breaking news
Ananthapur
-
పుట్టపర్తిలో రెడ్బుక్.. ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వెళ్లిన ఉషాశ్రీచరణ్ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు. -
ఎక్కడికి వెళ్లినా నోస్టాక్ బోర్డులే !
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా అంతటా యూరియా నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆర్ఎస్కేలు, సొసైటీలు, డీసీఎంఎస్లకు తగినంత సరఫరా చేసినట్లు ‘మార్క్ఫెడ్’ చెబుతున్నా ఎక్కడా బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ హోల్సేల్, రీటైల్ డీలర్లకు అవసరమైనంత ఇచ్చామని వ్యవసాయశాఖ అంటున్నా... వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ ఏప్రిల్ నుంచి జిల్లాకు చేరిన 14,286 మెట్రిక్ టన్నులతో పాటు గత ఖరీఫ్, రబీ మిగులుగా ఉన్న 15,241 మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. అయితే, ఇందులో సగానికి సగం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలతో పాటు అధికారులు కుమ్మకై ్క తమకు యూరియా లభించకుండా చేశారని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి సాగు చేస్తున్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాకు చేరిన యూరియా నిబంధనలకు విరుద్ధంగా సరిహద్దు జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున తరలించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పరిస్థితి చేయిదాటాక రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తుండటంతో రైతులు విస్తుపోతున్నారు. సెప్టెంబర్లో మరింత డిమాండ్.. ఆగస్టు రెండో పక్షం నుంచి యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్లో మరింత డిమాండ్ ఉంటుందని రైతులు చెబుతున్నారు. వరి, మొక్కజొన్న, అరటితో పాటు వేరుశనగ, కంది, పత్తి తదితర పంటలకు కూడా యూరియా వేసుకుంటారు. అధికారులు చెబుతున్నట్లు జిల్లా అంతటా జల్లెడ పట్టినా 500 మెట్రిక్ టన్నులు కూడా కనిపించడం లేదు. బఫర్స్టాక్ కింద 1,069 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చెబుతున్నా అది ఎప్పుడు బయటకు తీస్తారో చెప్పడం లేదు. రెండు మూడు రోజుల్లో సరఫరా కాకపోతే సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ వారంలో ‘స్పిక్’ కంపెనీకి చెందిన యూరియా రావొచ్చని సమాచారం. మార్క్ఫెడ్ నుంచి ఈ ఏప్రిల్ నుంచి 453 ఆర్ఎస్కేలకు 3 వేల మెట్రిక్ టన్నులు, అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి డీసీఎంఎస్లకు 843 మెట్రిక్ టన్నులు, రెండు ఎఫ్పీఓలు, 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2,200 మెట్రిక్ టన్నుల వరకు సరఫరా చేశామని చెబుతున్నారు. ఇక.. వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్న యూరియా లెక్కలు సరిపోవడం లేదు. ఇరుశాఖల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతో యూరియా పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. గార్లదిన్నెలో, మన గ్రోమోర్లో, అనంతపురంలో మూడు చోట్ల... ఇలా రీటైల్ షాపులో అక్కడక్కడా యూరియా ఉందని అధికారులు చెబుతున్నా బయటికి మాత్రం రావడంలేదు. ఎంఆర్పీకి మించి అమ్ముకునేందుకు హోల్సేల్, రీటైల్ వ్యాపారులు అంతో ఇంతో ఉన్న యూరియాను బయటకు తీయకుండా గుట్టుగా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్, జూలైలో వ్యవసాయశాఖ పరిధిలో జరిగిన ఏడీఏ, ఏఓ, ఆర్ఎస్కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ కూడా యూరియా పక్కదారి పట్టడానికి మార్గం సుగమం చేసినట్లు తెలిసింది. ఆర్ఎస్కేలు, సొసైటీలు, డీసీఎంఎస్ వద్ద లభించని యూరియా రీటైల్ డీలర్ల దగ్గర కొంత ఉన్నా బయటకు తీయని వైనం యూరియా దొరక్క వరి, మొక్కజొన్న, అరటి రైతుల అవస్థలు -
ఇదేనా బాలికాభివృద్ధి?
అనంతపురం ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్న బాలికాభివృద్ధి ప్రకటనల్లో తప్ప చేతల్లో కనిపిచండం లేదు. ఏటా ప్రత్యేక సర్వేలు నిర్వహించి బడిఈడు పిల్లలందరినీ గుర్తించి వారితో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడుల్లో చేర్పిస్తున్నారు. ఇందు కోసం రూ.లక్షల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. అయినా క్షేత్ర స్థాయిలో బడిఈడు పిల్లలు భిక్షాటనతో బతుకీడుస్తూనే ఉన్నారు. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. నగర శివారులోని రాచానపల్లి వద్ద నలుగురు బాలికలు (అందరూ 10–12 ఏళ్లలోపు) జోలెలు భుజాన తగిలించుకుని భిక్షాటనకు వెళుతున్నారు. నగరంలో మరో ఇద్దరు బాలికలు సంచులు భుజాన వేసుకుని చిత్తుకాగితాల సేకరణలో నిమగ్నమయ్యారు. మరో బాలిక తల్లితో కలసి భిక్షాటనకు వెళ్తోంది. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన వయసులో బాలికలు భిక్షాటన చేయడం, చిత్తుకాగితాలు ఏరుకోవడం చూపరుల హృదయాలను కదిలిస్తున్నాయి. అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, ఆ దిశగా ఎవరూ పట్టించుకోకపోవడం మరో కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని ఇలాంటి పిల్లలను గుర్తించి బలవంతంగానైనా బడిబాట పట్టించే చర్యలు తీసుకుంటే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
హెచ్ఎం అసోసియేషన్ నూతన కార్యవర్గం
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం (హెచ్ఎం) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవనంలో సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా హెచ్ఎంల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 2025–27 కాలానికి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జయరామి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా హరినాథ్, గౌరవాధ్యక్షులుగా బాలమురళీకృష్ణతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా విజయభాస్కర్ రెడ్డి, మల్లికార్జున, నారాయణరెడ్డి, హెడ్క్వార్టర్ విభాగం కార్యదర్శిగా రోషన్బాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మదన్మోహన్ రెడ్డి, మహిళా విభాగం ప్రతినిధిగా వసుంధర, మునిసిపాలిటీ విభాగం ప్రతినిధిగా శామ్సన్, అనంతపురం డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా బీసీ సుంకన్న, జాయింట్ సెక్రటరీగా పీఆర్వీ ప్రసాద్, కళ్యాణదుర్గం డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా ఈ. గోవిందప్ప, జాయింట్ సెక్రటరీగా ఆదిశేషయ్య, గుంతకల్లు డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా ఎం. సుంకన్న, జాయింట్ సెక్రటరీగా ఎం. శివ శంకర్ రెడ్డి, టెక్నికల్ కమిటీ సభ్యులుగా కే వెంకటప్రసాద్, గోపాల్ నాయుడు, అబ్దుల్ మునాఫ్, ఆడిట్ కమిటీ సభ్యులుగా ఎం. విశ్వనాథ్, సూర్యనారాయణ, శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షుడిగా జయరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ -
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: దసరా, దీపావళి పండుగలకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ జంక్షన్ (07009) నుంచి సెప్టెంబర్ 4– సెప్టెంబర్ 25వ తేదీ వరకు ప్రతి గురువారం (4 సర్వీసులు) రైలు తిరుగుతుందన్నారు. తిరుపతి జంక్షన్ (07010) నుంచి సెప్టెంబర్ 5–సెప్టెంబర్ 26 వరకు ప్రతి శుక్రవారం నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కాచిగూడ, ఉందా నగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రైళ్లలో ఫస్ట్ క్లాస్ కమ్ సెకండ్ ఏసీతోపాటు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. -
రచ్చకట్ట కోసం రచ్చరచ్చ
● రెండు వర్గాలుగా విడిపోయి పీఎస్ ఎదుటనే తలపడిన టీడీపీ నేతలు కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని దేవాదులకొండ గ్రామంలో రచ్చకట్ట వివాదం తారస్థాయికి చేరుకుంది. గ్రామ నడిబొడ్డున పూర్వీకులు ఏర్పాటు చేసిన రచ్చకట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు ఏకమై పునరుద్ధరణ పనులు చేపట్టారు. టీడీపీలోని ఓ వర్గం వారు చేపట్టిన ఈ పనులను అదే పార్తీకి చెందిన మరో వర్గం అడ్డుకుంది. దీంతో వివాదం ముదిరి ఆదివారం పోలీసుస్టేషన్కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు అందజేశారు. ఆ సమయంలో ఇరువర్గాల టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పీఎస్ ఎదుటనే తలపడిన టీడీపీ నేతలను సముదాయించడం పోలీసులకు తలకు మించిన భారమైంది. వివాదానికి పరిష్కారం చూపలేక చివరకు గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, సమస్యకు పరిష్కారం చూపుతామని సర్దిచెప్పి పంపారు. డీఎస్సీ ఫలితాల్లో మూడు పోస్టులకు అర్హత కళ్యాణదుర్గం రూరల్: ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కంబదూరుకు చెందిన ముత్యాలప్ప కుమార్తె సాయిచందన ఏకంగా మూడు పోస్టులకు అర్హత సాధించారు. టీజీటీ బయాలజీ జోన్–4లో 81.79 మార్కులతో 5వ ర్యాంక్, జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 83.13 మార్కులతో 8వ ర్యాంక్, ఎస్జీటీలో 84.54 మార్కులతో 84వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా సాయిచందనను పలువురు అభినందించారు. రైతు కూలీ బిడ్డకు డీఎస్సీలో ఐదో ర్యాంకు బత్తలపల్లి: మండల కేంద్రంలో నివాసముంటున్న బాలగొండ ఈరనారప్ప డీఎస్సీ ఫలితాల్లో ఐదో ర్యాంక్ సాధించాడు. ఈరనారప్ప తల్లిదండ్రులు నారాయణస్వామి, నారమ్మ దంపతులు సాధారణ రైతు కూలీలు. వీరిది రాప్తాడు మండలం బండమీదపల్లి స్వగ్రామం. 15 సంవత్సరాల క్రితం బత్తలపల్లికి వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విభాగంలో జిల్లా స్థాయిలో ఐదో ర్యాంక్తో పాటు టీజీటీలో 114వ ర్యాంకు, పీజీటీ విభాగంలో 94వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటిన ఈరనారప్పను పలువురు అభినందించారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap. gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియ జేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నేడు జిల్లా సమీక్ష సమావేశం అనంతపురం అర్బన్: జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం సోమవారం జరగ నుంది. జిల్లా ఇన్చార్జ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధ్యక్షతన మధ్యాహ్నం 2.45 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించనున్నారు. డీఆర్సీ సమావేశానికి సమగ్ర వివరాలు, సమాచారంతో హాజరు కావాలని అన్ని శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలలో సీఎం జిల్లా పర్యటన అనంతపురం ఎడ్యుకేషన్/గార్లదిన్నె: ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ మొదటివారంలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ఆదివారం అనంతపురం రూరల్, గార్లదిన్నె మండలాల్లో స్థలాలను పరిశీలించారు. అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు వద్ద (అనంతపురం – కదిరి జాతీయ రహదారి పక్కన), అనంతపురం– బెంగళూరు జాతీయ రహదారి పక్కన రాప్తాడు మండలంలోని ఎంఐజీ లేఔట్ వద్ద స్థలాలను పరిశీలించారు. అనంతరం గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామం (అనంతపురం– హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన) వద్ద స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు వీలుగా అనంతపురం నగరానికి దగ్గరలో మరికొన్ని చోట్ల స్థలాల్ని పరిశీలించాలని ఆర్డీఓ, తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్కు ఇబ్బందుల్లే కుండా, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లను పిలి పించి సంబంధిత స్థలాల స్కెచ్లను సిద్ధం చేసి నివేదించాలని సూచించారు. వారివెంట అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్పీ వెంకటేశులు, అనంతపురం, అనంతపురం రూరల్, గార్లదిన్నె మండలాల తహసీల్దార్ల్లు హరికుమార్, మోహన్ కుమార్,ఈరమ్మ, ఇటుకలపల్లి పీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్ ఉన్నారు. -
భరించలేని దుర్వాసన
‘అగ్నివీర్’కు 159 మంది అర్హత తిరుపతి రూరల్: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్షలో తిరుపతిలోని ఎస్వీ డిఫెన్స్ అకాడమీకి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు ఆ అకాడమీ చైర్మన్ బి.శేషారెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన అభినందించారు. వీరికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి రాప్తాడు రూరల్: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ ఐజీ నగర్ (మబ్బుకొట్టాలు)కు చెందిన వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు ఐజీనగర్కు చెందిన ఈడిగ పాండు (42) కూలి పనులతో జీవనం సాగించేవాడు. భార్య అరుణాదేవి, ఓ కుమార్తె ఉన్నారు. ఈ నెల 21న ఉదయం 9.30 గంటలకు టిఫిన్ తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో వెళ్తుండగా ఆవులు అడ్డురావడంతో అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసరాల్లోకి వెళ్లగానే భరించలేని దుర్వాసనతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ప్రతి శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున గొర్రెలు, పొట్టేళ్లు, పశువులు, ఎద్దుల సంత జరుగుతుంది. వర్షపు నీటి నిల్వకు తోడు పెంట ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం, పండ్ల వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. గత మూడు వారాలుగా ఇదే పరిస్థితి. మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నా... మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – అనంతపురం అగ్రికల్చర్: -
రక్తదానంతో రోగికి ప్రాణదానం
గుంతకల్లు: అరుదైన ‘ఓ’ నెగిటివ్ రక్త దానంతో క్యాన్సర్ రోగికి ప్రాణదానం చేశాడు గుంతకల్లుకు చెందిన పరుశురాముడు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కేవీ లక్ష్మి హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరుదైన ‘ఓ’ నెగిటివ్ (బాంబే బ్లడ్) గ్రూప్ ఉన్న ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో రక్తం అవసరమై కుటుంబసభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్రల్లోని పలువురు రక్తదాతలను సంప్రదించారు. విషయం గుంతకల్లులోని ప్రాణదాత సేవా సమితి సభ్యులకు తెలియడంతో ఓ నెగిటివ్ బ్లడ్ కలిగిన పరుశురాముడుకు సమస్య వివరించారు. దీంతో ఆయన ఆదివారం స్థానిక గోపీ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడంతో లక్ష్మి కుటుంబసభ్యుడు సురేష్ జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా పరుశురాముడుని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ప్రాణదాత సేవా సమితి సభ్యులు తిమ్మప్ప, హనుమంతు, హస్సేన్, బర్మాశాల రఘు, గఫూర్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పరుశురాముడు మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 18 మంది మాత్రమే ‘ఓ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన వారున్నారన్నారు. ఇందులో తరచూ ఆరుగురు మాత్రమే రక్త దానానికి ముందుకు వస్తున్నారని, ఇప్పటి వరకూ తాను 35 సార్లు రక్తదానం చేసినట్లు వివరించారు. -
ప్రియురాలికి పెళ్లి.. ప్రేమికుడి ఆత్మహత్య
యాడికి: తాను ప్రేమించిన యువతికి మరో యువకుడితో పైళ్లెనట్లు తెలుసుకుని క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన బాలగంగన్న, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు జయకృష్ణ (22) ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. ఆమెతో తనకు పెళ్లి చేయాలని 3 నెలల క్రితం తల్లిదండ్రులను కోరాడు. అయితే నెల రోజుల క్రితం ఆ యువతికి మరో యువకుడితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లుగా తెలిసింది. దీంతో మనోవేదనకు లోనైన జయకృష్ణ శనివారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున పిలిచినా స్పందన లేకపోవడంతో మిద్దైపెకి ఎక్కి గవాక్షం నుంచి కుటుంబసభ్యులు చూశారు. అప్పటికే ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న జయకృష్ణను చూసి, బలవంతంగా తలుపులు తీసి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కర్ణాటక మద్యం స్వాధీనం శెట్టూరు: కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఐ రాంభూపాల్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బచ్చేహళ్లి గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులను గమనించి స్కూటీపై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని ఆపి పారిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు వాహనం దగ్గరకు చేరుకుని పరిశీలించగా 520 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎరువుల దుకాణాల్లో కొనసాగుతున్న తనిఖీలు అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు ఊపందుకున్నాయి. ఆదివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వైబీపీటీఏ ప్రసాద్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని ఆరు దుకాణాల్లో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ–పాస్ మిషన్లతో పోల్చినప్పుడు స్టాక్లో వ్యత్యాసాలు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 60.18 మెట్రిక్ టన్నుల ఎరువులను విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ కె.శ్రీనివాసులు, జమాల్ బాషా, వ్యవసాయాధికారి వాసుప్రకాష్, డీసీటీఓ బి.సురేష్కుమార్, ఎస్ఐలు జి.గోపాలుడు, ఎస్.నరేంద్ర భూపతి పాల్గొన్నారు. -
గాల్లో తల్లీబిడ్డ ప్రాణాలు
అనంతపురం మెడికల్: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గైనిక్ విభాగం కోసం అత్యాధునిక హంగులతో లేబర్ ఆపరేషన్ థియేటర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పేదలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అలసత్వం కారణంగా నేడు లేబర్ వార్డు మధ్యాహ్నం వరకు మాత్రమే నడుస్తోంది. జనరేటర్ సాకు చూపుతూ సిజేరియన్లను మెయిన్ ఆపరేషన్ థియేటర్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నిండుచూలాలతో పాటు వైద్యులకూ అవస్థలు తప్పడం లేదు. పరుగులు పెట్టాల్సిందే.. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్లు చేసే వారు. ఇటీవల అక్కడ క్యాజువాలిటీ విస్తరణ చేపడుతుండడంతో ఎమర్జెన్సీ కేసులను ఆపేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో మెయిన్ ఓటీకి తరలించాల్సి వస్తోంది. వాస్తవంగా లేబర్ ఆపరేషన్ థియేటర్లోనే అన్ని సదుపాయాలున్నాయి. కానీ గర్భిణులను అత్యవసరం పేరిట ఇబ్బందులు పెడుతూ మొదటి అంతస్తులో ఉన్న మెయిన్ ఓటీకి తీసుకెళ్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా గైనిక్ వార్డు ఉన్న ప్రాంతంలోనే లేబర్ ఓటీ ఏర్పాటు చేశారు. అత్యవసర కేసు 20 నిమిషాల్లోపు ఓటీకి తీసుకెళ్లి సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఆస్పత్రిలో సీరియస్ కేసులను మెయిన్ ఓటీకి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ఆక్సిజన్, ఇతర పరికరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా తల్లీ,బిడ్డ ప్రాణాలకే ప్రమాదం లేకపోలేదు. నెలకు 700 నుంచి 800 ప్రసవాలు.. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సర్వజనాస్పత్రి పెద్ద దిక్కు. సాధారణ కేసుల నుంచి కష్టతరమైన కేసులన్నీ ఇక్కడికి వస్తుంటాయి. రోజూ 20 నుంచి 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 5 నుంచి 6 వరకు సిజేరియన్లు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి గర్భిణులకు ఇబ్బంది కలగకుండా లేబర్ ఓటీలోనే సిజేరియన్లు జరిగేలా చూడాలని గైనిక్ విభాగానికి చెందిన పలువురు కోరుతున్నారు. ఆ విభాగం వైద్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్లో లేబర్ ఓటీ సమస్య మధ్యాహ్నం నుంచి మెయిన్ ఓటీకి వెళ్లాల్సిందే నిండు చూలాలతో పాటు వైద్యులకూ అవస్థలు -
గ్రానైట్.. రైట్రైట్
కూడేరు: మండలంలోని కొర్రకోడు రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 127లో గల నల్లగుట్టలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నల్లగుట్ట సుమారు 5 ఎకరాలకు పైగా విస్తరించింది. ఇక్కడ విలువైన గ్రానైట్ రాయి ఉండడంతో నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. హిటాచీలు, జేసీబీలు పెట్టి కొన్ని రోజులుగా డ్రిల్లింగ్ యంత్రాలతో పెద్ద పెద్ద రాళ్లను బయటకు తీయిస్తున్నాడు. కార్మికులు ఈ ప్రాంతంలో టెంట్లు వేసుకుని పగలంతా రాళ్లను బయటకు తీసి అనంతరం బ్లాక్లుగా కత్తిరిస్తున్నారు. రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. పట్టని అధికారులు.. పట్టపగలే గ్రానైట్ కార్యకలాపాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. అక్రమ గ్రానైట్ తవ్వకాలు, రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికే ఇక్కడ సుమారు 2 వేల క్యూబిక్ మీటర్ల వరకూ తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా క్యూబిక్ మీటర్ తవ్వకానికి రూ.4,800 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు సమాచారం. నెల రోజులుగా పీఏబీఆర్, మండల కేంద్రానికి దగ్గర్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతోనే తవ్వకాలు చేపడుతున్నారని తెలిసింది. జోరుగా అక్రమ తవ్వకాలు కన్నెత్తి చూడని అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కొర్రకోడు రెవెన్యూ పొలం సర్వే నంబర్ 127లోని నల్లగుట్టలో గ్రానైట్ తవ్వకాలకు రెవెన్యూ శాఖ ద్వారా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు చేపట్టకూడదు. వారి వద్ద అనుమతులు ఏమున్నాయో విచారించాలని వీఆర్వోలను ఆదేశించాం. నిబంధనలు అతిక్రమించి ఉంటే చర్యలు తీసుకుంటాం. – మహబూబ్ బాషా, తహసీల్దార్, కూడేరు మండలం -
రోజంతా ఎదురుచూపులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు నేరుగా వారి వ్యక్తిగత మొబైళ్లకు మెసేజ్లు వస్తాయని ప్రకటించడంతో డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులు ఆదివారం రోజంతా ఎదురు చూశారు. రాత్రి 10 గంటలైనా ఏ ఒక్కరికీ సమాచారం అందలేదు. మరోవైపు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు సంబంధించి నగర శివారులో ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచి డీఈఓ అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ఇక్కడి అధికారులకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్పై డైరెక్టరేట్ నుంచి స్పష్టమైన సమాచారం అందలేదు. రాత్రయినా స్పష్టత లేకపోవడంతో అమోమయం నెలకొంది. ఓవైపు మెరిట్లో మంచి ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు, మరోవైపు అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. సాంకేతిక సమస్యలు, ఇతర సమస్యల కారణంగా ఎంపికై న అభ్యర్థులకు మెసేజ్లు పంపలేకపోతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. ఆర్జేడీ ఆదేశాలతో సోమవారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు ప్రకటించారు. తర్వాత రోజు (మంగళవారం) ఉండొచ్చని ఇక్కడి అధికారులు అంచనా వేస్తున్నా... సోమవారం దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు రాని మెసేజ్లు డైరెక్టరేట్ నుంచి కూడా స్పష్టమైన సమాచారం కరువు నేటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు డీఈఓ ప్రకటన -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు.48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయం.. ఎమ్మెల్యే దగ్గుపాటికి పట్టుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు.అనంతపురంలో ఉద్రిక్తత..ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ.. ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కళ్లప్పగించి చూసి.. చివరికి కదిలి!
అనంతపురం అగ్రికల్చర్:యూరియా విషయంలో సర్కారు తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది. ఖరీఫ్లో జిల్లాకు కేటాయింపులే తగ్గించారు. అందులోనూ కోతలు పెట్టారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన జిల్లాకు ఇబ్బంది రాకుండా శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా పెంచినట్లు చెబుతున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాకు మాత్రమే సరఫరా చేయాల్సిన యూరియా ఈ ఏడాది కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలకు కొంత కేటాయింపులు చేశారు. అంతో ఇంతో వచ్చినదాంట్లో ప్రైవేట్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు రైతుల పేరుతో సరిహద్దు ప్రాంతంలో పక్కనున్న కర్ణాటక ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. మార్క్ఫెడ్ ద్వారా ఆర్ఎస్కేలు, సొసైటీలు, డీసీఎంఎస్లకు కేటాయించిన యూరియాను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఇలా... యూరియా చెల్లాచెదురు కావడంతో అన్నదాతకు అవసరానికి అందకుండా పోతోంది. బస్తా... రెండు బస్తాల కోసం కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి ఏర్పడింది. యూరియా నిల్వలు ఖాళీ అయిన తర్వాత సర్కారు పెద్దల ఆదేశాలతో విజిలెన్స్, వ్యవసాయశాఖ, పోలీసు, రెవెన్యూ, సహకార శాఖలతో ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ఫోర్స్ గత రెండు రోజులుగా ఎరువుల గోదాముల్లో ఉత్తుత్తి తనిఖీలతో రైతులను మభ్యపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చింది 14,286 మెట్రిక్ టన్నులు: ఈ ఖరీఫ్ సీజన్లో అన్ని రకాల ఎరువులు 1.07 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రణాళిక అమలు చేస్తున్నారు. యూరియా 26,839 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అందులో ఇప్పటి వరకు 21 వేల మెట్రిక్ టన్నులు రావాల్సి వుండగా 14,286 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరింది. ఒక కంపెనీ నుంచి రావాల్సిన యూరియా ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లినట్లు తెలిసింది. అలాగే మరికొంత వైఎస్సార్ కడప, కర్నూలుకు సరఫరా చేయడంతో జిల్లాలో సమస్య ఉత్పన్నమైనట్లు అంచనా వేస్తున్నారు. గత ఖరీఫ్, రబీకి సంబంధించి 15,241 మెట్రిక్ టన్నులు మిగులుబాటు ఉండగా... ఈ ఏడాది దాన్ని కలుపుకుని ఇప్పటి వరకు 26,610 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 1,069 మెట్రిక్ టన్నులు బఫర్స్టాక్ ఉండగా ఆర్ఎస్కేలు, సొసైటీలు, డీసీఎంఎస్లు, ప్రైవేట్ డీలర్ల వద్ద 1,671 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు పొంతన లేని లెక్కలు చూపుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నా బఫర్స్టాక్ 1,069 మెట్రిక్ టన్నులు బయటకు తీయకపోవడం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉందంటున్న 1,671 మెట్రిక్ టన్నులు ఎక్కడుందనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. అక్కడక్కడా కృత్రిమ కొరత సృష్టించి బస్తా యూరియా ఎంఆర్పీకి మించి రూ.350 నుంచి రూ.400 ప్రకారం అమ్ముతున్నట్లు రైతులు వాపోతున్నారు. యూరియా బస్తా కావాలంటే నానో యూరియాతో పాటు డ్రిప్ మందులు తప్పనిసరిగా తీసుకోవాలని మెలిక పెడుతుండడంతో రైతులపై భారం పడుతోంది. రైతు సంక్షేమం అంటే ఇదేనా?ఈ ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినా యూరియాకు డిమాండ్ రావడం చూస్తే... పెద్ద ఎత్తున పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఎరువుల సరఫరా, అమ్మకాలు, మరీ ముఖ్యంగా యూరియా అమ్మకాలపై పర్యవేక్షణ చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైనట్లు తెలుస్తోంది. తీరా సమస్య ఉత్పన్నమైన తర్వాత హడావుడి చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నా రైతు సంక్షేమంపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ విస్తారంగా వర్షాలు పడటం, లక్షలాది హెక్టార్లలో ఖరీఫ్, రబీ పంటలు, అలాగే ఉద్యాన పంటలు విస్తరించినా... ఎక్కడా ఎరువుల సమస్య అనేది ఉత్పన్నం కాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. గోదాముల్లో ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్న ‘టాస్క్ఫోర్స్’ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, కడప, కర్నూలుకు యూరియా సరఫరా ఎరువుల కోసం ఇప్పటికీ రోడ్డెక్కుతోన్న అన్నదాతలు -
డీఎస్సీలో మెరిసిన కూలీ బిడ్డ
ఉరవకొండ: డీఎస్సీ మెరిట్ జాబితాలో కూలీ దంపతుల కుమార్తె జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు కై వసం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన నిరుపేద కూలీలు ఎర్రిస్వామి, లింగమ్మ దంపతుల కుమార్తె మౌనిక డీఎస్సీలో 84 మార్కులు సాధించి జోనల్ స్థాయిలో 6వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా ఎంపికై ంది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆమిద్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన మౌనిక ఖోఖోలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించి ఎన్నో పతకాలు సాధించారు. డీఎస్సీలో ర్యాంకు సాధించిన మౌనికను గ్రామస్తులు అభినందించారు. -
సురవరం మృతి బాధాకరం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి మరణం బాధాకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1998, 2004లో సురవరం సుధాకర్రెడ్డి ఎంపీగా ఉన్నారని, అదే సమయంలో తాను కూడా అనంతపురం ఎంపీగా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. సమాజం పట్ల నిబద్ధత, పేద ప్రజలకు మంచి చేయాలన్న తలంపు సురవరం సుధాకర్రెడ్డిలో ఉండేదన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీలకే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సురవరం మృతి ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు ● మాజీ ఎమ్మెల్యే విశ్వ ఉరవకొండ: కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి మృతి వామపక్ష , ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. దేశవ్యాప్త విద్యార్థి, యువజన, ఉద్యమాల వ్యాప్తికి సురవరం విశేష కృషి చేశారన్నారు. ఆయన నేతృత్వంలో పనిచేసిన అనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నేతలుగా ఎదిగారన్నారు. సురవరం ఆత్మకు శాంతి చేకురాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అనంతపురం: ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో శనివారం హౌసింగ్ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అమినిటీ సెక్రటరీలతో కలెక్టర్ సమీక్షించారు. లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు త్వరగా అందుతున్నాయా, లేదా? ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అమినిటీ సెక్రటరీలు అందుబాటులో ఉన్నారా, లేదా అనే అంశంపై ఫోన్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. లబ్ధిదారులతో అధికారుల ప్రవర్తన సక్రమంగా ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శైలజ, డీఈ విజయభాస్కర రావు పాల్గొన్నారు. ● జిల్లాలో ఉచిత ఇసుక విధానం సజావుగా అమలు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ అంశంపై ఏజెన్సీలు, రవాణాదారులతో ఆయన సమీక్షించారు. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
రాప్తాడు: మండల కేంద్రానికి చెందిన మాజీ స్టోర్ డీలర్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ జూటూరు లక్ష్మన్న తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని రాప్తాడు పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాలమేరకు.. ఈ ఏడాది మే 14న పోలీస్స్టేషన్కు వచ్చి సీఐ సార్ను కలవాలని తనకు ఫోన్ వచ్చిందన్నారు. తాను పోలీసుస్టేషన్ లోపలికి వెళ్తుండగా.. రాప్తాడుకు చెందిన మారుతీ, నారాయణ, జగదీష్లు పోలీస్స్టేషన్ ముందే తనపై దాడి చేశారన్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా చెప్పలేదన్నారు. వారిపై కేసు నమోదు చేయాలని అప్పట్లో ఫిర్యాదు చేసినా నేటికీ పోలీసులు స్పందించలేదన్నారు. నిన్ను కొడితే దిక్కెవరు? తాజాగా శనివారం సాయంత్రం ఎస్సీ కాలనీలోని తన ఇంటి ముందు కూర్చొని ఉండగా గతంలో దాడి చేసిన నారాయణ మళ్లీ దాడికి యత్నించాడని లక్ష్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. బండి ఎక్కు .. నీతో పని ఉందని బూతులు తిట్టారన్నారు. కొడితే దిక్కెవరని, పోలీసులు కూడా మేమంటే భయపడతారన్నారన్నారు. నారాయణ నుంచి తప్పించుకొని, వచ్చి నారాయణ, మారుతీ, జగదీష్ల నుంచి తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని మరోసారి పోలీసులను వేడుకున్నానని లక్ష్మన్న తెలియజేశారు. -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
అనంతపురం అగ్రికల్చర్: నిర్ధేశిత మార్కెట్ ఫీజుకు సంబంధించి అన్ని మార్కెట్ కమిటీలు వందశాతం వసూళ్లు సాధించాలని మార్కెటింగ్శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు ఆదేశించారు. శనివారం స్థానిక మార్కెటింగ్శాఖ కార్యాయలంలో రెండు జిల్లాల ఏడీలు రాఘవేంద్రకుమార్, ఎల్ఎన్ మూర్తితో కలిసి 17 మార్కెట్ కమిటీల సెక్రటరీలు, సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత 2025–26 సంవత్సరంలో మార్కెట్యార్డుల వారీగా టార్గెట్, ప్రస్తుతానికి సాధించిన ప్రగతిపై సమీక్షించారు. సగం కమిటీల పరిస్థితి మెరుగ్గా ఉండగా సగం కమిటీలు చాలా వెనుకబడ్డాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పరిఽధిలో ఉన్న 9 కమిటీలకు సంబంధించి రూ.13.49 కోట్లు లక్ష్యం కాగా ప్రస్తుతానికి 30 శాతంతో 3.95 కోట్లు సాధించారన్నారు. ఇందులో గుత్తి, రాప్తాడు, గుంతకల్లు కమిటీల పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న ఏడు మార్కెట్ కమిటీల టార్గెట్ రూ.5.82 కోట్లు కాగా అక్కడ కూడా 30 శాతం వసూళ్లు సాధించినట్లు తెలిపారు. ధర్మవరం, హిందూపురం, తనకల్లు కమిటీల్లో వసూళ్లు పెరగాలని తెలిపారు. విజిలెన్స్ బృందాలు తరచు క్షేత్రస్థాయిలో పర్యటించి గడువులోపు వంద శాతం లక్ష్యం చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
బలవంతంగా ‘కాంప్లెక్స్’ అంటగడితే కఠిన చర్యలు
పుట్లూరు: యూరియా కోసం వచ్చే రైతులను కాంప్లెక్స్ ఎరువులనూ తీసుకోమని ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ ఏజెన్సీల నిర్వాహకులను కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు.శనివారం ఆయన మండలంలోని కడవకల్లు గ్రామంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా సక్రమంగా రైతులకు అందేలా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. 50 శాతం యూరియా ప్రభుత్వ గోదాముల ద్వారా, 50 శాతం ప్రైవేట్ ఏజెన్సీలు పంపిణీ చేస్తాయన్నారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులూ తీసుకోవాలంటూ డబ్బు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. రైతులు ఏవి అడుగుతారో అవి మాత్రమే ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు ఆయన సూచించారు. అనంతరం గ్రామంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ ర్యాలీలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులకు సన్మానించారు. ఉపాధిహామీ పథకం కింద మంజూరైన వ్యక్తిగత సోక్పిట్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడామైదానం కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామాంజినేయులు, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ రామ సుబ్బయ్య, డ్వామా పీడీ సలీమ్బాషా, తహసీల్దార్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ హిత విగ్రహాలనే వినియోగించాలి ● జేసీ శివ్నారాయణ్ శర్మ పిలుపు అనంతపురం: పర్యావరణ హిత విగ్రహాలను వినియోగించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ పెద్ద విగ్రహాల మంటపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లన్నారు. ఆధ్యాత్మిక భావం పెంపొందేలా భక్తి పాటలు మాత్రమే వినిపించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికరమైన రంగుల వినియోగంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి హెచ్చెల్సీకి నీరు వదలాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వి. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. ‘ఆంధ్రకేసరి’ అడుగుజాడల్లో నడుద్దాం అనంతపురం: స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడల్లో నడవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ మినీ హాలులో టంగటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన తెగువ, ధైర్యం నిరుపమానమన్నారు. -
కానిస్టేబుల్కు టీచర్ ఉద్యోగం
కణేకల్లు: కణేకల్లు వాసి, పోలీసుశాఖలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సి.అశోక్ డీఎస్సీలో జిల్లాస్థాయిలో ర్యాంకు సాధించారు. బీకాం బీపెడ్ (బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) చేసిన అశోక్కు టీచర్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. 2017లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ అయ్యారు. ప్రస్తుతం ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో నిర్వహించిన డీఎస్సీలో ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాలేకపోయారు. నిరాశ చెందకుండా డీఎస్సీకి ప్రిపేర్ అయి జిల్లాలోనే 6వ ర్యాంకు సాధించారు. 150 మార్కులకుగాను 86.5 మార్కులు సాధించినట్లు అశోక్ తెలిపారు. అశోక్ టీచర్ ఉద్యోగానికి ఎంపికతో ఆయన తండ్రి హనుమంతప్ప, సోదరుడు సతీష్, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
అనంత వాసులకు బళ్లారి రాఘవ పురస్కారాలు
