Ananthapur
-
వడదెబ్బతో మహిళ మృతి
ఆత్మకూరు: వడదెబ్బకు గురై మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఆత్మకూరుకు చెందిన ఉరుముల రామాంజినమ్మ (59) సోమవారం తనకు ఉన్న రెండు ఆవులను తోలుకొని మేత కోసం పొలంలోకి వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమెకు కోసం వెతికారు. పొలం వద్ద స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రామాంజినమ్మ మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. రామాంజినమ్మకు భర్త, కుమారుడు ఉన్నారు. ‘శ్రీరామిరెడ్డి’ కార్మికులతో అధికారుల చర్చలు విఫలం కూడేరు: శ్రీరామిరెడ్డి పథకం కార్మికులతో అధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. మండలంలోని పీఏబీఆర్ సమీపంలో ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో మంగళవారం అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ చర్చలు జరిపారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను ఈ నెల 17న, పీఎఫ్ ఈ నెలాఖరుకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కార్మికులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అంగీకరించలేదు. 38 రోజులుగా సమ్మెలో ఉన్నామని, వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసే దిశగానే మాట్లాడితే ఎలా.. అని ఓబులు ప్రశ్నించారు. ‘సమ్మెలోకి వెళ్లిన ప్రతిసారీ ఫలానా గడువులోపు ఇస్తామంటారు.. మళ్లీ స్పందించరు.. మీ హామీలపై నమ్మకం లేదు, కార్మికులు సమ్మె కొనసాగిస్తారు’ అని ఓబులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మురళీధర్, డీఈ శిరీషా, తహసీల్ధార్ మహబూబ్ బాషా, సర్వేయర్ అయేషా సిద్దికీ, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు కొండారెడ్డి, రామాంజనేయులు, నాగరాజు, వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇక 9 రకాల పాఠశాలలు
●నూతన విధానాలు ప్రకటించిన ప్రభుత్వం ●పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు జీఓలు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు మంగళవారం జీఓలు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జాబితాలను అనంతపురం శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రెడీ చేస్తున్నారు. గతంలో 117 జీఓను అనుసరిస్తూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4.5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చారు. కూటమి ప్రభుత్వంలో 117 జీఓ రద్దు తర్వాత చాలా వరకు ఫౌండేషన్ స్కూళ్లను అలానే ఉంచారు. 3,4,5 తరగతులను సమీపంలోని మరో ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఇవీ పాఠశాలలు... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1,పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1–2 తరగతులు), బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2,1–5 తరగతులు), మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2, 1–8 తరగతులు), ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు), ఉన్నత పాఠశాలలు (1–10 తరగతులు), హైస్కూల్ ప్లస్ (6–12 తరగతులు), హైస్కూల్ ప్లస్ (1–12 తరగతులు). జిల్లాలో ఏయే స్కూళ్లు ఎన్నంటే... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1 నుంచి 2వ తరగతి వరకు)–92, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5 తరగతులు, 1–5 తరగతులు) 621, మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5, 1–5 తరగతులు) 626, ప్రాథమికోన్నత పాఠశాలలు (1–7/8 తరగతులు) 59, ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు) 338 పాఠశాలలుగా మారాయి. మొత్తం 1,736 పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నారు. ఆ పాఠశాలల హెచ్ఎంలుగా ఎస్ఏలు నూతన విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,556 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం/స్కూల్ అసిస్టెంట్గా కన్వర్షన్ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 520 పోస్టులను సృష్టించారు. ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో 515, ప్రభుత్వ పాఠశాలల్లో 5 పోస్టులను కన్వర్షన్ చేశారు. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో పని చేస్తున్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల గురించి స్పష్టత ఇవ్వలేదు. అలాగే జిల్లాలో మరో 34 (ఎంపీపీ, జెడ్పీ–31, ప్రభుత్వం–3) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అదే మేనేజ్మంట్ స్కూళ్లలో కన్వర్షన్ చేశారు. అయితే ఏయే సబ్జెక్టులనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
వేధింపుల కేసు నమోదు
గార్లదిన్నె: అదనపు కట్నం కోసం వివాహితను వేధింపులకు గురిచేసిన అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన ప్రమీలకు హిందూపురానికి చెందిన రాజశేఖర్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లి సమయంలో 10 తులాల బంగారాన్ని వరకట్నంగా ప్రమీల కుటుంబసభ్యులు ఇచ్చారు. కొంత కాలంగా అదనపు కట్నం కావలంటూ ప్రమీలను రాజశేఖర్తో పాటు ఆయన కుటుంబసభ్యులు వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రమీలకు తెలియకుండానే రాజశేఖర్ రెండో పెళ్లి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజశేఖర్తో పాటు అతని కుటుంబసభ్యులు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో బంగారు నగల చోరీ గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఓ ప్రయాణికురాలి వద్ద ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. వివరాలు... కర్నూలుకు చెందిన సుభాన్బీ సోమవారం గుంతకల్లులో జరిగిన బంధువుల ఇంట శుభ కార్యానికి వెళ్లారు. మంగళవారం ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు గుత్తి బస్టాండ్కు చేరుకోగానే కాసేపు ఆగింది. కాసేపటి తర్వాత తన వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించుకున్న ఆమె... అందులో ఉంచిన ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎస్ఐపై వేటు ● సరెండర్ చేస్తూ డీఐజీ ఉత్తర్వుల జారీ అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎం. ప్రదీప్కుమార్పై వేటు పడింది. అతన్ని సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్కుమార్ ఉన్నతాధికారుల అండ చూసుకుని లాబీయింగ్ చేసేవారని, డీఎస్పీ, సీఐలను సైతం లెక్క చేయకుండా వ్యవహరించే వారని సమాచారం. దీంతో పాటు రాజకీయ అండతో పంచాయితీలు, పైరవీలు చేస్తుండటంపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన అనంతపురం రేంజ్ డీఐజీ.. ప్రదీప్కుమార్ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మూడు స్థానాలకు 19న ఉప ఎన్నికలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ స్థానానికి ఈ నెల 19న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ ఇచ్చి 19న ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎన్నికల అధికారులు రాజోలి రామచంద్రారెడ్డి, జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. కాగా.. గతంలో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల స్థానాలకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించారు. అయితే గాండ్లపెంట, రామగిరి ఎంపీపీ స్థానాలతో పాటు కంబదూరు వైస్ ఎంపీపీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఆయా చోట్ల మార్చి 28న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు చర్యలు తీసుకున్నా.. రాజకీయ కారణాలతో వాయిదా పడ్డాయి. -
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు. -
లోదుక్కులతో లాభాలెన్నో..
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వేసవిలో లోతుగా దుక్కులు చేసుకుంటే ఖరీఫ్ పంటలకు చాలా మేలు జరుగుతుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. మెట్ట పొలాలు అధికంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు మందుస్తు సేద్యపు పనులు చేసుకోవాలన్నారు. అందులో భాగంగా పొలాల్లో వాలుకు అడ్డంగా దున్నడం, నేల, నీటి సంరక్షణకు వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా ‘కాంటూరి సేద్యపు పనులు చేసుకోవాలని సూచించారు. 75 శాతం వర్షాధారం జిల్లాలో 75 శాతం విస్తీర్ణం వరకు వర్షాలపై (మెట్ట సేద్యం) ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా ఎర్ర, చల్కా నేలలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై ఉమ్మడి జిల్లా పరిధిలో 7 నుంచి 8 లక్షల హెక్టార్ల ఖరీఫ్ ఆధారపడి ఉంది. రుతుపవనాలు నిర్ణీత సమయం కన్నా ముందుగా లేదంటే ఆలస్యం కావడం.. త్వరగా నిష్క్రమించడం.. తక్కువ వర్షాలు కురవడం.. అనిశ్చితి వర్షాలు.. పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఏర్పడటం.. ఒక్కోసారి విరామం లేకుండా అతివష్టి సంభవించడం లాంటివి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వర్షం కురిసినా అందులో 10 నుంచి 20 శాతం మాత్రమే భూమిలోకి ఇంకిపోయి మిగతాది ప్రవాహం, ఒరవడి రూపంలో బయటకు వెళ్లి వృథా అవుతుంటాయి. ఇలా ప్రవాహం రూపంలో వెళ్లే వర్షపునీటితో పాటు భూమిపై సారవంతమైన పొర కొట్టుకుపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి క్రమంగా భూమి ఉత్పాదకశక్తి కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. లోదుక్కులతో విస్తృత ప్రయోజనాలు వేసవిలో కురిసే ఇలాంటి వర్షాలను ఉపయోగించుకుని పొలాల్లో వాలుకు అడ్డంగా ఎర్రనేలలో ఒక మీటరు, నల్లరేగళ్లలో రెండు మీటర్లు లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీన్నే కాంటూరు సేద్యం అంటారు. భూమిలో గట్టిపొరను కదలించడం ద్వారా కోశస్థ దశలో ఉన్న పంటలకు కీడు చేసే పురుగులు చాలా వరకు నశిస్తాయి. వచ్చే పంట కాలంలో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి బాగా తగ్గుతుంది. నేల ఎండుతూ ఆరుతూ ఉంటే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అలాగే వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. భూమి గుల్లబారిపోతుంది. బెట్ట పరిస్థితులు ఏర్పడినా కొంతకాలం పాటు పంటలను కాపాడుకోవచ్చు. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. కలుపు సమస్య కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా గాలిలో నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని వర్షపు నీటితో పాటు నేలకు అందడం ద్వారా భూసారం పెరుగుతుంది. ఇలా విత్తనం వేయడానికి ముందుగా రెండు మూడు సార్లు నేలను బాగా దుక్కి చేసుకుంటే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. శాస్త్రవేత్తలు విజయ శంకరబాబు, నారాయణస్వామి సూచనలు -
నేడు కల్లితండాకు వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకాశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లితండాకు చేరుకుంటారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.జయప్రదం చేద్దాంఅనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను జయప్రదం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొడికొండ చెక్పోస్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారని, పార్టీ శ్రేణులు ఆ సమయానికంతా కొడికొండ చెక్పోస్టు వద్దకు చేరుకోవాలని ‘అనంత’ కోరారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
గార్లదిన్నె: ‘వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. ఇప్పటికే ఐదు, ఆరు సార్లు అర్జీలిచ్చాం. ఇప్పటికై నా పట్టించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం గార్లదిన్నె మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్కుమార్తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, డీఆర్ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జున, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 360 వినతులు అందాయి. అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పదే పదే వస్తున్న అర్జీలను పరిష్కరించే బాధ్యతను జేసీకి అప్పజెబుతామని, ఇందులో అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. గ్రామ, క్షేత్ర స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అమర జవాన్ ‘అగ్నివీర్ మురళీ నాయక్’కు ఘన నివాళులర్పించారు. వినతుల్లో కొన్ని... ● చీనీ మార్కెట్ యార్డులో ఈ నామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని, సూట్ విధానం రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారాజు నాయకులు చెన్నారెడ్డి, ఓబిలేసు, సంగప్ప విన్నవించారు. ● గార్లదిన్నె నుంచి మర్తాడు, కోటంక వరకు తారు రోడ్డు అధ్వానంగా ఉందని, నూతనంగా రోడ్డు వేయాలని ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ఆయా గ్రామస్తులు కోరారు. ● కొప్పలకొండ గ్రామంలో సీసీ రోడ్డుపై రాకపోకలు సాగించకుండా ఓ వ్యక్తి ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు అడ్డు పెడుతున్నారని గ్రామానికి చెందిన నాగరాజు విజ్ఞప్తి చేశాడు. ● గార్లదిన్నె డిప్యూటీ తహసీల్దార్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, డబ్బు ఇస్తేనే పనులు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ● ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించి, అవమానాలకు గురి చేస్తోందని, న్యాయం చేయాలని కనంపల్లికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త కలెక్టర్కు విన్నవించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 360 వినతులు ఈమె పేరు సుబ్బమ్మ. గార్లదిన్నె మండలం శిరివరంవాసి. ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. పది సంవత్సరాల క్రితం సుబ్బమ్మ భర్త చనిపోయాడు. కుమారుడు రేవంత్కు పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. సదరం క్యాంపులో 100 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్ మంజూరు చేశారు. ప్రభుత్వం పింఛన్ రూ.6 వేలే అందిస్తోంది. సుబ్బమ్మ కుటుంబానికి భూమి లేదు. రోజూ కూలీ పనులకెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ఈ క్రమంలో కుమారుడికి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని సుబ్బమ్మ పలుమార్లు మండల అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో గార్లదిన్నెలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అధికారులు, ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలోనూ సరిపడా ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో టెంట్ల కింద ఉక్కపోతతో నలిగిపోయారు. పేపర్లను ఊపుకుంటూ ఉపశమనం పొందారు. -
జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసులా?
చెన్నేకొత్తపల్లి: ‘‘ టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గత నెల 8న హెలికాప్టర్లో తమ నాయకుడు వైఎస్ జగన్ వస్తే హెలిప్యాడ్ వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రజలు హెలికాప్టర్ వరకూ దూసుకెళ్లారు. నేనే మైక్ తీసుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాను. అయినా అభిమానులు దూసుకెళ్లడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే. కానీ జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసు పెట్టారు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి సోమవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగమయ్యను అగ్రకులాలకు చెందిన వారు కొందరు హత్య చేసినా.. వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, బంధువులు హస్తం ఉందని తోపుదుర్తి ఆరోపించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవలు జరిగాయని, తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడిన వారితో కలిశారన్నారు. ఈ విషయాన్ని కొన్ని మీడియాలు తప్పుదోవ పట్టించే విధంగా రకరకాలుగా ప్రసారం చేశాయన్నారు. వాస్తవాన్ని వదలి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎక్కువ జనం రావడంతో పోలీసు ఉన్నతాధికారి సూచన మేరకు తాను మైక్ ద్వారా సంయమనం పాటించాలని హెలిప్యాడ్ వద్దకు వెళ్లరాదని సూచించారన్నారు. ఇవన్నీ వదిలి నాపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం మాని, రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రకాష్రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు ఉన్నారు. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన పోలీసుల వైఫల్యమే సంబంధం లేని నాపై కేసు పెట్టారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ ఆసక్తికర సీను అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. విలన్ గ్యాంగ్... యురేనియం కోసం తవ్వకాలు జరిపిన అనంతరం వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని పసికందుల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్
రాచానపల్లి సమీపంలో ఇటీవల రిపేరీ చేయించిన బోరులో వస్తోంది ఆయిల్ కాదు నీరే..వ్యర్థాలు భూమిలోకి వదులుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ ● చుట్టు పక్కల ప్రాంతాల్లో కలుషితమవుతున్న భూగర్భజలాలు ● ఇటీవల రాచానపల్లి పంచాయతీ బోరులో నల్లటి ద్రావకం ● పొగ, దుర్వాసన కూడా వెదజల్లుతున్న వైనం ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధి బళ్లారి రోడ్డు సమీపంలో ఉన్న ఔషధాల తయారీ సిఫ్లాన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వ్యర్థాలు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతుండటంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీకి చుట్టుపక్కల 6–7 కిలోమీటర్ల వరకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సిఫ్లాన్ ఫ్యాక్టరీకి దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని చెక్ డ్యాంలో ఉన్న రాచానపల్లి పంచాయతీ బోరు ఇటీవల చెడిపోగా.. రిపేరీ చేయించారు. మోటారు ఆన్ చేయగానే నల్లటి ద్రవం బోరులో నుంచి ఎగజిమ్మింది. రెండు ఇంచుల పైపులో దాదాపు రెండు గంటల పాటు ఇదే పరిస్థితి. ఈ బోరు 250 అడుగుల లోతు ఉంది. దీన్ని బట్టి రసాయన వ్యర్థాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్ర అవస్థలు.. ‘సిఫ్లాన్’ భూతం కారణంగా రాచానపల్లి, కొడిమి పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాచానపల్లి పంచాయతీలో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు కలుషితమై వస్తోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదని, దుస్తులు ఉతకడానికి కూడా వినియోగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంట భూముల్లోనూ డ్రగ్స్ వ్యర్థాల అవశేషాల ప్రభావం పడిందంటున్నారు. దీనికితోడు పొగ, దుర్వాసన వెదజల్లుతుండడంతో అవస్థలు పడుతున్నామంటున్నారు. -
ప్ర‘గతి’ తప్పిన హెచ్చెల్సీ
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)ను ప్రాజెక్టును కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించే ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అధికారిని నియమించకపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో హెచ్చెల్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ)గా పనిచేసిన రాజశేఖర్ పదవీ కాలం ముగియడంతో గత నెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేశారు. కీలకమైన ఖరీఫ్ సీజన్ ఆరంభం కానున్న ప్రస్తుత తరుణంలో ఉన్నతాధికారి పోస్టు భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కనీసం ఇన్చార్జ్ ఎస్ఈ నియామకంపై కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నిధులతో కల్వర్టులు, శిథిలావస్థకు వచ్చిన తూముల మరమ్మతులు జరుగుతున్నాయి. వీటిని పర్యవేక్షించి పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన జిల్లా స్థాయి అధికారి నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అభివృద్ధి పనులు గతి తప్పాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు మంచి అవకాశం జిల్లాకు వరదాయినిగా ఉన్న హెచ్చెల్సీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు అందుతోంది. హెచ్చెల్సీ పరిధిలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులకు ఆదాయ మార్గాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎస్ఈ స్థాయి అధికారులు సైతం ఇక్కడ పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. ఈసారి నైరుతీ రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని శాస్త్రవేత్తలూ పేర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే తుంగభద్ర డ్యాం ద్వారా ఈ సారి భారీగా నీరు అందే అవకాశమూ ఉంది. ఇలాంటి కీలక సమయంలో కాలువ మరమ్మతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి 100 కిలోమీటర్ల వరకూ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంది. ఆ తర్వాత పులివెందుల వరకూ నీటిని అందించాలంటే కాలువ పటిష్టత మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాలువలో మరమ్మతులు, ముళ్ల కంపలు తొలగించడానికి నీటి ప్రవాహం లేని ప్రస్తుత తరుణమే మంచి అవకాశమని పేర్కొంటున్నారు. అతిథి గృహంలోనే విధులు జిల్లా కేంద్రంలో హెచ్చెల్సీ కార్యాలయానికి దిక్కు లేకుండా పోయింది. గతంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఉన్న కార్యాలయం ప్రభుత్వాసుపత్రికి కేటాయించడంతో అక్కడున్న కార్యాలయాన్ని దశాబ్దాల క్రితం కిత్రం నిర్మించిన అతిథి గృహానికి మార్చారు. హెచ్చెల్సీకి నూతన కార్యాలయం నిర్మాణం ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రెండేళ్లుగా అతిథిగృహం ఇరుకు గదుల్లోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి హెచ్చెల్సీకి పూర్వవైభవం కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో నిర్వీర్యమవుతున్న బృహత్తర ప్రాజెక్ట్ కనీసం ఇన్చార్జ్ ఎస్ఈని నియమించని కూటమి సర్కార్ నానాటికీ ప్రశ్నార్థకమవుతున్న ఆయకట్టు సాగు -
నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలి : ఎస్పీ
అనంతపురం: నేరస్తులకు పక్కాగా శిక్షలు పడాలంటే నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని సిబ్బందికి ఎస్పీ పి.జగదీష్ సూచించారు. ‘ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్’’పై పోలీసు అధికారులకు సోమవారం సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, వాటి ప్యాకేజింగ్, భద్రతా ప్రమాణాలు, సిరాలజీ, డీఎన్ఏ, టాక్సికాలజీ, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి విబాగాల్లో నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, అలాంటి వారిని సమర్థవంతంగా పట్టుకుని చట్టం ద్వారా శిక్షలు వేయించాలంటే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వివిధ అంశాలపై అనంతపురం ఆర్ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజా రంగనాథరెడ్డి, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్ సుధారాణి, సైంటిఫిక్ అసిస్టెంట్లు మురళి, వెంకటేశ్వరరావు తదితరులు అవగాహన కల్పించారు. -
ఆర్డీటీ పరిరక్షణకు చర్యలు : కలెక్టర్
అనంతపురం టవర్క్లాక్: ఆర్డీటీ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో చేపట్టిన రిలే నిరాహార ధీక్షలు సోమవారానికి ఎనిమిదోవ రోజు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి, అఖిలపక్ష కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సీఎం పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించానన్నారు. సుధీర్ఘ కాలం పాటు పేదలకు నిస్వార్థ సేవలు అందించిన ఆర్డీటీ పరిరక్షణ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతానని అన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ కోసం 8 రోజులుగా దీక్షలు చేస్తున్నారంటే మామూలు విషయం కాదన్నారు. ఓ మంచి పని కోసం ఉద్యమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అఖిల పక్ష కమిటీ నాయకులు సాకే హరి మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు కొనసాగేలా కలెక్టర్ చేయగలరని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కుల, ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉధ్యమాలు చేపడతామన్ని అన్నారు. కార్యక్రమంలో కేపీ రాజు, కోట్ల గంగాధర్, సుగమంచి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, ఓబులేసు, టీపీ రామన్న, అనిల్కుమార్, కొత్తపల్లి సురేష్, నారాయణ నాయక్, బండారు కుళ్లాయప్ప , నరసింహులు, షఫీ, వన్నూరప్ప, హరినాథరెడ్డి, గోపాలకృష్ణ, తరిమెల రాజు తదితరులు పాల్గొన్నారు. -
యువరైతు బలవన్మరణం
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన రైతు బోయ సుధాకర్(27)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. గత రెండేళ్లుగా మిరప పంట సాగు చేస్తున్నాడు. సరైన దిగుబడి రాకపోవడంతో పాటు దిగుబడి ఉన్న సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట సాగు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడే సుధాకర్.. సోమవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్నీ
అనంతపురం: ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు.ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డితాడిపత్రి టౌన్: ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఎస్టీయూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలను బ్లాక్ చేయకుండా పారదర్శకత పాటించాలన్నారు. ప్రతి యూపీ పాఠశాలలో నిబంధనలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఇచ్చిన గ్రీవెన్స్ను క్లియర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజినేయులు, ఆర్థిక కార్యదర్శి ప్రసాద్, తిరుపాల్నాయుడు, శివచంద్ర, డేనియల్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం
పుట్లూరు: అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కోమటికుంట్లలో టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన ఎరికలయ్య కుటుంబాన్ని, అనంతరం గరుగుచింతపల్లిలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన పెద్దన్న , నాగరాజును పరామర్శించారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద మద్యం విక్రయించరాదన్నందుకు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు పెద్దన్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శైలజనాథ్ మాట్లాడుతూ... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి చేసి చూపించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప ఇలా దాడులు చేసి పైశాచిక అనందం పొందడం భావ్యం కాదన్నారు. అధికారం ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గరుగుచింతపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు అండగా నిలుస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీపీ బి.రాఘవరెడ్డి, సర్పంచ్లు ఓబులేసు, రామకృష్ణారెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, నాయకులు రామమోహన్రెడ్డి, జేఆర్పేట మహేశ్వరరెడ్డి, విష్ణునారాయణ, శింగనమల ప్రసాద్, పోలిరెడ్డి, వెంకటశివుడు, కృష్ణయ్య, సూరి తదితరులు ఉన్నారు. వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలకు శింగనమల సమన్వయకర్త శైలజనాథ్ భరోసా -
భూసేకరణ ప్రతిపాదనలు పంపండి
● అధికారులతో జేసీ శివ్నారాయణ్ శర్మ అనంతపురం అర్బన్: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. భూ సేకరణ అంశంపై సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో ఆయన సమీక్షించారు. జాతీయ రహదారులు 544డి, 67, 150తో పాటు రైల్వే, ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, భూ బదలాలియింపుపై పెండింగ్ ప్రతిపాదనలు జాతీయ రహదారి అధికారులకు పంపించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ తరుణ్కుమార్, భూ విభాగం సూపరిటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చెరువు మట్టినీ బొక్కేస్తున్నారు... పెద్దవడుగూరు: మండలంలోని చిత్రచేడు గ్రామంలో మట్టి దందాకు స్థానిక టీడీపీ కార్యకర్తలు తెరలేపారు. గత రెండు రోజుల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసేందుకు గ్రామంలోని రెండు వర్గాల వారు జేసీబీలతో మట్టిని తరలించేందుకు ప్రయత్నించడంతో అధికారులు తక్షణమే స్పందించి అడ్డుకున్నారు. ఇదే అదునుగా చేసుకుని గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఏకంగా పది ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని, చెరువులోని మట్టిని జేసీబీలతో పెకలించి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీ పెద్దల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే టీడీపీ బడా నేత ఫోన్ చేయడంతో వాటిని అక్కడే వదిలేసి వచ్చారు. కాగా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చెరువులోని మట్టిని తరలిస్తుండటంపై విమర్శలు వ్యక్తవమవుతున్నాయి. ఆ టీచర్లకు ప్రాధాన్యతనివ్వాలి అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్దీకరణకు రూపొందించిన నిబంధనల్లో స్టేషన్ పాయింట్లకు సంబంధించి ఒక పాఠశాలలో 8 ఏళ్లు పూర్తి కాకుండానే రేషనలైజేషన్కు గురవుతున్న టీచర్లకు 8 ఏళ్ల పూర్తి పాయింట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసనాయక్ మాట్లాడారు. సీనియర్/జూనియర్ ఎవరు రీ అపోర్షన్కు గురైనా రీఅపోర్షన్ పాయింట్లు కేటాయించాలన్నారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించి మోడల్ ప్రైమరీ పాఠశాలలకు నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతాన్ని 1:45 ప్రకారం నిర్ధారిస్తూ పోస్టులు కేటాయించాలన్నారు. బదిలీ పాఠశాలల్లో పోస్టులు బ్లాక్ చేయరాదన్నారు. ఇంగ్లిషు తదితర సబ్జెక్టుల సీనియార్టీ లిస్టు ఫైనలైజ్ చేసి.. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించిన తర్వాతనే మిగులు పోస్టులు ప్రకటించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, సత్యప్రసాద్, అశోక్ నాయక్, వజీర్ బాషా, నారాయణ నాయక్, దామో దర్ రామాంజనేయులు, హుసేన్ఖాన్ పాల్గొన్నారు. -
Murali Nayak: మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..?
కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు జన్మస్తావ్.. అంటూ కల్లితండాతో పాటు యావత్ భారత్ ప్రార్థిస్తోంది.సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అశువులు బాసిన ముడావత్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు. కల్లితండా నుంచి కాశ్మీర్ వరకు.. మురళీనాయక్ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి.. దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్ రెజిమెంట్లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశీ్మర్కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్ఓసీ – లైన్ ఆఫ్ కంట్రోల్) జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. మువ్వన్నెల జెండా రెపరెపలు.. పాకిస్తాన్ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై.. జోహార్ మురళీనాయక్.. మురళీనాయక్ అమర్ రహే.. జై హింద్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్.. ఖబడ్దార్.. పాకిస్తాన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..? కల్లి తండాలోని మురళీనాయక్ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ – మురళినాయక్ తల్లి జ్యోతిబాయి‘జోహార్ మురళి నాయక్. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ – బెంగళూరు నుంచి అంత్యక్రియలకు వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్.మహేందర్ ‘యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’ – మురళినాయక్ తండ్రి శ్రీరామ్నాయక్‘ఈరోజు బార్డర్లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’ – స్నేహితుడు వినోద్తో చివరిరోజున మురళీనాయక్ మాటలు -
టీడీపీ నేతల పరస్పర దాడులు
తాడిపత్రి: ఓ వివాహ వేడుకలో టీడీపీ నేతల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. సజ్జలదిన్నెకు చెందిన టీడీపీ నేత దుబ్బన్న బంధువు కుమారుడి వివాహ వేడుక సంద్భంగా గ్రామంలో శనివారం రాత్రి మెరవణి చేపట్టారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ ప్రముఖుడు సుబ్బయ్య ఇంటి ఎదురుగా మెరవణి వెళుతున్న సమయంలో బాణాసంచా పేల్చేందుకు దుబ్బన్న వర్గీయులు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని సుబ్బయ్య అడ్డుకున్నాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో బాణాసంచా కాల్చరాదని సూచించాడు. దీంతో దుబ్బన్న వర్గీయులు రెచ్చిపోయి సుబ్బయ్యతో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరగడంతో ఇరువర్గాలకు చెందిన పలువురు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో సుబ్బయ్య వర్గానికి చెందిన రమేష్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పార్టీ ఆఫీస్లోనే .. గుత్తి: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్టీకి చెందిన సీనియర్ నేత కోనంకి కృష్ణ కార్యాలయంలో ఇతర నాయకులతో కలిసి సంస్థాగత ఎన్నికలపై చర్చిస్తుండగా అక్కడకు తన అనుచరులతో కలసి చేరుకున్న టీడీపీ నేత వాసు (జీఆర్పీ కానిస్టేబుల్).. సంస్థాగత ఎన్నికల్లో తన అనుచరులు ఎనిమిది మందికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై కోనంకి కృష్ణ అభ్యంతరం తెలపడంతో వాసుతో పాటు అతని అనుచరులు బూతులతో రెచ్చిపోతూ దాడికి ప్రయత్నించారు. అక్కడున్నవ ఆరు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం తనపై జరిగిన దాడిపై తీసిన వీడియోను కోనంకి కృష్ణ విడుదల చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
● అ‘పూర్వ’ం.. ఆత్మీయం
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఇంటర్ కళాశాలలో 1980–83 విద్యాసంవత్సంలో కలసి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. అప్పట్లో 200 మంది కలసి చదువుకోగా, వీరిలో వంద మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. మనసారా పలకరించుకున్నారు. అప్పటి అధ్యాపకులు ఎవరూ లేకపోవడం కాస్త నిరాశ మిగిల్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ప్రస్తుత బేలోడు పాఠశాల హెచ్ఎం నాగరాజు, శివానంద, రామదాసు, వెంకటేశులు, శేషప్రభ, కేకేటీ మోహన్, బండి చిన్న, లాయర్ బాబు, ఎర్రిస్వామి తదితరులు నేతృత్వం వహించారు. -
ప్రభుత్వ ధోరణిని ఖండిస్తున్నాం
సాక్షి సంపాదకులు ధనుంజయరెడ్డి ఇంటిపై ఇటీవల పోలీసులు జరిపిన చట్ట విరుద్ధమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సెర్చ్ వారెంటు లేకుండా, అనుమతి లేకుండా ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం దారుణం. ఈ తరహా చర్యలు మౌలిక హక్కులను హరించడమే కాక, నిష్పక్షపాతంగా వార్తలు అందించే ప్రయత్నాలను అణచివేసే కుట్రలో భాగమేనని భావించాల్సి వస్తుంది. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించాలి. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. – రామ్కుమార్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) జిల్లా అధ్యక్షుడు -
తాగుడులో తగ్గేదేలా..
మందుబాబులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరాయంగా మందు దొరుకుతోంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కోరుకున్న బ్రాండ్ చేతికి చేరుతోంది. ప్రశాంతంగా తాగడానికి.. దోస్తులతో కలిసి విందు చేసుకోవడానికి వైన్షాపుల వద్ద సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మందు తాగుతూ ముక్క తింటూ ‘స్వర్గం’లో తేలియాడుతున్నారు. కూటమి పాలనలో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం విక్రయాలు దూసుకుపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు ‘మద్యం పురం’గా మారిందన్న విమర్శలున్నాయి. విచ్చలవిడి మద్యం కారణంగా గ్రామాల్లో ఇప్పటికే గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ మద్యం వినియోగం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మద్యపానం, బెల్టుషాపులు, పర్మిట్ రూములపై ఉక్కుపాదం మోపడంతో మద్యం నియంత్రణలో ఉండేది. కూటమి సర్కారు రాగానే ఎమ్మెల్యేల చేతుల్లోనే మద్యం షాపులు ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం నడుస్తోంది. తెల్లవార్లూ మద్యం అమ్ముతున్నా అడిగే నాథుడే లేరు. ‘సంపద సృష్టిస్తా.. అది పేదలకే పంచుతా’ అని పదే పదే చెప్పే చంద్రబాబు..ఇక్కడ మద్యం ద్వారా పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఊపందుకున్న మద్యం విక్రయాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయనేందుకు ఈ లెక్కలే ఉదాహరణ. రెండు జిల్లాల్లో గడిచిన 7 నెలల 25 రోజుల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మారు. ఊరూరా బెల్టుషాపులు, అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములతో మూడు పువ్వులు ఆరుకాయలుగా మద్యం వ్యాపారం జరుగుతోంది. అర్బన్లోనే ఎక్కువ.. తాజా గణాంకాలను చూస్తే పట్టణాల్లో మద్యం వినియోగం మరింత ఎక్కువైంది. కొత్తగా మద్యం వినియోగదారులు పెరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో రూ.646 కోట్ల విలువైన మద్యం వినియోగం కాగా.. అనంతపురం నగరంలోనే రూ.215 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. తాడిపత్రిలో రూ.84 కోట్లు, గుత్తిలో రూ.63 కోట్లు, గుంతకల్లులో రూ. 61 కోట్ల మద్యం వినియోగమైంది. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంలో రూ.86 కోట్లు, హిందూపురంలో రూ.57 కోట్లు, పెనుకొండలో రూ.61 కోట్లు, కదిరిలో రూ.54 కోట్ల విలువైన మద్యం వినియోగమైంది. ఊరూరా బెల్టుషాపుల కారణంగా మద్యం విచ్చలవిడిగా తాగుతున్నట్టు వెల్లడైంది. మద్యం వినియోగం (లీటర్లలో) బీరు వినియోగం (లీటర్లలో)మద్యం, బీరు వినియోగం విలువరోజుకు మద్యం కోసం చేస్తున్న వ్యయంఅనంతపురం జిల్లాలో మద్యం వ్యయంశ్రీసత్యసాయి జిల్లాలో మద్యం వ్యయం 8 నెలల్లో రూ.1,000 కోట్ల వ్యయం ఇదీ ఉమ్మడి జిల్లాలో మద్యం వినియోగం రూ.215 కోట్లతో అనంతపురం అగ్రస్థానం రూ.84 కోట్లతో రెండో స్థానంలో తాడిపత్రి -
ప్రముఖుల నివాళి..
