరిస్థితి. రాజకీయ జోక్యంతో రాత్రికి రాత్రే బదిలీలు జరుగుతుండటంతో పనిచేయాలంటేనే మనసొప్పడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు తమ పనులు చేయకుంటే మెడపై కత్తి పెట్టి మరీ బదిలీ చేయిస్తున్న దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా కలెక్టర్ పూర్తిగా నిశ్చేష్టులై చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈ బదిలీతో అలజడి.. కూటమి సర్కారు వచ్చేనాటికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు విద్యుత్ శాఖ ఎస్ఈగా సురేంద్ర ఉండేవారు. ఈయనపై రాజకీయ ముద్రవేసి అనంతపురం జిల్లా ఎస్ఈగా తెచ్చారు. మడకశిర ఎమ్మెల్యే రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు సంతకాలు చేసి మరీ ఆయన్ను తీసుకొచ్చారు. అయితే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్కుమార్ నాలుగు నెలలు పని చేశారో లేదో ఉన్నఫళంగా రెండు రోజుల క్రితం బదిలీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్శాఖలో అలజడి మొదలైంది. ఐదుగురు ఎస్పీలు.. కూటమి సర్కారు వచ్చాక జిల్లాకు ఐదుగురు ఎస్పీలు వచ్చి వెళ్లారు. ఎస్పీలపై ఇక్కడి నాయకులు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఉన్న అన్బురాజన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే బదిలీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ బర్దార్, గౌతమి శాలి, మురళీ కృష్ణలు వచ్చిన రెండు మాసాలకే తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుత ఎస్పీ జగదీష్పై కూడా బదిలీ కత్తి వేలాడుతోందని అంటున్నారు. సంతకం చేయకుంటే ఊడినట్లే.. కూటమి ప్రభుత్వంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరీ భ్రష్టు పట్టింది. ఇక్కడ ఐదు నెలల్లో ఐదుగురు కమిషనర్లు మారారు. నేతలు చెప్పిన చోట సంతకం చేయకపోతే మరుసటి రోజే బదిలీ కావాల్సి వస్తోంది. మేఘ స్వరూప్ అనంతరం నాగరాజు, రామలింగేశ్వర్, మల్లికార్జునరెడ్డిలు బదిలీ అయ్యారు. తాజాగా బాలస్వామి వచ్చారు. ఈయన ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి. దీంతో కార్పొరేషన్లో పాలన స్తంభించి పోయింది. రెండు నెలలు తిరక్కముందే ఏఎస్పీపై.. శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ డీఎస్పీగా ఉన్న ఆర్ల శ్రీనివాసులుకు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది.అదే జిల్లాకు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా పనిచేస్తున్న సమయంలో ఉన్నఫళంగా ఆయనకు బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. ఆ జిల్లా ఎస్పీకి నచ్చలేదని అడిషనల్ ఎస్పీని బదిలీ చేయించారనే విమర్శలొస్తున్నాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు ఆరుమాసాల్లో ఐదుగురు ఎస్పీలను మార్చిన వైనం అనంతపురం కార్పొరేషన్లో ఇష్టారాజ్యంగా కమిషనర్ల మార్పు తాజాగా విద్యుత్ శాఖ ఎస్ఈ బదిలీ అటకెక్కిన పాలన -
ముగిసిన రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన మంగళవారం ముగిసాయి. ఆరు పళ్లు, న్యూ కేటగిరి, సీనియర్ విభాగాల్లో జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య జిల్లాలకు చెందిన వృషభాలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగం పోటీల్లో నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నెకు చెందిన రైతు కుందూరు రాంభూపాల్రెడ్డి వృషభాలు మొదటి స్థానం, వైఎస్సార్జిల్లా కల్లూరుకు చెందిన రైతు పెరుమాల్ శివకృష్ణయాదవ్ వృషభాలు రెండవ స్థానం, అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రైతు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి వృషభాలు మూడవ స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు ప్రోత్సాహాకాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ అందజేశారు. అలాగే సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వృషభాల యజమానికి ఓ పాడి ఆవును రైతులు రమేష్రెడ్డి, చిలుకూరు కుమార్రెడ్డి బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు చిన్నరెడ్డి యాదవ్, రంగస్వామిరెడ్డి యాదవ్, లక్ష్మీరంగయ్య పాల్గొన్నారు. -
ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు కొన్ని...
జిల్లా అంతటా మంగళవారం చలి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ● అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్ మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ●● గార్లదిన్నె సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాల ఆవరణలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ● ఇటీవల సోములదొడ్డి సమీపంలో శ్రీచైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. వారం తర్వాత తిరుమలలో ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ● రెండేళ్ల క్రితం భవ్యశ్రీ అనే ఇంటర్ విద్యార్థిని అనంతపురం నగరంలోని నారాయణ క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి దూకింది. సుదీర్ఘకాలం చికిత్స పొంది అదృష్టవశాత్తూ మృత్యువు నుంచి బయటపడింది. -
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరి అరెస్ట్
ఉరవకొండ: వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మంగళవారం ఉరవకొండ పీఎస్లో ఏర్పాఉట చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్ఐ జనార్దననాయుడు వెల్లడించారు. స్థానిక కుమ్మర వీధిలో నివాసముంటున్న కిషోర్కుమార్ (39), దాసరి కేదార్నాథ్, కమ్మరి హరికృష్ణ, మరో ఇద్దరు స్నేహితులు. ముగ్గురూ కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు. ఈ క్రమంలో రూ.9 లక్షల వరకూ నష్టపోయారు. దీంతో కిషోర్కుమార్ ప్రమేయం వల్లనే తాము నష్టపోయామని, ఆన్లైన్ బెట్టింగ్లో పొగొట్టుకున్న డబ్బు మొత్తాన్ని చెల్లించాల్సిందేనంటూ కొంత కాలంగా నలుగురు స్నేహితులూ తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద గొడవ చేసి మాటలతో హింసించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్కుమార్ ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం ఉరవకొండ శివారున కేదార్నాథ్, హరికృష్ణను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బరువెక్కిన గుండెతో వలసబాట
గుంతకల్లు రూరల్: మండలంలోని మొలకలపెంట గ్రామస్తులు ఒకరి తరువాత మరొకరు వలస బాట పడుతున్నారు. ఉపాధి పనులు కల్పించి ఆదుకోవా ల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో నిస్సహాయ స్థితిలో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. 604 కుటుంబాలు, 2 వేలకు పైగా జనాభా ఉన్న మొలకలపెంట గ్రామంలో ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావం, వరుస తుపాన్ల కారణంగా ఖరీఫ్, రబీ పంటలు తుడిచి పెట్టుకు పోయాయి. కనీసం పెట్టుబడి కూడా చేతికి అందకపోవడంతో రైతన్నలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తినడానికి తిండి గింజలు కూడా లేక పూట గడవని స్థితిలో పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. ఉపాధి ఊసేలేదు.. 421 జాబ్ కార్డులు, 796 మంది కూలీలు ఉన్న మొలకలపెంట గ్రామంలో ఇప్పటివరకూ ఉపాధి పనులు ప్రారంభించనే లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఫీల్డ్ అసిస్టెంట్ల ను బలవంతంగా తొలగించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మొలకలపెంట ఫీల్డ్ అసిస్టెంట్కు ఉద్వాసన పలికిన అధికారులు.. కొత్త వారిని నియమించలేదు. దీంతో గ్రామంలో ఇప్పటి వరకూ ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. ఈ ఒక్కటే కాదు.. గుంతకల్లు మండలంలోని మరో 7 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటివరకూ జరగలేదు. దీంతో పనులు దొరక్క గ్రామీణులు వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది. మొలకలపెంట వ్యథ గ్రామంలో ఇప్పటికే వందకు పైగా ఇళ్లకు తాళాలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
రోగులకు నాణ్యమైన సేవలందాలి
● వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ అనంతపురం మెడికల్: రోగులకు నాణ్యమైన సేవలందించాలని సంబంధిత అధికారులను వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన అనంతపురంలోని ఆదిమూర్తినగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రుద్రంపేటలోని విలేజ్ హెల్త్ క్లినిక్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ విధానానికి సంబంధించిన రిపోర్టులు, ఓపీ సేవల వివరాలు, మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల అమలుపై సిబ్బందితో సమీక్షించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డీఐఓ డాక్టర్ యుగంధర్, ఎన్హెచ్ఎం కిషోర్, ఫణి ఉన్నారు. అమ్మలా లాలిస్తూ అక్షరాలు నేర్పండి కూడేరు: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను అమ్మలా లాలిస్తూ అక్షరాలు, మంచి నడవడిక నేర్పుతూ వారి ఉజ్వల భవితకు పునాదులు వేయాలని కార్యకర్తలకు అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పిలుపునిచ్చారు. ‘పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం(ఎఫ్ఎల్ఎన్)’ కార్యక్రమం అమలుపై అంగన్వాడీ కార్యకర్తలకు కూడేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణా తరగతులను మంగళవారం డీఈఓ ప్రసాద్బాబుతో కలసి ఆమె ప్రారంభించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్(ఎస్ఎస్ఏ ఏపీసీ) శైలజ, ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ హాజరయ్యారు. వినూత్న మాట్లాడుతూ.. అంగన్వాడీ స్థాయిలోనే పిల్లలకు చదువులపై ఆసక్తి పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లల పోషణపై అలసత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఏసీడీపీఓ యల్లమ్మ, ఎంఈఓలు–1, 2 మహమ్మద్ గౌస్, సాయికృష్ణ, సూపర్ వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాయితీతో మామిడి ఫ్రూట్ కవర్లు
● హెక్టారుకు రూ.10 వేలు ప్రోత్సాహం అనంతపురం అగ్రికల్చర్: మామిడిలో నాణ్యమైన దిగుబడుల కోసం రైతులకు ప్రోత్సాహక రాయితీలు అందించనున్నట్లు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాయలు మంచి పండ్లుగా తయారవడానికి వీలుగా రాయితీతో రక్షణ కవచం (ఫ్రూట్ కవర్) రాయితీతో ఇస్తామన్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా 50 శాతం రాయితీతో గరిష్టంగా ఒక హెక్టారుకు రూ.10 వేల వరకు రాయితీ వర్తింపజేస్తామన్నారు. కాయలు కోడిగుడ్డు సైజులో ఉన్నపుడు కవర్లు చుట్టాలన్నారు. గాలి చొరబడకుండా తొడిమ వరకు కట్టాలన్నారు. దీంతో ఊజీ ఈగ, తేనెమంచు పురుగు, మచ్చలు, తామర పురుగుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అధిక సూర్యరశ్మి, వడగండ్ల వాన నుంచి కూడా కాపాడుకోవచ్చన్నారు. తొడిమ కూడా దృఢంగా తయారై మంచి సైజు వస్తుందన్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఉద్యానశాఖ అధికారులు లేదా రైతు భరోసా కేంద్రాల అసిస్టెంట్లను సంప్రదించాలన్నారు. సుదర్శనరావుకే వీసీ బాధ్యతలు అనంతపురం: ఇన్చార్జ్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావుకే ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు కట్టబెట్టింది. జేఎన్టీయూ (ఏ) నూతన వీసీగా ఆయనను నియమిస్తూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ సుదర్శనరావు జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాలలోనే బీటెక్ పూర్తి చేశారు. ఇక్కడే చదివి అత్యున్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం దక్కడం గమనార్హం. గతంలో జేఎన్టీయూ అనంతపురంలో మూడున్నర సంవత్సరాలు ఆయన రెక్టార్గా పనిచేశారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు పుట్లూరు: రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మండలంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ వినోద్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరేపల్లి రెవెన్యూ గ్రామ 167 ఎల్పీఎం నంబర్లో 6.04 ఎకరాలు జాయింట్గా నమోదు కావడంతో రైతులు సబ్డివిజన్ చేయాలని ఇటీవల వినతి పత్రం అందించారన్నారు. తహసీల్దార్ శేషారెడ్డి, సర్వేయర్లు రైతులకు నోటీసులు అందించి హద్దులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మండలంలోని అరకటివేముల గ్రామ సచివాలయం నుంచి జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు రోజూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలన్నారు. హౌస్హోల్డ్ మిస్సింగ్ సిటిజన్ ప్రక్రియను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. 24న ‘పీఎం కిసాన్’! అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ కింద ఈనెల 24న రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.2 వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జూన్, అక్టోబర్, జనవరిలో విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఏటా రూ.6 వేల ప్రకారం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కాస్త ఆలస్యంగా ఫిబ్రవరిలో మూడో విడతగా 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.58 కోట్లు విడుదల కావొచ్చని చెబుతున్నారు. మొదటి రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో మరికొందరు రైతులు ‘పీఎం కిసాన్’కు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. -