అనంతపురం కల్చరల్: నగరానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారులు రామగోవింద సాగర్, సాధుశేఖర్ కళాప్రపూర్ణ బళ్లారి రాఘవ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా కళాకారుల ప్రతిభను గుర్తిస్తూ వారికి గౌరవ సత్కారాలనందిస్తున్న బళ్లారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ ప్రతినిధులు 53వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులను పురస్కారాలకు ఎంపిక చేశారు. వచ్చేనెల 6న బళ్లారిలో అవార్డుల ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. జాతీయ అవార్డులను అందుకోనున్న రామగోవిందసాగర్, సాధుశేఖర్ రంగస్థలంతో పాటూ ఇంటాక్ (భారతీయ కళలు, వారసత్వ పరిరక్షణ సంస్థ) ద్వారా మన సంస్కృతిని చాటే సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి లలితకళాపరిషత్తు కార్యదర్శి గాజుల పద్మజ, ఇంటాక్ కన్వీనర్ రాంకుమార్, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు. జేఎన్టీయూకు ఐఎస్ఓ గుర్తింపు అనంతపురం: జేఎన్టీయూ అనంతపురంకు ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండరైజేషన్) గుర్తింపు దక్కింది. వర్సిటీలోని అన్ని విభాగాలు, క్యాంపస్ కళాశాల, ఓటీపీఆర్ఐలోని అన్ని విభాగాలను ఐఎస్ఓ బృందం పరిశీలించింది. ఆరు నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్స్ (ఐఎస్ఓ) రావడం ఎంతో గర్వకారణమని వీసీ హెచ్. సుదర్శనరావు పేర్కొన్నారు. జేఎన్టీయూ అనంతపురంకు ఐఎస్ఓ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. 25న సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం: కానిస్టేబుల్ (సివిల్, ఏపీఎస్పీ) ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. జిల్లాలో సివిల్ విభాగం 278 మంది, ఏపీఎస్పీ విభాగం 210 మంది కానిస్టేబుళ్ల ఉద్యోగాలు సాధించారు. అన్ని ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, నాలుగు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలను వెంట తీసుకరావాలని సూచించారు. -
ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎరువుల మాఫియా
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజంఅనంతపురం కార్పొరేషన్:కూటమి ప్రభుత్వంలో మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాతో పాటు ఎరువుల మాఫియానూ చూస్తున్నామంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే మాఫియా నడుస్తోందని దుయ్యబట్టారు. శనివారం ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నదాతలను ఆదుకోవాలని ఏడాదిగా తాము ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని గుర్తు చేశారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని 8.5 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన ఎరువులను ఎప్పుడో అందించామని చెబుతున్నాయి. కానీ జిల్లాలో ప్రస్తుతం 5.5 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఇంకా 3 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన ఎరువులు ఏమయ్యాయి’ అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో సైతం ఎరువుల దోపిడీ, బ్లాక్ మార్కెట్ గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయని, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రజాప్రతినిధులకు తెలిసే అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్లాక్మార్కెట్లో ఎరువులు.. జిల్లాలో వేసిన పంటలు కూడా ఇప్పటికే దెబ్బతిన్నాయని, వేరుశనగ 4.5 లక్షల ఎకరాల్లో పంట విస్తీర్ణం ఉండేదని, అలాంటిది నేడు 1,71,000 ఎకరాల్లో మాత్రమే వేసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మిర్చి, పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవడానికి యూరియా, డీఏపీ అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఎరువులను బ్లాక్మార్కెట్లో కొనాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రూ.266.50తో యూరియా బస్తా అమ్మాల్సి ఉంటే రూ.350–రూ.400 వరకూ విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. రూ.1,300 ఉన్న డీఏపీకి రూ.1,600 సమర్పించుకుంటే తప్ప దొరికే పరిస్థితి లేదన్నారు. డీసీఎంఎస్, మార్క్ఫెడ్, రైతు సేవా సంస్థలు దోపిడీ కేంద్రాలుగా మారిపోయినా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. పట్టించుకున్న పాపాన పోలేదు: సీఎం చంద్రబాబు, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, కలెక్టర్లు రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిన పాపాన పోలేదన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాము ఈ ఏడాది జూలైలో ఓసారి, ఆగస్టు 4న మరోసారి ఐఏబీ, డీఆర్సీ సమావేశం ఏర్పాటు చేయాలని విన్నవించినా నిర్లక్ష్యం చేశారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సీజన్కు అనుగుణంగా పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించారని గుర్తు చేశారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి భారం తగ్గించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులపై ప్రీమియం భారం మోపారని దుయ్యబట్టారు. సౌత్, నార్త్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కు వెంటనే నీరు వదిలే ఏర్పాట్లు చేయాలని, రైతులను ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రైతు విభాగం అనంతపురం నియోజకవర్గ అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి పాల్గొన్నారు. -
సంపద లేని కేంద్రాలు
గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి చెత్త సంపద కేంద్రాలను నిర్మించింది. చెత్తను వేరు చేసి ఎరువులుగా తయారు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీలను అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే మహోన్నత ఆశయం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. కళ్యాణదుర్గం: ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ కూడా సక్రమంగా జరగడం లేదు. దీంతో చెత్త సేకరణ కేంద్రాలు కూడా మరుగున పడ్డాయి. కొరవడిన అధికారుల పర్యవేక్షణ గ్రామాల్లో ఇంటింటా వ్యర్థాలు సేకరించేందుకు హరిత రాయబారులను నియమించి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. చెత్త సంపద కేంద్రాలపై జిల్లాస్థాయి అధికారులతో పాటు డివిజన్, మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రతి ఊరిలో ఎక్కడ పడితే అక్కడ రహదారుల పక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్తను ఎక్కడికీ తరలించకుండా చెత్తకు నిప్పు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారడంతో గ్రామాల్లో మందుబాబులకు ఆవాసాలుగా మారాయి. గ్రామాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కొన్నిచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వెచ్చించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటి నిర్వహణపై చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల సర్పంచులు కోరుతున్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పర్యవేక్షించాలని, చెత్త నుంచి ఆదాయం పెంచుకొని ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెత్త సంపద తయారీ కేంద్రాలకు చేరిన వ్యర్థాలను తడి, పొడిగా వేరుచేసి వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసేవారు. దీన్ని కిలో రూ.30 నుంచి రూ.40 వరకు రైతులకు విక్రయించి పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడి లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పటికై నా రూ.లక్షల వ్యయంతో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తే పంచాయితీలకు ఉపయోగకరంగా ఉంటుంది. దిష్టి బొమ్మల్లా మారిన చెత్త సంపద తయారీ కేంద్రాలు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ఉత్త్తిదే ! గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడే చెత్త దిబ్బలు పంచాయితీల ఆదాయానికి గండి -
ఎరువుల దుకాణాలపై విజి‘లెన్స్’
అనంతపురం: అనంతపురం ఉమ్మడి జిల్లా విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్మెంట్ ఆఫీసర్ వైబీపీటీఏ ప్రసాద్ ఆదేశాల మేరకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఎరువుల గోడౌన్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో రాప్తాడు మండలం అయ్యవారిపల్లిలోని అవేజ్ లిమిటెడ్ గోడౌన్లో 874 మెట్రిక్ టన్నులు, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 713 మెట్రిక్ టన్నుల నిల్వలను గుర్తించారు. అనంతపురంలోని శ్రీనివాస ఫర్టిలైజర్స్లో నిషేధిత గడ్డి మందు అయిన గ్లెఫోసెట్ మందు (రూ.17,560 విలువ.. 22 లీటర్లు) సీజ్ చేసి కోర్టులో కేసు నమోదుకు సిఫార్సు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో శ్రీబాలాజీ ట్రేడర్స్లో యూరియా నిల్వ, విలువల్లో తేడాలు గుర్తించారు. బస్తాలను జప్తు చేసి చట్టపరమైన చర్యలకు వ్యవసాయాధికారికి అప్పగించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం. నాగభూషణం, సీఐ కే. శ్రీనివాసులు, సీఐ జమాల్ బాష, డీసీటీఓ సురేష్ కుమార్, ఎస్ఐ నరేంద్ర భూపతి, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. రూ.46.8 లక్షల పురుగు మందులు సీజ్ అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో అమ్మకాలకు అనుమతి లేని క్రిమిసంహారక మందులను అధికారులు సీజ్ చేశారు. యూరియాతో పాటు ఇలాంటి పురుగు మందులు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం ఏడీఏ అల్తాఫ్అలీఖాన్, ఏఓ వెంకటకుమార్లు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సంజీవరాయ ఫర్టిలైజర్స్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 117 బాక్సుల్లో నిల్వ చేసిన రూ.46.8 లక్షలు విలువ చేసే వందలాది లీటర్ల సోలోమాన్ క్రిమిసంహారక మందులను గుర్తించారు. ఈ మందు అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతులు లేవని ఏడీఏ తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో రసం పీల్చు పురుగు నివారణకు వీటిని పిచికారి చేస్తారన్నారు. అనుమతి లేకుండా విక్రయాలు సాగిస్తున్నందున వాటిని సీజ్ చేశామన్నారు. యాడికిలోనూ.. యాడికి: మండల కేంద్రంలోని ఎరువుల దుకాణంపై మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా, రెవెన్యూ అధికారులు శనివారం దాడి చేశారు. వెంకట్ ఫర్టిలైజర్ ఎరువుల దుకాణంలో అనుమతిలేని ఎరువులు, పురుగు మందులు గుర్తించారు. రూ.90 లక్షల విలువ గల 48 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, రూ.40 లక్షల విలువ గల 550 లీటర్ల పురుగు మందులు సీజ్ చేసినట్లు ఏఓ తెలిపారు. -
మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆర్.కె.నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు. ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు. -
వైభవంగా షంషేర్ ఉత్సవం
ఉరవకొండ: ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలోని హజరత్ బీబీ జైనబ్బీ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అమ్మ వారి షంషేర్ వేడుక శుక్రవారం వైభవంగా జరిగింది. పామిడి బాషు అంగడి నుంచి షంషేర్ను శుభ్ర పరిచి రాయదుర్గం బుడేన్ సాహెబ్ ఇంటి నుంచి మేళతాళాలతో దర్గాకు చేర్చారు. అనంతరం శుక్రవారం వేకువజాము 2 గంటలకు గుర్రంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించి, తిరిగి దర్గాకు చేర్చి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూరు బాషా, సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటీలు ఆకట్టుకున్నాయి. -
దివ్యాంగుల ఉసురు తగలక మానదు
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ములేక దివ్యాంగుల పింఛన్లను తొలగించేందుకు సిద్ధమైన కూటమి సర్కార్కు వారి ఉసురు తగిలి తీరుతుందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే 4.15 లక్షల వృద్దాప్య పింఛన్లు తొలగించి అర్హులకు అన్యాయం చేసిందన్నారు. తాజాగా మరో 2 లక్షల దివ్యాంగుల పింఛన్లను తొలగించేందుకు కుట్ర సాగుతోందన్నారు. వైద్యులకు టార్గెట్ ఇచ్చి పింఛన్ల తొలగింపునకు సిద్ధమైన ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. -
అక్రమాల షాక్
అనంతపురం నగరంలోని రెండో రోడ్డు సమీపంలో ఉన్న ఈ భవనానికి ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండానే ఐదు నెలల క్రితం విద్యుత్ శాఖ అధికారులు ఏడు విద్యుత్ సర్వీసులతో పాటు లిఫ్ట్కు అవసరమైన 3 ఫేజ్ కనెక్షనూ మంజూరు చేశారు. కనెక్షన్ ఇచ్చే ముందు ఆ భవనానికి ఎన్ని కిలో వాట్ల విద్యుత్ అవసరమవుతుందో గుర్తించి, ఆ మేరకు ఎస్టిమేషన్ రూపొందించి అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఎస్టిమేషన్ లేకుండానే కనెక్షన్లు మంజూరు చేయడంతో సంస్థకు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లింది. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఈ భవనానికి విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకుండానే 7 విద్యుత్ సర్వీసులను మంజూరు చేశారు. 11 కేవీ విద్యుత్ లైన్ లేకపోయినా భవన యజమానితో లబ్ధి పొంది విద్యుత్ సంస్థ ఆదాయాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎస్టిమేషన్ వేసి ఉంటే సంస్థకు రూ.4 లక్షలకుపైగా ఆదాయం సమకూరేది. ...ఈ రెండూ కేవలం ఉదాహరణ మాత్రమే. ఉన్నతాధికారుల అండతోనే కొందరు అక్రమార్జనకు తెరలేపడంతో సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం టౌన్: విద్యుత్ సంస్థలో పని చేస్తున్న కొందరు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి విద్యుత్ అక్రమ కనెక్షన్లు జారీ చేస్తూ కలెక్షన్ కింగ్లుగా మారారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ సొంత ఖజానాలను నింపుకోవడంతో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. సంస్థపై అదనపు భారం విద్యుత్ అక్రమ కనెక్షన్ల ఫలితంగా అనంతపురంలోని చాలా ప్రాంతాల్లో లో ఓల్టేజీ పెరిగి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సంస్థ ఏటా రూ.కోట్ల ఖర్చుతో అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. భారీ భవంతులకు ముందుగానే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సర్వీసులను మంజూరు చేస్తే లో ఓల్టేజీ సమస్యకు ముందుగానే చెక్ పెట్టవచ్చు. అయితే విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంతో లో ఓల్టేజీ సమస్యకు కారణమవుతున్నట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలో రూ.15 కోట్లకు పైగా ఖర్చు చేసి అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సంస్థ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. చర్యలకు వెనుకడుగు విద్యుత్ అక్రమ కనెక్షన్లపై చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అక్రమ విద్యుత్ కనెక్షన్లపై పత్రికల్లో కథనాలు వెలువడినా అక్రమార్కులపై చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనం. విచారణ పేరిట కాలయాపన చేయడం తప్ప సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై తీసుకున్నచర్యలు ఏమీ లేవు. ఇది మరికొందరికి ఊతమిచ్చింది. యూనియన్ల మాటున అక్రమంగా విద్యుత్ సర్వీసులను మంజూరు చేస్తూ సొంత జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. అనంతపురం నగరంలోని డీ5, డీ3 విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలోని బళ్లారి రోడ్డు, శ్రీనగర్కాలనీ, గుత్తి రోడ్డు, భైరవనగర్ తదితర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెద్ద పెద్ద భవంతులు, మాల్స్ ఏర్పాటు అవుతున్నాయి. వీటికి విద్యుత్ కనెక్షన్లు ఇష్టారాజ్యంగా మంజూరు చేస్తుండడంతో ఆయా ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు నానాటికీ తీవ్ర మవుతున్నాయి. ఇప్పటికై నా విద్యుత్ అక్రమ కనెక్షన్లకు అడ్డు కట్ట వేయకపోతే సంస్థ నష్టాల్లో కూరుకు పోవడం ఖాయమనే వాదనలు సొంత శాఖలోని కొందరు ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ముడుపులిస్తే ఎస్టిమేషన్ లేకుండానే విద్యుత్ కనెక్షన్లు విద్యుత్ సంస్థ ఆదాయానికి భారీగా గండి అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండ -
దివ్యాంగుల పింఛన్ల రద్దు దుర్మార్గం : సీపీఎం
గుంతకల్లు టౌన్: సొంత పనులు కూడా చేసుకోలేని అసహాయుల పింఛన్లను రద్దు చేయడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రీ వెరిఫికేషన్ పేరిట అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దివ్యాంగులతో కలసి శుక్రవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ.. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి కుట్రలకు తెరలేపడం తగదని, తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించకపోతే మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు పాల్గొన్నారు. -
పేరం స్వర్ణలతకు వైఎస్ జగన్ పరామర్శ
తాడిపత్రి టౌన్: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా శుక్రవారం పరామర్శించారు. అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని తన స్వగృహంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమెతో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎలాంటి సాయం అందించడానికై నా తాను సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు. ఆమె భర్త పేరం అమర్నాఽథరెడ్డితో మాట్లాడుతూ.. పేరం కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా అమెను ఫోన్లో పరామర్శించారు. అలాగే స్వర్ణలత ఇంటికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్రెడ్డి దంపతులు, మాజీ ఎంపీ తలారి రంగయ్య దంపతులు చేరుకుని ఆమె ఆరోగ్య స్థితిగతులు ఆరా తీశారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి
అనంతపురం: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ , ఎక్స్పర్ట్ ప్రమోషన్ కమిటీ) సమావేశం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను అన్ని రకాలుగా అన్ని శాఖల వారు ప్రోత్సహించాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులను జారీ చేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఎల్డీఎంను ఆదేశించారు. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైన సందర్భంగా జిల్లా స్కిల్ డెలప్మెంట్ అధికారి ప్రతాప్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్కర్ష్’లో జిల్లాను అగ్రస్థానంలో నిలపండి ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం అమలులో జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. పథకంపై న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పోర్టల్ ప్రదర్శన నిర్వహించింది. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో కలెక్టర్తో పాటు డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ సురేష్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద గుంతకల్లు మండలం గుండాల తండా, వజ్రకరూరు మండలం వెంకటంపల్లి చిన్న తండా, పెద్ద తండా, శింగనమల మండలం నాగులగుడ్డం, నాగుల గుడ్డం తండా గ్రామాలు ఎంపికై నట్లు వివరించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో 20 శాఖల అధికారులను సమన్వయం చేసుకుని వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర గ్రామాలలో అభివృద్ధి పనులు చేసేందుకూ సిద్ధంగా ఉండాలన్నారు. -
జాతీయ సాహస శిబిరానికి ఎంపిక
రాయదుర్గం టౌన్: స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం (బీఎస్సీ) విద్యార్థి జె.గౌతమ్ జాతీయ సాహస శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. జాతీయ పర్వతారోహణ సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల్ప్రదేశ్లో దిరాంగ్ గ్రామంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ పై ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిబిరానికి తమ కళాశాలలోని ఎన్సీసీ యూనిట్కు చెందిన గౌతమ్ ఎంపిక కావడంతో ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించి, వీడ్కోలు పలికారు. నేడు మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు అనంతపురం ఎడ్యుకేషన్/టౌన్: వినాయక చవితిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం ‘మట్టి వినాయక విగ్రహాల తయారీ’ పొటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ పీవీ కిషోర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి 6–10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి, నీటిని సమకూర్చుతామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాల వల్ల, వాటి అలంకరణకు వాడుతున్న కృత్రిమ రంగుల వల్ల నీటి, నేల కాలుష్యం జరిగి పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులలో పర్యావరణ స్పృహ పెంచాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
సోషల్ మీడియాతో సమాజానికి కీడు
● రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనంతపురం సిటీ: సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) విపరీత ధోరణి సమాజానికి కీడే ఎక్కువ జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. సంచలనాల పేరుతో నిజాలు నిర్ధారించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రచారం, ప్రసారం చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారన్నారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్లో ఉన్న డీపీఆర్సీ భవన్లో శుక్రవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఉమ్మడి జిల్లా మహాసభ జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ అధ్యక్షత వహించగా.. యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే విధంగా కథనాలు ఉండాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్కు చర్యలు తీసుకున్నామన్నారు. అక్రిడిటేషన్ కమిటీల్లో అన్ని సంఘాలకు అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్లో జర్నలిస్టులకు మరింత చేయూతనందిస్తామని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు జర్నలిజంతోనే ముడిపడి ఉందని ఉప్పల లక్ష్మణ్ అన్నారు. అయితే చాలా మంది జర్నలిస్టులు అక్రమార్కుల కొమ్ము కాస్తు నిజాలను రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిజాలే రాయాలని, అప్పుడే మెరుగైన సమాజ నిర్మాణంలో మన పాత్ర పోషించిన వారమవుతామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో తమ యూనియన్ ముందుంటుందని హామీ ఇచ్చారు. -
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం
● మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ అనంతపురం టవర్క్లాక్: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ అన్నారు. అనంతపురంలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాలలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య విబేధాలు రేకెత్తించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జూలుకుంట కేశవ ప్రసాద్, అరవింద్ కుమార్, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా?
అనంతపురం కార్పొరేషన్: ‘దివంగత ఎన్టీఆర్ కోడలు, నందమూరి హరికృష్ణ సతీమణి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు.. వరుసకు సోదరి అయిన జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై వ్యాఖ్యలు చేస్తే స్పందించరా? తోటి నటుడి తల్లిని అవమానిస్తే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరుమెదపరా?’ అని వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల అరాచకాలు తారస్థాయికి చేరాయని, మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడడం, వ్యవహరించడం కళ్లారా చూస్తున్నామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి ఎమ్మెల్యే దగ్గుపాటి దారుణంగా మాట్లాడారన్నారు. అయినా ఇలాంటి వారిని సీఎం ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. ‘నేను కొట్టినట్టు కొడతా..మీరు ఏడ్చినట్టు ఏడ్వండి’ అన్న చందంగా బాబు తీరు ఉందన్నారు. ఇటీవల అనంతపురంలో ఓ మైనార్టీ మహిళను కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి దుర్భాషలాడారన్నారు. బాబూ కొడుకులకు కోట్లు గుమ్మరించారట టికెట్ కోసం సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కు రూ.కోట్లు గుమ్మరించామని, ఇప్పుడు ఆ డబ్బు సంపాదించుకోవడం తమ హక్కు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే అనంతపురంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరాయన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దివ్యాంగులతో కలెక్టరేట్ ముట్టడిస్తాం కూటమి ప్రభుత్వం జిల్లాలో 9,601 మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించి విశ్వాసఘాతుకానికి పాల్పడిందని అనంత మండిపడ్డారు. పింఛన్లను పునరుద్ధరించకపోతే దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులతో కలసి కలెక్టరేట్ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మేయర్ వసీం, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, కార్పొరేటర్ కమల్భూషణ్, నాయకులు తనీష, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, చిదంబర్రెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు దుర్మార్గం సాటి నటుడి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కల్యాణ్ స్పందించరా? ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
యాంటీ బయాటిక్స్ వాడొద్దు
రెస్పరేటరీ వైరల్ ఫీవర్స్, దోమకాటు ఫీవర్స్ అధికంగా వస్తున్నాయి. ప్రజలు భయపడాల్సిన పనిలేదు. కానీ సురక్షిత ప్రమాణాలు, ముందస్తు జాగ్రత్తలు తప్పకపాటించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమకాటుకు గురికాకుండా చూసుకోవాలి. మాస్క్ ధరించడం, అవసరమైనప్పుడు చేతులకు శానిటైజ్ చేసుకోవాలి. జ్వరం వచ్చింది కదా అని, అనవసరంగా యాంటీ బయాటిక్స్ జోలికి వెళ్లొద్దు. పండ్లు, తదితర మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. స్వచ్ఛమైన నీటిని రోజూ ఆరు గ్లాసులపైగా తాగాలి. మూడు రోజుల కంటే అధికంగా జ్వరం ఉంటే వైద్యుల సూచనలతో రక్త పరీక్షలు చేసుకోవాలి. – డాక్టర్ యాసర్ అరాఫత్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజనాస్పత్రి -
‘పింఛన్ల కోత.. చంద్రబాబు సర్కార్ తీరు అమానవీయం’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లలో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్లు తొలగించారని, వచ్చెనెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్లను రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తికట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత పేదరికంలో ఉండి వయస్సు మీరిపోయి, పనులు చేసుకోలేని వృద్ధులకు ఒక కొడుకులా అండగా నిలబడేందుకు ప్రతినెలా సామాజిక పెన్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లను అందించారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ సామాజిక పెన్షన్లను కొనసాగించాయి.వైఎస్ జగన్ హయాంలో 66.34 లక్షల పెన్షన్లు:వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన సీఎంగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందాయి. ప్రతి ఏటా జనవరి, జూన్ నెలల్లో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు పెన్షన్లను పెంచుతామని, దివ్యాంగులకు కేటగిరిల వారీగా రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇస్తామని, కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏడాది కాలంలోనే పెన్షన్ల సంఖ్యను 62.19 లక్షలకు కుదించుకుంటూ వచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పద్నాలుగు నెలల్లో దాదాపు 4.15 లక్షల పెన్షన్లను తొలగించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లలో కూడా భారీగా కోత పెడుతూ వస్తున్నారు. పదేళ్ళ నుంచి పెన్షన్లు పొందుతున్న వారిని కూడా వివిధ కారణాలను చూపుతూ వారిని తొలగించారు. దివ్యాంగుల పైన కూడా ఇదే విధంగా కక్షసాధింపులు ప్రారంభమయ్యాయి.రీ వెరిఫికేషన్ పేరుతో, సదరం క్యాంప్ల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకుంటేనే పెన్షన్లు ఇస్తామంటూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్ జగన్ హయాంలో దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతూ ఉంటే, వారిలో సుమారు 2 లక్షల మందిని తొలగించేందుకు సిద్దయయ్యారు. వచ్చేనెల నుంచి వీరికి పెన్షన్లను నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివ్యాంగులకు ఇచ్చే సర్టిఫికేట్లలో కూడా వారి వైకల్యం శాతంను తగ్గించి ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఉన్న వత్తిడి మేరకే ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రత్యేక హెలికాఫ్టర్లతో వెళ్ళి, భారీ బందోబస్త్, పెద్ద ఎత్తున ప్రచారం కోసం ప్రతినెలా సీఎం చంద్రబాబు చేస్తున్న ఖర్చును వృద్దులు, దివ్యాంగుల కోసం చేస్తే భారం తగ్గదా..?చంద్రబాబు దుర్మార్గాలపై పోరాడతాం:అనంతపురం జిల్లాలోనే ఏడాది కాలంలో 19 వేల మందికి పైగా దివ్యాంగులకు పెన్షన్లు తొలగించారు. ఇప్పుడు తాజాగా దివ్యాంగులను 9601 పెన్షన్లను ఈ నెలలో తొలగించారు. వీరినే కాకుండా 2314 మందిని దివ్యాంగుల కోటా వర్తించదు కాబట్టి, వారిని వృద్దాప్య పెన్షన్ల కింద మార్పు చేస్తున్నామని నోటీసులు ఇచ్చారు. ఇంత అమానవీయంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. అనంతపురం మున్సిపల కార్పోరేషన్లో 23వేల మందికి పైగా ఉంటే తాజాగా 1008 మందికి నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు విశ్వాసఘాతకంగా చేస్తున్న పని.ఎన్నికల ముందు దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమ చూపించి, వారి పక్షాన నిలబడతామని నమ్మించి, వారి ఓటుతో అధికారంలోకి వచ్చిన తరువాత అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నంకు ఒక దివ్యాంగుడు ప్రయత్నించాడు. పెన్షన్లు తీసేస్తే ఎలా బతకాలని దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. తమ దుర్మార్గంపై దివ్యాంగులు పోరాటం చేయలేరనే ధీమాతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వారి పక్షాన పోరాడేందుకు వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దివ్యాంగుల వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారు. కలెక్టర్ కార్యాలయాలను దిగ్భందం చేస్తాం.టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు.మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నాలుగైదేళ్ళ కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. -
నేత్రపర్వంగా శ్రీవారి ఉంజల్ సేవ
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారి ఉంజల్ సేవ గురువారం రాత్రి నేత్ర పర్వంగా నిర్వహించారు. శ్రావణ మాసం బహుళ పక్షం త్రయోదశి పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో గురువారం రాత్రి భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరించి శ్రీరంగ మంటపంలో డోలోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భార్యకు అవమానం.. భర్త ఆత్మహత్య వజ్రకరూరు: తన భార్యకు జరిగిన అవమానాన్ని తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన బాలతిమ్మరాజు (40)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం సాయంత్రం కాయగూరలను ఫ్రిజ్లో పెట్టేందుకు భార్య పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో పక్కింటి యజమాని కురుబ నాగార్జున ఆమెను బలత్కారం చేయబోయాడు. ప్రతిఘటించి ఇంటికి చేరుకున్న భార్య జరిగిన విషయాన్ని భర్తకు తెలపడంతో బాలతిమ్మరాజు నేరుగా వెళ్లి నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. దీంతో గ్రామంలో పరువు పోయిందనే మనోవేదనతో తిమ్మరాజు బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక గురువారం బాల తిమ్మరాజు మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కురుబ నాగార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. -
గంజాయి మత్తు .. బతుకు చిత్తు!
కదిరి: జిల్లాలో ఏడాదిగా గంజాయి దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి ముఠా సభ్యులు విక్రయాలు సాగిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా పట్టణాలు మొదలు గ్రామాల్లో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి ముఠా సభ్యులకు కొండంత రాజకీయ అండ దొరికింది. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా.. కోస్తాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా జిల్లాకు గంజాయి గుట్టుగా తరలి వస్తోంది. ఇందుకోసం గంజాయి ముఠా సభ్యులు కొందరు నిరుపేదలను ఎంపిక చేసుకొని వారికి కమీషన్ రూపంలో చెల్లిస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ప్రయాణికుల్లాగా వీరు బస్సులు, రైళ్లలో సరుకు తీసుకొచ్చి గంజాయి ముఠాకు అప్పగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో గంజాయిని తీసుకొస్తున్న వారు దొరికినా సరఫరాదారులు, విక్రయదారులు మాత్రం అధికార పార్టీ నేతల అండతో తప్పించుకుంటున్నారు. గంజాయిని అరికట్టడం తమకు పెద్ద సమస్య కాదని, అసాంఘిక శక్తులకు అధికార పార్టీ నేతలు సహకరించకపోతే సంతోషిస్తామని జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇటీవల తలుపుల మండలంలో రెడ్హ్యాండెడ్గా దొరికిన ఒక దొంగను వదిలేయమని ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని మరో పోలీస్ అధికారి గుర్తు చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే .. హిందూపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారు. మత్తుకు అలవాటు పడ్డ కొందరు విద్యార్థులు గంజాయి కొనుక్కోవడానికి ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో వారిపై దాడులకు కూడా పాల్పడిన సంఘటనలు ఉన్నాయని కదిరికి చెందిన ఓ విద్యార్థి తెలిపారు. కొన్ని చోట్ల యువకులు బృందాలుగా ఏర్పడి డబ్బులకోసం ఎంతకై నా తెగిస్తున్నారు. కదిరి మండలం కాళసముద్రంలో ఇటీవల కొందరు మైనర్లు తోటి పిల్లలపై గంజాయి మత్తులో చెప్పులు, కర్రలతో దాడి చేసి ఆ దృశ్యాలను వారే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ సంఘటనపై ఎస్పీ వి.రత్న ఆ గ్రామాన్ని సందర్శిస్తే పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలా జరుగుతోందంటూ ఆమైపె బాధిత కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ఆగ్రహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఎన్పీ కుంట మండలంలో గంజాయి అమ్ముతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా కదిరి రూరల్ పోలీసులు కొండమనాయునిపాళ్యం వద్ద వాహనంలో గంజాయి తరలిస్తున్న గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని వారి నుండి సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువతే లక్ష్యంగా జిల్లాలో జోరుగా విక్రయాలు అధికార అండతో రెచ్చిపోతున్న గంజాయి ముఠా ప్రయాణికుల ముసుగులో సరుకు తరలింపు -
రేషన్ బియ్యం డంప్ స్వాధీనం
గుంతకల్లు రూరల్: పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న బయలు ప్రదేశంలో డంప్ చేసిన 49.6 క్వింటాళ్ల (105 బస్తాల) రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల క్రితం ఇదే స్థలంలో 78.5 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మరువకనే మళ్లీ అక్కడే 105 బస్తాల బియ్యం డంప్ను అధికారులు గుర్తించడం గమనార్హం. కార్యక్రమంలో సీఎస్డీటీ సుబ్బలక్ష్మి, వీఆర్వో మల్లికార్జున, పోలీసులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ● వచ్చే నెల 5న ఎన్నికలు అనంతపురం కార్పొరేషన్: నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ను కమిషనర్ బాలస్వామి విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. 29న నామినేషన్ల పరిశీలన, అదే రేజు 3 గంటలకు ప్రచురణ ఉంటుంది. వచ్చే నెల 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున సాయంత్రం 3 గంటలకు పోటీ అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. వచ్చే నెల 5న నగరపాలక సంస్థలోని నూతన భవనంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్, అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. పట్నం పూర్వపు ఎస్ఐ రాజశేఖర్పై కేసు నమోదు గుత్తి: న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడి ఉద్యోగం పోగొట్టుకున్న ముదిగుబ్బ మండలం ‘పట్నం’ పూర్వపు ఎస్ఐ రాజశేఖర్పై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ఎస్ఐ రాజశేఖర్పై ఫిర్యాదు చేయగా.. సీఐ వెంకటేశ్వర్లు సమగ్రంగా విచారించి రాజశేఖర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైగింక వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, సమస్య పరిష్కారం కోసం పట్నం పోలీసు స్టేషన్కు వచ్చిన గిరిజన మహిళను ఎస్ఐ హోదాలో ఉన్న రాజశేఖర్ లైంగికంగా వేధించిన వైనంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన ఎస్పీ రత్న తొలుత రాజశేఖర్ను వీఆర్కు పంపారు. అనంతరం విచారణ జరిపారు. రాజశేఖర్ లైంగిక వేధింపులు నిజమని తేలడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ రాయలసీమ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లైంగిక వేధింపులపైనే గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
నానో యూరియాతో మంచి ఫలితాలు
● రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది ● ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి అనంతపురం అగ్రికల్చర్: నానో యూరియాతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి అన్నారు. ‘నానో’ యూరియా, డీఏపీ ఎరువుల వాడకంపై హార్టికల్చర్ ఆఫీసర్లు (హెచ్ఓలు), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు (వీహెచ్ఏ)కు అవగాహన కల్పించారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి, ఏడీ దేవానంద్ పాల్గొని నానో ఎరువుల వాడకం, ప్రయోజనాల గురించి తెలియజేశారు. మామూలు యూరియా, డీఏపీతో పోల్చితే ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, డీఏపీ వాడకం వల్ల పంటల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలు రుజువు చేశాయన్నారు. రైతులకు ఖర్చు కూడా వాటి కన్నా కాస్త తక్కువగానే ఉంటుందని తెలిపారు. మామూలు యూరియాను దిగుమతి చేసుకోవడం వల్ల ప్రభుత్వాలపై భారం పడుతోందన్నారు. ఈ క్రమంలో దేశంలోనే ఉత్పత్తి చేస్తున్న నానో యూరియా, డీఏపీ వల్ల అటు ప్రభుత్వాలకు ఇటు రైతులకు కూడా ఖర్చు తగ్గి మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. వివిధ పంటల్లో ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలనే దానిపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోరమాండల్ ప్రతినిధులు గోవిందరావు, మహబూబ్అలీ, వెంకటేశు, శివకుమార్, హెచ్ఓ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!