గోరంట్ల: పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయాన్ని మిలటరీ, ప్రభుత్వ అధికారులు శనివారం రాత్రి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో మిలటరీ వాహనంలో కల్లితండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మురళీనాయక్ భౌతికకాయాన్ని ప్రజల సందర్భనార్థం ఉంచారు. వేలాదిమంది ప్రజలు, బంధుమిత్రులు, గ్రామస్తులతో పాటు అధికారులు, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సవిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాయదుర్గం ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్, ఎంఎస్ రాజు, కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తదితరులు మురళీనాయక్ భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, పార్టీ మడకశిర, హిందూపురం, కదిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్తో పాటు అత్తార్ చాంద్బాషా, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వీరజవాన్కు నివాళులర్పించారు. జవాన్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ను పరామర్శించారు.కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు జన్మిస్తావ్.. అంటూ కల్లితండాతో పాటు యావత్ భారత్ ప్రార్థిస్తోంది. సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అశువులు బాసిన ముడావత్ మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు. కల్లితండా నుంచి కశ్మీర్ వరకు.. మురళీనాయక్ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్నాయక్ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి.. దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్ రెజిమెంట్లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశ్మీర్కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్ఓసీ – లైన్ ఆఫ్ కంట్రోల్) జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీర మరణం పొందాడు. మువ్వన్నెల జెండా రెపరెపలు.. పాకిస్తాన్ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై.. జోహార్ మురళీనాయక్.. మురళీనాయక్ అమర్ రహే.. జై హింద్.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్.. ఖబడ్దార్.. పాకిస్తాన్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా..? కల్లి తండాలోని మురళీనాయక్ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. వీరజవాన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు ఉషశ్రీ చరణ్, ప్రకాష్రెడ్డి, దీపిక, మక్బూల్, ఈరలక్కప్ప, అత్తార్ చాంద్బాషా వీరజవాన్ మురళీనాయక్కు అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు భౌతికకాయం సందర్శించేందుకు తరలివచ్చిన ప్రజలు మార్మోగిన జయహో భారత్.. జైహింద్.. మురళి అమర్రహే నినాదాలు ‘యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’ – మురళినాయక్ తండ్రి శ్రీరామ్నాయక్ ‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ – మురళినాయక్ తల్లి జ్యోతిబాయి ‘ఈరోజు బార్డర్లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’ – స్నేహితుడు వినోద్తో చివరిరోజున మురళీనాయక్ మాటలు ‘జోహార్ మురళి నాయక్. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ – బెంగళూరు నుంచి అంత్యక్రియలకు వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్.మహేందర్ -
ఆ 10 ఎకరాలపై స్టేటస్కో
రాప్తాడురూరల్: ‘హైకోర్టు ఆదేశాలు’ అంటూ అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం పంచాయతీ పాపంపేట సర్వే నంబరు 106–1లోని 68 సెంట్లలో పెద్దపెద్ద భవనాలను రెవెన్యూ అధికారులు ఇటీవల తొలగించారు. ఈ వ్యవహారంపై శ్రీ విద్యారణ్య గురుకుల వైదిక పాఠశాల సంఘం అధ్యక్షుడు పట్నం శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ, పోలీసు అధికారులు భవనాలను తొలగించారంటూ పేర్కొన్నారు. రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్, రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓ, జీఎల్ఎన్ శ్రావణ్కుమార్, జి. హరిప్రసాద్, జి.నరేంద్రబాబు, జి.రమాశంకర్ను ప్రతివాదులుగా చేర్చారు. 68 సెంట్లు కాదు...106–1 సర్వేనంబరులో 4.86 ఎకరాలు, 106–2 సర్వే నంబరులో 4.20 ఎకరాలు, 119–1, 119–2 సర్వే నంబర్లలో 94 సెంట్లు కలిపి మొత్తం 10 ఎకరాలు తమదేనని పిటీషనర్ పేర్కొన్నారు. దీనిపై వాదోపవాదనలు విన్న తర్వాత నాలుగు రోజుల క్రితం హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. 10 ఎకరాలపై స్టేటస్కో ఇచ్చింది. ఈ క్రమంలో బాధితులు సదరు భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అక్రమంగా తొలగించారు.. 106–1 సర్వే నంబరులోని ఇళ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమంగా తొలగించారంటూ బాధితులు వాపోతున్నారు. జీఎల్ఎన్ శ్రావణ్కుమార్, జి. హరిప్రసాద్, జి.నరేంద్రబాబు, జి.రమాశంకర్ వేసిన పిటీషన్పై అనంతపురం మునిసిపాలిటీ పరిధిలోని 106–1 సర్వే నంబరులో సర్వే చేసి 68 సెంట్ల స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలంటూ 2024 డిసెంబరు 5న తీర్పు ఇచ్చిందన్నారు. దీన్ని పట్టుకుని రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా సంబంధం లేని రూరల్ పరిధిలోని పాపంపేట పొలంలోని 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లలో ఇళ్లను కూల్చివేశారన్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. భాగపరిష్కారాల్లోనూ చూపలేదు.. పైన పేర్కొన్న నాలుగు సర్వే నంబర్లలో 10 ఎకరాలను శ్రీ విద్యారణ్య గురుకుల వైదిక పాఠశాల సంఘం, శ్రీ హంపి విద్యారణ్య శంకర భారతి బ్రాహ్మణ వైదిక సంఘం రెండింటీకీ 5 ఎకరాల చొప్పున 1949లో ఆ భూమి హక్కుదారులైన రాచూరి, కొండపల్లి కుటుంబాలు దానవిక్రయం చేశాయి. ఈ భూమిలో మూడోవంతు రాచూరి కుటుంబానికి, ఒకటోవంతు కొండపల్లి కుటుంబానికి భాగాలుండేవి. ఈ రెండు కుటుంబాలు 1952లో భాగపరిష్కారాలు చేసుకున్నాయి. దాన విక్రయం చేసిన 10 ఎకరాల భూమి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 1962లో గొల్లపల్లి కుటుంబ సభ్యులు భాగ పరిష్కారం చేసుకున్నారు. ఇందులోనూ 10 ఎకరాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెబుతున్నారు. న్యాయం గెలిచింది హైకోర్టు తీర్పు ఒకటిస్తే ఇక్కడి అధికారులు మరొకటి అమలు చేసి మాకు అన్యాయం చేశారు. అనంతపురం మునిసిపాలిటీ పరిధిలోని 106–1 సర్వే నంబరులోని భూమి గుర్తించాలని స్పష్టంగా చెప్పినా... పోలీసు, రెవెన్యూ అధికారులు బలవంతంగా మా ఇళ్లను తొలగించారు. ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకెళ్లారు. పైగా మానాన్న, మేము కబ్జా చేశామని ఆర్డీఓ పదేపదే అన్నారు. ఏ ఆధారాలతో అన్నారో ఆయనకే తెలియాలి. అధికారులు కబ్జాదారులకు అండగా నిలిచారు. ఈ ఆధారాలను హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఉంచాం. చివరకు న్యాయమే గెలిచింది. నాలుగు సర్వే నంబర్లలో పది ఎకరాలు మాకే చెందుతుందని తీర్పు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేవియట్ వేశా. – పట్నం శివప్రసాద్ విద్యారణ్య నగర్లో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన బాధితులు 106–1, 106–2, 119–1, 119–2 సర్వే నంబర్లలో 10 ఎకరాలపై స్టేటస్కో హెచ్చరిక బోర్డు నాటిన బాధితులు -
సింహ వాహనంపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం దేవేరులతో కలసి సింహవాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ధ్వజారోహణ, యాగశాల ప్రవేశ, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహన సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించాలి● మాజీ మేయర్ రాగే పరుశురాంఅనంతపురం టవర్క్లాక్: ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ మేయర్ రాగే పరుశురాం అన్నారు. పదో తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక కనకదాస కల్యాణ మంటపంలో ప్రతిభ పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి రాగే పరుశురాంలో పాటు అడిషనల్ ఎస్పీ వెంకట్రాముడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కురుబలు తమ పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు మర్రిస్వామి, నాయకులు సంజీవరాయుడు, రాజహంస శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్, వీరనారప్ప, సతీష్, చిట్రా పరుశురాం, నారాయణ స్వామి, ఓబులేసు పాల్గొన్నారు.ప్రభుత్వ భవనం కూల్చివేతపై కేసు నమోదుబొమ్మనహాళ్: మండలంలోని గోవిందవాడలో ఎలాంటి అనుమతులు లేకుండా పశువైద్యశాల భవనాన్ని కూల్చివేశారని మండల పశువైద్యాధికారి వెంకటరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. 2001లో నిర్మించిన భవనం శిథిలావస్ధకు చేరిందని, దీంతో మరో భవనంలో విధులు నిర్వహించాల్సి వస్తోందని తన ఫిర్యాదులో వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భవనాన్ని గ్రామానికి చెందిన శరణబసప్ప, చిదానంద కూల్చి స్ధలాన్ని ఆక్రమించినట్లుగా వివరించారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రేపు కల్లితండాకు వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ నెల 13న గోరంట్ల మండలం కల్లితండాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా 11.30 గంటలకు కల్లి తండాకు చేరుకుంటారు. వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ను పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.నేడు గార్లదిన్నెలో ‘పరిష్కార వేదిక’అనంతపురం అర్బన్/గార్లదిన్నె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గార్లదిన్నెలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. తహసీల్దారు కార్యాలయం పక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. -
చర్యలు తీసుకోవాలి
అడ్మిషన్ల పేరుతో ప్రైవేటు ఉపాధ్యాయుల్ని యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు మొదలు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఇటీవల రాయదుర్గంలోని నారాయణ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించాం. విద్యాశాఖ అధికారులు పరిశీలించి కట్టడి చేయాలి. ముందస్తు పాఠ్య, నోట్ పుస్తకాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి, రాయదుర్గం. అడ్మిషన్ల పేరుతో వేధిస్తే చర్యలు అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులను , టీచర్లను వేధింపులకు గురిచేస్తే ప్రైవేటు పాఠశాలల యజమానులపై కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే అడ్మిషన్లు చేపట్టాలి. దీనికి విరుద్దంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రభుత్వ బడుల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసాద్బాబు, డీఈఓ, అనంతపురం -
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ కీలకం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజాస్వామ్య మనుగడలో పత్రికల పాత్ర చాలా కీలకమని, ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపి, పాలకులను గాడిన పెట్టే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించిందని పలువురు మేధావులు స్పష్టం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంత అవసరమో...పత్రికా స్వేచ్చకు కూడా అంతే అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకారణంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసుల చేపట్టిన తనికీలు అప్రజాస్వామిక విధానమేనని స్పష్టం చేస్తున్నారు. మీడియాపై రోజురోజుకూ పెరుగుతున్న దౌర్జన్య ధోరణికి ఇది నిదర్శనమని అంటున్నారు. ఽఇది ముమ్మాటికీ రాజకీయ దృష్టితో జరిగిన దాడేనని స్పష్టం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసుల తనఖీలను పౌర సమాజం తీవ్ర ఖండిస్తోంది. స్వయం ప్రతిపత్తి అవసరం న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఎంత అవసరమో...పత్రికా స్వేచ్చకూ అంతే అవసరం. పత్రికలను ఇది రాయాలి...అది రాయాలి అని మనం మాట్లాడకూడదని ఇటీవల సుప్రీంకోర్డు జడ్జి ఓ కేసు విషయంగా వ్యాఖ్యలు చేశారు. పత్రిక స్వేచ్ఛను ఎవరూ నియంత్రించాలని చేయకూడదని కూడా స్పష్టం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామిక వ్యవస్థలకు విఘాతం అని వ్యాఖ్యానించారు. బయట నుంచి పత్రికలను నియంత్రించాలని చూస్తే బెడిసి కొడుతుంది. – చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు తప్పులను ఎత్తిచూపి, విమర్శించే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించింది ‘సాక్షి’ ఎడిటర్ నివాసంలో పోలీసుల తనీఖీలు మీడియాపై దౌర్జన్య ధోరణికి నిదర్శనం ఇది ముమ్మాటికీ రాజకీయ దృష్టితో జరిగిన దాడే -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
పుట్లూరు: మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్దన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద టీడీపీ నాయకులు మద్యం అమ్మకాలు జరుపుతుండడంతో పెద్దన్న అభ్యంతరం తెలిపాడు. దీంతో టీడీపీ కార్యకర్త నవీన్తో పాటు మరికొందరు ఆదివారం దాడికి తెగబడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిపై కత్తితో దాడి పెద్దవడుగూరు: మండలలోని గుత్తిఅనంతపురం గ్రామానికి చెందిన తప్పిళ్ల ఆంజనేయులుపై శనివారం రాత్రి కత్తితో దాడి చేశారు. బండిశూల తిరునాలలో శివ, సాయితో ఆంజనేయులుకు గొడవ జరిగింది. స్థానికులు సర్ధి చెప్పి పంపారు. రాత్రి మటన్ పంచుకునే సమయంలో ఆంజనేయులుపై శివ, సాయి కత్తి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీఆర్సీ వెంటనే ప్రకటించాలి అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ 12వ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించి పీఆర్సీ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో యూటీఎఫ్ ఉద్యమ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్కుమార్ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు ఆలస్యమైతే ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను చెల్లించాలన్నారు. మెమో 57 ప్రకారం 2004 సెప్టెంబరుకు ముందు నియామకమైన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. టీచర్ల బదిలీల జీఓను వెంటనే విడుదల చేసి వేసవిసెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్జీటీలకు మ్యానువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు బదిలీల్లో కొత్తగా మంజూరై పోస్టులను ఖాళీలుగా చూపాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ.. పదోన్నతుల సీనియార్టీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ నాయకులు ఈశ్వరయ్య, రమణయ్య, హనుమంతరెడ్డి, రవికుమార్, సుబ్బరాయుడు, శేఖర్, రాముడు, చంద్రమోహన్, దేవేంద్రమ్మ పాల్గొన్నారు. కెంచంపల్లిలో చిరుత కలకలం కుందుర్పి: మండలంలోని కెంచంపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. గొర్రెల మందపై దాడి చేయడంతో కుక్కలు చుట్టుముట్టాయి. దీంతో చిరుత సమీపంలోని కొబ్బరి చెట్టు ఎక్కింది. అదే సమయంలో మేల్కొన్న గొర్రెల కాపరులు కేకలు వేస్తూ బెదరగొట్టడంతో గుట్టల్లోకి పరుగు తీసినట్లు గొర్రెల కాపరి ఈరన్న తెలిపాడు. -
సీనియారిటీ సమస్యను పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్ల టీచర్ల సీనియార్టీ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అనంతపురం, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీల్లో 2012 డీఎస్సీకి సంబంధించి జాయినింగ్ తేదీని ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో విధంగా నమోదు చేశారని గుర్తు చేశారు. కదిరి మునిసిపాలిటీలో 2013 జనవరి 2గా, తాడిపత్రి మునిసిపాలిటీలో 2012 డిసెంబరు 31గా, ధర్మవరం మునిసిపాలిటీలో 2013 జనవరి 10గా, రాయదుర్గం మునిసిపాలిటీలో 2013 జనవరి 5గా, హిందూపురం మునిసిపాలిటీలో 2013 జనవరి 4గా నమోదు చేశారన్నారు. ఒకే డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినప్పటికీ జాయినింగ్ తేదీలు వేర్వేరుగా ఉండడం వలన సీనియారిటీకి, తర్వాత పొందే పదోన్నతులకు ఇబ్బందిగా మారుతోందన్నారు. సమస్య పరిష్కారానికి వీరందరికీ కామన్ జాయినింగ్ తేదీ 2012, డిసెంబరు 31గా నమోదు చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సుధాకరన్ తదితరులు ఉన్నారు. ముందుగానే ‘నైరుతి’ అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్రన్ మాన్సూన్స్) ఈ సారి ముందుగానే పలకరించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్) ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలిస్తే ఉమ్మడి జిల్లాలో జూన్ ఒకటి, రెండో తేదీల్లోనే ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. 2020లో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న ప్రవేశించాయి. ఈ సారి మే 31న తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా... తాజాగా నాలుగు రోజులు ముందుగానే మే 27నే పలకరించవచ్చని ప్రకటించడం విశేషం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ముందుగానే ‘నైరుతి’ పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి. ఖరీఫ్కు కీలకం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగయ్యే లక్షలాది హెక్టార్ల పంటలకు నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలే ఆధారం. జూన్–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ మేర వర్షపాతం నమోదు కావాలి. నాలుగు నెలల కాలంలో 30 నుంచి 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావొచ్చని, విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు ఊపందుకుంటుందని చెబుతున్నారు. -
సేవకు ప్రతిరూపం.. స్టాఫ్నర్సులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలందించి, వారిని మామూలు స్థితికి తీసుకురావడంలో స్టాఫ్నర్సులకు సాటి మరెవ్వరూ లేరు. సాధారణంగా వైద్యులు రోగిని పరీక్షించి అవసరమైన సేవలను రాసి పెట్టి వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత రోగిని 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటూ వైద్య సేవలు అందించడంలో స్టాఫ్నర్సులే కీలకంగా ఉంటారు. ఈ క్రమంలోనే స్టాఫ్ నర్సుల సేవలపై ప్రజలను చైతన్యపరిచేలా ఏటా నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటలీ దేశానికి చెందిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854–55లో క్రిమియాలో జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు విశేష సేవందించారు. ఆమె సేవలకు గుర్తుగా ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో సోమవారం నర్సుల దినోత్సవాన్ని వైభవంగా జరుపుకునేందుకు నర్సులు సిద్ధమయ్యారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి.. జిల్లాలో 2020 మార్చి నుంచి కోవిడ్ నియంత్రణలో నర్సులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. మొదటి మూడు దశల్లో 25,47,582 మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా, వీరిలో 1,77, 596 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 45,327 మంది, కోవిడ్ కేర్ సెంటర్లలో 64,200 మంది చికిత్స పొందారు. అప్పట్లో ప్రభుత్వ సర్వజనాస్పత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో దాదాపు 2,360 మందికి పైగా స్టాఫ్నర్సులు సాహసోపేతమైన విధులు నిర్వర్తిస్తూ కోవిడ్ బారిన పడిన వారు కోలుకునేలా చేశారు. ఈ క్రమంలో వీరిలో 20 నుంచి 30 శాతం మంది కోవిడ్ బారిన పడినా.. కోలుకున్నాక తిరిగి ధైర్యంగా విధుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి స్టాఫ్నర్సుల సేవలకు గుర్తుగా రాష్ట్రస్థాయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. అనంతను అగ్రస్థానంలో నిలుపుతాం రోగులకు మెరుగైన సేవలందించడంలో స్టాఫ్నర్సుల పాత్ర చాలా కీలకం. క్షతగాత్రులు, ప్రాణాపాయ కేసులు, శస్త్రచికిత్సలు, సిజేరియన్, సాధారణ ప్రసవాలు తదితర సేవల్లో స్టాఫ్నర్సులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయిలో అనంతపురం సర్వజనాస్పత్రిని ప్రథమ స్థానంలో నిలుపుతాం. – నాగమణి, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
రాజకీయ దృష్టితో జరిగిన దాడే
సాక్షి ఎడిటర్ ఇంటిపై జరిగిన పోలీసు దాడి కేవలం రాజకీయ దృష్టితో జరిగిన దాడిగానే కనిపిస్తోంది. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి. దీనిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి. పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, పత్రికలను టార్గెట్ చేయడం అనుమతించరాదు. చూసీచూడనట్టు పోతే అది సమాజానికి నష్టదాయకమవుతుంది. సాక్షి ఎడిటర్ విషయంలో చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చాగల్లు రిజర్వాయర్లో వ్యక్తి గల్లంతు
శింగనమల: ఉల్లికల్లు సమీపంలోని చాగలు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లోకి దిగిన ఉల్లికల్లు శ్రీరాములు(48) గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఉల్లికల్లుకు చెందిన శ్రీరామలుకు భార్య, కుమారుడు ఉన్నారు. శ్రీరాములు శనివారం మద్యం తాగి చాగల్లు రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికులు చూసి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చేసరికి అతడు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ విజయకుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెస్క్యూ టీంను పిలిపించి సాయంత్రం వరకు నీటిలో వెతికించినా శ్రీరాములు జాడ కనిపించలేదు. -
18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు
● విజయవంతం చేయాలని ఈఓ పిలుపు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈఓ కె.వాణి పిలుపునిచ్చారు. ఆలయ సిబ్బందితో కలిసి శనివారం ఆమె హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈఓ మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాలు ఈ నెల 22 వరకు జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 18న స్వామివారికి పుష్పాలంకరణసేవ, ఉత్సవ మూర్తికి తులసీదళంతో లక్షార్చన పూజ, 19న స్వామివారికి డ్రైఫ్రూట్స్తో అలంకరణ, ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన, 20న స్వామివారి శ్రీగంధాలంకరణ సేవ, ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన, 21న 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల ఫలాలతో అలంకరణ, ఉత్సవమూర్తికి మల్లెపూలతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. చివరి రోజు ఈ నెల 22న స్వర్ణవజ్రకవచ అలంకరణలో స్వామివారిని తీర్చిదిద్ది, తోమాలతో విశేష పుష్పాలంకరణ, ఉదయం 9 గంటలకు శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగస్తాయని తెలిపారు. బాలుడిపై కుక్కదాడి యల్లనూరు: మండల కేంద్రంలో గురు ప్రజ్వల్ అనే రెండేళ్ల బాలుడిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. పాతపేటలోని రజక వీధిలో నివాసముంటున్న కొప్పేల గురుస్వామి, నాగమ్మ దంపతుల కుమారుడు గురు ప్రజ్వల్. తల్లి శుక్రవారం రాత్రి అన్నం తినిపిస్తుండగా ఇంటి ఆవరణలో ఉన్న కుక్క ఒక్కసారిగా ప్రజ్వల్పై దాడిచేసింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. -
దేవుని ప్రతిరూపం అమ్మ
మాటలకు అందనిది అమ్మ. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. అంతే కాదు దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు. మనకు జన్మనిచ్చి మనకోసం ఎంతో తాపత్రయపడిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. వారిని బాగా చూసుకుంటేనే మన జన్మకు సార్థకత. మాది కంబదూరు మండలం కొత్తపల్లి గ్రామం. అమ్మ పి.తులసీబాయి, నాన్న పి.అర్జున్ నాయక్. నేను ఒక్కడే కొడుకును. ఒక అక్క ఉంది. నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. మా నాన్న పోస్టుమాస్టర్గా పనిచేశారు. కొన్ని రోజులు అమ్మ అంగన్వాడీ టీచర్గా పనిచేశారు. నేను జీవితంలో స్థిరపడడానికి అమ్మ అండదండలే కారణం. ప్రతి దశలోనూ అమ్మ ప్రోత్సాహం ఉంది. – ప్రొఫెసర్ కేబీ చంద్రశేఖర్, మాజీ వీసీ, కృష్ణా యూనివర్సిటీ. -
●తల్లి ప్రోత్సాహంతోనే ఉన్నతస్థానాలకు చేరిన బిడ్డలు ●సందర్భం – నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మేము నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉండేవాళ్లం. అమ్మ వెంకట సుబ్బమ్మ, నాన్న వేణుగోపాలరావు. ఆరో తరగతికి కొడిగెనహళ్లిలో అడ్మిషన్ పొందాను. అప్పటి వరకు అమ్మతోనే ఉండేవాడిని. ఆళ్లగడ్డ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పొలం ఉండేది. ఆళ్లగడ్డ నుంచి నిత్యం పొలం పనులకు వెళ్తూ.. ఎంతో కష్టపడేవారు అమ్మ. మేము నలుగురు అబ్బాయిలం. వారిలో నేను పెద్దవాడిని. ముగ్గురు అమ్మాయిలు. నేను బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండగా నాన్న కాలం చేశారు. అప్పటి నుంచి మా కోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. జేన్టీయూ అనంతపురం వీసీ స్థాయికి ఎదగడానికి అమ్మ కృషి ఎంతో ఉంది. ప్రస్తుతం అమ్మకు 82 సంవత్సరాలు. అమ్మ అండదండలతోనే ఉన్నతస్థాయికి చేరాను. – ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ అనంతపురం అనంతపురం /అనంతపురం కల్చరల్: కల్మషం లేనిది అమ్మ ప్రేమ. అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ పేరు. నవమాసాలు మోసి బిడ్డలను కళ్లలో పెట్టుకుని చూసుకునే తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. మాతృభావన అక్షరాలలో చెప్పలేని, భావాలలో వ్యక్తీకరించలేని తీయని అనుభూతి. ఎంతమంది పిల్లలున్నా కంటికి రెప్పలా కాపాడుకుని ఉన్నత స్థానాలకు చేర్చిన తల్లిదండ్రులు వృద్ధులైపోతే భారంగా భావిస్తున్న రోజులివి. కర్కశ స్వభావమున్న బిడ్డలు తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. అలా పేగు పాశం కోసం తల్లడిల్లే ఎందరో అమ్మలు జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆశ్రమాలలో పిల్లల పిలుపు కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తల్లినే దైవంగా భావించి ఆరాధిస్తూ ఉన్నత స్థానాలను చేరుకున్న వారూ మరెంతోమంది ఉన్నారు. స్వచ్ఛమైన అమ్మ ప్రేమను తెలియజేయడానికి చరిత్రలో ఓ రోజును కేటాయించింది. మే నెలలో రెండవ ఆదివారాన్ని ‘అంతర్జాతీయ మాతృదినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం పలుచోట్ల మాతృదినోత్సవ వేడుకలు జరగనున్నాయి. తల్లులందించిన ప్రేమను చాటుకున్న ప్రముఖులు, అధికారుల అనుభవాలతో మదర్స్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. అమ్మ స్ఫూర్తితోనే ఉన్నత స్థాయికి -
వెరిటాస్ సైనిక్ స్కూల్కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా ఇటు విద్యార్థుల ఉన్నతికి, అటు దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమ విద్యను అందస్తూ వస్తున్నామన్నారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటివన్నీ సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. వెరిటాస్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తామన్నారు. విద్యా సంస్థలో ప్లస్–1 (ఇంటర్మీడియెట్)తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వైరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్రెడ్డి, బి.సందీప్రెడ్డి పాల్గొన్నారు. దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యం వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి -
వైఎస్సార్ కృషితోనే హంద్రీ–నీవా పూర్తి
ఉరవకొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితోనే హంద్రీ–నీవా మొదటి దశ పనులు 90 శాతం పూర్తి చేసి జీడిపల్లి వరకు నీటిని తీసుకురాగలిగారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని స్వగృహంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. ఛాయాపురం వద్ద సీఎం చంద్రబాబు ప్రజావేదిక సాక్షిగా హంద్రీ–నీవాకు సంబంధించి అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా పనులు చేపట్టారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ నీటి సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయించారన్నారు. దీనికి సంబందించి టెండర్లు కుడా పూర్తి చేశారని, పనులు ప్రారంభించే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. హంద్రీ–నీవాకు 60 నుంచి 70 టీఎంసీలు రావాలంటే కాలువను క్రమం తప్పకుండా వెడల్పు చేయాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో వెడల్పు చేస్తాం, రెండో దశ పనుల్లో కాలువకు లైనింగ్ చేస్తామంటే ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాయలసీమకు సమృద్ధిగా కృష్ణాజలాలు అందాలంటే మొదటి ఫేజ్లో 10వేల క్యూసెక్కులతో కాలువను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడతలో లైనింగ్ పనులు చేపట్టే బదులు ఆ నిధులతో కాలువ వెడల్పు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాపై అపారమైన ప్రేమే ఉంటే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఎయిమ్స్ను మంగళగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీంతో పాటు కర్నూలుకు మంజూరైన లా యూనివర్సిటీని ఇతర ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. సాంకేతికతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చే మీరు మరీ అమరావతి రాజధాని కోసం వేలాది కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఛాయాపురంలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గ్రామంలో భూములు కౌలుకు ఇస్తే ఎకరాకు రూ.60 వేలు ఇస్తారని చెబుతున్నారని, ఆ గ్రామస్థులతో మాట్లాడి అక్కడి భూములన్నీ కౌలుకు ఇప్పిస్తా ఎకరాకు రూ.60వేలు కచ్చితంగా ఇప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ములేక అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దమ్ము లేదు ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ధ్వజం -
అమ్మాయిలకు చదువు ముఖ్యం
మాది అనంతపురం మండలం ఉప్పరపల్లి. నాన్న రాముడు రైతు. అమ్మ నారాయణమ్మ. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు చాలా అవసరం అని అమ్మ గట్టిగా నమ్మింది. అలా చదివించడం వల్లే నేను ఎంపీడీఓ స్థాయికి చేరాను. సోదరి డాక్టర్ ఉజ్జినేశ్వరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. తమ్ముళ్లు నరేష్, విష్ణువర్ధన్ ఆపరేటర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఇలా అందరూ మంచి స్థానాల్లో స్థిరపడడానికి అమ్మ ప్రోత్సాహం, అందించిన సహకారమే కారణం. ఆడపిల్లలైనా ఇంటి పని చెప్పకుండా చదవాలంటూ పదే పదే చెప్పేది. అందరు తల్లులూ ఇలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుందో.. – విజయలక్ష్మి, ఎంపీడీఓ, రాప్తాడు -
కారు అదుపుతప్పి ముగ్గురు దుర్మరణం
బత్తలపల్లి/కళ్యాణదుర్గం రూరల్: కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల రామ్మోహన్ తన కుటుంబంతో పాటు స్నేహితుడు రాజశేఖర్రెడ్డి (45) కుటుంబ సభ్యులు, ముక్తాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ (25) మొత్తం పదిమంది కళ్యాణదుర్గం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో బయల్దేరారు. బత్తలపల్లి సమీపంలోని వై జంక్షన్ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న రామ్మోహన్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు బోల్తా పడింది. రామ్మోహన్, అతని భార్య మాధవి, కుమార్తెలు సాన్విక, జత్విక, కౌటిల్ కుమార్, రాజశేఖర్రెడ్డి, అతని భార్య దీపిక, కుమారుడు యస్విత్ రెడ్డి (7), కుమార్తె వీరాధ్యతో పాటు స్నేహితుడు ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్రెడ్డి, యస్విత్రెడ్డి మృతి చెందారు. ప్రశాంత్ కుమార్రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సానుభూతి తెలిపారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన -
హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘కృష్ణా జలాలు రాయలసీమ వాసుల కల. ఇందుకోసం మహానేత వైఎస్సార్తో పాటు వివిధ రాజకీయాల పార్టీల నాయకులు, మేధావులు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పెద్దఎత్తున పోరాటాలు చేశారు. దాని ఫలితమే హంద్రీ–నీవా. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఇప్పటికీ చంద్రబాబు మరో సారి తన నైజాన్ని బయటపెడుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. హంద్రీ–నీవాపై చర్చకు సిద్ధమా చంద్రబాబూ’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఏడేళ్లు, చంద్రబాబు హయాంలో 9 ఏళ్లకుపైగా...మొత్తం 16 ఏళ్లపాటు హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు గంపెడు మట్టిని కూడా వేయకుండా జిల్లాకు తీరని ద్రోహం చేశారన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే హంద్రీ–నీవా పరుగులు పెట్టిందన్నారు. హంద్రీ–నీవా కాలువను సందర్శించి ఛాయాపురం వద్ద చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే ఎటువంటి మార్పూ ఆయనలో కన్పించలేదని స్పష్టమైందని, ఆయన జీవితమంతా అబద్ధాలకే పరిమితమైందని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వారు చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకున్నారు తప్ప ఇంకేమీ లేదన్నారు. మిర్చి, కంది, శనగ, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లేదని, రైతాంగం పరిస్థితి గురించి చంద్రబాబు సభలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడలేదని, మంత్రి కేశవ్ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తేందుకే సమయం కేటాయించారని విమర్శించారు. ఒక్క అడుగూ ముందుకు వేయలేదు 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఓడీసీ వద్ద, 1996 మార్చి 11న అప్పటి సీఎం చంద్రబాబు ఉరవకొండ పోలీసు స్టేషన్ ముందు హంద్రీ–నీవాకు శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ కార్యక్రమంలో అప్పుడు మంత్రిగా ఉన్న పరిటాల రవి, శాసనసభ్యులుగా రామకృష్ణ, పయ్యావుల కేశవ్ ఉన్నారని, 1999 ఎన్నికలు వచ్చే వరకు ఒక గంప మన్ను కూడా తీయలేదని గుర్తు చేశారు. చివరకు శంకుస్థాపనకు రూ.2.5 లక్షలు ఖర్చు చేసిన కాంట్రాక్టర్కు డబ్బు ఇవ్వకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారని తెలిపారు. 1983, 1996 నాటి జీఓలను రద్దు చేసి తిరిగి 1999 జులై తొమ్మిదో తేదీ 40 టీఎంసీలుగా ఉన్న హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టును ఐదు టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి జీఓను ఇచ్చి ఆత్మకూరు వద్ద మరోసారి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2005లో సీఎంగా వైఎస్సార్ ఉన్న సమయంలో ఉరవకొండ పోలీసు స్టేషన్ వద్ద హంద్రీ–నీవా పనులకు శంకుస్థాపన జరిగిందని, ఆయన చలువతోనే ప్రాజెక్ట్ వేగవంతంగా సాగిందన్నారు. 2012 నవంబర్ 18న అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి నీటి విడుదల ప్రారంభిస్తే.. అదే నెల 29న ఎంపీగా ఉన్న తాను, అప్పటి మంత్రి రఘువీరా రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్కు నీరు తీసుకువచ్చామన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం, తాగునీటి అవసరాలకు, భవిష్యత్తులో పరిశ్రమలకు హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని, 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయకూడదన్నారు. తక్షణం లైనింగ్ పనులు ఆపి, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి కాలువను విస్తరించేలా చంద్రబాబును ఒప్పించాలన్నారు. 2019లో అనంతపురంలో కంటి వెలుగు ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలని విన్నవించామన్నారు. దీంతో 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరణకు అనుమతిస్తూ 2021 జులైలో జీఓ ఇచ్చారని, తమ ప్రభుత్వ హయాంలోనే రూ.4,647 కోట్లతో టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు ఖాజా, గోగుల పుల్లయ్య, చామలూరు రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పదహారేళ్ల పాలనలో గంపెడు మట్టి కూడా వేయలేదు శంకుస్థాపనలకే పరిమితం చేసిన ఘనుడు చంద్రబాబు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం అధికంగా కొనసాగింది. ఆకాశం పాక్షికంగా మేఘా వృతమైంది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
వీర జవాన్ కుటుంబానికి అండగా ఉంటాం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం కార్పొరేషన్: యుద్ధ భూమిలో శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందడం బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్తో జరుగుతున్న యుద్ధంలో పోరాడుతూ మురళీ నాయక్ మృత్యుఒడికి చేరడం బాధాకరమన్నారు. ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదని చెప్పారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి
తాడిపత్రి: మద్యం అతిగా సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన తాడిపత్రి రూరల్ పరిధిలోని జగనన్న కాలనీలో జరిగింది. సీఐ శివ గంగాధర రెడ్డి తెలిపిన మేరకు.. తాడిపత్రి పట్టణం నంద్యాల రోడ్డుకు చెందిన జయ చంద్రారెడ్డి (45) శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం జగనన్న కాలనీలోని ఓ ఇంటి ముందు మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయచంద్రారెడ్డిని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకుర్పారణ గావించారు. ముందుగా శాస్త్రోక్తంగా ధ్వజారో హణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజ స్తంభం వద్ద ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి ప్రత్యేక పూజలు చేశారు. నేడు నృసింహుని జయంతి.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నృసింహస్వామి జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారు సింహ, చంద్ర ప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈఓ రమేష్బాబు తెలిపారు. బాలికతో శ్రీవారి నిశ్చితార్థం రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శనివారం స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో కంకణధారణ జరిగింది. వందేళ్ల నుంచి వస్తున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా పద్మశాలియ అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం(ఈ నెల 15న) జరిపించేందుకు నిశ్చితార్థం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఏడాది పట్టణానికి చెందిన అరవా శ్రీనివాసులు, శ్వేత దంపతుల కుమార్తె శ్రీధన్యతో శ్రీవారి కల్యాణం జరగనుంది. శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, పుర పెద్దలు, దేవదాయశాఖ అధికారులు, పెళ్లికుమార్తె తరఫున బాలిక తల్లిదండ్రులు, బంధువులు, పద్మశాలీయ కులస్తులు తాంబులాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, సాయంత్రం శ్రీవారి సింహవాహనోత్సవం జరుగుతుందని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీయ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు అరవా శివప్ప, చుంచుల నాగప్ప, మున్సిపల్చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, గౌని ఉపేంద్రరెడ్డి, పొరాళ్ల శివకుమార్, గాజుల వెంకటేశులు, బంగి శంకర్ పాల్గొన్నారు. -
‘ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వం ’
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరమైన సమస్యలు అటుంచి ఆర్థికేతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. దీంతో ఉద్యోగులు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పీఆర్సీ కమిషన్ నియమించలేదన్నారు. దీంతో ఉద్యోగులకే నష్టమని, పీఆర్సీ బకాయిలు పెండింగ్లో పెడతారన్నారు. 2024 జనవరి, జూన్, 2025 జనవరికి సంబంధించి మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ నెల దాటితే మరో డీఓ వచ్చి కలుస్తుందని, ఇప్పటికీ ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. ఆక్రమణల తొలగింపు, ఇసుక దందా, రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో తహసీల్దార్లు బలవుతున్నారన్నారు. 2014లో గుంటూరులో ఆక్రమణల తొలగింపు క్రమంలో అప్పటి తహసీల్దారు తాతారావుపై కోర్టు చర్యలు తీసుకుందన్నారు. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనకు తహసీల్దారుగా డిమోషన్ ఇచ్చిందని వాపోయారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వం, అధికారుల ఆదేశాల మేరకు ఆయన పనిచేశారని, అలాంటప్పుడు ఈ కేసులో ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. పైవారు చెప్పిన పనిచేసినందుకు ఆ అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఒక నిర్ణయంపై అధికారులు లిఖితపూర్వంగా ఆదేశాలిస్తేనే అమలు చేయాలని తహసీల్దార్లకు చెబుతున్నామన్నారు. తహసీల్దారు కార్యాలయాల నిర్వహణకు, ప్రోటోకాల్కు రూ. లక్షలు ఖర్చు అవుతున్నా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కోర్టు కేసులకు లీగల్ చార్జీలు ఇవ్వడం లేదన్నారు. తహసీల్దారు కార్యాలయాల్లో తెల్లకాగితాలు కూడా సొంత డబ్బుతో కొనాల్సి వస్తోందన్నారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోందన్నారు. ఉన్నతాధికారులు తమ నిర్ణయాలను కిందిస్థాయి అధికారులపై రుద్దుతున్నారన్నారు. రెవెన్యూలోని అన్ని కేడర్లలో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట రాజేష్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్రావు, కార్యదర్శి సోమశేఖర్, మహిళ విభాగం చైర్పర్సన్ సురేఖరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప పాల్గొన్నారు. -
ఊరూరా ఉద్విఘ్నం
దేశరక్షణలో నేలకొరిగి భరతమాత నుదిట తిలకమై నిలిచిన వీర జవాన్ మురళీనాయక్కు అనంత ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి కల్లితండా వరకూ వెంటసాగి జోహార్ అగ్నివీరుడా అంటూ నినదించింది. ●వీరసైనికుడు మురళీ నాయక్కు ఘన నివాళి ●స్వగ్రామం చేరుకున్న వీర జవాన్ భౌతికకాయం ●బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు తరలింపు ●దారిపొడవునా పూలవర్షం కురిపిస్తూ ఘన నివాళులు ●ఊరూరా వందేమాతరం ఆలపించిన ప్రజలు ●రోడ్డుకు ఇరువైపులా నిలబడి సైనికుడికి సెల్యూట్ చేసిన వైనం ●నేడు కల్లితండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ●తరలిరానున్న ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు గోరంట్ల: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్మూకశ్మీర్లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన కల్లితండాకు చెందిన జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వందేమాతరం పాడుతూ మురళీనాయక్కు ఘన నివాళులర్పించారు. ఘొల్లుమన్న కల్లితండా సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది. ‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటిగంట మధ్యలో అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...
పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో అమరుడైన ఆర్మీ జవాన్ మురళీనాయక్ను తలచుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా బోరున విలపిస్తోంది. అతని స్వగ్రామం కల్లితండా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. జమ్మూకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ మురళీనాయక్ వీరమరణం పొందిన వార్త శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలియగానే ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతోపాటు కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులు మురళీనాయక్తో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కల్లితండాకు వెళ్లి మురళీనాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.కల్లితండా.. కన్నీటి సంద్రం అమరుడైన బిడ్డను తలచుకుని కన్నీరుమున్నీరైన తండావాసులు గోరంట్ల: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ఓదార్చారు. మురళీనాయక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. సలాం సైనికసైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన..ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబోట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం సోమందేపల్లిలో విద్యాభ్యాసం సోమందేపల్లి: వీర మరణం పొందిన మురళీ నాయక్ పదో తరగతి వరకు సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లగా.. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివారు. 2016–17 టెన్త్ బ్యాచ్కు చెందిన మురళీ నాయక్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. మురళీ నాయక్ మృతి విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జునతో పాటు అతని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమతో గడిపిన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ మురళీనాయక్ రాణించేవాడన్నారు. తమ తండా యువకుడు దేశం కోసం ప్రాణాలరి్పంచడం గర్వంగా ఉందని నాగినాయనిచెరువు తండా సర్పంచ్ అంజినాయక్, గ్రామస్తులు చెబుతున్నారు. నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండాదేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండాసైన్యంలో ఒక్కరోజున్నా చాలు నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా. బోర్డర్లో పనిచేయడం నా కల. ఒక్కరోజు పనిచేసినా చాలు. దేశం కోసం చావనైనా చస్తా. నా శవంపై భారత జెండా కప్పాలి. – స్నేహితులు, సన్నిహితులతో మురళీనాయక్ చెప్పిన మాటలివీ..దేశభక్తి ఎక్కువగా ఉండేది మురళి నాయక్ నాకు మంచి మిత్రుడు. చాలా దేశభక్తి ఉండేది. పోలీసు లేదా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని తపన ఉండేది. వీర మరణం పొందడం గర్వకారణంగా ఉంది. మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధ కల్గిస్తోంది. – చిరంజీవి, సోమందేపల్లిక్రమశిక్షణతో చదివేవాడు మురళీ నాయక్ పదో తరగతి వరకూ మా పాఠశాలలో చదివాడు. చాలా క్రమశిక్షణతో చదువుకునే వాడు. ఎటువంటి వివాదాలు లేని విద్యారి్ధ, దేశ భక్తి కూడా ఎక్కువగా ఉండేది. మా పాఠశాలలో చదివి దేశం కోసం ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉంది. – మల్లికార్జున, కరస్పాండెంట్ , విజ్ఞాన్ స్కూల్, సోమందేపల్లి -
పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈఓ సాకే రమేష్బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, బాలాజీస్వామిల ఆధ్వర్యంలో మేళతాళాలతో పెన్నహోబిలం నుంచి ఊరేగింపుగా ఆమిద్యాలకు వెళ్లారు. అక్కడి పెన్నోబులేసుని ఆలయంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పెన్నహోబిలానికి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలో కొలువుదీర్చారు. ముగిసిన గ్రూప్–1 మెయిన్స్ అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 3న ప్రారంభమైన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఏడు రోజుల పాటు జరిగిన పరీక్షల్లో అభ్యర్థుల హాజరు 64.28 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ బాలాజీ పీజీ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. పీవీకేకే కళాశాలలో 234 మంది, శ్రీ బాలాజీ కళాశాలలో 360 మంది.. మొత్తం 594 మంది అభ్యర్థులకు గాను 381 మంది హాజరయ్యారు. పరీక్షల తీరును కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పరిశీలించారు. పరీక్షలకు లైజన్ అధికారులుగా డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జునుడు వ్యవహరించారు. ‘పరివాహన్’లోనే ట్రాలీల రిజిస్ట్రేషన్ అనంతపురం సెంట్రల్: ట్రాక్టర్ ట్రాలీల రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ‘పరివాహన్’ వైబ్సైట్లోనే జరుగుతాయని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) ఎం.వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ–ప్రగతి సైట్లో రిజిస్ట్రేషన్లు జరిగేవని, కొద్దిరోజులుగా ఇందులో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణాశాఖలో ప్రతి సేవా ఆన్లైన్లోకి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయాన్ని ట్రాలీల తయారీ డీలర్లు గమనించి ట్రేడ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అందరినీ పరివాహన్ వెబ్సైట్లోకి మార్పు చేయనున్నట్లు తెలిపారు. ట్రాలీల రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అనంతపురం కార్పొరేషన్: ఆపరేషన్ సిందూర్లో పాలుపంచుకుని పాక్ సైనికుల కాల్పుల్లో అసువులు బాసిన గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ కుటుంబానికి మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీనాయక్ మృతి ఎంతో బాధించిందన్నారు. వీర జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. యుద్ధానికి సిద్ధమైన మాజీ సైనికులు అనంతపురం: అవసరమైతే యుద్ధానికి తాము కూడా సిద్ధమంటూ జిల్లా మాజీ సైనికులు తెలిపారు. యుద్ధంలో అమరుడైన మురళీనాయక్ చిత్రపటానికి అనంతపురం జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వీరజవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ తిమ్మారెడ్డి, కరణంకృష్ణ, బి.రవికుమార్, మహమ్మద్ గౌస్, బీఏ హుస్సేన్, సుహెల్, రాజగోపాల్, వెంకటరమణ, ఏవీ రమణ, ఐ.శ్రీనివాసులు, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
మృతుడి కుటుంబసభ్యులకు పరామర్శ
కళ్యాణదుర్గం రూరల్: కుందుర్పి సమీపంలో గురువారం చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన కరిగానపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రాజు కుటుంబసభ్యులను ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య శుక్రవారం పరామర్శించారు. కళ్యాణదుర్గంలోని సీహెచ్సీలో ఉన్న రాజు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చా రు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, మండల కన్వీనర్లు హనుమంతురాయుడు, గోళ్ల సూరి, మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, సర్పంచ్ విజయ్, నాయకులు షెక్షావలి, లింగప్ప, తిప్పేస్వామి, రామిరెడ్డి, తదితరులు ఉన్నారు. ‘ఎన్ఐసీ’కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి గుంతకల్లు టౌన్: కర్ణాటకలోని బెల్గాంలో ఉన్న రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకూ జరిగే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (ఎన్ఐసీ)కు గుంతకల్లులోని ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ (స్వయం ప్రతిపత్తి) కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి గాదిలింగ ఎంపికయ్యాడు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదరు విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపల్ రవిశంకర్ శర్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నారాయణ అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి తాడిపత్రి టౌన్: స్థానిక రజక కల్యాణ మంటపం సమీపంలో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (58) మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. పట్టణంలో భిక్షాటనతో జీవించేవాడై ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
పత్రికా స్వేచ్ఛపై పోలీసుల దాడి దుర్మార్గం
‘జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడం సిగ్గుచేటు’ అనంతపురం కల్చరల్: కక్షపూరితంగానే సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిని పోలీసులు అవమానించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి వారెంట్లు లేకుండా సోదాలు చేపట్టడం పోలీసు ప్రతిష్ట దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వాస్తవాలను ప్రచురించకుండా భయపెడుతున్న ప్రభుత్వ విధానాలు అభ్యంతరకరమన్నారు. న్యాయస్థానం సుమోటోగా కేసు స్వీకరించి, పోలీసు అధికారులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టానికి, న్యాయనికి విలువలు లేని రోజులు వచ్చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను, పత్రికా స్వేచ్ఛను మంటకలుపుతున్న విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారన్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం అత్యంత దుర్మార్గమని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విజయవాడలో సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంలో పోలీసులు చేపట్టిన తనిఖీలను తప్పుబట్టారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచే కథనాలు ప్రచురించే మీడియాపైనే ఇంతకు దిగజారితే... ఇక ప్రశ్నించే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాలను సాక్షి పత్రిక రోజూ అనేక కథనాలతో వెలుగులోకి తెస్తోందన్నారు. వాస్తవాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షి దిన పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి నివాసంపై పోలీసులతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం అవివేకమన్నారు. నిజాలు వెలుగులోకి రానీయకుండా గొంతునొక్కే ప్రయత్నంగానే దీనిని భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా పోలీస్ అధికారులు రాజ్యాంగం, చట్ట ప్రకారం వ్యవహరించకపోతే ప్రజల తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శి సురేష్ -
13న కల్లితండాకు వైఎస్ జగన్
● వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం రొద్దం: దేశ రక్షణలో అసువులు బాసిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అఽధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న కల్లితండాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని కంబాలపల్లిలో పర్యటించారు. అంతకుముందు కల్లితండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన కల్లితండా వాసి మురళీ నాయక్ కుటుంబీకులను ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారన్నారు. వీర జవాన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వయంగా వస్తున్నట్లు వెల్లడించారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ అనంతపురం కార్పొరేషన్: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మాతృభూమి కోసం మురళీనాయక్ ప్రాణత్యాగం చేశారన్నారు. చిన్న వయసులోనే మృతి చెందడం చాలా బాధగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రధానంగా మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ●దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ ●కన్నీటిసంద్రమైన స్వగ్రామం కల్లితండా ●అతని జ్ఞాపకాలు తలచుకుని రోదిస్తున్న స్నేహితులు ●ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్ పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్ అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన.. ఉగ్రమూకలకు బదులు చెప్పావ్ దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్ శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్ మాతృభూమి కోసం చివరి నెత్తురుబొట్టునూ చిందించావ్ సలాం సైనిక.. నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం ఆ పా(పి)కిస్తాన్ గాళ్లకు మరణశాసనం రాస్తాం యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై ప్రేమని చాటిచెబుతాం జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం సలాం సైనిక... సలాం గోరంట్ల: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ వీరమరణం గురించి తెలియగానే తండావాసులంతా మురళీనాయక్ స్వగృహానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్లను ఓదార్చారు. మురళీనాయక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి మెండుగా ఉన్న మురళీ నాయక్...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. దేశభక్తి ఎక్కువ మురళీ నాయక్ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ. ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు. – చాంప్లానాయక్, కల్లితండా నమ్మలేకపోతున్నాం మురళీనాయక్ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం. – గోవింద నాయక్, కల్లితండా సలాం సైనిక సోమందేపల్లిలో విద్యాభ్యాసం -
కక్ష సాధింపుపై కన్నెర్ర
● సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు పత్రికాస్వేచ్ఛను హరించడమే ● అనంతలో జర్నలిస్టుల నిరసనాగ్రహం అనంతపురం: మీడియాపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగడంపై జర్నలిస్టులు కన్నెర్రజేశారు. అక్రమ కేసులు పెడుతూ, ఖాకీలతో దాష్టీకానికి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో గురువారం పోలీసులు సోదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా అక్రమంగా ఇంట్లోకి చొరబడి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్య పాలనలో ఇదో మాయని మచ్చగా అభివర్ణించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జ్ గుండం రామచంద్రారెడ్డి (ఆర్సీఆర్), సాక్షి ఎడిషన్ ఇన్చార్జ్ తోలేటి మహేశ్వరరెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ శివారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, జాప్ జిల్లా అధ్యక్షుడు బండి సుబ్రహ్మణ్యంరెడ్డి, మన అనంతపురం పత్రిక ఎడిటర్ తోట నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు రమణ, శ్రీకాంత్, ఆశ్రయ కృష్ణారెడ్డి, ప్రముఖ కవి రియాజుద్దీన్ అహమ్మద్ తదితరులు సంఘీభావం తెలిపారు. సోదాలు అప్రజాస్వామిక చర్య రాష్ట్రంలో ప్రముఖ దినపత్రిక ఎడిటర్పై వేధింపులకు పాల్పడటం చరిత్రలో ఇదే తొలిసారి. అసలు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఉందా? విలేకరులపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేయడం అప్రజాస్వామిక చర్య. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీసు అధికారులపై కేసులు పెడతాం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తాం. – మచ్చా రామలింగారెడ్డి, ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు కక్ష సాధింపు తగదు ఉరవకొండ/వజ్రకరూరు: కూటమి ప్రభుత్వ పాలనలో లోటుపాట్ల గురించి ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమైతే.. వాటిని సరిదిద్దుకునేది పోయి పత్రిక ఎడిటర్పై కక్ష సాధింపు చర్యలకు దిగడం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేపట్టడాన్ని ఖండించారు. ఇది పత్రికాస్వేచ్ఛపై దాడిగా భావించాల్సి వస్త్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి పోలీసులు తమ వ్యవస్థకున్న ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడం కూటమి నేతల అవివేకానికి నిదర్శనమన్నారు. సంఘటితంగా పోరాడాలి సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు చేసి అవమానపరిచారు. సంబంధం లేకుండా పత్రికా సంపాదకులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు న్యాయం? అక్రమ కేసులు, దాడులపై జర్నలిస్టులు అందరూ సంఘటితంగా పోరాడాలి. – గుండం రామచంద్రారెడ్డి, సాక్షి బ్యూరో ఇన్చార్జ్ వార్తలు వస్తే కేసులా..? పత్రికల్లో వార్తలు రాస్తే కేసులు నమోదు చేయడం పాత్రికేయుల నైతిక బలాన్ని హరించాలని చూడడమే. కోర్టులో కేసు నడుస్తుండగా, కనీసం నోటీసులు ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలో సోదాలు చేయడం బాధాకరం. పోలీస్ శాఖ అనైతిక చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో మీడియాకు గొడ్డలిపెట్టు వంటిది. ప్రజాస్వామ్యవాదులు, మీడియా స్వేచ్చ, భావ ప్రకటనాస్వేచ్ఛ కోరుకునే వారందరూ ఇలాంటి ఘటనలను ఖండించాలి. –బండి సుబ్రహ్మణ్యంరెడ్డి, ‘జాప్’ జిల్లా అధ్యక్షుడు -
అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండానే ప్రారంభోత్సవం
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత మాత్రం విలువ లేదని తేలిపోయింది. ఇందుకు ఆత్మకూరు మండలం పంపనూరులో సచివాలయ భవన ప్రారంభోత్సవమే నిదర్శనం. గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేకుండానే శుక్రవారం స్థానిక టీడీపీ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ప్రభుత్వాధికారులు వాపోతున్నారు. ఎంపీపీకు, సర్పంచ్కు కూడా సమాచారం ఇవ్వకుండా కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శిలాఫలకంలో తహసీల్దార్, ఈఓఆర్డీ, పంచాయతీ సెక్రటరీ పేర్లు లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. యువకుడి బలవన్మరణం అనంతపురం: మద్యం సేవించడం మానలేక జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న ఇగవే పరుశురాం (34)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు ఉన్నారు. పాత చీరల వ్యాపారం చేసే వారి వద్ద కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన నాలుగేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. కూలీ పనులతో సంపాదించిన డబ్బు మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టేవాడు. దీంతో సంసారం గడవడం కష్టమైంది. ఇప్పటికీ ఐదు నెలల ఇంటి అద్దెలు కూడా చెల్లించలేకపోయాడు. మూర్ఛ వ్యాధి తిరగబెడుతుండడంతో ఇటీవల ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాడు. మద్యం మానేస్తే నయమవుతుందని వైద్యులు తెలపడంతో దిక్కుతోచలేదు. మద్యం లేకపోతే తాను చనిపోతానంటూ కుటుంబసభ్యులతో చెప్పుకునే వాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు సముదాయిస్తూ వచ్చేవారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అతిగా జ్వరం బారిన పడ్డాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి బెడ్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ● ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు అనంతపురం అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం స్థానిక రెవెన్యూ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయకపోవడం, డీఏ ప్రకటించకపోవడం, డీఏ, పీఆర్సీ ఆరియర్లపై స్పష్టత లేకపోవడం, మధ్యంతర భృతి ఊసేత్తకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఫలితం మరో విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజేష, జిల్లా చైర్మన్ దివాకర్రావు, ప్రధాన కార్యదర్శి పీఎస్ఖాన్, మహిళ విభాగం జిల్లా చైర్మన్ సురేఖరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణజ్యోతి, జిల్లా నాయకులు, శ్రీసత్యసాయి జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకూ
అనంతపురం: యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించే దిశగా అనంతపురంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పేరుతో ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు కానున్న రతన్ ఇన్నోవేషన్ హబ్కు అనుబంధంగా ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ హబ్ (హబ్ స్పోక్ సెంటర్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అనంతపురంలోని ప్రభుత్వ పాటిటెక్నిక్ కళాశాల పరిధిలోని ఐదు ఎకరాల్లో శాశ్వత భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భవనాలు అందుబాటులో వచ్చే వరకూ తాత్కాలికంగా జేఎన్టీయూ (ఏ) పాత పాలక భవనం నుంచి కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ సంస్థల పర్యవేక్షణలో.. ప్రాంతీయ హబ్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలు పర్యవేక్షించనున్నాయి. సీడ్ క్యాపిట్లను ప్రభుత్వం అందిస్తుంది. అనంతపురంలో ఏర్పాటు కానున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు ఇండస్ట్రీయల్ భాగస్వాములుగా కియా కంపెనీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ వ్యవహరించనున్నాయి. నాలెడ్జ్ భాగస్వాములుగా జేఎన్టీయూ (ఏ), సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అనంతపురం కీలకంగా వ్యవహరించనున్నాయి. హబ్లు పూర్తిస్థాయిలో పనిచేసే వరకూ జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో డీఐసీ జీఎం, డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ల లక్ష్యంగా ఈ హబ్ పనిచేయనుంది. సెక్షన్ ఫారం 8 కంపెనీగా నమోదు రతన్టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్ను సెక్షన్ ఫారమ్ 8 కంపెనీగా నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్ నమోదుపై చర్చ జరిగింది. పరిశ్రమలతో మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంఏఓ), ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ)ను ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి, వ్యూహాత్మక నిర్ణయాలను పరిశీలించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ‘అనంత’లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 5 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు అప్పటి వరకూ జేఎన్టీయూ(ఏ) పాత పాలక భవనంలో నిర్వహణ నూతన ఆవిష్కరణలకు దన్నుగా.. విద్యార్థి ఆలోచన ఏదైనా సరే దాని ఆవిష్కరణకు రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్ దోహదపడుతుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ సులభతరంగా నిర్వహించడంతో పాటు ఇందుకు అయ్యే ఖర్చునూ హబ్ భరిస్తుంది. నూతన ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక శిక్షణను అందిస్తారు. ఈ ప్రాజెక్ట్లో జేఎన్టీయూ (ఏ) భాగస్వామిగా ఉండడం గర్వకారణం. –ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ(ఏ) -
జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు
ఉరవకొండ/ వజ్రకరూరు: ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూసిన జిల్లా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నిరాశపరిచింది. శుక్రవారం వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనతో పాటు ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సంపదను సృష్టించి జిల్లాను అభివృద్ధి చేస్తానని, ఇంట్లో ఎక్కువమంది పిల్లలను కని జనాభా పెంచేలా చూడాలని చెప్పడం తప్ప హామీల అమలుపై సీఎం తన ప్రసంగంలో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. తల్లికి వందనం పథకం త్వరలోనే అమలు చేస్తామని, అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం వాటా ఇచ్చిన రోజే రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడు అమలు చేస్తారని కొందరు మహిళలు అడిగితే.. సీఎం సమాధానం ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన సూపర్ సిక్స్, తదితర పథకాల గురించి మాట్లాడకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రజావేదికలోకి పోలీసులు ఉదయం 9 గంటలకే ప్రజలను అనుమతించడంతో ఎండ తీవ్రతకు కూర్చోలేక అవస్థలు పడ్డారు. సభకు వచ్చిన వారికి సరిపడు తాగునీరు అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. నిర్వాసితులకు పరిహారం మంజూరు చేస్తాం జీడిపల్లి భూనిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం మంజూరు చేస్తామని, 34, 36 ప్యాకేజీ పనులు పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి, కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తామన్నారు. మెగా డ్రిప్ ఇరిగేషన్ కింద 40వేల ఎకరాలకు జీడిపల్లి ద్వారా నీరు అందించి పథకాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఉరవకొండకు టెక్స్టైల్ పార్కు, రామసాగరం వంతెన మంజూరు చేస్తామన్నారు. జీడిపల్లి, బీటీపీ పనులకు ప్రాధ్యానత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. ఛాయాపురంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇళ్ల నిర్మాణాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్శర్మ, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన అడ్డుకునేందుకు యత్నం వజ్రకరూరు మండలం ఛాయాపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జీఓ 77ను రద్దు చేయకుండా జిల్లాలోకి అడుగుపెట్టనీయబోమని ఏబీవీపీ నాయకులు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో వజ్రకరూరు సమీపంలో సీఎం డౌన్ డౌన్, జీఓ 77ను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తు సీఎం సభ వద్దకు చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చిన్నహోతురు వద్ద అరెస్టు చేసి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 77ను రద్దు చేసి ప్రతి విద్యార్థికీ స్కాలర్షిప్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ రద్దు చేయకుండా మోసం చేశారన్నారు. ప్రతి విద్యార్థికీ ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సుధీర్, నిఖిల్, తేజ, భూతరాజు, భూషి, గిరి, చంద్రశేఖర్, కృష్ణ పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అమలుపై స్పష్టత ఇవ్వని సీఎం చంద్రబాబు -
యంత్రం తగిలి వృద్ధుడి మృతి
గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామంలో అజాక్స్ యంత్రం తగిలి వి.వేమన్న గౌడ్ (75) మృతిచెందాడు. ఆయనకు భార్య చిట్టెమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. వివరాలు.. జీనులకుంటలోని ప్రాథమిక పాఠశాల వద్ద సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అజాక్స్ యంత్రంలో కంకర, సిమెంట్ వేసి కలుపుతుండగా వెనుక వైపున ఉన్న వేమన్న ఎడమకాలుకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అందేలోపు మృతి చెందాడు. మృతుని కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అశాసీ్త్రయ విధానాలతో రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర ఒత్తడికి గురవుతోందని, ఇదే తీరు కొనసాగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూటమి సర్కార్ను ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. పాఠశాలల పరిరక్షణ, పీఆర్సీ, మధ్యంతర భృతి, డీఏ మంజూరు అంశాలపై శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్ధీన్, రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, పూర్వపు అధ్యక్ష, కార్యదర్శులు రఘురామిరెడ్డి, నరసింహులు మాట్లాడారు. దశాబ్ధాల నుంచి అమలులో ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోదని మండిపడ్డారు. ఫౌండేషన్ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటి, రెండు తరగతులకు మాత్రమే పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఒక్కో విధమైన అశాసీ్త్రయ విధానాలను అవలంభిస్తూ ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పాటిస్తోందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సమస్యలను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి, మూడు పెండింగ్ డీఏల మంజూరులో ఆలస్యాన్ని ఇకపై ఉపేక్షించబోమన్నారు. రెండవ దశ పోరాటంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినట్లుగా తెలిపారు. మూడవ దశలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఈ నెల 14న ధర్నా తలపెట్టామన్నారు. కార్యక్రమంలో నాయకులు దేశాయి నాగరాజు, డేనియల్ మోహన్రెడ్డి, రామాంజనేయులు, సతీష్కుమార్, సర్ధార్వలి, వెంకటరమణ, శ్యాం, రవి, కృష్ణ, లక్ష్మీప్రసాద్, ప్రేమావతి, అంజలీదేవి, వన్నప్ప, బాలరామ్మోహన్, ఓబులేసు, శ్రీనివాసులు, నాగభూషణం, శ్రీనివాసులు, సూర్యనారాయణ, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో ఏపీటీఎఫ్ నాయకులు -
ప్రమాదంలో వ్యక్తి మృతి
గార్లదిన్నె: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య (46)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కోటంకలో జరిగిన బంధువుల ఇంట శుభకార్యానికి హాజరైన ఆయన కార్యక్రమం ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. స్వగ్రామానికి చేరువకాగానే ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి కిందపడడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108 ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపారు. దళిత రైతుల పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం అనంతపురం: జిల్లాలోని దళిత రైతుల పురోగతికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్ట్ నిర్వహణను జేఎన్టీయూ(ఏ) దక్కించుకుంది. డిపార్ట్మెంటల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీకి చెందిన సీడ్ (సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్) విభాగం ద్వారా అమలవుతున్న ఎస్సీ (షెడ్యూల్ కాస్ట్) హబ్ కింద రూ.47,62,047 నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్ను జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్, ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ ఎస్. చంద్రమోహన్రెడ్డి, కెమికల్ విభాగం ప్రొఫెసర్ బి.దిలీప్కుమార్, ఎలక్ట్రికల్ విభాగం డాక్టర్ జి. మమత నిర్వహించనున్నారు. మూడేళ్ల గడువున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేరుశనగ ద్వారా నూనె, స్నాక్స్, టమాట ద్వారా సాస్, డ్రై టమాట వంటి విలువ జోడింపు ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే రైతులకు మార్కెట్ లింకేజీలు, నిల్వ సౌకర్యాలు, ఉత్పత్తుల బ్రాండింగ్ వంటి అంశాలపై మద్దతునివ్వనున్నారు. ప్రత్యేకంగా దళిత రైతులకు నైపుణ్య శిక్షణా శిబిరాలు, వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు, మార్కెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సందర్భంగా పరిశోధక బృందాన్ని శుక్రవారం జేఎన్టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు అభినందించారు. -