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ‘గురుకుల’ విద్యార్థులు
బుక్కరాయసముద్రం: ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బీకేఎస్ మండలం కొర్రపాడులో ఉన్న ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. లాంగ్జంప్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి ఇందు, 6వ తరగతి విద్యార్థి నవ్యశ్రీ వెండి పతకాలు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, పీఈటీలు వరలక్ష్మి , తేజస్విని, హేమ, శ్యామలమ్మ అభినందించారు. కాలువలో పడి విద్యార్థి మృతి గుమ్మఘట్ట: ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలోని నీటి ప్రవాహంలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... బేలోడుకు చెందిన అన్నపూర్ణకు 11 సంవత్సరాల క్రితం గలగల గ్రామానికి చెందిన లోకేష్తో వివాహమైంది. అనారోగ్యంతో 2020లో అన్నపూర్త మృతి చెందింది. అప్పటి నుంచి వారి కుమారుడు జాని పోషణను అమ్మమ్మ హనుమక్క, తాత హనుమప్ప తీసుకున్నారు. ప్రస్తుతం జాని (7) బేలోడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన జాని.. మధా్య్హ్నం తోటి స్నేహితుడు లక్కీతో కలసి గ్రామ సమీపంలోని బీటీపీ సాగునీటి కాలువ వద్దకెళ్లాడు. అప్పటికే సిద్దంగా ఉంచుకున్న గాలాన్ని తీసి కాలువలో వేసే క్రమంలో జాని ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో లక్కీ కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకుని జానీని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు గుంతకల్లు టౌన్: ధర్మరక్ష వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్లు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్లో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. మత ప్రబోధకుల్లో 90 శాతం మంది సరిగా లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నినదిస్తే హైదరాబాద్లోని ఒవైసీతో పాటు ఇతరులకు వణుకు పుట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రతిచోటా హిందుత్వానికి శత్రువులు ఎక్కువయ్యారని, సెక్యులర్ వాదులను తాను శిఖండీలుగా అభివర్ణిస్తున్నానని అన్నారు. -
జిల్లాలో బర్డ్ ప్లూ లేదు
వదంతులను నమ్మొద్దు. ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడే గాని బర్డ్ఫ్లూ ప్రభావం లేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మండలానికి రెండు చొప్పున ఆర్ఆర్టీంలు ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ భయం వెన్నాడుతుంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ అస్సలు తినొద్దు. గ్రిల్డ్ చికెన్, ఉడికీ ఉడకని చికెన్ తినొద్దు. చికెన్ను 160 ఫారెన్ హీట్ వేడిలో వండుకుని తింటే మంచిది. – సుబ్బారెడ్డి, వెటర్నరీ డాక్టర్, తాడిపత్రి -
చికెన్ కర్రీస్ కాదు.. బర్డ్ఫ్లూ వైరస్ వర్రీనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో బర్డ్ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై పశుసంవర్దక శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. దీంతో కోడి మాంసం కొనుగోలుదారులు లేక జిల్ల
తాడిపత్రి రూరల్: జిల్లాలోని చికెన్ సెంటర్లపై బర్డ్ ప్లూ ప్రభావం పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వ్యాపించి లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. జిల్లాలో బర్డ్ ప్లూ ప్రభావం లేదని పశు సంవర్దక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం భయం వీడడం లేదు. చికెన్ తిని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అనే ధోరణి సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో కొనుగోలుదారులు లేక చికెన్ సెంటర్లు వెలవెలపోతున్నాయి. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేపట్టిన వారు ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. కర్ణాటక నుంచే దిగుమతి జిల్లాలోని కంబదూరు, కళ్యాణదుర్గం, కుందుర్పి, పామిడి తదితర ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించింది. పేరొందిన వెంకోబ్, సుగుణ,స్నేహ, లోటస్ తదితర కంపెనీలు ఆయా ప్రాంతాల్లో రైతులకు కోడి పిల్లలను పంపిణీ చేసి పెంపకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకూ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ నుంచే మిగిలిన ప్రాంతాలకు కోళ్లు సరఫరా అయ్యేవి. బర్డ్ఫ్లూ ప్రభావం కారణంగా ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలోని బెంగళూరు, పావగడ, చిక్కబళ్లాపూర్, దొడ్డబళ్లాపురం, చిత్రదుర్గ ప్రాంతల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. నెలకు 20 లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జిల్లా వ్యాఫ్తంగా 1,500 నుంచి 2వేల వరకు చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఆయా చికెన్ సెంటర్ల నుంచి నెలకు 20లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతుండేవి. పండుగలు, ఇతర శుభ కార్యాల్లో దీనికి అదనంగా విక్రయాలు సాగేవి. వందల సంఖ్యలో కుటుంబాలు చికెన్ కబాబ్ బండ్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాయి. దాదాపు 10వేల మందికి పైగా స్థానికులు, స్థానికేతరులు నెలసరి జీతాలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం బర్డ్ ప్లూ ప్రభావంతో వీరి జీవనం దుర్భరంగా మారింది. సగానికి పైగా వ్యాపారం పడిపోవడంతో చికెన్ విక్రేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ల నిర్వహణకు తీసుకున్న గదులకు సంబంధించి అద్దెలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అద్దెలు, కార్మికులు, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పశు సంవర్దక శాఖ అప్రమత్తత జిల్లాల్లో బర్డ్ ప్లూపై పశుసంవర్దక శాఖ అప్రమత్తంగా ఉంది. కోస్తా ప్రాంతంలో కనిపించిన బర్డ్ ప్లూ వైరస్ జిల్లాను తాకకుండా ప్రతి మండలానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ఆర్టీ)ను ఏర్పాటు చేసింది. ఇందులో వెటర్నరీ డాక్టర్తో పాటు నలుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ బృందాలు పౌల్ట్రీ పరిశ్రమలను పరిశీలించి కోళ్లకు వైద్యపరీక్షలు నిర్వహిస్తాయి. అనుమానిత కోళ్ల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ సేల్స్ ఢమాల్ సగానికి పైగా తగ్గిన వ్యాపారం కొనుగోలుదారులు లేక చికెన్ సెంటర్ల వెలవెల ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు -
వివాహిత దుర్మరణం
కణేకల్లు: ద్విచక్ర వాహనంఅదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ, అనసూయమ్మ (38) దంపతులు. మంగళవారం ఉదయం బొమ్మనహళ్ మండలంలోని కృష్ణాపురంలో జరిగిన బంధువుల పెళ్లికి తన భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై సత్యనారాయణ వెళ్లాడు. అనంతరం రాయదుర్గం మండలంలోని కదరంపల్లిలో ఉన్న అత్తారింటికి బయలుదేరాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కణేకల్లు క్రాస్లోని ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సాయీశ్వరా.. మముబ్రోవరా
ప్రశాంతి నిలయం: సాయీశ్వర నామంతో ప్రశాంతి నిలయం మార్మోగింది. సత్యసాయి.. ఈశ్వరుడి ప్రతిరూపమంటూ కీర్తించారు. సాయీశ్వరా...మముబ్రోవరా అంటూ వేడుకున్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో చేపట్టిన అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా నార్త్ బిల్డింగ్స్ మైదానంలో చేపట్టిన అష్టోత్తర శత సహస్త్ర సాయీశ్వర లింగార్చన ఘట్టం మంగళవారం ముగిసింది. చివరి రోజు లింగార్చనలో పాల్గొన్న భక్తులు ప్రత్యేకంగా రూపొందించిన సాయీశ్వర లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు దంపతులు సాయీశ్వరునికి పూజలు నిర్వహించారు. ఇక అతిరుద్ర మహాయజ్ఞం 6వ రోజు మంగళవారమూ కొనసాగింది. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణ మధ్య యజ్ఞ క్రతువు నిర్వహించారు. సాయంత్రం ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు సంబుద్దా ఛటర్జీ బృందం సంగీత కచేరీ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతిష్య శాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ ఎస్.మురళీ భక్తులనుద్దేశించి ప్రసంగించారు. -
జవాన్కు కన్నీటి వీడ్కోలు
బ్రహసముద్రం : బీఎస్ఎఫ్ జవాన్ వడ్డే లక్ష్మన్నకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్మీ సిబ్బంది కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఢిల్లీ సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన వడ్డే లక్ష్మన్న (33) భౌతికకాయం ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామం బ్రహ్మసముద్రానికి అధికారులు తీసుకువచ్చారు. కుమారుడిని చూసి తల్లిదండ్రులు సుశీలమ్మ, రామచంద్రప్ప గుండెలవిసేలా రోదించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఉదయం జవాన్ భౌతికాయాన్ని ప్రతేక వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. వందలాది మంది అభిమానుల మధ్య ‘వీరుడా... నీకు వందనం.. అమరుడా లక్ష్మన్నా నీకు వందనం’ అంటూ ఆర్మీ అధికారులు నినదించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జైజవాన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పశువైద్యశాల సమీపాన శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఎస్ఐ మాధవ్రావ్, హెడ్కానిస్టేబుల్ మాంతేష్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు కవాతు నిర్వహించారు. జవాన్ భౌతికకాయంపై ఉన్న జాతీయ జెండాను వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం కుటుంబ సభ్యుల కడసారి వీడ్కోలు అనంతరం ఆర్మీ అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యక్రమంలో సీఐ నీలకంఠేశ్వర్ , తహశీల్దార్ సుమతి, ఎస్ ఐ నారేంద్రకుమార్ , ఆర్ ఐ నాగిరెడ్డి, ఎంపీడీఓ నందకిశోర్, ఎంఈఓ ఓబుళపతి, క్రిష్ణానాయక్, ఎంపీపీ చంద్రశేకర్ రెడ్డి జెడ్పీటీసీ ప్రభవతి రాజకీయ పార్టీల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి
అనంతపురం అర్బన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (ఎంవీఆర్పీఎస్), రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం (ఆర్వీఎస్ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న, ఆర్వీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. వాల్మీకి/ బోయల చరిత్ర చాలా గొప్పదన్నారు. పురాతన పద్ధతులు, సంస్కృతి కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామన్నారు. అటవీ చట్టాల కారణంగా బోయలు అడవిని వదిలి జీవనోపాధికి మైదాన ప్రాంతాల్లోకి వలస వచ్చారన్నారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో వాల్మీకి/ బోయలు ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. మిగిలిన జిల్లాల్లో కోస్తా, ముఖ్యంగా రాయలసీమ జిలాల్లో వాల్మీకులు/ బోయలుగా బీసీలుగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఇది తమ జాతి అభివృద్ధికి గొడ్డలిపెట్టని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.జి.నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి దేవాదుల గోపాల్, ఆర్వీఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్లపల్లి మోహన్, స్వర్ణక్క, శివప్రసాద్, సురేభాష్, నాయ్యవాది చంద్రాచర్ల హరి, తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోని ప్రభుత్వం