● ఉచితం మాటున ఇసుక దందా ● నదులను కొల్లగొడుతున్న టీడీపీ నాయకులు ● చేష్టలుడిగి చూస్తున్న అధికారులు అనంతపురం టౌన్:ఇసుకను ఉచితంగా అందిస్తున్నామంటూ ఊదరగొడుతున్న కూటమి ప్రభుత్వం.. ఆ మాటున ‘పచ్చ’ నేతలకు దోచిపెడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ ‘తమ్ముళ్లు’ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల అండతో ఎక్కడిక్కడ తవ్వేసుకుంటూ భారీగా వెనకేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎద్దుల బండిపై ఇసుకను తరలిస్తేనే పట్టుకుంటున్న పోలీసు, విజిలెన్సు అధికారులు... అదే పెన్నా, వేదావతి, హగరి నదుల పరివాహక ప్రాంతాల నుంచి టిప్పర్లలో తరలిపోతున్న ఇసుక కనిపించడలేదు. అక్కడ గుంతలే సాక్ష్యం.. శింగనమల మండలం జలాలపురం గ్రామంలోని కూతలేరు వాగును స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ప్రధాన అనుచరులు మింగేశారు. వాగులో ఎటు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇసుక తవ్వేసి అమ్మేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి ఏమాత్రం పట్టడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటే తప్ప వెలుగులోకి రానివ్వకుండా అధికార యంత్రాంగం పని చేస్తుండడం గమనార్హం. శింగనమల నియోజకవర్గంలో తరిమెల, యల్లనూరు గ్రామాల్లో మినహా ఎక్కడా ఇసుక రీచ్లకు అనుమతులు లేవు. అయినా పెన్నా, కూతలేరు నది పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వేస్తూ స్థానిక టీడీపీ నేతలు అమ్మేసుకుంటున్నారు. ‘పచ్చ’ నేతల వికృత చేష్టలకు అక్కడి గుంతలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పెన్నాను ఊడ్చేస్తున్నారు.. ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం కాలువపల్లి మీదుగా వెళ్తున్న పెన్నానది పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను స్థానిక టీడీపీ నేతలు ఊడ్చేశారు. పెన్నానదిలో ఎటు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. మంత్రి అండదండలు ఉండడంతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎలాంటి ఇసుక రీచ్ల (ఓపెన్, పట్టా)కు గనుల శాఖ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఇసుక రవాణా మాత్రం సాగుతోంది. బెళుగుప్ప, కూడేరు మండలాలకు చెందిన టీడీపీ నేతలు రోజువారీగా పదుల ట్రాక్టర్లలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు బెళుగుప్పకు కాలువపల్లి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను రోజూ చూస్తున్నా మంత్రికి భయపడి చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో 6 రీచ్లకు మాత్రమే అనుమతి.. జిల్లా వ్యాప్తంగా గనుల శాఖ అధికారులు కేవలం ఆరు ఇసుక రీచ్లకు అనుమతి ఇచ్చారు. వాటిలో కణేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామంలో ఓపెన్ రీచ్, శింగనమల మండలం తరిమెల గ్రామంలో పట్టా భూముల్లో రెండు, యల్లనూరు మండలంలో ఒకటి, పెద్దవడుగూరు మండలంలో రెండు పట్టా భూముల్లో రీచ్కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే తాడిపత్రి మండలంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తిమ్మసముద్రం, కంబదూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుక దందాను స్థానిక ప్రజాప్రతినిధుల అండతో టీడీపీ నాయకులు సాగిస్తున్నారు. -
చిన్నారికి ప్రాణభిక్ష పెట్టండి
నల్లచెరువు: మండలంలోని దేవిరెడ్డిపల్లికి చెందిన ఇమాంబాషా, షబానా దంపతుల నాలుగేళ్ల వయసున్న ఏకై క కుమార్తె అల్ఫియా ప్రాణాపాయ స్థితిలో బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు కాగా, పాప సంపూర్ణ ఆరోగ్య వంతురాలు కావడానికి అవసరమైన చికిత్స కోసం రూ.10 లక్షలు అవుతుందని అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో నిరుపేద కుటుంబానికి దిక్కుతోచడం లేదు. ఆపన్న హస్తం అందించి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. 20 రోజుల క్రితం న్యూమెనియా.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని గ్యాస్ ఏజెన్సీలో డెలవరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని ఇమాంబాషా పోషించుకుంటున్నాడు. జీవనం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 20 రోజుల క్రితం అల్ఫియాకు జబ్బు చేసింది. తీవ్రమైన జ్వరం, దగ్గు ఎక్కువగా ఉండడంతో మదనపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పది రోజులు గడిచాయి. అయినా చిన్నారికి నయం కాకపోవడంతో మరోసారి వైద్య పరీక్షించి న్యూమోనియాతో బాధపడుతున్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పు చేసి డబ్బు సమకూర్చుకుని ఆగమేఘాలపై బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లారు. సక్రమంగా పనిచేయని కిడ్నీలు అల్ఫియాకు వైద్య పరీక్షలు నిర్వహించిన బెంగళూరులోని ఆస్పత్రి వైద్యులు.. న్యూమోనియాతో పాటు బ్లడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే రెండు కిడ్నీలూ సక్రమంగా పనిచేయడం లేదని నిర్ధారించారు. అల్ఫియా పరిస్థితి విషమంగా ఉండడంతో సత్వర చికిత్సలు అందించాలని పాప పూర్తిగా కోలుకోవాలంటే రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. పిడుగు లాంటి వార్త విన్న నిరుపేద తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో చిన్నారి వైద్య ఖర్చులు మొత్తం భరించాల్సి వస్తోంది. ఇప్పటికే తెలిసిన వారి వద్ద చేసిన రూ. 4 లక్షల వరకూ అప్పు చేసి చికిత్స చేయించారు. అయినా పాప పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారికి ప్రాణభిక్ష పెట్టే దాతలు ఎవరైనా ముందుకు రావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సాయం చేయదలిస్తే.. పేరు : ఎస్.షబానా బ్యాంకు పేరు : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఖాతా నంబర్ : 9115 0793 384 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ0001047 ఫోన్పే నంబర్ : 93915 74457 సక్రమంగా పని చేయని రెండు కిడ్నీలు బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియాతో కదలలేని స్థితి చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం దాతల కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబం -
చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు సురక్షితంగా, పారదర్శకంగా సాగేలా చూడడమే లక్ష్యమని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అనుమతుల కోసం ప్రత్యేకంగా ganeshustav. net వెబ్సైట్ ప్రారంభించామన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందాలని సూచించారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత పోలీస్ అధికారి మంటప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) జారీ చేస్తారని, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే మంటపాలకు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. ● పోలీసుల సూచనలిలా... పర్యావరణ కాలుష్యం జరగకుండా మట్టి ప్రతిమలే ప్రతిష్టించాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలను వాడరాదు. మంటపాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. విగ్రహ నిమజ్జనం కోసం ప్రభుత్వం గుర్తించిన ఘాట్లను మాత్రమే వినియోగించాలి. ● ప్రతి మంటపం వద్ద సీసీ కెమెరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తదితరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ప్రతి మంటపంలో కనీసం 5 నుంచి 10 మంది వలంటీర్లు విధులు నిర్వర్తించాలి. ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ● పోలీసు శాఖ సూచించిన మార్గదర్శకాలను పాటించాలి. ఊరేగింపు సమయంలో భక్తి గీతాలు, శాంతి సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి. ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీయకండా సోదరభావంతో, పరస్పర గౌరవంతో ఉత్సవాలు జరగాలి. శాంతిభద్రతలను కాపాడటంలో సహకారం అందించాలి. -
ఉత్తమ టీచరు అవార్డులకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 5న జరిగే ‘గురుపూజోత్సవం’ రోజున జిల్లాస్థాయిలో అందజేసే ‘ఉత్తమ టీచరు’ అవార్డులకు అర్హులైన టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఏపీఆర్ఈఐఎస్, కేజీబీవీ స్కూళ్లు, డైట్ కళాశాలలో పని చేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. దరఖాస్తులు (రెండుసెట్లు) ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోపు ఎంఈఓ/డీవైఈఓకు అందజేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిమార్కులతో 28 సాయంత్రం 5 గంటలలోపు ఎంఈఓ/డీవైఈఓలు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. దరఖాస్తుకు నిబంధనలివీ.. కనీసం పదేళ్లు బోధనానుభవం ఉండాలి. గతంలో జిల్లాస్థాయి అవార్డు తీసుకుని ఉండకూడదు. దరఖాస్తుదారునిపై ఎలాంటి క్రిమినల్ కేసులు/ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్/శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు ఉండకూడదు. మరిన్ని వివరాలకు డీఈఓ బ్లాగ్స్పాట్లో పరిశీలించాలని డీఈఓ తెలిపారు. సేవాఘడ్ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తులు అనంతపురం రూరల్: గొల్లలదొడ్డి (సేవాఘడ్) గిరిజన గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్లో ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వసతితో పాటు ప్లేట్లు, గ్లాసులు, నోట్ పుస్తకాలు, దుస్తులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 98853 69079, 8978239363, 9550655840 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. దివ్యాంగులతో చెడుగుడు అనంతపురం క్రైం: కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై ప్రతాపం చూపుతోంది. పూటకో నిబంధనలు మారుస్తూ వారితో చెడుగుడు ఆటుకుం టోంది. లేని పోని నిబంధనలను పెట్టి కార్యాలయాలు, ప్రభుత్వ వైద్యుల చుట్టూ తిప్పుతోంది. దివ్యాంగుల పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులు చేసినట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి, 60 సంవత్సరాలు మించిన వారిని వృద్ధుల కేటగిరీలోకి మార్చి రూ.4 వేల పింఛనులోకి చేర్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. మానసిక వైకల్యం కలిగి ఉన్న 18 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు యథావిధిగా పింఛను అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఇకపోతే... పునఃపరిశీలనలో కొంతమంది దివ్యాంగులకు తాత్కాలిక సర్టిఫికెట్లు జారీ చేసి రద్దు నోటీసులు ఇచ్చారని, ఇలాంటి వారు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. అప్పీల్ నోటీసుతో పాటు అప్పీల్ లెటర్, ఆధార్ కలిపి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్కి అందించాలని సూచించింది. నోటీసు అందిన 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకొనే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. -
దంపతులపై దాడి కేసులో వడ్డీ వ్యాపారి అరెస్ట్
ధర్మవరం అర్బన్: వడ్డీ వ్యాపారం చేస్తూ దాడులు, బెదిరింపులకు దిగిన ప్రధాన నిందితుడు సాకే రాజశేఖర్ అలియాస్ యర్రగుంట రాజాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం వివరాలను డీఎస్పీ వెల్లడించారు. లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన సాకే రాజశేఖర్ ధర్మవరం పరిసర ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ అనుచరులతో కలిసి బెదిరించడం, దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తున్నారన్నారు. జూలై 23న శాంతినగర్కు చెందిన చేనేత కార్మికుడు రమణ, అతని భార్య భారతిపై ఎర్రగుంట రాజా తన అనుచరులతో దాడి చేసి రూ.7 వేల నగదు తీసుకెళ్లారన్నారు. బాధితురాలు భారతి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దరాప్తు చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. పరారీలో ఉన్న రాజాను పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్టు చేశామని తెలిపారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్తో పాటు రూ.కోటి విలువ చేసే భూసంబంధిత రిజిస్ట్రేషన్ పత్రం, రూ.10 లక్షలు విలువ చేసే రెండు ప్రామిసరీ నోట్లు, రూ.2700 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజశేఖర్పై ఇప్పటికే పలు మర్డర్ కేసులు, వడ్డీ వ్యాపార దాడుల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
నాడీవ్యవస్థ పనితీరు మందగిస్తుంది
గంజాయి, హెరాయిన్, ఫోర్ట్విన్ ఇంజెక్షన్లు, కొకై న్ వంటి మాదక ద్రవ్యాలను తీసుకుంటే నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కండరాలు, నరాల బలహీనత, జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది, అసహనం, కుంగుబాటు, బరువు తగ్గిపోవడం వంటి రుగ్మతల బారిన పడతారు. – మదన్కుమార్, వైద్యనిపుణులు, కదిరి ప్రత్యేక టీములు ఏర్పాటు చేశాం గంజాయితో పాటు ఇంకా ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేశాం. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కదలికలు, అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలి. – వి.రత్న, ఎస్పీ, శ్రీసత్యసాయి జిల్లా -
ఫీజు చెల్లించకున్నా.. చెల్లించినట్లు
●బహిర్గతమైన ఎస్కేయూ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్వ విద్యార్థుల పన్నాగం ●విచారణకు ప్రత్యేక కమిటీఅనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థులు ఏకంగా బ్యాంకు చలానాలు ఫోర్జరీ ఫీజు చెల్లించినట్లుగా చూపి సర్టిఫికెట్లు పొందారు. కేవలం నాలుగు వేలు ఫీజు చెల్లించి.. రూ.14 వేలు ఫీజు చెల్లించినట్లుగా చలానాలను ఫోర్జరీ చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇంకా ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే అంశంపై వివరాలు నిగ్గు తేల్చడానికి ప్రొఫెసర్ల కమిటీని నియామకం చేశారు. చలానాల్లో మూడు విభాగాలుగా విభజించి ఇస్తారు. ఒకటి బ్యాంకు.. రెండోది విద్యార్థికి.. మూడోది పరీక్షల విభాగానికి పంపుతారు. విద్యార్థికి ఇచ్చిన చలానా భాగంలో ఫోర్ థౌజండ్ అనే పదాల స్థానంలో ఫోర్టీన్ అని రాసి.. 4,000 అని అంకెల రూపంలో ఉన్న స్థానానికి ముందు 1 చేర్చి 14,000గా మార్చి చలనాను కళాశాలలో సమర్పించారు. దీంతో ఫీజు మొత్తం చెల్లించినట్లుగా నిర్ధారించుకుని సర్టిఫికెట్లు అందజేశారు. ఫోర్జరీ చేసిన విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. -
డిమాండ్కు సరిపడని యూరియా
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా రైతుల డిమాండ్కు సరిపోవడం లేదు. ఒక లోడు, అర లోడు చొప్పున పంపుతుంటే కేవలం గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా మొక్కజొన్న, వరి సాగు చేపట్టారు. అయితే యూరియా డిమాండ్ ఉన్న ఈ పంటల్లో ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కడుతున్నారు. గురువారం పెడపల్లి సొసైటీకి 140 బస్తాల యూరియా రాగా, రెండు గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోయింది. ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు చొప్పున పంపిణీ చేసినా క్యూ లైన్లో వేచి ఉన్నవారిలో సగం మందికి కూడా దక్కలేదు. దీంతో చాలా మంది రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ప్రస్తుతం జిల్లాలో 4,700 టన్నుల యూరియా ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతున్నా.. ఈ మొత్తం ఏనాడో ఖాళీ అయిపోయి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వచ్చే లోడు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాల్సి వస్తోందన్నారు. వచ్చిన వెంటనే ఖాళీ అవుతున్న గోదాములు -
బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
● నేటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేళాలు అనంతపురం సిటీ: ప్రభుత్వ రంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంస్థ కేబుల్ ఆపరేటర్ల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్ పాషా గురువారం వెల్లడించారు. రూ.400కే సరికొత్త ట్రిపుల్ ప్లే (ఎఫ్టీటీహెచ్) ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ప్రవేశపెట్టినట్లు వివరించారు. 20 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, 400+ఫ్రీ చానళ్లతో పాటు అన్ని తెలుగు పే ఛానళ్లు (44 ఛానళ్లు) వీక్షించవచ్చని వెల్లడించారు. ఈ ప్లాన్లో తొమ్మిది ఓటీటీలు ఉన్నాయన్నారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లు బీఎస్ఎన్ఎల్లో టిప్గా నమోదు చేసుకుని ఇప్పటికే ఉన్న ఏపీఎస్ఎఫ్ఎల్ కస్టమర్లను బీఎస్ఎన్ఎల్కు మార్చవచ్చని పేర్కొన్నారు. కొత్త ఫైబర్ కనెక్షన్లను కూడా అందించే అవకాశముందన్నారు. ఆసక్తి ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్లు అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, కదిరి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రిలో తమకు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ డివిజనల్ కార్యాలయాల్లో కానీ, అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో కానీ సంప్రదించవచ్చన్నారు. కేబుల్ ఆపరేటర్ల సౌకర్యార్థం శుక్రవారం నుంచి పైన తెలిపిన డివిజన్ కార్యాలయాల్లో టిప్/లోకల్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఆత్మహత్యే శరణ్యం
పుట్లూరు: పింఛన్లు తొలగిస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పుట్లూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు కనీసం తమ వైపు చూడకుండా పంపారని కన్నీటిపర్యంతమయ్యారు. దివ్యాంగులకు సీపీఎం మండల కార్యదర్శి సూరి సంఘీభావం తెలిపారు. పింఛన్లను పునరుద్ధరించకపోతే బాధితులతో కలిసి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెద్దయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మూడో రోజూ కానరాని ‘మార్పు’
● మహిళా ప్రజాప్రతినిధులకు ముగిసిన శిక్షణ ● చివరి రోజు ముగ్గురే హాజరు అనంతపురం సిటీ: అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో మహిళా ప్రజా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు మొక్కుబడిగా ముగిశాయి. ‘మార్పు ద్వారా విజేతలు–మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి మొదలైన శిక్షణ తరగతులకు కనీస స్పందన లేదంటే అతిశయోక్తి కాదు. తొలి రోజు ఇద్దరు, రెండో రోజు ముగ్గురు హాజరు కాగా, చివరి రోజు కూడా కేవలం ముగ్గురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వారిలో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు కాగా, మరొకరు ఎంపీపీ ఉన్నారు. అయితే వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వలేకపోయారు. ఘనత వహించిన అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఈ మాత్రానికి శిక్షణ తరగతులు ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని వచ్చిన ప్రజాప్రతినిధులు వాపోయారు. మరో ఏడాదిలో పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై మహిళా ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. ఎలాంటి ఉపయోగం లేకపోగా, నిధుల దుర్వినియోగం బాగా జరుగుతోందని వాపోయారు. -
తొలి రోజు ఇద్దరు.. రెండో రోజు ముగ్గురు
● జెడ్పీ శిక్షణ తరగతులకు స్పందన కరువు ● అధికారులకూ పట్టని వైనం అనంతపురం సిటీ: అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణకు మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీల నుంచి స్పందన కరువైంది. మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని జెడ్పీ అధికారులు నిర్ణయించారు. జెడ్పీ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు ఉంటాయని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులకు కబురు పంపారు. అందరూ వస్తారని భావించినా తొలి రోజు మంగళవారం కేవలం ఇద్దరు మహిళా జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. బుధవారం ముగ్గురు (ఇద్దరు జెడ్పీటీసీలు, ఒక ఎంపీపీ) మాత్రమే వచ్చారు. శిక్షణ తరగతులకు కనీసం 60 మంది వస్తారని ఊహించి, ఆ మేరకు భోజనాలు తెప్పించారు. అయితే ప్రజాప్రతినిధుల నుంచి స్పందన సరిగా లేకపోవడంతో భోజనాలన్నీ వృథా అయ్యాయి. ఆ వచ్చిన వారు కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే తమ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కాగా, మరో ఏడాది కాలం మాత్రమే మిగిలి ఉందని, నాలుగేళ్లుగా లేని శిక్షణ చివరి ఏడాదిలో ఎందుకో అధికారులకే తెలియాలని పేర్కొన్నారు. కేవలం నిధులు వెనక్కి పోకుండా ఖర్చులు చూపించుకోవడానికే కార్యక్రమం ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హడలెత్తుతున్న సబ్ రిజిస్ట్రార్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘పచ్చ’ నేతల దెబ్బకు ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు బెంబేలెత్తుతున్నారు. అసలే రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయి అల్లాడుతుండగా తాజాగా ఎమ్మెల్యేల ఒత్తిడి ఎక్కువైపోయిందంటూ వాపోతున్నారు. తాము చెప్పినట్టు రిజిస్ట్రేషన్లు చెయ్యకపోతే శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పెద్ద రిజిస్ట్రేషన్లు తమకు తెలియ కుండా చేయకూడదని చెబుతున్నారు. పర్సెంటేజీలు ముట్టజెబితేనే.. ఎక్కడైనా కొద్దో గొప్పో బిల్డర్లు స్థలాలు లేదా భూములు కొని రిజిస్ట్రేషన్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కోటి రూపాయలకు మించి ఎలాంటి రిజిస్ట్రేషన్ వచ్చినా ముందుగా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలి. స్వయంగా కొన్ని చోట్ల సబ్రిజిస్ట్రార్లే ‘ఎమ్మెల్యేను కలిసి రండి’ అని కొనుగోలుదారుడికి చెబుతున్నారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. మున్సిపాలిటీల పరిధిలో పెద్ద పెద్ద భవనాలకు రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఎమ్మెల్యేల అనుమతి ఉండాల్సిందేనని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. అక్కడ భారీగా ఒత్తిళ్లు.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ప్రధానంగా కొన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు వాపోతున్నారు. అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్,కదిరి,కళ్యాణదుర్గం, రాప్తాడు, తాడిపత్రి ప్రాంతాల్లో ఎక్కువ ఇబ్బందులున్నట్టు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఒక సారి రిజిస్ట్రేషన్ అయిన భూములను కూడా రెండో సారి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తిళ్ల కారణంగానే ఇటీవల అనంతపురం నగరంలో ‘అస్రా’ కంటి అద్దాల షాపు రిజిస్ట్రేషన్ రెండో సారి జరిగినట్టు తెలిసింది. కదిరి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతా అడ్డగోలుగా.. కదిరిలో ముడుపులు లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదు. విచిత్రమేమంటే పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన మూడు మండలాలు కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. కానీ ఈ మూడు మండలాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పుట్టపర్తి ఎమ్మెల్యే చెప్పినట్టు జరగడం లేదు. కదిరి ఎమ్మెల్యే చెబితేనే పనవుతుందని అక్కడి టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధర్మవరం, శింగనమల నియోజకవర్గాల్లోనూ ఖరీదైన భూములైతే ప్రజాప్రతినిధుల చేయి తడిపాకే పనవుతోంది. లేదంటే సబ్రిజిస్ట్రార్ కొర్రీలేసి జాప్యం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగా సబ్రిజిస్ట్రార్లు కూడా వినియోగదారుల నుంచి పిండుకుంటున్నారు. దీంతోనే ఏడాదిలో ఒక్క సబ్ రిజిస్ట్రార్ అయినా ఏసీబీకి పట్టుబడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యేల ఒత్తిడి ఉన్నట్టు సబ్రిజిస్ట్రార్లు చెబుతుండడం గమనార్హం. చెప్పింది చెయ్యకపోతే బదిలీపై వెళ్లిపోతారంటూ ఎమ్మెల్యేల హెచ్చరికలు పెద్ద రిజిస్ట్రేషన్ వస్తే తమకు తెలియజేయాలని హుకుం ప్రతినెలా మామూళ్లివ్వాలని కొంతమంది ఎమ్మెల్యేల అల్టిమేటం విలవిలలాడుతున్న సబ్రిజిస్ట్రార్లు -
అవసరమైన మేరకే ఎరువులు వాడాలి
● కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కళ్యాణదుర్గం/ కళ్యాణదుర్గం రూరల్: అవసరమైన మేరకే పంటలకు రసాయన ఎరువులు ఉపయోగించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని డీసీఎంఎస్ ఎరువుల గోదామును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడారు. రైతు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బయటి మార్కెట్ కంటే డీసీఎంఎస్లో ఎరువులు తక్కువ ధరతో లభిస్తాయని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీతో అంది స్తున్న ఎరువులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి సాగును అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్కుమార్ కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లిలో జవహర్ నవోదయ విద్యాలయం కోసం భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఆర్డీఓ వసంత్బాబు తదితరులు పాల్గొన్నారు. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇంజి నీరింగ్ కళాశాల క్యాంపస్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్ను బుధవారం సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ హబ్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య, పలు ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యూజీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కేసీ సత్యలత ఓ ప్రకటన విడుదల చేశారు.బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 26 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే డివిజన్ను అభివృద్ధి పట్టాలపై నడుపుదాం గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్ను అభి వృద్ధి పట్టాలపై నడపడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాతో కలిసి గుంతకల్లు రైల్వే డివిజన్లో సుడిగాలి పర్యటన చేశారు. రేణిగుంట–గుంతకల్లు సెక్షన్లో ప్రత్యేక రైలులో పర్యటిస్తూ తనిఖీ చేశారు. సాయంత్రం స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో రివ్యూ మీటింగ్లో జీఎం మాట్లాడారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వేడి పాలు ముక్కులో పడి చిన్నారి మృతి గుత్తి: వేడి పాలు ముక్కులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన పట్టణంలో విషాదం నింపింది. వివరాలు.. స్థానిక కోట వీధిలో నివసిస్తున్న ప్రతాప్ రెడ్డి, మేనక దంపతులకు ఇద్దరు మగపిల్లలు (కవలలు) సంతానం. కుమారులను తల్లిదండ్రులు ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నారు. బుధవారం ఇంట్లో పెద్ద కుమారుడు (15 నెలలు) శర్విల్ రెడ్డి గిన్నెలో ఉన్న వేడి పాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వేడి పాలు చిన్నారి ముక్కు, నోట్లో పడ్డాయి. దీంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న శర్విల్ రెడ్డిని వెంటనే తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక చిన్నారి మృతి చెందాడు. బిడ్డ మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
టోకెన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారా?
● యూరియా పంపిణీలో అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం ● డీసీఎంఎస్ కార్యాలయానికి తాళాలు వేసి ధర్నా అనంతపురం డీసీఎంఎస్ కార్యాలయ ప్రధాన గేటు మూసివేసి ధర్నా చేస్తున్న రైతులుఒక్క బస్తా యూరియా అయినా ఇవ్వండి సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న మహిళా రైతు ఓబుళమ్మ... నిస్సహాయ స్థితిలో అధికారిఅనంతపురం అగ్రికల్చర్: యూరియా కోసం టోకెన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారా అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం బుధవారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. అయితే, అధికారులు మాత్రం స్టాకు లేదంటూ చేతులెత్తేశారు. కనీసం ఒక బస్తా యూరియా అయినా ఇవ్వాలని అనంతపురం రూరల్ మండలం కామారుపల్లికి చెందిన మహిళా రైతు ఓబుళమ్మ కన్నీళ్లు పెట్టుకున్నా స్టాకు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కడుపు మండిన రైతులు నిరసనకు దిగారు. ఎరువులు అమ్మే ఇంత పెద్ద ఆఫీసుకే యూరియా తెప్పించకపోవడమేమిటంటూ బీఎం విజయభాస్కర్, ఏబీఎం సత్యనారాయణరెడ్డి, ఏఓ సుధాకర్రెడ్డిని నిలదీశారు. అధికారులు, సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతరం ప్రధాన గేటు ముందు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి వెంకటకుమార్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. టోకెన్లు ఇచ్చిన వారికి యూరియా ఇస్తామని, గురువారం నుంచి ఎక్కడిక్కడ రైతు సేవా కేంద్రాలకు యూరియా సరఫరా అవుతున్నందున, ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. కలెక్టర్, జేడీఏ ఆదేశాల మేరకు మండలాల్లోనే ఒక ఆర్ఎస్కేకు యూరియా సరఫరా చేస్తారని, సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే యూరియా అందేలా చూస్తారన్నారు. అనంతపురం రూరల్కు సంబంధించి నారాయణపురంలో తీసుకోవచ్చన్నారు. దీంతో రెండు గంటల తర్వాత రైతులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. -
అంతర్ జిల్లా టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● నేటి నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు అనంతపురం ఎడ్యుకేషన్: ఒకే యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న భార్య,భర్తలు స్పౌజ్ కింద, అలాగే మ్యూచువల్ (పరస్పర బదిలీలు) బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు/హెడ్మాస్టర్ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా వివరాలు, బదిలీ కావాల్సిన జిల్లా వివరాలను డీఎస్సీ ఏపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఈ ప్రకారం కొత్త ప్రొఫార్మాలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపకూడదని స్పష్టం చేశారు. ఈ బదిలీలు జిల్లాల మధ్య మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు. ఒకే యాజమాన్యంలో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. 2025 జూలై 31 నాటికి కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పని చేస్తున్న వారు అదే యాజమాన్యంలో బదిలీకి అర్హులని పేర్కొన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల సమ్మతిపత్రం తప్పనిసరిగా జత చేయాలి. దరఖాస్తు ఇలా... లీప్యాప్ (ఆన్లైన్)లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని సంతకం చేసి సంబంధిత హెచ్ఎం/ఎంఈఓ/డీవైఈఓకు అందజేయాలి. ఆయా అధికారులు అన్ని సర్టిఫికెట్లు పరిశీలించి నిర్ధారణ చేసి డీఈఓకు నివేదించాలి. ఒకసారి మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలకు వెళ్లేటప్పుడు సీనియార్టీ కోల్పోతారు. అక్కడ చివరి ర్యాంకులో చేర్చుతారు. ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 నుంచి 25 వరకు హెచ్ఎంలు/ఎంఈఓలు/డీవైఈఓలు పరిశీలిస్తారు. 23 నుంచి 26 వరకు డీఈఓ కార్యాలయంలో పరిశీలిస్తారు. 27న పాఠశాల డైరెక్టర్కు నివేదిస్తారు. 28,29 తేదీల్లో డైరెక్టర్ కార్యాలయంలో పరిశీలించి నిర్ధారిస్తారు. 30న ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. -
చీనీలో సమగ్ర యాజమాన్యం
బుక్కరాయసముద్రం: చీనీ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని రైతులకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి తెలిపారు. గత ఏడాది టన్ను చీనీ ధర రూ. 90 లక్షలు నుంచి రూ.1.10 లక్షల వరకూ పలికింది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.25 వేలతో అమ్ముడుపోతోంది. ఈ నేపథ్యంలో చీనీ సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను ‘సాక్షి’కి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి వివరించారు. ● చీనీ సాగులో ప్రధానంగా మొక్క ఎంపిక చాలా ముఖ్యం. మొక్క ఎంపిక సరైనది కాకపోయినా, సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకపోయినా, విపరీతంగా రసాయనిక మందులు వినియోగించినా, సూక్ష్మ పోషకాలు లోపించినా, సరైన నీటి యాజమాన్యం లేకపోయినా వేరు కుళ్లు, బంక తెగుళ్లు, నల్ల మంగు తదితర చీడ పీడలు ఆశించే అవకాశముంది. ● రంగాపూర్ నిమ్మ వేరు మీద 15 సెంటీమీటర్ల ఎత్తులో అంటు కట్టి, చీడపీడలు ఆశించని 6 నెలల వయసున్న మొక్కలు ఆమోదం పొందిన నర్సరీ నుంచి సేకరించుకోవాలి. 1 మీటరు లోతు గుంత తీసి 20 కిలోల పశువుల ఎరువు, 100 గ్రాముల ట్రెకోడెర్మా విరిడి, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెట్, 100 గ్రాముల మిథైల్ ఫెరాథియాన్ కలిపి మొక్క నాటడానికి 15 రోజుల ముందు వేసి నీరు పెట్టాలి. నేల మట్టం నుంచి 15 సెంటీ మీటర్లు ఎత్తులో అంటు కలయిక భాగం ఉండేలా నాటుకోవాలి. ● నేలలో కర్బన శాతాన్ని పెంచడానికి 25 కిలోల జనుమును మొక్కల మధ్య అంతర పంటగా వేయాలి. 50 శాతం పూత వచ్చిన తరువాత జనుమును కలియ దున్నాలి. 25 శాతం పశువుల ఎరువు, 25 శాతం చెక్క, 50 శాతం సేంద్రీయ ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్ ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలి. కాయ పెరిగే సమయంలో వేసుకున్నట్లయితే మొక్కకు పోషకాలు పెరిగి మంచి దిగుబడి సాధించవచ్చు. 500 గ్రాముల యూరియా, 250 గ్రాముల మ్యారేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం ఎంతో మంచిది. ● లేత ఆకులు విచ్చుకున్న దశలో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు సూక్ష్మధాతు మిశ్రమాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. జింక్ సల్ఫేటు 500 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేటు 200 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేటు 200 గ్రాములు, బోరాన్ 100 గ్రాములు, యూరియా 1కిలో చొప్పున 100 లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పూత, పిందె దశలో ఉన్నప్పుడు వేర్లు ఉన్న ప్రాంతాన్ని కదిలించరాదు. డ్రిప్పు ద్వారా నీటి తడులను సక్రమంగా ఇవ్వాలి. 9 లీటర్ల నీటికి 2 మి.లీ. ప్లానాఫిక్స్ కలిపి పూత, పిందె దశలో పిచికారీ చేయాలి. ఒకవేళ తెగుళ్ల వలన పిందె రాలుతుంటే లీటరు నీటికి కార్బండజిమ్ 1 గ్రాము కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ● కాయ సైజు పెరగడానికి నిమ్మ కాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున పొటాషియం నైట్రేట్ 13.0.45 కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కాయలో నునుపుదనాన్ని పెంచడానికి లీటరు నీటికి 5 గ్రాముల సల్ఫేటు ఆఫ్ పొటాష్ కలిపి కాయ కోయడానికి నెల రోజుల ముందు పిచికారీ చేయాలి. -
నిధుల్లేక నిస్తేజం!
● ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు ● ఏడాదిగా కుంటుపడిన పల్లె పాలనరాయదుర్గం: నిధుల్లేక గ్రామ పంచాయతీలు నిస్తేజంలో పడ్డాయి. ఐదు నెలలుగా పైసా జమ కాకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల ఊసే లేకపోవడంతో సర్పంచులు పారిశుధ్య పనులకే పరిమితమవుతున్నారు. వీటికి సైతం సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎదురుచూపునకే పరిమితం జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఆగిపోయాయి. ఈ లెక్కన 577 పంచాయతీలకు రూ.30 కోట్లకు పైగా నిధులు జమకావాల్సి ఉంది. నిధులు జమకాక, పనులు చేపట్టక సర్పంచులు సతమతమవుతున్నారు. 90 శాతం గ్రామ పంచాయతీలకు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచులుగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగునా సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నీ పంచాయతీల్లోనూ కూటమి నాయకులే అధిపత్యం చెలాయిస్తుండడంతో సొంతంగా ఏ పని చేయలేని దుస్థితిలో ఉంటున్నారు. పన్నులపైనే ఆధారం గ్రామ జనాభా ఆధారంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి నెలా ఎస్ఎఫ్సీ నిధులతో పాటు మూడు నెలలకోసారి 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం సమకూరుస్తూ ఉంటుంది. జిల్లాలోని 577 గ్రామ పంచాయతీల్లో 3.90 లక్షల గృహాలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి పథకాల మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్ నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తదితరాల ఖర్చులు పంచాయతీలే భరిస్తున్నాయి. అయితే 15 ఆర్థిక సంఘం నిధులు అందక ఇంటి పన్ను, కొళాయి పన్నులపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.18.8 కోట్లు ఇంటి పన్ను లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ రూ.15.3 కోట్లు వసూలైంది. మరో రూ.3.5 కోట్లు వసూలు కావాల్సి ఉంది. తాండవిస్తున్న పారిశుధ్యం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో అపరిశుభ్రత పేరుకుపోతోంది. తడి ఆరక వీధులన్నీ బురదమయంగా మారాయి. కాలు ఎక్కడ పెట్టాలో తెలియని స్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఖజనాలో డబ్బుల్లేక సర్పంచులు సొంత డబ్బును వెచ్చించాల్సి వస్తోంది. -
●సర్వజనం.. వేదనాభరితం
వైకల్య ధ్రువీకరణ కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వేచి ఉన్న దివ్యాంగులు దివ్యాంగుల పింఛన్లు ఆగిపోయాయి.. చిన్న చిన్న కారణాలతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వేలల్లో లబ్ధిదారుల పింఛన్లను నిలుపుదల చేసే చర్యలకు కూటమి సర్కార్ తెరదీసింది. ఈ మేరకు నోటీసులు జారీ కావడంతో ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో తెలియక దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. తమ వైకల్యాన్ని ధ్రువీకరించుకునేందుకు జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాల కోర్చి బుధవారం సర్వజనాస్పత్రికి పరుగున చేరుకున్నారు. దీంతో సర్వజనాస్పత్రిలో వేదనాభరిత దృశ్యాలు చూపరుల హృదయాలను కదిలించాయి. సీఎం చంద్రబాబు ఏ పని చేసినా దానికో లెక్క... ఆ లెక్కలో పక్కాగా మోసం, కుట్ర దాగి ఉంటుందనేందుకు దివ్యాంగ పింఛన్ల తొలగింపే నిదర్శనం. – సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం -
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దండి
పుట్టపర్తి అర్బన్: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సీఈఓ వాకాటి కరుణ ఆదేశించారు. వెలుగు కార్యాక్రమాలపై బుధవారం పుట్టపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా వెలుగు సిబ్బందితో ఆమె సమీక్షించారు. మహిళా సాధికారతకు కృషి చేయాలని, మహిళా సంఘాల్లో లెక్కల్లో కచ్చితత్వం ఉండేలా కృషి చేయాలని సూచించారు. మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ తో పాటు ఇతర రుణాలు అందించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఉన్నతి హెచ్డీ డైరెక్టర్ శివశంకరప్రసాద్, డీఆర్డీఏ పీడీలు నరసయ్య, శైలజ, ఉమ్మడి జిల్లా డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శాంతి భవన్లో కలెక్టర్ చేతన్ను కలసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. జిల్లా విషయాలపై సుమారు గంట పాటు చర్చించారు. వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి ● విద్యుత్ శాఖ సీఎండీ సంతోష్రావు అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగినప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతామని ఆ శాఖ సీఎండీ సంతోష్రావు అన్నారు. విద్యుత్ వినియోగదారులతో ఎలా మెలగాలనే అంశంపై జేఎన్టీయూ ఆడిటోరియంలో బుధవారం ఆ శాఖ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు సకాలంలో సేవలు అందించి వారి నుంచి రెవెన్యూ రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత వర్షకాలంలో వినియోగదారులు ఫోన్ చేసిన వెంటనే స్పందించి, విద్యుత్ అంతరాయం లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీఎం వరకుమార్, ఎస్ఈ శేషాద్రి శేఖర్తోపాటు పలువురు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాయలసీమ కవితా పోటీలు అనంతపురం కల్చరల్: రాయలసీమ సమాజం, జీవనం, సంస్కృతి నేపథ్యంగా దీర్ఘ కవితల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు నవంబరు 1వ తేదీలోపు తమ కవితలను పంపాలని కోరారు. విజేతకు రూ.15 వేల నగదు పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. పూర్తి వివరాలకు 99639 17187 లో సంప్రదించాలని కోరారు. -
కరిగిపోతున్న అక్కమాంబ కొండ
కళ్యాణదుర్గం రూరల్: పట్టణ శివారులోని అక్కమాంబ కొండపై టీడీపీ నేతల కన్ను పడింది. ఏకంగా కొండను తవ్వి ఎర్ర మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ మట్టిని డిమాండ్ను బట్టి రూ.3వేల నుంచి రూ.4వేలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా రాత్రి సమయంలో జోరుగా సాగుతోంది. టీడీపీ నేతలే అక్రమాలకు తెరలేపడంతో అటుగా అధికారులు సైతం కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా అక్కమాంబ కొండ కరిగిపోతోంది. దీనిపై తహసీల్దార్ భాస్కర్ను వివరణ కోరగా... ప్రభుత్వ స్థలాలు, కొండ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాక, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నూతన మూల్యాంకన విధానం వద్దు : ఏపీటీఎఫ్ అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్య పరీక్షల నిర్వహణలో తీసుకొచ్చిన నూతన మూల్యంకన విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మూల్యాంకన విధానం బోధన సమయాన్ని హరించేలా ఉందన్నారు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని ఉపసంహరించుకొని సాధారణ మూల్యాంకన విధానాన్నే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చాలామంది ఉపాధ్యాయులకు జూన్, జూలై మాసాల జీతాలు ఇప్పటికీ అందలేదని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. డీఈఓను కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాయల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్.సిరాజుద్దీన్, నాయకులు నరసింహులు, సర్దార్ వలి, వెంకటరమణ, వన్నప్ప, ఈజీ నాగభూషణం, రంగనాయకులు, పుల్లయ్య ఉన్నారు. ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు https://iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అనంతరం 27వ తేదీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్కు హాజరు కావాలి. 29న కౌన్సెలింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు పని వేళల్లో ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు. -
గిరిజనుడిపై టీడీపీ సానుభూతిపరుడి దాడి
ఉరవకొండ: మండలంలోని లత్తవరం తండాకు చెందిన వైఎస్సార్సీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు ప్రసాద్నాయక్పై అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు తులసీనాయక్ దాడి చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బుధవారం ఉదయం తన పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా ట్రాక్టర్పై వస్తున్న తులసీనాయక్ దారి ఇవ్వకుండా అడ్డంగా నిలిపి వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో తులసీనాయక్ రాయితో దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. -
అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: నగర శివారులోని కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ సత్యలత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి సమాచారానికి 86395 30636 లో సంప్రదించవచ్చు. యూరియా నిల్వలపై విస్తృత తనిఖీలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా యూరియా కొరత ఏర్పడటంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ వినోద్కుమార్ సీరియస్ అయ్యారు. ఎందుకు సమస్య ఉత్పన్నమైందో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖతో పాటు రెవెన్యూ, కార్మిక, పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్బోర్డు, పోలీసు తదితర శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు సాగిస్తున్నారు. వ్యవసాయానికి కాకుండా ఇతరత్రా వాటి తయారీ కోసం ఉపయోగిస్తున్నారా అనే కోణంలో పెయింట్ షాప్స్, డెయిరీలు, లూబ్రికెంట్స్, పీవీసీ పైపులు, సొల్యూషన్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే, జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు యూరియా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు ముందస్తుగా పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. మరికొందరు డీలర్లు ఎంఆర్పీకి మించి అమ్ముకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.క్షమాపణలు చెప్పాలిఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఏం జరిగింది?వార్ -2 రిలీజ్ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచ్ మోనాలిసాకు కలెక్టర్ అభినందన
అనంతపురం అర్బన్/వజ్రకరూరు: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘సర్పంచ్ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ అనే థీమ్తో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి జాతీస్థాయి పురస్కారానికి ఎంపికై న వజ్రకరూరు పంచాయతీ సర్పంచ్ ఎం.మోనాలిసాను కలెక్టర్ వినోద్కుమార్ అభినందనలు తెలిపారు. సర్పంచ్ను అభినందిస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సూర్యకుమారి లేఖ కలెక్టర్కు మంగళవారం అందింది. ఈ లేఖను మోనాలిసాకు ఎంపీడీఓ దామోదరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్ మోనాలిసా జాతీయస్థాయిలో ప్రశంసనీయమైన విజయాన్ని సాధించి జిల్లా కీర్తిని దేశవ్యాప్తం చేశారని అన్నారు. డైరెక్టర్ అభినందిస్తూ తన లేఖలో... నిరంతర మార్గదర్శకత్వం, సమన్వయం ద్వారా జిల్లా యంత్రాంగం గ్రామంలో బాలలకు అనుకూలమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషదాయకమైందని పేర్కొన్నారు. బాలల విద్య, బాల్య వివాహాల నివారణ, బాల కార్మికులు, బాల యాచక నిర్మూలనకు కృషి చేయడం అభినందనీయమన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి ఫిట్నెస్ కోసం యోగా కార్యక్రమాలు ప్రోత్సహించడం, మిషన్ వాత్సల్య లక్ష్యాలను చురుకుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు.అంబులెన్స్ డ్రైవర్ అజాగ్రత్త.. వ్యక్తి మృతి అనంతపురం: అంబులెన్స్ డ్రైవర్ అజాగ్రత్త ఓ ద్విచక్ర వాహన చోదకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని విద్యుత్ నగర్ రోడ్డులో ఉన్న పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్మకర్త ఆర్టీసీ విశ్రాంత డ్రైవర్ రేకునార్ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆలయానికి వెళ్లి రాత్రి 8.15 గంటలకు ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. విద్యుత్ నగర్ సర్కిల్లోని కుమార్ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే ఓ అంబులెన్స్ (ఏపీ39టీఎన్0767) డ్రైవర్ ఉన్నఫళంగా కుడివైపు డోర్ తీయడంతో అప్పటికే అత్యంత సమీపంలోకి చేరుకున్న వేణుగోపాల్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర రక్తస్రావమవుతున్న వేణుగోపాల్ను వెంటనే కుమార్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి వేణుగోపాల్ మృతి చెందాడు. తన భర్త మృతికి అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి భార్య నాగరత్నమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.‘డీఎస్సీ’ సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక బృందాలుఅనంతపురం ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీలో భాగంగా ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాకు ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులుంటారు. ఎంఈఓ/హెచ్ఎంలు, సాంకేతిక పరిజ్ఞానం కల్గిన ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హతల మార్కులు, లోకల్, నాన్ లోకల్ తదితర సర్టిఫికెట్లను వీరు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం విజయవాడలో ఒక రోజు శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబుతో పాటు పలువురు సిబ్బంది మూడు రోజులుగా అక్కడే మకాం వేసి జాబితా ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నేడో, రేపో తాత్కాలిక ఎంపిక జాబితా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.జైళ్ల శాఖ పెట్రోల్ బంకుల్లో అక్రమాలు● ధర్మవరంలోని పెట్రోల్ బంకులో రూ.20 లక్షల అవినీతి● అడ్డగోలు వ్యవహారంలో నలుగురి చేతివాటంసాక్షి, టాస్క్ఫోర్స్: జైళ్ల శాఖ కడప రేంజ్ డీఐజీ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో అవినీతి తవ్వేకొద్దీ బయట పడుతోంది. పలువురు సిబ్బంది బంకుల్లోని సొమ్ము కాజేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని పెట్రోల్ బంకు పరిధిలో అప్పటి డీఐజీ, అనంతపురం డీఎస్డీఓ, అక్కడ జైలర్గా పనిచేస్తూ బదిలీపై కడప కేంద్ర కారాగారానికి వచ్చిన మరో జైలర్, ధర్మవరంలో పనిచేస్తూ ప్రస్తుతం తాడిపత్రికి బదిలీపై వెళ్లిన డిప్యూటీ జైలర్ ఈ వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. సదరు డిప్యూటీ జైలర్ పెట్రోల్ బంకు నిర్వహణ ఛార్జ్ డీఎస్డీఓకు అప్పగించే క్రమంలో ఈ లొసుగులు బయటపడినట్లు తెలిసింది. రూ.20 లక్షల మేర పెట్రోల్ బంకు డబ్బులు, రూ.1.50 లక్షలు పీపీసీ (ప్రిజనర్స్ పార్టిసిపేషన్ క్యాష్) తక్కువగా ఉండడంతో డీఎస్డీఓ ఛార్జ్ తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ప్రస్తుతం వార్డర్లే పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. అప్పటి కీలక అధికారి పెద్ద మొత్తంలో డబ్బును తన అవసరాలకు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ అధికారి తీసుకున్న మొత్తం డబ్బు బంధువులు, వార్డర్స్ ఫోన్పేల రూపంలో చెల్లించినట్లు సమాచారం. డిప్యూటీ జైలర్ తాను చెల్లించాల్సిన డబ్బును చెల్లించకపోవడం, ఇతర కారణాలతో అప్పట్లో డిపార్ట్మెంట్ అతన్ని డిస్మిస్ చేసింది. ఆ డిప్యూటీ జైలర్ వాడుకున్న మొత్తాన్ని ఎవరు కట్టాలో.. దిక్కుతోచక ఒక కమిటీని నియమించి కడప రేంజ్ డీఐజీ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లిలోని పెట్రోల్ బంక్లోనూ రూ. 62 లక్షల మేరకు అవినీతి జరిగినట్లు గుర్తించారు. అవినీతికి పాల్పడిన వారిలో ప్రధానంగా కర్నూలు డీఎస్డీఓతో పాటు, డిప్యూటీ జైలర్, ఓ హెడ్ వార్డర్ ఉన్నట్లు తెలిసింది. అవినీతికి ఊతమిచ్చిన డీఎస్డీఓకు అడిషనల్ ఎస్పీ ర్యాంక్తో పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్దమైన తరుణంలో అక్రమాలు బయటపడడం గమనార్హం. -
డీడీఓగా నాగశివలీల
అనంతపురం సిటీ: అనంతపురం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీఓ)గా నాగశివలీల మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆమె 2007లో ఎంపీడీఓగా ఎంపికై కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పని చేశారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా సెర్ప్లో పని చేశారు. అక్కడి నుంచి మెప్మా, డీఆర్డీఏ పీడీగా కర్నూలు జిల్లాలో పని చేశారు. ఇప్పుడు బదిలీలపై అనంతపురం రెగ్యులర్ డీడీఓగా వచ్చారు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: తపాలా శాఖ ఆధ్వర్యంలో అందించే దీన దయాళ్ స్పర్శ యోజన స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తపాలా శాఖ సూపరింటెండెంట్ బి.లక్ష్మన్న మంగళవారం తెలిపారు. తపాలా సేవలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు వివరించారు. గడిచిన విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. స్కాలర్షిప్ ఎంపిక కోసం రెండు రకాల పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి రూ.6 వేలు చొప్పున స్కాలర్షిప్ అందిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వ్యక్తిగతంగా గానీ, స్కూల్ ప్రధానోపాధ్యాయుడి ద్వారా గానీ రూ.200తో అనంతపురం, గుంతకల్లులోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరచి, దరఖాస్తుకు జత చేసి సూపరింటెండెంట్, పోస్ట్, అనంతపురం– 515001 చిరునామాకు స్పీడ్పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు. సెలవులో జెడ్పీ సీఈఓ అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ) శివశంకర్ సెలవులో వెళ్లారు. 10 రోజుల సెలవు కావాలని ఆయన లెటర్ పెట్టగా.. వారం రోజులకు మాత్రమే కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఆ తరువాత ఆయన సెలవు పొడిగించుకునే అవకాశం ఉంటుందని జెడ్పీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, గత సీఈఓ రామచంద్రారెడ్డి పట్టుమని మూడు నెలలు తిరక్కనే ఆయనను టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి బలవంతంగా సాగనంపిన సంగతి దుమారం రేపింది. తరువాత శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో డ్వామా ఏపీడీగా పని చేస్తున్న శివశంకర్ను జెడ్పీ సీఈఓగా బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన రాకను ఓ ద్వితీయ శ్రేణి అధికారి జీర్ణించుకోలేక లోలోన పొగబెడుతుండడంతో చివరకు సెలవులో వెళ్లాల్సి వచ్చిందని జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ వస్తారో.. లేదో అనే విషయంపై చర్చ నడుస్తోంది. -
ఇద్దరు డాక్టర్లు, స్టాఫ్ నర్సుకు షోకాజ్ నోటీసు
గుత్తి: వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గుత్తి సీహెచ్సీ వైద్యులు ఎ.రమ్యశ్రీ, ఎన్.రమశ్రీతో పాటు స్టాఫ్ నర్సు రామాంజినమ్మకు ఆస్పత్రి సూపరిండెండెంట్ డాక్టర్ యల్లప్ప మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం మారెప్ప అనే రోగి జ్వరంతో ఆస్పత్రికి రాగా, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మారెప్ప మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఽఆందోళన చేశారు. ఈ క్రమంలో వైద్యులు, స్టాఫ్నర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్నారు. నీట్ పీజీ ఫలితాల్లో సత్తా చాటిన డాక్టర్ వరుణ్ కళ్యాణదుర్గం రూరల్: జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పీజీ–2025 పరీక్షల్లో కళ్యాణదుర్గం పట్టణ ప్రముఖుడు ఏసీ తిప్పేస్వామి మనవడు డాక్టర్ వరుణ్ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 3న నీట్ పీజీ 2025 పరీక్ష ఒకే షిఫ్ట్లో జరిగింది. దీని ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. మైసూర్లో ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ వరుణ్కుమార్... నీట్ పీజీ–2025 పరీక్షల్లో 650/800 మార్కులతో జాతీయ స్థాయిలో 290 ర్యాంక్ను దక్కించుకున్నారు. ప్రతిభ చాటిన డాక్టర్ వరుణ్కుమార్ను మిత్రులు, బంధువులు అభినందించారు. -
అంతర్ జిల్లా చైన్స్నాచర్ల అరెస్ట్
● రూ.4 లక్షల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం అనంతపురం: సులువుగా డబ్బు సంపాదించేందుకు బంగారు చైన్లను లాక్కొని ఉడాయిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం మూడో పట్టణ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శాంతిలాల్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడకు కంబం నాగార్జున అలియాస్ నాగార్జున రెడ్డి ఉరఫ్ చిన్నా, బోజనోల వరప్రసాద్ అలియాస్ ప్రసాదు ఇద్దరూ మంచి స్నేహితులు. బతుకు తెరువు కోసం నాగార్జున అనంతపురానికి వలస వచ్చి విజయనగర కాలనీలో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వరప్రసాద్ సైతం కదిరికి వలస వెళ్లి అక్కడి ఎరికల కాలనీలో నివాసముంటున్నాడు. నాగార్జునకు పేకాట, మద్యం సేవించడం, ఇతర చెడు వ్యసనాల కారణంగా అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో అప్పులు, వ్యసనాలు తీర్చుకునేందుకు చైన్స్నాచింగ్లకు పథకం రచించి, వరప్రసాద్ను అనంతపురానికి రప్పించుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలసి చైన్స్నాచింగ్లకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఏడాది జూన్ 21న నేషనల్ పార్క్ ఎదురుగా స్కూటీపై ఇద్దరు మహిళలను మోటార్ సైకిల్పై అనుసరిస్తూ స్కూటీ నడుపుతున్న ఆమెతో మాట కలిపి వెనుక చక్రంలో గాలి తగ్గిందని బుకాయించారు. వారి మాటలు నమ్మిన ఆమె స్కూటీని ఆపి వెనుక చక్రం వైపు తొంగి చూస్తుండగా ఆమె మెడలోని బంగారు మాంగల్యం చైన్ను లాక్కొని ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో మంగళవారం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 4లక్షలు విలువ చేసే 23 గ్రాముల బరువు కలిగిన బంగారు చైను, 1.5 గ్రాముల బరువులున్న ఒక బంగారు తాళిబొట్టు, ఒక బంగారు లక్ష్మీకాసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. -
యూరియా ‘నో స్టాక్’
● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం అనంతపురం అగ్రికల్చర్: యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదు. పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రస్థాయిలో వేధిస్తోంది. విస్తారంగా వర్షాలు పడటంతో వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు యూరియా వేసుకోవాల్సి ఉండటంతో దాని కోసం పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్ తగ్గట్టు సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో యూరియా లభించడం లేదు. ముందస్తు చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ విఫలం కావడంతో రైతుకు అవస్థలు అధికమయ్యాయి. యూరియా కోసం జిల్లాకేంద్రంలోని డీసీఎంఎస్కు మంగళవారం కూడా రైతులు ఎగబడ్డారు. పరిసర మండలాల నుంచి ఉదయం 8 గంటలకే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ యూరియా సరఫరా కాలేదని ‘నోస్టాక్’ బోర్డు పెట్టడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్రెడ్డి, పండ్లతోటల రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి తదితరులు డీసీఎంఎస్ వద్దకు చేరుకుని రైతులకు మద్ధతుగా డీసీఎంఎస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. డీసీఎంఎస్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూరల్ ఏఓ వెంకటకుమార్ చేరుకుని రైతులు, రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ దుకాణంలో ఉన్న 60 బస్తాలు యూరియా రెండు బస్తాలు చొప్పున రైతులకు పంపిణీ చేయించారు. యూరియా సమస్య వేధిస్తుండటంతో తమ పరిస్థితి దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘పచ్చ’ నేత గోదాములో యూరియా అన్లోడ్
కణేకల్లు: మండలంలోని బెణికల్లు గ్రామంలో ఓ లారీ యూరియా లోడ్ను టీడీపీ నేత రమేష్ గోదాములో అన్లోడ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రశ్నించిన రైతులపై ‘పచ్చ’ నేత రెచ్చిపోవడమే కాకుండా వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి చేశాడు. వివరాలు.. ఇటీవల బెణికల్లు హెచ్చెల్సీ ఆయకట్టులో వరినాట్ల ప్రక్రియ ఊపందుకుంది. యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం బెణికల్లు ఆర్ఎస్కేకు లారీలో యూరియా బస్తాలు పంపారు. వర్షం వచ్చి ఆర్ఎస్కే వద్ద గుంతలు పడటంతో లారీ ఇరుక్కుపోతుందని భావించిన వ్యవసాయశాఖ అధికారులు మరోచోట అన్లోడ్ చేయాలనుకొన్నారు. పాత గ్రామ పంచాయతీ కార్యాలయం అందుబాటులో ఉన్నా టీడీపీ నేత ప్రోద్బలంతో ఆయన గోదాములో యూరియా అన్లోడ్ చేయాలని నిర్ణయించి లారీని అక్కడికి పంపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు గోదాము వద్దకెళ్లి వీఏఏ శ్రావణితో వాగ్వాదానికి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఉండగా టీడీపీ నేత గోదాములో ఎలా అన్లోడ్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి ప్రశ్నించారు. దీని వెనుకున్న ఆంతర్యమేమిటని నిలదీశారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత రమేష్ రెచ్చిపోయాడు. ‘ప్రభుత్వం మాది.. మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం.. ఇష్టమొచ్చిన చోట దింపుతాం.. నీదేందిరా’ అంటూ సూర్యనారాయణపై దాడి చేశాడు. టీడీపీ వారికి పంపిణీ చేయాలనే.. తమకు అనుకూలంగా ఉన్నోళ్లకి యూరియా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకుడు తన గోదాములో అన్లోడ్ చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి, సంగప్ప ఆరోపించారు. ప్రయివేటు గోదాములో అన్లోడ్ చేయడం తప్పని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు తమ పార్టీకి అనుకూలురైన రైతులు అక్కడికెళ్లి యూరియా తీసుకోరనే విషయం తెలిసే తమ గోదాముల్లో దింపుకుంటున్నారన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా యూరియా పంపిణీ చేయాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విలేకర్లతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నేత రమేష్ గోదాములో యూరియా బస్తాలు అన్లోడ్ చేస్తున్న దృశ్యం ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ‘మా ప్రభుత్వం... మా ఇష్టం’ అంటూ రెచ్చిపోయిన ‘పచ్చ’ నేత వైఎస్సార్సీపీ నాయకుడు సూర్యనారాయణరెడ్డిపై దాడి -
అధికారులతో వాగ్వాదం
గుత్తి: అన్యాయంగా పెన్షన్లు రద్దు చేశారంటూ లబ్ధిదారులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 137 పెన్షన్లు రద్దయ్యాయి. మరో 17 పెన్షన్లు కన్వర్ట్ చేశారు. సాంకేతికంగా మొత్తం 154 పెన్షన్లు తొలగించారు. ఈ మేరకు నోటీసులు రావడంతో పలువురు లబ్ధిదారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఎందుకు తమ పెనన్లు రద్దు చేశారని మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వం ఆదేశాలు మాత్రమే తాము పాటిస్తామని అధికారులు చెప్పారు. తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో లబ్ధిదారులు ఆవేదనతో వెనుదిరిగారు. -
24న టీటీసీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) పరీక్షలు ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జి. వెంకటేష్ తెలిపారు. మూడు విడతలుగా పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 3.30 నుంచి 4.30 గంటల వరకు ఉంటాయన్నారు. మొదటి రోడ్డులోని నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. www.bse.ap.gov.in వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని సూచించారు. హాల్టికెట్తో పాటు పాన్/ఓటర్ ఐడీ/ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని తెలియజేశారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. జిల్లాకు 1,016 మెట్రిక్ టన్నుల ‘కాంప్లెక్స్’ అనంతపురం అగ్రికల్చర్: ఫ్యాక్ట్ కంపెనీకి చెందిన 1,016 మెట్రిక్ టన్నుల 20–20–0–13 రకం కాంప్లెక్స్ ఎరువులు మంగళవారం జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్పాయింట్లో వ్యాగన్ల ద్వారా వచ్చిన కాంప్లెక్స్ను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 826 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేసి, మిగతా 190 మెట్రిక్ టన్నులు కంపెనీ గోదాములో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్న్షిప్ క్రెడిట్ల కుదింపు.. లాంగ్వేజ్ల పొడిగింపు ● నేడు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ అనంతపురం: డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ బుధవారం జారీ కానుంది. సంప్రదాయ డిగ్రీ అడ్మిషన్లలో ప్రభుత్వం మార్పులు చేసింది. కళాశాలలో విద్యార్థి దరఖాస్తు సమర్పించే సమయంలో కచ్చితంగా ఆధార్ అథెంటిఫికేషన్ తీసుకోవాలని సూచించింది. ఎలా దరఖాస్తు చేసుకున్నప్పటికీ మెరిట్ ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తారు. ఒక్కో కోర్సులో 15 శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాలకు కేటాయిస్తారు. వీటిల్లో గ్రూప్–1(12 కులాలు)ఒక శాతం,గ్రూప్ 2 (18 కులాలు)కు 6.5 శాతం, గ్రూప్ 3 (29 కులాలు)కు 7.5 శాతం విభజించారు. తాజాగా ప్రతిపాదించిన మేజర్–కోర్ సబ్జెక్టుకు కేవలం 44 క్రెడిట్లు ఇచ్చారు. మేజర్ ఆప్షనల్కు 16 క్రెడిట్లు కేటాయించారు. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారం మూడేళ్ల డిగ్రీకి 126 క్రెడిట్లు నిర్దేశించారు. ఇందులో లాంగ్వేజెస్ను మూడో సెమిస్టర్ వరకు పొడిగించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో మార్కెట్ ఓరియెంటెడ్ విధానాన్ని అలవర్చే ఇంటర్న్షిప్ను తగ్గించారు. పేరుకు రెండు మేజర్ సబ్జెక్టులు చూపించినప్పటికీ అందులో ఒకటి ఆప్షనల్ కావడం, వాటికి కేవలం 16 క్రెడిట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇలా చేయడంతో పీజీ చేసుకునే అవకాశం ఉండదు. ఇక మేజర్ కోర్ సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్నే ఆప్షనల్ మేజర్గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ‘నక్ష’ను గడుపులోపు పూర్తి చేయాలి ● సీడీఎంఓ సంపత్కుమార్ అనంతపురం కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేషన్ (నక్ష)’ కార్యక్రమాన్ని 45 రోజుల్లో పూర్తి చేస్తే రూ.50 కోట్లు నగరపాలక సంస్థకు వస్తాయని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) సంపత్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థలో ఉమ్మడి జిల్లాల కమిషనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పక్కాగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నగరపాలక సంస్థ, మునిసిపాలిటీల్లో పన్నులపై సర్వే చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కాలువలకు మరమ్మతు చేయించాలన్నారు. సమావేశంలో కమిషనర్ బాలస్వామి పాల్గొన్నారు. కుక్కల బెడదకు పరిష్కారం చూపాలి నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, శునకాల బెడదకు పరిష్కారం చూపాలని మేయర్ వసీం డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్కుమార్కు విజ్ఞప్తి చేశారు. గతంలో కంపోస్టు యార్డులో కుక్కల బెడదకు స్టెరిలైజేషన్ చేశారన్నారు. అనంతరం సంపత్కుమార్ కంపోస్టు యార్డును పరిశీలించారు. మేయర్ వెంట కార్పొరేటర్లు ఇసాక్, కమల్భూషణ్, వైఎస్సార్ సీపీ నాయకులు చింతకుంట మధు తదితరులున్నారు. -
అధిష్టానం ముందు అరాచకాల చిట్టా
● టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన 40 మంది అనంత వాసులు ● ప్రజాప్రతినిధి వేధింపులపై ఆధారాలతో సహా ఫిర్యాదుఅనంతపురం క్రైం: ‘అనంత’లో టీడీపీ పరువు రోడ్డున పడింది. ప్రజా ప్రతినిధి ధనదాహం ఓ వైపు, తమ్ముళ్ల దౌర్జన్యాలు మరో వైపు... నామినేటెడ్ పోస్టుల పేరుతో డబ్బు వసూళ్ల నుంచి మద్యం దుకాణాల్లో మామూళ్లు.. పేదల బియ్యం కోటాలో వాటాలు... విలువైన భూముల్లో కంచె వేసి కబ్జా చేయడం లాంటి అనేక ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ముందు బాధితులు ఉంచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...అనంత ప్రజాప్రతినిధి దౌర్జన్యాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు వివరించారు. మంగళవారం సాయంత్రం 40 మంది బాధితులు విజయవాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జరిగిన అన్యాయాలపై ‘పల్లా’కు విన్నవించుకున్నారు. ప్రధానంగా అనంత నగర శివారులోని 210 సర్వే నంబరులో భూమి కబ్జాతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న అస్రా ఆప్టికల్స్కు సంబంధించి మైనార్టీ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆధారాలతో సహా ఆయన ముందుంచారు. స్థానిక ప్రజాప్రతినిధి స్వయంగా నగరంలో పార్టీకి చెందిన వారిని, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి బెదిరించాడని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధితోపాటు సన్నిహితుల వ్యవహార శైలితో నగరంలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. మద్యం దుకాణాల సిండికేట్ విషయం, అక్రమ వసూళ్ల దందాతో పాటు ఇతర వ్యవహారాల్లో ప్రజా ప్రతినిధి, అతని బంధువులు, కుటుంబ సభ్యులు, అనుంగులు చేసిన అకృత్యాలను ఆధారాలతో అందజేసినట్లు తెలుస్తోంది. ఆ ఆడియో సంచలనం: ‘అస్రా ఆప్టికల్స్’కు చెందిన మైనార్టీ కుటుంబాన్ని అత్యంత పరుష పదజాలంతో ప్రజా ప్రతినిధి దూషించిన ఆడియోని పల్లాకు వినిపించినట్లు తెలిసింది. ఈ ఆడియో విని షాక్ తిన్న ఆయన దాన్ని అక్కడే డిలీట్ చేయాలని కోరినట్లు సమాచారం. దారుణంగా మాట్లాడి... తమ ఆస్తులపై దాడులు చేసింది కాకుండా తమను ఒకానొక దశలో ఊరు కూడా వదిలిపోవాలని బెదిరించినట్లు వాపోయారు. కాగా బుధవారం నేరుగా పార్టీ అధినేతను బాధితులందరూ కలిసే అవకాశం కల్పిస్తానని చెప్పినా.. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సారథ్యమా? పార్టీ అధిష్టానం పిలుపుతో బాధితులు రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారా.. లేక మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సారథ్యంలో కలుస్తున్నారా... అన్నది తెలియరాలేదు. పార్టీలో చాలా కాలంగా పని చేసిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలతో కలసి చౌదరి పార్టీ అధిష్టానాన్ని కలిసినట్లు తెలిసింది. -
ప్రజలు నన్ను అడ్డుకుంటే ఇళ్లు రాసిస్తా
● తాడిపత్రికి వెళ్లాలంటే వీసా ఏమైనా కావాలా? : మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనంతపురం కార్పొరేషన్: ‘నేను తాడిపత్రికి వెళితే శాంతిభద్రతలకు విఘాతం కల్గుతుందని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. తాడిపత్రికి వెళ్లాలంటే ఏమైనా వీసా కావాల్నా..? నన్ను నిజంగా అక్కడి ప్రజలు రాకుండా అడ్డుకుంటే నా ఇళ్లు రాసిస్తా’ అని వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఉత్తర్వులున్నా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. వన్సైడ్ కేసులు ఎక్కడా నమోదు చేయలేదన్నారు.ప్రస్తుతం వైఎస్సార్ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దాడులు, అక్రమ కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనలతో పోలీసులు నమోదు చేస్తున్నారన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా తనను తాడిపత్రికి రాకుండా పోలీసులతో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. 700 మంది పోలీసులతో తనను ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం అని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. పోలీసుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఇంటెలిజెన్స్ సర్వే చేసుకుంటే తెలుస్తుందన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఉన్నాడా లేడా అన్న క్లారిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. నిజంగా తాను తప్పు చేసి ఉంటే విచారణ చేయాలన్నారు. అదేవిధంగా 420, గజదొంగ, అక్రమార్కుడైన జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ, సిట్తో విచారణ చేయిస్తే తాడిపత్రిని నాశనం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుస్తుందని ఆయన సూచించారు. ఇప్పటికీ ప్రభాకర్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నాడని విమర్శించారు. మారని పోలీసుల తీరు... సాక్షి టాస్క్ఫోర్స్: చట్టానికి లోబడి విధులు నిర్వహించాల్సిన పోలీసులు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సోమవారం హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాడిపత్రికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డగించిన విషయం విదితమే. మంగళవారం మరోమారు పుట్లూరు మండలం సూరేపల్లి వద్ద సీఐ సత్యబాబు సిబ్బందితో కలిసి మాజీ ఎమ్మెల్యేను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం వెళ్లిపోయారు. తాడిపత్రిలో హైఅలర్ట్ తాడిపత్రిలో హైఅలర్ట్ నెలకొంది. పట్టణంలో మంగళవారం పోలీస్ బలగాలతో ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి కవాతు నిర్వహించారు. ఇరుపార్టీల నాయకుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాళ్లు రువ్వేందుకు ప్రయత్నిస్తే కాల్చిపారేస్తాం.. అల్లరి మూకలు రాళ్లు విసిరేందుకు ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని ఏఎస్పీ రోహిత్కుమార్చౌదరి హెచ్చరికలు జారీ చేశారు. కవాతు సందర్భంగా ఏఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని చూస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు హద్దు దాటి ముందుకు వచ్చినా, రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించినా టియర్గ్యాస్ ఉపయోగిస్తామన్నారు. లాఠీ చార్జ్ చేసేందుకూ వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. -
రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి.. పెద్దారెడ్డిని అడ్డుకుని..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన్ని బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓవరాక్షన్కు దిగారు. అడ్డంగా రోడ్డుకు జీపులు పెట్టి మరీ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. దమ్ముంటే పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటూ జేసీ ప్రభాకర్ సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. అయితే పెద్దారెడ్డి అడుగుపెట్టిన వెంటనే దాడులు చేయాలని జేసీ, ఆయన అనుచరులు ప్లాన్ వేశారని వైఎస్సార్సీపీ అంటోంది. ఉన్నత న్యాయస్థానం పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు అనుమతించినా.. పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై పార్టీ మండిపడుతోంది.తాడిపత్రి వెళ్లాలంటే.. వీసా కావాలా?: పెద్దారెడ్డిపోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి వెళ్లాలంటే.. వీసా కావాలా? అంటూ ప్రశ్నించారు. నాపై పోలీసుల ఆంక్షలు దుర్మార్గం. నేను ఎక్కడికెళ్లినా పోలీసులు వెంట పడుతున్నారు. జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభాకర్రెడ్డి చేతిలో పోలీసులు బందీ అయ్యారు. తాడిపత్రి అరాచకాలపై సిట్ విచారణ జరపాలి’’ అని పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
● వృద్ధుడి మృతదేహంతో గుత్తి సీహెచ్సీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన గుత్తి: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మారెప్ప మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గుత్తిలోని కమ్యూనిటీ వైద్యశాల ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలు.. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పెద్దవడుగూరు మండలం గుత్తి వెంకటాంపల్లి గ్రామానికి చెందిన మారెప్ప(60)ను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం గుత్తిలోని సీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో జ్వర తీవ్రత మరింత ఎక్కువైంది. విషయాన్ని వైద్యులకు తెలిపినా వారు సకాలంలో స్పందించలేదు. ఈ క్రమంలో సాయంత్రం మారెప్ప మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మారెప్ప మృతదేహంతో ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. ఆందోళనకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్ ప్రసాద్ మద్దతు పలికారు. సమాచారం తెలుసుకున్న అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు సురేష్, గౌతమ్, హెడ్ కానిస్టేబుల్ హనుమంతు తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి భార్య రామాంజినమ్మ, కుమారుడు ఓబులరాజు, కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చించారు. ఇక్కడికి రాకముందే మరో ఆస్పత్రిలో చికిత్స చేయించారని ఆస్పత్రి సూపరిండెండెంట్ డాక్టర్ యల్లప్ప తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమే మారెప్ప మృతికి కారణమంటూ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సరుకుల పంపిణీపై ఆరా తాడిపత్రి రూరల్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏ మేరకు సరుకులు పంపిణీ చేశారో వివరాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లను ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఆదేశించారు. కేంద్రాల వారీగా పంపిణీ వివరాలు ఇవ్వాలని అంగన్వాడీ సెక్టార్ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారాన్ని పోస్టు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సరుకుల పంపిణీలో నెలకొన్న గందరగోళంపై ఈ నెల 17న ‘అందని అంగన్వాడీ సరుకులు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు కార్యాచరణను చేపట్టారు. యాప్ల భారంతో ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు తమకు 2018లో ఇచ్చిన సెల్ఫోన్లను అధికారులకు తిరిగి ఇచ్చారు. సెల్ఫోన్లు లేకపోవడంతో ఎఫ్ఆర్ఎస్ ద్వారా లబ్దిదారులకు సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఈ పంపిణీపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అదేశాలు రాకపోవడంతో టీచర్లు సరుకుల పంపిణీ చేయలేదు. గుడ్లు, పాలు చెడిపోయే అవకాశం ఉండటంతో కొన్ని చోట్ల యూనియన్ నాయకుల సూచనల మేరకు సరుకుల పంపిణీ జరిగింది. ఉన్నతాధికారుల నుంచి సరుకుల పంపిణీపై అధికారికంగా ఎలాంటి అదేశాలు రాకపోయిన సరుకుల పంపిణీ చేశారన్న దానిపై జిల్లా అధికారులు సమాచార సేకరణలో పడ్డారు. ఐసీడీఎస్ పీడీ నాగమణి మాట్లాడుతూ... ఎఫ్ఆర్ఎస్ లేకుండా సరుకుల పంపిణీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్యులు అందలేదన్నారు. ఉత్తర్వులు వచ్చిన తరువాత పంపిణీపై ఆదేశాలిస్తామన్నారు. ఇప్పటికే పలుచోట్ల సరుకుల పంపిణీ చేశారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మా కష్టాలు తీర్చండి
● ‘పరిష్కార వేదిక’లో 550 వినతులు అనంతపురం అర్బన్: ‘మా కష్టాలు తీర్చండి’ అంటూ ‘పరిష్కార వేదిక’లో అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్కుమార్తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 550 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమక్షించారు. అర్జీదారుల సమస్యను తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● భూమి తక్కువ చేసి ఆన్లైన్లో చూపిస్తున్నారని శింగనమలకు చెందిన విక్రమ్కుమార్ ఫిర్యాదు చేశాడు. నరసాపురం గ్రామం సర్వే నంబరు 242–2సీలో 2.50 ఎకరాలు, 242–2బీలో 2.50 ఎకరాలు ఉందని, ఆన్లైన్లో మాత్రం నాలుగు ఎకరాలే నమోదు చేశారని వాపోయాడు. ● ఇంటి స్థలం ఇచ్చినట్లుగా పట్టాఫారం ఇచ్చారని, అయితే అఽధికారులు స్థలం చూపలేదని అనంత పురంలోని రహమత్ నగర్కు చెందిన ఉదయభాను ఫిర్యాదు చేసింది. ఇంటి స్థలం చూపించడంతో పాటు పక్కా గృహం మంజూరు చేసి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరింది. ● భర్త పింఛను తనకు ఇప్పించాలని బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన 75 ఏళ్ల బండి లక్ష్మక్క కోరింది. తన భర్త వెంకటరాముడుకు పింఛను వచ్చేదని, ఆయన రెండున్నరేళ్ల క్రితం మరణించాడని చెప్పింది. భర్త పింఛను ఇప్పించాలని ఏడాదిగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదంది. ఎవరూ లేని తనకు పింఛను వచ్చేలా చేసి ఆదుకోవాలని కలెక్టర్కు విన్నవించుకుంది. -
దగ్గుపాటీ.. బహిరంగ క్షమాపణ చెప్పు
గుత్తి: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. గుత్తిలో సోమవారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కదం తొక్కారు. పట్టణంలోని రాయల్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రపటాలను చెప్పుకాళ్లతో తొక్కిన అనంతరం కాల్చివేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు రాజు, మండల అధ్యక్షుడు సాదిక్, కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ను వ్యక్తిగతంగా తిట్టడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కారణమన్నారు. ముఖ్యంగా ప్రసాద్ గెలవడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కీలకపాత్ర పోషించారన్నారు. తామే ఓటు వేయకుంటే ఎక్కడుండేవాడివంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని, వారు తలచుకుంటే అనంతపురంలో కూడా దగ్గుపాటి తిరగలేడని హెచ్చరించారు. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పి తీరాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు రామ్మోహన్, అశోక్, మారేష్, నరేష్, మస్తాన్, అరవింద్, భాస్కర్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గంలో.. రాయదుర్గంటౌన్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్–2 విడుదల సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాయదుర్గంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక బళ్లారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తిప్పేస్వామి, వెంకటేశులు, ఓబలేశు, మలకన్న, పొంపాపతి పాల్గొన్నారు. గుత్తి, రాయదుర్గంలో కదం తొక్కిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే చిత్రపటాలను చెప్పు కాళ్లతో తొక్కి నిరసన -
మట్టి గణపతిని పూజించాలి
● కలెక్టర్ వినోద్కుమార్ పిలుపు అనంతపురం అర్బన్: వినాయక చతుర్థి సందర్భంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిక్షించాలని ప్రజలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మట్టి ప్రతిమలను పూజించి– పర్యావరణాన్ని పరిరక్షించాలి’ అనే పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్లి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకోవాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకూడదన్నారు. జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గించడం లేదా పూర్తిగా మానేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీరు పీవీ కిషోర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్హెచ్ పనులు వేగవంతం చేయాలి ● జాతీయ రహదారి 544–డీ పనులు వేగ వంతం చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి పనులపై సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. సోములదొడ్డి నుంచి ముచ్చుకోట వరకు 37 కిలోమీటర్లు, ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కిలోమీటర్లు జాతీయ రహదారి 544–డీ చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి పెండింగ్ ఉన్న భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ‘అప్రమత్తంగా ఉండండి’ అనంతపురం అర్బన్: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాల కింద, మైదానాల్లో ఉండకూడదన్నారు. సురక్షిత భవనాల్లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘ఆ జీఓ వెనుక కుట్ర’ అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించే జీఓ వెనుక కుట్ర దాగి ఉందని వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు ధ్వజమెత్తారు. జైల్లో ఖైదీలను కలిసే అవకాశం ఉంది కానీ పాఠశాలల్లో విద్యార్థులను కలిసే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం లేదని మంత్రి లోకేష్ రెడ్బుక్ పాలన అమలవుతోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే పాఠశాలల్లోకి ఎవరూ వెళ్లకూడదనే జీఓ తెచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యను నీరుగార్చడమే మంత్రి లోకేష్ లక్ష్యంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తోందన్నారు. నగర అధ్యక్షుడు కై లాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్బుక్ పాలనపై పెట్టిన దృష్టి పిల్లల బుక్కులపై పెట్టలేదన్నారు. జీఓ రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడు రేవంత్, నగర నాయకులు రాహుల్ రెడ్డి, ఆదిల్, అశోక్, నరేంద్రరెడ్డి, సిద్దిక్, రోహిత్, జిలాన్, సతీష్, నాగేంద్ర, సాయి, రవి, పూజ విగ్నేష్, బాబా, ఇమ్రాన్, సురేంద్ర, చరణ్ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేద్దాం
● గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్కుమార్ రాప్తాడు: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ఆధునిక వ్యవసాయ పధ్దతులకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్కుమార్ ఆదేశించారు. రాప్తాడు మండలం జి.కొత్తపల్లిలో ప్రకృతి వ్యవసాయ విధానంతో మహిళా రైతులు అనిత 4 ఎకరాల్లో సాగు చేసిన డ్రాగన్ ప్రూట్ పంట, లోకేశ్వరి సాగు చేసిన సీతా ఫలం, టమాట, అలసంద పంటలు, లక్ష్మీదేవి సాగు చేస్తున్న ఏటీఎం మోడల్ను సోమవారం ఆయన పరిశీలించారు. ఆనంతరం ఆయన గ్రామంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో ముఖాముఖీ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలకు పెట్టుబడి తక్కువగా ఉంటుందని, దిగుబడులు పెరుగుతున్నాయని రైతులు తెలిపారు. ఈ పంటలకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. అనిల్కుమార్ మాట్లాడుతూ.. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్న అభివృద్ది చెందిన దేశాలే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను, నాణ్యమైన దిగుబడులను సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఉత్తమమైనదన్నారు. ప్రతి రైతూ ఆర్థికంగా బలపడాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం ఒక్కటే మార్గమన్నారు. ఏటీఎం మోడల్తో రోజు వారీ ఆదాయాన్ని పొందవచ్చన్నారు. 18 సెంట్లలో 22 రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసిన లక్ష్మీదేవిని అభినందించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంటలను స్టాల్స్గా ఏర్పాటు చేయడంతో వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ రహేర్, సెర్ఫ్ సీఈఓ శ్రీరాములు నాయుడు, డీపీఎం లక్ష్మానాయక్, ఉన్నతి డైరెక్టర్ శివశంకర్, స్త్రినిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, డీఆర్డీఏ పీడీ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఎం సునీత, రైతులు పాల్గొన్నారు. సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధి బుక్కరాయసముద్రం: గ్రామీణ ప్రాంతాలలో సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ది సాధించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్కుమార్ అన్నారు. బీకేఎస్లోని వెలుగు కార్యాలయంలో సోమవారం ఆయన మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధించిన మహిళలను అభినందించారు. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహేర్, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధికి కూటమి సర్కార్ సహకారం పూర్తిగా కొరవడింది. కొన్నేళ్లుగా మితిమీరిన రాజకీయ జోక్యం వర్ధమాన క్రీడాకారుల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న కూటమి పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాల ప్రతినిధులు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగున పడిపోయింది. ఇద
అనంతపురం: క్రీడా కుసుమాలను వెలికితీయాలంటే క్షేత్ర స్థాయిలో యువతను ప్రోత్సహించాలి. మట్టిలో మాణిక్యాలకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచాలి. ఈ ఉద్దేశంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా కోచ్లనూ నియమించింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గిరిజన విద్యార్థుల క్రీడావకాశాలపై కోలుకోలేని దెబ్బ తీసింది. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు సైతం నిలిపి వేసి వర్ధమాన క్రీడాకారుల జీవితాలతో చెడుగుడు ఆడుకుంటోంది. నాడు రాణింపు.. గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో అల్లూరి జిల్లా అరకులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్కు అనుబంధంగా రాష్ట్రంలో ఆరు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేశారు. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట (బాలురు), భద్రగిరి (బాలికలు), తూర్పుగోదావరి జిల్లా ముసురుమిల్లి (బాలురు), ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం (పీజీటీ–బాలురు), నంద్యాల జిల్లా మహానంది (బాలికలు), అనంతపురం జిల్లా గొల్లలదొడ్డి (బాలురు)లో స్పోర్ట్స్ స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయి. గొల్లలదొడ్డిలోని స్పోర్ట్స్ స్కూల్లో అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 720 మంది బాల, బాలికలు ఆటల పోటీల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఈ స్పోర్ట్స్ స్కూళ్లు 2022లో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఈవెంట్కు ఒకరు చొప్పున మొత్తం 23 మంది కోచ్లను నియమించారు. క్రీడా పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అడ్మిషన్ కల్పించేవారు. దీంతో నాడు అనేక మంది గిరిజన విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో చేరి క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లోనూ రాణించారు. అడ్మిషన్లకు నిరాకరణ గిరిజన విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను కూటమి ప్రభుత్వం తొక్కి పెట్టింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తున్నా.. స్పోర్ట్స్ స్కూళ్లలో ఒక్క గిరిజన విద్యార్థికి కూడా అడ్మిషన్ ఇచ్చిన పాపాన పోలేదు. కోచ్లు ఉన్నప్పటికీ విద్యార్థుల అడ్మిషన్లు లేకపోవడంతో మొత్తం ఆరు స్పోర్ట్స్ స్కూళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వ తీరుపై గిరిజన సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించడకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు తమలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన చెందుతున్నారు. గిరిజన పిల్లలు క్రీడల్లో ఎదగకుండా ఈ ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టిందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. వెంటనే స్పోర్ట్స్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి, వారిని ఉన్నత స్థాయిలో చూసుకునే అవకాశమివ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. క్రీడల్లో గిరిజన విద్యార్థులు రాణించకుండా సర్కార్ అడ్డుపుల్ల అగమ్యగోచరంగా మారిన స్పోర్ట్స్ స్కూళ్ల పరిస్థితి -
పేద బతుకులతో ఆటలా?
● వైకల్యమున్నా తక్కువగా చూపి పింఛన్లు తొలగిస్తారా.. ● దివ్యాంగుల ఆవేదన ● రెవెన్యూభవన్ వద్ద ధర్నా అనంతపురం అర్బన్: రీ వెరిఫికేషన్ పేరిట వైకల్యం తక్కువగా చూపించి పేద బతుకులతో ఆటలాడడం న్యాయమా అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను పునరుద్ధరించాలంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్ వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్, కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లకు పైగా పింఛను తీసుకుంటున్న దివ్యాంగులనూ రీ–వెరిఫికేషన్ పేరుతో తొలగించారన్నారు. వైద్యులు ఉద్దేశపూర్వకంగా వైకల్యం తక్కువ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దివ్యాంగులకు ఈ నెలలో తొలగించిన పింఛన్లు తక్షణం పునరుద్ధరించాలన్నారు. ఇకపై దివ్యాంగులకు ఏ కారణంగానూ పింఛను తొలగించకూదని డిమాండ్ చేశారు. అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుధాకర్, కార్యదర్శి రామయ్య, తదితరులు పాల్గొన్నారు. ఎలా బతకాలి? రెండేళ్లుగా పింఛను తీసుకుంటున్నా. ఇప్పుడు వైక్యలం తక్కువగా ఉందంటూ పింఛను తొలగిస్తే ఎలా బతకాలి. పింఛను డబ్బుతో మందులు కొనుక్కునేవాడిని. పెన్షన్ రాకపోతే మందుల కోసం డబ్బులు ఎవరిని అడుక్కోవాలి. – రామలింగ, గోళ్ల గ్రామం, కళ్యాణదుర్గం మండలం 84 శాతం వైకల్యాన్ని 40 శాతం చూపారు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న మా కుమారుడు రవితేజకు వచ్చేనెల నుంచి పింఛను నిలిపివేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. రవితేజకు ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి పింఛను వస్తోంది. ఇప్పుడు 22 సంవత్సరాలు. 84 శాతం వైకల్యం ఉంటే రీ వెరిఫికేషన్లో 40 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. – కదిరప్ప, రమాదేవి, మరూరు గ్రామం, రాప్తాడు మండలం -
యువకుడి ఆత్మహత్య
అనంతపురం: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మద్దినేని మనోహర్ నాయుడు, రమణమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ప్రకాష్చౌదరి (22) నర్సరీ నుంచి పదో తరగతి వరకు అనంతపురంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివాడు. అనంతరం గుంటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ మానేశాడు. ఇరవై రోజుల క్రితం అనంతపురానికి వచ్చి తన స్నేహితులతో కలసి ఆదర్శ నగర్లో అద్దె గదిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సోమవారం తెల్లవారు జామున గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున నిద్రలేచిన స్నేహితులు.. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న ప్రకాష్చౌదరిని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటినా అనంతపురానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, సేవా దృక్పథంతో కుమారుని నేత్రాలను తల్లిదండ్రులు దానం చేశారు. -
బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం: ఏపీ ప్రభుత్వం 2025–28 సంవత్సరానికి గాను జిల్లాలో 19 బార్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఉన్న బార్ల గడువు ముగిసిందని, వీటి స్థానంలో కొత్త బార్లు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 9, గుంతకల్లులో ఒకటి, తాడిపత్రిలో 4, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గంలో ఒక్కొక్కటి చొప్పున బార్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వేలం పద్ధతిలో కాకుండా, లక్కీ డ్రా ఆధారంగా కేటాయిస్తామన్నారు. నాన్ రీఫండబుల్ కింద దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. బార్ కేటాయిస్తే ఏడాదికి రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజు, రూ.10 వేలు ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు మొత్తాన్ని నిర్ధేశించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఈ నెల 26వ తేదీలోపు ఆన్లైన్ /హైబ్రిడ్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 28న కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహిస్తారన్నారు. -
తిరుమల వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు
తనకల్లు: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు, రెండు టూరిస్ట్ మినీబస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టూరిస్ట్ బస్సుల్లోని అనసూయమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మణికంఠ (41), నాగేంద్రప్ప (45), జాహ్నవి (4) చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా కర్ణాటక వాసులే. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్ మినీబస్సుల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం బళ్లారికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో మండ్లిపల్లి జాతీయ రహదారిపై ఉన్న మలుపు వద్ద కదిరి నుంచి మదనపల్లి వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు ఢీకొంది. ఆ వెనుకనే వస్తున్న మరో టూరిస్ట్ బస్సు ముందున్న టూరిస్ట్ బస్సును ఢీకొట్టింది. ఒకదానికొకటి బలంగా ఢీ కొనడంతో ముందున్న టూరిస్ట్ బస్సు నుజ్జనుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి జాహ్నవి, డ్రైవర్ మణికంఠ, నాగార్జున, కుమార్స్వామి, భార్గవి, రిత్విక, నాగేంద్రప్ప, గోవిందమ్మ, గోవిందప్ప, రాకేష్, చిన్నమ్మ, అంజినమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో ఉచితంగా అంబులెన్స్ సేవలు నిర్వహిస్తున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాధితుల్ని తమ అంబులెన్స్లో తనకల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన జాహ్నవి, నాగేంద్రప్ప, మణికంఠ, నాగార్జున, రిత్విక, భార్గవిలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో డ్రైవర్ మణికంఠ, నాగేంద్రప్ప, జాహ్నవి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వీరు మృతిచెందారు. తనకల్లు ఎస్ఐ గోపి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. మండ్లిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.మృతి చెందిన అనసూయమ్మ, తనకల్లు ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులు రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం మృతులు కర్ణాటక వాసులు మరో 9 మందికి గాయాలు ఢీకొన్న ఆర్టీసీ బస్సు, రెండు టూరిస్ట్ బస్సులు -
సౌత్జోన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీ విజేత చిత్తూరు
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ స్టేడియం వేదికగా ఈ నెల 11 నుంచి జరుగుతున్న సౌత్ జోన్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీ విజేతగా చిత్తూరు జిల్లా జట్టు నిలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. సోమవారం చిత్తూరు, కడప జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల నష్టానికి కడప జట్టు 101 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు కేవలం 17.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 101 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. చిత్తూరు 9 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చిత్తూరు జట్టు నిలవగా, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో కర్నూలు, నాల్గో స్థానంలో కడప, ఐదో స్థానంలో నెల్లూరు జట్లు నిలిచాయి. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి వి.భీమలింగారెడ్డి అందజేశారు. జేవీవీ జిల్లా కమిటీ ఎంపిక అనంతపురం కల్చరల్: శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) జిల్లా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ వెల్లడించారు.సోమవారం జేవీవీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా కన్నేపల్లి చిత్తప్ప, ఉపాధ్యక్షులుగా రామిరెడ్డి, శివానంద, శశికళ, ప్రసాదరెడ్డి, రాజన్న, నాగరత్న, ప్రధాన కార్యదర్శిగా కెంచాల వీర్రాజు, కార్యదర్శులుగా తిరుపాల్, తిప్పేస్వామి, రాఘవేంద్ర, సింఽహాద్రి, రంగనాథ్, రామచంద్రయ్య, కోశాధికారిగా మహమ్మద్ జిలాన్, గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రంగన్న, డాక్టర్ ప్రసూన, సాకే భాస్కర్, గౌరవ సలహాదారులుగా మల్లికార్జున, వీకే పద్మావతిను ఎంపిక చేసినట్లు వివరించారు. అలాగే సబ్ కమిటీల కన్వీనర్లలో వైద్య కమిటీకి లక్ష్మీనారాయణ, విద్యా కమిటీకి గాంగేనాయక్, సమతా కమిటీకి రాధాప్రసాద్, ఆడిట్కు శ్రీనివాసరావు, కల్చరల్ కమిటీకి వెంకచల రామిరెడ్డి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జేవీవీ భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలను ఆమోదించారు. బస్సులో ప్రయాణికుడి మృతి బుక్కరాయసముద్రం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బాబావలి (65) అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి సోమవారం ఉదయం కడప వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. బీకేఎస్ వద్దకు చేరుకోగానే సీటులో కూర్చొన్నట్టుగానే కిందకు వాలిపోయాడు. గమనించిన ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో బస్సును ఆపి డ్రైవర్, కండెక్టర్ పరిశీలించారు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా నిర్ధారించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. -
జీజీహెచ్ వైద్యం.. దైవాధీనం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో వైద్య సేవలు అడుగంటుతున్నాయి. అత్యవసర ప్రాంతాల్లో వైద్యులను నియమించకుండా అనవసర ప్రాంతాలకు కేటాయించడంతో రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు మౌలిక వసతులు లోపించడంతో రోగులకందే సేవల్లో నాణ్యత లోపిస్తోంది. ఒక్క రోగికి నలుగురు సీఎంఓలు ఈ నెల 11 నుంచి తలకు సంబంధించిన కేసులు నేరుగా అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లవచ్చునని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ప్రకటించారు. ఈ క్యాజువాలిటీకి ఏకంగా నలుగురు సీఎంఓలను ఏర్పాటు చేశారు. సరాసరి రోజుకు ఒకరిద్దరుకు మించి రోగులు ఉండడం లేదు. ఈ లెక్కన ఒక రోగికి నలుగురు సీఎంలు చికిత్స చేయాల్సి వస్తోంది. వాస్తవానికి సూపర్ స్పెషాలిటీలో క్యాజువాలిటీ ఏర్పాటుకు సౌకర్యాలు లేకపోయినా క్యాంటీన్కు కేటాయించిన గదిలోనే ఏర్పాటు చేశారు. అందులో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్, పల్స్ ఆక్సీమీటర్లు, వెంటిలేటర్లు, విద్యుత్ సరఫరా బోర్డులు, తదితర వాటిని ఏమీ లేవు. డీఎంఈ ఆదేశించారంటూ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ముందుచూపు లేకుండా సూపర్లో క్యాజువాలిటీ ఏర్పాటు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. జీజీహెచ్ క్యాజువాలిటీలో ఆరుగురు సీఎంఓలు సర్వజనాస్పత్రిలో క్యాజువాలిటీకి రోజూ మూడు షిప్టుల్లో 800 నుంచి వెయ్యి మంది వరకు రోగులు వస్తుంటారు. ఇలాంటి తరుణంలో పదుల సంఖ్యలో సీఎంఓల అవసరం ఉంటుంది. అయితే ఇటీవల క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే ఓ సీఎంఓను నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్కు నియమించారు. ప్రస్తుతం ఆరుగురు సీఎంఓలతోనే సర్వజనాస్పత్రిలోని క్యాజువాలిటీ నడుస్తోంది. గతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి నలుగురు సీఎంఓలు వివిధ స్పెషాలిటీ సేవల్లో ఓపీలకు వినియోగిస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం అనవసర ప్రాంతాల్లో వైద్యుల ఏర్పాటు సూపర్ స్పెషాలిటీ క్యాజువాలిటీలో ఒక్క రోగికి నలుగురు సీఎంఓలు జీజీహెచ్ ఎమర్జెన్సీలో 800 నుంచి వెయ్యి వరకూ ఓపీ సీఎంఓల కొరతతో జీజీహెచ్లో రోగులపై ప్రభావం నిబంధనలకు విరుద్ధంగా ‘సూపర్’ క్యాంటీన్లో క్యాజువాలిటీ ఏర్పాటు -
పీఏబీఆర్లో పెరుగుతున్న నీటి మట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం పెరుగుతోంది. ఇన్ఫ్లో పెరగడంతో 18 రోజులకే 2.17 టీఎంసీల నీరు చేరుకుంది. సోమవారం నాటికి రిజర్వాయర్లో 4.024 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణ తెలిపారు. సత్యసాయి, శ్రీరామరెడ్డి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీల రూపంలో రోజుకు దాదాపు 130 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందని వివరించారు. మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త అనంతపురం: మద్యంలో మత్తులో కట్టుకున్న ఇల్లాలి గొంతును భర్త కోశాడు. అనంతపురం రెండో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా ఓబులంపల్లి తండాకు చెందిన రవి నాయక్, భాగ్యబాయి దంపతులు ధర్మవరంలో కూలి పనులతో జీవనం సాగించేవారు. రవి నాయక్ తాగుడుకు బానిస కావడంతో భాగ్యబాయి 20 రోజుల క్రితం అనంతపురం లోని ఓబులదేవరనగర్లో మకాం మారి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం భాగ్యబాయి వద్దకు వచ్చిన రవినాయక్.. సోమవారం మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కత్తి తీసుకుని భాగ్య బాయి గొంతు కోసి పరారయ్యాడు. పొరుగింటి వారు తక్షణమే స్పందించి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భాగ్య బాయి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
జేసీ కోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం: పోలీసులు
అనంతపురం: తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందనే కారణంగానే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పడం గమనార్హం.తాజాగా డీఎస్పీ వెంకటేషులు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉంది. అందుకే నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు విన్నవిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో, జేసీ కోసమే పెద్దారెడ్డి అడ్డుకున్నట్టు పోలీసులు బహిరంగంగానే ప్రకంటించేశారు.మరోవైపు.. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా.. తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడం కాదు.. ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలి అంటూ హెచ్చరించారు. దీంతో, పెద్దారెడ్డి ఇంటిని కూల్చి ప్లాన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తాను. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వామా?. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు పనిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారు. నేను గతంలో ఫ్యాక్షనిజం చేయలేదు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.ఇక, తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఐదు వాహనాల్లో తాడిపత్రి వెళ్తున్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపించినా.. బారికేడ్లు పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాగా, 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాలయాపన చేసి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు పోలీసులే చేయడం గమనార్హం. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా నారాయణరెడ్డి పల్లిలో ఆరుగంటలుగా హైడ్రామా కొనసాగుతోంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డి పల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అయితే,తన స్వగ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు,కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డి పల్లికి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరట్ల మాధవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు.. తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. మరోవైపు.. తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు.వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు ఉదయం 10-11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 మాసాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంది. దీంతో, తాడిపత్రిలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు.తిమ్మంపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం. హైకోర్టు తీర్పు వల్లే 14 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను. హైకోర్టు ఆదేశాలు పోలీసులు పాటించాలి. పోలీసులపై నమ్మకం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయం పాటించాలి. నన్ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావద్దు. తాడిపత్రిలోని నా ఇంటి వద్ద 50-60 మంది మాత్రమే ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తాడిపత్రి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాను అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తాడిపత్రి పట్టణానికి రావాలని జేసీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిణామాల కారణంగా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం
ఉరవకొండ: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థ నాశనమైందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలతో పూర్తిగా భ్రష్టుపట్టిందని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి ధ్వజమెత్తారు. ఉరవకొండలోని గవిమఠం వెనుక ఉన్న సీవీవీ నగర్లో యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు రామప్పచౌదరి అధ్యక్షతన నిర్వహించిన విద్యాసదస్సులో గోపి మూర్తి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగంలో ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పడిపోయేలా చేశారన్నారు. రాష్ట్రంలో 9 రకాల పాఠశాలల నిర్వహణ లాంటి అశాస్త్రీయ కార్యక్రమాలతో తీవ్ర గందగోళానికి తెర లేపారన్నారు. రాష్ట్రంలో 4వేల పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు ఉన్నాయంటే ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టకుండా యోగా డే, మెగా పేరేంట్స్ డే అంటూ వారాల పాటు కార్యక్రమాలు నిర్వహించి ఫొటోలు తీయడం, ఆప్లోడ్ చేయడమే పనిగా ఉపాధ్యాయులను ఆదేశించడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్సీ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరావు, డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ.. యూటీఎఫ్ ఆవిర్భావం, విధివిధానాలను వివరించారు. యూటీఎఫ్ అలుపెరుగని పోరాటాల ఫలితంగా ఉపాధ్యాయ సమస్యలు విజయవంతంగా పరిష్కారమయ్యాయన్నారు. కార్యక్రమంలో వజ్రకరూరు ఎంఈఓలు ఎర్రిస్వామి, తిమ్మప్ప, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంజీవ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, అడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, పూర్వ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, విద్యావేత్త షాషావలి, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్న కూటమి సర్కార్ విద్యా సదస్సులో ఎమ్మెల్సీ గోపిమూర్తి ధ్వజం -
ఉచిత బస్సు.. తుస్సు
● సరిహద్దు గ్రామాల మహిళలకు నిరాశ ● గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రయోజనం శూన్యం బొమ్మనహాళ్: ఉచిత బస్సు ప్రయాణం గ్రామీణ ప్రాంత మహిళలకు వర్తించడం లేదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో లాంటి ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కర్ణాటక సరిహద్దున ఉన్న బొమ్మనహాళ్ మండలంలోని గ్రామాల మహిళలకు తీరని కలగానే మిగులుతోంది. బొమ్మనహాళ్, ఉద్దేహాళ్ గ్రామాల్లో ఉన్న బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కళ్యాణదుర్గంలో ఉన్న ఆర్డీటీ ఆస్పత్రికి రోజూ మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ మార్గంలో తిరిగే బస్సులన్నీ పొరుగున ఉన్న కర్ణాటకకు వెళ్లి వస్తుంటాయి. మండలంలోని గోనేహాళ్, క్రాస్ నుంచి బొమ్మనహాళ్కు వెళ్లాలంటే మహిళలు టికెట్ తీసుకోవాల్సిందేనని కండెక్టర్లు అంటున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసు బస్సులకు ఉచిత ప్రయాణం కల్పించలేదని స్పష్టం చేస్తున్నారు. బొమ్మనహాళ్ నుంచి కళ్యాణదుర్గం వెళ్లాలన్నా టికెట్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఉచిత బస్సు అంటూ కర్ణాటక ప్రాంత సరిహద్దున ఉన్న తమకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రత్యామ్నాయం.. ఇంకెంత ఆలస్యం!