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా పర్యటనలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఈరోజు(శుక్రవారం) ఉరవకొండ నియోజకవర్గం చాయపురంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది.. జీవో 77ను రద్దు చేయాలంటూ ఏబీవీపీ కార్యకర్తంలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గో బ్యాక్ సీఎం అంటూ ఫ్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని సీఎం చంద్రబాబు ఎదుట నిరసన తెలపకుండా అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత చిన్నహోతూరు ప్రభుత్వ పాఠశాలలో పోలీసులు నిర్భందించారు. బీజేపీ అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసనపై సర్వత్రా చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఒకవైపు ఎన్డీఏ కూటమిలో ఉండగా, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నిరసన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసింది. -
కుందుర్పి జెడ్పీటీసీకి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
కుందుర్పి: స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రాధాస్వామి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన సహచరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. గురువారం సాయంత్రం తన సహచరుడు కరిగానిపల్లికి చెందిన ఉప్పర రాజు(37)తో కలసి ద్విచక్ర వాహనంపై మలయనూరు నుంచి కుందుర్పికి వెళుతుండగా కేజీబీవీ వద్దకు చేరుకోగానే ఎదురుగా రాళ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై పడింది. ఘటనలో రాధాస్వామికి కుడికాలు విరిగింది. వాహనం నడుపుతున్న రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రులను కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. చికిత్స అందేలోపు రాజు మృతిచెందాడు. రాజుకు భార్య కమలమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాధాస్వామిని అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఫోన్లో రాధాస్వామిని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సహచరుడి మృతి -
రూ.3 లక్షల వరకు ఏపీజీబీ పంట రుణాలు
● ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు ఆర్ఎం శ్రీదేవి అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు రూ.3 లక్షల వరకు పంట రుణాలు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (పూర్వ ఏపీజీబీ) రీజనల్ మేనేజర్ పి.శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తమ బ్యాంకు శాఖల్లో పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల పంపిణీ జరుగుతోందన్నారు. ఎలాంటి మార్ట్గేజ్ లేకుండా పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా రూ.3 లక్షల వరకు పంట రుణం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ బ్యాంకుల విలీనంతో ఇపుడు ఏపీజీబీ శక్తివంతంగా మారిందన్నారు. ప్రజల అవసరాల నిమిత్తం మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. డిపాజిట్లపై 7.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.1 శాతం వడ్డీ రేటు వర్తింపజేశామన్నారు. రైతు నగదు దోచుకెళ్లిన దుండగులు కళ్యాణదుర్గం రూరల్: రైతు నగదు దుండగులు దోచుకెళ్లిన ఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. వివరాలు.. బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన రైతు తిమ్మప్ప గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్లో రూ.5,00,000 విత్డ్రా చేశాడు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. పట్టణంలోని రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద బైక్ను ఆపి నగదు అందులోని బ్యాగులో ఉంచి మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చిన తిమ్మప్ప బైక్ బ్యాగ్ తీసి ఉండటం గుర్తించాడు. అందులోని నగదు కనపించలేదు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు యాడికి: జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కురుకుంట గ్రామానికి చెందిన విజయభాస్కరరెడ్డి కనిపించడ లేదు. గత నెల 28న యాడికి మండలం కొట్టాలపల్లిలో జరిగిన వివాహ వేడుకలకు వచ్చిన ఆయన ఇప్పటి వరకూ ఇంటికి చేరుకోలేదు. ఆయన ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో గురువారం యాడికి పీఎస్లో తండ్రి గురివిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత బొమ్మనహాళ్: అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం బొమ్మనహాళ్ మండలంలోని సంగమేశ్వరస్వామి దేవాలయం వద్ద విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. బొమ్మనహాళ్ మండలంలోని పలు గ్రామాల్లో పేదల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసిన 37 క్వింటాళ్ల రేషన్ బియ్యన్ని కేఎ34డి2274 నంబరు గల బొలెరో వాహనంలో కర్ణాటకలోని చిత్రదుర్గ్ జిల్లా బి.జి.కెరె గ్రామానికి తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు విజిలెన్సు ఎస్ఐ గోపాలుడు తెలిపారు. ఘటనకు సంబంధించి డ్రైవర్ బసవరాజు, బియ్యం వ్యాపారులు జి. యల్లప్ప, రుద్రన్నపై రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్నాయక్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. నీట మునిగి యువకుడి మృతి గార్లదిన్నె: ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన షేక్ బాబావలి (28) కల్లూరులో వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ అదే గ్రామంలోనే నివాసముంటున్నాడు. గురువారం వేసవి తాపాన్ని తాళలేక స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లిన బాబావలి ఉన్నఫలంగా నీట మునిగాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గత ఈతగాళ్లను రంగంలో దించి బాబావలిని వెలికి తీశారు. అప్పటికే ఊపిరి ఆడక మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహమ్మద్గౌస్ బాషా తెలిపారు. కాగా, బాబావలికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. -
ఆర్టీసీలో ఆగని దోపిడీ
అనంతపురం క్రైం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో పాలన పూర్తిగా గాడి తప్పింది. అధికారంలో ఉన్నప్పుడే అందిన కాడికి దోచుకోవాలనే తీరుతో కొందరు ఉద్యోగులు బరితెగించారు. అక్రమాలకు తెరలేపి సంస్థ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. విషయం బయటకు పొక్కితే బదిలీ చేస్తారు.. అప్పటి వరకూ జేబులు నింపుకుంటే చాలు అనే ఫార్ములాను అనుసరిస్తూ రూ.లక్షలు దిగమింగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమార్కుల కొమ్ము కాస్తున్న ఆర్ఎం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మచ్చుకు కొందరి అక్రమాలు ఇలా.. ఉరవకొండ డిపోలో మేనేజరుగా పనిచేసిన ఓ ఉద్యోగి తీరు కారణంగా ఆర్టీసీకి రూ. 42 లక్షల రాయితీ దక్కకుండా పోయింది. ఈ విషయం కాస్త బహిర్గతం కావడంతో ఆయన గుట్టుచప్పుడు కాకుండా స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసి తప్పుకున్నారు. ఈ విషయం తెలిసినా.. ఆర్ఎం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఆయన ఉద్యోగ విరమణ ఫైల్కు క్లీన్చిట్ ఇచ్చి పూర్తి స్థాయిలో సహకరించారు. అంతేకాక చాలా కాలం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. చివరకు విషయం వెలుగు చూడడంతో అలాంటి పొరపాటు జరగలేదని బుకాయించారు. కాగా, ఇదే అంశంపై గతంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశంలో ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చర్చ లేవనెత్తడం గమనార్హం. జల్లిపల్లి, మరూరు, కాశేపల్లి, రామాపురం వద్ద ఉన్న నాలుగు టోల్ గేట్లకు బస్సులకు రాయితీ పాసులు ఎందుకు పొందలేదని ఆరా తీసినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిపో మేనేజరుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసినట్లు తెలిసింది. చిరు ఉద్యోగుల తప్పిదాలను భూతద్దంలో చూసి కఠినంగా శిక్షించే అధికారులు... అదే ఉన్నత కేడర్లో ఉన్న వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుండడం ప్రస్తుతం కార్మికుల్లో అసహనం రేకెత్తిస్తోంది. వెలుగు చూడని దారుణాలెన్నో ఆర్టీసీలోని కీలక విభాగాల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీలోని విజిలెన్స్ లాంటి కీలక విభాగం కూడా ఆర్ఎం కనుసన్నల్లో పని చేస్తోంది. ఆర్ఎం చాంబర్ వద్ద విజిలెన్స్ కానిస్టేబుల్ ఒకరిని కాపలాగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని విభాగాలను ఇక్కడ అధికారులు వారి సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆర్టీసీ బస్టాండులో నో పార్కింగ్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బును విజిలెన్స్ సిబ్బంది వాటాలు వేసుకుని పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అనంతపురం ఆర్టీసీ రీజియన్లోని అన్ని విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే దారుణాలెన్నో వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. కార్గొ సేవల్లోనూ అక్రమాలుఆర్టీసీలో కార్మికుల కష్టంతో వచ్చే ఆధాయాన్ని ఎలా దోచుకోవాలో కొంత మంది ఉద్యోగులకు బాగా వంటబట్టింది. ఇందుకు కార్గొ సేవలే ఉదాహరణ. కార్గొ కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారికి వాహనం ఏర్పాటు చేసుకునే వెసులు బాటును ఆ సంస్థ కల్పించింది. అయితే సదరు అధికారి వాహనం లేకుండా నెట్టుకొస్తూ రికార్డులు సృష్టించి నెలకు రూ.30 వేలు చొప్ను తన సొంత ఖాతాలోకి వేసుకుంటున్నట్లు సమాచారం. అద్దె వాహనం పేరుతో ఏడాదికి పైగా రూ.3.60 లక్షలు లూటీ చేసినట్లు ఆధారాలతో సహా ఇటీవల పట్టుబడిన ఆ అధికారిపై నేటికీ ఎలాంటి చర్యలు లేవు. రూ.లక్షలు దండుకుంటున్న ఉద్యోగులు అటకెక్కిన ఉరవకొండ డిపోలో రూ.42 లక్షల గోల్మాల్ జిల్లా కేంద్రంలో అద్దె వాహనం పేరుతో రూ.3.60 లక్షలు స్వాహా ఏ ఒక్కరిపై కనిపించని చర్యలు ఆర్ఎం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు -
తిరునాలలో అపశ్రుతి
పెద్దవడుగూరు: బండిశూల తిరునాలలో అపశ్రుతి చోటు చేసుకొంది. వివరాలు.. గురువారం గుత్తి అనంతపురం, కాశేపల్లి మీదుగా పామిడి మండలం రామరాజు పల్లి వరకూ ఎద్దులతో సురబండిని లాగే కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కాడిమానుపై కూర్చొని ఎద్దులను తోలుతుండగా జి. వెంకటాంపల్లికి చెందిన సిద్దపు రాజు అదుపు తప్పి కింద పడ్డాడు. పాదాలపై బండి చక్రం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సల కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే పెద్దవడుగూరుకి చెందిన రైతులు తమ ఎద్దులను సురబండి లాగడానికి కట్టారు. ఈ క్రమంలో ఉన్నఫలంగా ఎద్దుల పట్టెడు తెగిపోయింది. అక్కడే ఉన్న రైతు నాగభూషణ ఎద్దును కట్టడి చేయడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేసింది. క్షతగాత్రుడికి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
వజ్రకరూరు: స్థానిక ఎస్బీఐ అధికారుల తీరును నిరసిస్తూ బ్యాంక్ ఎదుట గురువారం ఓ గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. వజ్రకరూరు మండలం ఎన్ఎన్పీ తండాకు చెందిన హేమ్లనాయక్, సాలమ్మ దంపతులు తమకున్న 1.47 ఎకరాల భూమిలో పంటల సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్బీఐలో రూ.51వేల పంట రుణాన్ని పొందారు. రెండేళ్ల క్రితం సాలమ్మ మృతి చెందింది. ఆమె పేరుమీద తీసుకున్న రుణానికి వడ్డీతో కలిపి రూ.71,131 అయిందని, ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బుధవారం సాయంత్రం హేమ్ల నాయక్ బ్యాంక్ అధికారులను కలసి డెత్ సర్టిఫికెట్ అందజేసి, మాట్లాడాడు. దీంతో సాలమ్మ ఖాతాలో ఉన్న రూ.21,600 ఆమె పేరుతో ఉన్న పంట రుణానికి బ్యాంక్ అధికారులు జమ చేశారు. విషయం తెలుసుకున్న హేమ్ల నాయక్ గురువారం బ్యాంక్ అధికారులను కలసి మాట్లాడాడు. ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపం చెంది బ్యాంక్ ఎదుట పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎస్ఐ నాగస్వామి వెంటనే పురుగుల మందు డబ్బా లాక్కొని న్యాయం జరిగేలా చూస్తానని భరోనివ్వడంతో రైతు శాంతించాడు. -
ఆర్డీటీకి నిధులు తెప్పిస్తా
అనంతపురం టవర్క్లాక్: ఆర్డీటిపై కక్ష సాధింపు చర్యలు తగదని ప్రభుత్వాలకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సూచించారు. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చించి ఆర్డీటీకి నిధులు అందేలా చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. గురువారం అనంతపురం పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమలో ప్రతి ఇంటికీ సేవలు అందించిన ఘనమైన ఆర్డీటీకి ఉందన్నారు. ఆర్డీటీకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. నిధుల సమీకరణకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ఆపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఇందు కోసం పాకిస్తాన్కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరి బలోపేతం చేయాలని కోరారు. ● ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ -
దుర్మార్గం.. అత్యంత హేయం
● కూటమి సర్కారుపై జర్నలిస్టు సంఘాల మండిపాటు ● ‘సాక్షి’ ఎడిటర్పై వేధింపులు సిగ్గుచేటంటూ విమర్శలు ● మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్రకు తెరలేపారని ధ్వజం అనంతపురం: ఏపీలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో గురువారం విజయవాడలోని ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎలాంటి నోటీసులు లేకుండానే లోపలికి ప్రవేశించి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాల పేరుతో హల్చల్ చేశారు. ఈ క్రమంలో కూటమి సర్కారు నిరంకుశ ధోరణిపై జిల్లా జర్నలిస్టు సంఘాల నేతలు భగ్గుమన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటంటూ మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛపై దాడే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది కచ్చితంగా పత్రికా స్వేచ్ఛపై సర్కారు చేస్తున్న దాడే. ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కూడా ఈ నిరంకుశత్వాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు వెళ్లడం అన్యాయం. – కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛను కాపాడాలి జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడటం సరికాదు. సాక్షాత్తూ ఓ పత్రిక ఎడిటర్ను టార్గెట్ చేయడం శోచనీయం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే.ఇప్పటికై నా పత్రికా ఎడిటర్లపై బూటకపు కేసులు ఎత్తివేయాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – తలారి రామాంజినేయులు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఏపీలో విలేకరులపై దాడులు పెరిగాయి. పాత్రికేయులను దూషిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం, వేధించడం నిత్య కృత్యంగా మారాయి. అధికార పార్టీకి చెందిన వారే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన పత్రికా రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. – రాచమల్లు భోగేశ్వర రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు విలేకరులపై దాడులు పెరిగాయి -
అకాల వర్షాలకు రూ.35.47 కోట్ల పంట నష్టం
● కలెక్టర్ వి.వినోద్ కుమార్ అనంతపురం అర్బన్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.35.47 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ 21న కురిసిన వర్షానికి వ్యవసాయ పంటలకు రూ.15.90 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.93 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. అదే నెల 29న కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ పంటలకు రూ.16 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.63 లక్షలు, ఈ నెల 3వ తేదీ కురిసిన వర్షానికి వ్యవసాయ పంటలకు రూ.38 లక్షలు, ఉద్యాన పంటలకు రూ.1.63 కోట్ల నష్టం సంభవించిందన్నారు. ఇందుకు సంబం ధించి నివేదికలను ప్రభుత్వానికి పంపించామన్నారు. వేసవిలో అకాల వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు పిడుగుల కారణంగా ఒకరు మృతి చెందారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ‘పీ–4’ సర్వే నిర్వహించి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 63,379 కుటుంబాలను గుర్తించామన్నారు. సంపన్నుల సహకారంతో వీటిని బంగారు కుటుంబాలుగా మారుస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు, సంపన్నులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సీపీఓ అశోక్కుమార్, కో–ఆర్డినేషన్ విభాగం సూపరిటెండెంట్ యుగేశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్లు తప్ప నీళ్లు పారించడం లేదు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాయలసీమ జిల్లాల్లో హంద్రీ–నీవా ఆయకట్టు గ్రామాల్లో 40 టీఎంసీల నీళ్లు పారించేలా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలువను తీసుకొచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు పారిస్తున్నారు తప్ప నీళ్లు పారించడం లేదు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల పర్యవేక్షణకు శుక్రవారం ఉరవకొండ నియోజకవర్గానికి వస్తున్న సీఎం చంద్రబాబు ఇక్కడి రైతుల మనోభావాలను తెలుసుకుంటే బాగుంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు, రైతు సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయన్నారు. ఇక్కడి రైతాంగ ప్రయోజనాలను తుంగలో తొక్కి కుప్పానికి నీళ్లు తరలించాలని చూస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీ–నీవాను వైఎస్ జగన్మోహన్రెడ్డి 83 టీఎంసీలకు పెంచారన్నారు. వైఎస్సార్, చిత్తూరు జిల్లాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం గండికోట నుంచి గాలేరు–నగరి ద్వారా 20 టీఎంసీల ప్రాజెక్ట్ను తీసుకొచ్చిందన్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల దాకా ఖర్చు చేశారన్నారు. తక్కిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. గండికోట నుంచి 20 టీఎంసీల నీళ్లు వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు తీసుకెళ్తే...ఆ మేరకు 20 టీఎంసీల నీళ్లు అనంతపురం, కర్నూలు జిల్లాలకు మిగులుతాయన్నారు. ‘దివంగత నేత ఎన్టీఆర్ను అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడాలని లేదా.. మా ప్రాంత ప్రజలు వ్యవసాయం వదిలి బెంగళూరు, కేరళ ప్రాంతాలకు భిక్షాటనకు పోవాలని భావిస్తున్నారా’ అని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి, ఆర్డీటీ ట్రస్టులు జిల్లాకు రెండు కళ్లు భగవాన్ సత్యసాయి బాబా, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆదర్శమూర్తులని ప్రకాష్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఆర్డీటీ సంస్థపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, విదేశాల నుంచి నిధులు అందకుండా ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు సత్యసాయి బాబా గౌరవాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి, ఆర్డీటీ ట్రస్టులు జిల్లాకు రెండు కళ్లులాంటివని, వాటికి ప్రాణం పోయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రామగిరి మండల పర్యటనలో హెలికాప్టర్ దిగిన తర్వాత ఆయనపై అభిమానంతో వేలాదిమంది హెలీప్యాడ్ వద్దకు చొచ్చుకువచ్చారని, ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనన్నారు. హెలీప్యాడ్లోకి కేవలం 41 మందిని అనుమతించాలని ఎస్పీకి జాబితా అందజేసినా అంతమంది చొచ్చుకువచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానిదా... పోలీసులదా... తమదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కొన్ని మీడియా సంస్థలు అబద్ధాలను ప్రచారం చేశాయన్నారు. తనకు డీఎస్పీ విజయకుమార్ మైకు ఇస్తే... హెలీప్యాడ్ వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ తాను రోడ్డుపైనే కూర్చుని, అందరూ ఇక్కడే కూర్చోవాలంటూ పదేపదే కోరానన్నారు. పోలీసుల వైఫల్యం వల్ల జగనన్నకు ప్రాణహాని కలుగుతోందని, ఆయన భద్రతపై కేంద్ర హోంమంత్రి, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి భద్రతను తప్పించడానికి, ఆయనకు అపాయం తలపెట్టడానికి ప్రకాష్రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించారంటూ తనవైపు మళ్లించారన్నారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన హత్యను మరుగుపరచడానికి మీడియా చేసిన పాపం ఇదన్నారు. కురుబ లింగమయ్యపై దాడి చేసిన సమయంలో 20 మంది ఉన్నారని కుమారులే చెబుతున్నా కేవలం ఇద్దరిపై కేసు పెట్టి తక్కిన 18 మందిని తప్పించారన్నారు. హంతకుల ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిని రానీయనని, హెలికాప్టర్ దిగనీయనని మాట్లాడిన పరిటాల సునీత నోరు నొక్కాల్సింది పోయి హత్యను ఖండించిన, ప్రశ్నించిన తమ గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు గంగుల సుధీర్రెడ్డి, బండి పవన్, మాదవరెడ్డి, మంజునాథ్, నరేంద్రరెడ్డి, లోకనాథరెడ్డి, ఈశ్వరయ్య, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మా ప్రాంత ప్రజలను భిక్షాటనకు పంపాలని చూస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేపట్టొద్దు’ అని యావత్తు ఉమ్మడి జిల్లా రైతాంగం ముక్త కంఠంతో నినదిస్తున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రోడ్లెక్కి ఆందోళనలు చ
ఆత్మకూరు సమీపంలో జరుగుతున్న హంద్రీ–నీవా లైనింగ్ పనులు అనంతపురం సెంట్రల్: ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నీటి అవసరాలు బాగా పెరిగాయి. 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. భవిష్యత్లో పారిశ్రామికంగా కూడా మరింతగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ సమయంలో ఏ ప్రభుత్వమైనా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకొచ్చే పనులకు శ్రీకారం చుడుతుంది. కానీ చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ పూతలు పూసే పనులకు తెరలేపింది. స్వలాభం కోసమే.. హంద్రీనీవా ఫేజ్–2 కింద 7 ప్యాకేజీల్లో లైనింగ్ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ. 936 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్ పనులకు టెండర్లు ఈ ఏడాది మార్చిలో ఖరారయ్యాయి. ఏప్రిల్ నుంచి పనులు చేపడుతున్నారు. జూన్ 10 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో వేగంగా పూర్తి చేయాలనే నెపంతో కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనుల నాణ్యతను ఇంజినీర్లు ఎవరూ పరిశీలించే సాహసం చేయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వలాభం కోసమే హంద్రీ–నీవా లైనింగ్ పనులకు తెర తీశారని, టీడీపీ ముఖ్య నేతలకు భారీగా ముడుపులు అందాయని, దీంతోనే ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకే... ‘లైనింగ్ పనులు వద్దు మొర్రో’ అని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. కేవలం నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో లైనింగ్ పనులు చేపడుతూ, తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉమ్మడి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ కుటుంబంతోనే హంద్రీనీవాకు జీవం.. 2004కు ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను చూసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంత పరిస్థితులను చూసి చలించిపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తలచి.. అప్పటివరకూ తాగునీటి పథకంగా శిలాఫలకానికే పరిమితమైన ‘హంద్రీ–నీవా’ను తాగు,సాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2009 నాటికే మొదటి దశ పనులను పూర్తి చేశారు. రెండో దశ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయి. ఆయన చలువతో 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతున్నాయి. ఇక.. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవాను మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోగలుతున్నామని, దీన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రూ. 6,182 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే, ఆ క్రమంలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైపోయింది. జగన్ హయాంలో నిర్ణయం మేరకు పెరగాల్సిన సామర్థ్యం6,300 క్యూసెక్కులు చంద్రబాబు ప్రభుత్వం పరిమితం చేసింది3,850 క్యూసెక్కులు లైనింగ్.. దోపిడీకి టెండరింగ్ హంద్రీ–నీవా లైనింగ్ పనుల్లో కాంట్రాక్టర్లకు డబ్బే డబ్బు కాంట్రాక్టు సంస్థల నుంచి నేతలకు భారీగా ముడుపులు! నాసిరకంగా పనులు జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు జూన్ 10 నాటికి పనులు పూర్తి హంద్రీ–నీవా లైనింగ్ పనులు జూన్ 10 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పనులు పరిశీలించేందుకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురానికి నేడు సీఎం వస్తున్నారు. అక్కడ గ్రామ సభ నిర్వహిస్తారు. అనంతరం లైనింగ్ పనులపై హంద్రీ–నీవా అధికారులతో సమీక్షిస్తారు. జిల్లాలో పనులు అన్నిచోట్లా ప్రారంభమయ్యాయి. – నాగరాజ, సీఈ, జలవనరులశాఖ -
ఎమ్మెల్యేకే రూమ్ ఇవ్వరా.. నీకెంత ధైర్యంరా..?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఎమ్మెల్యే మనుషులొస్తే రూములు లేవంటారా.. ఎంత ధైర్యం మీకు.. ఇకపై మీరు హోటల్ ఎలా నడుపుతారో చూస్తాం’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో మాట్లాడుకోవడానికి సూట్రూమ్ కావాలని తన ముఖ్య అనుచరుడిని నగరంలోని అలెగ్జాండర్ హోటల్కు పంపించారు. అయితే హోటల్ మేనేజర్ రూములు ఖాళీగా లేవని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు పరుష పదజాలంతో మేనేజర్పై విరుచుకుపడ్డారు. మెడపట్టి గెంటినట్టు బాధిత సిబ్బంది చెప్పారు. ఇవన్నీ సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. గొడవ సమయంలో హోటల్లో ఎమ్మెల్యే అనుచరులు గంగారాం, పి.హరిక్రిష్ణ ఉన్నట్టు సీసీ ఫుటేజీల్లో తేలింది. ఆ సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి హోటల్ బయట కారులోనే ఉన్నారు. మేనేజర్ను కారులో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే సైతం తీవ్ర పదజాలంతో దూషించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే అడిగితే సూట్రూం ఇవ్వవా.. నీకెంత ధైర్యంరా.. ఏమనుకుంటున్నావ్ నా గురించి’ అంటూ తిట్టడమే కాకుండా ఇకపై హోటల్ ఎలా నడుపుకుంటారో చూస్తా అంటూ బెదిరించినట్లు తెలిసింది. నాలుగేళ్ల పాటు సూట్రూమ్ ఫ్రీగా ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి.. పోలీసుల సోదాలు ముగిసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ముగ్గురు ఆ శాఖ అధికారులు హోటల్లో సోదాలకు వెళ్లారు. కిచెన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. చికెన్ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ల్యాబుకు పంపిస్తున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఇక.. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయాన్నే మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొలి్పనట్లు తెలిసింది. హోటల్ భవన నిర్మాణం అక్రమంగా ఉందని, తనిఖీలకు వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో లిక్కర్ వ్యాపారి (సింధూర వైన్స్) పిట్టు రామలింగారెడ్డిపై కూడా దగ్గుపాటి ప్రసాద్ దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. పది నిమిషాల్లోనే పోలీసుల రైడింగ్ఈ ఘటన జరిగిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే.. టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్కు ఫోన్ చేసి హోటల్పై రైడ్ చేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పోలీసులు హోటల్కు చేరుకున్నారు. ప్రతి రూము గాలించారు. చిన్న తప్పు కనిపించినా కేసు బుక్ చేయాలని శతవిధాలా యతి్నంచారు. అయితే, చివరకు ఏ లోపం కనిపించకపోవడంతో పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. తొలుత హోటల్లో రైడ్ చేయలేదని చెప్పిన సీఐ శ్రీకాంత్ యాదవ్.. మళ్లీ కొద్ది సేపటికే అన్ని హోటళ్లలాగే ఇక్కడ చేశామని ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. -
వేగం.. సులభం.. సురక్షితం!
రాయదుర్గం టౌన్: జేబులో రూ.500 నోటు పెట్టుకుని దుకాణానికి వెళ్లడం.. నచ్చిన వస్తువు కొనుగోలు చేసిన తర్వాత చిల్లర సమస్యతో సతమతమవడం.. ఇది నిన్నామొన్నటి వరకూ ప్రజలు పడిన ఇబ్బందులు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటిల్ మనీ రూపాంతరం చెందడంతో ఈ ఇబ్బందికి చెక్ పడింది. ఈ లావాదేవీలు వేగంగా, సులభంగా, సురక్షితంగా జరుగుతుండడంతో అందరూ వీటిపై ఆకర్షితులయ్యారు. దీంతో చిన్నపాటి కిళ్లీ కొట్టు మొదలు... షాపింగ్ మాల్స్ వరకూ ఎటు చూసినా డిజిటల్ పేమేంట్లు ఊపందుకున్నాయి. ఎటు చూసినా ఫోన్పే, గూగుల్పే, పేటీఎం క్యూ ఆర్ కోడ్లు కనిపిస్తున్నాయి. చిటికెలో చెల్లింపులు జిల్లాలో దాదాపు రెండు లక్షలకు పైగా వ్యాపార సముదాయాలున్నాయి. కిరాణాకొట్లు, కిళ్లీ బంకులు, వస్త్ర దుకాణాలు, మెడికల్ షాపులు.. చివరికి బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు సైతం డిజిటల్ మనీని స్వీకరిస్తున్నారు. మరికొన్ని చోట్ల కార్డు స్వైపింగ్ కోసం పీఓఎస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు తమ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యాప్లను డౌన్లోడ్ చేసుకుని చిటికెలో చెల్లింపులు జరుపుతున్నారు. ఆన్లైన్ ద్వారా జిల్లాలో రోజూ రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నట్లు అంచనా. చిల్లరతో పనేదీ? గతంలో రూపాయి, రెండు, ఐదు రూపాయల కాయిన్లకు డిమాండ్ ఉండేది. హోటళ్లు, కిరాణా దుకాణాల్లో అవసరమున్న చిల్లర లభ్యత కాగా కొనుగోలుదారులు ఇబ్బంది పడేవారు. దీంతో వ్యాపారులు రూ.10 కమీషన్ చెల్లించి వంద రూపాయలకు చిల్లర తీసుకునేవారు. ఒకప్పుడు ఈ తరహా వ్యాపారం జిల్లాలో భారీగా జరిగేది. ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపుల కారణంగా చిల్లర అవసరాలు పూర్తిగా తగ్గాయి. లెక్క లేకుండా ఖర్చు డిజిటల్ మనీ వ్యాప్తిలోకి వచ్చాక ఎంత మేలు జరుగుతుందో.. అంతే నష్టం పొంచి ఉంది. గతంలో జేబులో ఉన్న డబ్బును ఎంత వరకు అవసరమో అంత మేరకే వినియోగించేవారు. అయితే ప్రస్తుతం వచ్చిన నగదు చెల్లింపుల యాప్లతో ఎంత వెచ్చిస్తున్నామనే అంశంపై అవగాహన ఉండడం లేదు. క్రెడిట్ కార్డుల్లో ఉన్న మొత్తంతో పాటు ఓవర్ లిమిట్ సౌకర్యాన్ని సైతం కల్పిస్తుండడంతో షాపింగ్లు, సినిమాలు, షికార్లకు యువత ప్రాధాన్యతనిస్తున్నారు. డబ్బులను తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. దీంతో డిజిటల్ మనీ లావాదేవీల విషయంగా అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మోసపూరిత లింకులు, సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్త ఆన్లైన్ చెల్లింపులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో... అంతే వేగంగా సైబర్ మోసగాళ్లు వల విసురుతున్నారు. లింకులను పంపి వాటిని క్లిక్ చేయాలని సూచిస్తున్నారు. అవగాహన లేని కొందరు వాటిని క్లిక్ చేయగానే వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును అప్పనంగా కాజేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత లింకులు, సైబర్ కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డిజిటల్ మనీతో దూరమైన నగదు ఇక్కట్లు స్మార్ట్ఫోన్ ద్వారా క్షణాల్లో నగదు చెల్లింపులు కిళ్లీ కొట్టు మొదలు.. షాపింగ్మాల్ వరకూ అంతా డిజటల్ చెల్లింపులే -
సీఎం పర్యటనలో లోటుపాట్లకు తావివ్వొద్దు
● కలెక్టర్ వినోద్కుమార్ వజ్రకరూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ నెల 9న వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ జగదీష్తో కలిసి ఛాయాంపురంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం స్థానిక ప్రాథమిక పాఠశాలలో జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సీఎం సభకు 3,000 మంది హాజరయ్యేలా చూడాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలన్నారు. హెలీప్యాడ్ వద్ద భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలన్నారు. ‘బంగారు కుటుంబం’ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్,ఎస్పీలతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, డీఆర్ఓ మలోల, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి,డీపీఓ నాగరాజునాయుడు, సీఎంఓ అధికారులు దినేష్, ఏఎస్పీ రమణ మూర్తి,ఆర్డీఓలు కేశవనాయుడు, శ్రీనివాసులు, వసంతబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పథకంలో అవినీతి
బుక్కరాయసముద్రం: మండలంలోని కొర్రపాడు పంచాయతీ నీలారెడ్డిపల్లిలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్త గంగాధర్ అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రజా ప్రతినిధి అండ చూసుకుని తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించిన ఆయన గ్రామంలో ఒక్కొ కూలీలో రూ.150 చొప్పున అక్రమంగా వసూలు చేస్తుండడం అదే పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లు రికార్డు చేసి వైరల్ చేయడం గమనార్హం. రూ.150 చెల్లిస్తే రూ.1,800 కూలి పడేలా చేస్తామంటూ 150 మంది కూలీలతో వారానికి రూ.22,500 వేలు చొప్పున నెలకు రూ.లక్షకు పైగా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దరూ కుమ్మకై అక్రమ వసూళ్లకు తెరలేపిన విషయం కాస్త బహిర్గతం కావడంతో వారు స్వీయరక్షణలో పడ్డారు. దీంతో ఎవరూ డబ్బు వసూలు చేయడం లేదని ఇటీవల విచారణ చేపట్టిన ఉపాధి సిబ్బంది ఎదుట తమకు అనుకూలమైన కూలీలతో చెప్పించి సంతకాలతో కూడిన లేఖలు అందజేయించినట్లుగా తెలిసింది. వైఎస్సార్సీపీ యూత్ లీడర్పై దాడి ఉరవకొండ: మండలంలోని పాల్తూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బోయ వన్నూరుస్వామిపై టీడీపీ నాయకులు కట్టెలతో దాడి చేశారు. బాధితుడు తెలిపి మేరకు... 1930 నుంచి సర్వే నెంబర్ 416లో భూమిని వన్నూరుస్వామి పూర్వీకులు సాగు చేసుకునే వారు. ఆయనకు సమీప బంధువైన వట్టి సుంకన్న కుమారుడు ముత్యాలప్ప 2019లో 2.84 ఎకరాల సాగు భూమిని పాల్తూరు గ్రామానికి చెందిన మారెయ్యకు విక్రయించాడు. మిగులు భూమిలో వెళ్లేందుకు మారెయ్యకు అమ్మిన భూమి నుంచి ఉన్న రస్తా గుండా రాకపోకలు సాగించకుండా ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకునేవారు. ఈ క్రమంలో బుధవారం తన పొలానికి వెళుతున్న వన్నూరు స్వామిని బొమ్మశెట్టి, ముత్యాలు అడ్డుకుని కట్టెలతో దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. పందుల పెంపకందారుడిపై కత్తులతో దాడి పామిడి: స్థానిక సంతమార్కెట్ వీధిలో బుధవారం సాయంత్రం పందుల పెంపకందారుడు మొండి బాలరాజుపై దొంగ శివ బృందం కత్తులతో దాడి చేసింది. బాలరాజుకు తలకు, చేతులకు, ఛాతీపై తీవ్ర రక్త గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా పందుల తరలింపుపై దొంగ శివ బృందం, పందుల పెంపకందారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇరువర్గాలపై కేసులూ ఉన్నాయి. పందులను అక్రమంగా తరలించకుండా బాలరాజు అడ్డుపడుతున్నాడనే అక్కసుతో బుధవారం కత్తులతో దాడికి తెగబడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘అనంత’ అభివృద్ధే లక్ష్యం కావాలి
అనంతపురం సిటీ: విధి నిర్వహణలో అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తూ.. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నూతనంగా పోస్టింగ్ అందుకున్న ఎంపీడీఓలకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పని చేస్తున్న పది మంది పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓ (ఈఓఆర్డీ)లతో పాటు నంద్యాల నుంచి ముగ్గురు, కర్నూలు నుంచి ఇద్దరు అధికారులకు రెగ్యులర్ ఎంపీడీఓలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదోన్నతిపై వచ్చిన 15 మందిలో 10 మందిని శ్రీసత్యసాయి జిల్లా, ఐదుగురిని అనంతపురం జిల్లాకు కేటాయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి మండలాలు కేటాయిస్తూ బుధవారం తన చాంబర్లో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలసి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఉత్తర్వులు అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉండగా, 15 మంది వచ్చారని, త్వరలో మిగిలిన పోస్టులు కూడా భర్తీ అవుతాయని డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో ప్లానింగ్, ఎస్టాబ్లిష్మెంట్ ఏఓలు రత్నాబాయి, నియాజ్ అహమ్మద్, జూనియర్ అసిస్టెంట్ లీలావతి పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 మంది ఎంపీడీఓలకు మండలాల కేటాయింపు -
పోలీసుల తీరు మారాలి
రాయదుర్గం: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే విషయంలో పోలీసుల తీరు పూర్తిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, రాయదుర్గం, కళ్యాణదుర్గం సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య అన్నారు. బుధవారం రాయదుర్గంలో పార్టీ నాయకులతో కలసి వారు మాట్లాడారు. పోలీసు వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాప్తాడు పర్యటనలో పోలీసుల భద్రత వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ అంశంపై తమ పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయించడం సరైందికాదన్నారు. ఇటీవల రాయదుర్గంలోనూ వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేసి వివాదానికి కారణమయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన 11 నెలలవుతోందని, సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో స్కీములు తక్కువ స్కాములు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, సమన్వయకర్తలు మెట్టు, రంగయ్య -
రేపటి నుంచి పెన్నహోబిలంలో బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆలయ ఈఓ సాకే రమేష్బాబు బుధవారం వెల్లడించారు. 9న శ్రీవారి ఉత్సవమూర్తులను ఆమిద్యాల గ్రామం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. 10న ప్రాకారోత్సవం, 11న సింహ వాహనం, చంద్రప్రభ ఉత్సవాలు ఉంటాయి. 12న గోవాహన సేవ, శేషవాహనోత్సవం, 13న హంసవాహనం, 14న హనమంత వాహన సేవలు, 15న గరుడ వాహనోత్సవం ఉంటాయి. అదే రోజు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 16న సూర్యప్రభ ఉత్సవం, ఐరావత వాహనోత్సవం, 17న ఉదయం రథోత్సవం, సాయంత్రం ధూళోత్సవం, 18న అశ్వవాహనం, 19న ధ్వజారోహణం, శయనోత్సవం ఉంటాయి. 20న శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల గ్రామానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందాలి
బుక్కరాయసముద్రం: రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందేలా చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ సూచించారు. బీకేఎస్ మండలం రేకులకుంటలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం బుధవారం జరిగింది. సమావేశానికి అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకుని రైతాంగానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు. పంటల సాగులో మెలకువలు, సూచనలు సలహాలు నిరంతరం అందించాలన్నారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రైతాంగ పంటల సాగు, వివిధ రకాల పంటలలో యాజమాన్య పద్దతులపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ జాన్సన్, ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, రేకులకుంట పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ విజయశంకర్బాబు, రెడ్డిపల్లి ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ -
ఎమ్మెల్యేకే రూమ్ ఇవ్వరా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఎమ్మెల్యే మనుషులొస్తే రూములు లేవంటారా.. ఎంత ధైర్యం మీకు.. ఇకపై మీరు హోటల్ ఎలా నడుపుతారో చూస్తాం’ అంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు వీరంగం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం రాత్రి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన అనుచరులతో మాట్లాడుకోవడానికి సూట్రూమ్ కావాలని తన ముఖ్య అనుచరుడిని నగరంలోని అలెగ్జాండర్ హోటల్కు పంపించారు. అయితే హోటల్ మేనేజర్ రూములు ఖాళీగా లేవని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు పరుష పదజాలంతో మేనేజర్పై విరుచుకుపడ్డారు. మెడపట్టి గెంటినట్టు బాధిత సిబ్బంది చెప్పారు. ఇవన్నీ సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. గొడవ సమయంలో హోటల్లో ఎమ్మెల్యే అనుచరులు గంగారాం, పి.హరిక్రిష్ణ ఉన్నట్టు సీసీ ఫుటేజీల్లో తేలింది. ఆ సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి హోటల్ బయట కారులోనే ఉన్నారు. మేనేజర్ను కారులో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే సైతం తీవ్ర పదజాలంతో దూషించినట్టు బాధితులు చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే అడిగితే సూట్రూం ఇవ్వవా.. నీకెంత ధైర్యంరా.. ఏమనుకుంటున్నావ్ నా గురించి’ అంటూ తిట్టడమే కాకుండా ఇకపై హోటల్ ఎలా నడుపుకుంటారో చూస్తా అంటూ బెదిరించినట్లు తెలిసింది. నాలుగేళ్ల పాటు సూట్రూమ్ ఫ్రీగా ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి.. పోలీసుల సోదాలు ముగిసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎమ్మెల్యే నుంచి ఫోన్ వెళ్లింది. దీంతో ముగ్గురు ఆ శాఖ అధికారులు హోటల్లో సోదాలకు వెళ్లారు. కిచెన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. చికెన్ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ల్యాబుకు పంపిస్తున్నట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఇక.. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయాన్నే మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఉసిగొల్పినట్లు తెలిసింది. హోటల్ భవన నిర్మాణం అక్రమంగా ఉందని, తనిఖీలకు వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో లిక్కర్ వ్యాపారి (సింధూర వైన్స్) పిట్టు రామలింగారెడ్డిపై కూడా దగ్గుపాటి ప్రసాద్ దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. పది నిమిషాల్లోనే పోలీసుల రైడింగ్ ఈ ఘటన జరిగిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే.. టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్కు ఫోన్ చేసి హోటల్పై రైడ్ చేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పోలీసులు హోటల్కు చేరుకున్నారు. ప్రతి రూము గాలించారు. చిన్న తప్పు కనిపించినా కేసు బుక్ చేయాలని శతవిధాలా యత్నించారు. అయితే, చివరకు ఏ లోపం కనిపించకపోవడంతో పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. తొలుత హోటల్లో రైడ్ చేయలేదని చెప్పిన సీఐ శ్రీకాంత్ యాదవ్.. మళ్లీ కొద్ది సేపటికే అన్ని హోటళ్లలాగే ఇక్కడ చేశామని ‘సాక్షి’తో చెప్పడం గమనార్హం. హోటల్ సిబ్బందిపై దగ్గుపాటి అనుచరుల వీరంగం అప్పటికప్పుడు పోలీసులతో హోటల్పై రైడింగ్ ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులనూ ఉసిగొల్పిన వైనం -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరా
కళ్యాణదుర్గం: కంబదూరు మండలం అండేపల్లిలో బుధవారం ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేపట్టారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై రెండు రోజుల క్రితం స్థానికులు రోడ్డెక్కారు. కంబదూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. దీనిపై ‘సాక్షి’లో ‘తారస్థాయికి దాహం కేకలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో స్పందించిన కంబదూరు మేజర్ పంచాయతీ సర్పంచు పద్మావతమ్మ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఆమె కుమారుడు, వైఎస్సార్ సీపీ జేసీఎస్ కన్వీనర్ సాకే గంగాధర్ తన సొంత నిధులతో అండేపల్లిలో నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచుకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తాడిపత్రికి చేరుకునే నిర్ణయం వాయిదా వేయండి
అనంతపురం: హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 8న కుటుంబసభ్యులతో కలిసి తాడిపత్రికి వెళ్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ను మంగళవారం పెద్దారెడ్డి కలసి హైకోర్టు ఉత్తర్వులు చూపి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ వినతిపై ఎస్పీ పి. జగదీష్ బుధవారం స్పందిస్తూ తాడిపత్రికి 8న చేరుకునే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మొత్తం భద్రతా సిబ్బంది అక్కడ విధుల్లో పాల్గొంటున్నారని, దీంతో 8వ తేదీ తర్వాత మరో రోజు నిర్ణయించుకుని తెలిపితే సరైన భద్రత కల్పిస్తామని లేఖలో పేర్కొన్నారు.ముష్కరులపై పోరుకు నేను సైతం..కళ్యాణదుర్గం: ముష్కరులను తుదముట్టించే దిశగా ప్రస్తుతం పాకిస్తాన్తో మొదలైన యుద్ధంలో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులకు మాజీ జవాన్, కళ్యాణదుర్గం నియోజకవర్గ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చేకూరి అమర్నాథ్ లేఖ రాశారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ముస్కరులపై సాగిస్తున్న ఈ యుద్ధంపై ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రవాదులు, వాళ్లకు సహకరించిన వాళ్లను భూమ్మీద లేకుండా చేసే పనిని త్రివిధ దళాలకు కేంద్రం అప్పగించిందన్నారు. ఇది ఒక విధంగా మిలటరీ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చేనట్లేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో తాను సర్వీసులో ఉండి ఉంటే ఎంతో గర్వంగా అనుభూతి చెందేవాడినని అన్నారు. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సహాయం, అవసరమైతే యుద్ధంలో పాల్గొనేందుకూ తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆర్మీ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు.త్రివిధ దళాల హుండీల లెక్కింపుఅనంతపురం: సాయుధ త్రివిధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా వివిధ సంస్థలు, పాఠశాలలు, కళాశాలల నుంచి సేకరించిన విరాళాల హుండీ బాక్స్లను బుధవారం కలెక్టర్ నియమించిన కమిటీ సమక్షంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లెక్కించారు. మొత్తం 75 హుండీల ద్వారా రూ.1,09,710 నగదు, దాతల నుంచి రూ.3,76,992 కలిపి మొత్తం రూ.4,86,702 నగదు అందినట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప తెలిపారు. ఈ మొత్తాన్ని లు త్రివిధ సాయుధ దళాల పతాక బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు వివరించారు. -
హంద్రీ–నీవాను 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలి
● శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి డిమాండ్ ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వితే 2,200 క్యూసెక్కులు మాత్రమే వస్తాయని, అలా కాకుండా 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వానికి శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి సూచించారు. వజ్రకరూరు మండలం ఛాయపురంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జీడిపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం 1.68 టీఎంసీల మాత్రమే నీటిని నిల్వ చేస్తున్నారన్నారు. దీని సామర్థ్యాన్ని 4 టీఎంసీలు చేయడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.675 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ఆమోదిస్తే రాయలసీమకు తాగు, సాగునీరు అందుతుందన్నారు. హంద్రీనీవా ద్వారా 70 నుంచి 80 టీఎంసీల వరకు నీటిని తీసుకోరావాలంటే కాలువను మరింత వెడల్పు చేయాలన్నారు. లైనింగ్ పనులతో ఉమ్మడి జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కోడిని తిన్న కుక్క... పలువురిపై కేసు నమోదు యాడికి: మండలంలోని నిట్టూరు గ్రామంలో రెండు రోజుల క్రితం పెంపుడు కోడిని ఓ కుక్క తినింది. దీంతో చోటు చేసుకున్న ఘర్షణలో పుల్లయ్య కుమారుడు వీరాంజనేయులును అదే గ్రామానికి చెందిన రాధక్క, అరుణ్, రామాంజనేయులు చితకబాదారు. ఘటనపై బాధితుడు బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు రాధక్క, అరుణ్, రామాంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తనపై పుల్లయ్య, వీరాంజనేయులు, మల్లేశ్వరి దాడి చేసి కొట్టారంటూ బాధిత రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో హంద్రీ–నీవాకు ప్రమాదం ముంచుకొస్తోందని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా పరిస్థితులను సీఎం చంద్రబాబు మానవత్వంతో పరిశీలించి, రాయలసీమ జిల్లాలకు నీరందించే హంద్రీ–నీవాను బలోపేతం చేయాలన్నారు. జిల్లాకు 65 టీఎంసీల నీరు అవసరం ఉందని, ఆ మేరకు హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేయాలన్నారు. గాలేరు–నగరి నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2009లో దివంగత నేత వైఎస్సార్ హయాంలో పనులు వేగవంతంగా జరిగాయన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని తీసుకువచ్చేలా రూ.6,018 కోట్లతో టెండర్లను పిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పనులు కొనసాగించి ఉంటే మరో రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అంది ఉండేవన్నారు. అలాగే, రూ.5 వేల కోట్లతో గాలేరు–నగరిని హంద్రీ–నీవాతో అనుసంధానించాలని నిర్ణయం తీసుకుని రూ.1,500 కోట్లు ఖర్చు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా పాత జీఓలను రద్దు చేసి కేవలం 3,850 క్యూసెక్కులకు హంద్రీ–నీవాను కుదించి అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని, ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. హంద్రీ–నీవా ఫేజ్ 2 లైనింగ్ పనులను జిల్లా ప్రజలు అంగీకరించడం లేదన్నారు. లైనింగ్ టెండర్లు సీఎం చంద్రబాబు తన అస్మదీయులకు అప్పగించారని, రూ.743.85 కోట్లకు టెండర్లు పిలిచి దాదాపు రూ.200 కోట్ల ఎక్సెస్తో రూ.936.70 కోట్లకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. జీడిపల్లి రిజర్వాయర్ కోసం భూములిచ్చిన 645 మంది రైతులకు రూ.10 లక్షల ప్రకారం ఒక ప్యాకేజీ సిద్ధం చేసి ఉందని, ఆ మేరకు పరిహారం ఇచ్చి జీడిపల్లిని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఉంతకల్లు, వజ్రకరూరు చెరువులకు నీరందించడానికి సంబంధించి కూడా చంద్రబాబు ప్రకటన చేయాలన్నారు. చేనేతకు సంబంధించి ఉరవకొండ పెద్ద కేంద్రమని ‘విశ్వ’ గుర్తు చేశారు. గతంలో చేనేత క్లస్టర్ ఏర్పాటు పనులు మొదలైనా సాంకేతిక సమస్యల కారణంగా ఆగిపోయాయని, ఈ విషయంపైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని పేరుతో వెనుకబడ్డ ప్రాంతాలను విస్మరించడం తగదన్నారు. 11 నెలల్లోనే రూ.1.65 లక్షల కోట్ల అప్పు చేసి ఆ భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాసినేని నరేష్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవింద్ నాయక్, కూడేరు మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దురుద్దేశపూర్వకంగానే 3,850 క్యూసెక్కులకు కుదించారు కాలువ బలోపేతంపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలి ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వ -
2014 ఖరీఫ్లోనే హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరిస్తామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే హామీ ఇచ్చి మాట తప్పారు. ఆ తర్వాత 2015, 2016 అన్నారు. గడువు మారింది తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టనే లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీ–నీవా కింద డిస్ట్రిబ్య
చిన్నముష్టూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో వర్షపు నీటిలో ౖపైపెనే మట్టిని పక్కకు జరుపుతున్న దృశ్యంఉరవకొండ: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అయిన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం కరువు పీడిత అనంతపురం జిల్లాకు జీవనాడి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలనే లక్ష్యంతో అప్పట్లో ఈ పథకానికి రూపకల్పన చేశారు. అయితే, వైఎస్సార్ ఆకస్మిక మరణంతో లక్ష్యం నీరుగారిపోయింది. హంద్రీ–నీవా ఫేజ్–1 కింద 2012లో పనులు పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్కు కృష్టా జలాలు చేరినా, నేటికీ పొలాలను తడపలేకపోతుండటమే ఇందుకు నిదర్శనం. బూటకపు ప్రకటనలతో సరి.. హంద్రీ–నీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని 2014 నుంచి బూటకపు ప్రకటనలు చేస్తూనే ఉన్న చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అందుకు సంబంధించిన పనులు చేపట్టనే లేదు. ఉరవ కొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలంలో 33, 34 ప్యాకేజీ పనులు నేటికీ పూర్తి కాలేదు. ఈ ప్యాకేజీల కింద 28 వేల ఎకరాల ఆయకట్టు ఉండటం గమనార్హం. అబద్ధపు హామీలతో ఊరిస్తూ వచ్చిన చంద్రబాబు.. 2015లో హంద్రీ–నీవా కింద డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయరాదంటూ ఏకంగా జీఓ నం.22 తీసుకొచ్చి అన్నదాతలను నైరాశ్యంలోకి నెట్టారు. దీనిపై అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే.. 2017 ఖరీఫ్కు సాగునీరు ఇస్తామని ప్రకటించి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఈ విషయంపై ఆ తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వ ఉద్యమాలు చేపట్టినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతా ఆర్భాటమే.. ఆయకట్టుకు నీళ్లందించడంపై దృష్టి సారించని కూటమి ప్రభుత్వం.. నేడు హంద్రీ–నీవా కాలువ విస్తరణ పేరిట ఆర్భాటం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే 3,800 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో రూపకల్పన చేసిన కాలువను 6 వేల క్యూసెక్కులకు పెంచుతామని ఇటీవల ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, నేడు ఆ హామీని తుంగలో తొక్కుతూ విస్తరణ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. ఆ పనులు కూడా అస్తవ్యస్తంగా సాగుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఈ నెల 9న సీఎం పర్యటన నేపథ్యంలో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలో నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలో జేసీబీల సాయంతో కేవలం కాలువకిరువైపులా మట్టిని పక్కకు జరిపి చేతులు దులుపుకుంటున్నట్లు తెలిసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మాట నిలుపుకోని సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలను అటకెక్కించి దగా నేడు విస్తరణ పేరిట ఆర్భాటం రైతులకు ఒరిగేది శూన్యం -
నువ్వో చిల్లరగాడివి!
తాడిపత్రి టౌన్: విలేజ్ క్లినిక్లలోని డాక్టర్లపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నోరుపారేసుకున్న ఘటన మరిచిపోకముందే తాజాగా ఓ సీఐపైనా ఆయన తన నోటికి పనిచెప్పారు. ‘రోజూ చిల్లర తీసుకునే చిల్లర గాడివి’ అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ సాయిప్రసాద్పట్ల ఫోన్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సీఐ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం ఏమిటంటే.. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో తాడిపత్రి పట్టణంలో వీహెచ్పీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్స్టేషన్ సర్కిల్లో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో స్టేషన్కు వచ్చిన ఏఎస్పీ రోహిత్కుమార్ ఇది గమనించి బాణాసంచా కారణంగా వాహనదారులకు, పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వారిని స్టేషన్కు తీసుకురావాలని సీఐ సాయిప్రసాద్ను ఆదేశించారు. సీఐ అక్కడికి వెళ్లి సంబరాలు చేసుకోవడానికి అనుమతిలేదని, స్టేషన్కు రావాలన్నారు. ఈ క్రమంలో.. వీహెచ్పీ నాయకుల్లో ఒకరు సీఐ కాలర్ పట్టుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో వారిని బలవంతంగా స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ వీహెచ్పీ నేతల్లో ఒకరు మంత్రి సత్యకుమార్కు ఫోన్చేసి సీఐకి ఇవ్వగా.. ‘రోజూ చిల్లర తీసుకునే చిల్లరగాడివి’.. అంటూ సీఐను మంత్రి దూషించినట్లు తెలిసింది. ఫోన్ పెట్టేసిన వెంటనే సీఐ.. ‘నేనేమీ చిల్లర తీసుకునే వాణ్ణి కాదు.. నన్ను వేరే స్టేషన్కు మార్చుకోమనండి.. ఐదు నిమిషాల్లో వెళ్లిపోతా. పోస్టు పీకి పడేస్తే టీకొట్టు పెట్టుకుని బతుకుతా. మీ అందరిపై కేసు బుక్చేసి పడేస్తా. అధికారం ఉంది కాబట్టి కేసు మూసేసుకుంటారేమో.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓపెన్ చేసి పడేస్తా.. ఏం చేస్తారు?’ అంటూ వీహెచ్పీ నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు. -
పెద్దారెడ్డికి భద్రత కల్పించలేం: ఎస్పీ
అనంతపురం: తన స్వగ్రామమైన తాడిపత్రికి రావడానికి భద్రత కోరుతూ జిల్లా ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ. ఈ నెల9వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటన అనంతరం పోలీస్ భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లే అవకాశం ఉంది.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా ఆయన ఇంకా అక్కడకి వెళ్లలేకపోయారు. పెద్దారెడ్డి తాడిపత్రలో అడుగుపెడితే అంటూ టీడీపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు.పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ రెండు రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. -
తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్మెంట్కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది. -
అనంతపురం, శ్రీ సత్యసాయి ఎస్పీలపై సర్వత్రా విమర్శలు
● పోస్టుల కోసం శాంతిభద్రతల్ని గాలికొదిలేశారనే ఆరోపణలు ● రామగిరి హెలీప్యాడ్ ఘటనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు 71 మందిపై కేసులు ● హైకోర్టు ఆదేశాలిచ్చినా పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వని దుస్థితి ● ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా పోలీసు బాస్ల తీరు సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో అనంతపురం ఎస్పీ జగదీష్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రెడ్బుక్ రాజ్యాంగానికి కంకణ బద్ధులై పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓవైపు మట్టి, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. మట్కా మూడుపువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగిపోతోంది. ఇవన్నీ పక్కనపెడితే టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోతున్న పోలీసు బాస్లు.. ‘పచ్చ’ నేతలు చెప్పిందే వేదంగా నడుచుకుంటూ అభాసుపాలవుతున్నారనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగుతోంది. ఇందుకేనా.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో పాపిరెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇది ఖాకీల మొదటి వైఫల్యం కాగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే హెలీప్యాడ్ దగ్గర జనాన్ని నియత్రించలేక చేతులెత్తేయడం మరో వైఫల్యం. అక్కడ డీఎస్పీ స్థాయి అధికారి ఉండి కూడా ‘హెలీప్యాడ్’ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర పోలీసు చరిత్రలోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది. అయితే, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రివర్స్ కేసులకు తెరలేపడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘటనలో 71 మందిపై కేసులు పెట్టడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. జగన్ రాక సందర్భంగా వచ్చిన జనాన్ని నియంత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిపైనా కేసుల మీద కేసులు పెట్టి వేధింపులకు తెరతీయడం గమనార్హం. హైకోర్టే చెప్పినా... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తున్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాది కావస్తున్నా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్రెడ్డి తండ్రి ప్రభాకర్రెడ్డి పట్టణంలోకి రానివ్వకుండా కుయుక్తులు పన్నుతున్నారు. దాడులకు తెర తీస్తున్నారు. ఇటీవల స్వయానా హైకోర్టే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించి తాడిపత్రికి పంపించాలని ఆదేశించినా పోలీసులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఏకంగా ఐపీఎస్ అధికారిని తాడిపత్రికి ఏఎస్పీగా వేసినా ఏమీ చేయలేని దుస్థితి. దీన్నిబట్టి తాడిపత్రిలో రౌడీరాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని దుస్థితిలో జిల్లా పోలీసులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ఎస్పీ జగదీష్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగు తోంది. తమ పోస్టులు కాపాడుకుంటే చాలు ఏది ఏమైనా కానీ అన్న రీతిలో రెండు జిల్లాల ఎస్పీలు ముందుకు సాగుతున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విచ్చలవిడిగా మట్కా, జూదం జరుగుతుండటం, మద్యం ఏరులై పారుతుండటం, దొంగతనాలు భారీగా పెరిగి రెండు జిల్లాల్లోనూ అధ్వాన పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోని పోలీసు బాస్లు.. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
పొంచి ఉన్న విత్తన గండం
● విత్తన వేరుశనగ సేకరణపై బాబు సర్కారు మొద్దునిద్ర ● బడ్జెట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం ● ఇప్పటికే నాణ్యమైన విత్తనకాయలు వ్యాపారుల పాలు ● రైతులకు నాసిరకం విత్తనాలే గతి! అనంతపురం అగ్రికల్చర్: రైతులకు ఈ ఖరీఫ్లో నాణ్యమైన విత్తన వేరుశనగ అందే పరిస్థితి కనిపించడం లేదు. రబీలో విత్తన వేరుశనగ సేకరణపై బాబు సర్కారు మొద్దునిద్ర వహించడమే ఇందుకు నిదర్శనం. ఏటా రబీలో రైతులు పండించే వేరుశనగను ఏపీ సీడ్స్, వ్యవసాయశాఖ ద్వారా ముందస్తుగా కొనుగోలు చేసేవారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసేది. ఖరీఫ్లో రైతులకు రాయితీతో నాణ్యమైన విత్తనం అందించేది. అయితే, రైతుల పట్ల చిన్నచూపు ధోరణి అవలంబిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియపై దృష్టి సారించనే లేదు. ఇటీవల విత్తన సేకరణ ధర (క్వింటా రూ.9,300) ఖరారైతే చేసింది కానీ, బడ్జెట్ మాత్రం విడుదల చేయలేదు. గత ఖరీఫ్కు సంబంధించి ఏపీ సీడ్స్కు అందాల్సిన రూ.90 కోట్లు(ఉమ్మడి జిల్లా), రాష్ట్ర వ్యాప్తంగా రూ.200 కోట్ల బకాయిలు కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. మంచి విత్తనం దళారులపాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రబీలో 10 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఇటీవల పంట కోతలు కూడా మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకం కారణంగా విత్తన సేకరణ ప్రారంభం కాకపోవడంతో మంచి విత్తనం వ్యాపారుల పాలవుతోంది. కొనుగోలు చేసిన వేరుశనగను దళారులు, వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఖరీఫ్లో రైతన్నలకు నాసిరకం విత్తనాలే దిక్కయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విత్తన కేటాయింపుల్లో కోతలు.. ఈ సారి విత్తన కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కొర్రీలు వేసి అన్నదాతలను నిరాశపర్చింది. జిల్లాకు 1,51,978 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు పంపగా... 54,184 క్వింటాళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకు 1.60 లక్షల క్వింటాళ్లు కావాలని ప్రతిపాదించగా 60 వేల క్వింటాళ్లకు అనుమతిచ్చారు. ఈ క్రమంలో రైతులు విత్తనం కోసం కూడా అగచాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక.. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్) 750 క్వింటాళ్లు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తామని 15 రోజుల క్రితమే ప్రకటించారు. కానీ 750 క్వింటాళ్లకు 207 క్వింటాళ్లకు కుదించినా ఇప్పటి వరకు క్వింటా కూడా సరఫరా చేయకపోవడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందో అర్థం చేసుకోవచ్చు. అన్నదాతల మండిపాటు.. రెండేళ్లుగా సరైన పంట దిగుబడులు లేవు. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించి ఆదుకోవాల్సిన బాబు సర్కారు.. అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికే రాయితీ విత్తన సరఫరాలో కోతలు వేసి నిరాశ పర్చిందే కాక.. విత్తన సేకరణపై ఇప్పటికీ దృష్టి సారించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి కీలకమైన ఖరీఫ్ (ముంగారు) ఆరంభం కానున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుండటంతో.. ఈ సారి విత్తన విపత్తు తప్పేలా లేదంటూ నిట్టూరుస్తున్నారు. -
తారస్థాయికి దాహం కేకలు
కళ్యాణదుర్గం: ఉమ్మడి జిల్లాలో దాహం కేకలు తారస్థాయికి చేరాయి. కడుపు మండిన జనం రోడ్లెక్కుతున్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగులోకి వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా కళ్యాణదుర్గం మండలం అండేపల్లిలో, కుందుర్పి మండలంలోని తూముకుంట గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆర్తనాదాలు పెట్టారు. ‘తాగునీరందించండి మహాప్రభో’ అంటూ విన్నవించుకున్నారు. అండేపల్లి గ్రామస్తులు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తూముకుంటవాసులు గ్రామంలో సచివాలయానికి తాళాలు వేసి గంట పాటు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్లు ఖాళీ బిందెలతో అండేపల్లివాసులు ర్యాలీ నిర్వహించడం చూస్తే క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు మాట్లాడుతూ తాగునీరు కూడా అందజేయని పాలకులు, అధికారులెందుకని నిలదీశారు. శ్రీరామిరెడ్డి పథకం నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. కూటమి నేతలు తమ స్వలాభం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎంపీపీ లక్ష్మిదేవి స్పందించి.. అండేపల్లి గ్రామంలో మరో బోరు వేసేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. -
ఆర్డీటీ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
ఉరవకొండ: ఆర్డీటీని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఆర్డీటీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టు (ఎఫ్సీఆర్ఏ) రెన్యూవల్ అంశంపై మంగళవారం స్థానిక ఓ కల్యాణ మంటపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్తో పాటు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశ్వ మాట్లాడుతూ... కరువు పీడిత అనంతపురం జిల్లాలో ఆర్డీటీ చేపట్టిన సేవలను గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, పక్కాగృహాలు, వాటర్షెడ్,ఉపాధిహమీ, హార్టికల్చర్, మహిళా సాధికారితకు రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే పేదలు నష్టపోతారన్నారు. ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలనే డిమాండ్తో ఈ నెల 12న ఉరవకొండలో భారీ నిరసన ర్యాలీ చేపట్టేలా నిర్ణయించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున, కృష్ణమూర్తి, అబ్బాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు బెంజిమెన్, ఏపీటీఎఫ్ హనుమప్ప, భాస్కర్, రాజేష్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక నాయకులు మధుకర్, జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల్లి ఓబులేసు, ఆపద్బాంధవ ట్రస్ట్ ప్రతినిధి మురళి, సర్పంచ్ జగదీష్, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు ఏసీ ఎర్రిస్వామి, తిప్పయ్య, విద్యార్థి సంఘం నాయకుడు పురుషోత్తం, వైఎస్సార్సీపీ గిరిజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందునాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వ -
●కళ నింపని కనకాంబరాలు
ట పండితే ధరలుండవు.. ధరలుంటే పంట పండదు’ అన్నట్లుగా తయారైంది రైతుల పరిస్థితి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి, రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట తమకు కనీస గిట్టుబాటు కూడా మిగిల్చని దుస్థితి దాపురిస్తుండటంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. అనంతపురం రూరల్ మండలం పూలకుంట, పసలూరు, చియ్యేడు తదితర గ్రామాల్లో రైతులు కనకాంబరం పూలు సాగు చేశారు. కాపు బాగానే ఉన్నా మార్కెట్లో సరైన ధరల్లేవు. ప్రస్తుతం కిలో రూ.150 నుంచి రూ.200 మాత్రమే పలుకుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలో కనకాంబరాలు రూ.500 నుంచి రూ.800 పలికితేనే అంతో ఇంతో మిగులుతుందని చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం ‘పం -
తాడిపత్రి వెళ్తున్నా.. భద్రత కల్పించండి
అనంతపురం: హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 8న కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వెళ్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని డీఐజీ, ఎస్పీకి విన్నవించారు. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డితో కలిసి పెద్దారెడ్డి మంగళవారం డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ జగదీష్కు అందజేశారు. అనంతరం పెద్దారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రెండు దఫాలు జిల్లా ఎస్పీని కలిశామన్నారు. కప్పదాటు వైఖరి అవలంబిస్తూ తాను తాడిపత్రి వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 8న తాడిపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, భద్రత నడుమ తాడిపత్రికి పంపేలా న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, మహిళా విభాగం అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శోభారాణి, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శోభా భాయి, నగర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రసన్న లక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఐజీ, ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వినతి -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
వజ్రకరూరు: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద ఏర్పాట్లను ఎస్పీ పి. జగదీష్తో కలిసి జేసీ పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కేశవనాయుడు, శ్రీనివాసులు, డీపీఓ నాగరాజునాయుడు, జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రా రెడ్డి, పీఆర్ ఎస్ఈ జహీర్అస్లాం పాల్గొన్నారు. ‘గ్రూప్–1 మెయిన్స్’ కేంద్రాల పరిశీలనఅనంతపురం అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. అనంతపురంలో పరీక్ష కేంద్రాలను జేసీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయన్నారు. 9వ తేదీతో ముగుస్తాయన్నారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షకు 594 మంది హాజరుకావాల్సి ఉండగా నాల్గో రోజు 381 మంది హాజరయ్యారని, 213 మంది గైర్హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో లైజనింగ్ అధికారులు, ఎస్డీసీలు మల్లికార్జునుడు, తిప్పేనాయక్ ఉన్నారు. -
ఆర్డీటీ పరిరక్షణే వైఎస్సార్సీపీ లక్ష్యం
కళ్యాణదుర్గం: జిల్లా ప్రజల జీవనాడిగా, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా ఉన్న ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య స్పష్టం చేశారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్తో కలిసి ‘సేవ్ ఆర్డీటీ’ ఉద్యమ కార్యాచరణను ఆయన వెల్లడించారు. ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకతీతంగా కలిసొచ్చే ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలతో కలసి ఈ నెల 17న చేపట్టిన బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రహ్మసముద్రం నుంచి శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మీదుగా కళ్యాణదుర్గంలోని ఆర్డీఓ కార్యాలయం వరకూ బైకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేయాలంటూ ఆర్టీఓకు వినతి పత్రం అందజేస్తామన్నారు. అలాగే సేవ్ ఆర్డీటీ పేరుతో గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకూ పోరాటాలు చేసేందుకు పార్టీ పెద్దలతో సంప్రదించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నామన్నారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయకుండా సీఎం చంద్రబాబే అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ద్వారా లబ్దిపొందిన గ్రామాల ప్రజలు బాహటంగానే పేర్కొంటున్నారని తెలిపారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే పేదలే తీవ్ర ఇబ్బందులు పడతారనే విషయాన్ని ఈ నెల 9న ఉరవకొండకు రానున్న సీఎం చంద్రబాబును కలసి వివరించి, ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణకు వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేయనున్నామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎన్.వెంకటేశులు, జిల్లా ఉపాధ్యక్షుడు కె.గంగాధరప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మరాయుడు, డాక్టర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు బొమ్మయ్య, జిల్లా కార్యదర్శి వై.కృష్ణమూర్తి, మున్సిపాలిటీ విభాగం కన్వీనర్ సుధీర్, వివిధ మండలాల కన్వీనర్లు హనుమంతరాయుడు, చంద్రశేఖర్రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, ఎంపీపీలు ఆంజినేయులు, నాగరాజు, అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు చరణ్, పాతలింగ, భాస్కర్, విజయ్, షెక్షావలి, మురళి, పాండు, అజయ్, ప్రతాప్, రామిరెడ్డి, మల్లికార్జున, కిరణ్కుమార్, తిమ్మారెడ్డి, సర్పంచులు బాబు, విజయ్, సోమశేఖర్రెడ్డి, విరుపాక్షి, కౌన్సిలర్ పరమేశ్వరప్ప, ఎంపీటీసీ మల్లేశు, నాయకులు శ్రీనివాసరెడ్డి, జానీ, దేవ పాల్గొన్నారు. 17న నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త రంగయ్య, నేతలు తిప్పేస్వామి, మాదినేని ఉమా -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ఎక్కడేగాని చెట్లను తొలగించరాదన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలనన్నారు. అనవసరంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయరాదన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలోని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 మంది ఆయకట్టుదారులు, సభకు మూడు వేల మంది మాత్రమే వచ్చేలా చూడాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో గ్రామానికి చెందిన వారు మాత్రమే ఉండాలన్నారు. హెలిప్యాడ్, కాన్వాయ్, సభాప్రాంగణం, తదితర ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. బంగారు గొలుసు అపహరణ కళ్యాణదుర్గం రూరల్: బస్సులో ప్రయాణికురాలి హ్యాండ్బ్యాగ్లో ఉన్న బంగారు గొలుసును దుండగుడు అపహరించిన ఘటన కళ్యాణదుర్గంలో వెలుగు చూసింది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం శిర్పి గ్రామానికి చెందిన మౌనిక, నవీన్ దంపతులు కర్ణాటకలోని పెద్దపల్లి గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమై మంగళవారం ఉదయం కళ్యాణదుర్గంలోని బస్టాండ్కు చేరుకున్నారు. ఆ సమయంలో వచ్చిన కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో పాటు ఎక్కి కూర్చొన్న అనంతరం తన హ్యాండ్ బ్యాగ్ను మౌనిక పరిశీలించారు. అందులో ఉంచిన నాలుగు తులాల బంగారు చైన్ కనిపించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘కుట్టు’లో భారీ అవినీతి
అనంతపురం అర్బన్: మహిళలకు కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు తెరతీసిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆరోపించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మను మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ మీసాల రంగన్న, అనంతపురం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బోయ లక్ష్మన్న, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అల్తాఫ్ అహమ్మద్, ఇతర నాయకులతో కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో లక్ష మంది బీసీ మహిళలకు కుట్టు శిక్షణ, మిషన్ల అందజేత పేరుతో ఒక్కొక్కరికి రూ.23 వేలు చొప్పున రూ.230 కోట్లతో టెండర్ను తమకు అనుకూలమైన అవుట్ సోర్సింగ్ వ్యక్తికి కట్టబెట్టారన్నారు. వాస్తవానికి లబ్ధిదారునికి కుట్టు శిక్షణ, మిషన్ ఖర్చు రూ.7,300 మాత్రమే అవుతుందన్నారు. ఈ ప్రకారం మొత్తం లక్ష మందికి గాను ఖర్చు రూ.73 కోట్లు పోను మిగిలిన రూ.167 కోట్లు ఎవరి ఖాతాలోకి మళ్లిస్తున్నారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలన్నారు. మొత్తం ఈ స్కామ్పై విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళ విభాగం నాయకులు జాహ్నవిరెడ్డి, శోభాబాయి, శోభారాణి, పార్వతమ్మ, అంజలి, భానుమతి, పద్మావతి, లక్ష్మీదేవి, ప్రసన్న, జయమ్మ, లక్ష్మి, కళావతి, నారాయణమ్మ, రాధమ్మ పాల్గొన్నారు. రూ.230 కోట్ల టెండర్లో రూ.167 కోట్ల స్కామ్ వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి -
‘భగవద్గీత’ పోటీల్లో చిన్నారి ప్రతిభ
అనంతపురం కల్చరల్: గణపతి సచ్చిదానంద భగవద్గీత పారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన భగవద్గీత కంఠస్త పోటీల్లో అనంతపురానికి చెందిన నికితేష్రెడ్డి, సంధ్య దంపతుల కుమార్తె, 9 ఏళ్ల వయసున్న చిన్నారి నిహాన్సారెడ్డి బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఈ నెల 18న మైసూరులో జరిగే కార్యక్రమంలో పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఆమె బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకోనుంది.ఆయిల్ ట్యాంకర్ బోల్తాగుంతకల్లు రూరల్: మండలంలోని తిమ్మాపురం సమీపంలో ఉన్న పద్మావతి ఆయుర్వేదిక్ కళాశాల వద్ద బళ్లారి వైపు వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. ఘటనలో 33 కేవీ విద్యుత్ లైన్కు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభంతో పాటు దానికి సపోర్ట్గా నిలిపిన మరో స్తంభమూ కూలింది. విద్యుత్ వైర్లు కిందకు వేలాడాయి. స్థానికులు అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ అంజాద్బాషాను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అత్యాచార యత్నం కేసులో నిందితుడి అరెస్ట్పెద్దపప్పూరు: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటనలో నిందితుడు వీరాంజనేయులుని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులుఅనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐలో స్వల్ప కాలిక కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపాల్ రామమార్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘టూ వీలర్ సర్వీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్’ కోర్సులకు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఆసక్తి ఉన్న పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతలున్న విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోపు బయోడేటాను ఐటీఐ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 88868 85173 లో సంప్రదించవచ్చు. -
సమస్యలు పరిష్కరించండి
అనంతపురం సిటీ: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్యదర్శుల సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు. మంగళవారం మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేసి, మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఇతర విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం తమ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు వెల్ణేర్ సెక్రటరీలకు కూడా పదోన్నతి కల్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై మంత్రి పయ్యావుల సానుకూలంగా స్పందిస్తూ.. ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్రరావు, జిల్లా కోశాధికారి మహేశ్ ఉన్నారు. మంత్రి పయ్యావులకు సచివాలయ ఉద్యోగుల వినతి -
కులగణన సక్రమంగా జరిగితే ప్రజలకు సమ న్యాయం
మడకశిర రూరల్: కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు సమ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మడకశిర మండలం నీలకంఠాపురంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం కులగణనపై కార్యాచరణ ప్రకటించాలన్నారు. దాని ఫార్మెట్ తయారీపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు లోకసభ, రాజ్యసభల్లో చర్చించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కులగణన సర్వే ఆరు నెలల్లోనే పూర్తి చేసి వివరాలు ప్రకటించాలన్నారు. కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఒత్తిడి తేవడంతోనే కులగణనకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కులగణన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేసేలా చూడాలన్నారు. కులగణన పూర్తయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు పెరిగి న్యాయం జరుగుతుందన్నారు.315 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత గార్లదిన్నె: మండలంలోని తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా తరలిస్తున్న 315 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నట్లు ఎస్ఐ గౌస్మహమ్మద్ బాషా తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. గార్లదిన్నె తహసీల్దార్ ఈరమ్మ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అక్బర్ బాషా, క్లీనర్ సుబ్బరాయుడుపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఆత్మకూరు స్టాక్ పాయింట్కు తరలించామన్నారు.రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియాన్ని రాప్తాడు మండలం మరూరు టోల్ ఫ్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు రాప్తాడు తహసీల్దార్ విజయకుమారి తెలిపారు. సోమందేపల్లికి చెందిన రవికుమార్ అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి, కర్నాటకలోని పావగడకు తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.లక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో ఎస్పీఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామిని ఎస్పీ జగదీష్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ సాకే రమేష్బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. విశేష పూజల అనంతరం స్వామి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేశారు.అప్పు చెల్లించమంటే దాడి చేశారు!యల్లనూరు: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరిన వ్యక్తిపై రుణ గ్రహీత దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు...యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామానికి చెందిన శ్రీరంగనాయకులు మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నిమ్మకాయల రామాంజనేయులుతో రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ సోమవారం రాత్రి శ్రీరంగనాయకులును ఆయన ఇంటి వద్దకెళ్లి రామాంజనేయులు అడిగాడు. దీంతో శ్రీరంగనాయకులు, ఆయన కుమారులు రమేష్, రంగ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామాంజనేయులుపై ఇనుప పైపులతో దాడి చేశారు. ఘటనలో తలకు తీవ్ర గాయమైన రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రూ.లక్ష నగదు అపహరణ
గుత్తి రూరల్: బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచిన రూ.లక్ష నగదును ఓ దుండగుడు అపహరించారు. ఈ దృశ్యం సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. వివరాలు... గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున పంటల సాగు కోసమని గుత్తిలోని కెనరా బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టి రూ. లక్ష రుణం తీసుకున్నాడు. ఈ నగదును బ్యాంక్ వద్ద నిలిపిన తన బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచి ఎదురుగా ఉన్న దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగుడు బైక్ బ్యాగులోని నగదు ఉంచిన సంచిని తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. సిగరెట్ కాల్చి తిరిగి వచ్చిన మల్లికార్జున బ్యాగ్లో నగదు కనిపించకపోవడంతో వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బ్యాంకు పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే బ్యాగులోని నగదును తీసుకెళుతున్న వ్యక్తి ఆ వెనుకనే వచ్చిన మరో బైక్పై ఎక్కి వెళ్లిపోయే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ కార్యాలయంలో హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లేందుకు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన సందర్భంగా సరైన భద్రత కల్పించాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీలను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది.అయితే, హైకోర్టు ఉత్తర్వుల కాపీలను అనంతపురం ఎస్పీ జగదీష్కు అందజేసేందుకు మూడు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నేరుగా అనంతపురం ఎస్పీ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. విషయం తెలుసుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఏఎస్పీతో మాట్లాడి.. అనంతరం ఎస్పీ జగదీష్తో కూడా ఫోన్లో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దారెడ్డి. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉందని.. ఆ తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. తగిన భద్రత కల్పిస్తామని ఎస్పీ జగదీష్ హామీ ఇచ్చినట్లు వారు మీడియాకు వివరించారు. -
ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం
రిలే దీక్షలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ అనంతపుర అర్బన్: ఆర్డీటీకి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) రెన్యూవల్ మరింత ఆలస్యం జరిగితే ప్రజా ఉద్యమాన్ని చవి చూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఓ పార్టీకి ప్రతినిధిగా ఈ మాట తాను చెప్పడం లేదని, జిల్లా పౌరుడిగా ఆర్డీటీ అందిస్తున్న సేవలను దగ్గరగా చూసి చెబుతున్నానని అన్నారు. ఆర్డీటీని కాపాడాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలనే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అధ్యక్షతన రిలే దీక్షలు మొదలయ్యాయి. కార్యక్రమానికి అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం ప్రకటించి, మాట్లాడారు. ఆర్డీటీ కేవలం స్వచ్చంద సంస్థ మాత్రమే కాదని, ఇక్కడి ప్రజల జీవితాల్లో ఓ భాగం.. వారి భావోద్వేగాలకు ప్రతిరూపమని అన్నారు. ఐదున్నర దశాబ్దాలుగా ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇదే అంశంపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాను విజ్ఞప్తి లేఖలు రాశానని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు కూడా ఆర్డీటీ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళితే ‘మీరే కేంద్రం వద్దకెళ్లి మాట్లాడండి’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆర్డీటీని కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆర్డీటీ సేవలు ఆగితే ప్రజలే తీవ్రంగా నష్టపోతారనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గేయానంద్, మచ్చారామలింగారెడ్డి, రవిచంద్ర, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు చామలూరు రాజగోపాల్, కోట్ల గంగాధర్, కేవీరాజు, రామన్న, సుగమంచి శ్రీనివాసులు, బాలపెద్దన్న, టీపీరామన్న, ఐఎంఎం బాషా, జన్నే ఆనంద్, టీవీరెడ్డి, హరినాథరెడ్డి, వంశీకృష్ణ, రాచేపల్లి రామాంజినేయులు, కృష్ణారెడ్డి, సాకే గోవర్దన్, రామకృష్ణ, రాకెట్ల సూర్యనారాయణ, వరికూటి కాటమయ్య, వెంకటాపురం మారుతి, తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్యాలు పట్టించుకునే వారేరీ?
అనంతపురం మెడికల్: పోషకాహార పునరావాస కేంద్రం (న్యూట్రీషియన్ రీహ్యాబిలిటేషన్ సెంటర్–ఎన్ఆర్సీ)లో చిన్నారుల ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలను 14 రోజుల పాటు ఎన్ఆర్సీలో ఉంచి వారు బరువు పెరిగాక డిశ్చార్జ్ చేస్తుంటారు. తల్లులకు పోషకాహారం, వైద్యం, సంరక్షణ గురించి ఇక్కడ అవగాహన కల్పిస్తుంటారు. అయితే వైద్య ఆరోగ్యశాఖాధికారుల బాధ్యతారాహిత్యంతో ఎన్ఆర్సీ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఎన్ఆర్సీలో సేవలు.. పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిన చిన్నారులకు ఎన్ఆర్సీలో వైద్యులు, డైటీషియన్, స్టాఫ్నర్సుల పర్యవేక్షణలో రెండు వారాల పాటు వైద్య చికిత్సలందిస్తారు. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి చిన్నారులకు డైట్ (ఆహారం) ఇస్తారు. ఉదయం 6 గంటలకు పాలు/రాగిమాల్ట్, 8 గంటలకు పాయసం/ సగ్గుబియ్యం, వేరుశనగ పచ్చడితో చపాతి, జొన్నరొట్టె, రాగిరొట్టె, 10 గంటలకు ఉడికించిన కోడిగుడ్డు/ పండు/ మొలకెత్తిన తింజలు, 12 గంటలకు రాగిముద్ద లేదా అన్నం పప్పుతో కూర, మధ్యాహ్నం 2 గంటలకు ఉడికించిన కూరగాయలు, 6 గంటలకు ఏదైనా పండు, 8 గంటలకు మధ్యాహ్నం భోజనం లాగే ఇవ్వాలి. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు ఇవ్వాలి. ఆహార పంపిణీలో తీవ్ర జాప్యం పోషకాహార పునరావాస కేంద్రం (ఎన్ఆర్సీ)లో చిన్నారులకు డైట్ అందించేందుకు ఇద్దరు వంట మనుషులు అవసరం. అయితే ఇక్కడ ఒక పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఉన్న ఒక్క వంట మనిషి ప్రసూతి సెలవులో వెళ్లారు. ఇక వంట చేయడానికంటూ ప్రత్యేకంగా మనుషులు లేరు. దీంతో ప్రతి రెండు గంటలకు ఒకసారి అందాల్సిన డైట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సకాలంలో ఆహారం అందక చిన్నారులు ఎదురు చూడడం.. కొందరు ఆకలికి నకనకలాడటం నిత్యకృత్యమైపోయింది. అమ్మలా చూసుకుంటున్న స్టాఫ్నర్సులు ఎన్ఆర్సీలోని వైద్యులు ఉదయం, మధ్యాహ్నం వరకు ఉండి తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. ఇక స్టాఫ్నర్సులు తమ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు చిన్నారుల ఆకలిదప్పులు తీర్చేందుకు వంట వండి పెడుతున్నారు. స్టాఫ్నర్సులు అందుబాటులో లేని సమయంలో అటెండర్ వంట వండాల్సి వస్తోంది. ఇదే విషయమై ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేస్తే..‘మీరు డీఎంహెచ్ఓ పరిధిలో ఉంటారు. ఉన్న వారితోనే సర్దుబాటు చేసుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఇక డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి అయితే తమ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వజనాస్పత్రి ఎన్ఆర్సీని ఏనాడూ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. కేంద్రం ఎలా నడుస్తోందో.. సిబ్బందికి సలహాలు, సూచనలు కూడా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిన్నారుల ఆకలి కేకలు ఎన్ఆర్సీలో సౌకర్యాలు నిల్ వంట చేయడానికి మనుషులేరీ? తప్పని పరిస్థితుల్లో వంట చేస్తున్న స్టాఫ్నర్సులు చిన్నారులకు పూర్తిస్థాయిలో అందని పోషకాహారం పర్యవేక్షణ మరచిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్నారని, తమకేం సంబంధం లేదని చెప్పే సర్వజనాస్పత్రి అధికారులు ఎన్ఆర్సీలో ఉన్న డైటీషియన్ను మదర్ మిల్క్ బ్యాంకుకు డిప్యుటేషన్పై పంపారు. ప్రస్తుతం ఉన్న మరో డైటీషియన్ సెలవులో ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్సీలో రెండు ఏసీలు పని చేయడం లేదు. ఫ్యాన్లు తిరగని పరిస్థితి. వంట వండే ఫ్లోర్లో పైకప్పు పెచ్చులూడి పడుతోంది. ఒక్కోసారి పైన ఉన్న బాత్రూంల నుంచి మురుగు కిందకు లీకవుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఇన్ని అసౌకర్యాలున్నా.. అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు. -
ప్రభుత్వ ప్రకటనతో సంబంధం లేదు. తమ భూముల విలువ పెంచుకోవడం కోసం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లతో అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. ఆలసించినా ఆశాభంగం అని తొందరపెడుతున్నారు. అమాయకులు నిజమని నమ్మి.. సంపాదించుకున్న డబ్బుతో పాటు.. వడ్డ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురానికి ఎయిర్పోర్ట్ వస్తోందని, అతి కొద్ది నెలల్లోనే ఫ్లైట్లు దిగుతాయని జరుగుతున్న ప్రచారం సామాన్యులను విస్మయ పరుస్తోంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న ఈ ప్రచారం మాయలో పడి చాలామంది భూములు, ప్లాట్లు అధిక ధరలకు కొని తీవ్రంగా నష్టపోతున్నారు. వందల ఎకరాల భూములు కొన్న స్థిరాస్తి పెట్టుబడిదారులు దానిని సొమ్ము చేసుకునేందుకు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఉదయాన్నే కాలేజీలు, ప్లే గ్రౌండ్లు, పార్కుల వద్దకు వచ్చే వాకర్స్కు కరపత్రాలు పంచుతున్నారు. దానిపై ఎయిర్పోర్ట్ డిజైన్తో పాటు హైవే దూరం, ప్లాట్ల లేఅవుట్ వంటివన్నీ చూపిస్తోంటే చాలామంది నిజమేనేమో అని నమ్మేస్తున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో కూడేరు మండల కేంద్రం జిల్లా కేంద్రం అనంతపురానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో తలుపూరు, సజ్జల కాల్వ, బాపనపల్లె గ్రామాల్లో సుమారు 1,500 ఎకరాలు సేకరిస్తున్నారని, ఇక్కడ ఎయిర్పోర్టు ఖరారైందని రియల్ ఎస్టేట్ వాళ్లు చెబుతున్న కహానీ. ఇదంతా ప్రైవేటు భూమే. ఎకరాకు కనీసం రూ.30 లక్షలు ధర చెల్లించినా భూమికే రూ.450 కోట్లు చెల్లించాలి. కనీసం వంద ఎకరాలు ప్రభుత్వ భూమి లేకుండా ఎయిర్పోర్ట్ సాధ్యమా అన్నది నిపుణుల మాట. రోజుకో ప్రచారంతో ఆ ప్రాంత రైతులు భయాందోళన చెంది, తమ భూములు ఎయిర్పోర్టుకు ఎక్కడ లాక్కుంటారోనని ఏకంగా జాయింట్ కలెక్టర్ను కలిశారు. ఇదంతా నిజం కాదని, మీరు అలాంటివేవీ నమ్మొద్దని చెప్పి పంపించారు. ఆరులేన్ల రహదారి పేరుతోనూ... ప్రస్తుతం బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి నాలుగు లేన్లుగా ఉంది. ఈ రహదారిని ఆరులేన్ల రహదారిగా చేస్తున్నారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో చాలామంది చిన్న చిన్న పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ జాతీయ హైవే అథారిటీ అధికారులు మాత్రం అలాంటి ప్రతిపాదనే లేదని చెబుతున్నారు. జాతీయ రహదారి ఆనుకుని కొడికొండ నుంచి గుత్తి వరకు వందల ఎకరాల్లో వెంచర్లు వేసిన బడా పెట్టుబడి దారులు చేస్తున్న దుష్ప్రచారంతో సగటు మదుపరులు నష్టపోతున్నారు. ఎయిర్పోర్టు, రహదారి వెడల్పు పనులు అయ్యాక ధరలు పెరిగిపోతాయని, ఇప్పుడు కొనుక్కుంటే చౌకగా లభిస్తాయని నమ్మబలికిస్తున్నారు. ఏకంగా ఎయిర్పోర్ట్ గూగుల్ లొకేషన్ అంటూ ఫ్లెక్సీల్లో వేసి చూపిస్తున్నారు. దీంతో చిరు వేతనజీవులు ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు కొనుక్కుని నిండా మునిగిపోతున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడి దారులంతా టీడీపీ నేతలే ఉండటం గమనార్హం. అనంతపురంలో ఎయిర్పోర్ట్ వస్తోందని ప్రచారం కూడేరు ప్రాంతంలో నేడో రేపో ఫ్లైట్లు దిగుతాయని లీకులు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఓనర్లు కర పత్రాలతో మార్కెటింగ్ బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి 6 లేన్లు అవుతుందని మరో ప్రచారం ఇప్పటివరకూ ఆరు లేన్ల ప్రతిపాదనే లేదంటున్న జాతీయ హైవే అథారిటీ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఇప్పటివరకూ సంప్రదింపులే జరగలేదన్న కలెక్టర్ నమ్మించి నట్టేట ముంచడానికి యత్నిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు -
ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించండి
బుక్కరాయసముద్రం: ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. బుక్కరాయసముద్రంలోని షిరిడీ సాయి కల్యాణమండలంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ హాజరయ్యారు. జేసీ మాట్లా డుతూ ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిశీలించి సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అనంతరం ప్రజల నుంచి 506 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, సివిల్ సప్లయ్ డీఎం రమేష్రెడ్డి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీపీఓ నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ, హౌసింగ్ పీడీ శైలజ, డ్వా మా పీడీ సలీం, మైన్స్ ఏడీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ సాలోమన్ పాల్గొన్నారు. పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు అనంతపురం అర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జేసీ సోమవారం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 20 వరకు థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 16,423 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 5,278 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఒకేషనల్ కోర్సుకు సబంధించి మొదటి సంవత్సరం 1,528 మంది, ద్వితీయ సంవత్సరం 1,056 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. ఇక ప్రాక్టికల్స్ ఈ నెల 28 నుంచి జూన్1 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో మాత్రమే జరుగుతాయని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీవీఈఓ వెంకటరమణనాయక్, డీఈసీ సభ్యులు శంకరయ్య, నాగరత్నమ్మ, అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఈఓ ప్రసాద్బాబు, డిప్యూటీ లేబర్ కమిషనర్ లక్ష్మినరసింహ, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ కృష్ణ చైతన్య, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ పాల్గొన్నారు. -
బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, ఎంసీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21)సప్లిమెంటరీ, ఎంబీఏ మూడో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎస్.శ్రీధర్, డాక్టర్ అంకారావు తదితరులు పాల్గొన్నారు.పిచ్చికుక్క వీరంగం: 15 మందికి గాయాలుపుట్లూరు: మండల కేంద్రం పుట్లూరులో ఆదివారం పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న వారిపై దాడి చేసి గాయపరిచింది. సాయంత్రం వేళలోనూ ఇద్దరు చిన్నారులను పిచ్చికుక్క కరిచింది. దాదాపు 15 మంది గాయపడ్డారు. బాధితులకు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించారు. బాధితుల్లో దేవాన్ష్ అనే నాలుగేళ్ల బాలుడితో పాటు హరిప్రసాద్, నరేంద్ర, ఎల్లమ్మ, అంకన్న, నారాయణస్వామి తదితరులు ఉన్నారు.నేడు ఏపీ ఈసెట్అనంతపురం: డిప్లొమా విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కింద బీటెక్ సెకండియర్లో ప్రవేశం పొందేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో మంగళవారం ఏపీ ఈసెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య సోమవారం సాయంత్రం జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి భవనంలో మీడియాకు వెల్లడించారు. ఏపీ ఈసెట్కు మొత్తం 35,187 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఏపీలో 109, తెలంగాణలోని హైదరాబాద్లో ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి హాల్టికెట్, డౌన్లోడ్ చేసిన దరఖాస్తు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఐడెంటెటీ కార్డు తీసుకెళ్లాలని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.సూర్యప్రభ వాహనంపై లక్ష్మీ చెన్నకేశవుడుధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి వారి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంపై స్వామిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం సర్వభూపాల, సింహ వాహనాల్లో స్వామి వారు దర్శనమివ్వనున్నట్లు ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు తెలిపారు. -
పోక్సో కేసు నమోదు
పుట్లూరు: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన 51 ఏళ్ల వయసున్న వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటనరసింహ తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పుట్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి వద్ద వాష్రూంకు వెళ్లి వస్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన వెంకట్రాముడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తప్పించుకుని తల్లిదండ్రులకు తెలిపింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకట్రాముడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంఎల్హెచ్పీల డిమాండ్లను నెరవేర్చాలి అనంతపురం మెడికల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపించారు. సర్వజనాస్పత్రి ఎదుట నిరవధిక సమ్మె చేపట్టిన ఎంఎల్హెచ్పీలకు సోమవారం ఆయన సంఘీభావం తెలిపి, మాట్లాడారు. ఎంఎల్హెచ్పీలకు ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరేళ్లు దాటిన వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాన్ని అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ మిడ్లెవెల్ ప్రొవైడర్ అసోసియేషన్ నాయకులు గౌరి, అనూష, దివ్య, రాజేశ్వరి, వినోద్, శివరాం పాల్గొన్నారు. -
ఈ–పాస్ మిషన్ అపహరణ
రాయదుర్గం టౌన్: స్థానిక కోతిగుట్టలోని 17వ నంబర్ స్టోరు డీలర్ రామకృష్ణను బెదిరించి ఆ వార్డు టీడీపీ ఇన్చార్జ్ అశోక్ దౌర్జన్యంగా ఈ–పాస్ మిషన్ ఎత్తుకెళ్లాడు. బాధితుడు తెలిపిన మేరకు... డీలర్ షిప్ దక్కించుకునేందుకు అశోక్ దౌర్జన్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అధికారులపై ఒత్తిళ్లు తీసుకెళ్లడంతో పలుమార్లు తనిఖీలు చేసి 6ఏ కేసు నమోదు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారణ కావడంతో అధికారులు సైతం అడుగు ముందుకు వేయలేకపోయారు. దీంతో ఈ నెల 3న స్టోర్ వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న సమయంలో అశోక్ అక్కడకు చేరుకుని దౌర్జన్యంగా ఈ–పాస్ మిషన్ ఎత్తుకెళ్లాడు. దీంతో కార్డుదారులకు రేషన్ పంపిణీ నిలిచిపోయింది.స్టోరు పరిధిలో మొత్తం 936 కార్డులు ఉండగా 625 కార్డులకు రేషన్ పంపిణీ జరిగింది. ఇంకా 300లకు పైగా లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. శనివారం నుంచి లబ్దిదారులు స్టోరు వద్ద వచ్చి తిరిగి మిషన్ లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు, తహసీల్దార్, సీఎస్డీటీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి పరిష్కారం దక్కలేదు. ఈ–పాస్ యంత్రం అపహరణపై సీఐకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని బాధితుడు వాపోయాడు. ఈ అంశంపై నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు. టీడీపీ వార్డు ఇన్చార్జ్ నిర్వాకంతో కార్డుదారులకు అందని రేషన్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు -
అనంతలో నకిలీ అక్రిడిటేషన్ల కలకలం
అనంతపురం: జిల్లాలో నకిలీ అక్రిడిటేషన్లు బయటపడ్డాయి. ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నకిలీ అక్రిడిటేషన్లను ఒక్కోక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ‘ప్రజాబలం–ప్రశ్నించే గళం’ పేరుతో మీడియా అక్రిడిటేషన్ కార్డు–2024ను డీఐపీఆర్వో గురుస్వామి శెట్టి గుర్తించి నిగ్గు తేల్చాలంటూ అనంతపురం వన్టౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో అధికారికంగా చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రనాథయాదవ్ స్పష్టం చేశారు. కాగా, అసలైన అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 31తో ముగియనుంది. అయితే నకిలీ అక్రిడిటేషన్లు ఏకంగా 2026, జనవరి 1 చలామణిలో అయ్యేలా ముద్రించడం గమనార్హం. నేర చరిత ఉన్న వారు సైతం మీడియా ముసుగులో రిపోర్టర్లుగా చలామణి అయ్యేందుకు ఇలా నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించి దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం పెద్దపప్పూరు: మండలంలోని ఓ గ్రామంలో మతిస్థిమితం లేని మహిళపై సోమవారం స్థానికుడు అత్యాచారయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా పెట్నికోట గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని ఓ మహిళ తన తల్లితో కలిసి శుక్రవారం పెద్దపప్పూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న వారి బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఒంటరిగా ఉన్న ఆమైపె అదే గ్రామానికి చెందిన వీరాంజనేయులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ నాగేంద్రప్రసాద్ ఆ గ్రామానికి చేరుకుని బాధిత మహిళ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రహసనంలా ‘పోలీసు గ్రీవెన్స్’
అనంతపురం: తమకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులే. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. అన్యాయం జరిగిన వెంటనే బాధితులు నేరుగా పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం దక్కక అయోమయంలో ఉన్న బాధితులు నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే... వాటిలో 50శాతం పిటిషన్లను గ్రీవెన్స్ పరిధిలోకి రావని తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఈ గందరగోళం మధ్యనే టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితులపైనే పోలీసులు రివర్స్ కేసులు బనాయిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. వెల్లువలా వినతులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్కు వినతులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో బాధితులు ఎంతో వ్యయప్రయాసలకొర్చి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ వినతుల్లో సైతం పరిష్కారం దక్కేది ప్రశ్నార్థకమై ‘నేతి బీరలో నెయ్యి...’ అనే చందంలా మారింది. 74 అర్జీలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 74 వినతులు అందాయి. అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఎస్. మహబూబ్ బాషా పాల్గొన్నారు. ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయని వైనం బాధితులపైనే రివర్స్ కేసులతో సతాయింపు పోలీసు వ్యవస్థపై సన్నగిల్లుతున్న నమ్మకం -
9న ఉరవకొండకు సీఎం రాక
ఉరవకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన ఉరవకొండలో సీఎం పర్యటించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణజ్యపన్నులు, శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సోమవారం వజ్రకరూరు మండలం ఛాయపురంలో ఆయన సీఎం పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్నిపెంచేందుకు చేపడుతున్న కాలువ వెడల్పు పనులను సీఎం పరిశీలిస్తారన్నారు. ఇప్పడొస్తున్న నీటిని రెట్టింపుస్థాయిలో తీసుకొచ్చే విధంగా ఆరు పంపులను 12 పంపులకు పెంచనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన కోసం రాగులపాడు, లత్తవరం, ఛాయాపురం ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 9వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పర్యటన ఉంటుందన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన హంద్రీ–నీవా కాలవ విస్తరణ పనులను పరిశీలించేందుకు త్వరలో సీఎం చంద్రబాబు ఉరవకొండ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ వినోద్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఎస్పీ జగదీష్ సోమవారం పరిశీలించారు. లోటుపాట్లు తలెత్తరాదు అనంతపురం టవర్క్లాక్: సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేశవ్ ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ వినోద్కుమార్తో కలసి జిల్లా స్థాయి అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ జగదీష్, అసిసెంట్ కలెక్టర్ సచిన్ రహర్తో చర్చించి రూట్మ్యాప్ను రూపొందించారు. -
34 ప్రాంతాల్లో తగ్గిన భూగర్భజలాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని 34 ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 ఫిజోమీటర్ల పరిశీలనలో 34 ఫిజోమీటర్లలో భూగర్భజలాలు క్షీణిస్తోన్నట్లు భూగర్భజలశాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం జిల్లా సగటు నీటిమట్టం 11.67 మీటర్లుగా నమోదైంది. ఈ ఏడాది 473.9 మి.మీకు గాను 37.5 శాతం అధికంగా 651.4 మి.మీ వర్షం కురిసింది. వర్షం రూపంలో 40.94 టీఎంటీలు భూగర్భంలో అందుబాటులో ఉండగా.. అందులో 14.45 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఇంకా 26.49 టీఎంసీలు మిగులు ఉన్నాయి. నార్పల మండలంలో భూగర్భజలాలు అధికంగా వినియోగిస్తుండటంతో డేంజర్ జోన్లో ఉంచారు. జిల్లా అంతటా 1,87,610 బోరుబావులు వినియోగిస్తుండగా... కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ 13 గ్రామాలను వాల్టా పరిధిలోకి చేర్చారు. సగటు నీటి మట్టం 11.67 మీటర్లుగా నమోదైనా... యాడికి మండలం రాయలచెరువు ఫిజోమీటర్లో 41.01 మీటర్ల లోతులో కనిపిస్తున్నాయి. అలాగే శెట్టూరు మండలం చెర్లోపల్లి ఫిజోమీటర్లో కూడా 38.92 మీటర్లు, మండల కేంద్రం పుట్లూరులో 35.28 మీటర్లు లోతుకు భూగర్భజలాలు క్షీణించాయి. బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్, కళ్యాణదుర్గం, కుందుర్పి, పామిడి, నార్పల, పుట్లూరు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, యాడికి తదితర 12 మండలాల్లో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. అయితే గతేడాదితో పోల్చితే ఈ సారి 3.35 మీటర్లు పెరుగుదల ఉన్నట్లు ఆశాఖ డీడీ కె.తిప్పేస్వామి తెలిపారు.... కానీ 34 ప్రాంతాల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు. జిల్లా సగటు నీటిమట్టం11.67 మీటర్లు ఈ ఏడాది 37.5 శాతంఅదనంగా వర్షాలు డేంజర్ జోన్లో నార్పల వాల్టా పరిధిలోకి 13 గ్రామాలు -
బ్రహ్మోత్సవాల పోస్టర్ల విడుదల
ఉరవకొండ: ఈ నెల 9 నుంచి ప్రారంభం కాను న్న పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన పోస్టర్లను కౌకుంట్లలోని తన స్వగృహంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం విడుదల చేశారు. ఆలయ ఈఓ సాకే రమేష్బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, బాలాజీ స్వామి తదితరులు పాల్గొన్నారు. 8న జిల్లా జైలులో వేలం బుక్కరాయసముద్రం: మండలంలోని జిల్లా జైలులో ఈ నెల 8న 25 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం పాట నిర్వహించనున్నారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ రహమాన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొనే వారు రూ.20 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం ముగిసిన తర్వాత ధరావత్తు వెనక్కు చెల్లిస్తారు. -
జేఎన్టీయూ గౌరవ డాక్టరేట్కు చావా ఎంపిక
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం 14వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ కోసం డాక్టర్ సత్యనారాయణ చావాను ఎంపిక చేశారు. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్న డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ అందించాలని చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ ఎమిరటర్స్ ప్రొఫెసర్, ఐఐటీ కాన్పూర్ ను ఎంపిక చేశారు. మే 17న స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. చావా విజయ ప్రస్థానం.. లారస్ ల్యాబ్స్ కంపెనీ ఏర్పాటైన 18 ఏళ్లలో ఇప్పటి వరకు 150 కొత్త మందులు కనిపెట్టారు. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్లో చేరిన 8 సంవత్సరాలకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎదిగారు. లారస్ ల్యాబ్ స్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి పితామహులు అయ్యారు. సాక్షి 2021 సంవత్సరంలో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఆయన్ని సత్కరించింది. -
వాడిపోతున్న జలపుష్పాలు
రాయదుర్గం: ప్రచండ భానుడి భగభగలకు జిల్లా నింపుటి కుంపటిని తలపిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల ధాటికి మనుషులే కాదు జీవరాసులూ విలవిల్లాడుతున్నాయి. ఈ తాపం భూమిపై ఉన్న జీవరాసులకే కాదు.. నీటిలో ఉన్న జలచరాలను సైతం తాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రత కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, నీటికుంటల్లోని చేపలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో వేసవి తాపం తాళలేమంటూ లోతైన నీటిలోకెళ్లి దాక్కుంటున్నాయి. రూ.12 కోట్ల ఆదాయానికి గండి అనంతపురం– ఎంపీఆర్ మత్స్య క్షేత్రాల వద్ద 100 ఎంఎం పరిమాణంతో ఉత్పత్తి చేసిన 19.5 లక్షల చేప పిల్లలను ప్రభుత్వ ధర ప్రకారం మత్స్యకార సంఘాలకు సరఫరా చేశారు. అలాగే మధ్యతరహా ప్రాజెక్టులైన బైరవానితిప్ప ప్రాజెక్టులో ఈ ఏడాది 6.48 లక్షలు, పీఏబీఆర్లో 12 లక్షలు చేప పిల్లలను వంద శాతం రాయితీతో విడుదల చేశారు. దీనికి తోడు ప్రధాన మంత్రి మత్స్య సహకార పథకం కింద జిల్లాలోని బుక్కరాయసముద్రం, పుట్లూరు, శింగనమల, చాగల్లు, గుత్తి పెద్ద చెరువు, జంబులదిన్నె, మాముడూరు, కలుగోడు, రంగసముద్రం, గుమ్మఘట్ట కమతం చెరువు, పెద్ద ట్యాంకు, గూళ్యం, బెట్టిట్యాంకు భూపసముద్రం, శ్రీధరఘట్ట, తదితర 15 చెరువుల్లో మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 40 శాతం రాయితీతో 14.86 లక్షల చేపపిల్లల పెంపకం చేపట్టారు. ఈ చెరువుల ద్వారా చేపల ఉత్పత్తి జరిగితే 356 టన్నులకు గాను రూ.3.56 కోట్లు, జలాశయాల ద్వారా 918 టన్నులకు గాను రూ.9.18 కోట్లు ఆధాయం రావచ్చని మత్స్యశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ దిగుబడిపై ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎక్కడికక్కడ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో నీరు అడుగంటే కొద్ది చేపలు మృత్యువాత పడుతున్నాయి. మధ్యాహ్నం నేరుగా తాకే సూర్యకిరణాల తీవ్రతను తాళలేక చేపలన్నీ ఒకేచోటకు పోగవుతున్నాయి. భానుడి భగభగలకు వేడెక్కుతున్న నీరు వేడిని తట్టుకోలేక మృత్యుఒడికి చేరుతున్న చేపలు -
ప్రమాదంలో వ్యక్తి మృతి
గుత్తి రూరల్: ఆటో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం అప్పేచెర్ల తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (45) సోమవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతున్న తన వదిన భీమక్కను చికిత్స కోసమని గుంతకల్లులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పిలుచుకెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు గుత్తి శివారులోని నేమతాబాదు జగనన్న కాలనీ వద్దకు చేరుకోగానే చెరువుకట్ట వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొంది. ఘటనలో రమేష్, భీమక్క తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక రమేష్ మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీసీల పేరుతో బహిరంగ దోపిడీ ● వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కురుబ దేవేంద్ర అనంతపురం కార్పొరేషన్: బీసీల పేరుతో కూటమి ప్రభుత్వం బహిరంగ దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కురుబ దేవేంద్ర, నగర అధ్యక్షుడు లక్ష్మణ్ణ విమర్శించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు 50 రోజుల పాటు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. శిక్షణకు హాజరయై ప్రతి మహిళకూ రూ. 3 వేల స్టయిఫండ్తో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్ను ఉచితంగా అందజేసేలా కార్యాచరణను రూపొందించారన్నారు. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.23 వేలు వెచ్చిస్తున్నట్లుగా ప్రకటిచిందన్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... శిక్షణ కాలంలో చెల్లించే రూ.3 వేల స్టయిఫండ్, ఉచితంగా అందజేసే కుట్టు మిషన్ ధర రూ.4,300 పోను... రూ.23 వేలలో మిగిలిన రూ.15,700 ఏమవుతున్నదో అంతు చిక్కడం లేదన్నారు. శిక్షణ సమయంలో దారం, టేపు, కత్తెర, స్కేల్ వంటి పరికరాలను లబ్ధిదారులే సమకూర్చుకుంటున్నారన్నారు. మొత్తం ఈ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు అయ్యే ఖర్చు రూ.73 కోట్లు కాగా, మిగిలిన రూ.167 కోట్లను దిగమింగేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థలను పక్కన పెట్టి, సొంత సంస్థలకు శిక్షణ కాంట్రాక్ట్లను కట్టబెట్టి కూటమి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకొనేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దల తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సెల్ నాయకులు గోగుల పుల్లయ్య, నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
గుంతకల్లు: స్థానిక సిద్ధార్థ నగర్లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి ఇంట్లో దుండగులు చొరబడి విలువైన సామగ్రిని అపహరించారు. వివరాలు.. పట్టణ శివారులోని సివిల్ న్యాయస్థానం వెనుక సిద్ధార్థ నగర్లో రైల్వే బుకింగ్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్న శరత్ నివాసముంటున్నారు. కుటుంబసభ్యులందరూ హైదరాబాద్కు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న శరత్ శనివారం ఇంటికి తాళం వేసి నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత శరత్ ఇంటి తాళాన్ని చిన్నపాటి కడ్డీతో తొలగించి లోపలకు ప్రవేశించారు. బెడ్రూమ్లో బీరువాకే తాళాలు ఉండడం గమనించి అందులోని 12 తులాల బంగారు నగలు అపహరించారు. అనంతరం ఆ పక్కనే నివాసముంటున్న మున్సిపల్ విశ్రాంత అధికారి ఓ.రామాంజనేయులు (తన బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు వెళ్లారు) ఇంటికి వేసిన తాళం గుర్తించి లోపలకు చొరబడ్డారు. బీరువాలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కొంత నగదు అపహరించినట్లు సమాచారం. రామాంజనేయులు బెంగళూరులో ఉండటంతో ఎంత మొత్తం చోరీ అయింది తెలియరాలేదు. ఆయన వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. అలాగే రైల్వే ఉద్యోగి శరత్ ఇంటినీ పరిశీలించి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డ్రిప్ టార్గెట్ 18 వేల హెక్టార్లు ● ఇంకా ఏపీఎంఐపీకి అందని గ్రీన్సిగ్నల్ అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది జిల్లాకు డ్రిప్, స్ప్రింక్లర్ల టార్గెట్ 18 వేల హెక్టార్లు ఇచ్చినట్లు ఏపీఎంఐపీ వర్గాలు తెలిపాయి. అయితే నియమ నిబంధనలు ప్రకటించలేదన్నారు. ఈ ఏడాది 5 ఎకరాల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల రైతులకు 100 శాతం రాయితీతో పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అలాగే 10 ఎకరాల్లోపు ఉన్న ఇతర రైతులకు 90 శాతం రాయితీని వర్తింపజేయనున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఏపీఎంఐపీకి అందకపోవడంతో ఎలాంటి ప్రకటన జారీ చేయకుడా మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం గతేడాది అర్హులైన రైతుల్లో ఇంకా చాలా మందికి మెటీరియల్ సరఫరా చేస్తూ ఉన్నారు. అడిగిన ప్రతి రైతుకూ సూక్ష్మ సేద్యం పరికరాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆర్బాటంగా మొదట జిల్లాకు 42,100 హెక్టార్లు టార్గెట్ ఇచ్చిన కూటమి సర్కారు... రాను రాను తగ్గిస్తూ చివరకు 18 వేల హెక్టార్లకు కుదించింది. ఇందులో 12,635 మంది రైతులకు 15,060 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అందించగా... 2,234 మంది రైతులకు 2,582 హెక్టార్లకు స్ప్రింక్లర్ సెట్లు అందించారు. ఇలా మొత్తంగా 14,869 మంది రైతులకు 17,642 హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేశారు. ఇంకా మెటీరియల్ సరఫరా, ఇన్స్టాలేషన్ పూర్తి కాలేదు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 35 రోజులు కావస్తున్నా... ఇంకా టార్గెట్ల వద్దనే ఆగిపోయారు. ఇప్పటికే 30 వేల మంది వరకు రైతులు పరికరాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. గొర్రెల వ్యాపారిని బెదిరించి రూ. 6.80 లక్షల అపహరణ బుక్కరాయసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి పరిధిలో గొర్రెల వ్యాపారిని దుండగులు అటకాయించి నగదు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. బీకేఎస్కు చెందిన నారాయణస్వామి గొర్రెల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం అనంతపురం మార్కెట్ యార్డులో గొర్రెలు విక్రయించగా వచ్చిన డబ్బుతో అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో గొర్రెలు కొనుగోలు చేసేందుకు తన స్కూటీ వాహనంపై బయలుదేరాడు. దేవరకొండ – ఉప్పరపల్లి మధ్యలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని నారాయణస్వామిని అడ్డుకున్నారు. డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి, అతని వద్ద ఉన్న రూ.6.80 లక్షలు లాక్కొని ఉడాయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్ గార్లదిన్నె: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గార్లదిన్నె పీఎస్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెకంటేషులు వెల్లడించారు. గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన రాజశేఖర్, శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన సుధీర్రెడ్డి, భాస్కరరెడ్డి జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు క్రికెట్ బెట్టింగ్ల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆదివారం పలువురిని ఆకట్టుకుని ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో శింగనమల సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐలు గౌస్ మహమ్మద్ బాషా (గార్లదిన్నె), విజయ్కుమార్ (శింగనమల) కల్టూరులోని రాజశేఖర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో రాజశేఖర్తో పాటు సుధీర్రెడ్డి, భాస్కరరెడ్డి పట్టుపడ్డారు. వీరి నుంచి రూ.4,02,000 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
డిమాండ్లు నెరవేర్చమంటే బెదిరింపులా?
అపంతపురం మెడికల్: గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్హెచ్పీ)/ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ)ను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారి న్యాయపరమైన డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా వేతనాలు నిలుపుదల చేయడంతో పాటు 9 నెలల ఇన్సెంటీవ్స్ బకాయిలనూ ఆపేసి పరోక్షంగా బెదిరింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ తీరుపై పలువురు ఎంఎల్హెచ్పీలు, సీహెచ్ఓలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల సేవలు బంద్.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి వద్దకే సేవలందించేందుకు ప్రతి సచివాలయ పరిధిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. ప్రతి క్లినిక్లో ఎంఎల్హెచ్పీలు అన్ని రకాల సేవలు అందించేవారు. ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా ఇంటి వద్దకే వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంది. గర్భిణులకు నెలనెలా చెకప్లు, చెవి, ముక్కు గొంతు సమస్యలను గుర్తించి మందులు ఇవ్వడం అవసరమైతే హయ్యర్ సెంటర్కు రెఫర్ చేయడం, బాలింతలకు సేవలు, వయసు పైబడిన వారికి ఇంటి వద్దకే వెళ్లి సేవలందించడం, హెచ్బీ, ప్రెగ్నన్సీ, యూరిన్, బీపీ, మలేరియా, హెచ్ఐవీ, డెంగీ,విజువల్ ఇన్ఫెక్షన్(గర్భసంచి ముఖ ద్వారా కేన్సర్పరీక్ష), అయోడిన్ పరీక్ష, హెపటైటీస్ బీ, స్పుటమ్, సుఖ వ్యాధులు, తదితర 14 రకాల పరీక్షలు చేసేవారు. వైద్య నిపుణుల ద్వారా టెలీ మెడిసిన్ సేవలు అందించేవారు. దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, ఫిట్స్ గుండె, కిడ్నీ వ్యాధులకు మందులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని ఆయుష్మాన్ మందిర్లుగా మార్చడమే కాకుండా సేవలను గ్రామీణులకు దూరం చేస్తూ వచ్చింది. న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా నిరవధిక సమ్మెలో ఎంఎల్హెచ్పీలు ఈ నెల వేతనంతో పాటు 9 నెలల ఇన్సెంటివ్ను ఆపిన ప్రభుత్వం కూటమి సర్కార్ తీరుపై అసహనం -
పచ్చ మీడియా కుట్రలను తిప్పికొడదాం
అనంతపురం కార్పొరేషన్: అవాస్తవాలను ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తున్న పచ్చ మీడియా కుట్రలను తిప్పికొడదామంటూ ప్రవాసాంధ్రులకు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆకాంక్షలతో కూడిన చర్చ జరిగింది. ప్రవాసాంధ్రులు భావోద్వేగంతో వైఎస్సార్సీపీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సాగించిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల బాధలు, వారి అవసరాలను తెలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అన్నింటినీ నెరవేర్చారని గుర్తు చేశారు. మేనిఫెస్టోను ఓ కాగితంగా కాకుండా ప్రజా ఒప్పందంగా నిరూపించారన్నారు. రూ.4.47 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఆర్థికాభివృద్ధిలో భాగంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను, 90కి పైగా మౌలిక ప్రాజెక్ట్లను తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇచ్చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లోకి వ్యతిరేకత మొదలైందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు అండగా నిలబడేందుకు అందరూ సామాజిక మాధ్యమాల ద్వారా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న చేసిన మేలును గణాంకాలతోనే తెలియజేస్తూ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, క్వీన్స్ల్యాండ్ కన్వీనర్ బ్రహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బ్రిస్బేన్లో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు -
జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
అనంతపురం అర్బన్: హైకోర్టు ఆదేశాలను చట్ట ప్రకారం అమలు చేయాలని పోలీసు అధికారులకు డిబెట్లో సూచించిన మాటలపై ఆక్రోశంతో జేసీ ప్రభాకర్రెడ్డి సీపీఎంను లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరి కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి నల్లప్ప అన్నారు. జేసీ ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయాలని మాత్రమే డిబెట్లో చెప్పామన్నారు. గతంలో అప్రజాస్వామ్యంగా జేసీ ప్రభాకరరెడ్డిని అరెస్టు చేసినప్పుడు, జేసీ ఇంటికి పెద్దారెడ్డి వెళ్లినప్పుడు కూడా టీడీపీ కంటే ముందు ఖండించింది తామేనని గుర్తు చేశారు. మున్సిపల్, అంగన్వాడీ కార్మికుల సమస్యలపై, ఆర్జాస్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ గతంలో సీపీఎం చేపట్టిన పోరాటానికి జేసీ ప్రభాకరరెడ్డి కూడా మద్దతు తెలియజేశారన్నారు. మరి ఆ రోజున తాము ఆయనతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యామా? అని ప్రశ్నించారు. ఏ రోజూ ఎవరితోనూ లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా... ప్రజాసమస్యల పరిష్కారానికి శాంతియుతంగానే పోరాటాలు సాగిస్తున్నామన్నారు. ఈ ఏడాది జనవరి 1న తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి నిర్వహించిన మహిళా ఈవెంట్ కార్యక్రమంపై, బస్సు తగలబెట్టడంపై, బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన దాడిపై మొదటిగా ఖండించింది సీపీఎం అని అన్నారు. నిజానిజాలను బట్టి ప్రజల పక్షాన సీపీఎం నిలుస్తోందన్నారు. చేసిన ఆరోపణలు నిరాధారమమని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభాకర్రెడ్డి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్య పాల్గొన్నారు. సీపీఎం నాయకులు రాంభూపాల్, నల్లప్ప -
ఖజానా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం (ఏపీటీఎస్ఏ) కార్యవర్గం ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. స్థానిక ట్రెజరీ హోమ్లో నిర్వహించిన ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారులుగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు పి.కిరణ్కుమార్ (నెల్లూరు), డి.రవికుమార్(కర్నూలు), ఎన్నికల పరిశీలకులుగా ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు ఎ.రవికుమార్ వ్యవహరించారు. కార్యవర్గంలోని అన్ని స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రటించారు. ఎన్నికై న సభ్యులకు ప్రోసీడింగ్స్ అందజేశారు. నూతన కార్యవర్గ సభ్యులు వీరే.. ఉమ్మడి జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.శంకరనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ఫారూక్ మహమ్మద్, కార్యదర్శిగా జి.మహేశ్వరెడ్డి, కోశాధికారిగా బి.అనంతయ్య ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా పి.సుమనలత, జి.జగదీష్, ఎం.శ్రీనివాసరావు, కె.వాసుమూర్తియాదవ్, సంయుక్త కార్యదర్శులుగా పి.సిద్ధిక్ఖానుమ్, డి.శ్రీనివాసులు, ఎం.కె.రాజేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సి.తిరుమలరెడ్డి, సి.కిషోర్కుమార్చౌదరి, జి.ఉమేష్ ఎన్నికయ్యారు. ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి ● రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు శంకరయ్య అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి చెంది, పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల నుంచి ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు శంకరయ్య తెలిపారు. అనంతపురంలోని శ్రీనివాస కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు పురస్కారాలతో పాటు జ్ఞాపకలను అందజేసి సత్యరించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను నేరుగా, లేదా పోస్టు ద్వారానైనా అనంతపురంలోని శ్రీనివాస కల్యాణమంటపంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98664 19693, 94901 80177, 92477 92567లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు పామురాయి వెంకటేశ్వర్లు, వెంకట్రాముడు, విజయభాస్కర్, సాయిప్రసాద్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. 11న కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అనంతపురం టవర్క్లాక్: పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన కురుబ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ నెల 11న ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందించనున్నారు. ఈ మేరకు కనకదాస విద్య, ఉపాధ్యాయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్రిస్వామి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 11న అనంతపురంలోని కనకదాస కల్యాణ మంటపంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి హాజరవుతారని పేర్కొన్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్–యూజీ 2025) ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు (అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాయ్స్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, జేఎన్టీయూ–ఏ ఇంజినీరింగ్ కళాశాల, కేఎస్ఎన్ ప్రభుత్వ ఉమెన్స్ కళాశాల, ఏపీ మోడల్ జూనియర్ కళాశాల– గుత్తి) ఏర్పాటు చేశారు. 2,613 మందికి గాను, 2,534 మంది (96.97 శాతం) హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి కనిపించింది. బాగా రాయాలంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పి లోనికి పంపించారు. తల్లిదండ్రులకు తప్పని ఇక్కట్లు.. నీట్ రాయడానికి అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు ఇక్కట్లు తప్పలేదు. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం ఎస్కేయూ ప్రధాన ద్వారానికి చాలా దూరంగా ఉంటుంది. తల్లిదండ్రులు అందరినీ ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. ఇంజినీరింగ్ కళాశాల పరిసరాల్లోకి రాకుండా ఆపి ఉంటే బాగుండేది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్దే ఆపివేయడంతో తల్లిదండ్రులు మండుటెండల్లో రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్కేయూ ఉద్యోగుల క్వార్టర్స్లో ఉండే ప్రొఫెసర్లు, వారికి మంచినీరు ఇచ్చి దాహం తీర్చారు. అతి పెద్ద క్యాంపస్ అయిన ఎస్కేయూ లోపలికి తల్లిదండ్రులను కూడా అనుమతించి ఉంటే క్యాంటీన్ వద్దో.. ఇతరత్రా భవనాల వద్ద కూర్చుని ఉండేవారు. ఉదయం 11 గంటలకు లోపలికి వెళ్లిన అభ్యర్థులు సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బయటే మండుటెండలో వేచి ఉన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడతామనే రీతిలో తల్లిదండ్రులు అక్కడే నిరీక్షించడం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు వేర్వేరుగా నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్, నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద డీఎఫ్ఎండీలు, హెచ్ఎస్ఎండీల ద్వారా పరిశీలించి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి పంపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. ● నీట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. సజావుగా నీట్ పరీక్షలు నిర్వహించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. -
కాలువ వెడల్పు పనులు వేగవంతం
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్ హౌస్ వద్ద నుంచి ఉరవకొండ మండలం కౌకుంట్ల, వై.రాంపురం మధ్యలో 211.8 కిలోమీటర్ వద్ద, బెళుగుప్ప మండలం జీడిపల్లి డ్యాం వద్ద ప్రధాన కాలువ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు పనులు నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజాస్వరూప్కుమార్, ఆర్డీఓ వసంతబాబు, ఎస్ఆర్పీఎస్ శ్రీనివాస్, ఈఈలు శ్రీనివాసనాయక్, శ్రీనివాసులు, తహసీల్దార్ మహబూబ్బాషా, డీటీ నరేష్, డీఈఈ, జేఈలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉచిత గ్యాస్ ఊసేదీ?
అనంతపుర అర్బన్: ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గత మార్చి వరకు ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా వర్తింపజేశారు. అయితే అది కూడా చాలామందికి అందలేదు. అధికారిక నివేదిక ప్రకారం ఉచిత సిలిండర్ పొందేందుకు జిల్లాలో 5.05 లక్షల మంది అర్హులు ఉండగా 4.03 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందారు. అర్హులుగా ఉన్నప్పటికీ 1,02,361 మందికి వివిధ కారణాలతో ఉచిత సిలిండర్ అందలేదు. ఈ ఏడాది ఎప్పుడిస్తారో..? ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంంలో నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇవ్వాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు నుంచి నవంబరు మధ్య రెండవ సిలిండర్, ఇక డిసెంబరు నుంచి మార్చి మధ్య మూడవ సిలిండర్ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఒక నెల గడిచిపోయింది. మే నెల ప్రారంభమైనా కూడా ప్రస్తుత ఏడాదికి సంబంధించి మొదటి సిలిండర్ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో ఉచిత సిలిండర్ ఎప్పుడిస్తారా.. అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్న ప్రభుత్వం గత అక్టోబరు నుంచి ఈ మార్చి వరకు ఒకదానితోనే సరి అదీ 5 లక్షల మంది లబ్ధిదారుల్లో 4 లక్షల మందికే ఈ ఏడాది మే నెల వచ్చినా ఉచిత గ్యాస్ ఊసెత్తని ప్రభుత్వం ఉచిత పథకానికి అర్హులు : 5,05,831 ఒక సిలిండర్ అందుకున్నవారు : 4,03,470 అర్హత ఉండి లబ్ధిపొందనివారు : 1,02,361 ఈ ఆర్థిక సంవత్సరంలో : ఇంకా వర్తించలేదు -
బుక్కరాయసముద్రంలో నేడు పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: బుక్కరాయసముద్రంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. చెరువుకట్ట సమీపంలోని శ్రీసాయిబాబా కల్యాణమండపంలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. వాటిని అధికారులు పరిశీలించి గడువులోపు పరిష్కారం చూపుతారని తెలిపారు.భగీరథ మహర్షి జీవితం ఆదర్శప్రాయంఅనంతపురం రూరల్: భగీరథ మహర్షి జీవితం ఆదర్శ ప్రాయమని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి ఎంపీ, కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగీరఽథ మహర్షి జీవితం నేటి తరానికి ఆదర్శ ప్రాయమన్నారు. తన కఠోర తపస్సుతో గంగను భూమి మీదకు తీసుకొచ్చిన మహానుభావుడు భగీరథుడని కొనియాడారు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఖుష్బూకొఠారి, బీసీ సంక్షేమశాఖ హాస్టల్ వార్డెన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మస్తాన్, జిల్లా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, సగర సంక్షేమ సంఘం నాయకులు సగర పవన్కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.16న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంఅనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్లో నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చను ప్రారంభిస్తారన్నారు. గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో పాటు అన్ని శాఖల అధికారులకు సమాచారం చేరవేసినట్లు తెలిపారు. అధికారులు గైర్హాజరు కావొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని సూచించారు.అక్రమ కేసులు సరికాదుపోలీసుల వైఫల్యంతోనే ‘హెలిప్యాడ్’ ఘటనవైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిఅనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. హెలిప్యాడ్ వద్ద జనాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారన్నారు. రోజూ ఎవరో ఒకరి మీద పనిగట్టుకుని పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు నమోదు చేసినా.. భయపడే ప్రసక్తే లేదన్నారు. రెట్టింపు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తామన్నారు. పార్టీ అండగా ఉంటుందని, ఎవ్వరూ భయపడవద్దని అన్నారు. -
సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కారు. పెద్దకొండపై పాగా వేసి సహజ వనరుల లూటీకి తెగబడ్డారు. అధికారంలో ఉన్నాం.. అందినంత దోచుకుందాం అనే రీతిలో పేట్రేగిపోతున్నారు. పెద్దకొండను ఇష్టానుసారం తవ్వేస్తూ అనకొండలుగా మారారు. కొంతకాలానికి కొండ ఆనవాళ్లు లేకుండా ప
అక్రమార్కుల ఆగడాలకు సాక్ష్యం.. ఈ పెద్దకొండ రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణమరెడ్డిపల్లి సమీపంలోని 231 సర్వే నంబరు (చియ్యేడు పొలం)లో పెద్దకొండ కరిగిపోతోంది. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు తెలుగు తమ్ముళ్లే కొండను కరిగించేస్తున్నారు. ‘అధికారం మాదే...మమ్నల్ని ఆపేదెవరు?’ అంటూ రెచ్చిపోతున్నారు. ఈ కొండ ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. అనంతపురం–కదిరి జాతీయ రహదారికి ఎడమ వైపు కూతవేటు దూరంలో ఉంది. అనుమతులు లేకపోయినా బరి తెగించి ఈ కొండ నుంచి సహజ వనరులను కొల్లగొడుతున్నారు. మొన్నటిదాకా కొండకు ఉత్తరం వైపు (కృష్ణమరెడ్డిపల్లి) మట్టిని తవ్వేసిన ‘తమ్ముళ్లు’.. అక్కడి లీజుదారులు అభ్యంతరం తెలపడంతో వారం రోజులుగా దక్షిణం వైపు (చియ్యేడు) నుంచి తవ్వుతూ వస్తున్నారు. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు కలసికట్టుగా దోపిడీకి తెర తీశారు. హిటాచీ, జేసీబీల సాయంతో మట్టిని తవ్వుతూ టిప్పర్లలో నింపుతున్నారు. వీరిలో ఒకరికి మూడు టిప్పర్లు ఉన్నాయి. ఇద్దరికీ కలిసి ఒక హిటాచీ వాహనం ఉంది. వీరి టిప్పర్లే కాకుండా బయట వారికి కూడా లోడింగ్ చేస్తున్నారు. బయటి వాహనాలకు ఒకసారి లోడింగ్ చేసినందుకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. వారి సొంత వాహనాల ద్వారా నిత్యం నగరానికి మట్టి తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు మట్టి రూ.6–7 వేల దాకా అమ్ముతున్నారు. రోజూ 90 ట్రిప్పుల దాకా మట్టి తరలిస్తున్నారు. ఖర్చులన్నీ పోను రోజూ రూ.2 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. గతంలో ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఇటీవలి కాలంలో ‘పెద్దకొండ’ పుణ్యమా అని రూ.కోట్లకు పడగలెత్తారు. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల బరితెగింపు రోజూ 90 ట్రిప్పుల దాకా ఎర్రమట్టి తరలింపు ఉత్తరం వైపు అడ్డుకుంటే దక్షిణం వైపు నుంచి తవ్వకాలు షురూ పోలీసులు, ఆర్టీఏ, భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ అధికారులకు నెలవారీ మామూళ్లు! ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ నిరాటంకంగా సహజ వనరుల దోపిడీ అందరికీ నెలవారీ మామూళ్లు.. వీరి అక్రమ దందాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. పోలీసులు, ఆర్టీఏ, భూగర్భ గనుల శాఖలోని విజిలెన్స్ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు ఆ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే అక్రమ రవాణా విషయంలో ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. నెలల తరబడి వీరి దందా సాగుతున్నా అధికారులు ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలను బలపరుస్తోంది. దీనికితోడు పొరపాటున ఎవరైనా వీరి వాహనాలను ఆపితే వెంటనే కొందరితో ఫోన్లు చేయిస్తున్నారు. తరచూ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెబుతూ ‘మట్టి దందా’ను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే... -
వివాదాల్లేకుండా టీచర్ల బదిలీలు చేపట్టాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు కోరారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలో పీఆర్టీయూ నాయకులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు వీలైనంత త్వరగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయ, విద్యార్థుల మధ్య నిష్పత్తిని తగ్గించాలన్నారు. వేసవి సెలవుల్లో సమ్మర్ కోచింగ్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఈఎల్ సదుపాయం కల్పించాలన్నారు. డీఈఓ పూల్లో ఉన్న పండిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఉర్దూ పాఠశాలలో తెలుగు పోస్ట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఆర్టీయూ అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి. పురుషోత్తం రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. తిమ్మారెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్. విష్షువర్ధన్రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏ. కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వైసీ ప్రసాదరెడ్డి, బి. చితంబరరెడ్డి, ఎంవీ శివారెడ్డి, బాబయ్య, శ్రీరాములు, చంద్రశేఖర్, జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు -
ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి
గుంతకల్లు: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా ప్రధాన మంత్రి మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. నేటికీ ఈ హామీకి దిక్కు లేకుండా పోయిందన్నారు. అమరావతి శంకుస్థాపనకు ఇటీవల వచ్చిన మోదీ... రాష్ట్ర రాజధాని అభివృద్దికి రూ.45వేల కోట్ల నిధులను కేటాయించినట్లు గొప్పగా ప్రకటించారన్నారు. అయితే ఇందులో కేవలం 10శాతం మాత్రమే కేంద్రం భరిస్తోందని, మిగిలిన 90 శాతాన్ని రాష్ట్రానికి అప్పుగా ఇస్తోందని గుర్తు చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం అప్పులతోనే రాష్ట్రాన్ని కూటమి సర్కార్ నెట్టుకొస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ అభివృద్ది వైపు పరుగులు పెట్టాలంటే ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ఈ అంశంపై కూటమి పెద్దలు పోరాటాలకు సిద్ధమైతే పార్టీలకు అతీతంగా అందరూ కలసి వస్తారన్నారు. కులగణనను కేవలం బిహార్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, ఎస్ఎండీ గౌస్, రామురాయల్, మురళి తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నేత జగదీష్ -
రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్
అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 10 మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ఇటీవల దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ రాక సందర్భంగా కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.చెన్నేకొత్తపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మవరం మెజిస్ట్రేట్.. పది మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పరామర్శించారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత
సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో, వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హిందూపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్ పూర్ సర్కిల్లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ నాటికి పరీక్షలు ముగుస్తాయి. తొలి రోజున అభ్యర్థుల హాజరు 65 శాతం నమోదయ్యింది. అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ బాలజీ పీజీ కళాశాల కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 594 మంది అభ్యర్థులకు గాను 389 మంది హాజరయ్యారు. 205 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి.వినోద్కుమార్ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌలిక సదుపాయల కల్పనపై ఆరా తీశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సదుపాయంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏపీఎస్సీ నియమ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, లైజన్ అధికారి ఎస్డీసీ తిప్పేనాయక్, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు. తొలి రోజున అభ్యర్థుల హాజరు 65 శాతం -
రేపు బీకేఎస్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుక్కరాయసముద్రం సమీపంలోని షిరిడీసాయి కళ్యాణ మండపంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తనతో పాటు జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా అధికారులందరూ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెచ్చిపోయిన జేసీ ● సీపీఎం నేత రాంభూపాల్పై అనుచిత వ్యాఖ్యలు తాడిపత్రిటౌన్ : తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు. సీపీఎం రాష్ట్ర నేత రాంభూపాల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాన్ని చెప్పడమే నేరమన్నట్లుగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉన్నా జేసీ ప్రభాకర్రెడ్డి దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. ఈ అంశంపై ‘సాక్షి’ టీవీ డిబేట్లో రాంభూపాల్ మాట్లాడడాన్ని జేసీ ప్రభాకర్రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం తాడిపత్రిలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ..తనదైన రీతిలో రెచ్చిపోయారు. ‘స్కూల్ గ్రౌండ్లో టిప్పర్లతో రాళ్లు వేశామని మాట్లాడుతున్నావ్.. మాజీ ఎమ్మెల్యేను ఎందుకు వెనుకేసుకొస్తున్నావ్? ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావా? గత ఐదేళ్లు ఎక్కడికి పోయింటివి రాంభూపాల్.. ఆరోజు నన్ను పోలీసోళ్లు ముసలోడినని కూడా చూడకుండా ఎలా తోశారో చూడలేదా? నాకు నీ మీద మంచి అభిప్రాయం ఉండేది. ఈ రోజుతో నీకు మర్యాద పోయింది. నీ గురించి కూడా తీస్తా. విత్ రికార్డ్తో వస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. రైతుల ఆశలు గాలికి ● గాలీవానకు రూ.2 కోట్లకు పైగా పంట నష్టం అనంతపురం అగ్రికల్చర్: రైతుల ఆశలు గాలికి పోతున్నాయి. ఈ సీజన్లో నెలన్నర రోజులుగా గాలీవాన బీభత్సానికి పెద్ద ఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. చేతికొచ్చిన పంటల వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లుతోంది. తాజాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు మండలాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో పంటలు నేలవాలాయి. గాలులకు తోడుగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం వల్ల రైతులకు కోలుకోని నష్టం కలిగించింది. ఉద్యానశాఖ అంచనా మేరకు గుంతకల్లు, గుమ్మఘట్ట, అనంతపురం, రాప్తాడు, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, నార్పల, యల్లనూరు మండలాల్లో 31 గ్రామాల పరిధిలో అరటి, బొప్పాయి, మామిడి పంటలు 88.61 హెక్టార్లలో దెబ్బతినడంతో 102 మంది రైతులకు రూ.1.64 కోట్ల వరకు నష్టం జరిగింది. అలాగే శింగనమల మండలంలో మొక్కజొన్న, వరి పంటలు 44 హెక్టార్లలో నేలవాలడంతో 77 మంది రైతులకు రూ.38 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నెలన్నర రోజులుగా జిల్లా రైతులకు రూ.70 కోట్లకు పైగా పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. 23 మండలాల్లో వర్షం.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 6.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. సెల్ఫోన్ చూడొద్దన్నందుకు విద్యార్థి ఆత్మహత్య అనంతపురం: సెల్ఫోన్ను పక్కనపెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వన్టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్నానగర్కు చెందిన కల్లూరు చంద్రకాంత్ (20) ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చంద్రకాంత్ కళాశాలకు వెళ్లకుండా తరచూ సెల్ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన చంద్రకాంత్ శనివారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కల్లూరు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రైతు ఉసురు తీసిన అప్పులు
వజ్రకరూరు: అప్పులు ఓ గిరిజన రైతు ఉసురు తీశాయి. వెంకటాంపల్లి పెద్దతండా (రూప్లానాయక్ తండా)లో శనివారం సబావత్ సామునాయక్ (44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సబావత్ సాము నాయక్కు నాలుగు ఎకరాల పొలం ఉంది. అందులో ఏడుదాకా బోర్లు వేయించాడు. బోర్ల ద్వారా వచ్చే నీటి ఆధారంగా మూడేళ్లుగా మిరప సాగు చేస్తున్నాడు. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ పెట్టాడు. అయితే పంటలు ఆశించిన స్థాయిలో చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. పంటల సాగు, బోర్ల కోసం చేసిన అప్పులు రూ.16లక్షలకు చేరుకున్నాయి. వీటిని ఎలా తీర్చాలో అర్థం కాక రోజూ మదనపడుతుండేవాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సబావత్ సామునాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులు ముగించుకుని వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తట్టగా ఎంతకూ తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా సామునాయక్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేశారు. దేవుడా ఇక తమకు దిక్కెవరు అంటూ కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. రైతు సామునాయక్కు భార్య సామక్కబాయి, నలుగురు కుమారులు ఉన్నారు. ఎంపీపీ రమావత్ దేవి, సర్పంచ్ కొర్రా శివాజీ నాయక్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
హతవిధీ.. రక్తం ఏదీ..?
అనంతపుం మెడికల్: ఉమ్మడి జిల్లాకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రే పెద్ద దిక్కు. నలుమూలల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా రక్త నిల్వలు లేకపోవడం కలవర పెడుతోంది. రోజూ 2,500 మంది ఔట్ పేషంట్, 1,100 మంది ఇన్పేషంట్లు సేవలు పొందుతుంటారు. వివిధ వార్డుల్లో ఉన్న రోగులకు సరాసరి 50 మంది వరకు రక్తం అవసరం ఉంటుంది. అందులో గర్భిణులు, బాలింతలు 20 మందికిపైగానే ఉంటున్నారు. అందుబాటులో 163 యూనిట్లు ప్రస్తుతం సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రంలో 163 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. అందులో ఏ పాజిటివ్ 22, బీ పాజిటివ్ 16, ఓ పాజిటివ్ 27, ఏబీ పాజిటివ్ 4, ఏ నెగిటివ్ 1, బీ నెగిటివ్ 7, ఓ నెగిటివ్ 7, ఏబీ నెగిటివ్ 1, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినవి 78 యూనిట్లు ఉన్నాయి. సదుపాయాలు మృగ్యం.. సర్వజనాస్పత్రిలో రక్తనిధి (బ్లడ్ బ్యాంకు) నిర్వహణను ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్తనిధి కేంద్రంలో 12 ఏసీలు ఉన్నాయి. ఇందులో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. ఇక రక్తం నిల్వ ఉంచే ఫ్రీజర్ చెడిపోయి చాలా రోజులైంది. దీనిని మరమ్మతు చేయించి.. రక్తం నిల్వలు పెంచడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలంటే లెక్కలేదని తెలుస్తోంది. మంత్రికి ప్రైవేట్పైనే ప్రీతి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఏడాది తన జన్మదినం రోజున ప్రభుత్వ సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రానికి మెడికల్ క్యాంపునకు అవకాశం కల్పించారు. అయితే రోజుల వ్యవధిలోనే క్యాంపును నగరంలోని దీపు రక్తనిధికి మళ్లించారు. ఎక్కడైనా సర్వజనాస్పత్రికి అధిక యూనిట్ల రక్తం అందించేలా చూడాల్సిన మంత్రివర్యులు.. ఇలా ప్రైవేట్ రక్తనిధికి సహకరించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కన్నెత్తి చూడని కలెక్టర్.. కలెక్టర్ వినోద్కుమార్ ఏనాడూ సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. పాతూరులోని రెడ్క్రాస్ను నాలుగైదు సార్లు పరిశీలించి, వారిని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఏనాడూ సర్వజనాస్పత్రి రక్తనిధి కేంద్రాన్ని అభివృద్ధి చేసి.. అధిక మొత్తంలో రక్తం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. యువత ముందుచూపుతో రక్తం అందించడానికి ముందు వస్తే గర్భిణులు, బాలింతలు, క్షతగాత్రులకు ఉపయోగపడుతుందని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. రక్తనిధిలో అందుబాటులో ఉన్నది 163 యూనిట్లే సర్వజనాస్పత్రిలో రక్తం కొరత రోజువారి అవసరం 50 యూనిట్లు ఇక్కడ కనిపిస్తున్న గర్భిణి యాడికి చెందిన మహిళ. హెచ్బీ 8లోపే ఉండడంతో గైనిక్ వైద్యులు రెండు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. 2 గ్రాములు, 4 గ్రాములు, తదితర తక్కువ శాతంతో హెచ్బీ ఉన్న వారు చాలామంది ఆస్పత్రిలో అడ్మిషన్లో ఉన్నారు. రాయదుర్గం ప్రాంతానికి చెందిన భంభం స్వామికి పొట్టేలు పొడవడంతో కాలుకు తీవ్ర రక్తస్రావమై శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు భంభం స్వామికి 10 యూనిట్ల రక్తం ఎక్కించారు. అదేవిధంగా హిందూపురానికి చెందిన ఓ మహిళ గైనిక్ సమస్యతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. వైద్యులు రక్తం ఎక్కించుకోవాలని సూచించారు. అయితే ఆమెకు డోనర్ ఎవరూ లేరు. చివరకు బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు డోనర్ లేకున్నా..రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారు. -
ఇళ్ల స్థలాల్లో ఇంత పెద్ద గుంతలా?
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం ఆలమూరు జగనన్నకాలనీ పక్కన ఉన్న ఎర్రకొండ చుట్టూ అక్రమ తవ్వకాలను చూసిన అధికారులు నివ్వెరపోయారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, చివరకు కరెంటు పోళ్లు, నీటి ట్యాంకుల చుట్టూ పెద్దపెద్ద గుంతల కారణంగా ప్రమాదకరంగా మారిన దృశ్యాలను చూసి విస్మయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రకొండ చుట్టూ యథేచ్ఛగా తవ్వకాలు జరిపిన వైనంపై ‘సాక్షి’లో శుక్రవారం ‘ఎర్రకొండపై ఎల్లో గద్దలు’ శీర్షికతో వచ్చిన కథనం కలకలం రేపింది. ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. భూగర్భ గనుల శాఖ డీడీ గంజి వెంకటేశ్వర్లు, అనంతపురం రూరల్ తహసీల్దార్ మోహన్కుమార్, ఆర్ఐ సందీప్, సర్వేయర్ రఘునాథ్ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పేదలకు ఇళ్ల కోసం కేటాయించిన స్థలాల్లోనూ పది అడుగులకు పైగా గుంతలు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించారు. తవ్వకాలతో ప్రమాదకరంగా మారిన కరెంటు పోళ్లు, నీటిట్యాంకులు వర్షాకాలంలో కూలే ప్రమాదం ఉందని తేల్చారు. హౌసింగ్ పీడీ శైలజకు గనుల శాఖ డీడీ వెంకటేశ్వర్లు ఫోన్లో మాట్లాడారు. మీరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున గుంతలు పెట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగగా... అదంతా రెవెన్యూ వాళ్లు చూసుకోవాలి కదా అని పీడీ పేర్కొన్నారు. రెవెన్యూ వాళ్లు స్థలాన్ని హౌసింగ్ అధికారులకు అప్పగించారు. హౌసింగ్ వారే ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారు. కరెంటు పోళ్లు నాటించారు. నీటి ట్యాంకులు ఏర్పాటు చేయించారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ను పర్యవేక్షించకుండా ఇలా గాలికొదిలేస్తే ఎలా అని డీడీ ప్రశ్నించారు. కచ్చితంగా ఒకరిద్దరిని ఇక్కడ ఏర్పాటు చేసి తవ్వకాలు జరగకుండా చూడాలన్నారు. వెంటనే ఇద్దరు ఉద్యోగులను ఏర్పాటు చేస్తామని హౌసింగ్ పీడీ పేర్కొన్నారు. వీఆర్ఏ కూడా రోజూ వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించాలని, ఎవరైనా తవ్వకాలు జరిపినా, జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లు ఈ ప్రాంతానికి వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరిపితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఎర్రకొండలో అక్రమ తవ్వకాలు పరిశీలనలో అధికారుల విస్మయం హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యంపై భూగర్భ గనుల డీడీ ఆగ్రహం -
లింగ నిర్ధారణ తీవ్ర నేరం
అనంతపురం అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తీవ్రమైన నేరమని, ఎప్పటికప్పుడు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం, ఏఆర్టీ సరోగిసీ చట్టానికి సంబంధించి డిస్ట్రిక్ లెవల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అధారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు సంబంధించి పోస్టర్లను తయారు చేయాలని ఆదేశించారు. బాలికల కళాశాలల వద్ద బీట్ పాయింట్ ఏర్పాటు చేయాలన్నారు. టీనేజీ ప్రెగ్నేన్సీ నమోదైన వెంటనే హెల్త్, ఐసీడీఎస్ అధికారులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. లింగ నిర్ధారణకు అడ్డుకట్టవేయాలన్నారు. ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలకు జరకూడదని, చట్టం అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఒకటవ ఏడీజే సత్యవాణి, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, డాక్టర్ పార్వతి, ఆర్టీడీ ప్రతినిధి డాక్టర్ దుర్గేష్, డీఎస్పీ మహబూబ్బాషా, డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్, ఆశారాణి, రెడ్స్ భానూజా డెమో త్యాగరాజ్, హెల్త్ ఎడ్యుకేటర్లు, తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలి.. సచివాలయాల పరిధిలో చేపట్టిన మనమిత్ర క్యాంపెయిన్, తదితర కార్యక్రమాలకు సంబంధించి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయాలు, ఇతర అంశాలపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీఓలు, డీఎల్డీఓలు ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ప్రజారోగ్య, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమిత్రకు సంబంధించి రోజుకు 17 వేల క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. సిటిజన్ ఈ–కేవైసీ రోజుకు 10 వేలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ నాగరాజు నాయుడు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ కిరణ్కుమార్రెడ్డి, పీజీఆర్ఎస్ తహసీల్దారు వాణిశ్రీ, జీఎస్డబ్ల్యూఎస్ కో–ఆర్డినేటర్ ధనుంజయ పాల్గొన్నారు. -
గుత్తి డీవైఈఓగా పాటిల్ మల్లారెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్/ గుత్తి: గత కొంత కాలంగా నాన్చుతూ వచ్చిన గుత్తి డీవైఈఓ పోస్టుపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. బెళుగుప్ప ఎంఈఓ పాటిల్ మల్లారెడ్డి(ఎఫ్ఏసీ)ని నియమిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు 4 రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ రెగ్యులర్ డీవైఈఓగా పని చేస్తున్న శ్రీదేవి ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి డీఈఓనే ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ వచ్చారు. నూతన డీవైఈఓ మల్లారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. పలువురు ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా విద్యాశాఖలోని ఓ విభాగంలో కీలకమైన పోస్టులో పని చేసిన అధికారిపై ఆర్థిక అంశాలపై ఆరోపణలు వచ్చాయి. గతంతో పని చేసిన డీఈఓ వరలక్ష్మి...ఇక్కడ చేరకముందే ఆమె పేరుతో ప్రశ్నపత్రాల ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఆ తర్వాత బిల్లులు డ్రా చేయడం తదితర అంశాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా సదరు అధికారిపై చార్జ్ మెమోలు జారీ చేశారు. వాస్తవానికి ఈ అధికారే సీనియార్టీ జాబితాలో ముందున్నారు. అయితే చార్జెస్ పెండింగ్ ఉన్న కారణంగా...ఆయనకు ఇవ్వడానికి వీలులేదని తేల్చిన ఉన్నతాధికారులు మల్లారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కోసం విద్యాశాఖలోని మరో కీలక అధికారి చివరివరకు తీవ్రంగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి చెక్ పెట్టిన ఉన్నతాధికారులు -
తాగునీటి ట్యాంకుల శుభ్రం
ఉరవకొండ: ఉరవకొండ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని తాగునీటి సంప్ శుక్రవారం అధికారులు శుభ్రం చేయించారు. ‘తగ్గని వాంతులు..విరేచనాలు’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మేజర్ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి క్లోరినేషన్ చేపట్టారు. ఉరవకొండ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్వీఆర్ చౌదరి ఆదేశాల మేరకు వైద్యాధికారిణి డాక్టర్ వీనీత, ఆర్డబ్ల్యూఎస్ జేఈలు ఐజయ్య, ద్రాక్షయణితో కలిసి స్థానిక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని సంప్ను పరిశీలించారు. ఈసందర్భంగా జేఈ ఐజయ్య మాట్లాడుతూ నింబగల్లు సమ్మర్ స్టొరేజీ ట్యాంకు వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్లను మరమ్మతు చేయడంతో పాటు కొత్తగా మైక్రో ఫిల్టర్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని ఎంపీడీఓ రవిప్రసాద్ గ్రామకార్యదర్శులను ఆదేశించారు. -
నిజా నిజాల్ని ప్రజలకు వివరిద్దాం
అనంతపురం మెడికల్: ప్రత్యక్ష రాజకీయ వేదికలకంటే సామాజిక మాధ్యమాల ద్వారా నిజం గళం వివరించి ప్రజలను చైతన్యవంతునలు చేద్దామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మెల్బోర్న్లో జరిగిన వైఎస్సార్ సీపీ గ్లోబల్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నివర్గాల ప్రజలకు పథకాలు అందించడం ద్వారా సంక్షేమ విప్లవాన్ని సృష్టించారన్నారు. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేశారని, నాడు–నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చడమే కాకుండా అన్ని వర్గాల వారికి ఖరీదైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలనలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాయాలను తీసుకువచ్చి ఒకేసారి 1,25,000 మందికి ఉద్యోగాలు, 2.6 లక్షల మంది వలంటీర్లకు ఉపాధి కల్పించారన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని విధంగా విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. ఇంటి వద్దకే పాలననందించారన్నారు. అబద్దాలకు గళం ఇస్తే మనం వాస్తవాలకు శబ్దం ఇవ్వాలని, డేటా, గణాంకాలు, గ్రాపులు ఇవేన ఆయుధాలని, జగనన్నను సీఎం చేసుకోవడానికి ప్రవాసాంధ్రులు పోరాట పటిమను చాటాలన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్ సీపీ కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, మెల్బోర్న్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మెలబోర్న్లో ప్రవాసాంధ్రులతో సమావేశం -
● అనారోగ్యం బారిన అధికారులు, ఉద్యోగులు ● డెప్యుటేషన్లో డీడీ, సెలవులో ఏడీ, హెచ్ఓలపై భారం ● అధికార పార్టీ, కమిషనరేట్, కలెక్టరేట్ ఒత్తిళ్లకు అనారోగ్యం
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. రైతులు, పంట రకాలు, విస్తీర్ణం, దిగుబడులు, టర్నోవర్ పరంగా ‘అనంత’ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 72 రకాల పంటలతో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగానూ, ఫలసాయం, ఎగుమతుల పరంగా ఇటీవల ఉద్యాన హబ్గా పిలవబడుతోంది. జిల్లాలో 3 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉద్యాన తోటలు విస్తరించాయి. అందులో 1.80 లక్షల ఎకరాలు పండ్లతోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, మిగతా 45 వేల ఎకరాల్లో పూలు, ఔషధ, సుగంధ, తోట పంటలు సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల ఫలసాయం వస్తుండగా... రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల మేర టర్నోవర్ (జీవీఏ) ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘అనంత’ ఫలసాయానికి ఢిల్లీలో ఉన్న అజాద్పూర్ మండీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంటోంది. అలాగే హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, విజయవాడ, నాగపూర్ లాంటి మార్కెట్లకు చీనీ, దానిమ్మ, మామిడి, అరటి, టమాట, కళింగర, కర్భూజా లాంటి ఫలసాయం ఎగుమతి అవుతోంది. ఏడీ స్థాయి అధికారే దిక్కు.. ఉద్యానతోటల పరంగా ప్రాధాన్యత కలిగిన ‘అనంత’కు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ (డీడీహెచ్) స్థాయి అధికారి లేకపోవడం గమనార్హం. ఇక్కడే వేతనం తీసుకుంటూ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి కమిషనరేట్లో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారితో నెట్టుకొస్తున్నారు. ఏడీకి అదనంగా ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈఓగా బాధ్యతలు ఇచ్చారు. ఇక 31 మండలాల పరిధిలో 10 మంది హార్టికల్చర్ ఆఫీసర్లు(హెచ్ఓ)లు, మరో నలుగురు హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(హెచ్ఈఓ) ఉన్నారు. ఆర్ఎస్కే అసిస్టెంట్లుగా మరో 180 మంది వరకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ (వీహెచ్ఏ)లు పనిచేస్తున్నా. వీరు పూర్తీ స్థాయిలో హార్టికల్చర్ కింద పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యాన పథకాలతో పాటు ఏపీఎంఐపీ కింద అమలు చేస్తున్న డ్రిప్, స్ప్రింక్లర్ల పథకంలో కూడా ఉద్యానశాఖ అధికారులు భాగస్వామ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో ఉద్యానశాఖ మీద పనిఒత్తిడి పెరిగినట్లు చెబుతున్నారు. నిత్యం సమావేశాలే.. తరచూ కమిషనరేట్, కలెక్టరేట్ నుంచి నివేదికలు కోరడం, నిత్యం జూమ్, వెబ్ కాన్ఫరెన్స్లు, టెలీ కాన్ఫరెన్స్లు అధికం కావడం, క్యాంప్లు ఉండటం తదితర కారణాలతో ఒత్తిడి అధికమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లవాన, చీడపీడల తాకిడికి పంటలు దెబ్బతినడం, సస్యరక్షణ సిఫారసులు చేయడం, పంట నష్టం అంచనా వేయడం లాంటి వాటితో పాటు ఇటీవల కాలంలో పథకాల అమలులో అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఆ శాఖ అధికారులు అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుస్తోంది. ఏడీ స్థాయి అధికారి నరసింహారావు రెండు సార్లు నెల రోజుల పాటు సెలవు పెట్టారు. ప్రధానంగా గంట గంటకు పై నుంచి నివేదికలు, సమాచారం అడగడం వల్ల సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో ఈదురుగాలులతో పంటలు దెబ్బతిన్న సమయంలో పుట్లూరు మండలానికి చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడటంతో అధికార పార్టీ నేతలు, కమిషనరేట్, కలెక్టరేట్ నుంచి ఒత్తిళ్లు రావడంతో ఏడీ నరసింహారావు గుండెనొప్పితో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని అనంతరం నెల రోజుల పాటు సెలవు పెట్టారు. అలాగే హెచ్ఓ రత్నకుమార్ సైతం గుండెనొప్పితో ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కార్యాలయ సూపరిండెండెంట్ బాషా సైతం గుండెనొప్పితో ఇటీవల స్టంట్ వేయించుకున్నారు. మరో సూపరిండెండెంట్ శాంతకుమారి తీవ్ర వెన్నునొప్పితో ఆపరేషన్ చేయించుకున్నారు. అకౌంటెంట్ కమలాకర్ కంటి నొప్పి భరించలేక వారం కింద లేజర్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇలా... ఉద్యానశాఖ అధికారులు, ఉద్యోగులు ఇటీవల ఒత్తిడికి గురవుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
నల్ల్లలమ్మ ఆలయంలో చోరీ
రాప్తాడు: బుక్కచెర్ల ఎస్సీ కాలనీలోని నల్ల్లలమ్మ ఆలయంలో అమ్మవారి సోత్తులు చోరీకి గురయ్యాయి. ఆలయ నిర్వాహకులు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలు.. ఆలయ పూజారి నల్లప్ప అమ్మవారికి ప్రతి మంగళ, శుక్ర, ఆదివారం పూజలు చేస్తుండేవారు. శుక్రవారం పూజలు చేసి ఆలయానికి తలుపులు వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి 80 గ్రాముల అమ్మవారి ముఖావళి, 20 గ్రాముల 3 వెండి గొడుగులు, ఒక తులం బంగారు తాళిబొట్టును ఎత్తుకెళ్లారు. రూ.2 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు.ఆర్టీసీ బస్సులో రూ. 70 వేలు చోరీగుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో బస్సులో ఉన్న ప్రయాణికుడి నుంచి రూ.70 వేలు చోరీకి గురయ్యాయి. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన తాయప్ప రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని స్వస్థత శాలకు వచ్చాడు. శనివారం సాయంత్రం రాయచూరు వెళ్లడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాడు. ఈక్రమంలో ఆళ్లగడ్డ బస్సు ఎక్కగా పది నిమిషాల్లోనే తన వద్ద ఉన్న రూ.70 వేలు కనిపించలేదు. దీంతో బస్సంతా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బస్సును స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.మద్యం మత్తులో స్నేహితుడిపై దాడిఅనంతపురం: మద్యం మత్తులో స్నేహితుడిపై దాడిపై దాడి చేసిన ఘటన శారదనగర్లో చోటుచేసుకుంది. వన్టౌన్ సీఐ వి. రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన వివరాలు..ఫెర్రర్ నగర్కు చెందిన మునాఫ్, శారదానగర్కు చెందిన మురళి మిత్రులు. మద్యం సేవించిన అనంతరం మాటామాట పెరిగింది. వ్యక్తిగతంగా దూషించుకున్నారు. స్థానికులు సర్దిచెప్పి పంపించేశారు. దూషించాడనే అవమానంతో దూషించిన మురళి నాటు కొడవలి, దుస్తులు శుభ్రం చేసే సోడా రసాయన ద్రావణం, తీసుకుని తిరిగి మద్యం షాపు వద్దకు వచ్చాడు. శారదనగర్లో మద్యం షాపు వద్ద మద్యం సేవిస్తున్న మునాఫ్పై ద్రావణం చల్లాడు. రాయి, కొడవలితో దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ మునాఫ్ను ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. బాధితుడి కళ్లు, ముఖం, శరీర భాగాలు దెబ్బన్నాయని, మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు మురళిని అదుపులోకి తీసుకున్నారు.రేపు ఆర్ట్స్ కళాశాలలో మెగా ఉద్యోగమేళాఅనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో సోమవారం మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి. పద్మశ్రీ, జేకేసీ సమన్వయకర్త తాళంకి జీవన్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలు డాక్టర్ రెడ్డి ఫౌండేషన్, కియా, అమెజాన్, జోయలుక్కాస్ తదితర సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆయా కంపెనీల్లో సుమారు 1000 పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ కోర్సులు పూర్తయిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.బంగారం మూట మాయం అతడి పనే..పెన్నహోబిళం ఘటనలో స్వీపరే నిందితుడుసీసీ పుటేజీ ఆధారంగా గుర్తింపుఉరవకొండ: ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనృసింహస్వామికి భక్తురాలు సమర్పించిన బంగారు మూటను మాయం చేసిందే స్వీపరేనని పోలీసులు గుర్తించారు. శనివారం అర్బన్ సీఐ మహానంది వివరాలు వెల్లడించారు. మార్చి 7న ఆమిద్యాల గ్రామానికి చెందిన వనజాక్షి అనే భక్తురాలు మొక్కులో భాగంగా నిలువుదోపిడీ కింద బంగారు మూటను స్వామి వారికి సమర్పించింది.ఈఏడాది మార్చి 18న పెన్నహోబిళం శ్రీవారి హుండీ లెక్కింపు సమయంలో స్వీపర్ శ్రీనివాసులు వనజాక్షి సమర్పించిన బంగారు మూటను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టి మూట కనబడలేదని అధికారులను తప్పుదోవ పెట్టించాడు. వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో భయపడిన స్వీపర్ తాను చెత్త ఊడుస్తున్న సమయంలో బంగారు మూట దొరికిందని చెప్పి అధికారులు అప్పగించారు. అయితే ఈ ఘటనపై ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయంలో సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా స్వీపర్ బంగారు మూటను మాయం చేసేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
● డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్కు గాయాలు కనగానపల్లి: మండల పరిధిలోని మామిళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్ గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెనుకొండ రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ అన్షర్బాషాతో కలిసి శనివారం ఉదయం అనంతపురం నుంచి పెనుగొండ వైపు వెళ్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న మరో కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొని ఇటువైపు వెళ్తున్న వీరి కారును ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీటీ ఇంతియాజ్తో పాటు సీనియర్ అసిస్టెంట్ అన్షర్బాషా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వృద్ధురాలి ఆత్మహత్య గార్లదిన్నె: మండలంలోని మర్తాడుకు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్మహమ్మద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సైదాబీ(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయినా ఫలితం లేకపోవడంతో మదనపడుతుండేది. ఈక్రమంలో అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంకా ఏమన్నారంటే..రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం ఉంది. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ.1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఆ 5 లిప్టు స్కీమ్లు చేపట్టకపోతే, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయి. ఇంకా దేశంలో జాతీయ రహదారులను కిలోమీటరుకు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే, రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్ రోడ్డుకు ఏకంగా రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పైగా ఆ పనుల కాంట్రాక్టులన్నీ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో తమ వారికే కట్టబెడుతున్నాడు. మరోవైపు ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు.ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్ టవర్లు, ఆకాశహర్మ్యాలు, సీ ప్లేన్, నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్తో ప్రచారం చేసి ఊదరగొట్టారు. ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదు. అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు.ఒక పక్క బస్టాండ్ కట్టడానికే నిధులు లేవని చెప్పే చంద్రబాబు, విజయవాడలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టుకుని మళ్లీ అమరాతిలో విమానాశ్రయం కడతామని డాబు మాటలు చెబుతున్నాడు. 11 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇదిచాలదన్నట్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకునే హక్కును ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.కమీషన్ల కోసం, తమ వారి జేబులు నింపేందుకు అమరావతి అంచనా వ్యయాన్ని ఏకంగారూ. 44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారు. కమీషన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను చంద్రబాబు రద్దు చేశారు. కొత్తగా మొబిలైజేషన్ విధానం తీసుకొచ్చి, కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ కిందకు 10 శాతం నిధులు ఇచ్చి, అందులో నుంచి 8 శాతం కమిషన్ల కింద వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెడుతూ, అప్పులన్నీ చేసి మొత్తం అమరావతిలోనే ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని సాకే శైలజానాథ్ నిలదీశారు. -
8 నుంచి పీజీ పరీక్షలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 8న ప్రారంభం కానున్నాయని డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. పీజీ పరీక్షలు ఈ నెల 13న ముగుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని నాలుగు డిగ్రీ కళాశాలలను తనిఖీ చేశారు. 17న జేఎన్టీయూ స్నాతకోత్సవం ● ముఖ్య అతిథిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ● 40 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ● స్నాతకోత్సవ నిర్వహణకు ప్రత్యేక కమిటీల నియామకం అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్టీయూ–ఏ) స్నాతకోత్సవం ఈ నెల 17న నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ చాన్సలర్, ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి డాక్టరేట్ ప్రదానం చేస్తారు. ముఖ్య అతిథిగా చాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవాన్ని ఉద్ధేశించి ప్రసంగిస్తారు. బంగారు పతకాలకు ఎంపికై న వారికి గవర్నర్ అందజేస్తారు. పీహెచ్డీ పూర్తి చేసిన వారికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందజేస్తారు. గౌరవ డాక్టరేట్ ఎవరికి అందించాలనే అంశంపై మూడు పేర్లతో కూడిన జాబితాను గవర్నర్కు పంపారు. త్వరలోనే గౌరవ డాక్టరేట్ పేరు ఖరారు కానుంది. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోనూ, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో టాపర్లు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా 17 కమిటీలను నియమించారు. ఇందులో ప్రొఫెసర్లను నియమించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు కమిటీలను నియమించినట్లు వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు తెలిపారు. -
జేఎన్టీయూ విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్
అనంతపురం: జేఎన్టీయూ(ఏ) విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు తెలిపారు. ఇందు కోసం హైదరాబాద్లోని స్మార్ట్ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఒప్పందంలో భాగంగా ఎక్స్పీరిన్సియల్ లర్నింగ్, వర్చువల్ ఇంటర్న్షిప్ను విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూ (ఏ) విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా సాఫ్ట్స్కిల్స్ అభ్యసించేందుకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ టూ వీసీ ఆచార్య ఓ.దేవన్న, రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ సి.శోభాబిందు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి, స్మార్ట్ బ్రిడ్జి ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీ దేవి సిరా పాల్గొన్నారు. -
ప్రాణం బలిగొన్న అతి వేగం
రాప్తాడు: అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని దేవనహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్ (44), ప్రతాప్, అమర్నాథ్, నగేష్... కేఏ50ఏ 9691 నంబర్ గల కారులో మంత్రాలయ క్షేత్ర దర్శనానికి వెళ్లారు. అక్కడ పూజాదికాలు ముగించుకున్న అనంతరం శుక్రవారం దేవనహళ్లికి తిరుగు ప్రయాణమయ్యారు. రాప్తాడు మండలం రామినేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఘటనలో కారు నడుపుతున్న మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతాప్, అమర్నాథ, నగేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
హోరుగాలి.. జోరువాన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పలు చోట్ల గాలీవాన బీభత్సం సృష్టించింది. అనంతపురంలో శుక్రవారం రాత్రి హోరుగాలికి ఎక్కడికక్కడ హోర్డింగులు పడిపోయాయి. ఫ్లెక్సీలు చిరిగి ఎగిరిపోయాయి. రోడ్డు మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన డివైడర్లు కిందపడిపోయాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగాయి. కాసేపు ఉరుములు, మెరుపులతో జోరుగా వర్షం పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రెండు గంటలకు పైగా నగరం, పరిసర ప్రాంతాలు అంధకారం అలుముకున్నాయి. చీకట్లలోనే అతికష్టం మీద వాహనాలు రాకపోకలు సాగించాయి. అనంతపురంలో 20 మి.మీ వర్షం నమోదైంది. పెద్దపప్పూరు, శింగనమల మండలాల్లో 15 మి.మీ, నార్పల, వజ్రకరూరులో 10, యల్లనూరు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పామిడి, తాడిపత్రి, యాడికి, పుట్లూరు, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల్లో 6.మి.మీ.లోపు వర్షం కురిసింది. గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. -
‘మార్కెటింగ్’లో మిశ్రమ ఫలితాలు
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెలకు సంబంధించి నిర్ధేశిత పన్ను వసూళ్లలో మార్కెటింగ్శాఖ మిశ్రమ ఫలితాలు సాధించింది. గతానికి భిన్నంగా ఈసారి ఉరవకొండ మార్కెట్ కమిటీ దూకుడు కొనసాగించగా... గుత్తి, తాడిపత్రి, రాప్తాడు తదితర ఐదారు కమిటీలు వెనుకంజలో ఉన్నాయి. జిల్లాలోని 9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా ఈ ఏడాది రూ.13.49 కోట్ల వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... మొదటి నెల ముగిసేనాటికి ఓవరాల్గా 10.2 శాతంతో రూ.1.38 కోట్లకు పైగా ప్రగతి సాధించడం గమనార్హం. గతేడాది మొదటి నెలతో పోల్చుకుంటే ఈసారి రూ.19.21 లక్షలు అధికంగా వసూలైనట్లు మార్కెటింగ్శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి తెలిపారు. మార్కెట్ కమిటీల్లో విజిలెన్స్ చర్యలు మరింత పటిష్టం చేసి లీకేజీలు లేకుండా గడువులోపు వంద శాతం సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫారంపాండ్ల నిర్మాణాలు పూర్తి చేయండిఅనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన 10,413 ఫారం పాండ్ల నిర్మాణాలను జూన్ మొదటి వారంలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. ఫారం పాండ్ల నిర్మాణాలపై శుక్రవారం ఏపీడీలు, ఏపీఓలతో ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో 335 ఫారం పాండ్ల తవ్వకాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,166 ఫారంపాండ్లు పూర్తి కాగా 3 వేల ఫారం పాండ్లు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు నిర్దేశిత సమయంలోపు పూర్తి కావాలని ఆదేశించారు. బీసీ గురుకులాల కన్వీనర్గా అష్రత్వలి అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల కన్వీనర్గా కొనకొండ్ల గురుకుల పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు జి.అష్రత్వలి నియమితులయ్యారు. ప్రస్తుతం కన్వీనర్గా పనిచేస్తున్న కేజే జోనాథన్ గత నెల 29న పదవీవిరమణ పొందారు. ఈ క్రమంలో అష్రత్వలికి జిల్లా కన్వీనర్గా నియమించారు. -
● వాసవీమాతకు లక్ష గాజులతో పూజలు
హిందూపురం: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి మూలవిరాట్ను స్వర్ణతోరణ కవచధారణ చేసి విశేష పూజలు చేశారు. అలాగే వాసవీమాత జయంత్యుత్సవాల్లో భాగంగా వాసవీమాత విగ్రహానికి వందలాది మంది మహిళలు గాజులతో పూజలు చేశారు. అంతకుముందు ఆలయంలో కలశస్థాపన, గోపూజ, సువర్ణ్ణ వాసవీమాత విగ్రహ ప్రాణప్రతిష్ట, నవగ్రహ పూజ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. వాసవీ భజన బృందం సభ్యులు అమ్మవారికి లక్ష గాజులతో పూజలు చేశారు.