అనంతపురం అర్బన్: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. రబీలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని, మిరప, పత్తి, పప్పుశనగ, విత్తన జొన్నకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పంట ఉత్పత్తులతో రైతులతో కలిసి ధర్నా చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఖరీఫ్, రబీలో పండించిన మిరప, పత్తి, సీడ్ జొన్న, పప్పుశనగ పంటలకు గిట్టుబాటు ధరలేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో దాదాపు 57 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఎకరాకు దిగుబడి రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా రాలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మద్దతు ధర క్వింటాలు రూ.5,560ను రూ.10 వేలకు పెంచి కొనుగోలు చేయాలన్నారు. పత్తి పంట మద్దతు ధర రూ.7,250 నుంచి రూ.10 వేలకు పెంచి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. విత్తన జొన్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో దళారుల జోక్యం లేకుండా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిరపకు గిట్టుబాటు ధర కింటాలుకు రూ.50 వేలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ధర్నా వద్దకు విచ్చేసిన కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేసి రైతుల పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, ఉపాధ్యక్షులు శివారెడ్డి, బీహె చ్ రాయుడు, మధుసూదన్, నాయకులు పొతులయ్య, వెంకటేష్, ఈరప్ప, నారాయణరెడ్డి, నాగమ్మ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శుల ధ్వజం గిట్టుబాటు ధర, పరిహారం కోసం డిమాండ్ కలెక్టరేట్ ఎదుట పంట ఉత్పత్తులతో ధర్నా -
సకాలంలో పరిష్కారం చూపాలి
అనంతపురం: మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కారం చూపాలని ఎస్పీ పి.జగదీష్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్పీ 80 అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా శేషాద్రి శేఖర్ అనంతపురం టౌన్: విద్యుత్ శాఖ ఎస్ఈగా శేషాద్రి శేఖర్ను నియమిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణదుర్గం ఈఈగా పనిచేస్తున్న శేషాద్రిశేఖర్కు ఎస్ఈగా పదోన్నతి కల్పించారు. దీంతో సాయంత్రమే ఆయన ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఈ సంపత్ కుమార్ను కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎంగా బదిలీ చేశారు. -
మహిళలకు రక్షణ కరువు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖ్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ధ్వజమెత్తారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలో యువతిపై హత్యాయత్నం, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల బాత్రూమ్లో బిహార్ యువకులు తొంగిచూసిన ఘటన కూటమి మంత్రి వర్గానికి కన్పించలేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు అండగా నిలుస్తామన్న పవన్ కళ్యాణ్ పూజలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, విద్యార్థి విభాగం నాయకులు భారతి, నరేష్, మహేశ్వరి, శేఖర్, భాను, అనిత, చందు, రాజేష్, సూర్య, రమేష్, అరుణ్యాదవ్, కరుణాకర్, శివ, శశికళ, పాల్గొన్నారు. ● వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నేతల ధ్వజం -
యూట్యూబ్ చానల్ విలేకరి అదృశ్యం
గుంతకల్లు రూరల్: ఇంటి నుంచి పొలానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన యూట్యూబ్ చానల్ విలేకరి బి.తిరుమలరెడ్డి (45) బుగ్గ సంగాల వద్ద అదృశ్యమయ్యాడు. సంఘటన స్థలంలోనే మొబైల్, చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బైక్పై బండరాళ్లతో దాడిచేసి ఆనవాళ్లు ఉన్నాయి. ఎవరో పథకం ప్రకారం దాడిచేసి.. కిడ్నాప్ చేశారా.. లేక హత్య చేసి కాలువలో ఏమైనా పడేశారా అన్నది తెలియడం లేదు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన బి.వెంకటరెడ్డి కుమారుడైన బి.తిరుమలరెడ్డి కొన్నేళ్లుగా గుంతకల్లుకు వచ్చి నివాసముంటున్నాడు. బుగ్గ సంగమేశ్వర ఆలయ సమీపంలో తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తండ్రి పేరున బీవీఆర్ అనే యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య కామేశ్వరి, అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న కూతురు మోనా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బావమరిదిని చూసేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లిన తిరుమలరెడ్డి ఆదివారం సాయంత్రం తిరిగి గుంతకల్లుకు చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి పొలానికి పల్సర్ బైక్పై బయల్దేరాడు. అయితే మరో ఐదు నిమిషాల్లో పొలానికి చేరుకుంటాడనగా అదృశ్యం అయ్యాడు. బుగ్గ సంగాల వద్ద బండరాళ్లతో బైక్ను ధ్వంసం చేసి ఉంది. సమీపంలోనే చెప్పులు, మొబైల్ చెల్లాచెదురుగా పడ్డాయి. అటుగా వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు మద్దికెర, ఇటు గుంతకల్లు నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాస్, గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి తన సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. సంఘటన స్థలం నుంచి గుట్ట వరకూ వెళ్లి అటు నుంచి పక్కనే ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్ద ఆగిపోయింది. తిరుమలరెడ్డిని చంపి కాలువలో పడేశారా లేక, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా.. దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఏమైనా కాలువలో పడిపోయాడా.. ఇంకేమైనా జరిగిందా.. తిరుమలరెడ్డికి ప్రత్యర్థులు ఎవరు ఉన్నారు.. అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై బండరాళ్లతో దాడి సంఘటన స్థలంలో దాడి చేసిన ఆనవాళ్లు కాలువ వరకు వెళ్లి ఆగిన పోలీసు జాగిలం -
మందకొడిగా రైతు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: ఆధార్ నంబర్ మాదిరిగా రైతులకు ఐడీ నంబర్లు కేటాయించేందుకు చేపడుతున్న రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే, కనీక సదుపాయాలు కల్పించకుండానే రంగంలోకి దించడంతో సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది. నాలుగు రోజులుగా అగ్రీ స్టాక్ యాప్లో రైతుల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. అయితే యాప్లో నెలకొన్న సాంకేతిక కారణాల వల్ల డీ–పట్టా భూములు కలిగిన రైతులకు, ఒకే సర్వే నంబరుతో ఇద్దరు, ముగ్గురికి భూములు కలిగిన వారికి ఐడీ నంబరు కేటాయింపు జరగడం లేదని సమాచారం. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. వీరందరికీ ఐడీ నంబరు లేకుండా మున్ముందు ప్రభుత్వ పథకాల వర్తింపులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పంట నమోదు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఎంఎస్పీ అమ్మకాలు తదితర అన్ని రకాల పథకాలు వర్తించాలంటే రైతుకు తప్పనిసరిగా ప్రత్యేక ఐడీ నంబరు ఉండాలని షరతు విధించడంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ కింద రిజిస్టర్ అయిన 2.79 లక్షల రైతుల అకౌంట్ల ఆధారంగా ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. నెలాఖరుకు 40 శాతం పూర్తీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికి 32 వేల మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గుంతకల్లు, తాడిపత్రి, కణేకల్లు, పెద్దవడుగూరు, గుత్తి మండలాల్లో మాత్రమే 2 వేలకు పైగా పూర్తి కాగా... కుందుర్పి, వజ్రకరూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, శింగనమల తదితర మండలాల్లో ఇంకా 200 నుంచి 400 మంది రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. -
మాముడూరులో ఇరువర్గాల ఘర్షణ
గుత్తి రూరల్: మాముడూరులో గొర్రె పిల్లలను ఉంచే జాలరీ విషయంలో సోమవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనిల్కుమార్లకు తమ ఇంటి సమీపంలో ఉండే రవి, చౌడప్ప, ఎల్లప్ప, రామాంజనేయులు, పెద్దయ్యలతో గత కొన్ని నెలలుగా భూమి విషయంలో వివాదం ఉంది. పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ క్రమంలో గ్రామ శివారులో గొర్రె పిల్లలను ఉంచే జాలరీల ఏర్పాటు విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిలో అనీల్కుమార్, తల్లి వరలక్ష్మి గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శతాధిక వృద్ధుడు కన్నుమూత రాయదుర్గంటౌన్: పట్టణానికి చెందిన మున్సిపల్ విశ్రాంత ఉద్యోగి ఎస్.అమీరుద్దీన్సాబ్ (104) అనారోగ్యంతో సోమవారం ఉదయం 6.30 గంటలకు చనిపోయారు. ఈయన భార్య 40 ఏళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గుకు కుమార్తెలు ఉన్నారు. సాయంత్రం బళ్లారి రోడ్డులోని ఖబర్స్థాన్లో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుమారుడు మెహబూబ్బాషా తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి 15 గొర్రెలు మృతి శెట్టూరు: విద్యుత్ తీగలు తెగి మందపై పడటంతో అందులో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన మల్లేటిపురంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కురుబ గోవిందప్ప సుమారు 100 గొర్రెలతో తన పొలంలేనే మంద ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం రాత్రి మంద వద్దే నిద్రించాడు. గొర్రెల మంద నిద్రిస్తున్న స్థలం వద్దే విద్యుత్ మెయిన్లైన్ ఉంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడుగంట సమయంలో విద్యుత్తీగ తెగి గొర్రెల మందపై పడింది. మెరుపుతో కూడిన శబ్దం రావడంతో రైతు ఉలిక్కిపడి లేచాడు. రైతు వెంటనే లైన్మెన్కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. విద్యుత్షాక్కు గురికాంకుండా జాగ్రతపడి గొర్రెలను మందనుంచి బయటకి తీశాడు. అయితే అప్పటకే 15 గొర్రెలు మృతి చెందాయి. విద్యుత్ వైర్లు పాతబడటం వల్లే తెగిపోయాయని గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్ వెంకటేశులు, ఎంపీటీసీ ప్రహ్ల్దా, వైఎస్సార్సీపీ నాయకులు కిష్టప్ప, సిద్దలిగంప్ప, గ్రామస్తులు రైతును పరామర్శించారు. వివాహితపై అత్యాచారయత్నం తాడిపత్రి రూరల్: బొడాయిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన ఓ వివాహితపై బంధువైన అంకన్న అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితురాలు ఇంట్లో జరిగిన విషయం తెలిపింది. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు అంకన్నపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కాటమయ్య తెలిపారు. -
ఉపాధి పనుల్లో భారీగా అక్రమాలు
రాయదుర్గం: కూటమి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ పథకం కూలీలకు కాకుండా కూటమిలోని కొందరు కాంట్రాక్టర్లకు వరంగా మారిందన్నారు. సోమవారం రాయదుర్గంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన ఆయన జిల్లాలోని పలు మండలాల ఎంపీపీలు, సర్పంచులతో కలసి కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో రవీంద్రారెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ చెప్పిన వారికి ఉపాధి పనులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కూలీలతో కాకుండా ఉపాధి పనులను కాంట్రాక్టర్లకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. ఉపాధి పనులు జరిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన నేమ్బోర్టుల బిల్లుల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందించారు. నేమ్బోర్డుల నిధులు తమ బందువుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజినేయులు, స్థానిక నాయకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూలీలకు కాకుండా కాంట్రాక్టర్తో పనులు ఎలా చేయిస్తారు? -
సాత్వికాహారమే ఆరోగ్య రహస్యం..
కళ్యాణదుర్గం: ఆయనో విశ్రాంత ఉపాధ్యాయుడు. పెన్షన్ కోసం ఏటా సమర్పించే లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని కళ్యాణదుర్గం సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చారు. ఎంతో చలకీగా కనిపించిన ఆయన్ను చూసి తోటి రిటైర్డు ఉద్యోగులు మల్లికార్జున, తిప్పేస్వామి, హంపన్న, అంజినప్ప, మారెన్న, విశ్వనాథ్, భగవాన్ దాస్ తదితరులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ మాస్టారు పేరు బండయ్య. 103 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యకరంగా ఉన్న ఆయన్ను పెన్షనర్ భవనంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండయ్య విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘానికి తన వంతుగా రూ.5 వేల విరాళం అందజేశారు. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చెందిన బండయ్య మాస్టారు 1922 జూలై 10న జన్మించారు. నాలుగో తరగతి వరకు చదివి జ్యోతిష్యం నేర్చుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన చూసి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. తొలి నెల జీతం రూ.30.10 పైసలు. 1978లో ఉద్యోగ విరమణ పొందే నాటికి జీతం రూ.90. ప్రస్తుతం ప్రతి నెలా రూ.26 వేల పెన్షన్ అందుకుంటున్నారు. బండయ్య మాస్టారు ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామం పొబ్బర్లపల్లిలో వ్యవసాయంపై దృష్టి సారించారు. సేంద్రియ వ్యవసాయం, పంట మార్పిడితో ఆదర్శ రైతుగా రాణించారు. కొత్త రకం వంగడాలు పరిచయం చేస్తూ గ్రామంలోని రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. శ్రీశైలంలో సదాశివయ్య అన్న సత్రం చైర్మన్గా పనిచేశారు. పలుచోట్ల విరాళాలు సేకరించి నిత్యాన్నదాన సత్రాన్ని విజయవంతంగా నడిపారు 103 ఏళ్లలోనూ చలాకీగా.. విశ్రాంత ఉపాధ్యాడికి ఘన సన్మానం వ్యవసాయం, జ్యోతిష్యంలో అపార అనుభవం ఆదర్శ రైతుగా రాణింపు.. ఉద్యోగ ప్రస్థానం... బండయ్య మాస్టారు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం రెండు పూటల స్నానం చేస్తూ.. సాత్విక ఆహారం, మజ్జిగ, పాలు స్వీకరిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధులకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వయసు రీత్యా కంటి చూపు మందగించింది. ఈయన భార్య శివలింగమ్మ నాలుగేళ్ల క్రితం మరణించింది. ఇక ఏడుగురు సంతానంలో ఒకరు మృతి చెందారు. మిగిలిన ఆరుగురు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో కుమారుడు గౌరీ శంకర్తో కలిసి మాస్టారు ఉంటున్నారు. -
గడిచిన ఆరు మాసాల్లో అధికారులకు అందిన వినతులు ఇలా....
తప్పుడు రిజిస్ట్రేషన్లు 471పంజరంలో చిలుకలా అధికారులు ● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టని మైనింగ్ అధికారులు ● రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ‘పచ్చ’ పెత్తనం సాగుతున్నా ఉన్నతాధికారుల మీనమేషాలు ● మండలాల్లో డమ్మీలుగా మారిన తహసీల్దార్లు ● ఎమ్మెల్యేల ఆగడాలపై నోరెత్తే పరిస్థితి లేదని పలువురి ఆవేదన సాక్షి ప్రతినిధి, అనంతపురం: భూకబ్జాలు, బెదిరింపులు, దొంగతనాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. సహజ వనరులు దోపిడీకి గురవుతున్నా కన్నెత్తి చూడలేని పరిస్థితిలో అధికారులున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం అక్రమంగా తరలించిన వారిపై ఉక్కుపాదం మోపారు. కానీ ఇప్పుడు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదు. మట్టి, ఇసుక, కంకర వంటివన్నీ జిల్లా దాటి ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయి. మైనింగ్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు డమ్మీలుగా మారారు. పంజరంలో చిలుకలా చూస్తూ ఉండిపోతున్నారు తప్ప చర్యలకు సాహసించడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు పాలేరు పనిచేస్తున్నట్టుందని ఓ తహసీల్దార్ వాపోయారు. ఏరీ మైనింగ్ అధికారులు..? చాలా పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఇప్పుడా కేసుల్లో మైనింగ్ అధికారులను కూడా చేర్చాలని జనంలో చర్చ జరుగుతోంది. తాడిపత్రిలో పెన్నానదిని లూటీ చేస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. రాప్తాడు నియోజకవర్గంలో ఎర్రమట్టిని వందల లోడ్లు తరలిస్తున్నప్పటికీ వాటివైపు చూడటం లేదు. శింగనమల నియోజకవర్గంలో ఏకంగా గ్రామస్తులు ట్రాక్టర్లకు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. గార్లదిన్నె, కూడేరు, ఆత్మకూరు మండలాల్లో జరుగుతున్న మట్టి దోపిడీపై మైనింగ్ అధికారులు చూసిన పాపాన పోలేదు. వినతిపత్రాలు.. బుట్టదాఖలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా భూకబ్జాల కేసులు రోజువారీ అయ్యాయి. కలెక్టర్ ఏ నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించినా భూకబ్జా బాధితులే ఎక్కువగా వస్తున్నారు. అనంతపురం రూరల్ పరిధిలో ఓ వ్యక్తి 50 ఏళ్ల కిందట కొన్న భూముల చుట్టూ టీడీపీ గూండాలు బౌండరీలు వేసి మరీ ఆక్రమించుకుంటున్న పరిస్థితి. రాయదుర్గం పట్టణంలో రోజూ సగటున రెండు భూకబ్జాల కేసులు నమోదవుతున్నాయి. అనంతపురం, గుత్తి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. స్థానికంగా తహసీల్దార్లకు బాధితులు వినతిపత్రాలు ఇస్తుంటే అవి బుట్టదాఖలవుతున్నాయి. చివరకు కలెక్టర్కు ఇచ్చినా ఆయన కూడా వీసమెత్తు న్యాయం చేయలేక పోతున్నారు. సబ్రిజిస్ట్రార్లు బిక్కుబిక్కు.. ఏ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలో.. దేన్ని చేయకూడదో సబ్రిజిస్ట్రార్లకు తెలుసు. కానీ ఇప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తున్నారు. ఇటీవల తాడిపత్రిలో టీడీపీ నాయకుడి ఆదేశాల మేరకు మూడు రోజులు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రాప్తాడులో పెద్ద రిజిస్ట్రేషన్లు తమకు తెలియకుండా చేస్తే ఇంటికెళతావని సబ్రిజిస్ట్రార్ను టీడీపీ నేతలు బెదిరించారు. దీంతో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాలన్న భయం బాధితులను వెంటాడుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఇక్కడ డీఐజీ స్థాయి అధికారి ఉన్నా ఏమీ అనలేని దుస్థితి నెలకొంది. ఐపీఎస్ అధికారిని వేసినా.. భూకబ్జాలు 2,145బెదిరింపులు, తదితరాలు 266మట్టి, ఇసుక అక్రమ రవాణా 1,461తాడిపత్రిలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి, మట్కాకు అడ్డుకట్ట వేయాలని ఇటీవల ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరిని ఏఎస్పీగా పంపారు. కానీ ఆయన మాత్రం తన ఆఫీసుకే పరిమితమయ్యారనే విమర్శలున్నాయి.. స్థానిక టీడీపీ నేతల ఒత్తిడి మేరకు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ తాడిపత్రిలో గంజాయి, మట్కా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇంతదానికి ఇక్కడికి ఓ సీఐని వేస్తే సరిపోతుంది కదా అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
అనంతపురం సెంట్రల్: తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంతపురం శారదానగర్లోని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీల జీతాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశాన్నీ యాప్లలో చేయమని చెబుతుండటంతో అంగన్వాడీలపై తీవ్ర పనిభారం పడుతోందని వాపోయారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడంతో పాటు వర్కర్లకు సెలవులు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 26 వేలు అందించాలని కోరారు. హెల్పర్ పదోన్నతులకు నిర్దిష్ట గైడ్లైన్స్ రూపొందించాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి దహన సంస్కారాలకు రూ. 20 వేలతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న అద్దెలు, టీఏ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ రూరల్ ప్రాజెక్టు అధ్యక్షురాలు అరుణ, అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నక్షత్ర, రేవతి, సీఐటీయూ నగర కార్యదర్శి ముత్తూజ, సీఐటీయూ ఉపాధ్యక్షులు రామాంజనేయులు, పలువురు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. సర్కారు తీరుపై కన్నెర్ర జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరసన ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ -
విద్యార్థిని చితక బాదిన టీచరు
అనంతపురం ఎడ్యుకేషన్: హోం వర్క్ రాయలేదనే కారణంతో మూడో తరగతి విద్యార్థిని టీచర్ చితకబాదిన ఘటన అనంతపురం రూరల్ మండలం కురుగుంటలోని శ్రీభారతి ప్రైవేట్ స్కూల్లో జరిగింది. శనివారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు...అక్కంపల్లి పంచాయతీ ఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణస్వామి కుమారుడు జయసూర్య శ్రీభారతి ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న విద్యార్థి హోం వర్క్ రాయలేదని గుర్తించిన టీచరు బెత్తంతో చితకబాదింది. విద్యార్థి చేతిపై వాతలు తేలాయి. సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తండ్రికి విషయం చెప్పాడు. తర్వాత రోజు సెలవు రోజు కావడంతో సోమవారం విద్యార్థి తండ్రి నారాయణస్వామి, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు వెళ్లారు. విద్యార్థిని ఇష్టానుసారం ఎలా కొడతారని ప్రశ్నించగా...సదరు టీచర్ ఎదురుదాడికి దిగింది. దెబ్బలు కొట్టకుంటే పిల్లలకు చదువులు ఎలా వస్తాయని నిలదీసింది. విద్యార్థి తండ్రి, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి చేరుకుని డీఈఓ ప్రసాద్బాబుకు ఫిర్యాదు చేశారు. వాతలు పడేలా కొట్టిన టీచరుపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్యాదవ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మంజునాథ్, వంశీ, సాయి ఉన్నారు. 17ఏటీపీసీ70డీడీఈఓ ప్రసాద్బాబుకు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థి తండ్రి, విద్యార్థి సంఘాల నాయకులు -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతాం
రాయదుర్గం: ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. సోమవారం రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కల్యాణ మంటపంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్వో మలోల, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 360 వినతులు అందాయి. ఎక్కువ భాగం భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అర్జీల్లో 70 నుంచి 80 శాతం పరిష్కారం చూపుతున్నారని, వంద శాతం పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, ఆనంద్, మల్లికార్జున, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ వసంతబాబు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, సీపీఓ అశోక్కుమార్, డీఎస్పీ రవిబాబు, పట్టణ, రూరల్ సీఐలు జయనాయక్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని మున్సిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్పతో పాటు ఐనాపురం మంజునాథ, పైతోట సంజీవ, శివకుమార్, వార్డు ఇన్చార్జులు పొరాళ్ల శివ, రామాంజినేయులు, శ్రీరామిరెడ్డి, బషీర్, కృష్ణమూర్తి, దివాకర్, నిజాముద్దీన్, కో–ఆప్షన్ మెంబర్లు సజీర్, శ్రీనివాసులు, బాబు, దేవేంద్ర తదితరులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.డంపింగ్ యార్డు తొలగింపునకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కంపోస్టు యార్డు నిర్మాణానికి స్థలం చూపాలన్నారు. ● దివ్యాంగురాలైన తనకు పెన్షన్ మంజూరు చేయాలని రహీనబేగమ్ విజ్ఞప్తి చేశారు. వీల్చైర్లో వచ్చిన ఆమె వద్దకు స్వయంగా కలెక్టర్ వెళ్లి వినతి పత్రం స్వీకరించారు. ● పట్టణంలోని మసీదుల వద్ద వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఉర్దూ పాఠశాలకు దారి, ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఖాజా వినతి పత్రం సమర్పించారు. ● ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని స్టీల్ప్లాంట్ సాధన కమిటీ అధ్యక్షుడు నాదల్ఆలీ కోరారు. డీ హీరేహాళ్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు అంజి, మురడిలో రస్తా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ‘దుర్గం’లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వివిధ సమస్యలపై 360 వినతులు -
విద్యార్థినుల భద్రతకు చర్యలు
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం రాత్రి సెంట్రల్ యూనివర్సిటీని కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో వేర్వేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల హాస్టల్ వద్ద సెక్యూరిటీని యూనివర్సిటీ వారు ఏర్పాటు చేయాలన్నారు.వర్సిటీలో స్టూడెంట్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి వారం తహసీల్దార్ పుణ్యవతి యూనివర్సిటీని తనిఖీ చేస్తారన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటుపై వర్సిటీ ఉన్నతాధికారులకు సూచనలు చేశామని, తాము కూడా బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కోరి, ఆర్డీఓ కేశవ నాయుడు, సీఐ కరుణాకర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. రీ సర్వే పక్కాగా నిర్వహించాలి గుమ్మఘట్ట/బ్రహ్మసముద్రం: భూముల రీ సర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో జరుగుతున్న రీ సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే చేస్తున్న సమయంలో రైతులకు నోటీసులు ఇవ్వాలన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాల్లో పలు రికార్డులు పరిశీలించారు. బీటీ ప్రాజెక్టును సందర్శించి ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరందించారని జలవనరులశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్లు శ్రీని వాసులు, సుమతి తదితరులు పాల్గొన్నారు. జీతాలు చెల్లించమని కోరితే షోకాజ్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు సక్రమంగా చెల్లించమని విజ్ఞప్తి చేసిన బోధనేతర ఉద్యోగుల సంఘం నాయకుడు రఘోత్తం రెడ్డిపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. జీతాల చెల్లింపులో రిజిస్ట్రార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొంటూ గత గురువారం రఘోత్తం రెడ్డి బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి, విద్యాశాఖ మంత్రిపై లేఖలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంలో రిజిస్ట్రార్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాత్రమే లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రఘోత్తం రెడ్డికి సోమవారం రిజిస్ట్రార్ రమేష్ బాబు షోకాజ్ నోటీసు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 25వ తేదీ లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. సమస్య పరిష్కరించాల్సింది పోయి ఇలా కక్షసాధింపు చర్యలకు దిగడం సరికాదని బోధనేతర ఉద్యోగులు పేర్కొంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం గుమ్మఘట్ట: మండలంలోని కలుగోడు గ్రామంలో రంజిత్కుమార్ (23) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి, తిప్పమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు రంజిత్కుమార్ బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత శనివారం బెంగళూరు నుంచి స్వగ్రామానికి రంజిత్కుమార్ వచ్చాడు.ఏమైందో తెలియదు కానీ, సోమవారం తమ ఇంటి పక్కనే ఉన్న గంగన్న గౌడ ఇంట్లో పైకప్పునకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంతో చలాకీగా ఉండే రంజిత్కుమార్ మృతితో గ్రామస్తులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగారు. -
తీర్థయాత్రకు వెళ్లి తిరిగి రాని లోకాలకు
తాడిపత్రి రూరల్: భర్తతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తాడిపత్రికి చెందిన వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాశీ వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. వివరాలు.. తాడిపత్రిలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన నాగలక్ష్మి (53), రాజన్న దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. మండలంలోని బుగ్గ వద్ద రాజన్న పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు. ముగ్గురు కుమార్తెలకూ పెళ్లిళ్లు కావడంతో తీర్థయాత్రలకు వెళ్లాలన్న కోరిక భార్యాభర్తలకు కలిగింది. ఈ నెల 3న తాడిపత్రి నుంచి 13 రోజుల పాటు అయోధ్య, ప్రయాగ్ రాజ్, కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు బస్సులో వెళ్లారు. గత శుక్రవారం ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. శనివారం రాత్రి కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే కాశీ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో టీ తాగేందుకు డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును నిలపగా.. వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన నాగలక్ష్మితో పాటు మరో ఆరుగురిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నాగలక్ష్మిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా హైదరాబాద్కు తీసుకురాగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని సోమవారం గన్నెవారిపల్లి కాలనీకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో నాగలక్ష్మి పక్కనే భర్త రాజన్న నిద్రిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తలుచుకుని ఆయన గుండెలవిసేలా రోదించారు. మాజీ సర్పంచ్ లింగం కృష్ణయ్య తదితరులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి -
కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు
● ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈఓ నరసింహారావు అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ) కింద కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలతో ప్రోత్సాహం అందిస్తామని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) బీఎంవీ నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, ఎఫ్పీఓలు, రైతు సహకార సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్ విలువలో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 35 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. మిగతా 55 శాతం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. వేరుశనగ నూనె, చిక్కీల తయారీ వంటి వాటికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పొటాటో చిప్స్, చెక్కిలాలు, ఊరగాయలు, రోటీ మేకర్, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్, శనగపప్పు, బేకరీ ఉత్పత్తులు, మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులు, బొరుగులు, రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్, అరికానట్స్, చింతపండు తదితర మరో 20 నుంచి 30 రకాల ఉత్పత్తుల తయారీకి రాయితీలు వర్తిస్తాయని వెల్లడించారు. ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, వివరాలకు ఫుడ్ ప్రాసెసింగ్ జిల్లా రీసోర్స్ పర్సన్ బి.హరీష్ (9676796974)ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
అనంతపురం: యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో అమ్మాయి బాత్రూమ్లోకి కొందరు తొంగిచూశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళన దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూమ్ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. -
కుంభమేళాకు వెళ్లిన తాడిపత్రి వాసులకు గాయాలు
తాడిపత్రిటౌన్: పట్టణం నుంచి కుంభమేళాకు వెళ్లిన తాడిపత్రి వాసులు ఆదివారం ప్రమాదానికి గురయ్యారు. తాడిపత్రి నుంచి కుంభమేళాకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో దాదాపు 40 మంది వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాశీకి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో వారి బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో దాదాపు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కడప రోడ్డులో ఉన్న శివాలయం నిర్వాహకుడు రంగస్వామి, బాలరంగయ్య దంపతులకు గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులను వారణాసి కలెక్టర్, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. -
స్వగ్రామానికి జవాన్ లక్ష్మన్న భౌతికకాయం
కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ లక్ష్మన్న (33) భౌతికకాయాన్ని ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామమైన బ్రహ్మసముద్రం తీసుకొచ్చారు. ముందుగా ఢిల్లీ నుంచి ఆర్మీ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చారు. ఆర్మీ జవాన్లు గౌరవ వందనం సమర్పించిన అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన మినీ బస్లో భౌతిక కాయాన్ని గ్రామానికి తరలించారు. లక్ష్మన్నను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కళ్లెదుటే భర్త మరణిస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ లక్ష్మన్న భార్య లక్ష్మి విలపించడం అందరి వెంట కన్నీళ్లు పెట్టించింది. తమ తండ్రి ఎక్కడని పిల్లలు అడిగితే ఏం చెప్పాలంటూ పిల్లల్ని పట్టుకుని ఏడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఉన్నత స్థానానికి వెళ్లిన కుమారుడు ఇలా విగత జీవుడిగా తిరిగి వస్తాడని అనుకోలేదంటూ తల్లిదండ్రులు సుశీలమ్మ, రామచంద్రలు రోదించడం కలచివేసింది. లక్ష్మన్నతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బంధువులు, స్నేహితులు విలపించారు. బాధిత కుటుంబ సభ్యులను ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ పిల్లలపల్లి నరసింహారెడ్డి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నేడు అంత్యక్రియలు.. జవాన్ లక్ష్మన్న అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని పశువైద్యశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సుమతి, ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు, గ్రామస్తులు నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు -
ఏటి గంగమ్మా.. చల్లంగ చూడమ్మ
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన ఏటి గంగమ్మ తిరునాల ఆదివారం వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ముందుగా భక్తులు పెన్నహోబిలంలో లక్ష్మీనృసింహస్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర పెన్నా నదిలో మాఘమాస పుణ్యస్నానాలు ఆచరించారు. నది సమీపంలోని ఏటి గంగమ్మ ఆలయంలో ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి కోళ్లు, గొర్రెలు, మేకలు బలి ఇచ్చి పచ్చని చెట్ల మధ్య వనభోజనాలు చేశారు. తిరునాల సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వైఎస్సార్సీపీ యువనేత వై.భీమిరెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు వనజాక్షి, ఆకుకూర నాగరాజులు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పెన్నహోబిలం ఆలయ ఈఓ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కదులుతున్న బస్సు.. కిటికీలో కాళ్లు
● మద్యం మత్తులో వ్యక్తి నిర్లక్ష్యం ● సోషల్ మీడియాలో వైరల్ ● ప్రభుత్వంపై నెటిజన్ల సైటెర్లు గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సైటెర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. -
‘మిస్టర్ సౌత్ ఇండియా’ పోటీల్లో ప్రతిభ
రాయదుర్గంటౌన్: బెంగళూరులో ఆదివారం జరిగిన మిస్టర్ సౌత్ ఇండియా మెన్స్ ఫిజిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన యువకుడు కొలిమి దస్తగిరి మూడో స్థానం సాధించారు. ఆయన మొదటిసారిగా ఈవెంట్లో పాల్గొని ఈ ఘనత సాధించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది బాడీబిల్డర్లు పాల్గొనగా మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ఏకై క పోటీదారుడు దస్తగిరి కావడం విశేషం. మొత్తం 60 మంది పోటీల్లో పాల్గొనగా దస్తగిరి మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మన్ముందు రాష్ట్రం నుంచి మరిన్ని పోటీల్లో పాల్గొంటానని దస్తగిరి పేర్కొన్నారు. -
‘వ్యవసాయం దండగ’ నినాదమే అమలు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నినాదాన్నే పరిటాల సునీత అమలు చేస్తున్నారు. హంద్రీ–నీవా కాలువ పనులు రద్దు చేసే విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్నారు. లైనింగ్ పనులు పూర్తి చేస్తే కాలువకు దిగువనున్న 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు అడుగంటి పచ్చని పొలాలు బీళ్లుగా మారతాయి. రైతులు వలసలు పోతారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలయ్యే ప్రమాదముంది. నియోజకవర్గంలోని రైతులను వలస బాట పట్టించాలని ఉంటే పనులు చేయండి. ఈ ప్రాంతం ఎడారిగా కావాలంటే పనులు చేపట్టండి. లైనింగ్ పనులను రైతులతో కలిసి అడ్డుకుంటాం. ఇది హెచ్చరిక కాదు చివరి అల్టిమేటం’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాతను కష్టపెట్టే విధానాలను మానుకోవాలని కోరారు. మొండివైఖరితో పనులు చేయాలని చూస్తే ఎక్కడికక్కడ అడ్డుకుని తీరతామన్నారు. పైసా ఖర్చు చేసే పని లేకున్నా పేరూరు డ్యాంకు పరిటాల సునీత నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. తాజాగా నియోజకవర్గాన్ని శాశ్వతంగా ఎడారిగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇది ఆమెకు తగదన్నారు. త్వరలో ఆత్మకూరు మండలం సింగంపల్లి నుంచి వేలాదిమందితో పాదయాత్ర మొదలుపెట్టి ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల వరకు కొనసాగిస్తామన్నారు. పాదయాత్రలో పరిటాల సునీత అక్రమాలు, అవినీతిని ప్రజల్లో ఎండగడతామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేడన్నారు. గతంలో 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న హంద్రీ–నీవా కాలువను 5 టీఎంసీలకు కుదించిన చంద్రబాబు... నేడు 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే హంద్రీ–నీవా కాలువను కేవలం 300 చెరువులకు నీళ్లిచ్చే కాలువగా మారుస్తున్నారన్నారు. పాదయాత్రకు పోలీసు అధికారులు అనుమతులు ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ అనంతపురం రూరల్ మండలం–1,2 కన్వీనర్లు బండి పవన్, దుగుమర్రి గోవిందరెడ్డి, యూత్ విభాగం శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి, నాయకులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. హంద్రీ–నీవా లైనింగ్తో విధ్వంసాలు చూస్తారు కమీషన్ల ఆశలో రైతులకు పరిటాల సునీత అన్యాయం త్వరలో వేలాదిమంది అన్నదాతలతో పాదయాత్ర రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఆరిన ఆశల దీపం.. అయ్యో ఎంత ఘోరం
● బైకును ఢీ కొన్న కారు ● మూడేళ్ల బాలుడి దుర్మరణం ● తల్లిదండ్రులకు తీవ్రగాయాలు పెద్దవడుగూరు: బైకును కారు ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని గోపురాజుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మండలంలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డి తన భార్య సులోచనమ్మ, కుమారుడు రిత్విక్ రెడ్డి(3)తో కలిసి ఆదివారం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో జరుగుతున్న అశ్వత్థం తిరునాలకు బైకుపై వెళ్లారు. స్వామిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో గోపురాజుపల్లి వద్ద వీరి బైకును ఓ కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలుడు రిత్విక్ రెడ్డి ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచాడు. సురేంద్ర రెడ్డి, సులోచనమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తమ ఆశలదీపం ప్రాణాలు విడిచాడని తెలుసుకున్న వారు.. ఘటనాస్థలిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. కారు డ్రైవర్ చిన్న దస్తగిరి మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బైకును ఢీకొన్న అనంతరం కారు బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం
అనంతపురం: అనంతపురానికి సమీపంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో కలకలం రేగింది. తమ బాత్రూముల్లోకి, గదుల్లోకి అక్కడే పనిచేస్తున్న బిహార్ యువకులు తొంగి చూస్తున్నారని, తమకు రక్షణ కరువైందంటూ క్యాంపస్ విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మహిళా హాస్టల్ బాత్రూముల్లోకి ఒకరు తొంగిచూసినట్లు నీడ కనపడింది. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని కేకలు వేయడంతో అగంతకుడు పారిపోయాడు. వాష్రూం బయట గల సన్సైడ్కు వెళ్లేందుకు వీలుగా ఉన్న గేటును సైతం తొలగించి.. అక్కడి నుంచి తొంగిచూస్తున్నట్లు నీడ కనపడింది. వాష్రూంలో సైతం తమకు భద్రత కరువైందని విద్యార్థినులు వాపోతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ఆందోళన మొదలుపెట్టిన విద్యార్థినులు ..రాత్రి 12 గంటలైనా కొనసాగించారు. దీంతో సెంట్రల్ వర్సిటీ అట్టుడికిపోతోంది. సుమారు వేయి మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. గత డిసెంబర్ 9వ తేదీ ఇలాగే.. గతేడాది డిసెంబర్ 9వ తేదీన అర్ధరాత్రి కూడా వర్సిటీ భవన నిర్మాణ పనులు చేస్తున్న బిహార్కు చెందిన కొందరు యువకులు.. అమ్మాయిల స్నానాల గదులున్న వైపు తొంగి చూసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ సమయంలో విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడంతో సదరు వ్యక్తులు పారిపోయారు. భయంతో వణికిపోయిన విద్యార్థినులు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు వర్సిటీకి చేరుకుని విచారణ చేశారు. అనుమానితులైన నలు గురు బిహార్ యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. తాజాగా అదే ఘటన పునరావృతం కావడంతో విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఇలా ఎన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడపాలని ప్రశ్నిస్తున్నారు. రక్షణ కరువైందంటూ విద్యార్థుల ఆందోళన -
లోపాలను వెంటనే సరిచేయండి
గుత్తి: పాఠశాల సముదాయాల పునర్ వ్యవస్థీకరణ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని వాటిని వెంటనే సవరించాలని వైఎస్సార్టీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గుత్తిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓబులేసు, వెంకటరెడ్డి మాట్లాడారు. పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లాలంటే 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. దీంతో రెండు , మూడు వాహనాలు మారాల్సి వస్తుందన్నారు. పాఠశాల సముదాయానికి వెళ్లాలంటే ఆత్రుతలో ఉపాధ్యాయులు ప్రమాదాలకు గురయ్యే అవకాశ ఉందన్నారు. ఇవే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం లోపాలు సరిచేయాలని డిమాండ్ చేశారు. ఆమిద్యాలలో భారీ చోరీ ● 20 తులాల బంగారు, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు ఇంట్లో బీరువాలోని 20 తులాల బంగారుతో పాటు రూ1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఆమిద్యాలకు చెందిన దర్జీ నారాయణరావు, సర్వసతీ దంపతులు 10 రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెంగళూరుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ జనార్దన్నాయుడు కేసు నమోదు చేసుకొని క్లూస్టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు. కారు బోల్తా .. వ్యక్తికి గాయాలు చెన్నేకొత్తపల్లి: అనంతపురం వైపు నుంచి బెంగళూరుకు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన మైకేల్ ఫెర్నాడెజ్ మరో వ్యక్తితో కలసి అనంతపురము వైపు నుంచి బెంగళూరుకు కారులో వెళుతున్నారు. అయితే మండల పరిధిలోని ఉన్న ఫారెస్ట్ నర్సరీ వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న మైకేల్ ఫెర్నాడెజ్ గాయపడగా చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. అక్కడి నుంచి అతను చికిత్స నిమిత్తం బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఘనంగా నారాయణస్వామి తిరునాల
పెద్దపప్పూరు: అశ్వర్థనారాయణస్వామి మూడో ఆదివారం తిరునాల అత్యంత వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామికి పొంగళ్లను ప్రసాదంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాల సందర్భంగా ఏర్పాటు చేసిన గాజుల అంగళ్లు, చిన్నారుల ఆటవస్తువుల దుకాణాలు, తినుబండారాల షాపులు కిటకిటలాడాయి. పలు గ్రామాలకు చెందిన భక్తులు అన్నదానం చేశారు. దాతలు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు మజ్జిన పంపిణీ చేశారు. సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ నాగేంద్రప్రసాద్ బందోబస్తును పర్యవేక్షించారు. -
కొత్త ఫాస్టాగ్ రూల్స్ తప్పనిసరి
హిందూపురం అర్బన్: జాతీయ రహదారులు, ఇతర చోట్ల టోల్గేట్స్ దాటి వెళ్లే వాహనదారులు (కార్లు, బస్సులు, లారీలు తదితర వాహనాలు) తప్పనిసరిగా సోమవారం నుంచి నూతన ఫాస్టాగ్ రూల్స్ పాటించాలి. ఈ నెల 17 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమలులోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం వాహనదారులు కొత్త చెల్లింపు విధానాలు పాటించకపోతే ఆదనంగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా టోల్ ప్లాజా వద్దకు వెళ్లే 75 నిమిషాల ముందే తగిన రెండింతల మొత్తం ఫాస్టాగ్లో ఉండేలా రీచార్జ్ చేసుకోవాలి. అలాగే రవాణా కార్యాలయంలో కేవైసీ చేయించుకొని తీరాలి. కొంతమంది ఇప్పటికీ అడపాదడపా వాహనాలు బయటకు తీసి తిప్పేవారు టోల్ప్లాజా వద్దకు వెళ్లేందుకు 5 నిమిషాల ముందు రీచార్జ్ చేస్తుంటారు. ఇకమీదట అలా కుదరదు. అందుకు జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) స్వస్తి పలికింది. తగిన మొత్తం ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేని పక్షంలో డబుల్ మొత్తం చెల్లించక తప్పదు. త్వరిత గత ప్రయాణం, డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఎన్హెచ్ఏఐ ఈ నిబంధనను సోమవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. మెట్టినింటికి తీసుకెళ్లాలని అడిగినందుకు దాడి ● న్యాయం చేయాలంటున్న బాధితురాలు బెళుగుప్ప: మెట్టినింటికి తీసుకెళ్లాలని అడిగినందుకు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులు చితకబాదారని బాధితురాలు సాయిలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శివ విచారణ చేపట్టారు. బాధితురాలి వివరాలమేరకు.. మండల పరిధిలోని తగ్గుపర్తికి చెందిన సాయిలీల, కణేకల్లు మండలం కలేకుర్తికి చెందిన లాలుస్వామి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో గత నెల 24న పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తగ్గుపర్తిలోని తన అక్క ఇంట్లో ఉంటున్న లాలుస్వామి.. భార్య సాయిలీల దగ్గరకు మాత్రం అప్పుడప్పుడూ వెళ్లేవాడు. అయితే మొట్టినింటికి తీసుకెళ్లాలని సాయిలీల భర్త లాలుస్వామిని అడిగింది. తన అక్కలకు, అమ్మకు తనను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడని, మెట్టినింటికి తీసుకెళ్లాలని గట్టిగా నిలదీసింది. ఈ నేపథ్యంలో సాయిలీలతో పాటు ఆమె అక్క ప్రవళ్లిక, అన్న ఎర్రిస్వామి, వదిన శిల్ప, మామ నాగరాజుపై లాలుస్వామితో పాటు వారి కుటుంబ సభ్యులు దాడి చేశారు. వారంతా గాయపడటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులే తనకు న్యాయం చేయాలని బాధితురాలు సాయిలీల విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని సజ్జలదిన్నె క్రాస్లో ఆదివారం రంగనాయకులు(65) ద్విచక్ర వాహనంలో వెళ్తూ లారీ కింద పడి మృతి చెందినట్లు అప్గ్రేడ్ ఎస్ఐ కాటయ్య తెలిపారు. మండలంలోని ఆలూరుకు చెందిన రంగనాయకులు మోటర్ సైకిల్లో తాడిపత్రి నుంచి ఆలూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. గార్లదిన్నెలో మరొకరు.. గార్లదిన్నె: మండల పరిధిలోని రామ్దాస్పేట గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు... శింగనమల మండలం నిదనవాడకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి లాగేజీ ఆటోలో గేదేలను అనంతపురం మార్కెట్కు తరలిస్తున్నాడని చెప్పారు. అయితే రామ్దాస్పేట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడిందన్నారు. దీంతో లక్ష్మీనారాయణ (45) అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురము ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్మికుల సమస్యలపై అలసత్వం తగదు కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై అధికారులు, ప్రభుత్వం అలసత్వం వహించడం తగదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. ఆదివారం ఆయన పీఏబీఆర్ డ్యాం వద్ద ఉన్న శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ను సందర్శించారు. కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫేస్–4లో కళ్యాణదుర్గం , రాయదుర్గం కార్మికులకు పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలు, 30 నెలల ఫీఎప్ చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారానికై ఈ నెల 18 నుంచి కార్మికుంతా సమ్మెబాట పడుతున్నట్లు చెప్పారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
అనంతపురం కల్చరల్: జిల్లా కేంద్రమైన అనంతపురంలో నిర్వహించిన బాలోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఆదివారం నిర్వహించిన ముగింపు వేడుకల్లో జానపద గీతాలు, సందేశాత్మక నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలతో విద్యార్థులు అలంరించారు. పెద్ద సంఖ్యలో వీక్షకులు తరలిరావడంతో స్థానిక లలితకళాపరిషత్తు, గిల్డ్ ఆఫ్ సర్వీసు ప్రాంగణాలు కిటకిటలాడాయి. సాయంత్రం నిర్వహించిన ముగింపు వేడుకల్లో ప్రతిభ చాటిన వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ చైర్పర్సన్ షమీమ్, ఆర్ఐఓ వెంటరమణనాయక్, నిర్వాహకులు సావిత్రి, లలితకళాపరిషత్తు కార్యదర్శి పద్మజ, బాలోత్సవం కార్యదర్శి శ్రీనివాసరావు, ట్రెజరర్ జిలాన్, తరిమెల అమరనాథరెడ్డి, సీనియర్ కవి నబీరసూల్, డాక్టర్ కొండయ్య, కత్తి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి కనువిప్పు కల్గిస్తాం
అనంతపురం కార్పొరేషన్: ఉపాధి కూలీల పొట్ట కొడుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా వైఎస్సార్సీపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఉపాధి కూలీల విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఇందులో భాగంగానే ఈ నెల 17న కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పనుల్లో 50 శాతం కూలీలకు ఉపాధి చూపించాలన్న నిబంధనను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.69 లక్షల పనిదినాలు కల్పించలేదని, అందుకు సంబంధించి రూ.700 కోట్ల నిధులు టీడీపీ నాయకుల ఖాతాల్లోకి వెళ్లాయని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మంత్రి వర్గంలో ఆయన ర్యాంక్ ఎక్కడో చెప్పాలన్నారు. మీ స్థానాన్ని పదో స్థానంలోకి పడేసిన సీఎం చంద్రబాబు వైఖరిపై మీ నిర్ణయం ఏమిటో తెలియజేయాలన్నారు. పంచాయితీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న పవన్కళ్యాణ్ ఉపాధి కూలీలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు కలెక్టర్ న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస -
జిల్లా అంతటా శనివారం చలి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు ● సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయన్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారం పల్లికి చెందిన గౌతమి పట్ల టీడీపీ నాయకుని కుమారుడు గణేష్ అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. యాసిడ్ తాగించి, కత్తితో దాడి చేయడం బాధాకరమన్నారు. అధికార మదంతోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. దాడి ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ మరింత అప్రమత్తం కావాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో యువతిపై అత్యాచారం జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళకు అటువంటి పరిస్థితి తలెత్తకూడదని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ‘దిశ’ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. నేడు మహిళలపై దాడులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. -
క్లస్టర్ సమావేశాలు.. కష్టాలు
అనంతపురం ఎడ్యుకేషన్: క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు టీచర్లకు చుక్కలు చూపించాయి. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం జిల్లాలో 135 చోట్ల కాంప్లెక్స్ సమావేశాలు జరిగాయి. ఉదయం తాము పని చేస్తున్న పాఠశాలలకు వెళ్లిన టీచర్లు.. 11.45 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇళ్లకు పంపారు. 12 గంటల నుంచి కాంప్లెక్స్ స్కూళ్లకు బయలుదేరారు. 25–30 కిలోమీటర్ల దూరంలో ఉండే కాంప్లెక్స్ స్కూళ్లకు వెళ్లేందుకు అయ్యవార్లు నానా తంటాలు పడ్డారు. మరీ ముఖ్యంగా మహిళా టీచర్లు రవాణా సదుపాయం లేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకుని వెళ్లగా.. మరికొన్ని కోట్ల ఉదయం పని చేస్తున్న పాఠశాలల్లో కొందరు టీచర్లు అటెండెన్స్ వేసి 11 గంటలకే బయలుదేరి వెళ్లారు. అటెండెన్స్ యాప్లాక్.. వాస్తవానికి సాయంత్రం 5 గంటల వరకు సమావేశాలుంటాయని షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు పని చేస్తున్న పాఠశాలలో (ఇన్టైమ్) అటెండెన్స్ వేయాలని, మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 గంటలలోపు క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్లో (ఇన్టైమ్), అక్కడే సాయంత్రం 5 గంటల నుంచి (అవుట్టైమ్) వేయాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే 5.30 గంటల వరకు అటెండెన్స్ పడకుండా యాప్లో లాక్ చేయడంతో టీచర్లు బెంబేలెత్తిపోయారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న సీనియర్ ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. దీనికితోడు ఉదయం 6–7 గంటలకు మొబైళ్లకు చార్జింగ్ పెట్టుకున్న టీచర్లు సాయంత్రం 6 గంటలైనా అటెండెన్స్ తీసుకోకపోవడంతో చార్జింగ్ లేక అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై కళ్యాణదుర్గం మండలం గోళ్ల పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. చాలా దుర్మార్గం.. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో ప్రభుత్వం వింత నిర్ణయాలు తీసుకుని ఉపాధ్యాయులను తీవ్ర అవస్థల్లోకి నెట్టిందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. టీచర్ల పట్ల ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్గౌడ్, రాష్ట్ర నాయకులు గంగాధర్ రెడ్డి, గోవింద రెడ్డి, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు నీలూరి రమణారెడ్డి, ఎస్.రామాంజ నేయులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి, జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు రాయల్ వెంకటేష్, సయ్యద్ సిరాజుద్దీన్, ఆపస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎర్రిస్వామి, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి డెగావత్ రవీంద్రనాథ్ శనివారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. పాఠశాల సమయం 4 గంటలకు ముగించాల్సి ఉండగా కాంప్లెక్స్ మీటింగ్ పేరుతో 5 గంటల వరకు పెంచారన్నారు. అయితే 5.30 గంటల వరకు అటెండెన్స్ పడకుండా చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనైనా సాయంత్రం 4 గంటల వరకే కుదించాలని వారు డిమాండ్ చేశారు. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో అవస్థలు సాయంత్రం 5.30 వరకూ అటెండెన్స్ పడకుండా యాప్లాక్ సర్కారు తీరుపై టీచర్ల ఆగ్రహం -
రైతుకు భరోసా అందించాలి
అనంతపురం సిటీ: కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఆకాశ వాణి అనంతపురం కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో శనివారం నిర్వహించిన రేడియో రైతు దినోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. దేశానికి వెన్నెముక లాంటి రైతులకు వెన్నుదన్ను లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ, నెట్, మొబైల్ లేని రోజుల్లో రైతన్నలకు దిక్సూచిగా నిలిచింది రేడియో ఒక్కటేనన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, మ్యుటేషన్లు, కబ్జాలు తదితర సమస్యలపై రైతులు గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. తాను కూడా ప్రతి రోజూ ఒక్కో మండలానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే, కలెక్టర్లు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండిలో డీపీఆర్సీ భవన్కు చేరుకున్నారు. కార్యక్రమంలో డీఏఓ ఉమామహేశ్వరమ్మ, రైతులు, అధికారులు పాల్గొన్నారు. రేపు ‘దుర్గం’లో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్/రాయదుర్గం: ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీ (సోమవారం) రాయదుర్గం పట్టణంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం డ్వామా ఏపీడీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తనతో పాటు జేసీ, డీఆర్ఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటా రన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లో కార్యక్రమం నిర్వహించడం లేదని, ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ -
గుళ్లు తిరిగేందుకేనా డిప్యూటీ సీఎం పదవి?
అనంతపురం అర్బన్: పరిపాలన పక్కన పెట్టి గుళ్లు, గోపురాలు తిరిగే డిప్యూటీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అంటూ పవన్కల్యాణ్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శనివారం అనంతపురం విచ్చేసిన ఆయన స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమకేదో మంచి చేస్తారని నమ్మి ఓటు వేసిన ప్రజలను పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా, పాలన గాలికొదిలేసి గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారని విమర్శించారు. సాధారణంగా పదవీ విరమణ చేసిన వారు, వయసు పైబడిన వారు ఆలయాలు సందర్శిస్తూ కాలం గడుపుతారన్నారు. ఆలయాలపై ఆసక్తి ఉంటే దేవదాయ శాఖ తీసుకుంటే సరిపోయేదన్నారు. అప్పుడు ఎన్ని ఆలయాలు తిరిగినా ఎవరూ అడగరన్నారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు తప్ప మిగిలిన ఏ వర్గాల ప్రజలకూ మేలు చేసేదిగా లేదని విమర్శించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపాటు -
ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
● మంత్రి సత్యకుమార్ అనంతపురం టవర్క్లాక్: ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. బర్డ్ఫ్లూ వ్యాధి గురించి ఎవరూ భయపడవద్దన్నారు. కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. రాబోయే రోజుల్లో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి సీట్లు పెంచుతామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపరుస్తామన్నారు. ఎలాంటి రోగానికై నా వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొంతకాలం చికెన్ తినడం మానుకోవాలని సూచించారు. ‘కూటమి’లో ఎటువంటి విభేదాలు లేవని, దీనిపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, నాయకులు లలిత్ కుమార్, చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి అనుచరుల ఓవరాక్షన్ విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిధులపై మంత్రి సత్యకుమార్ అనుచరులు ఓవరాక్షన్ చేశారు. ఎంత సేపు ఇంటర్వ్యూ చేస్తారు అంటూ దురుసుగా మాట్లాడారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ఖండించగా.. మంత్రి సత్యకుమార్ క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. సైబర్ మోసాలపై ఆటోల ద్వారా అవగాహన అనంతపురం: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి 70 ఆటోలను జిల్లా ఎస్పీ పి. జగదీష్ శనివారం ప్రారంభించారు. ‘సైబర్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా ఆటోలు తిరుగుతాయన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలో ఇప్పటికే వాహనాల ద్వారా వీడియోలను ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నామన్నారు. పనుల్లో నిమగ్నమై డిజిటల్ వాహనాల ద్వారా ప్రదర్శించే వీడియోలు చూడలేని వారి కోసం తాజాగా టాంటాం ఆటోలను ప్రవేశపెట్టామన్నారు. జిలా కేంద్రంలో 17 ఆటోలు తిరుగుతాయని, మొత్తం జిల్లా అంతటా 70 ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కుంభమేళాకు ప్రత్యేక రైలు రాయదుర్గంటౌన్: ఇది వరకే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 22, 25 తేదీల్లో శివమొగ్గ టౌన్ – వారణాసి (06223/06224) కుంభమేళాకు ప్రత్యేక రైలుకు ఆన్లైన్ రిజర్వేషన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 22న శివమొగ్గ టౌన్ నుంచి బయల్దేరి చిత్రదుర్గం, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హొస్పేట్ మీదుగా ప్రయాగ్రాజ్, వారణాసికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 25న వారణాసిలో బయల్దేరి ఇదే రూట్లో రాయదుర్గం మీదుగా శివమొగ్గకు చేరుకుంటుంది. రాయదుర్గం ప్రాంత ప్రజలు ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు గుంతకల్లు: రైలు ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా పేర్కొన్నారు. డివిజన్లో తొలిసారిగా ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకోపైలట్ల కోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని శనివారం డీఆర్ఎం సీఎస్ గుప్తా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైళ్ల రాకపోకలకు సంబంధించిన భద్రతా నిబంధనలు పాటించేందుకు పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల సమర్థవంతమైన నిర్వహణతోపాటు భద్రత, ఆపరేషనల్ సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీఎస్టీఈ సుదర్శన్రెడ్డి, సీనియర్ డీఓఎం శ్రావణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘చెత్తతో సంపద తయారీ’తో ఆదాయం
పామిడి: చెత్తతో సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని వంకరాజుకాలువ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలన్నారు. ఆదాయంతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. కలెక్టర్ వెంట మెప్మా పీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ తేజోత్స్న, ఈఓఆర్డీ కృష్ణకుమార్, డీటీ లక్ష్మీనారాయణరెడ్డి, రీసర్వే డీటీ విజయ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు, కలెక్టర్కు సమస్యల ఏకరువు... వంకరాజుకాలువలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ ఎదుట ఏకరువు పెట్టారు. పెన్నప్పగుడి నుంచి గ్రామానికి ఉన్న తారు రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు.గ్రామంలోని తాగునీటి ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో నీరు వృథా అవుతోందన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. లింగ నిర్ధారణకు పాల్పడితే చర్యలు అనంతపురం అర్బన్: గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. వంకరాజు కాలువ గ్రామ సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. కర్ణాటక సరిహద్దు మండలాల్లో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. -
ఎన్నికల విభాగం... అంతా మా ఇష్టం!
అనంతపురం అర్బన్: జిల్లా ఎన్నికల విభాగం అవకతవకలకు కేంద్రంగా మారింది. ఎన్నికల నిధులను ఇష్టారాజ్యంగా పంచడం.. విజయవాడలోని ప్రధాన ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేస్తుండటం... అక్రమాలకు పాల్పడి సరెండర్ అయిన ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు సపోర్ట్ చేయడంతదితర వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. యథేచ్ఛగా చెల్లింపులు.. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు విడతలవారీగా కోట్ల రూపాయల నిధులను అప్పట్లోనే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలోనే బూత్ లెవల్ అధికారులకు రెమ్యునరేషన్ చెల్లింపులో ఎన్నికల విభాగం అధికారులు వివాదానికి తెరతీసినట్లు తెలిసింది. జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికానికి సంబంధించి 3,750 మంది బీఎల్ఓలకు రూ.750 చొప్పున, నాల్గో త్రైమాసికానికి రూ.1,500 చొప్పున రూ.84,37,500 చెల్లించాల్సి ఉంది. అలాగే 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున 2,198 మందికి రూ. 1.31 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంఽధించి మూడు త్రైమాసికాలకు కలిపి ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున రూ.99,58,500 చెల్లించాలి. 2021–22లో బీఎల్ఓలుగా పనిచేసిన వారిలో కొందరు 2022–23, 2023–24లో ఆ విధులు నిర్వర్తించలేదు. కానీ, 2021–22లో బీఎల్ఓలుగా పనిచేసిన వారిలో చాలా మందికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ప్రస్తుతం ఉన్నవారికే ఇష్టారాజ్యంగా చెల్లించినట్లు తెలిసింది. డబ్బుల వసూలు.. ఎన్నికల విధుల్లో భాగంగా విజయవాడలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదికలు తీసుకుని జిల్లా ఎన్నికల విభాగానికి సంబంధించి ఉద్యోగులు వెళతారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఒక ఉద్యోగి వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ వెళ్లే ప్రతిసారీ డీటీల నుంచి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తారని సమాచారం. డబ్బు ఇవ్వకపోతే ‘మీరే వెళ్లండని’ అంటుండడంతో చేసేదిలేక సమర్పించుకున్నట్లు తెలిసింది. అక్రమార్కుడికి సపోర్ట్.. గత ఎన్నికల సమయంలో ఓటర్ల తొలగింపునకు (ఫారం–7) సంబంధించి రాప్తాడుకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) అవకతవకలకు పాల్పడటంతో అతడిని అప్పట్లోనే సరెండర్ చేశారు. అయితే ఆ ఉద్యోగిని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుమతి లేకుండానే కలెక్టరేట్లో నియమించుకున్నారు. వ్యవహారం బయటికి రావడంతో ఇటీవల పంపించేశారు. అక్రమాలకు పాల్పడిన సదరు ఉద్యోగికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు ఒకరు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. డీఈఓ చేసిన తప్పును వదిలేసి... ఆ విషయాన్ని బయటికి ఎవరు చెప్పారు అంటూ సదరు నాయకుడు అందరినీ బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఎన్నికల విభాగంలో నడుస్తున్న అడ్డగోలు వ్యవహారాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. జేసీ అంతర్గత విచారణ.. ఎన్నికల నిధుల దుర్వినియోగంపై జేసీ శివ్ నారాయణ్ శర్మ అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. అప్పట్లో నియోజకవర్గాల ఈడీటీలు(ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు) గా విధులు నిర్వర్తించిన వారిని జాయింట్ కలెక్టర్ నాలుగు రోజుల క్రితం పిలిపించి విచారణ చేసినట్ల్లు తెలిసింది. దీనిపై ఆయన సమగ్ర నివేదిక సిద్ధం చేసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి త్వరలో సమర్పించనున్నారు. ఎన్నికల నిధుల దుర్వినియోగం ఇష్టారాజ్యంగా బీఎల్ఓలకు రెమ్యునరేషన్ విజయవాడ వెళ్లినప్పుడల్లా ఓ ఉద్యోగి డబ్బు వసూలు సరెండెర్ డీఈఓకి సంఘం నాయకుడు సపోర్ట్ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న అధికారుల వ్యవహారాలుప్రత్యేక దృష్టి సారిస్తా ఎన్నికల విభాగం వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. బీఎల్ఓలకు రెమ్యునరేషన్ చెల్లింపులను పరిశీలిస్తా. ఎన్నికల విధులు నిర్వర్తించిన ప్రతి బీఎల్ఓకు రెమ్యునరేషన్ అందేలా చర్యలు తీసుకుంటా. – వి.వినోద్కుమార్, కలెక్టర్ -
వడ్డీ వ్యాపారుల వేధింపులపై కేసు
గార్లదిన్నె: అధిక వడ్డీల కోసం మహిళను వేధిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్మహమ్మద్ బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శనివారం మీడియాకు వెల్లడించారు. కోటంక గ్రామానికి చెందిన కుళ్లాయమ్మ అనే మహిళ తన పెళ్లికి ముందు అనంతపురంలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తుండేది. రెండేళ్ల క్రితం అనంతపురంలోని రాణీనగర్కు చెందిన మణికుమార్ వద్ద అవసరాల నిమిత్తం వారానికి నూటికి రూ.10 వడ్డీతో రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. తన బంగారు ఆభరణాలు అమ్మి అసలు, వడ్డీ కలిపి రూ.3లక్షలు చెల్లించింది. పెళ్లయిన తర్వాత భర్త సురేష్రెడ్డిని బెదిరించి అప్పు ఇంకా తీరలేదని గత ఏడాది జూలైలో రూ.5.30లక్షలకు ప్రాంసరీ నోటు రాయించుకున్నారు. అంతేకాదు బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకున్నారు. అప్పటి నుంచి డబ్బు కోసం వేధిస్తూనే ఉన్నారు. స్వగ్రామం కోటంకకు వెళ్లినా అక్కడకూ కొంతమంది మహిళలు వెళ్లి అప్పు తీర్చాలంటూ కుళ్లాయమ్మను బెదిరించారు. వడ్డీ వ్యాపారి మణికుమార్, అతని భార్య మణి, తల్లి కొత్తమ్మ నుంచి ప్రాణహాని ఉందని కుళ్లాయమ్మ గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
ఎన్నికలెప్పుడొచ్చినా కూటమికి ఓటమే
గుంతకల్లుటౌన్: ఎన్నికల హామీలను గాలికొదిలేసి ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన కూటమికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటమి తప్పదని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం గుంతకల్లులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ఆయా రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. తాను సంపద సృష్టికర్తనని చెప్పుకునే చంద్రబాబు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుభరోసా, తల్లికి వందనం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా నిధులివ్వడానికి ఆర్థిక ఇబ్బందులను సాకు చూపుతున్న చంద్రబాబు తమ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి మాత్రం పనిచేస్తున్నారని విమర్శించారు. సొంతింటి కల సాకారం చేయాలన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వ హయాంలో పేదలకు ఇంటి స్థలాలిస్తే కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇళ్లు నిర్మించుకోలేదని, అలాంటి వారి స్థలాలను కూటమి సర్కారు రద్దు చేస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తోందని మండిపడ్డారు. బడులు, దేవాలయాల కంటే ముందే మద్యం షాపులను తెరిచి ఇష్టారాజ్యంగ సొంత బ్రాండ్లను విక్రయిస్తూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ ఓ మహిళను హింసించి మోసం చేసినా.. ఆయనపై చర్యలు తీసుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నుంచి గుంతకల్లు చేరుకున్న తనకు అపూర్వస్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ వైవీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, కౌన్సిలర్లు లింగన్న, సుమోబాష, కోఆప్షన్సభ్యుడు ఫ్లయింగ్ మాబు, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ యుగంధర్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఎస్వీఆర్.మోహన్, సీనియర్ నాయకులు నూర్నిజామి, గోవింద్నాయక్, జయరామిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల నియోజకవర్గం అధ్యక్షులు అబ్దుల్బాసిద్, వీరేష్, అంజి, షాబుద్దీన్, బాబూరావు పాల్గొన్నారు. గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు -
యూజీసీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: వైస్ చాన్సలర్ల నియామక నిబంధనలను పూర్తిగా మారుస్తూ కేంద్రం విడుదల చేసిన యూజీసీ డ్రాఫ్ట్ –2025 నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యావ్యవస్థలో ఊహించడానికి కూడా సాధ్యం కాని మార్పులను కేంద్రం తలపెట్టిందన్నారు. వాటిలో అత్యంత కీలకమైనవి వీసీ నియామకాలన్నారు. వీసీల ఎంపికకు సంబంధించి విద్యాపరమైన అర్హతలను సడలించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేట్ రంగానికి చెందిన వారితో పాటు ఎలాంటి అకడమిక్ అనుభవం లేని వారిని కూడా వైస్ చాన్సలర్లుగా నియమించే అవకాశం ఉందన్నారు. సెర్చ్ కమిటీలు, అధ్యయనాల పరిశీలనలు కూడా ఉండవన్నారు. గవర్నర్ ఆధ్వర్యంలోనే కీలకమైన టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన నియామకాలు జరుగుతాయన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో యూనివర్సిటీలను పెడితే విద్యా వ్యవస్థ కుంటుపడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆర్టికల్ 66 ప్రకారం ఉన్నత విద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు మధ్య సమన్వయం చేయడానికి ప్రమాణాలను నిర్దేశించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని గుర్తు చేశారు. సమావేశంలో విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కై లాష్, నాయకులు వెంకట్, బోయ నితిన్, రాహుల్ రెడ్డి, బోయ శ్రీనివాస్, శివ, శారిక్, సూర్య రెడ్డి, సురేష్, సాయి పాల్గొన్నారు.