అనంతపురం అగ్రికల్చర్: గతి తప్పిన వర్షాలతో ఖరీఫ్లో పంటల సాగు పడకేసింది. జూన్ 15 నుంచి ఆగస్టు 5 వరకు అంటే 55 రోజుల పాటు వరుణుడు మొహం చాటేయడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అడపాదడపా కురిసిన అరకొర వర్షాలకే రైతులు ఖరీఫ్ కింద పంటలు సాగు చేశారు. వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునే గడువు జూలై నెలాఖరుతోనే ముగిసింది. 3.42 లక్షల హెక్టార్లు అంచనా వేయగా.. సరైన వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతానికి 1.90 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు వెల్లడైంది. దీన్ని బట్టి ఇంకా 1.52 లక్షల హెక్టార్లు పంటలు లేక బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. కీలక సమయంలో వర్షాభావం.. పంటలు విత్తుకునేందుకు కీలక సమయమైన జూన్ ఒకటి నుంచి ఆగస్టు 5 వరకు అంటే దాదాపు 65 రోజుల్లో 130 మి.మీ గానూ 37 శాతం తక్కువగా 82.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా జూలైలో 64.3 మి.మీ గానూ కేవలం 34.7 మి.మీ వర్షం కురిసింది. దీంతో ఖరీఫ్ సాగుకు అవరోధంగా మారింది. అయితే ఆగస్టు 5 నుంచి... గత 12 రోజుల్లోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విరామం లేకుండా వర్షాలు పడుతుండటంతో ఒక్కసారిగా 37 శాతం లోటు నుంచి 40 శాతం అధిక వర్షపాతానికి చేరుకోవడం విశేషం. ‘ప్రత్యామ్నాయం’ చూపని కూటమి: ప్రధాన పంటల సాగుకు గడువు ముగిసిపోవడంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సి ఉంది. అయితే కూటమి సర్కారు ‘ప్రత్యామ్నాయం’ చూపే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి అసలు ప్రతిపాదనలు పంపకపోవడం చూస్తే రైతులకు విత్తనాలు ఇచ్చే ఆలోచన చంద్రబాబు సర్కారు లేదని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా, లేదంటే 80 శాతం రాయితీతో ఉలవ, పెసర, అలసంద లాంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు వీలుగా ఆగస్టు మూడో వారంలో విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ సారి అలాంటి సన్నాహకాలు లేకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. అదే జరిగితే ఈ సారి 1.50 లక్షల హెక్టార్లు క్రాప్ హాలిడే కింద చేరే పరిస్థితి నెలకొంది. ఏ పంట వేసుకోవాలో అర్థం కాక రైతులు అయోమయంలో ఉన్నా కూటమి సర్కారు కానీ, వ్యవసాయశాఖ కానీ నోరుమెదపడం లేదు. 13 మండలాల్లో మోస్తరు.. కేవలం 13 మండలాల్లో మోస్తరుగా పంటలు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ నివేదిక వెల్లడిస్తోంది. అందులో ఆశ్చర్యకరంగా వజ్రకరూరు మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 18,716 హెక్టార్లు కాగా ఇప్పటికే 125 శాతంతో ఏకంగా 23,335 హెక్టార్లలో పంటలు సాగు చేయడం విశేషం. ఆ తర్వాత గుంతకల్లులో 94 శాతంతో 17,050 హెక్టార్లు, కణేకల్లులో 73 శాతంతో 11,150, గుత్తిలో 71 శాతంతో 10,536, కళ్యాణదుర్గంలో 67 శాతంతో 11,298 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. పుట్లూరు, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, నార్పల, గుమ్మఘట్ట, గార్లదిన్నె, యల్లనూరు, విడపనకల్లు, తాడిపత్రి తదితర 10 మండలాల్లో 10 నుంచి 30 శాతం లోపు విస్తీర్ణంలో పంటలు వేయగా... ఇంకా పెద్ద ఎత్తున భూములు ఖాళీగా దర్శనమిస్తుండటం గమనార్హం. కంది మినహా... ఈ ఖరీఫ్లో కందిపంట మాత్రమే సాధారణం కన్నా ఎక్కువగా 132 శాతం విస్తీర్ణంలో సాగైంది. 55,296 హెక్టార్లకు గానూ 73,145 హెక్టార్లలో కంది వేశారు. ప్రధానపంటగా ఉన్న వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లకు గానూ 34 శాతంతో 61,186 హెక్టార్లకు పరిమితమైంది. మొక్కజొన్న 14,653 హెక్టార్లకు గానూ 13,670 హెక్టార్లు, పత్తి 44,001 హెక్టార్లకు గానూ 18,058, ఆముదం 16,293 హెక్టార్లకు గానూ 9,222, సజ్జ 3 వేల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. మిగతా పంటలు నామమాత్రంగా వేశారు. 1.50 లక్షల హెక్టార్లు బీడు భూములుగా దర్శనం గతితప్పిన వర్షాలతో ఖరీఫ్ పంటల సాగుకు అవరోధం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని కూటమి ప్రభుత్వం -
తాడిపత్రిలో ఉత్కంఠ
తాడిపత్రిటౌన్: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం తాడిపత్రికి వస్తున్న నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెల కొంది. ఆయన్ను అడ్డు కునేందుకు టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరతీయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్ట కుండా జేసీ ప్రభాకర్రెడ్డి అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. శాంతిభద్రతల పేరుతో పోలీసులను అడ్డుపెట్టి మాజీ ఎమ్మెల్యేకు అడ్డు తగులుతున్నారు. దీంతో పెద్దారెడ్డి పలుమార్లు కోర్టు మెట్లెక్కారు. పట్టణానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం సోమవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఆయనకు పోలీసులు తగిన భద్రత కల్పించాలని కూడా ఆదేశించడం గమనార్హం. అడ్డుకునేందుకు జేసీ కుయుక్తులు.. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తారని తెలుసుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి ఆయన్ను అడ్డుకోవడానికి మరోసారి కుయుక్తులకు తెరతీశారు. ఈ క్రమంలో ఏకంగా దేవుడి పేరుతో రాజకీయాలకు తెరలేపడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సోమవారం తాడిపత్రి– అనంతపురం ప్రధాన రహదారిలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద శివుడి విగ్రహావిష్కరణ ఉంటుందని, ఇందుకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు రావాలని జేసీ పిలుపునివ్వడం గమనార్హం. విగ్రహావిష్కరణ అనంతరం మరో కార్యక్రమానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వాట్సాప్ గ్రూపుల్లో జేసీ అనుచరులు ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తాడిపత్రివాసుల్లో భయాందోళన నెలకొంది. భారీ బందోబస్తు.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్ల పరిసరాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల కదలికలపై గట్టి నిఘా ఉంచారు. దాదాపు 400 మంది ప్రత్యేక పోలీస్ బలగాలతో పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. నేడు పట్టణానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకునేందుకు జేసీ కుయుక్తులు పోలీసుల భారీ బందోబస్తు -
పీకల్లోతు కష్టాల్లో రైతాంగం
అనంతపురం కార్పొరేషన్: అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతాంగం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందు నుంచి సీఎం చంద్రబాబు రైతు వ్యతిరేకి అని దుయ్యబట్టారు. ఆయన ఏనాడూ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన చేసిన పాపాన పోలేదన్నారు. దివంగత నేత వైఎస్సార్, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతోనే దేశంలోనే అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గుర్తింపు లభించిందని, హార్టికల్చర్లో ప్రథమ స్థానం దక్కిందని గుర్తు చేశారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతంగానూ నిలిచిందన్నారు. 22 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో అందులో 50 శాతం మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయని వాపోయారు. 19,466 హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి 6,069 హెక్టార్లకు, 1,719 హెక్టార్లలో సాగులోకి రావాల్సిన జొన్నలు కేవలం 199 హెక్టార్లకే పరిమితమయ్యాయన్నారు. చిరుధాన్యాల సాగు భారీగా పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం నాసిరకమైన వేరుశనగ విత్తనాలను పంపిణీ చేసి, విత్తనాలపై రైతులకు నమ్మకం పోయేలా చేసిందని విమర్శించారు. యాడికి మండలంలో రూ.2 కోట్ల విలువ చేసే పత్తి పంట దెబ్బతిందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. కియా పరిశ్రమను తెచ్చామని ఓ ప్రజాప్రతినిధి చెబుతున్నారని, అందులో ఉద్యోగాలన్నీ అనంతపురం జిల్లా ప్రజలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు విత్తనం వేసినప్పటి నుంచి విక్రయించే వరకూ చేయూత అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాలసీ కారణంగా యూరియా దొరకడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దారుణ పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయని తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోకపోతే పోరాటాలకు సంసిద్ధమవుతామని స్పష్టం చేశారు.సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రసాద్, బండ్ల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను ఆదుకోవాలనే ఆలోచన బాబుకు లేదు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ -
పదాలు అవసరం లేదు.. ఒక్క ఫొటో చాలు!
ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదులాడుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే నాటి స్మృతులు మనసులో మెదలుతాయి. సంతోషం.. బాధ.. మధుర ఘట్టాలు.. సాధించిన విజయాలు.. అద్భుత సన్నివేశాలు.. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఒక్క ఫొటోతోనే సాధ్యం. మనసులోని భావాలను పలికించడానికి.. ప్రకృతి అందాలను బంధించడానికి.. హృదయాంతరాల్లోని ఆర్ధ్రతను చూపించడానికి.. ప్రజల ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడానికి పదాలు అవసరం లేదు. ఒక్క చిత్రం చాలు. ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన లూయిస్ డాగురే జ్ఞాపకార్థం ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాలు మీకోసం.. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
బైక్ ఢీకొని బాలుడి మృతి
గుమ్మఘట్ట: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామానికి చెందిన వీరాంజనేయులు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆదివారం ఉదయం పెద్ద కుమారుడు కార్తీక్ (5)ను పిలుచుకుని రోడ్డు పక్కన ఉన్న తోటలోకి వెళ్లారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా.. కార్తీక్ రోడ్డుపైకి చేరుకున్నాడు. అదే సమయంలో రంగచేడు వైపు నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం వేగంగా వెళుతూ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహాన్ని హత్తుకుని గుండెలవిసేలా రోదించారు. ఘటనపై రాయదుర్గం రూరల్ పోలీసుల దర్యాప్తు చేపట్టారు. శతాధిక వృద్ధురాలి మృతి కూడేరు: మండలంలోని ఇప్పేరుకు చెందిన అచ్చుత బాలయ్య సతీమణి లక్ష్మీదేవమ్మ (102) కన్నుమూశారు. ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బెంగళూరులో కుమారుడి వద్ద ఉంటున్న ఆమె వయోభారంతో ఆదివారం మృతి చెందారు. -
హామీల అమలుకు పోరాటానికి సిద్ధం
● అంగన్వాడీలకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పిలుపు అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అంగన్వాడీ వర్కర్లకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి పిలుపునిచ్చారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం 8వ జిల్లా మహాసభ ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్లో జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షురాలు శంకుతల పాతక్క అధ్యక్షతన జరిగిన సభలకు ఓబుళు, శ్రీదేవితో పాటు ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, సంఘం ప్రధాన కార్యదర్శి రమాదేవి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాసభలో ఉద్యమ కార్యాచరణపై తీర్మానాలు చేశారు. వివాహితపై హత్యాయత్నం కేసులో భర్త అరెస్ట్ అనంతపురం: కట్టుకున్న భార్యనే చంపాలని ప్రయత్నం చేసిన భర్త కటకటాలపాలయ్యాడు. వివరాలను అనంతపురం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. అనంతపురం నగరంలోని పవర్ ఆఫీసు వెనుక అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్న ఖాజీ తస్లీమా నస్రీన్కు ఏడు నెలల క్రితం సంగమేష్ నగర్లోని బృహస్పతి పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కె.రోషన్ జమీర్ ఖాన్తో వివాహమైంది. వీరిద్దరిదీ రెండో వివాహమే. పెద్దల సమక్షంలో పెళ్లి చేసే సమయంలో తస్లీమా నస్రీన్ తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, 12 తులాల బంగారు, రూ.1.50 లక్షల విలువ చేసే ఫర్నీచర్ను ఇచ్చారు. వివాహం జరిగినప్పటి నుంచి రోషన్ జమీర్ , అతని తల్లి షమీమ్ భాను, చెల్లెలు నౌజియా సుల్తానా, ఆమె భర్త సలీం, మేనమామ సాదిక్ వలి అందరూ కలిసి మరో రూ.10 లక్షలు కట్నం కింద తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. ఇందుకు నస్రీన్ ఒప్పుకోకపోవడంతో ఈ నెల 15న మోతాదుకు మించి టాబ్లెట్లను నీటిలో కలిపి బలవంతంగా నస్రీన్ నోట్లోకి రోషన్ జమీర్ పోసి నోరు అదిమి పెట్టాడు. తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న నస్రీన్ను పొరుగింటి వారు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త రోషన్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. కంటైనర్ – కారు ఢీ కూడేరు: మండలంలోని శివరాంపేట గ్రామ సమీపంలో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై ఆదివారం కంటైనర్, కారు ఢీకొన్నాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న మహేష్ ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. విడపకల్లు మండలం గడేహోతురుకు చెందిన వీరు కారులో బెంగళూరుకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గుర్తు తెలియని మహిళ మృతిబత్తలపల్లి: స్థానిక శివాలయం వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సోమశేఖర్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మతిస్థిమితం సరిగా లేని సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ మహిళ నాగుల కట్ట మీద గత 20 రోజులుగా ఉండేది. చుట్టు పక్కల వారు ఆమెకు ఆహారం ఇచ్చి సౌకర్యాలు కల్పించేవారు. ఆదివారం ఉదయం ఆహారం ఇచ్చేందుకు వెళ్లినప్పుడు అచేతనంగా పడి ఉండడంతో సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96833 కు సమాచారం అందించాలని కోరారు. -
‘అనంత’లో మళ్లీ ‘ఉగ్ర’ అలజడి
అనంతపురం:ఉగ్రవాద కదలికలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భయాందోళనకు గురి చేస్తున్నాయిు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ చేస్తూ యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ధర్మవరం పట్టణానికి చెందిన కే. నూర్ మహమ్మద్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలకలం రేగింది. పౌరుల ముసుగులో ఉంటూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండడంతో ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అత్యంత పకడ్బందీగా ఐదు రోజుల కిందటే నూర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్, సిమ్కార్డులు, ఉగ్రవాద ప్రేరేపిత పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు ధర్మవరం పట్టణంలోనే ‘ఐ లవ్ పాకిస్తాన్’ అంటూ ఫోన్లో స్టేటస్ పెట్టుకున్న ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంత మందికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనుమానం రాకుండా.. మెట్రో సిటీల్లోనే ఉగ్రవాదులు ఎక్కువగా పాగా వేస్తారు. కానీ ఇందుకు భిన్నంగా ప్రస్తుతం బెంగళూరు మెట్రో సిటీకి దగ్గరలోని పట్టణాల్లోనూ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా హోటళ్లలో పనిచేసేవారు, ఆటో డ్రైవర్లు వంటి వారిని సులువుగా ముగ్గులో దింపుతున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద భావజాలం పట్ల ప్రేరేపించే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నూర్ మహమ్మద్ పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉండడం గమనార్హం. గతంలోనూ లింకులు.. 2024 మే 22న జిల్లాలోని రాయదుర్గంలో విశ్రాంత హెచ్ఎం అబ్దుల్ సాహెబ్ నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ను అదుపులో తీసుకుంది. సుహేల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ ఉండేవాడు. కొన్నిరోజుల క్రితమే హైదరాబాద్కు మకాం మార్చిన సుహేల్ తరచూ బెంగళూరు వెళ్లి వచ్చేవాడు. రామేశ్వరం కేఫ్లో బాంబు బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుడితో సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు.. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ ఆరా.. బెంగళూరు నగరానికి సమీపంలో ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి అనంతపురంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా నివాసం ఉంటున్న వారి స్థితిగతులను పరిశీలిస్తున్నారు. నూర్ మహమ్మద్తో వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసిన వారి వివరాలపై కూపీ లాగుతున్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులు అనంతపురం, రాయదుర్గం, కదిరి, ధర్మవరం, హిందూపురం పట్టణాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టిస్తున్న ఉగ్రవాదుల కదలికలు గత ఏడాది రాయదుర్గంలో ఉగ్రవాది జాడను గుర్తించిన ఎన్ఐఏ తాజాగా ధర్మవరంలో టెర్రరిస్ట్ నూర్ అహమ్మద్ అరెస్ట్ జిల్లాను ‘ఉగ్ర’ స్థావరంగా మార్చుకున్నారేమోనని సర్వత్రా అనుమానాలు -
వంట గ్యాస్ పక్కదారి
అనంతపురం అర్బన్: జిల్లాలో గృహావసర వంటగ్యాస్ పక్కదారి పడుతోంది. అక్రమ రీ ఫిల్లింగ్ దందా జోరుగా సాగుతోంది. వంటగ్యాస్ స్టవ్ల విక్రయాలు, రిపేర్లు, చిన్న సిలిండర్ల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఆ మాటున అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. కస్టమర్ అవసరాన్ని బట్టి కిలో గ్యాస్ ధర రూ.100 నుంచి రూ.150తో రీఫిల్ చేసి ఇస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ వ్యాపారం విలువ జిల్లాలో నెలసరిగా రూ.60 లక్షల పైగానే ఉంటోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమ దందాకు అడ్డుకట్టపడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి. బ్లాక్లో కొనుగోలు... ఫిల్లింగ్ దుకాణాల వ్యాపారులు గృహావసర వంటగ్యాస్ 14.2 కిలోల సిలిండర్ను డెలివరీ బాయ్స్ నుంచి బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. అలా కొన్న సిలిండర్ నుంచి గ్యాస్ను చిన్న సిలిండర్లకు కిలో రూ.100 నుంచి రూ.150 ధరతో నింపి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో అక్రమంగా వంటగ్యాస్ రీ–ఫిల్లింగ్ దందా సాగుతున్నప్పటికీ అధికారులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అదనంగా వసూళ్లు.. జిల్లాలో గృహాసవర వంటగ్యాస్ కనెక్షన్లు 7,65,246 ఉన్నాయి. ప్రతి రోజు 12,000 సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. వీటిలో ప్రతి రోజూ దాదాపు 1,000 సిలిండర్లు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డెలివరీ బాయ్లు రీ–ఫిల్లింగ్ దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లకు కూడా గృహావసర వంటగ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తూ బిల్ ధరపై బ్లాక్లో రూ.200 అదనంగా డెలివరీ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో సిలిండర్పై రూ.200గా వెయ్యి సిలిండర్లపై రోజువారీ అక్రమార్జన రూ.2 లక్షలుగా నెలసరి రూ.60 లక్షల బ్లాక్ దందా సాగుతోంది. ఏజెన్సీల్లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్లో కొందరు బహుళ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు సమాచారం. కొందరు బాయ్లు వారి పేరున, వారి కుటుంబ సభ్యుల పేరున కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. వాటి ద్వారా సిలిండర్లను పొందిన అనంతరం బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దుకాణాల్లో యథేచ్ఛగా రీ–ఫిల్లింగ్ దందా జిల్లాలో రోజూ 1,000 సిలిండర్ల అక్రమ డెలివరీ నెలసరి అక్రమ వ్యాపారం రూ.24 లక్షలు పైమాటే -
కమనీయం.. రథోత్సవం
బొమ్మనహాళ్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున 5.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు చేశారు. విశేష అలంకరణల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఉమ్మడి జిల్లా నుంచే కాక, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ముందే రోజే వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. భక్తులకు స్థానికులు సునీత, శివారెడ్డి ఆధ్వర్యంలో అన్న దానం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆంజినేయస్వామి ఉత్సవమూర్తిని రథంపైకి చేర్చి.. గోవింద నామ స్మరణతో భక్తులు ముందుకు లాగారు. రాత్రి 7 గంటలకు నిర్వహించిన లంకా దహనం కార్యక్రమం అలరించింది. పూజల్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఈఓ నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఏపీలో ‘ఉగ్ర’ కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా చెందిన ఓ వంట మనిషికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ జీవితం గడుపుతూ.. లోపల మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన వైనం తీవ్ర సంచలనం గా మారింది.ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ లోనికోట ఏరియాలో నివసిస్తున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా... టీ చేసే వ్యక్తిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చాలీచాలని జీతంతో అప్పులు చేసిన ఇతను... కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహామైన నూర్ మహ్మద్కు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు నూర్ మహ్మద్. తాడిపత్రికి చెందిన ఓ మహిళతో నూర్ మహ్మద్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.నూర్ మహ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన మహిళ అదృశ్యం అయ్యింది. ఆమెకు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయా? ఆమె ద్వారానే నూర్ మహ్మద్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరం ఉగ్రవాది నూర్ మహ్మద్ ఇంట్లో జిహాద్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మీడియాకు వివరాలు వెల్లడించారు.అరెస్ట్ అయిన నూర్ మహ్మద్పై దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. ఎన్ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో పూర్తి స్థాయిలో ధర్మవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. ధర్మవరంలో నూర్ మహమ్మద్తో పాటు మరో వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న వెల్లడించారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు.నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని.. పాక్కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. నిషేధిత వాట్సప్ గ్రూప్లు 6, పాక్కు చెందిన మరో 30 గ్రూపుల్లో నూర్ మహ్మద్ సభ్యుడిగా ఉన్నాడు’’ అని ఎస్పీ రత్న మీడియాకు వివరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ను బూతుల తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.ఎమ్మెల్యే ప్రసాద్, జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్రవాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వార్ -2 సినిమా ఆడదంటూ పదేపదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి.. ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని.. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. మేం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావ్ అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్లకు నచ్చదు.. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరూ చూడవద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకూం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి.. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. ఒక్కసారి గా రెచ్చిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని.. మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని.. బాక్సులు, స్క్రీన్లు కాల్చేయిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో భయపడ్డ.. దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ విడియో విడుదల చేశారు. అది ఫేక్ వీడియో అన్న ఎమ్మెల్యే.. తనకు నారా-నందమూరి కుటుంబాలపై గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.మరో వైపు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అలా చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలు చించి వేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని... ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు -
జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్గా మారింది.ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
రేపు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 18న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితి గురించి కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: మూడు రోజులు వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని 17,18వ తేదీల్లో తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి జంక్షన్లో రైలు (07097) ఆదివారం (నేడు) రాత్రి 9.10 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (07098) సోమవారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతి జంక్షన్ చేరుకుంటుందన్నారు. రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా రైలు ప్రయాణం సాగిస్తుందన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 15 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 15 మండలాల పరిధిలో 6.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు 52 మి.మీ, తాడిపత్రి 31.4, పెద్దవడుగూరు 29.6, యాడికి 19.2, విడపనకల్లు 16.2, గుత్తి 11.4, పామిడి 10.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 88.3 మి.మీ కాగా 145 మి.మీ వర్షం పడింది. ఓవరాల్గా జూన్ 1 నుంచి 165 మి.మీ గానూ 38 శాతం అధికంగా 228 మి.మీ నమోదైంది. 14 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. 23 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా, మరో 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తే చర్యలు ● డీఎస్పీ వెంకటేశ్వర్లు గార్లదిన్నె: అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ‘యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జంబులదిన్నె కొట్టాల వద్ద మట్టి తవ్వకాలు చేసిన ప్రభుత్వ గుట్టను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉంటేనే మట్టి తరలించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఎవరైనా మట్టి తరలిస్తే అధికారులకు సమా చారం అందించాలని కోరారు. అనంతరం గార్లదిన్నె పోలీస్ స్టేషన్ను డీఎస్పీ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మండలంలో క్రైమ్ రేట్ తగ్గించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సీట్లో కూర్చునే అర్హత ఉందా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘సూపర్సిక్స్ పథకాల ద్వారా మొదటి ఏడాదిలో ప్రజలకివ్వాల్సిన రూ.80 వేల కోట్లు ఎగురగొట్టావు. మద్యం పాలసీ ముసుగులో ఆదాయాన్ని పెంచుకునే పనిలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునైనా మద్యాన్ని కట్టడి చేయడంపై చంద్రబాబు మాట్లాడతారని ప్రజలంతా భావించారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి మద్యాన్ని నాణ్యతగా, సరసమైన ధరలకు అందిస్తామని చెప్పడం సిగ్గుచేటు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే బాబూ.. నీకు సీఎం సీట్లో కూర్చునే అర్హత ఉందా’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు తీరుపై ‘అనంత’ నిప్పులు చెరిగారు. ఐఏఎస్, ఐపీఎస్లు ప్రజాప్రతినిధుల చేతుల్లో కీలుబొమ్మలు కావడంతో దౌర్జన్యాలు, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయన్నారు. మద్యం గురించి ప్రస్తావించి యువతకు చంద్రబాబు ఎలాంటి సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి’, ‘నిరుద్యోగ భృతి’, 50 ఏళ్లకు పైబడి వారికి పింఛన్ ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుకు సంబంధించి కేవలం 7 రకాల సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పించారని, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ తరహాలో అమలు చేయలేదని దుయ్యబట్టారు. రైతన్నకు అడుగడుగునా అన్యాయం.. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి రైతాంగాన్ని చంద్రబాబు వంచించారన్నారు. గత ప్రభుత్వంలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు మేలు చేసేలా అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించి 86 లక్షల ఎకరాల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఇప్పటి వరకు 14 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు చెల్లించారని చెప్పారు.అతివృష్టి, అనావృష్టి కారణంగా వేరుశనగ, పత్తి, ఆముదం, కందులు వేసుకునే పరిస్థితి లేదని, కనీసం రైతులను ఆదుకునేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. రైతుల పట్ల కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నచూపు వైఖరి ప్రదర్శిస్తుండడం అన్యాయ మన్నారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎక్కడకు వెళ్తున్నాయో నిఘా ఉంచాలని, బస్తాపై అదనంగా రూ.50–రూ.100 వరకూ రైతుల నుంచి వసూలు చేస్తున్నారని, వీటిని అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తాము కలెక్టర్కు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. శ్రావణి మృతిపై విచారణ చేయాలి... జిల్లా కేంద్రంలో విద్యార్థి తన్మయి హత్యతో పాటు ఉమ్మడి జిల్లాలో మహిళలు, మైనర్లపై అఘాయిత్యాలు జరిగినా పోలీసు వ్యవస్థ ఏమాత్రం మేలుకోలేదని విమర్శించారు. తన్మయి విషయంలో ఆందోళన చేస్తే సీఐను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇలాంటి ఉదాసీనత కారణంగానే తాజాగా కళ్యాణదుర్గంలో గర్భిణీ శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. భర్త, అత్తామామలు, పోలీసులు, టీడీపీ నాయకులు తనను ఇబ్బందులకు గురి చేశారని, వారి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటానని ఓ నిండు గర్భిణీ చెప్పడం కలచివేస్తోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ను కలిసి తాము విన్నవిస్తే కళ్యాణదుర్గం పోలీసులే విచారణ చేస్తారని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఓ యువ ఐపీఎస్ ఇటువంటి సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం పోలీసుల కారణంగా ఇబ్బంది పడినట్లు గర్భిణీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ విషయంలో నిష్పాక్షికంగా విచారణ చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం పాలసీపై మాట్లాడతావా? ‘దుర్గం’లో గర్భిణి మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
బస్సులు కటకట.. లోపల కిటకిట
● కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు ● సర్వీసులు పెంచకపోవడంపై డ్రైవర్లలో ఆందోళనఅనంతపురం క్రైం: మహిళలతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిశాయి. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. బస్సుల్లో పరిమితి భారీగా పెరిగిపోయింది. దీంతో డ్రైవర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం నుంచి శనివారం మధ్యాహ్నం అనంతపురం వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో 118 మంది ప్రయాణికులు ఎక్కారు. ఓవరు లోడు కావడంతో సురక్షితంగా బస్సును తీసుకురావడానికి తలప్రాణం తోకకొచ్చినట్లయిందని బస్సు డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. టైరు పేలినా ప్రాణాలు గాలిలో కలసిపోతాయని వాపోయారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా ఉందని తెలిపారు. లేకుంటే ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటినీ భవిష్యత్లో గుజిరీకి వేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రత్యేకంగా సీట్లు పెట్టండి.. అనంతపురంలో ఓ వృద్ధుడు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ‘పురుషులకు మాత్రమే’ సీట్లు పెట్టించాలని కోరడం గమనార్హం. కనీసం బస్సుకు పది సీట్లైనా కేటాయించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశాడు. లేకుంటే డబ్బిచ్చి కూడా సీటు లేకుండా నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. వాటిలో వర్తించదంట.. జిల్లాకు కర్ణాటక సరిహద్దుగా ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించకపోవడం గమనార్హం. ప్రధానంగా జిల్లాలోని గుంతకల్లు–బళ్లారి, రాయదుర్గం– బళ్లారి, కణేకల్లు– బళ్లారి, కంబదూరు– పావగడ, పేరూరు–పావగడ, బళ్లారి– డీ హీరేహాళ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు స్వగ్రామమైన గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, ఉరవకొండ నుంచి రూపనగూడి, చీకలగుర్కి నుంచి బళ్లారికి వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో ఈ సమస్య బాగా కనిపిస్తోంది. దీంతో మహిళలు ఇంకెందుకు ‘సీ్త్ర శక్తి’ అంటూ వాపోతున్నారు. -
బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఏపీ బీడీ, సిగార్ కార్మికుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జి.ఓబుళు డిమాండ్ చేశారు. ఇందుకోసం అక్టోబరు నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శనివారం స్థానిక గణేనాయక్ భవన్లో సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ పి.ఇక్బాల్బాషా అధ్యక్షతన రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబుళు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాలు బీడీలు చుట్టడం, కట్టలు కట్టడం వంటి పనులు చేస్తున్నాయన్నారు. నిరంతరం పనులు చేస్తున్న కారణంగా క్షయ, వెన్నునొప్పి, ఇతర జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. వీరికి వైద్యం అందించేందుకు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ కంపెనీలు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నాయన్నారు. బీడీ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోందని, అయితే కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు అబ్దుల్ దేశాయ్, సుధాకర్, జీఎల్ నరసింహులు, జగన్, ఉమాగౌడ్ పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం ● ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఏపీజీఏ) లక్ష్యం అని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపీకృష్ణ, రామునాయక్ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని సంఘం కార్యాలయంలో ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని సంఘం ద్వారా తొలగించేందుకు కృషి చేశామన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగవర్గాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాకులు, పెన్షనర్లకు దాదాపు రూ. వేల కోట్ల ఆర్థిక బకాయిలున్నాయన్నారు. పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. సీపీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలు ఇంతవరకూ పరిష్కారం కాలేదన్నారు. పెండింగ్ బకాయిలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం మహిళా విభాగం సాంబశివమ్మ, సుజాత, నగర కమిటీ శ్రీనివాసులు, సుధాకర్, మౌలాసాబ్, నాగరాజు, ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. పలు సమస్యాత్మక గ్రామాలు, కాలనీల్లో శనివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించారు. గంజాయితో కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలపై నేరాలు, శక్తి యాప్, డయల్–100, సీసీ కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పాత కేసుల్లోని నిందితులతో సమావేశమై.. పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గంజాయి ముఠా అరెస్ట్ తాడిపత్రిటౌన్: గంజాయి ముఠాను తాడిపత్రి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 610 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివగంగాధర్రెడ్డి పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, వ్యవసాయాధికారులతో కలిసి స్థానిక చుక్కలూరు రోడ్డులో అనుమానాస్పదనంగా ఉన్న ఇద్దరు (ఓ వ్యక్తి– మైనర్ బాలుడు) వ్యక్తులను తనిఖీ చేయగా.. వారి వద్ద డ్రై గంజాయి లభించింది. దీంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు చెందిన శేషాద్రిని అరెస్టు చేసి.. 16 సంవత్సరాల బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. వీరు ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ జీవిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు తాడిపత్రి శివారు, నందలపాడు వంటి ప్రాంతాల్లో మూడుసార్లు గంజాయి విక్రయించినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. -
అప్రమత్తంగా వ్యవహరించాలి
● భద్రత చర్యలు మమ్మురం చేయాలి ● రైల్వే జీఎం సంజయ్కుమార్ గుంతకల్లు: ప్రసుత్త రుతుపవనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు భద్రతా చర్యలు మమ్మురం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ ఆదేశించారు. శనివారం జోనల్ పరిధిలోని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎం, ఏడీఆర్ఎం, డివిజన్ స్థాయి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ వర్షాకాలంలో ముంపునకు ఎక్కువగా గురయ్యే వంతెనలు, సొరంగాలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు వంటి ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. అక్కడ ఇసుక, బ్యాలస్ట్, సిమెంట్, బండరాళ్లు, పైపులు అందుబాటులో ఉన్నాయా? లేదా పరిశీలించుకోవాలన్నారు. స్టేషన్ యార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ, పంపింగ్, సున్నితమైన ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నిఘా పెట్టాలన్నారు. అంతేకాకుండా పెరిగిన చెట్ల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి తొలగించాలన్నారు. విపత్తు నిర్వహణ గదిని తనిఖీలు చేయడంతోపాటు 24 గంటలూ పర్యవేక్షణ చేయాలన్నారు. అవరోధాలు ఎదురై సమయాల్లో ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం అందించడానికి ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏ సమస్యనైనా వెంటనే పరిష్కరించేలా చూసుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నైపుణ్యం పట్ల మీ నిబద్ధతను చాటి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఏడీఆర్ఎం సుధాకర్, డివిజన్ స్థాయి ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
యాడికి కానిస్టేబుల్కు ‘చంద్రబోస్ ఐకాన్’ అవార్డు
● ఉత్తమ పోలీస్ అవార్డు సైతం.. యాడికి: అరుదైన పురాతన నాణేలు సేకరిస్తున్న వారిని ప్రోత్సహించేలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్కు చెందిన జీవన జాగృతి ఆర్గనైజేషన్ పురాతన నాణేల పరిశోధన సంస్థ అంద జేస్తున్న ‘సుభాష్ చంద్రబోస్ ఐకాన్’ అవార్డుకు యాడికి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు భగవాన్ ఎంపికయ్యారు. ఏటా ప్రయాగ్రాజ్కు చెందిన జీవన్ జాగృతి ఆర్గనైజేషన్ వారు తమ సంస్థ తరపున అవార్డును అందజేస్తుంటారు. ఈ ఏడాది ఎంపికై న వారిలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి విష్ణు భగవాన్ ఎంపిక కావడం గమనార్హం. ఈ మేరకు గురువారం ఆ సంస్థ నుంచి విష్ణు భగవాన్కు సందేశం అందింది. కానీ తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్ కుమార్చౌదరి ద్వారా నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్లో విధులు నిర్వహిస్తుండటంతో ఉత్తమ పోలీసు అవార్డు రావటంతో అనంతపురంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా ఎస్పీ జగదీష్ సమక్షంలో ‘ఉత్తమ పోలీస్’ అవార్డు అందుకున్నారు. దీంతో విష్ణుభగవాన్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అవార్డు కార్యక్రమానికి హాజరుకాలేనని వారికి సమాచారం అందజేశారు. దీంతో ఆ సంస్థ వారు పోస్టల్ ద్వారా అవార్డును చేరవేస్తామని విష్ణు భగవాన్కు తెలిపారు. అనంతపురంలో ఉత్తమ పోలీసు అవార్డు అందుకోవడం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరఫున ‘సుభాష్ చంద్రబోస్ ఐకాన్’ అవార్డు పొందిన యాడికి కానిస్టేబుల్ విష్ణు భగవాన్ను ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, యాడికి సీఐ ఈరన్న, ఎస్ఐ రమణ, పోలీసు సిబ్బంది శనివారం అభినందించారు. -
●గోకుల కృష్ణా..
ప్రత్యేక అలంకరణలో రాధాపార్థసారథివిద్యుద్దీపాలంకరణలో అనంతపురంలోని ఇస్కాన్ మందిరంజిల్లాలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు సందడిగా జరిగాయి. చిన్నికృష్ణులు, గోపికమ్మలు ఆకట్టుకున్నారు. తమ పిల్లలను తల్లిదండ్రులు అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. పలు గ్రామాల్లో కృష్ణ పరమాత్ముడి విగ్రహాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఉట్లోత్సవాలు సందడిగా సాగాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని అనంతపురంలోని ఇస్కాన్ మందిరం కిటకిటలాడింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
●కసాపురం.. భక్తజనసంద్రం
● నెట్టికంటుడి నామస్మరణతో మార్మోగిన ఆలయ పురవీధులు గుంతకల్లు రూరల్: శ్రావణ మాసం నాలుగో శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. స్వామి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. వేకువజామునే అభిషేకాలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని స్వర్ణ కవచ అలంకరణలో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఈఓ ఎం.విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్లను ఊరేగిస్తూ ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. -
అనంతపురం, కర్నూలు జట్ల విజయం
అనంతపురం: అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ సీనియర్ (ఉమెన్) అంతర జిల్లా టోర్నీలో అనంతపురం, కర్నూలు జట్లు విజయం సాధించాయి. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత నెల్లూరు జట్టు బ్యాటింగ్ చేసింది. 38.5 ఓవర్లలో 112 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. చంద్రిక మూడు వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 17.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. బి.నేహా 60 బంతుల్లో 56 పరుగుల (10 ఫోర్లు)తో నాటౌట్గా నిలిచింది. ఎస్.ఆశ్రియ 46 బంతుల్లో 45 పరుగులు చేసింది. వీరిద్దరి భాగస్వామ్యం గెలుపునకు బాటలు వేసింది. ఫలితంగా అనంతపురం జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ● కడప – కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కడప జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కడప జట్టు 49.3 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఎ.శిరీష 97 బంతుల్లో 94 పరుగులు (11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు ఐదు వికెట్లు నష్టపోయిన 196 పరుగులు చేసి విజయం సాధించింది. ఎం.అనూష 34 బంతుల్లో (9 ఫోర్లు) 51 పరుగులు, ఎస్వీ కుషల్యబాయి 98 బంతుల్లో 70 పరుగులు (12 ఫోర్లు) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రైలు పట్టాలపై మృతదేహం అనంతపురం సిటీ: అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటంపల్లి – ఖాదర్పేట మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి(40) మృతదేహాన్ని శనివారం ఉదయం కనుగొన్నట్లు జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మృతుడు రైలు కింద పడి మరణించి ఉంటాడని భావిస్తున్నామన్నారు. చంద్రిక (3 వికెట్లు) శిరీష (94 పరుగులు) -
అభాగ్యులకు అమ్మ భరోసా
తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు.. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న పేదలను చూస్తే ఆయన హృదయం కరిగిపోతుంది. ఊహించని ప్రమాదాలు.. అనారోగ్యాల బారినపడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న వారి గురించి తెలిస్తే చలించిపోతారు. పేదరికంతో కుటుంబాన్ని పోషించలేక పిల్లలను పస్తులుంచుతున్న దృశ్యాలు ఆయన్ను కదిలిస్తాయి. ఇలా ఎందరో అభాగ్యులను ‘అమ్మ’లా అక్కున చేర్చుకుని చేతనైన సహాయం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తరిమెల రమణారెడ్డి. ఆయన స్థాపించిన ‘అమ్మ’ సంస్థ సామాజిక సేవలో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. అభాగ్యుల జీవితాలకు భరోసా కల్పిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న రమణారెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం. ●విద్య, వైద్య సాయంతో పాటు కుటుంబాలకు చేయూత ●పాతికేళ్లు దాటిన ‘అమ్మ’ స్వచ్ఛంద సంస్థ సేవా ప్రస్థానం అనంతపురం కల్చరల్: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం కదిరిదేవరపల్లికి చెందిన ఆంజనేయులు, పుల్లమ్మ దంపతులు. వారి ముగ్గురు పిల్లలూ గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అందరికీ ఆపరేషన్లు అయితే తప్ప బతకడం సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు. అయితే వారికి అంతటి ఆర్థిక స్థితి లేదు. ఎక్కడా వారికి భరోసా కూడా దక్కలేదు. విషయం తెలిసిన ‘అమ్మ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తరిమెల రమణారెడ్డి ముందుకొచ్చారు. ఆపరేషన్లకు అవసరమైన రూ.8 లక్షలు అందించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. సాటి మనిషికి సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. ‘అమ్మ’ సంస్థకు అంకురార్పణ ఇలా.. రెండున్నర దశాబ్దాల కిందట ఆగస్టులో స్వాతంత్య్ర వేడుకలు సాగుతున్న వేళ అనంతపురానికి చెందిన తరిమెల రమణారెడ్డి స్నేహితురాలు ప్రమాదానికి గురైంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు ఆయనే రక్తదానం చేసి బతికించుకున్నారు. ఆ సందర్భంలో వారి కృతజ్ఞత, అవసరానికి ఆదుకునే మనుషుల అవసరాన్ని గుర్తించిన తరిమెల రమణారెడ్డి అనురాగానికి మారుపేరైన ‘అమ్మ’ పేరుతోనే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. తన సంపాదనలోనే కొంత భాగాన్ని సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారి గురించి, ప్రతిభ ఉండి ఉన్నత విద్యనభ్యసించలేకపోతున్న వారి గురించి తెలిసినా.. తన దృష్టికి వచ్చినా అలాంటి వారిని అక్కున చేర్చుకుని.. వారికి అవసరమైన సహాయ సహకారాలందించి వెన్నదన్నుగా నిలుస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనాథలు, నిస్సహాయ స్థితిలోని 65 మంది పేదింటి పిల్లల ఉన్నత విద్యకు, పేదరికంతో బాధపడుతున్న 220 మందికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చారు. పలువురికి స్వయం ఉపాధి కల్పించి గౌరవంగా బతికేలా చేయూతనందించారు. ఇక 142 మందికి వైద్యసాయం అందించి మానవత్వం చాటుకున్నారు. సామాజిక సేవకు ముందుకు రావాలి లోకంలో స్వార్థం పెరిగిపోతోంది. సొంత బంధువులకు కూడా సాయపడలేని స్థితికి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాటి మనిషికి సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ధనవంతులు, స్థితిమంతులు మానవతాదృక్పథంతో తమ సంపాదనలో కొంత సమాజానికి కేటాయించగలిగితే ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించింది మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే. నాకు ప్రసాదరెడ్డి, స్వరాజ్యలక్ష్మి దంపతులు జన్మనిస్తే, రంగనాయకమ్మ, కుళ్లాయిరెడ్డి దంపతులు మరో జీవితం ప్రసాదించారు. భార్య లక్ష్మి, కొడుకు సాయి సిద్ధార్ధరెడ్డి ప్రోత్సాహంతో నేను ‘అమ్మ’ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నడపగలుగుతున్నాను. – తరిమెల రమణారెడ్డి, వ్యవస్థాపకుడు, అమ్మ సంస్థ -
‘పల్లె’కు అధికారుల జీ హుజూర్!
ప్రశాంతి నిలయం: ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. తెలుగుదేశం పార్టీ నేత. అయినా అధికారిక కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి..? అధికారం మాది.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా కలెక్టరేట్లో కలెక్టర్ సీటులోనే కూర్చుని టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు కూడా ఆయనకు అడ్డు చెప్పకుండా ‘జీ హుజూర్’ అంటూ మిన్నకుండిపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఎలాంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ పాల్గొంటున్నారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఏకంగా కలెక్టర్ కుర్చీలో ఆశీనుడై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇంత జరుగుతున్నా కలెక్టరేట్ అధికారులు అడ్డుచెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్ను పార్టీ కార్యాలయంగా మార్చేస్తూ సమావేశం నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎమ్మెల్యే ఉన్నా.. అన్నీ తానై.. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అధికారుల బదిలీలు, నియామకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆయనే ముందుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్యేకు బదులు తానే హాజరవుతున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి విమర్శలు వచ్చినా లెక్క చేయడం లేదు. తన కోడలికి ఏమీ తెలియదని, అందుకే తాను ముందుండి నడిపిస్తున్నానని చెప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో టీడీపీ నేతలతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమీక్ష ఏకంగా కలెక్టర్ కుర్చీలో కూర్చున్న వైనం అడ్డు చెప్పని కలెక్టరేట్ అధికారులు -
అందని అంగన్వాడీ సరుకులు
తాడిపత్రి రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ప్రతి నెలా మొదటి వారంలోనే పంపిణీ కావాల్సిన సరుకులు ఈ సారి రెండో వారం దాటినా లబ్ధిదారులకు అందించలేదు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 3.20 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా మూడు కిలోల బియ్యం ప్యాకెట్లు, కిలో కందిబేడలు, అర కిలో ఆయిల్, 25 కోడిగుడ్లు, తల్లులకు 5, చిన్నారులకు 2.5 లీటర్ల పాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే కేంద్రాలకు ఆగస్టు మొదటి వారం మొదటి విడతగా సరుకులు వచ్చి చేరాయి. అంగన్వాడీలకు ప్రభుత్వం అందించిన సెల్ఫోన్ యాప్లలో వివరాల నమోదు ఆధారంగా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, యాప్ల భారం తదితర కారణాలతో ఈ నెల 5న ఉమ్మడి జిల్లాలో చాలామంది అంగన్వాడీ కార్యకర్తలు సెల్ఫోన్లను ఉన్నతాధికారులకు వెనక్కు ఇచ్చేశారు. దీంతో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయలేదు. కొన్ని చోట్ల రికార్డుల్లో సంతకాలు పెట్టించుకొని లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిసింది. పట్టని అధికారులు.. లబ్ధిదారులకు సరుకులు అందకున్నా ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అధికారుల ఆదేశాల కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు విడతలకు సంబంధించి లక్షల్లో గుడ్లు నిల్వ ఉన్నాయి. ఇవి చెడిపోకముందే పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఏఆర్ ఎస్ఐ నాగేంద్రకు సేవా పతకం
అనంతపురం: ఏఆర్ ఎస్ఐ కురుబ నాగేంద్రకు సేవా పతకం లభించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన్ను సేవా పతకానికి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వాసుదేవన్ నుంచి నాగేంద్ర సేవా పతకాన్ని అందుకున్నారు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన నాగేంద్ర 1990లో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 36 ఏళ్లుగా క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. సేవా పతకం అందుకున్న నాగేంద్రకు ఏఆర్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
అనంతపురం అర్బన్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని, సమష్టిగా పనిచేసి అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం పోలీసు పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు. వేడుకల్లో జిల్లా న్యాయమూర్తి భీమరావు, ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, పార్థసారథి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీమ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రగతిని, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. పీ4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. -
బ్రిటీష్ పాలనను తలపిస్తున్న కూటమి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు, బెదిరింపులు, కక్షసాధింపు చర్యలతో కూటమి ప్రభుత్వం బ్రిటీష్ పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తే.. ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో పూర్తి నెరవేర్చకపోగా.. అమలు చేస్తున్న అరకొర పథకాల్లో అనేక కొర్రీలతో అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా తయారైందన్నారు. పోలీసులే దగ్గరుండి ఎన్నికల్లో అక్రమాలు జరిగేలా చేశారని విమర్శించారు. నాడు బ్రిటీష్ వారిపై ఏవిధంగా పోరాటాలు చేశారో.. కూటమి ప్రభుత్వంపై అలాంటి పోరాటాలు చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం అని, ఆ స్ఫూర్తితో తాము ప్రజల కోసం పోరాటాలు చేస్తామని, అందుకు ప్రతి కార్యకర్తా కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సైఫుల్లాబేగ్, మల్లెమీద నరసింహులు, శ్రీదేవి, బాకే హబీబుల్లా, శ్రీనివాసులు నాయక్, అమర్నాథ్రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, రాష్ట్ర నాయకులు కృష్ణవేణి, పెన్నోబులేసు, నాయకులు శ్రీనివాసులు, రియాజ్, అనిల్ కుమార్గౌడ్, సాకే కుళ్లాయి స్వామి, చంద్రలేఖ, హజరాబి, రాధాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ సైనికులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయసేవలు అందించనున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సేవలు అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం అనంతపురం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కోవూరు నగర్లోని జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ను జిల్లా జడ్జి ప్రారంభించారు. పెన్షన్, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు తదితర అన్ని న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.రాజశేఖర్, జిల్లా సైనిక సంక్షమ అధికారి పి.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. ‘డిజైన్ థింకింగ్’ కోర్సు ప్రారంభం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సహకారంతో మూడో వ్యాల్యూ యాడెడ్ కోర్సు ‘డిజైన్ థింకింగ్ సర్టిఫికెట్ కోర్సు’ను ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత శుక్రవారం ప్రారంభించారు. నూతన కోర్సు మానవ కేంద్రీకృత డిజైన్ విధానాలను నేర్పిస్తుంది. విద్య, వ్యాపారం, వ్యవసాయం, సహజ అభివృద్ధి వంటి విభిన్న రంగాల్లో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినూత్న పరిష్కారాలు అందించే సరళమైన, శక్తివంతమైన పద్ధతులు నేర్చుకోవడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. కార్యక్రమంలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం సీఈఓ సి.చంద్రమౌళి, కోఆర్డినేటర్ కృష్ణుడు, డాక్టర్ పి.జ్యోతి, బి.రాజశేఖర్ పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి కళ్యాణదుర్గం రూరల్: భర్త, అత్త మామల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణి మృతదేహం వద్ద వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం రంగయ్య మాట్లాడుతూ... భర్త శ్రీనివాసులు, అత్తమామలు తీవ్రంగా వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. భర్త, అత్త, మామలు టీడీపీ సానుభూతిపరులు కావడంతో పోలీసులు కేసును నీరుగారుస్తున్నారన్నారు. శ్రావణిది ఆత్మహత్య కాదని టీడీపీ నేతలు, పోలీసులు కలిసి హత్య చేశారని రంగయ్య ఆరోపించారు. శ్రావణి మృతి కారకులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, హనుమంతురాయుడు, చంద్రశేఖర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నేత రామాంజినేయులు. వైస్ ఎంపీపీ కాంతమ్మ, మల్లి, బిక్కి హరి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ‘అమర భారతం’ ప్రశాంతి నిలయం: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను వివరిస్తూ ‘అమర భారతం’ పేరుతో ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. -
యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు
● రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి ● తెలిసినా పట్టన ట్లు వ్యవహరిస్తున్న అధికారులు గార్లదిన్నె: శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో ఆదాయం కోసం అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. అనధికారికంగా ఇసుక, మట్టి కొల్లగొట్టుకుపోతున్నారు. కళ్లెదుటే కనిపిస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఇటీవల కల్లూరులో టీడీపీ మట్టి మాఫియా ఏకంగా రెవెన్యూ అధికారులపైనే దాడులు చేసిన విషయం విదితమే. అనుమతులు లేకుండా ప్రభుత్వ గుట్టల్లో హిటాచీ, జేసీబీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా రోడ్ల నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ● ఇక గ్రామాల్లో కొందరు వ్యక్తులు ఎర్రమట్టి వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాక్టర్లలో మట్టి తరలింపు కొనసాగుతోంది. కల్లూరులో సింగరప్ప కొండ, జంబులదిన్నె కొట్టాలలో ప్రభుత్వ గుట్ట, అదే విధంగా పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో కూడా దర్జాగా మట్టి తవ్వకాలు చేస్తూ అక్రమ దందాను యథేచ్ఛగా చేపడుతున్నారు. వ్యాపారులకు ఎర్రమట్టి కాసులు కురిపిస్తోంది. అనధికారిక మట్టి తవ్వకాలను అరికట్టాల్సిన అధికారులు.. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి తప్పనిసరి ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఏ భూములలోనైనా మట్టి తవ్వకాలు చేయాలంటే మైనింగ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఏ సర్వే నంబర్లో తవ్వకాలు చేస్తున్నారు.. ఎంత లోతు తవ్వకాలు చేయాలి... ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి తీసుకుంటున్నారు.. మట్టి తరలిస్తే భూగర్భజలాలు అడుగంటి పోయే అవకాశం ఉందా అనే వివరాలు కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. – మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్, గార్లదిన్నె -
అభివృద్ధి పట్టాలపై గుంతకల్లు డివిజన్
● పంద్రాగస్ట్ వేడుకల్లో డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: ప్రయాణికుల భద్రత, సరుకు రవాణా తదితర అన్ని విభాగాల్లో గుంతకల్లు డివిజన్ ఆల్ రౌండ్ ప్రతిభతో దూసుకెళ్తోందని రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశేఖర్గుప్తా పేర్కొన్నారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ఆర్పీఎఫ్ల నుంచి డీఆర్ఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గడచిన నాలుగు నెలల్లో 15 మిలియన్ల ప్రయాణికులు టిక్కెట్ల కొనుగోలు ద్వారా రూ.361 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. దాదాపు 48 ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడపడం ద్వారా మరో రూ.8 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. డివిజన్లోని పాణ్యం–బుగ్గనపల్లి స్టేషన్ల మధ్య డబులింగ్ రైలు మార్గం పనులు పూర్తి చేశామన్నారు. అమృత్ స్టేషన్ స్కీమ్ కింద డివిజన్ పరిధిలోని 17 రైల్వేస్టేషన్లలో తొలి విడత కింద రూ.234 కోట్లు, రెండో విడత కింద రూ.358 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం యూ.సుధాకర్, సీనియర్ డీపీఓ కోర్డినేషన్ హెచ్ఎల్ఎన్ ప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్, ఆర్పీఎఫ్ కమిషనర్ ఆకాష్ జైశ్వాల్ పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యమని గుంతకల్లు రైల్వే జీఆర్పీ ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది విశేష సేవలు అందించిన జీఆర్పీలకు అవార్డులను ప్రదానం చేశారు. డీఎస్పీ శ్రీనివాస ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
సంబరాలు చేసుకునేందుకు సిగ్గుండాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గుంతకల్లు: ‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నాయకులు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతూ రిగ్గింగ్ చేసి గెలిచారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పడు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సిగ్గుపడాలని’ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విమర్శించారు. శుక్రవారం ఆయన గుంతకల్లుకు విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున ఏజెంట్లు లేరని, కనీసం ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లును కూడా అడ్డుకోవడం దారుణమన్నారు. కాళ్లపై పడినా కనికరం లేకుండా ఓటు వేయాడానికి అనుమతించకపోవడం చూస్తుంటే తాలిబన్ల పాలనను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. టీడీపీకి వత్తాసు పడిన పోలీసు డిపార్టుమెంట్ తలదించుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని మంత్రి నారా లోకేష్ అనడం సిగ్గుచేటన్నారు. పవన్కళ్యాణ్ పంచాయతీశాఖ మంత్రి ఉన్నా ఉపయోగం లేదన్నారు. పంచాయతీలకు నిధులు లేకపోవడంతో చిన్న పనులు కూడా సర్పంచులు చేయించలేకపోతున్నారు. అటు సినిమాలకు .. ఇటు రాజకీయాలకు కూడా ఆయన పనికిరాడన్నారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రసుత్తం కురుస్తున్న వర్షాలకు అమరావతి ప్రాంతం సముద్రంలా తయరైందన్నారు. ఈనాడు, జ్యోతి, టీవీ5లకు అమరావతి పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శ్రావణి మృతికి కారకులను శిక్షించాలి అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకపోగా, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకులు, భర్త, వారి కుటుంబ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న శ్రావణికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఆ వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. శ్రావణి భర్త శ్రీనివాసులతో పాటు టీడీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ శర్మాస్వలి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు శ్రావణి ఆడియో రికార్డు బయటకు వచ్చిందన్నారు. పోలీసులకు మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆడియో స్పష్టంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం కారణంగానే తనకు ఈ పరిస్థితి ఏర్పడిందని, తన చావుకు టీడీపీనే కారణమని చెప్పారన్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో అనంతపురంలో యువతి హత్య, ఏడుగుర్రాలపల్లిలో మైనర్పై సాముహిక అత్యాచారం జరిగాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాతరెడ్డి, నాయకురాళ్లు శోభారాణి, అనురాధ, భారతి, చంద్రలేఖ, లీలావతి, అంజలి తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించాలి హిందూపురం టౌన్: ‘మలుగూరు పంచాయతీ నందమూరినగర్లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఒకేసారి 10 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వారికి వెంటనే మెరుగైన వైద్య సేవలందించాలి’ అని వైఎస్సార్ఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరీష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వారు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో సోమందేపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన మరువకముందే హిందూపురంలో ఒకేసారి పదిమందిపైగా విష జ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవడం బాధాకరమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపాల్, హౌస్ మాస్టర్లను సస్పెండ్ చేయాలన్నారు. -
టీడీపీ నేతల వేధింపులు.. శ్రావణి చివరి ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేతల వేధింపులకు గర్భిణి బలైంది. ఉరేసుకుని గర్భిణి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది. శ్రావణి భర్త శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. భర్త వేధిస్తున్నాడంటూ శ్రావణి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. శ్రీనివాస్పై చర్యలు తీసుకోకుండా పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయం జరగకపోవడంతో శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.తన చావుకు కారణం టీడీపీ ప్రభుత్వం, పోలీసులే అంటూ శ్రావణి వాయిస్ రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో బాధితురాలి చివరి ఆడియో వైరల్గా మారింది. భర్త శ్రీనివాస్తో పాటు కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్, మాజీ సర్పంచ్ శర్మాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం పోలీసులు, టీడీపీ నేతలపై విచారణ జరపనున్నారు. -
కళ్లెదుటే వైకల్యం.. కానరాని కనికరం?
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. వైకల్యం కళ్లెదుటే కనిపిస్తున్నా వెరిఫికేషన్ పేరుతో పింఛను నిలిపివేస్తుండంతో అంతులేని ఆవేదన మిగులుతోంది. గుత్తి మండలం శ్రీపురానికి (కొజ్జేపల్లి) చెందిన దంపతులు సూర్యనారాయణ, రాజేశ్వరి తమ దివ్యాంగ (బుద్ధిమాద్యం) కుమారుడు మహిధర్ను ఎత్తుకుని గురువారం కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిధర్ వయసు తొమ్మిది సంవత్సరాలని, నిలబడలేడు.. కూర్చోలేడని వాపోయారు. తమ బిడ్డకు ఈ నెల పింఛన్ నిలిపేశారన్నారు. వెరిఫికేషన్ చేయించలేదు.. అందుకే ఆపేశా మని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ ఏడాది ఏప్రిల్ 16న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వెరిఫికేషన్ చేయించామని, అయినా పింఛన్ నిలిపేయడంతో మళ్లీ గురువారం ఆస్పత్రికి వచ్చి వెరిఫికేషన్ చేయించినట్లు వెల్లడించారు. మళ్లీ అప్పట్లోలా ఎక్కడ చేస్తారనే భయంతో వెరిఫికేషన్ ప్రక్రియ వీడియో కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చినట్లు తెలిపారు. అయితే, ఇన్చార్జ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. -
జాతీయోద్యమంలో ‘కల్లూరు’ మార్క్
అనంత స్వాతంత్రోద్యమ చరిత్రలో కల్లూరు సుబ్బారావు ప్రత్యేక భూమికను పోషించారు. 1918లో గాంధీజీ పర్యటనలో ఇచ్చిన ఉపన్యాసానికి ప్రభావితమైన ఆయన... మెట్రిక్యులేషన్తో చదువుకు స్వస్తి పలికి జాతీయోద్యమంలో ప్రవేశించారు. జాతీయ స్థాయిలో జరిగిన అనేక సమావేశాలకు రాయలసీమ తరఫున హాజరైన ఏకై క ప్రతినిధిగా ఖ్యాతిగాంచారు. రాయలసీమ ప్రజా ప్రయోజనాల కోసం శ్రీబాగ్ ఒడంబడికలో సంతకం చేసిన వారిలో ముఖ్యులు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయనను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన విలువైన స్థలాన్ని లలిత కళలను ప్రోత్సహించేందుకు ఉదారంగా అందజేశారు. ప్రస్తుతం రూ.కోట్ల విలువ చేసే అనంతపురంలోని ఆ స్థలంలో నిర్మించిన లలిత కళాపరిషత్ ఎంతో మంది కళాకారులకు ఊతమిస్తోంది. -
కన్నతల్లి కళ్ల ముందే...
● రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి గుంతకల్లు రూరల్: స్థానిక విద్యానగర్ రోడ్డు నంబర్ 1లో నివాసముంటున్న ఖాదర్వలి, షేక్ హాసీనా బేగం దంపతుల ఒక్కగానొక్క కుమార్తె షేక్ అఫ్రీన్ (12) స్థానిక ఓ కార్పొరేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. రైల్వే కాంట్రాక్టర్ వద్ద సూపర్వైజర్గా పనిచేస్తూ ఖాదర్వలి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తిమ్మాపురం సమీపంలో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి గురువారం మధ్యాహ్నం కుమార్తె అఫ్రీన్తో కలసి స్కూటీపై హసీనా బేగం బయలుదేరింది. పారిశ్రామిక వాడ సమీపంలోని చాక్లెట్ ఫ్యాక్టరీ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద వేగాన్ని తగ్గిస్తూ ముందుకు పోతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. ఘటనలో తల్లి కుడి పక్కకు ఎరిగి పడగా... అఫ్రీన్ మాత్రం ఎడమ వైపు రోడ్డుపై పడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ బ్రేక్ వేయకపోవడంతో లారీ చక్కాలు అప్రీన్ను తొక్కుకుంటూ ముందుకెళ్లాయి. ఘటనలో అఫ్రీన్ సగం శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన తల్లి హసీనా బేగం షాక్ నుంచి కోలుకొని వెంటనే కుమార్తె కోసం గాలించింది. ఆమె కళ్లకు రక్తపు మడుగులో విగత జీవిగా కుమార్తె కనిపించడంతో రోదనకు అంతులేకుండా పోయింది. మాంసపు ముద్దలా మారిన కుమార్తెను గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా రోదించసాగింది. విషయం తెలుసుకున్న తండ్రి ఖాదర్వలి కూడా అక్కడకు చేరుకుని ఆమెకు తోడవడంతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఈ దృశ్యం చూసిన వాళ్లు సైతం కంటనీరు పెట్టారు. సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్ ఎస్ఐ రాఘవేంద్రప్ప క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన ● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు, లోకేష్ పిలుపునిచ్చారని, ప్రస్తుతం అధికారం చేపట్టిన తరువాత ఇదే పెద్ద మనుషులు మాట తప్పి స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. విద్యుత్ చార్జీలో పెంచబోమని, మరింత తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పి... అధికారంలోకి వచ్చిన తరువాత ట్రూఆప్ చార్జీల పేరుతో ప్రజలపై ఏకంగా రూ.15,400 కోట్లు భారం మోపారని దుమ్మెత్తిపోశారు. హామీల సాధనకు ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు రాజేష్గౌడ్, రమణ, రామకృష్ణ, నారాయణస్వామి, కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. -
త్రివర్ణశోభితం.. రైల్వేస్టేషన్ భవనం
గుంతకల్లు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంతకల్లులోని రైల్వేస్టేషన్ భవనం త్రివర్ణ శోభితమైంది. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ విద్యుద్దీపాలతో భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణ పతాకం రెపరెపలు మరింత అందాన్ని తెచ్చుపెట్టింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం ● హర్ఘర్ తిరంగా ర్యాలీలో డీఆర్ఎం గుంతకల్లు: స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాలంటూ డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పిలుపునిచ్చారు. గుంతకల్లు డివిజన్ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని డీఆర్ఎం సీఎస్ గుప్తా ప్రారంభించారు. స్టేషన్ రోడ్డు, ప్రధాన రహదారి, ఆర్టీసీ బస్టాండ్, బీరప్పగుడి, హనుమన్ సర్కిళ్ల మీదుగా తిరిగి రైల్వేస్టేషన్కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీఎంఈ మంగచార్యులు, ఆర్ఫీఎఫ్ డీసీ ఆకాష్ జైశ్వాల్, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఎం సాదిక్, సీనియర్ డీపీఓ కో ర్డినేషన్ హెచ్ఎల్ఎన్ ప్రసాద్, సీనియర్ డీఈఎన్ కో ఆర్డినేషన్ జీబీ శ్రీనివాసులు, ఆర్పీఎఫ్లు పాల్గొన్నారు. అలాగే శ్రీశంకరనందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గోపాల్, ప్రిన్సిపాల్ సురేష్బాబు, ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు. భర్త వేధింపులకు గర్భిణి బలి కళ్యాణదుర్గం రూరల్: భర్త వేధింపులు తాళలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని దొడగట్ట రోడ్డులో నివాసముంటున్న నాగరాజు, రామాంజినమ్మ దంపతుల కుమార్తె శ్రావణి(24)కి గండ్లప్ప దొడ్డికి చెందిన బోయ శివన్న, కరెమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులుతో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం శ్రావణి మూడు నెలల గర్భిణి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య మనస్పర్థలు చెల రేగాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శ్రావణిపై భర్తతో పాటు అత్త, మామ దాడి చేసి, పుట్టింటికి పంపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
●యూరియా వెతలు!
బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్లో ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు ఈసారి హెచ్చెల్సీకి ముందుగానే నీరు రావడం ఖరీఫ్ ముందస్తులోనే వర్షాలు కురువడంతో రైతులు వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా ఆవసరం ఎక్కువైంది. అయితే యూరియా కొరత రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినా యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ పెద్దలతో పాటు జిల్లా వ్యవసాయాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. యూరియా దొరుకుతోందని తెలియగానే ఆర్ఎస్కేల వద్దకు రైతులు, మహిళా కూలీలు పరుగు తీస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్, ఉంతకల్లు గ్రామాలు, కణేకల్లులోని ఆర్ఎస్కేల వద్ద గురువారం 6 గంటల నుంచి పడిగాపులు కాసినా యూరియా అందక కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగారు. – బొమ్మనహాళ్/కణేకల్లు: -
చిరస్మరణీయుడు ‘యర్రమల’
దేశం పట్ల అచంచల భక్తివిశ్వాసాలున్న యర్రమల కొండప్ప త్యాగం చిరస్మరణీయం. 1890లో ఓ గొప్ప భూస్వామ్య కుటుంబంలో జన్మించి, విద్యావంతుడై పోలీసు శాఖలో పనిచేశారు. ఆ రోజుల్లోనే గుంతకల్లు సభలో బాలగంగాధర్ తిలక్ ఉపన్యాసంతో ప్రభావితుడైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలో 1921లో బ్రిటీష్ సైనికులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. 1934లో మహాత్మాగాంధీ అనంతకు విచ్చేసిన సమయంలో హరిజనోద్ధరణ పిలుపునకు ప్రభావితుడై అదే స్ఫూర్తితో అనంతపురంలోని అశోక్ నగర్లో ఎంతో విలువైన రెండు ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. ఆ స్థలంలోనే ప్రస్తుతం అంబేడ్కర్ భవనం నడుస్తోంది. -
నిరుపమాన త్యాగధనులు
తిరుగులేని దేశభక్తే తమ ఆయుధంగా పోరాటం సల్పి భరతమాతను దాస్య విముక్తి కల్గించిన వారిలో అనంత వాసులూ ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తిదాయకమైన పోరాటాల ఫలితంగా... నాటి నుంచి నేటి వరకూ వన్నె తగ్గని జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతావని స్వేచ్ఛకు ప్రతిరూపాలుగా నిలిచిన మహనీయులు... స్మారకాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అనంతపురం కల్చరల్: జిల్లాకు చెందిన కల్లూరు సుబ్బారావు, తరిమెలనాగిరెడ్డి, పప్పూరు రామాచార్యులు, యర్రమల కొండప్ప వంటి వారే కాకుండా సామాన్యులు సైతం నిరుపమాన త్యాగాలతో ఎంతోమంది దేశం కోసం సర్వమూ అర్పించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తిరుగులేని దేశభక్తే తమ ఆయుధంగా పోరాటాల్లో పాల్గొన్నారు. భరతమాతకు దాస్యవిముక్తి కల్గించిన అనంతరం కూడా తమ ఆస్తిపాస్తులను సమాజానికి అందించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారి త్యాగాలకు ఫలితంగా ఊరూరా వారి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. స్వేచ్ఛావాయువులకు సజీవ చిహ్నం అనంతపురం నగర నడిబొడ్డున నిలువెత్తు రూపంలో కనపించే టవర్ క్లాక్ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వేచ్ఛావాయువులకు సజీవ చిహ్నంగా నిలిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి గుర్తుగా 8 (ఆగస్టు నెల) భుజాలు, 15 (తేదీ) అడుగుల వెడల్పు, 47 (1947) అడుగుల ఎత్తు టవర్క్లాక్ను నిర్మించారు. 1952లో అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. సందర్భం నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవంఅపురూప చిత్రం -
స్వాతంత్య్ర సమరంలో ‘దుర్గం’ యోధులు
రాయదుర్గం/టౌన్: రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఓబుళాచార్యులు, కెరె శరణప్ప, ఎన్సీ శేషాద్రీ, జగన్నాథ్సింగ్, నిప్పాణి రంగరావు, వైహెచ్ సుబ్బారావు, సత్యభామాదేవి, మోపూరు చంద్రకాంతనాయుడు, శిరిగేదొడ్డి గ్రామస్తుడు దామోదర సింగ్, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్టరావుప్ప ఇలా ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్య్ర యోధులు భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని రాయదుర్గం ప్రాంత కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేశారు. ప్రముఖ గాంధేయవాది, న్యాయవాది గురుమాల్ నాగభూషణం 1941లో స్వాతంత్య్ర పోరాటంలో అరెస్ట్ అయి 1941 మే 12 నుంచి బీజాపుర్ జిల్లా ఇండాలిగి సెంట్రల్ జైలులో 3 నెలల కారాగార శిక్ష అనుభవించారు. వరదా చెన్నప్ప, తిప్పయ్య 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 3 నెలల కఠిన కారాగార శిక్షను అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వైహెచ్ సత్యభామాదేవి రెండు నెలల జైలు శిక్ష అనుభవించారు. వ్యక్తిగత సత్యాగ్రహం చేసి ఆర్.నాగన్నగౌడ్ రూ.400లు దండన చెల్లించి ఏడాది కారాగార శిక్ష అనుభవించారు. బసవన్న గౌడు, చిందనూరు నాగప్ప శెట్టి ఇతర ప్రముఖులతో కలసి ఓబుళాచార్యులు తమ వంతు సేవలందించారు. వీరి జ్ఞాపకార్థం రాయదుర్గం పట్టణంలోని ఒక రోడ్డుకు ఓబుళాచారి రోడ్డు అని నామకరణం చేశారు. -
అది దొంగ ఓట్ల విజయం
రాప్తాడు రూరల్: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో సాధించిన గెలుపు ఓ గెలుపు కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దానిపై పేలాలు ఏరుకున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన పోలీసులు, పోలింగ్ సిబ్బంది అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంటన్లు కూడా కూర్చోనివ్వలేదన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్లో దొంగ ఓట్లు వేసిన వేరు అడ్డంగా దొరికిపోయారన్నారు. కలెక్టర్ ఉన్న బూత్లోనూ దొంగ ఓట్లు వేశారంటే ఈ ఎన్నికలు ఎంత హీనంగా జరిగాయో అర్థమవుతోందన్నారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు దొంగ ఓట్లు వేశారనేందుకు ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలు, ఫొటోలే నిదర్శనమన్నారు. పోలింగ్ బూత్ల్లో చేసిన వెబ్కాస్టింగ్, బూత్ల బయట సీసీ పుటేజీలు పూర్తి స్థాయిలో ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ఆధారాలు, సాక్ష్యాలను బయటపెట్టినా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. దొంగ ఓట్లు వేసిన వారిని విచారిస్తే ఈ అక్రమాలకు సూత్రధారులు, పాత్రధారులు బయటపడతారన్నారు. ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని హెచ్చరించారు. హడావుడి కౌంటింగ్ ఎందుకో? ఉప ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయిచిందన్నారు. ఈ నేపథ్యంలో హడావుడిగా పులివెందుల ఫలితాన్ని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైకోర్టు తమకు వ్యతిరేకంగా ఆదేశాలిస్తుందనే భయంతో ఎక్కువ టేబుళ్లు వేసి ఒకే రౌండ్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశారన్నారు. చంద్రబాబుకు నిజంగా అంతటి ప్రజాబలం ఉందనుకుంటే ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే తాజా ఎన్నిక కోసం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాల సమక్షంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
యువకుడి ఆత్మహత్య
పెద్దవడుగూరు: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరులోని నరసింహ కాలనీలో నివాసముంటున్న రాజేష్ (23)కు ఇటీవల అదే గ్రామానికి చెందిన అరుణతో వివాహమైంది. తరచూ అరుణను తల్లి పుట్టింటికి పిలుచుకెళుతుండడంతో క్షణికావేశానికి లోనైన రాజేష్.. గురువారం తెల్లవారుజామున కాలనీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జిల్లాకు 1,950 మెట్రిక్ టన్నుల ఎరువులు అనంతపురం అగ్రికల్చర్: ఇఫ్కో కంపెనీకి చెందిన 1,200 మెట్రిక్ టన్నుల డీఏపీ, 750 మెట్రిక్ టన్నుల 20–20–0–13 రకం కాంప్లెక్స్ ఎరువులు జిల్లాకు సరఫరా అయినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్కు వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులను ఆయన గురువారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ప్రకారం ఎరువులను మార్క్ఫెడ్కు, ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖైదీ మృతిపై 18న ఆర్డీఓ విచారణ ధర్మవరం అర్బన్: ఈ ఏడాది జనవరి 14న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం సబ్జైల్లోని రిమాండ్ ఖైదీ మృతి చెందిన అంశంపై ఈ నెల 18న ఆర్డీఓ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ మహేష్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పామిడి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన కాడింటి కేశవనారాయణ అలియాస్ శివయ్య ఉరఫ్ శ్రీనివాసులు(50) ధర్మవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీ (నం.1254)గా ఉండేవాడు. అనారోగ్యంతో బాధపడుతుండగా సర్వజనాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన అంశంపై విచారణ చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 18న ఉదయం 11గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో విచారణ ఉంటుందని, దీనిపై ఆక్షేపణలున్నవారు అఫిడవిట్ రూపంగా కానీ, ప్రత్యక్షంగా కాని అందజేయాలని ఆర్డీఓ కోరారు. -
జగన్ ..నీరాజనం
జన తరంగం ఎగసింది. అభిమాన నేతను చూసి మురిసిపోయింది. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది. అడుగడుగునా నీరాజనం పలికింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నీ వెంటే అంటూ ముందుకు నడిచింది. ఏ శక్తీ తమను ఆపలేదంటూ స్పష్టం చేసింది. జగన్ నినాదాలతో మార్మోగించింది. ● అనంతలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం ● మాజీ ఎమ్మెల్యే విశ్వ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన జననేత ● జగన్ను చూసేందుకు తరలివచ్చిన జన సందోహం ● హెలిప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకు అడుగడుగునా నీరాజనం శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025అనంతపురం కార్పొరేషన్: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత వివాహం గురువారం అనంతపురంలోని ఇంద్రప్రస్థ జీఎంఆర్ గార్డెన్స్లో జరిగింది. వీరి వివాహానికి హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జననేతను చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే.. హెలీప్యాడ్ వద్దకు ఉదయం 9 గంటల నుంచే ప్రజలు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూశారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగగానే కేరింతలు కొట్టారు. ‘అన్న వచ్చాడు’ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఈలలు, కేకలు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఇంద్రప్రస్థ జీఎంఆర్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపానికి బయలు దేరిన జగన్కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సంక్షేమ ప్రదాతను చూసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. రుద్రంపేట బ్రిడ్జి వద్ద, హెలీప్యాడ్ చుట్టుపక్కల భవనాలు, కల్యాణ మండపం చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కి అభివాదం చేశారు. కిక్కిరిసిన కల్యాణ మండపం.. అభిమానులు, నాయకులు, ప్రజలతో కల్యాణ మండపం పరిసరాలు కిక్కిరిసిపోవడంతో వైఎస్ జగన్ లోపలికి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. జగనన్నతో కరచాలనం చేయడానికి అడుగడుగునా ప్రజలు ఉత్సాహం చూపారు. వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహితను ఆశీర్వదించిన అనంతరం హెలికాప్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. సాదర స్వాగతం.. హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు అనంత వెంకటరామిరెడ్డి (అనంతపురం), డాక్టర్ సాకే శైలజానాథ్ (శింగనమల), ఉషశ్రీ చరణ్(పెనుకొండ), మెట్టు గోవిందరెడ్డి(రాయదుర్గం), తలారి రంగయ్య(కళ్యాణదుర్గం),తోపుదుర్తి ప్రకాష్రెడ్డి(రాప్తాడు), దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (పుట్టపర్తి),వై.వెంకటరామిరెడ్డి(గుంతకల్లు) కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), పెద్దారెడ్డి (తాడిపత్రి), మక్బుల్ (కదిరి), ఈరలక్కప్ప (మడకశిర), ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మాజీ మంత్రులు ఆర్కే రోజా, శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, గుంటూరు వెస్ట్ సమన్వయకర్త ఫాతిమా నూరి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
అనంతపురం కార్పొరేషన్: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బాబు దిగుజారుడు రాజకీయాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా పాలన సాగిస్తున్నారన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే కాకుండా, ఎవరైనా విమర్శించినా, గొంతెత్తినా పోలీసులను అడ్డుపెట్టుకుని అణచి వేయాలనే నీచ రాజకీయాలకు చంద్రబాబు అండ్ కో పాల్పడుతోందని మండిపడ్డారు. ఇప్పటివరకూ తాను ఏడు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని నేడు నడిరోడ్డులో హత్య చేశారన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపారా బాబూ అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలోని వారితో కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి మనుషులను పిలిపించి దొంగ ఓట్లు వేశారన్నారు. ఉదయం నుంచే అన్ని పోలింగ్ బూత్లను హస్తగతం చేసుకుని రిగ్గింగ్కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొంగ ఓటింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దామన్న ఆలోచనను ఎన్నికల సంఘం చేయకపోవడం దారుణమన్నారు. సాక్షాత్తు కలెక్టర్ ముందే అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తక్షణం ఎన్నికలను రద్దు చేసి మరోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలన్నారు. ‘కూటమి’ ప్రజాప్రతినిధులకు నిజంగా గత ఎన్నికల్లో గెలిచామని నమ్మకం ఉంటే మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. దద్దమ్మ ప్రభుత్వం.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల బరిలోకి దిగాల్సిన కూటమి ప్రభుత్వం దొంగ చాటున ఎన్నికల్లో గెలిచిందని, ఇవాళ ఏదో గెలిచామంటూ చంకలు గుద్దుకుంటున్నారని, ఇది దద్దమ్మ ప్రభుత్వమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించకుండా కూటమి ప్రభుత్వానికి వంత పాడారని దుయ్యబట్టారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు మరెక్కడా ఉండవన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, 3 లక్షల మందికి వలంటీర్లుగా అవకాశం, పరిశ్రమలకు సంబంధించి రూ.47,485 కోట్లతో 28,343 యూనిట్ల ద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీనైనా కూటమి ప్రభుత్వం సరిగా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ప్రకటించిన పథకాల్లోనూ అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, అనిల్కుమార్ గౌడ్, కాకర్ల శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్, కోటేశ్వర్ రెడ్డి, సాకే శివశంకర్, సాకే మణికంఠ, గుజ్జల సర్దార్, సంగమేష్, సంపంగి రాయుడు, గుజ్జల నారాయణ, రమణ, తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎన్నికలకు సిద్ధమవ్వాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి దద్దమ్మ ప్రభుత్వం ఇది: పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి -
‘20 లక్షల ఉద్యోగాలన్నారు.. 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’
అనంతపురం: కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, మరి చంద్రబాబు ప్రభుత్వం 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియర్ రాష్ట అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని, ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో 400 పరిశ్రమలు మూతబడ్డాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం-అభివృద్ధి జరిగిందని గౌతంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ .జరిగిందని, వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ పాల్పడ్డారని విమర్శించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనైతికమని గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. -
వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురంలో పర్యటించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి వివాహానికి ఆయన హాజరయ్యారు. హెలీప్యాడ్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికాయి.అనంతరం రుద్రంపేట సర్కిల్ మీదుగా ఇంద్రప్రస్థ కళ్యాణ వేదిక దాకా వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నూతన వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత లకు అభినందనలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
వీడని బాధ్యతారాహిత్యం
అనంతపురం మెడికల్: ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న జిల్లా వైద్య రంగంలో ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం ప్రజలకు శాపంగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, బోధనాస్పత్రిలో కీలక అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన పలువురు ప్రజారోగ్యం జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు పట్టడం లేదని విమర్శలు చేస్తున్నారు. నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం జిల్లా కేంద్రంలో గతంలో సీజ్ చేసిన ప్రైవేట్ ఆస్పత్రిని అనధికారికంగా తెరిచి రోగులకు చికిత్సలు అందజేస్తున్నా.. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోతే తప్ప డీఎంహెచ్ఓ మేల్కోనకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్.. లావణ్య పేరుపై తన ఆస్పత్రిలో ఓ మహిళకు చేసిన శస్త్రచికిత్స విఫలం కావడంతో ఏడాది క్రితమే కలెక్టర్ ఆదేశాలతో ఆ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. తన భార్య డెంటల్ వైద్యురాలని, ఆ ఆస్పత్రిని తెరుచుకుంటానని తరచూ ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ డాక్టర్ రమణ నాయక్ అప్పట్లో తిరిగారు. ఆ తర్వాత మూతపడిన లావణ్య ఆస్పత్రిని తెరిచి శ్రీకృప పేరుతో నడిపారు. ఇటీవల బీకేఎస్ మండలం చెదళ్లకు చెందిన గర్భిణి రాధమ్మ(29) ప్రాణం పోయాక మూత పడిన ఆస్పత్రిని తెరిచిన వైనం వెలుగు చూసింది. పర్యవేక్షణ మరచిన డీఎంహెచ్ఓ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం తీరూ ఇష్టారాజ్యంగా మారిందనే విమర్శలున్నాయి. గత నెలలో తాను నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోంలో అడ్మిట్ చేసుకున్న ఉరవకొండ ప్రాంతానికి చెందిన రాజేష్ అనే 22 ఏళ్ల యువకుడిని తర్వాత జీజీహెచ్లో చేర్పించి చికిత్స అందజేయించారు. అయితే ఆ యువకుడి మృతితో కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఇటీవల జీజీహెచ్లో స్ట్రెచర్ అందుబాటులో లేక బెళగుప్ప తండాకు చెందిన మధునాయక్(23) మృతి చెందిన విషయం కలకలం రేపింది. తన సొంత ఆర్థో విభాగానికి సంబంధించిన వైద్యులు పట్టపగలే విధులకు డుమ్మా కొడుతున్నా డాక్టర్ ఆత్మారాం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. బర్న్స్ వార్డును అనస్తీషియా విభాగానికి కేటాయించి విమర్శలకు తావిచ్చారు. ప్రధానంగా ఆస్పత్రిలో ఓ వైద్య విద్యార్థిని దోషిగా చేస్తూ ఆస్పత్రి గ్రూపులో ఏకంగా సదరు విద్యార్థి పేరును పోస్ట్ చేయడం కలకలం రేపింది. విద్యార్థి భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా పేరును ప్రస్తావించి పరువు తీయడం ఎంత వరకు సమంజసమని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రిప్రిన్సిపాల్ తీరూ అంతంతే ఇటీవల అనంతపురం మెడికల్ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ షారోన్ సోనియా పనితీరు కూడా అంతంత మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి వైద్యులు కనీసం సమయపాలన పాటించేలా కూడా ఆమె చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిన వైద్యులు.. అలా వచ్చి తమ వాహనాలు కూడా దిగకుండా వైద్య కళాశాల ఎదుటనే తమ మొబైల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి వెళ్లిపోతున్నారు. అనంతరం వారికి తీరికై నప్పుడు విధులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు.. జిల్లా వైద్య రంగాన్ని బాగుపరిచేవారెవ్వరూ లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య శాఖ, బోధనాస్పత్రిలో అధికారుల ఇష్టారాజ్యం సీజ్ చేసిన ఆస్పత్రిని తెరిచినా నిద్ర వీడని డీఎంహెచ్ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్లు విధులకు డుమ్మా కొడుతున్నా పట్టించుకోని ఏఎంసీ ప్రిన్సిపాల్ మంత్రి సత్యకుమార్కు పట్టని ప్రజారోగ్యం -
ఎస్సీ కాలనీల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
బ్రహ్మసముద్రం: మండలంలోని చెలిమేపల్లి, బుడిమేపల్లి తదితర గ్రామాల్లో ఉన్న ఎస్సీ కాలనీల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ బ్రహ్మసముద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆయా గ్రామాల ప్రజలు బుధవారం ధర్నా చేపట్టారు. చెలిమేపల్లిలోని ఎస్సీ కాలనీలో కరెంటు స్తంభాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇటీవల గాలి వానకు కరెంటు తీగలు తెగిపడటంతో ఓ పెంపుడు కుక్క మృతి చెందిందన్నారు. చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తీగలు తెగి కింద పడుతున్నాయని, ఇలా జరిగిన ప్రతిసారీ కాలనీ వాసులంతా చందాలు వేసుకుని మరమ్మతలు చేయించుకుంటున్నారని వాపోయారు. కాలనీల్లో ఇలాంటి అగచాట్లు ఇంకా ఎన్నాళ్లు భరించాలని ఆవేదనతో విద్యుత్ అధికారుల వద్ద మొర పెట్టుకునేందుకు వస్తే మధ్యాహ్నం 12 గంటలైనా ఒక్కరూ కూడా రాలేదని మండిపడ్డారు. దీంతో వినతి పత్రాన్ని కార్యాలయం తలుపునకు అతికించి నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ‘అనంత’ ఎమ్మెల్యే వసూళ్లకు హద్దేదీ? ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం అనంతపురం అర్బన్: జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, స్వయానా టీడీపీ ఎమ్మెల్యేనే అక్రమాలకు ఊతమిస్తూ సాగిస్తున్న వసూళ్లకు హద్దనేది లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అనంతపురంలోని కనకదాస ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం నగరంలో దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు, అడ్డగోలు అవినీతి పెరిగిపోయాయన్నారు. ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలన్నారు. ‘లే అవుట్లు వేస్తే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి. మాల్ ఓపెన్ చేస్తే డబ్బులివ్వాలి. బ్రాందీ షాపులన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. చికెన్ సెంటర్ల నిర్వహణకూ డబ్బు ఇవ్వాలి. చివరికి బుడబుక్కల వారి భూమి కూడా తనదే అనే స్థాయికి ఎదిగారు’ అంటూ ధ్వజమెత్తారు. నగరంలో వాణిజ్య దుకాణదారులనూ వదిలి పెట్టడం లేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఏ కార్యాలయంలోకి వెళ్లినా అవినీతికి అడ్డులేకుండా పోయిందన్నారు. అనంత రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఏనాడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్రంలోని విలువైన భూములను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు కూటమి ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం అన్యాయమన్నారు. టూరిజం శాఖ పరిధిలోని విలువైన ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల దిగజారుడుతనం పరాకాష్టకు చేరుకుందనేందుకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణనే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఆపకుండా మిట్టాల్కు ఊడిగం చేస్తూ మిట్టాల్ ఉక్కు పరిశ్రమకు అనుమతులు, రాయితీలు ఇవ్వాలంటూ కేంద్రం వద్ద పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై మహాసభలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
మద్యంలో మునిగితేలుతున్నారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఊరూరా వెలసిన బెల్టుషాపులు మద్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే స్థాయికి చేరాయి. నగరంలో వైన్షాపులు సమయం ప్రకారమే నడుచుకోవాలి. కానీ బెల్టుషాపులకు సమయమూ సందర్భమూ ఏమీ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందిస్తారు. పల్లెల్లో ప్రస్తుతం ఏదైనా బాగా అందుబాటులో ఉందీ అంటే అది మద్యమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయల షాపుల కంటే ఎక్కువ సాధారణంగా ఊరికి రెండు, మూడు కూరగాయల షాపులు.. మండల కేంద్రాల్లో అయితే పదిహేను, ఇరవై వరకూ అందుబాటులో ఉంటాయి. కానీ రాప్తాడు నియోజకవర్గంలోని 1,500 జనాభా ఉండే బండమీదపల్లెలో 15 నుంచి 20 వరకూ బెల్టుషాపులున్నాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాల వ్యాన్లు ఎలా అయితే షాపులకు పాలు వేస్తూ వెళతాయో అదే తరహాలో బెల్టుషాపులకు మందు సరఫరా చేయడానికి వ్యాన్లు ఏర్పాటు చేశారు. కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో ఏ ఊరికెళ్లినా పట్టపగలే రోడ్డుమీద మద్యం పెట్టి అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తాయి. రూ.1,550 కోట్ల వినియోగం.. 2024 సెప్టెంబర్ 15న కొత్త మద్యం పాలసీ వచ్చింది. అప్పటినుంచి ఈరోజు వరకూ అంటే 11 నెలల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.1,550 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందంటే ఎలా తాగుతున్నారో అంచనా వేయొచ్చు. ఈ 11 నెలల్లో 1.97 కోట్ల లీటర్ల మద్యం సేవించారు. బీర్ల సేవనం దీనికి అదనం. పట్టణాల్లో అయితే పర్మిట్ రూముల్లో మందుబాబులు మద్యంలో మునిగి తేలుతున్నారు. మామూళ్లు మద్దయ్యకు తెలిసే.. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందుకు నెలనెలా ఎకై ్సజ్ అధికారులకు మామూళ్లు వెళుతున్న విషయం తెలిసిందే. ఇదంతా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్(డీసీ) నాగమద్దయ్యకు తెలిసే జరుగుతోందని ఒక ఎక్సైజ్ అధికారి చెప్పారు. ‘మామూళ్ల సంగతి కిందిస్థాయి కాని స్టేబుల్కే తెలిసినప్పుడు డీసీకి తెలియకుండా ఉంటుందా?’ అనే చర్చ జరుగుతోంది. దీనిపై డీసీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. నెలనెలా పెరుగుతూనే ఉన్న వినియోగం పల్లె పల్లెనా విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటు 11 మాసాల్లో రూ.1,550 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు 1.98 కోట్ల లీటర్ల మద్యం సేవనం -
ఉన్న వాటితో ఉచిత బస్సు సాధ్యమేనా?
అనంతపురం క్రైం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ కూటమి సర్కారు హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం 511 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. సగటున 1.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సంస్థకు సుమారు రూ.80 లక్షల ఆదాయం చేకూరుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే, అందుకు అనుగుణంగా సర్వీసులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు టెన్షన్కు గురవుతున్నారు. అనంతపురం రీజియన్కు కనీసం మరో 300 బస్సులు ఇవ్వగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బస్సుల్లేవ్.. సిబ్బంది కొరత ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూటమి సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదనంగా బస్సుల కొనుగోలు, సిబ్బంది సంఖ్య పెంపు, వాహన సారథుల ఎంపిక చేపట్టనేలేదు. ఇప్పటికే కాలం చెల్లిన బస్సులకు మరమ్మతులు చేయలేక గ్యారేజీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. గ్యారేజీలో తగినంత మంది లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అంటుండడంతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎర్రబస్సెరుగని గ్రామాలు 120కి పైగానే.. జిల్లాలో ఇప్పటి దాకా ఎర్రబస్సెరుగని గ్రామాలు 120కి పైగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆటోలు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలులోకి వస్తే నష్టాల కారణంగా ఆయా గ్రామాలకు ప్రైవేటు వారు వెళ్లరు. ఈ క్రమంలో తమ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపాల్సిందే అంటూ ఆయా గ్రామాల ప్రజలు తిరుగుబాటుకు దిగే అవకాశం లేకపోలేదు. ఈ విషయంపైనా ఆర్టీసీ అధికారులు, సిబ్బందిలో ఆందోళన నెల కొంది. సర్కారు పెద్దలెక్కడో ఉంటారని, క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తితే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఊపిరి పోసిన వైఎస్ జగన్.. ఆర్టీసీని నష్టాల బారి నుంచి బయట పడేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులకు జీతాలు, అలవెన్సులకు నెలకు రూ. 300 కోట్లు అవసరమని గుర్తించి ఏడాదికి రూ. 3,600 కోట్ల భారం పడినా మాటకు కట్టుబడ్డారు. పెద్ద మొత్తంలో సంస్థకు భారం తగ్గించడంతో ఆర్టీసీ కొంత మేర ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలోనే కూటమి సర్కారు ఉచిత బస్సుకు తెరతీయడంతో మళ్లీ ఆర్టీసీ అగాథంలోకి పడిపోతుందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నిండా ముంచిన వర్షాలు
కణేకల్లు/బొమ్మనహాళ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కణేకల్లు మండలంలోని ఎన్.హనుమాపురం, సొల్లాపురం, హనకనహళ్ గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి నాగేపల్లి వంకకు భారీగా వరద వచ్చింది. ఈ క్రమంలోనే వంక పక్కనే ఉన్న గరుడచేడు రైతుల వేరుశనగ పంట పొలాల్లోకి నీరు చేరాయి. పొలాలు చెరువుల్లా మారాయి. 15 రోజుల్లో పంట చేతికొస్తుందనుకుంన్న నేపథ్యంలో ఇలా జరగడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 200 ఎకరాల్లో పంట దెబ్బతిందని చంద్రశేఖర్, కురుబ వెంకటేశులు, కురుబ కాడెప్ప, గోపాల్, వెంకటరాముడు, బెస్త గోవిందరాజులు, గంగాధర, కృష్ణతోపాటు మరో 30 మంది వాపోయారు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదని విలపిస్తున్నారు. ● బొమ్మనహాళ్ మండలంలోని దేవగిరి క్రాస్కు చెందిన పరమేశ్వరప్ప అనే కౌలు రైతు 6 ఎకరాల్లో బోరు కింద వేరుశనగ పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ఇటీవల వేరుశనగ చెట్లు పీకి పొలంలో ఆరబెట్టాడు. అయితే, ఇదే సమయంలో నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండడంతో పొలంలో నీరు నిలిచి వేరుశనగ కాయలకు మొలకలు వచ్చాయి. దీంతో పరమేశ్వరప్ప లబోదిబోమంటున్నాడు. కాయలు బూజుపట్టి, పశుగ్రాసం కూడా దక్కలేని పరిస్థితి ఉందని వాపోయాడు. రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. 28 మండలాల్లో వాన అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 28 మండలాల పరిధిలో 5.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 21 మి.మీ, గుంతకల్లు 20.2 మి.మీ నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షపాతం కురిసింది. కాగా రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.రమణ ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతిలోని ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిసియన్’లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బీఎస్సీ (హెచ్ఏ అండ్ హెచ్ఏ) మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఇంటర్లో 40 శాతం పైబడి మార్కులు సాధించిన వారు అర్హులు. క్రాప్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటినరీ కోర్సు, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ (సీసీఎఫ్బీఎస్) కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కోర్సులు పూర్తయిన తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు www.sihmtpt.org వెబ్సైట్ను పరిశీలించవచ్చు, లేదా 97013 43846, 91005 58006, 97004 40604లో సంప్రదించవచ్చు. వడ్ల రాజమ్మ దేహదానం అనంతపురం మెడికల్: మరణానంతరం వైద్య కళాశాలకు దేహదానాన్ని చేయడం ద్వారా మానవ శరీర నిర్మాణంపై వైద్య విద్యార్థుల అభ్యాసనకు దోహదపడుతుందని అనంతపురంలోని నిర్మలానంద నగర్లో నివాసముంటున్న తెలుగు వెలుగు సాహితీ సంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి అన్నారు. ఈ నెల 12న ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన భార్య, విశ్రాంత అంగన్వాడీ టీచర్ వడ్ల రాజమ్మ మృతి చెందింది. దీంతో బుధవారం సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియాకు వడ్ల రాజమ్మ మృతదేహాన్ని ఆయన అప్పగించి, మాట్లాడారు. ఈ సందర్భంగా టీవీ రెడ్డికి ప్రశంసాపత్రాన్ని డాక్టర్ షారోన్ సోనియా అందజేశారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు మృతదేహాల అవసరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తరిమెల అమరనాథ్రెడ్డి, గురునాథ్, సలీం, జూటూరు షరీఫ్, విజయసాయి పాల్గొన్నారు. రేషన్ బియ్యం డంప్ స్వాధీనం గుంతకల్లు రూరల్: పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో బహిరంగ ప్రదేశంలో డంప్ చేసిన 157 బస్తాల్లోని 78.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి సీఎస్డీటీ సుబ్బలక్ష్మి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి ఉన్నారు. బియ్యాన్ని డంప్ చేసిన వారు ఎవరనే విషయంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
రైతులకు రాజకీయ రంగు పులమొద్దు
అనంతపురం సిటీ: రైతులకు రాజకీయ రంగు పులిమి సంక్షేమాన్ని అందకుండా చేయడం దారుణమని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరికీ అన్నదాత–సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం నిర్వహించిన స్థాయీ సంఘం–1, 2, 3, 4 5, 6, 7 సమావేశాలకు గిరిజమ్మ అధ్యక్షత వహించారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభం కాగానే యూరియా కొరతపై అధికారులను గిరిజమ్మ నిలదీశారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఎందుకు దృష్టి సారించలేకపోయారంటూ ప్రశ్నించారు. అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, నల్లమాడ జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, భాస్కర్, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి సైతం వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే.. అదే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలను కొందరికి మాత్రమే జమ చేసి మిగిలిన వారికి మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ముద్రవేసి రైతులకు అన్యాయం చేయడం భావ్యం కాదన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా ఇచ్చే వేరుశగన కిట్లను అధికారులు అమ్ముకున్నారంటూ డి.హీరేహాళ్ జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాభాను ఆరోపించారు. తల్లికి వందనం అమలులో వంచన చేస్తారా? విద్యార్థులందరికీ తల్లికి వందనం అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని జెడ్పీటీసీలు వేదాంతం నాగరత్నమ్మ, భాస్కర్, చంద్రకుమార్ ఆరోపించారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం అమలు వివరాలు ఇవ్వాలని అడగ్గా విద్యా శాఖ అధికారులు చేతులెత్తేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం చాలా దారుణంగా ఉంటోందని, పిల్లలకు పురుగులు పడిన, ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశానికి ఆర్ఐఓ రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను ఆయా శాఖాధిపతులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సభ్యులు కోరారు. చిలమత్తూరు జెడ్పీ హైస్కూల్లో తాగునీటి కొరతతో విద్యార్థులు అల్లాడిపోతున్నారని సభ దృష్టికి జెడ్పీటీసీ సభ్యురాలు అనూష తెచ్చారు. సమావేశంలో సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ -
పరారీలో రైస్ మిల్లు ఓనర్
యాడికి: టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని మిల్లులో డంప్ చేసి బెంగళూరుకు తరలించేందుకు సిద్ధమైన యాడికిలోని రైల్ మిల్లు ఓనర్ బలరాముడుతో పాటు, మూడు వాహనాల డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు బలరాముడు పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. యాడికి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ ఈరన్న, సీఎస్డీటీ మల్లేసు వివరించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి అందించిన ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన యాడికి సీఐ ఈరన్న, సిబ్బంది, సీఎస్డీటీ మల్లేసుతో కలసి ఈ నెల 10న తెల్లవారుజామున 4 గంటలకు లారీ, బొలెరో, ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం వాహన డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి అనుమతులు తీసుకుని రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో యాడికిలోని బలరాముడు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. అక్కడ టన్నుల కొద్దీ రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. మొత్తం 271 టన్నుల రేషన్ బియ్యాన్ని మూడు రోజులుగా 10 లారీల ద్వారా గుంతకల్లులోని బఫర్ గోదాముకు తరలించారు. అనంతరం తహసీల్దార్ ప్రతాపరెడ్డి, పెద్ద మనుసులతో కలిసి బలరాముడు రైస్ మిల్లును సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రైస్ మిల్లు ఓనర్ బలరాముడితో పాటు వాహన డ్రైవర్లు తాడిపత్రికి చెందిన మసూద్ వలి, యాడికి మండలం కేశవరాయుని పేటకు చెందిన గంగాధర్, నంద్యాల జిల్లా ప్యాపిలి గ్రామానికి చెందిన ఖాసీంవలిపై కేసు నమోదు చేశారు. వీరిలో పట్టుబడిన ముగ్గురు వాహన డ్రైవర్లను బుధవారం రిమాండ్కు తరలించారు. పరారీలో బలరాముడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మూడు వాహనాల డ్రైవర్ల అరెస్ట్ 271 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం -
డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ వేగవంతం చేయాలి
అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఉద్యానశాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఓఎస్డీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వారు విజయవాడ నుంచి ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బీసీ ధనుంజయ, ఎంఐ ఇంజనీర్లు, కంపెనీ డీసీఓలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుత 2025–26లో 18 వేల హెక్టార్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకూ 2,522 హెక్టార్లకు మాత్రమే రైతులకు మంజూరు చేయగా, ఇన్స్టాలేషన్ల ప్రక్రియ తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పీడీ వివరణ ఇస్తూ... మరో 2 వేల హెక్టార్లకు మంజూరు చేయడానికి బీఓక్యూ, బీఎంసీ, రైతు వాటా పూర్తయిందని, వారం రోజుల్లోనే అడ్మినిస్ట్రేటివ్ శ్యాంక్షన్ తీసుకుని రైతులకు మంజూరు ఉత్తర్వులు ఇస్తామన్నారు. సీనియార్టీ వారీగా రిజిస్ట్రేషన్లను తీసుకుని ప్రాథమిక పరిశీలన చేపట్టి అర్హత జాబితా ప్రకారం మంజూరు ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ సూచించారు. పరికరాలను త్వరితగతిన సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అదే సందర్భంగా నాణ్యత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ డీసీఓలను ఆదేశించారు. గతేడాదికి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్న వాటిని వారం లోపు పూర్చి చేయాలన్నారు. వారం వారీ టార్గెట్లు నిర్ధేశించుకుని మంజూరు ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. ఉద్యానశాఖ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశం