Ananthapur
-
పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాలు కీలకం
అనంతపురం కార్పొరేషన్: పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాల పాత్ర ఎంతో కీలకమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ హరిప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టి.సురేంద్రరెడ్డి అన్నారు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం వారు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీను బలోపేతం చేయడానికి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారికి వివిధ పదవులతో జగనన్న గుర్తింపునిచ్చారన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలతో మమేకమై పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలన్నారు. ప్రజల పక్షాన నిలిచి వైఎస్సార్ సీపీ అధిష్టానం దశలవారీగా పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హరిప్రసాదరెడ్డి, సురేంద్ర రెడ్డిని అనుబంధ విభాగాల అధ్యక్షులు సన్మానించారు. కార్యక్రమంలో యువజన విబాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు అమర్నాథరెడ్డి, వైపీ బాబు, మల్లెమీద నరసింహులు, కురుబ దేవేంద్ర, మూడే శ్రీనివాసులు నాయక్, రాజశేఖరరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, కె శ్రీనివాసరెడ్డి, ఎం ధనుంజయ, సి.నాగప్ప, ఓబిరెడ్డి, ఎంసీ సంధ్యారాణి, శ్రీదేవి, రిలాక్స్ నాగరాజు, వై.నరేంద్రరెడ్డి, సైఫుల్లాబేగ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించి బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు. చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు. కర్ణాటక వాసి దుర్మరణం పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మార్కెట్ వసూళ్లు ఆశాజనకంఅనంతపురం అగ్రికల్చర్: మార్కెట్యార్డు పరిధిలో వివిధ రకాల ఫీజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నట్లు ఆ శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలోని9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13.49 కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా మొదటి రెండు నెలల కాలంలో 18 శాతంతో రూ.2.42 కోట్లకు పైగా సాధించినట్లు వివరించారు. అందులో మే నెల టార్గెట్ రూ.1.01 కోట్లు కాగా రూ.1.03 కోట్లు వసూలైందన్నారు. -
●జనం నెత్తిన ‘రేషన్ బరువు’
ఇంటి వద్దకు వాహనం వచ్చినప్పుడు రేషన్ తీసుకుంటూ వచ్చిన కార్డుదారులకు... ఇప్పుడు ‘నెత్తిన రేషన్ బరువు’ మోయాల్సిన దుస్థితి పట్టింది. ఇంటింటికీ రేషన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడి... చౌక దుకాణాల ద్వారానే అందజేసే విధానం తేవడంతో కార్డుదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలికినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దీంతో వృద్ధులు స్లోర్ల వద్దకు వచ్చి బియ్యం, సరుకులు తీసుకుంటున్నారు. రేషన్ పంపిణీ మొదలైన రెండో రోజు సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా కార్డుదారులు అవస్థలు పడ్డారు. – అనంతపురం అర్బన్/సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వాలు
అనంతపురం అర్బన్: సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేనాయక్ భవన్లో ప్రభుత్వాల సంస్కరణల వల్ల ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదానీకి దాసోహమైందని ఆరోపించారు. ఆదానీకి లబ్ధి చేకూరేలా పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. సర్దుబాటు పేరుతో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్లను పగలకొట్టాలంటూ ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే మాట మార్చాయని మండిపడ్డారు. విద్యుత్చార్జీల పెంపు, స్మార్ట్మీటర్ల ఏర్పాటు, ఆస్తిపన్ను పెంపునకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకుని రానున్న రోజుల్లో పోరాటాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రామిరెడ్డి, సిటిజెన్స్ ఫోరమ్ నాయకులు ఏజీరాజమోహన్, నాయకులు మత్తుజ, వెంకటనారాయణ, ప్రకాష్, గోపాల్, మసూద్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు -
చంద్రబాబు పాలనలో జిల్లాలో అరాచకం కొనసాగుతోంది. లోకేష్ ఫొటోలతో కూడిన రెడ్బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో యథేచ్ఛగా దా
● పుట్లూరు మండలం కోమటిగుంట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మనోహర్, విశ్వనాథ్, శేఖర్ తదితరులపై టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య(55) టీడీపీ నాయకుల్ని అడ్డుకుని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆయనపై బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బలమైన గాయాలతో అక్కడే కుప్పకూలి ఎరికలయ్య మృతి చెందాడు. ● రాప్తాడులో వైఎస్సార్సీపీకి చెందిన చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతుల హత్య రాష్ట్రాన్నే కుదిపిసేంది. పొలం తగాదా విషయంలో ఇనుపరాడ్లు, కట్టెలు, వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఘటనాస్థలంలోనే భార్య, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో భర్త మృతి చెందారు. రాప్తాడు సమీపంలోని గంగలకుంటకు చెందిన పొలం విషయంగా దాయాదుల మధ్య నెలకొన్న వివాదంలో టీడీపీ నేతలు తలదూర్చి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. రాప్తాడు మండలంలో టీడీపీ నాయకులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన బోరు, డ్రిప్ పరికరాలు (ఫైల్) రాప్తాడు మండలం వరిమడుగులో స్థలం కబ్జా కోసం టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన బండలు (ఫైల్) అనంతపురం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్యుల వరకూ ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పచ్చ ముఠాలు రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి తెరతీస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరిపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి. ● సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా నూతనంగా గృహాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయి. మున్సిపాలిటీ అనుమతులూ ఉన్నాయి. అయినా... ఫయాజ్బాషా నిర్మించిన ఇంటిని ఆక్రమణల పేరుతో తొలగించేందుకు మునిసిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పురమాయించారు. ఇంటిని కూల్చాలని ఒత్తిడి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలను పలు దఫాలుగా ఫయాజ్ బాషా అడ్డుకున్నారు. దీంతో నేరుగా జేసీ ప్రభాకర్రెడ్డి రంగంలో దిగి జేసీబీని తీసుకెళ్లి ఫయాజ్బాషా ఇంటి పైకి టీడీపీ కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై ఫయాజ్బాషానే రాళ్ల దాడికి పాల్బడ్డారంటూ రివర్స్ కేసు నమోదు చేయించారు. ● సార్వత్రిక ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వకుండా రెడ్బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, జేసీ ప్రభాకర్రెడ్డి ఇరువురినీ తాడిపత్రి వదిలి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక జేసీ ప్రభాకర్రెడ్డి ఒక్కరే తాడిపత్రిలో కాలు పెట్టారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు నుంచి అనుమతులు తీసుకున్నా పెద్దారెడ్డిని ఇప్పటికీ అక్కడ కాలు పెట్టనివ్వడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం ఎస్పీ పట్టించుకోలేదంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీస్ వ్యవస్థ ఎంతలా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు. ● జిల్లా వ్యాప్తంగా ఖాళీ స్థలాలనే కాకుండా పట్టా స్థలాలనూ టీడీపీ నేతలు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకోబోయిన సొంత దారులపై దాడులకు తెగబడుతున్నారు. చిన్నారులనే కనికరం లేకుండా ● రాయదుర్గం మండలం యర్రగుంట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న లైంగిక వేధింపులకు పాల్బడ్డాడు. మనో వేదనకు గురైన ఆ బాలిక హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అప్రమత్తమైన స్థానికులు బాలికను కాపాడారు. ముక్కన్నకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ● గత నెలలో కేవలం రోజుల వ్యవధిలోనే 15 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. కారణాలు ఏమైనా ఇప్పటి వరకూ కొన్ని అదృశ్యం కేసుల్లో మిస్టరీ వీడలేదు. రాక్షసత్వానికి పరాకాష్ట కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అంతులేని ఆకృత్యాలు, దౌర్జన్యకాండ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం అక్రమ కేసులు, అరెస్ట్లు, హత్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి దాసోహమన్న పోలీసులు కుంటి సాకులతో కేసులు ఆగని దౌర్జన్యకాండ జిల్లాలో ఇప్పటి వరకూ 70 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. రివర్స్ కేసులతో వేధింపులకు గురి చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామితో పాటు మొత్తం 48 మంది నాయకులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ర్యాలీగా వెళ్తుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ లింగరాజును ప్రభావితం చేసి, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం. చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించి, నిందితులను శిక్షించాలని ప్రెస్మీట్లో కోరినందుకు కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేశారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కుమార్పై దాడికి యత్నించారంటూ ఎంపీ గోరంట్లమాధవ్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. విద్యుత్ బిల్లుల పెంపు అంశంపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిపై ఉరవకొండలో ట్రాఫిక్కు అంతరాయంకలిగించారనే నెపంతో అక్రమ కేసు నమోదు చేశారు. గుమ్మఘట్ట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ గౌని కాంతారెడ్డి.. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో పంచాయితీ చేసి బాధితులకు అందాల్సిన రూ.నాలుగు లక్షలను వాడుకున్నాడని తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు. ఆత్మకూరు, రాయదుర్గం మండలం ఆయతపల్లి, బెళుగుప్ప గ్రామాల్లోని సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. డి.హీరేహల్ మండలంసిద్దాపురం తండాలో తాగునీటి కొళాయి విషయంగా ఘర్షణ పడి ఏడుగురు వైఎస్సార్సీపీ నాయకులపైనే రివర్స్ కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు. డి.హీరేహల్ మండలం కళ్లెం గ్రామంలో చోటు చేసుకున్న చిన్న పాటి ఘర్షణకు రాజకీయ రంగు పులిమి 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు బనాయించి రిమాండ్కు పంపారు. -
రాయితీ విత్తనాలకు కత్తెర..
రాయితీపై ఇచ్చే విత్తనాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రాయితీ కూడా కుదించి రైతులపై భారం మోపారు. ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు. ఈ ఖరీఫ్లో కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే విత్తన ప్రణాళిక తయారు చేశారు. ● వైఎస్ జగన్ ప్రభుత్వం 40 శాతం రాయితీతో విత్తనం అందించింది. ఐదేళ్లలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రూ.289 కోట్లు రాయితీ కల్పించడం గమనార్హం. -
ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా పడ్డాడు. అలవిగాని హామీలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి రైతన్న బలయ్యాడు. ఏడాది పాలనలో రైతుకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా చేతులెత్తేయడంతో కరువ
అనంతపురం అగ్రికల్చర్: ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పగా చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇదిగో అదిగో అంటూనే ఏడాది కాలం ముగించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. కానీ చంద్రబాబు తన హామీని గాలికి వదిలేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ... పీఎం కిసాన్ రూ.6 వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇచ్చి ఉన్నా రూ.400 కోట్లకు పైగా సాయం అందేది. కానీ రూపాయి కూడా ఇవ్వకుండా రైతులకు కుచ్చుటోపీ పెట్టేశారు. ● 2019–24 మధ్య వైఎస్ జగన్ సర్కారు ఏటా పీఎం కిసాన్, రైతు భరోసా కింద రూ.13,500 ప్రకారం ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ. 67,500 ఇచ్చారు. మొత్తంగా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. పంటల బీమాకు పాడె.. రైతులకు ఎంతగానే మేలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు పాడె కట్టేసింది. ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్లకు పైగా రైతుల నుంచి పిండేస్తోంది. 2023 ఖరీఫ్, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాల్సివుండగా... తమకు సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు ఎగనామం పెట్టేశారు. 2024 ఖరీఫ్లో కూడా ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారంపై నోరు మెదపడం లేదు. ● 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులపై పైసా కూడా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం ఇచ్చింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించారు. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చేశారు. బాధిత కుటుంబాలపై నిర్లక్ష్యం.. చంద్రబాబు ఏడాది పాలనలో పంటలు పండక, అప్పుల బాధతో 45 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నా... ప్రభుత్వం చలించడం లేదు. రూ.7 లక్షలు అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ● ఆత్మహత్య బాధిత కుటుంబాలకు గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రెండు మూడు నెలల్లోపే రూ.7 లక్షల మేర పరిహారం ఇచ్చి అండగా నిలిచారు. అలా 280 బాధిత రైతు కుటుంబాలకు రూ.17.40 కోట్ల ఎక్స్గ్రేషియా అందించారు. గతంలో చంద్రబాబు పాలించిన 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి 110 కుటుంబాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. సున్నా వడ్డీ, పావలా వడ్డీ లేదు.. ఖరీఫ్, రబీలో పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పావలావడ్డీ ఇవ్వలేదు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న సన్నచిన్నకారు రైతులకు వడ్డీరాయితీలు కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ● గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగింది. గిట్టుబాటు లేక నష్టాలు.. అరకొరగా చేతికొచ్చిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. చీనీ, అరటి రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నా... ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టలేదు. పత్తి, కంది రైతులు కూడా బాగా నష్టపోయారు. అరకొర కొనుగోలు కేంద్రాలతో మమ అనిపించేశారు. ● గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన రూ.350 కోట్లు విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరతో కొనుగోలు చేసి మేలు చేకూర్చింది. రైతులకు కూటమి సర్కారు కుచ్చుటోపీ చిన్నచూపు ధోరణి ప్రదర్శిస్తున్న సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సాయం చేయని వైనం మోసంపై మండిపడుతున్న అన్నదాతలు -
జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్
● ఆలిండియా ఓపెన్ కేటగిరీలో భూపతి నితిన్ అగ్రిహోత్రికి 183వ ర్యాంకు అనంతపురం ఎడ్యుకేషన్/శింగనమల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘అనంత’ విద్యార్థులు అదుర్స్ అనిపించారు. పలువురు జాతీయస్థాయి ర్యాంకులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీ కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షలు 12.68 లక్షల మంది విద్యార్థులు రాశారు. 2.5 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఐఐటీల్లో 17 వేల సీట్లు, తక్కిన సీట్లు ఎన్ఐటీ, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విడుదలైన ఫలితాల్లో భూపతి నితిన్ అగ్నిహోత్రి 360 మార్కులకు గాను 264 మార్కులు సాధించి అఖిల భారత స్థాయి ఓపెన్ కేటగిరీలో 183 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అలాగే శింగనమల మండలం సీ.బండమీదపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి శశిధర్రెడ్డి 638, అనంతపురం నగరానికి చెందిన పి. విశాల్ 3,946, భావన 10,889, మోక్ష సాయి రెడ్డి 12,809, ఆసిఫ్ 16,099, సవిత్ కుమార్ రావు 16,884 ర్యాంకు, డి.లోకేష్ కుమార్ 114 (ఎస్సీ కేటగిరీ) ర్యాంకు, ప్రణయ్ చౌదరి 5,499 (ఈడబ్ల్యూఎస్) ర్యాంకు సాధించారు. వీరందరికీ నేరుగా ఐఐటీలో ఇంజినీరింగ్ సీట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన కూడేరు వాసులు
కూడేరు: మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తమకు తాగునీరు అందడం లేదంటూ సోమవారం కూడేరు వాసులు ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని బోయ, కమ్మ, దళిత, కటిక వీధులు, శ్రీసత్యసాయి కాలనీల్లో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీ వాసులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణమూర్తి మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు అక్కడికు ఆందోళన కారులతో చర్చించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే అధికారులే వచ్చి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కుళ్లాయిస్వామి అక్కడకు చేరుకుని వారం రోజుల్లోపు కొత్తగా బోర్లు వేయించి, నీరు సరఫరా అయ్యేలా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
గుత్తి కోట ఉత్సవాలకు రూ.50 లక్షలు
గుత్తి: వచ్చే ఏడాది జనవరిలో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు గాను రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం గుత్తి కోటపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, జిల్లా పర్యాటక అధికారి విజయకుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ ఓబులేసు, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బీ, మహర్షి దయానంద గురుకుల పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు
ఆత్మకూరు: సీఎం చంద్రబాబు తీరుతో జిల్లాలో మళ్లీ ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో లైనింగ్ పనులను రైతులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్ట్ను చేపట్టారని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలను రద్దు చేస్తూ జీఓ 22 ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులతో పాటు 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 63 టీఎంసీల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం డ్యాం మల్యాల నుంచి కాలువను వెడల్పు చేసేలా జీఓ ఇచ్చి, పనులు మొదలు పెట్టారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చాలని, డోన్ ప్రాంతంలో 63 చెరువులకు2 టీఎంసీలు, శింగనమల, శింగనమల రూరల్ చెరువులకు 2.3 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ ఇచ్చారన్నారు. అలాగే జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్ట్కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి 114 చెరువులకు నీరు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారన్నారు. పేరూరు డ్యాంకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇస్తూ సోమరాండ్లపల్లి , పుట్టకనుమ, తోపుదుర్తి, ముట్టాల చెరువులకూ 4.3 టీఎంసీలు కేటాయించారన్నారు. పుట్టపర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 193 చెరువులకు, కియో ఫ్యాక్టరీకి నీరు ఇచ్చే బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లన్నీ రద్దు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపిందన్నారు. గతంలో అమిలినేని సురేంద్రబాబు కాలువ మీద 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అమ్ముకున్నారన్నారు. ప్యాకేజ్ 2లో రూ.9 కోట్ల పనులను రూ.95 కోట్లకు బిల్లులు చేసుకున్నారని తెలిపారు. ఫ్యాకేజి 3లో రూ.40 కోట్ల పనులకు సంబంధించి రూ.105 కోట్ల బిల్లులు చేసుకున్నారని వివరించారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్పనులతో రైతులకు తీరని నష్టమన్నారు. కాలువను 63 టీఎంసీలతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయాలని, జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు, కడప జిల్లాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్ల కాలువల నిర్మాణం చేపట్టి 6 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే ఏర్పాటు చేసిన తరువాతనే లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. గండికోట నుంచి గాలేరు నగరికి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో హంద్రీ నీవా పుంగనూరు బ్రాంచ్కెనాల్కు లిప్ట్ ఇరిగేషన్ కొనసాగించాలని దీనిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, సభలు పెట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 9న తోపుదుర్తి గ్రామంలో తన నివాసం వద్దనే వేల మంది రైతులతో నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే లైనింగ్ పనులతో రైతులకు నష్టం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి
● కలెక్టర్ వినోద్కుమార్ గుత్తి: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గుత్తి ఆర్ఎస్ రోడ్డులో ఉన్న వసుధా ఫంక్షన్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జేసీ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ శ్రీనివాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో ఉన్నతాధికారులకు అందజేశారు. మొత్తం 490 అర్జీలు అందాయి. తనకు బదిలీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అనంతపురం గిరిజన బాలుర కళాశాల హాస్టల్లో వార్డెన్గా నిధులు నిర్వహిస్తున్న అనసూయ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అవినీతికి పాల్పడి అంధురాలైన తనను తాను కోరిన గుత్తి ఎస్టీ హాస్టల్కు బదిలీ చేయలేదని విన్నవించారు. డబ్బు ముట్ట జెప్పిన వారిని కోరిన ప్రాంతానికి బదిలీ చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా తదితరులున్నారు. టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మే మొదటి వారంలో జీరోగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది. బెంగ తీర్చేనా..?! అనంతపురం సెంట్రల్: జిల్లాకు వర ప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయం ఈ ఏడాది ముందుగానే జలకళ సంతరించుకుంటుండడంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి త్వరగానే ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా జూన్ నెలాఖరు, జూలైలో డ్యాంకు ఇన్ఫ్లో ప్రారంభమవుతుంది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా పలకరించడంతో కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే 20 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో చేరుకోవడం గమనార్హం. కర్ణాటకలో వర్షాలు కొనసాగితే కొన్ని రోజుల్లోనే గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీబీ డ్యాం పరిధిలో హెచ్చెల్సీ కింద జిల్లాకు చాలా లబ్ధి కలుగుతోంది. దాదాపు లక్ష ఎకరాల పైగా సాగునీరు అందుతోంది. ఇలాంటి తరుణంలో డ్యాం త్వరగా నిండితే సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్ఈ పురార్థనరెడ్డి మాట్లాడుతూ టీబీ డ్యాంకు జూన్లోనే ఇన్ఫ్లో వస్తుండటం శుభ పరిణామమన్నారు. కేటాయింపులు త్వరగా నిర్ణయించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాము కాటుతో రైతు మృతి రాయదుర్గం టౌన్: మండలంలోని కెంచానపల్లికి చెందిన రైతు బోయ రామాంజనేయులు (70) పాము కాటుతో మృతి చెందాడు. తన వేరుశనగ పొలంలో సోమవారం మధ్యాహ్నం పనుల్లో నిమగ్నమైన సమయంలో పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య శివమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
మోసం... చంద్రబాబు నైజం
బుక్కరాయసముద్రం: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రెడ్బుక్ పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యాకాండకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచక పాలన సాగించడం హేయమన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4న నార్పల మండలంలో ఆందోళన, నిరసన కార్యక్రమం ఉంటుందని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి, అనుబంధ సంఘాల పరిశీలకులు సురేంద్ర మాట్లాడుతూ కూటమి పాలన రాష్ట్రంలో ఎల్లకాలం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడరాదని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నరేష్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, మేజర్ పంచాయతీ సర్పంచ్ పార్వతి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నాగలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల నారాయణస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, అనంత వెంకటరెడ్డి, కాటమయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
గంటల తరబడి వేచి ఉన్నా..
ఈమె పేరు జయమ్మ. అనంతపురంలోని నవోదయ కాలనీవాసి. తన ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న స్టోర్ నం. 88లో ఆదివారం రేషన్ తీసుకునేందుకు వచ్చి లైన్లో నిలబడలేక చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది. ఉదయం 8.30 గంటలకు నీళ్లు వస్తే పట్టేసి వచ్చానని, ఇక్కడేమో 9 గంటలైనా రేషన్ ఇవ్వడం మొదలు పెట్టలేదని వాపోయింది. రెండు రోజులే ఇచ్చి ఆ తరువాత బియ్యం అయిపోయాయని చెబుతారనే భయంతో మొహం కూడా కడుక్కోకుండానే మొదటి రోజే వచ్చినట్లు చెప్పింది. గతంలో తమ వీధిలోకే రేషన్ బండి వచ్చేదని, కేవలం 10 నిమిషాల్లో బియ్యం, సరుకులు తీసుకునేదాన్నని గుర్తు చేసుకుంది.రేషన్ సరుకులు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే దుస్థితి దాపురించింది. గత ప్రభుత్వం తరహాలో ఇంటి వద్దనే రేషన్ వేయాలి. ప్రస్తుతం రేషన్ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో..ఎప్పుడు మూస్తారో అర్థం కావడంలేదు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణం వద్ద వేచి ఉండి బియ్యం తెచ్చుకున్నా. మా ఇంటి నుంచి రేషన్ షాపు కి.మీ దూరంలో ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది.– రాజేశ్వరి, గుంతకల్లుఅనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పేదలను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. తాజాగా రేషన్ కష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కోసం కార్డుదారులు ఎప్పుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఇంటి వద్దకు ఎండీయూ వాహనం వచ్చినప్పుడు బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకునేవారు. అయితే, కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహన వ్యవస్థకు మంగళం పాడి చౌక దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి తెరలేపడంతో పేద ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదటి రోజే చుక్కలు కనిపించాయి. ‘ఉదయమే ఇంటి పనులను వదిలేసుకుని చౌక దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది.. మాకేం కర్మ పట్టిందిరా స్వామి’ అంటూ పలువురు వాపోయారు.8 గంటలకూ తెరచుకోని స్టోర్లు..ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఉదయం 8 గంటలకు చౌక దుకాణాలు తెరుచుకోలేదు. అప్పటికే రేషన్ తీసుకునేందుకు వచ్చిన కార్డుదారులు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. డీలర్లు నింపాదిగా 9 గంటల తరువాత పంపిణీ ప్రారంభించారు.ఇబ్బంది పడ్డ వృద్ధులు, మహిళలు..సరుకులు తీసుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు లైన్లలో నిలబడలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రాప్తాడు మండలం చిన్మయానగర్లో చౌక దుకాణం వద్ద చాలా ఆలస్యంగా పంపిణీ ప్రారంభించారు. ఉదయమే వచ్చిన కార్డుదారులు లైన్లో నిలబడలేక సంచులను వంతులుగా పెట్టి కూర్చున్నారు.రెండు రోజులకు మించి ఇవ్వరు..!చౌక దుకాణాల్లో ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కార్డుదారులు అంటున్నారు. బియ్యం, సరుకులు రెండు రోజులకు మించి ఇవ్వరని చెబుతున్నారు. ఆ తరువాత వస్తే అయిపోయాయని అంటారని, అందుకే పనులు వదిలేసుకుని మరీ బియ్యం తీసుకునేందుకు మొదటిరోజే వచ్చామని పేర్కొంటున్నారు. డీలర్లు కచ్చితంగా 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చూడాలని, అలా ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
నేడు గుత్తిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గుత్తి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు.గుత్తిలో పత్తికొండ రోడ్డులోని వసుధ ఫంక్షన్ హాలులో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. గుత్తి పట్టణ, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాటు తుపాకీ స్వాధీనం రాయదుర్గంటౌన్: ఓ వ్యక్తి అక్రమంగా తీసుకెళ్తున్న నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరమణ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీ హీరేహాళ్ మండలంలోని పాత హడగలి గ్రామం వద్ద సీఐ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం ఎస్ఐ గురుప్రసాద్ వాహన తనిఖీ చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే పాత హడగలి వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరు తాలూకా కోనాపురం గ్రామా నికి చెందిన బోయ గంగన్న పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడన్నారు. అనుమానంతో గంగన్నను పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా నాటు తుపాకీ, నల్ల మందు లభ్యమయ్యాయన్నారు. డీ హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలోని ఓ దానిమ్మ తోటలో గంగన్న మామ నాగరాజు పనిచేస్తున్నాడన్నారు. తోటలో తిరుగుతున్న అడవి పందుల నుంచి కాపాడాలని చెప్పడంతో తన గ్రామానికే చెందిన బసవ అనే వ్యక్తితో నాటు తుపాకీ, నల్లమందును తీసుకుని గంగన్న కూడ్లూరుకు వెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏమ్మా.. రేషన్ బియ్యం అన్నం బాగా ఉంటోందా? ● లబ్ధిదారుని ఆరా తీసిన కలెక్టర్ కూడేరు: ‘ఏమ్మా బియ్యం నాణ్యతగా ఉన్నాయా.. అన్నం బాగా అవుతోందా’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ రేషన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కలెక్టర్ మండల పరిధిలోని కమ్మూరులోని రేషన్ షాపులో సరుకుల పంపిణీని తనిఖీ చేశారు. సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. అనంతరం పలువురు కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యంపై ఆరా తీశారు. చిట్టెమ్మ అనే మహిళ ఇంట్లో రేషన్ బియ్యంతో వండిన అన్నం తిన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ కుమార్తె దీక్షను ఏం చదువుతున్నావమ్మా అంటూ పలకరించారు. పదిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు దీక్ష తెలపగా.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించాక ఉన్నత చదువులు చదవాలని, ‘అనంత ఆణిముత్యాలు’ పథకం ద్వారా చదివిస్తామని భరోసా ఇచ్చారు. బాలికలు మధ్యలోనే చదువులు మానేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఎస్డీటీ లక్ష్మీదేవి తదితరులు వీఆర్ఓ రామకృష్ణ పాల్గొన్నారు. -
ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ సీపీ ధ్యేయం
అనంతపురం కార్పొరేషన్: ‘ప్రజల శ్రేయస్సే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారు. ఇప్పుడు ప్రజలను నయవంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పోరాటాలకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఏ–7 కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో కలసి ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, నగర కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 4న ఉదయం 10 గంటలకు పాతూరు చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. గాంధీ విగ్రహం, వన్టౌన్ పీఎస్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, తొలి సంతకాలకు వన్నె తెచ్చిన నాయకులు దివంగత నేత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్థానమంతా వెన్నుపోటేనని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’తో పాటు 175 హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 1.30 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు, 2.50 లక్షలకుపైగా వలంటీర్లకు అవకాశం కల్పించారన్నారు. జగన్ హయాంలో అభివృద్ధి పనులతో అనంతపురం నగర రూపురేఖలు మార్చేశామన్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం మాఫియా గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సంపద సృష్టించుకునేందుకు మద్యం మాఫియాకు తెరలేపారని ‘అనంత’ ధ్వజమెత్తారు. మద్యం బాటిల్పై అదనంగా ధర వసూలు చేస్తున్నారన్నారు. ప్రతినెలా మద్యం షాపుల నుంచి భారీగా ఎమ్మెల్యేలకు ముడుపులు అందుతున్నాయన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలను హస్తగతం చేసుకుని అక్రమ కేసులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలపై గళమెత్తుదామని, ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చైతన్యానికి మారుపేరు అనంతపురం అని, వైఎస్సార్ సీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్గౌడ్, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు అశ్వర్థ్ నాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ తదితరులు ప్రసంగించారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, చంద్రశేఖర్ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, సైఫుల్లాబేగ్, శ్రీదేవి, చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు కృష్ణవేణి, దత్తా, వెన్నం శివరామిరెడ్డి, కేశవరెడ్డి, బాకే హబీబుల్లా, పెన్నోబులేసు, చింతకుంట మధు, ఆసిఫ్, సాకే చంద్రలేఖ, సుజాత రెడ్డి, పార్వతి, భారతి, గౌని నాగన్న, జానీ, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు వెన్నపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి -
హెచ్చెల్సీలో ఫెవికాల్ వీరులు
● హెచ్చెల్సీలో ఓ ఉద్యోగి 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈయన తన సర్వీసులో అన్ని ప్రాంతాల్లో పనిచేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. అనేక సంవత్సరాలుగా ఎస్ఈ కార్యాలయంలోనే ఉండిపోయారు. డిప్యుటేషన్ ముసుగులో ‘ఫెవికాల్’ వేసుకొని తిష్ట వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఈయనకు ప్రత్యేకంగా గది కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ● ఓ ఇరిగేషన్ ఉద్యోగి జిల్లా కేంద్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం, లోక్ డివిజన్, ధర్మవరం డివిజన్ అంటూ జిల్లా కేంద్రంలోనే తిరుగుతున్నారు తప్ప ఏనాడు క్షేత్రస్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. ఇలాంటి ఉద్యోగులు హెచ్చెల్సీలో దాదాపు 25 మంది విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ప్రాజెక్టు కీలకమైంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి తాగునీరు, దాదాపు 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్టులో పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. ఉద్యోగుల నియామకాల్లో విపరీతమైన రాజకీయం సాగుతోంది. పలుకుబడి ఉన్న వాళ్లు ఎప్పుడూ కీలక స్థానాల్లో ఉంటున్నారు. పైరవీలు చేయడం... ప్రాధాన్య సీట్లను దక్కించుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు కూడా వీరికే వత్తాసు పలుకు తుండటంతో చాలా మంది ఉద్యోగుల సర్వీసు మొత్తం సుదూర ప్రాంతాల్లోనే సాగుతోంది. వాస్తవానికి నీటి సరఫరా జరిగే సమయంలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా డిప్యుటేషన్లు వేసుకునే వెసులు బాటు ఉంటుంది. సరఫరా ఆగిన తర్వాత యథావిధిగా వారి స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ హెచ్చెల్సీలో ఏళ్లుగా డిప్యుటేషన్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా పైరవీలకే పెద్దపీట..! బదిలీలకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నుంచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారికి, మ్యూచువల్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ బదిలీలు కావాలని ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 2 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. హెచ్చెల్సీలో ఇప్పటి వరకూ బదిలీల గురించి అధికారికంగా ప్రకటించకపోయినా... ఇప్పటికే ఆ తంతు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా పైరవీలతో కొందరు ఉద్యోగులు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొన్ని, డిప్యుటేషన్లతో కొన్ని పోస్టులను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక భారీగానే ముడుపులు ముడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం ఉద్యోగుల బదిలీలు నేటిలోపు పూర్తి చేయాల్సి ఉంది. జేఈలు, డీఈలు, ఈఈల బదిలీలు ఈఎన్సీ స్థాయిలో ఉంటాయి. మిగిలిన పోస్టులకు ఎస్ఈ స్థాయిలో బదిలీలు చేస్తాం. జీఓ ప్రకారం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామే తప్ప ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి ఉండదు. డిప్యుటేషన్ల రద్దు విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – పురార్థనరెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీహెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే విధులు డిప్యుటేషన్ ముసుగులో తిష్ట అధికారులకు బురిడీ -
● ఇదీ జనమెరిగిన ‘సత్య’ం
ధర్మవరం.. దుర్గంధమయమైంది. ఎటు చూసినా చెత్త కుప్పలు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో పారిశుధ్యం మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో ఎన్నడూ ఇంతటి దుర్భర స్థితిని చూడలేదని... సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటోందో ఊహించుకోలేక పోతున్నామని స్థానికులు అంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
ఇరు కుటుంబాల ఘర్షణ
తాడిపత్రి టౌన్/పెద్దపప్పూరు: నియోజకవర్గంలో టీడీపీ నాయకుల నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువులో ఇరు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందారు. వివరాలు.. తిమ్మనచెరువు గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు ఆదివారం గ్రామ దేవతలకు మొక్కు చెల్లించి విందు ఏర్పాటు చేసాడు. కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన ఓబులేసు కుటుంబసభ్యులూ హాజరయ్యారు. కాగా, ఓబులేసుకు కుమార్తె రత్నమ్మ, కుమారులు రాజు, నాగేంద్ర, ఓబులేసు ఉన్నారు. రత్నమ్మకు 15 సంవత్సరాల క్రితమే వివాహమైంది. కుమార్తె కుటుంబానికి తండ్రికి మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విందు కార్యక్రమంలో ఇరు కుటుంబాలు తారసపడి ఘర్షణకు దిగాయి. రత్నమ్మపై తండ్రి ఓబులేసు, తమ్ముడు రాజు చేయి చేసుకున్నారు. దీంతో రత్నమ్మ భర్త చిన్నరంగయ్య, అమె బావ పెద్దరంగయ్య, కొడుకు మనోజ్ వెంటనే ఓబులేసు, రాజుపై కర్రలతో, పైపులతో దాడి చేశారు. తండ్రిని, అన్నను కొడుతున్నారన్న విషయం తెలుసుకున్న నాగేంద్ర, ఓబులేసు వెంటనే అక్కడకు చేరుకుని చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య, మనోజ్పై కొడవలి, కర్రలతో ప్రతి దాడికి దిగారు. ఘటనలో వీరితో పాటు బంధువులు కిట్ట, వేణుకూ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి, అనంతరం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓబులేసు కుమారుడు రాజు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వేమనాథరెడ్డి కారు డ్రైవర్ కావడంతో టీడీపీ నాయకులు వెంటనే రాజకీయ రంగు పులిమి ఆ పార్టీ నేతలపై దాడులు చేశారంటూ వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేసేలా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు. కాగా, ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ రంగు పులిమిన పచ్చ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసు బనాయించేలా కుట్ర -
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది. నాలుగు మండలాల్లో విస్తారంగా నిమ్మ సాగు తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పుట్లూరు మండలాలతోపాటు వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని రైల్వే కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో నిమ్మ సాగు విస్తారంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి తాడిపత్రిలోని మార్కెట్ యార్డుకు నిమ్మ కాయలను మంగళ, శుక్ర, ఆదివారాల్లో రైతులు తీసుకువస్తుంటారు. బస్తాలో 1,000 నుంచి 1,100 వరకు నిమ్మకాయలు ఉంటాయి. కాయ నాణ్యత, సైజును బట్టి మూడు రకాలుగా విభజించి వేలం వేస్తారు. వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ ధర గిట్టుబాటు కాకపోతే రైతులు జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మార్కెట్లో తగ్గిన నిమ్మకాయల ధరలు.. గత ఏడాది ఇదే సమయానికి నిమ్మ ధరలు రైతులకు కాస్త వెసులుబాటుగా ఉండేది. అప్పట్లో బస్తా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అమ్ముడు పోయింది. ఈ ఏడాది రుతు పవనాలు వారం రోజులు ముందుగా జిల్లాను పలకరించాయి. దీంతో ఆకాశం మబ్బులు కమ్ముకోవడం, వాతావరణ పరిస్థితులు చల్లబడటంతో నిమ్మ ధరలు అమాంత పడిపోయినట్లుగా తెలుస్తోంది. బస్తా రూ.5వేల నుంచి రూ.1,500 లోపు ఆందోళనలో రైతులు మరింత తగ్గుతాయి నేను తాడిపత్రిలోని మార్కెట్లో డైలీ నిమ్మకాయలు అమ్ముతుంటాను. గత నెలలో రూ.20కి 5 కాయలు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.10కే 5 కాయలు ఇస్తున్నాం. పరిస్థితి చూస్తుంటే నిమ్మకాయల ధరలు మరింత తగ్గే అవకాశముంది. – రసూల్బీ, వ్యాపారి, తాడిపత్రి -
కమ్ముకుంటున్నా.. కరుణించట్లేదు!
అనంతపురం అగ్రికల్చర్: ఆశల నైరుతి రుతుపవనాలు ఈ సారి చాలా ముందుగానే గత నెల 26న ప్రవేశించడంతో అన్నదాతలు సంబరపడ్డారు. ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా విస్తారంగా వర్షాలు పడతాయని ఆశించారు. కానీ... ‘నైరుతి’ ప్రవేశించి వారం కావొస్తున్నా ప్రభావం మాత్రం చూపడం లేదు. రుతుపవనాలు రాకమునుపు జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ‘నైరుతి’ ప్రవేశించాక అనుకూల వాతావరణం మధ్య మంచి వర్షాలు కురుస్తాయని ఆశించినా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వారం రోజులుగా అక్కడక్కడా తేలికపాటి మినహా ఎక్కడా మంచి వర్షపాతం నమోదు కాలేదు. 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి మేఘాలు చెదిరిపోతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. 36 నుంచి 38 డిగ్రీలు, రాత్రిళ్లు 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల 15 నుంచి... జూలై నెలంతా ఖరీఫ్ కింద పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టకపోవడం.. కూటమి సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం లేక సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. ఇంకా మొదలు కాని ‘నైరుతి’ ప్రభావం గాలి వేగానికి చెదిరిపోతున్న మేఘాలు -
ద్రోహులను పార్టీ ఉపేక్షించదు
● పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ క్రమ శిక్షణ నూతన కమిటీని అధిష్టానం నియమించిందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చైర్మన్గా ఉన్న కమిటీలో సభ్యులుగా తనతో పాటు తానేటి వనిత, రెడ్డిశాంతి, అనిల్కుమార్ ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు, విధివిధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆశయం మేరకు ప్రజలతో పార్టీ కేడర్ ఉండాలన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచినా, ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న వారిలో పార్టీ మార్పు కోరుతోందని, అయినా వారు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా, ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారన్నారు. బహిష్కరణకు గురైన వారిలో మార్పు రాకుండా అదే పంథాను కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వారిని సమర్థించే నాయకత్వంపైన కూడా చర్యలుంటాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన సోనాక్షి అనంతపురం: సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) ఆధ్వర్యంలో గోవా వేదికగా గత నెల 30 నుంచి రెండు రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించగా.. రోలర్ స్కేటింగ్ విభాగంలో జిల్లాకు చెందిన చిన్నారి ప్రతిభ చాటింది. అండర్–5 కేటగిరిలో ఏకంగా రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కె.వేణుగోపాల్, మౌనిక దంపతుల కుమార్తె సోనాక్షిని ఆమె చదువుతున్న మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం ఆదివారం అభినందించింది. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బదిలీ అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం ఉత్తర్వులు రాగా...మధ్యాహ్ననికి ఆయన రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న వెంకటేశును నియమించారు. అలాగే డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య రెండు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. మరో పోస్టు కొద్ది రోజులుగా ఖాళీ ఉంది. దీంతో ఈ రెండు స్థానాలను అధికారులు భర్తీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న మునీర్ఖాన్, కర్నూలు జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న శ్రీనివాసులును ఇక్కడికి బదిలీ చేశారు. అలాగే ఇక్కడి డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న సరళను కర్నూలు డీఈఓ పరిధిలోని పాఠ్యపుస్తకాల విభాగానికి బదిలీ చేశారు. ప్రమాదంలో వివాహిత మృతి రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి సమీపంలో చోట చేసుకున్న ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... ఆవులదట్ల గ్రామానికి చెందిన వివాహిత కవిత(28) ఆదివారం తన సోదరుడు నవీన్తో కలిసి ద్విచక్ర వాహనంపై గుండ్లపల్లికి బయల్దేరారు. కదరంపల్లి టోల్గేట్ సమీపంలోకి చేరుకోగానే వెనుకనే ఆర్బీ వంక గొల్లలదొడ్డి గ్రామం నుంచి కెంచానపల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న శివప్ప ఢీకొన్నాడు. ప్రమాదంలో బలమైన గాయమైన కవితను ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. నవీన్తో పాటు ప్రమాదానికి కారణమైన శివప్ప, అతని తాత ఉలెప్పకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఉలెప్పను అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, మృతురాలు కవితకు భర్త నాగరాజు, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
వంచకుడిపై చర్యలు తీసుకోండి
● పోలీసులను ఆశ్రయించిన యువతి ● న్యాయం చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో గుమ్మఘట్ట: ప్రేమ పేరుతో తనను లోబర్చుకుని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరి పెద్ద కుమార్తె జిల్లా సరిహద్దున ఉన్న కర్ణాటకలోని మొలకాల్మూరులో ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో సొంత గ్రామానికి చెందిన నాగప్ప, నాగమ్మ దంపతుల కుమారుడు సురేష్ లోబర్చుకున్నాడు. పెళ్లి పేరుతో మూడేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్నాడు. ఆమె అడిగిన ప్రతిసారీ తన అన్న పెళ్లి జరిగేంత వరకూ ఓపిక పట్టాలని నచ్చచెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం యువకుడి అన్నకు పైళ్లెంది. దీంతో పది రోజుల క్రితం ఆమె నిలదీయడంతో యువకుడు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వారు స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఎస్ఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా విచారిస్తున్నామని తెలిపారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు... కక్కలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 144/2ఏలో మొత్తం 1.76 ఎకరాల్లో ఆర్.కృష్ణారెడ్డి కుమారుడు హనుమంతరెడ్డికి 0.73 సెంట్లు, మహమ్మద్ షఫీ కుమారుడు సయ్యద్ షామీర్కు 0.58 సెంట్లు, మహేష్బాబు భార్య జి.విజయలక్ష్మికి 0.08 సెంట్లు, షేక్ మహబూబ్బాషా కుమారుడు షేక్ ఇమాం బాషాకు 0.08 సెంట్ల స్థలం ఉంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గత 20 సంవత్సరాలుగా పక్కాగా ఉన్నాయి. వీటి ఆధారంగా బ్యాంక్ రుణాలు సైతం పొందారు. ఆ స్థలంలో నీటి బోర్లు, కాంపౌండ్ వాల్, షెడ్డు, డోర్ నంబర్లు, కరెంట్ బిల్లులూ ఉన్నాయి. గత నెల 28న సర్వేయర్ ఉమామహేశ్వర్ ఫోన్ చేసి హద్దులు చూపిస్తానని తెలపడంతో వారు హక్కుదారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే ప్రహరీని జేసీబీతో కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం సాగుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనంతపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన 50 మంది అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి తమదంటూ దుర్భాషలాడుతూ హక్కుదారులను పక్కకు లాగేశారు. బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దౌర్జన్యపరులపై ఎలాంటి చర్యలూ లేవు. అలాగే కియా కార్ల షోరూం వెనుక ఉన్న ఎకరాలోపు స్థలంలో కుటుంబ సభ్యులపై అనంతపురం, రాప్తాడు ప్రజాప్రతినిధులకు చెందిన ముఖ్య అనుచరులు దాడి చేశారు. నగరంలోని అరవిందనగర్కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ గుప్తాకు చెందిన ఈ స్థలం అత్యంత విలువైనది. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు శనివారం ఆ స్థలం వద్దకెళ్లి కబ్జాకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ ప్రసాద్ గుప్తా, అతని కుమారులు ప్రణీత్, సాయినాథ్ అక్కడకు చేరుకోవడంతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో వెంకటేశ్ప్రసాద్ గుప్తా చెవికి తీవ్ర గాయమైంది. బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కె.సాయినాథ్ మాట్లాడుతూ.. భూ వివాదాలపై ప్రాథమికంగా విచారణ చేపడతామన్నారు. బాధితులకు రాత్రి, ఉదయం ఫోన్ చేసి విచారణకు రావాలని సూచించామని, వారిచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
అడిషనల్ ఎస్పీ సేవలు చిరస్మరణీయం
అనంతపురం: అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి సేవలు చిరస్మరణీయమని ఎస్పీ జగదీష్ అన్నారు. అడిషనల్ ఎస్పీ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారని అడిషనల్ ఎస్పీని కొనియాడారు. అనంతరం అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ పోలీసుశాఖలో చేరి ప్రజలకు సేవలు అందించడం సంతృప్తి ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ షేక్ ఇలియాజ్ బాషా, డీఎస్పీలు రవిబాబు, వెంకటేశులు, శ్రీనివాస్, మహబూబ్ బాషా, నీలకంఠేశ్వర రెడ్డి (ఏఆర్), గురునాథ్ బాబు, ప్రసాదరెడ్డి, బీవీ శివారెడ్డి, ప్రభాకర్, మహేశ్వర్రెడ్డి, ఏఓ రవిరాం నాయక్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ● ఉద్యోగ విరమణ చేసిన పలువురు పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఘనంగా సత్కరించారు. రామాంజినేయులు (ఎస్ఐ) జిల్లా స్పెషల్ బ్రాంచి, చంద్రశేఖర్ (ఎస్ఐ) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అనంతపురం, శ్రీధర్ బాబు (ఏఎస్ఐ) యాడికి, శివశంకర్ (ఏఎస్ఐ) అనంతపురం టూటౌన్, ఈశ్వర్ (ఏఎస్ఐ) కణేకల్లు, అయూబ్ బాషా, హెడ్కానిస్టేబుల్– వన్టౌన్ అనంతపురం, వెంకటేశులు కానిస్టేబుల్– ఒన్టౌన్ పోలీస్ స్టేషన్, అనంతపురం ఉద్యోగ విరమణ చేశారు. వీరిందరికీ ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసనాగ్రహం
● రాజేష్ నాయుడుపై క్రిమినల్ చర్యలకు డిమాండ్ అనంతపురం: మహానాడుకు జన సమీకరణ చేయలేదని వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అశ్వత్థరెడ్డిని టీడీపీ 30వ డివిజన్ ఇన్చార్జ్ రాజేష్నాయుడు పరుష పదజాలంతో దూషించడంపై సచివాలయ ఉద్యోగులు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీకాంత్ యాదవ్కు బాధితుడితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, రామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమానికి జనాలను సమీకరించే బాధ్యత సచివాలయ ఉద్యోగులది కాదన్నారు. బాధితుడు అశ్వత్థరెడ్డికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతూ భయభ్రాంతులకు గురిచేస్తే విధులు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ● జిల్లాలోని కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి పట్టణాల్లో సచివాలయ ఉద్యోగులు శనివారం ధర్నా చేసి టీడీపీ నేత రాజేష్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదన్నారు. జాబ్చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తిస్తామే తప్ప ఏ పార్టీకీ కొమ్ము కాసే ప్రసక్తే లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
● కారును ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు ● ఒకరు మృతి.. మరో నలుగురికి గాయాలు ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: ఓవర్ టేక్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. కారును కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరానికి చెందిన జాన్రెడ్డి (80), చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె షైనీదీప్తి, అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని సందర్శించి శనివారం కారులో తిరుగు పయనమయ్యారు. బూదగవి సమీపంలో బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కూతురు, అల్లుడుతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రతమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
●మీ సేవలు అమూల్యం
అనంతపురం అర్బన్: ఉద్యోగులుగా ప్రభుత్వానికి, ప్రజలకు మీరు అందించిన సేవలు అమూల్యమని కలెక్టర్ వినోద్కుమార్ కొనియాడారు. వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసి అధికారులు, ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తరఫున శనివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరై ఉద్యోగ విరమణ చేసిన వారికి శాలువా కప్పి మొమెంటో, పూలమొక్క అందించి సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరూ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాక్షించారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
స్టేషన్ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా స్టేషన్ పాయింట్లు (పని చేస్తున్న స్కూల్) గరిష్టంగా 24కు మించి ఉండకూడదు. ఎనిమిదేళ్ల సర్వీసుకు (3వ కేటగిరీ) 24 పాయింట్లు వస్తాయి. ఆపైన 9–10 ఏళ్లు సీనియారిటీ ఉన్నా..గరిష్టంగా ఎనిమిదేళ్లకే పాయింట్లు పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. అయినా కొందరు టీచర్లు ఇష్టానుసారంగా నమోదు చేసుకున్నారు. సరి చేయాల్సిన మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా వందలాది మంది టీచర్లు ఇష్టానుసారంగా స్టేషన్ పాయింట్లు నమోదు చేసుకున్నారు. ఎస్జీటీ తెలుగులో 3,872 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వీరిలో 84 మంది ఎస్జీటీలు స్టేషన్ పాయింట్లు 24కు పైగా వేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎడిట్ చేయాలని డీఎస్ఈ నుంచి డీఈఓలు, ఎంఈఓలకు ఆదేశాలు వచ్చాయి. పట్టించుకోని ఎంఈఓలు ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను..సంబంధిత టీచర్లతో హార్డ్కాపీలు తెప్పించుకుని వారు వేసుకున్న పాయింట్లను పరిశీలించి ఆమోదం తెలపాలి. చాలా మండలాల్లో ఎంఈఓలు పట్టించుకోని కారణంగా ఈ ప్రక్రియ సరిగా జరగలేదు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగానే నిర్ధారించారు. తర్వాత డీఈఓ లాగిన్కు వచ్చిన దరఖాస్తులను కూడా కార్యాలయ సిబ్బంది అలానే నిర్ధారించి పంపారు. ఫలితంగానే వందలాది మంది టీచర్లకు స్టేషన్ పాయింట్లలో తేడా వచ్చింది. వీటిని సరిదిద్దుతున్నామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ‘ప్రత్యేక’ పాయింట్లలోనూ అడ్డదారులు కొందరు టీచర్లు అనుకూలమైన స్థానాలకు వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యాలు, వ్యాధుల బారిన పడిన వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నా, ప్రత్యేక పాయింట్లు పొందినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే..లేని రోగాలను సృష్టించుకుని అడ్డదారుల్లో నకిలీ సర్టిఫికెట్లు పొంది పాయింట్లు పొందుతుండడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. డి.హీరేహాళ్ మండలంలో పని చేస్తున్న ఓ ఎస్జీటీ ఇటీవల బైకుపై నుంచి కిందకు పడ్డాడు. ఇదే అదనుగా తనకు మేజర్ సర్జరీ జరిగినట్లు ప్రచారం చేసుకుని నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకుని.. ప్రత్యేక పాయింట్లు పొందాలని చూస్తున్నాడు. ఈయన వ్యవహారంపై కొందరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి బదిలీలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న మెడికల్ సర్టి ఫికెట్లను పున:పరిశీలించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ఎవరైనా మెడికల్ సర్టిఫికెట్లను దుర్వినియోగపరిస్తే.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కువ పాయింట్లు నమోదు చేసుకున్న 84 మంది ఎస్జీటీలు అధికారుల పరిశీలనలో వెలుగులోకి.. -
ఏడాదిన్నర నిరీక్షణకు తెర
● తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు పునఃప్రారంభం రాయదుర్గంటౌన్: మరమ్మతులు, అభివృద్ధి పనుల పేరిట దాదాపు ఏడాదిన్నరగా రద్దు చేస్తూ వస్తున్న తిరుపతి – కదిరిదేవరపల్లి రైలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాయదుర్గం ప్రాంత ప్రజలకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. రాయదుర్గం – తుంకూరు మార్గంలో ట్రాక్ పనులు పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు నడుపుతున్న ఏకై క రైలును సైతం రద్దు చేస్తూ వస్తుండడంతో ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఈ రైలు ఇప్పటి దాకా గుంతకల్లు వరకు రాకపోకలకు సాగించేది. 2023 నవంబర్ నుంచి ఈ రైలును రెండు నెలలు, మూడు నెలల పాటు పాక్షికంగా రద్దు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 1న కదిరిదేవరపల్లికి ఈ రైలు (57405) తిరుపతిలో బయల్దేరుతుందని, అలాగే రెండో తేదీన కదిరిదేవరపల్లిలో (57406) రాయదుర్గం మీదుగా తిరుపతికి బయల్దేరుతుందని నైరుతి రైల్వే అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ బీఎల్ శివకుమార్ తెలిపారు. రోజూ తిరుపతిలో రాత్రి బయల్దేరి గుంతకల్లు, బళ్లారి మీదుగా రాయదుర్గానికి 11.03 గంటలకు చేరుకుంటుందని, అలాగే కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం స్టేషన్కు మధ్యాహ్నం 3.49 గంటలకు చేరుకుంటుందన్నారు. -
ఒక్క పథకమైనా అమలు చేశారా?
బుక్కరాయసముద్రం: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం మండలలోని దయ్యాలకుంటపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తున్నారన్నారు. హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావడానికి లక్ష్యంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4న నిర్వహించే ర్యాలీలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వెన్నుపోటుకు ఆద్యుడు బాబు రాజకీయాల్లో వెన్నుపోటుకు ఆద్యుడిగా చంద్రబాబు పేరుగాంచారని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే ఆయనకు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. చంద్రబాబు మోసాలకు నిరసనగా నార్పలలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, బీకేఎస్ జెడ్పీటీసీ భాస్కర్, సత్య నారాయణరెడ్డి, నారాయణరెడ్డి, నార్పల ఎంపీపీ నాగేశ్వరరావు, రాఘవరెడ్డి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, గోకుల్రెడ్డి, చామలూరు రాజగోపాల్, నాగలింగారెడ్డి, ప్రసాద్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు మోసాలను నిరసిస్తూ ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
నాణ్యమైన విత్తనం సిద్ధం చేయండి
● ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనం సిద్ధం చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) జిల్లా మేనేజర్ జి.వెంకటసుబ్బయ్య ఆదేశించారు. శనివారం ఆయన స్థానికంగా ఉన్న హిమబిందు ప్రాసెసింగ్ ప్లాంట్ను సందర్శించి, అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తనశుద్ధి చేసి ఆర్ఎస్కేలకు సరఫరా చేసిన విత్తనకాయలు బాగలేవని వెనక్కు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని ఆదేశించారు. అవుటన్, తూకాలు కచ్చితంగా ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 40 శాతం రాయితీతో 1.14 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం 15 ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి వేగవంతంగా జరగుతోందన్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 16 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న ఆర్ఎస్కేలకు 8,500 క్వింటాళ్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయశాఖ సహకారంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని, త్వరలోనే విత్తన పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్ వసీం చాంబర్లోకి టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి రాజేష్నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి (29వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ) అశ్వత్థరెడ్డిని నానా దుర్భాషలాడాడు. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని, రాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నాచేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్కు వినతిపత్రం ఇచ్చారు.నేను మాట్లాడేది రికార్డు చెయ్..కడపలో జరిగిన మహానాడుకు ఎవ్వరూ రాలేదంటూ రాజేష్నాయుడు ఫోన్లో అశ్వత్థరెడ్డిని నోటికొచి్చనట్లు బూతులతో దూషించాడు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా.. రాత్రి నుంచి ఫోన్చేసినా.. నీ క్లస్టర్ నుంచి ఏ..ల..కొడుకూ రాలా.. కాల్ రికార్డు చెయ్ నేను మాట్లాడేది.. సచివాలయంలో నువ్వేమైనా పీ..తున్నావా? రేయ్..ల...కొడకా.. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా.. ఒక్క ల.. ల..కొడుకు రాలేదు మీటింగుకు నీ..మ్మా..’ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటి కొచ్చినట్లు తిట్టాడు.పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగుల ధర్నా..ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్కు వినతిపత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇది మంచి సంస్కృతి కాదు..సచివాలయ ఉద్యోగిపట్ల దౌర్జన్యానికి పాల్పడ్డ రాజేష్నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఎలా? అశ్వత్థరెడ్డితో మాట్లాడిన తీరుచూస్తే టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు. – రామిరెడ్డి, సీపీఎం అనంతపురం నగర కార్యదర్శిరాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలి..టీడీపీ నేత రాజేష్నాయుడుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇతను డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగిని అంతుచూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. – ఎస్. నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శికూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు..టీడీపీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల నా చాంబర్లోకే టీడీపీ చోటా నాయకులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు నానా మాటలన్నాడు. ప్రభుత్వోద్యోగులపట్ల ఇలాగేనా ప్రవర్తించేది? మరీ ఇంత దారుణమా? ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులపట్ల ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తే ఎలా? – వసీం, మేయర్, అనంతపురం నగర పాలక సంస్థ -
జెడ్పీలో ఆరుగురికి పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురికి పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ల్యాబ్ అసిస్టెంట్, ఓ రికార్డు అసిస్టెంట్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో భీమయ్య (గుమ్మఘట్ట), ఫకృద్ధీన్ (సిద్దరాంపురం), లక్ష్మన్న (నాగసముద్రం), సాదిక్ బాషా (తగరకుంట), హరికృష్ణ (ముదిగుబ్బ), వెంకటేశులు (కళ్యాణదుర్గం) ఉన్నారు. వీరికి పదోన్నతుల ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేసి, అభినందించారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేసే ఉద్యోగులకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ సమక్షంలో ఉదయం 9:30 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులును ప్రకటిస్తూ పాలక వర్గం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు డీసీఎంఎస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన చాకలి రంగ (45)కు భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాఆపరుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన రంగ... శుక్రవారం కోమలి – జూటూరు గ్రామాల మధ్య ఉన్న పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ యువజన విభాగంలో పలువురికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి (అనంతపురం), రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజేష్ (ఉరవకొండ), రాష్ట్ర అధికార ప్రతినిధిగా గొర్ల మారుతీనాయుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా జి.రామాంజినేయులు (కళ్యాణదుర్గం), వాసగిరి నాగ్ (అనంతపురం), జోనల్ అధ్యక్షుడిగా వై.ప్రణయ్రెడ్డి (ఉరవకొండ) నియమితులయ్యారు. ‘ఖజానా’లో బదిలీల సందడి అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖజానా శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై బదిలీల నిర్వహణ కమిటీ సభ్యులు అనంతపురం జిల్లా డీడీ వెంకటేశ్వర్లు, ఏటీఓ రాణి, శ్రీసత్యసాయి జిల్లా డీడీ శ్రీనివాసులు, ఏటీఓ పవిత్ర శుక్రవారం అనంతపురంలోని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ చాంబర్లో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది సీనియర్ అకౌంటెంట్లు, 15 మంది జూనియర్ అకౌటెంట్లు, 12 మంది ఆఫీస్ సబార్డినుట్లు చొప్పున మొత్తం 61 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీనియర్ అకౌంటెంట్లు 19 మంది, జూనియర్ అకౌంటెంట్లు 9 మంది, ఆఫీసు సబార్డినేట్లు 8 మంది ఉన్నారు. అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఖజానా శాఖలో బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అంటూ ఏదీ ఉండదన్నారు. ఖాళీల జాబితా ప్రకటించామని, బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం బదిలీ ప్రక్రియ పూర్తి చేసి స్థానాలను కేటాయిస్తామన్నారు. రైల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ గుత్తి: రైలులో నగదు, నగలు చోరీ చేస్తూ ఓ దొంగ పట్టుపడ్డాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం మచిలీపట్నం – ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలులోని కోచ్–1లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఓ ప్రయాణకుడి బ్యాగ్లోని బంగారు నగలు, నగదు, సెల్ఫోన్లు అపహరిస్తుండగా గమనించి మరో ప్రయాణికుడు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. రైలు గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకోగానే జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సివిల్ కానిస్టుబుల్ భాస్కర్ నాయుడు కోచ్–1లోకి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒకటిన్నర తులం బంగారు ఆభరణాలు, రూ.10 వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడు నంద్యాల జిల్లాకు చెందిన జయరాజ్గా గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్ఏ ఇంగ్లిష్ ఖాళీలు పెంచాలని రెండోరోజూ ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్ల ఖాళీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండోరోజూ శుక్రవారం అనంతపురంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంగ్లిష్ పదోన్నతుల అంశంపై హైకోర్టులో వేసిన కేసు పరిష్కారమైందన్నారు. 2023, జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 వరకు రూ. 2,500 గౌరవ వేతనంతో తాత్కాలిక పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్లుగా పనిచేసిన ఎస్జీటీలకు ఇంగ్లిష్ టీచర్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 230 ఖాళీలకు గాను కేవలం 19 మాత్రమే ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారని, వీటిని 2023లో తాత్కాలిక పద్ధతిలో ఇచ్చిన 230 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల ఖాళీలుగానే చూపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి 30 శాతం కోటా 103 పోస్టులు కేటాయించి ఇందులో 70 శాతం ఇవ్వాల్సిన పదోన్నతులను కాదని కేవలం 19 మాత్రమే ఇస్తామనడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి సూర్యుడు, చంద్రశేఖర్, నాగభూషణ, జయరాం నాయక్, జయపాల్ నాయుడు, సురేష్, నరసింహులు, మురళి, భాస్కర నాయుడు, రవి, విజయ శ్రీ, పరిమళ, తులసి, మాధవి,ఆదిలక్ష్మి, కౌసర్ బాను పాల్గొన్నారు. ధర్నాకు ఎస్టీయూ రమణారెడ్డి, రామాంజనేయులు, యూటీఎఫ్ నాగేంద్ర, పీఆర్టీయూ విష్ణువర్దన్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్టీఏ నాగిరెడ్డి, శ్రీనివాసులు, రవినాయక్, నాగభూషణ, ఆర్ఈఎఫ్ నారాయణ నాయక్ మద్దతు తెలిపారు. -
రాష్ట్రంలో దగాకోరు పాలన
అనంతపురం ఎడ్యుకేషన్: మహానాడులో చంద్రబాబు ప్రసంగం పరిశీలిస్తే అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే బాధ స్పష్టంగా కనిపిస్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనలో అన్ని విధాలుగా దగాపడ్డామనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారన్నారు. టీడీసీ, జనసేనతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే భావనలో ఉన్నారన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు సైతం స్పష్టత వచ్చిందని, అందుకే రానున్న రోజుల్లో అధికారం కోల్పోవాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. చెప్పుకునేందుకు వంద ఉన్నాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ నెరవేర్చారన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధిని సైతం పరుగులు పెట్టించారన్నారు. జగన్ పాలనలో ప్రజలకు చేకూరిన లబ్ధిపై చెప్పుకునేందుకు వంద ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో చెప్పుకునేందుకు ఏ ఒక్కటీ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమల ఊసే లేదు కానీ, అన్నీ అమలు చేశానని చంద్రబాబు గొప్పలకు పోతున్నారని, ఆయనకు అల్జీమర్స్ పీక్స్కు వెళ్లిందనేందుకు ఇదే నిదర్శమన్నారు. ఈ పరిస్థితులను చూస్తూంటే ఆయన కుర్చీని లోకేష్బాబు లాక్కొనే టైం వచ్చిందనే అనుమానం కలుగుతోందన్నారు. వ్యవస్థలన్నీ నాశనం చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అమ్మకాలు, వెనుకబడిన ప్రాంతాల తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. వలంటీర్ల వ్యవస్థ, ఉన్న ఉద్యోగాల రద్దు, సచివాయాలు, ఆర్బీకేలు, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశారన్నారు. నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. పథకాల కోసం గొంతెత్తితే గొంతుకోస్తారనే భయాన్ని సృష్టించారన్నారు. రాష్ట్రానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే చంద్రబాబు వాస్తవానికి కరువుకు, అపద్ధాలకు, దగాకోరు పాలనకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని విస్మరించారన్నారు. అభివృద్ధి పేరుతో ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి, వాటిని పక్కదారి పట్టించడంపై ఉన్న తపన నీళ్లు పారించే విషయంగా చంద్రబాబుకు లేదన్నారు. అందుకే రాయలసీమకు కాని, గ్రేటర్ రాయలసీమకు గాని తాగు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. గండికోట నుంచి గాలేరు–నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి పథకం తీసుకొచ్చి సగానికి పైగా పనులు చేస్తే చివరకు ఆ ప్రాజెక్ట్ను చంద్రబాబు రద్దు చేశారన్నారు. హంద్రీనీవా మొదటిదశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీల నీటిని అదనంగా తీసుకొచ్చే పనులను ప్రారంభిస్తే ఆ ప్రాజెక్ట్నూ రద్దు చేశారన్నారు. నారా వారి పాలనపై రాయలసీమ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు పొగాకు రామచంద్ర, కదిరి ఇస్మాయిల్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజి, గంగుల సుధీర్రెడ్డి, బండిపవన్, ఈశ్వరయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
అనంతపురం అర్బన్: బాలకార్మిక వ్వవస్థను నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. బాలకార్మిక వ్వవస్థ నిర్మూలనపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జేసీ సమీక్షించారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాలకార్మికులు, డ్రాపౌట్లను గుర్తించి సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలలకు విముక్తి కల్పించాలన్నారు. బాలకార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీధిబాలలు, యాచన చేస్తున్న వారిని గుర్తించడంతో పాటు పునరావాసం కల్పించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి అధికారులకు జేసీ శివ్నారాయణ్ శర్మ ఆదేశం -
బాసిజం... బానిసత్వం ఈ రెండూ నాటికి, నేటికీ రెవెన్యూ శాఖను వీడడం లేదు. ఇది ఏ ఒక్క స్థాయిలోనో అనుకుంటే పొరపాటే. అన్ని స్థాయిలోనూ ఇదే తీరు కొనసాగుతోంది. ఇదేమని ప్రశ్నిస్తే మరింత అణచివేత... విధుల పరంగా వేధింపులు తప్పడం లేదు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు మౌనంగ
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో కీలకంగా ఉండే రెవెన్యూ శాఖ అన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఈ శాఖలో ఉన్నతాధికారుల బాసిజానికి కింది స్థాయి ఉద్యోగులు బానిసలుగా మారక తప్పడం లేదు. ముఖ్యంగా బదిలీల ప్రక్రియలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా బయటపడుతోంది. అన్ని శాఖల్లోలా ఇక్కడి ఉద్యోగులకు బదిలీలకంటూ ప్రత్యేక కౌన్సెలింగ్ ఉండక పోవడమే ఇందుకు నిదర్శనం. బదిలీ కోసం స్థానాల ఆప్షన్లతో దరఖాస్తు చేసుకోవడం వరకే ఉద్యోగుల వంతు.. అటు తర్వాత ఆ స్థానానికి వారిని బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం అనేది అధికారుల చేతుల్లో ఉంటుంది. ఆప్షన్ ప్రకారం ఇవ్వచ్చు... లేదా ఇవ్వని స్థానానికి బదిలీ చేయవచ్చు. ‘ఎందుకు?... ఏమిటి?... ఎలా?’ అని మాత్రం ప్రశ్నించకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారు ‘చుక్కలు’ చూడాల్సిందే. ఇక ‘మేనేజ్’ చేసుకునే సామర్థ్యం ఉన్నవారు కోరిన చోట పోస్టింగ్ పొందవచ్చు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు... సాక్షాత్తూ బానిసత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న రెవెన్యూ ఉద్యోగులే కావడం గమనార్హం. అన్ని స్థాయిల్లోనూ బాసిజం రెవెన్యూ శాఖలో గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయి వరకు బాసిజం ఏ స్థాయిలో ఉందో అంతకంటే ఎక్కువ స్థాయిలో బానిసత్వమూ కనిపిస్తోంది. గ్రామ స్థాయి అధికారి తన కింద వారిపై బాసిజం చూపిస్తూ.. పైవారు ఏది చెప్పినా కాదనకుండా చేస్తారు. మండలస్థాయి అధికారి తన కింద వారిపై బాసిజం చూపిస్తారు. డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఏది చెప్పినా (ఆర్థిక, ఆర్థికేతర) కిమ్మనకుండా ఆగమేఘాలపై చేసి పెడతారు. ఒక ఆదేశం జిల్లా స్థాయి అధికారి నుంచి డివిజన్ స్థాయి అధికారికి వస్తే... ఆ ఆదేశం వెంటనే మండల స్థాయికి... అక్కడి నుంచి గ్రామ స్థాయికి వెళుతుంది. ఎలా చేస్తారు? అనేది పైవారికి అవసరం లేదు. వారు చెప్పింది చేయాలి... చేయకపోతే ‘సినిమా’ చూడాల్సిందే. ఇక్కడ నో కౌన్సెలింగ్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు బదిలీల సమయంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ప్రకియ అనేది నిర్వహించడం పరిపాటి. అదికూడా ఉద్యోగుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తుంటారు. చివరికి పోలీసు శాఖలోనూ కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో చూపించిన ఖాళీల్లో వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తుంటారు. ఇక మెప్మా, గ్రంథాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ను స్వయంగా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అయితే రెవెన్యూశాఖలో ఈ విధానం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ విధానం లేదు. బదిలీలు చేయడంలోనూ అధికారుల బాసిజమే పనిచేస్తుంది. అధికారులు బదిలీ చేసిన స్థానాలకు మారుమాట్లాడకుండా ఉద్యోగులు వెళ్లాల్సిందే. స్టేషన్ అమలు కాదు... రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. ప్రధానంగా ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి అనే నిబంధన విషయంలో ‘స్టేషన్’ అమలు కాదు. ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ) బదిలీల క్రమంలో మండలం స్టేషన్గా తీసుకోకుండా... గ్రామం స్టేషన్గా తీసుకుంటున్నారు. దీంతో పలువురు వీఆర్ఓలు ఒక మండలంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ అవుతున్నారే తప్ప ఆ మండలం వీడడం లేదు. ఇక డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు విషయంలో డివిజన్ స్టేషన్గా తీసుకోవడం లేదు. దీంతో వారు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దారు, పౌర సరఫరాల కార్యాలయాల్లో... ఇలా ఇక్కడిక్కడే పోస్టింగ్ పొందుతూ ఒకే స్టేషన్లో ఏళ్లుగా పాతుకుపోతున్నారు. ఈ విమర్శలు రెవెన్యూ వర్గాల నుంచే వస్తుండం గమనార్హం. రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లోనూ ఇదే తీరు బదిలీల్లోనూ ఇదే వైఖరి ఉద్యోగులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ అంటూ లేదు అధికారులు పోస్టింగ్ ఇచ్చిన చోటుకు వెళ్లాల్సిందే -
చౌక దుకాణాల వద్దే రేషన్
● నిస్సహాయులకు ఇంటి వద్దకే పంపిణీ అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డుదారులకు జూన్ నెలకు సంబంధించి బియ్యం, తదితర సరుకులు చౌక ధరల దుకాణాల (స్టోర్) వద్దే పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. 65 ఏళ్ల వయసున్న వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. చౌక దుకాణాల్లో ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో డీలర్లు కార్డుదారులకు అసౌకర్యం కల్పించినా, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైళ్లు సమగ్రంగా సిద్ధం చేయాలి ● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశంఅనంతపురం అర్బన్: నిషేధిత భూముల జాబితాలో ఉన్న చుక్కల భూములు, 22ఏ భూముల ఫైళ్లను సమగ్ర వివరాలతో సిద్ధం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలోని భూముల ఫైళ్లు సమగ్రంగా లేకపోతే వాటిని పరిష్కరించలేమన్నారు. చెక్లిస్ట్ ప్రకారం అన్ని వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం 22ఏకు సంబంధించి 16 క్లెయిమ్లను, చుక్కల భూములకు సంబంధించి 31 దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నవాటిని ఆమోదించారు. వివరాలు సమగ్రమంగా లేని వాటిని పునః పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఆర్బీఎస్కే శ్రీనివాస్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్దీన్, కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసు మలుపులు తిరుగుతోంది. పుట్టపర్తిలో జరిగిన ఘటన పోలీసుల పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలకే దొంగ, కేటుగాళ్లకు కేటుగాడు వంటివి సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ పు
ఎన్ఆర్ఐని చీటింగ్ చేసిన కేసులో భారీ ట్విస్టులు ● నిందితుడిని పోలీస్స్టేషన్లో పెట్టి స్థిరాస్తుల బదలాయింపు ● పోలీసుల ఆధ్వర్యంలోనే నిందితుడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి ● కేసు నమోదు చేసిన వారానికి అరెస్టు చూపించిన పోలీసులు ● పోలీసు అధికారులకు రూ.50 లక్షల డీల్ కుదిర్చిన టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడైన ఆర్వీన్ మహేంద్రకర్ను పుట్టపర్తికి చెందిన సత్యనారాయణ రాజు రూ.12.50 కోట్ల మేర మోసం చేశారు. ఈ కేసులో బాధితుడికి పెద్దగా లాభం చేకూరకపోగా నిందితుడి నుంచి పోలీసులకు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు, ద్వితీయశ్రేణి నాయకులకు బాగా లబ్ధి కలిగింది. పోలీసులకు రూ.50 లక్షల డీల్ ఎన్ఆర్ఐ మోసపోయిన కేసులో పోలీసులకు రూ.50 లక్షల డీల్ కుదిరినట్టు తెలిసింది. ఈ నెల 22న బాధితుడి ఫిర్యాదు మేరకు సత్యనారాయణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. 28వ తేదీ వరకు అరెస్టు చూపించలేదు. ఈ ఏడు రోజుల పాటు నిందితుణ్ని స్టేషన్లో హింసించి.. లొంగదీసుకుని దారికి తెచ్చుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, ఒక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారు. తాము చెప్పినట్టు చేస్తే మీకు రూ.50 లక్షలు ఇస్తామని టీడీపీ నాయకులు పోలీసు అధికారికి చెప్పడంతో తలూపిన సదరు అధికారి బాధితుణ్ని గోప్యంగా ఉంచి.. చేయాల్సిందంతా చేశారు. ఆస్తుల బదలాయింపు నిందితుడి పేరిట ఎక్కువ మొత్తంలో భూములు, స్థలాలు ఉన్నాయి. వీటిని కొట్టేయాలనేదే ప్రధాన ఆలోచన. పథకంలో భాగంగా అరెస్టుకు ముందే నిందితుడి పేరున ఉన్న కొన్ని భూములు ఓ మహిళ (ఎన్ఆర్ఐ భార్య) పేరిట బదలాయించారు. ఈమె పుట్టపర్తిలో పూల వ్యాపారం చేసుకునేది. వీసా సమస్య వస్తుందని గతంలో మహేంద్రకర్కు సదరు మహిళతో ప్రస్తుత నిందితుడు సత్యనారాయణరాజు పెళ్లి జరిపించారు. ప్రవాస భారతీయుడైన మహేంద్రకర్కు ఇక్కడి విషయాలు తెలియవు. దీంతో ఈమెను టీడీపీ నాయకులు, పోలీసులు భయపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణరాజు పేరుపై ఉన్న ఆస్తులు బుక్కపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో (డాక్యుమెంటు నంబర్లు 1563, 1564, 1584) ఆమె పేరుపై బదలాయించారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు ఎస్కార్టు వాహనాల్లో నిందితుణ్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారంటే పోలీసులు ఏ స్థాయిలో బరితెగించారో అంచనా వేయొచ్చు. ముందుగా ఆమె పేరుతో బదలాయించి.. ఆ తర్వాత తక్కువ ధరకు టీడీపీ నేతలు రాయించుకోవాలనేది ఎత్తుగడ. నిందితుణ్ని వారం రోజులు అరెస్టు చూపించకుండా చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ఇక్కడ భారీగా లబ్ధిపొందిన పోలీసు అధికారిపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐతో కలిసి పోలీసు బాస్లకు వసూళ్లు చేసి పెట్టడంలోనూ ఈ అధికారికి ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అరాచకాలు సత్యసాయి భక్తులకు విస్మయం కలిగిస్తున్నాయి. ఎన్నో దేశాల నుంచి సాయి సన్నిధికి భక్తులు వస్తుంటారు. ఇలా పోలీసులే నిందితుల నుంచి వసూళ్లు మొదలెడితే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో పుట్టపర్తి పోలీసులు తమను తాము కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమ ప్రయోజనాలను ఏమాత్రమూ పట్టించుకోని ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా తాను రాయలసీమ ప్రాంత వాసి అని మహానాడులో చెప్పారని, ఆయనకు ఈ ప్రాంతం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం గండికోట రిజర్వాయర్ను పట్టించుకోకపోవడం, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కోస్తా జిల్లా నేతలతో కలిసి ధర్నాలు చేయడం, విభజన హామీల్లో అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించడం, కర్నూలుకు రావాల్సిన హైకోర్టును.. బెంచ్ వరకే పరిమితం చేయడం వంటివి చేసిన చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గాలేరు నగరి, హంద్రీ–నీవాకు పునాదిరాయి మాత్రమే వేశారని, 1996 నుంచి ఏళ్ల తరబడి సీఎంగా పని చేసిన చంద్రబాబు ఆ ప్రాజెక్టులను ఒక్క కిలోమీటర్ కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. 40 టీఎంసీల సామర్థ్యం గల హంద్రీ–నీవాను 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చిన జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీ–నీవాను అనంతపురం, కర్నూలు జిల్లాకు పరిమితం చేసి, గండికోట నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు నీరందించి హంద్రీ–నీవాను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుని.. సీమకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అనంత పేర్కొన్నారు. జగన్ హయాంలో గండికోటకు 27 టీఎంసీల నీరు తీసుకువచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో హంద్రీ–నీవాకు రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, మరి జగన్ హయాంలో రూ.2వేల కోట్లకుపైగా ఖర్చు చేసిన విషయాన్ని దాచిపెడితే ఎలా బాబూ అన్ని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం హామీలు నెరవేర్చాలంటే తనను అధికారం నుంచి దించవద్దని, మళ్లీ గెలిస్తేనే హామీలకు గ్యారెంటీ అని, ఇప్పట్లో హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని చెప్పకనే చెబుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని అనంత మండి పడ్డారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తామని.. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పింఛన్ల కోత విధించి అర్హులకు అన్యాయం చేశారన్నారు. మహానాడు పేరిట మహాడ్రామా కడపలో టీడీపీ నిర్వహించింది మహానాడు కాదని మహాడ్రామా అని అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మూడు రోజుల కార్యక్రమమంతా ఆత్మస్తుతి పరనిందగా సాగిందన్నారు. ప్రజలకు ఏం చేస్తామనే విషయంపై నోరు మెదపలేదన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడారో ఆ వీడియోలను మహానాడులో ప్రదర్శించి ఉంటే బాగుండేదన్నారు. మామకు చేసిన మోసాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మబోరన్నారు. లోకేష్ తనకు తాను యువరాజులా భావిస్తూ ఆరు శాసనాలు అనడం, దాన్ని గేమ్ఛేంజర్ అంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో శాసనాలు ఉండవని గుర్తు చేశారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేశ్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జూన్ 4న వెన్నుపోటు దినం ఎన్నికల హామీలు అమలు చేయకుండా కూటమి చేసిన మోసాన్ని వివరిస్తూ జూన్ 4న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని చేపడుతున్నట్లు అనంత తెలిపారు. సమన్వయకర్తలతో కలసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, మల్లెమీద నరసింహులు, చింతా సోమశేఖర్రెడ్డి, నాయకులు కృష్ణవేణి, మధు, కేశవరెడ్డి, పుల్లయ్య, గుజ్జల శివయ్య, సాకే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం ఎన్నికల హామీల అమలులో తాత్సారం జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
టీబీ డ్యాంకు 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఏప్రిల్ 24 వరకు జీరో ఇన్ఫ్లో ఉండి 6.871 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే ఈ నెల మొదటి వారం నుంచి ఇన్ఫ్లో మొదలవడంతో శుక్రవారం ఉదయానికి 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదై నీటి నిల్వ 13.680 టీఎంసీలకు చేరింది. ఎగువ భాగం ఆగుంబే, తీర్ధనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. టీబీ డ్యాం లో 1,633 అడుగులకు గాను 1592.96 అడుగుల నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 153 క్యూసెక్కులు ఉంది. కాగా గత ఏడాది ఇదే సమయానికి 3.330 టీఎంసీల నీరు నిల్వ ఉండి, ఇన్ఫ్లో జీరో, అవుట్ఫ్లో 30 క్యూసెక్కులు ఉండేది. విత్తన నాణ్యతలో రాజీ పడంఅనంతపురం అగ్రికల్చర్/ బెళుగుప్ప: నాణ్యతా ప్రమాణాల మేరకు విత్తన వేరుశనగ శుద్ధి (ప్రాసెసింగ్) చేపట్టి రైతులకు మంచి విత్తనం అందేలా చూడాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం అనంతపురంలోని విజయ ఆగ్రోసీడ్స్, బాలాజీ ట్రేడర్స్, వేంకటేశ్వర ట్రేడర్స్ ప్రాసెసింగ్ ప్లాంట్లతో పాటు బెళుగుప్పలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. మొలకశాతం, అవుటన్ గురించి ప్రయోగత్మాకంగా తెలుసుకున్నారు. సరఫరాకు సిద్ధంగా ఉన్న వేరుశనగ బస్తాలు తూకం వేసి చూశారు. విత్తన నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, నాసిరకమని గుర్తించినా, బాగా లేవని వెనక్కి వచ్చినా సంబంధిత ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 శాతం రాయితీతో 50,952 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అదనపు కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టామని, జూన్ మొదటి వారంలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. జేడీఏ వెంట ఏడీఏ ఎం.రవి, టెక్నికల్ ఏఓ రాకేష్నాయక్, ప్రాసెసింగ్ ప్లాంట్ల పర్యవేక్షక ఏఓలు కిరణ్కుమార్రెడ్డి, సాయిలక్ష్మి, శేఖర్రెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
పాయింట్లపై ఫిర్యాదుల వెల్లువ
● స్టేషన్ పాయింట్లు 24కు మించి ఉండకూడదు ● 26, 28, 30 పాయింట్లు పొందిన టీచర్లపై ఫిర్యాదులు ● స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాల విడుదల ● అభ్యంతరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అధికారులు ● నేడు ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసుకున్న పాయింట్లపై శుక్రవారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గురువారం అర్ధరాత్రి స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితాలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయాన్నే పరిశీలించి.. కొందరు పాయింట్లు ఎక్కువ వేసుకోవడాన్ని గుర్తించి నగరంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాల వద్దకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు తరలివచ్చారు. ఒక స్కూల్లో ఎన్నేళ్లు పనిచేసినా గరిష్టంగా ఎనిమిదేళ్లకు 24 పాయింట్లు (3వ కేటగిరీ) పొందాలి. ఒక టీచరు పదేళ్లు పనిచేసినా వేసుకోవాల్సింది 24 పాయింట్లు. ఆ రకంగా సీలింగ్ పెట్టారు. సాంకేతిక సమస్య కారణంగా ఎన్నేళ్లు నమోదు చేసినా అన్ని పాయింట్లు పడ్డాయి. రీఅపోర్సన్కు గురైన టీచర్లు కూడా ఇష్టానుసారంగా పాయింట్లు నమోదు చేశారు. దీనిపై ఎంఈఓలు, డీఈఓలు పరిశీలించి అభ్యంతరాలు స్వీకరించి అదనంగా పడిన పాయింట్ల తొలిగింపునకు సిఫార్సు చేయాలంటూ విద్యాశాఖ డైరక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దాదాపు ఏ ఒక్క మండలంలోనూ ఈ పని జరగలేదు. ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను వచ్చినవి వచ్చినట్టు అఫ్రూవల్ చేసి డీఈఓ లాగిన్కు పంపారు. డీఈఓ కార్యాలయ టెక్నికల్ సిబ్బంది కూడా వాటిని వెంటనే అఫ్రూవల్ చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపారు. 300కు పైగా అభ్యంతరాలు స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలను పరిశీలించిన టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపారు. సుమారు ఆధారాలతో రాతపూర్వకంగా 300కు పైగా ఫిర్యాదులు చేశారు. వాటన్నింటినీ డెప్యూటీ డీఈఓల ద్వారా రాష్ట్ర అధికారుల లాగిన్లకు పంపారు. శనివారం రోజుకు ఫైనల్ జాబితా విడుదల కానుంది. ఆలోగా ఎన్ని అభ్యంతరాలు పరిష్కారమవుతాయో.. తాము ఎన్నో స్థానంలో ఉంటామోనన్న ఆందోళన చాలామంది టీచర్లకు పట్టుకుంది. కాగా శనివారం ఎస్జీటీ తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల కానుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీపై దుమారం చాలామంది అనర్హులు ప్రిపరెన్షియల్ కేటగిరీ జాబితాలో కనిపించడం పట్ల ఉపాధ్యాయుల్లో దుమారం రేపుతోంది. గార్లదిన్నె మండలంలో పని చేస్తున్న ఓ టీచరు.. కంటిచూపు తగ్గిందని వైద్య ధ్రువీకరణ పత్రం పొంది ప్రిఫరెన్షియల్ కేటగిరీలో హెచ్ఎం పదోన్నతి పొందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలోనూ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న టీచర్ల పేర్లను చూసి కంగుతింటున్నారు. సీకేపల్లి, అనంతపురం రూరల్, గుత్తి, రొళ్ల, శింగనమల, బత్తలపల్లి, కూడేరు, కణేకల్లు, ధర్మవరం, పెనుకొండ తదితర మండలాల పరిధిలోని స్కూళ్లల్లో కొందరు టీచర్లు నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అవయవాలు బాగున్నవారు కూడా ఈ జాబితాలో కనిపిస్తున్నారంటూ వాపోతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత సహజంగానే వివిధ రోగాల బారిన పడుతుంటారని, కొందరు వాటిని అసరగా చేసుకుని ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు పొందారంటున్నారు. ఎస్జీటీల జాబితాల్లో కుప్పలుతెప్పలుగా నకిలీరాయుళ్లు కనిపిస్తారంటున్నారు. -
చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో చంద్రబాబు పాలన అగమ్యగోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమని అన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారు. చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్నే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని చంద్రబాబు.. బనకచర్ల డ్యాం అంటూ ఊదరగొడుతున్నారు. కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు కాదు.. టీడీపీ నేతలు అవినీతి నిధులు పారిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి. ప్రజలను వంచించే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరు. నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన
● మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: ఎమర్జెన్సీ తలపించేలా పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులపై తప్పుడు కేసులు బనాయించి వారిని జైలుకు పంపించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అండ్ కో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సంపద సృష్టి, సూపర్ సిక్స్ హామీలు కేవలం చంద్రబాబు అభూత కల్పనగానే మిగిలిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. పాలన గాడి తప్పడంతో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటి పోతున్నాయన్నారు. లిక్కర్ స్కాంలో అసలైన దోషి చంద్రబాబు అని బెయిల్పై బయటకు వచ్చి పాలన సాగిస్తున్నాడనే విషయాన్ని టీడీపీ పెద్దలు గుర్తించాలన్నారు. రైతుల శ్రేయస్సును పూర్తిగా విస్మరించిన క్రెడిట్ కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. -
జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా, మండల పరిషత్ సహా అనుబంధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితా ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత అవకాశాన్ని బట్టి రిక్వెస్ట్ బదిలీలకు చోటు కల్పించాలని సూచించింది. బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులు 236 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ యాజమాన్యం పరిధిలో పని చేస్తున్న వారిలో 236 మంది ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. వీరిలో ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 136 మంది ఉండగా 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రిక్వెస్ట్ బదిలీల కోసం ఏకంగా వంద మంది దరఖాస్తు చేసుకున్నారు. అటెండర్లలో 64 మంది ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకోగా బదిలీల కోసం 59 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జాబితా సిద్ధం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిషత్ కార్యాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత మందిని బదిలీ చేయవచ్చనే సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక బృందం రూపొందించిన జాబిత పరిశీలన కోసం సీఈఓ వెంకటసుబ్బయ్య టేబుల్పైకి గురువారం చేరింది. ఆయన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. కొందరు అటెండర్లు పదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు. మరి కొందరు జిల్లా కేంద్రం దాటి బయటకు పోవడం లేదు. ఇక్కడిక్కడే జెడ్పీ లేదా పీఆర్ఐ, పీఐయూ, క్యూసీ, ఆర్డబ్ల్యూఎస్ ఇలా ఏదో ఒక ఆఫీసుకు బదిలీ చేయించుకోవడం పరిపాటిగా మారింది. జెడ్పీలో పని చేస్తూ ఏడాది కిందట ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు తిరిగి జెడ్పీకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల ఇళ్లు, జెడ్పీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకొందరు అనారోగ్యం సాకు చూపిస్తూ అందుకు అనుగుణంగా సర్టిఫికెట్లు సైతం సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేడు తుది ఆమోదం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వద్దకు శుక్రవారం పంపనున్నారు. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. శని లేదా ఆదివారంలోపు కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించే ఆలోచనలో జెడ్పీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ వెంకటసుబ్బయ్య పరిశీలనకు అర్హుల జాబితా నేడు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనుమతి కోసం ఫైల్ -
ట్రాక్టర్ నగర్ డైరెక్టర్గా డాక్టర్ పీపీ రావు
గార్లదిన్నె: మండల పరిధిలోని దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల, శిక్షణ, పరీక్షణ సంస్థ (ట్రాక్టర్ నగర్) డైరెక్టర్గా గురువారం డాక్టర్ పీపీ రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన డాక్టర్ బాలాజీ మురారి నాందేడ్ను మధ్యప్రదేశ్లోని బుద్ని సంస్థకు బదిలీ చేశారు. కాగా, డాక్టర్ పీపీ రావు 2016 నుంచి 2022 వరకు ట్రాక్టర్ నగర్ డైరెక్టర్గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు అనంతపురం అర్బన్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించినట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ నిర్ణయం మేరకు అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు లేదా కొత్త కార్డులు జారీ చేసే వరకు (ఏది ముందు జరిగితే అప్పటి వరకు) పొడిగించినట్లు పేర్కొన్నారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ గుంతకల్లు రూరల్: గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డీఎల్పీఓ విజయ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. 2020 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ గుంతకల్లు మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులను అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు, సర్పంచులు ఉమ్మడిగా కాజేశారంటూ ధర్మహ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ అధికారిగా డీఎల్పీఓ విజయ్కుమార్ నియమించడంతో ఆయన గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో వీరాంజనేయులు సమక్షంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులను విచారిస్తూ రికార్డులు పరిశీలించారు. 5న జాబ్ మేళా అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జూన్ 5న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లా రెడ్డి తెలిపారు. ఎంపికై న వారు ఐఆర్ఈపీ సంస్థ (ఎన్బీఎఫ్సీ)లో అనంతపురం, రాయదుర్గం, తాడిపత్రి, ప్రొద్దుటూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, చిత్తూరు, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. సేల్స్ ఆఫీసర్, సీనియర్ సేల్స్, ఆఫీస్ అడ్మిన్, కలెక్షన్ ఎక్జిక్యూటీవ్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి 35 సంవత్సరాల్లోపు వయసు న్న వారు అర్హులు. ఎన్బీఎఫ్సీ, ఎంస్ఈ, ఎంఎస్ఎంఈల్లో అనుభవం తప్పనిసరి. ఎంపికైన వారికి రూ.3.6 లక్షల వార్షిక వేతనం, రూ.2.4 లక్షల వార్షిక వేతనం అందిస్తారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పుట్లూరు: మండలంలోని చాలవేముల గ్రామానికి చెందిన తోలు కృష్ణయ్య, సరస్వతి దంపతుల రాజకుళ్లాయప్ప (24) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కృష్ణయ్య, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, కొన్నేళ్ల క్రితమే కుటుంబ పెద్ద కృష్ణయ్య మృతి చెందాడు. అప్పటి నుంచి చిన్న కుమారుడు రాజకుళ్లాయప్ప వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకూ రాజకుళ్లాయప్ప ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న కుమారుడ్ని చూసి తల్లి సరస్వతి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాము కాటుతో మహిళ... బెళుగుప్ప: మండలంలోని అంకంపల్లి గ్రామానికి చెందిన పాటిల్ ప్రభాకర్రెడ్డి భార్య సావిత్రమ్మ(60) పాము కాటుకు గురై మృతి చెందింది. గ్రామానికి సమీపంలోనే ఉన్న తమ తోటలో గురువారం ఉదయం కూలీలతో పనులు చేయిస్తున్న భర్తకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకెళ్లిన ఆమె అనంతరం కూలీలతో కలసి కలుపు తీత పనుల్లో నిమగ్నమైంది. ఆ సమయంలో రక్త పింజరి కాటు వేసింది. వెంటనే విషయాన్ని గుర్తించిన కూలీలు పామును కట్టెలతో కొట్టి చంపేశారు. సావిత్రమ్మను ఆగమేఘాలపై అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. డీసీసీబీ చైర్మన్గా ముంటిమడుగు కేశవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జిగా ముంటిమడుగు కేశవరెడ్డి నియమితులైనట్లు సీఈఓ కె.సురేఖారాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశవరెడ్డి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిసియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ జారీ చేశారన్నారు. మహానాడులో జీఆర్పీ హెచ్సీ హల్చల్ సాక్షి, టాస్క్ఫోర్స్: కడపలో జరుగుతున్న మహానాడులో గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వాసు హల్చల్ చేశారు. రెండో రోజు (28వ తేదీ) కార్యక్రమాల్లో పాల్గొన్న వాసు.. టీడీపీ నేతలు ఇసురాళ్లపల్లికి చెందిన కిట్టుయాదవ్, లచ్చానుపల్లికి చెందిన రామాంజినేయులుతో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ నెల 11న గుత్తి టీడీపీ సీనియర్ నేత కోనంకి కృష్ణపై పార్టీ కార్యాలయంలోనే వాసు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కోనంకి కృష్ణ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి వాసు ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ నేతగా చెలామణి అవుతున్నాడు. -
పదోన్నతులు కోరుతూ ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) పదోన్నతులు కల్పించాలంటూ బాధిత టీచర్లు గురువారం స్థానిక శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నా చేపట్టారు. ఆందోళనకు పీఆర్టీయూ, ఏపీటీఎఫ్, వైఎస్సార్టీఏ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ (1938), ఆప్టా, ఎన్టీఏ, ఎంఈఎఫ్, పీడీ అసోసియేషన్ తదితర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ.. గతంలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి 230 మందికి పదోన్నతులు ఇచ్చారని, కోర్టు వివాదం కారణంగా వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేశారని గుర్తు చేశారు. రూ.2,500 గౌరవ వేతనంతో మూన్నెళ్లకు పైగా పని చేశామన్నారు. ప్రస్తుతం ఆ పోస్టుల్లో కేవలం 19 మందిని మాత్రమే చూపిస్తున్నారన్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న డీఈఓ ప్రసాద్బాబు శిబిరం వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) పదోన్నతుల ఖాళీల విషయమై పాఠశాల విద్య డైరెక్టర్కు లేఖ రాసినట్లు తెలిపారు. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూర్యుడు, రమణారెడ్డి, రామాంజనేయులు, సిరాజుద్దీన్, రాయల్ వెంకటేష్, లింగమయ్య, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ నాయక్, కరణం హరికృష్ణ, శ్రీధర్గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జయరాం నాయక్, వెంకటరత్నం, శంకరమూర్తి, జైపాల్ నాయుడు, చంద్రశేఖర్, సుధాకర్, హరి ప్రసాద్ రెడ్డి, బండారు శంకర్, నరసింహారెడ్డి, రవి నాయక్, వాణిశ్రీ త్రివేణి విజయశ్రీ, లక్ష్మీదేవి, కౌసర్ భాను,సురేష్, కేశవరెడ్డి, నాగభూషణ, ఈరప్ప, నరసింహులు, శేషగిరి, వెంకటరమణ పాల్గొన్నారు. -
‘ఆర్డీటీ’ పరిరక్షణకు పాదయాత్ర
కళ్యాణదుర్గం: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన ఆర్డీటీ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలనే డిమాండ్తో జూన్ 4వ తేదీ నుంచి జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులతో స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామితో కలసి గురువారం ఆయన సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీటుగా పేదరిక నిర్మూలనకు ఆర్డీటీ కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ను ప్రభుత్వాలు అడ్డుకున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యక్తపై ప్రజలను చైతన్యపరిచేందుకు సంస్థ సేవలను జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రారంభించిన బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి జూన్ 4న పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల మీదుగా మొత్తం 62 గ్రామాలలో 209 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందన్నారు. ఉద్యమానికి కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, తదిరాలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పల్లెపల్లె నుంచి ఆర్డీటీ ద్వారా లబ్ది పొందిన ప్రతి కుటుంబమూ ఓ ఉప్పెనలా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరప్ప, ఎంపీపీ ఆంజనేయులు, మున్సిపాలిటీ కన్వీనర్ ఐ.సుధీర్, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, ఎంఎస్ హనుమంతరాయుడు, కంబం చంద్రశేఖర్రెడ్డి, కె.హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, పార్టీ అనుబంధ విభాగాల కార్యదర్శులు యర్రంపల్లి కృష్ణ్ణ్ణమూర్తి, హనుమంతరెడ్డి, రామాంజినేయులు, నాయకులు గోపాలరెడ్డి, మంజునాథ్, తిప్పేస్వామి, ఫయాజ్, దాదు, కిరణ్, నరసింహులు, చరణ్, పాతలింగ, భాస్కర్, షెక్షావలి, మురళి, రాజు, పాండు, ఇబ్రహీం, అజయ్, ప్రతాప్, రామిరెడ్డి, మల్లికార్జున, తిమ్మారెడ్డి, కిరీటి యాదవ్, దేవ, మల్లి, సుధాకర్, నారాయణస్వామి, కేశవ్ గౌడ్, జానీ, జయరామిరెడ్డి, సుబ్బరాయుడు, గంగాధర్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ 4న గొంచితండా నుంచి ప్రారంభం 62 గ్రామాలు....209 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య -
ఖరీఫ్ సీజన్కు సిద్ధం కండి
● కలెక్టర్ వినోద్కుమార్ బుక్కరాయసముద్రం: ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. బీకేఎస్ మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లి జెడ్పీ హైస్కూల్లో గురువారం వ్యవసాయ, ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ రైతుల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో 100 శాతం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. విత్తనశుద్ధి వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ, ఏపీసీడ్స్ డీఎం సుబ్బయ్య, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, తహసీల్దార్ పుణ్యవతి, సెరికల్చర్ అధికారి ఓబిలేసు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి రైతులు పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానం అందింపుచ్చుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ‘జిల్లాస్థాయి వికసిత కృషి సంకల్ప అభియాన్’ ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ వినోద్కుమార్ హాజరై మాట్లాడారు. వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జూన్ మొదటి వారం వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న పాల్గొన్నారు. -
పడకేసిన వైద్యం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూటమి సర్కారు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైద్య రంగం తిరోగమనంలో వెళుతోంది. మందుల కొరత, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం నిత్యకృత్యమయ్యాయి. ఇక పేదలకు అపర సంజీవనిగా వెలుగొందిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం కావడంతో ప్రజల కష్టాలు చెప్పనలవిగా మారాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందుల పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కారు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం మంది తమకు మందులు అందడం లేదని చెప్పారు. చాలాచోట్ల యాంటీబయాటిక్స్ లేవు. పాముకాటు మందు లేదు. గర్భిణులకు కాన్పు సమయంలో ఇచ్చే ఇంజెక్షన్లు లేవు. అంతెందుకూ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం ఆస్పత్రిలోనే మందులు లేవు. పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రి వరకూ మందుల కొరత రోగులను వేధిస్తోంది.దారుణ పరిస్థితులు..ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది వాపోతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు.‘ఆరోగ్య శ్రీ’ నిర్వీర్యం..2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం జగన్ చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త జవసత్వాలు నింపుకుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 3,250 జబ్బులకు ఈ పథకం ద్వారా చికిత్సలు అందించేవారు. అయితే, చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పటినప్పటి నుంచి పథకం ప్రకారం ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ‘ఆరోగ్య శ్రీ’ని ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో పథకం పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.గాల్లో దీపంలా 108, 104 ..ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందిని ఆపత్కాలంలో ఆదుకున్న 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ రాప్తాడు వద్ద షెడ్డులో పడ్డాయి. కాల్ వెళ్లిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. ఇక 104 అంబులెన్సులకు కూటమి సర్కారు రాగానే కాలం చెల్లింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. 104 వాహనాలు పల్లెలకు వెళ్లక ఏడాది అవుతోంది.పెనుకొండలో మెడికల్ కాలేజీకి గ్రహణం...శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్ జగన్ హయాంలో రూ.375 కోట్లతో మెడికల్ కాలేజీకి పునాది వేశారు. కూటమి సర్కారు వచ్చాక దీన్ని ముందుకు కదలనివ్వలేదు. ఉమ్మడి జిల్లా అంతటికీ కలిపి ఇప్పటికీ ‘అనంత’లో ఒక్కటే మెడికల్ కళాశాల ఉంది. కొత్త కాలేజీ వస్తే శ్రీ సత్యసాయి జిల్లాకు వరం అయ్యేది. కానీ ‘కూటమి’ దీన్ని కాలరాసింది. -
అధికారుల తప్పిదం... విద్యార్థులకు శాపం
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులకు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ నగరపాలక ఉర్దూ హైస్కూల్, బీపీఎస్ (బేసిక్ ప్రైమరీ స్కూల్) విద్యార్థులు బలవుతున్నారు. 117 జీఓ ప్రకారం 3–5 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్ల బోధన అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూల్గా మార్చారు. అయితే,కూటమి ప్రభుత్వం 117 జీఓకు తోసిరాజని పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఇందులో హైస్కూల్+బీపీఎస్ ఒకటి. అబుల్కలాం ఆజాద్ నగరపాలక ఉర్దూ పాఠశాల ఈ కోవలోకి వచ్చింది. ఇక్కడ 1–5 తరగతులను బీపీఎస్గా, 6–10 తరగతులను హైస్కూల్గా విభజించారు. 1,2 తరగతుల విద్యార్థులు మాయం 3,4,5 తరగతుల విద్యార్థులు 20 మంది, 1,2 తరగతుల విద్యార్థులు 14 మంది ఉన్నారు. మొత్తం 34 మంది పిల్లలు ఈ బేసిక్ ప్రైమరీ పాఠశాలలో ఉన్నారు. 21 జీఓ ప్రకారం బీపీఎస్ స్కూళ్లల్లో 1–10 మంది విద్యార్థులకు రెండు ఎస్జీటీ పోస్టులు, 11–30 మంది విద్యార్థులుంటే 3 ఎస్జీటీ పోస్టులు, 31–59 ఉంటే మూడు ఎస్జీటీ పోస్టులతో పాటు పీఎస్హెచ్ఎం/ఎస్ఏ పోస్టు కేటాయిస్తారు. అయితే, విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్లో 1,2 తరగతుల విద్యార్థులను చూపించలేదు. వారిని మ్యాపింగ్ చేయలేదు. 3–5 తరగతుల విద్యార్థులు 20 మంది ఉంటే 18 మందిని మాత్రమే చూపించారు. వాస్తవానికి ఈ స్కూల్కు మూడు ఎస్జీటీ పోస్టులతో పాటు ఒక పీఎస్హెచ్ఎం/ఎస్ఏ రావాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా చూపిస్తున్న కారణంగా పీఎస్హెచ్ఎం పోస్టు కోల్పోయారు. 10 రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ... తమ పాఠశాలకు జరిగిన అన్యాయంపై హెచ్ఎం, కొందరు పది రోజుల నుంచి డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డీఈఓను, టెక్నికల్ విభాగం సిబ్బందిని కలిసి రోజూ వినతిపత్రాలు ఇస్తున్నారు. వారు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సాంకేతిక పరంగా పొరబాటు జరిగిందంటూ పరిష్కారం చూపించలేదని బాధిత టీచర్లు వాపోతున్నారు. వాస్తవానికి 9 మంది దాకా ఉర్దూ ఎస్ఏలు మిగులు టీచర్లుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ స్కూల్కు ఒకరిని కేటాయిస్తే అటు టీచరుకు, ఇటు విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అనంతపురం ‘అబుల్ కలాం ఆజాద్’ బీపీఎస్ స్కూల్కు అన్యాయం విద్యార్థుల లెక్క సరిగా లేకపోవడంతో రద్దయిన పీఎస్హెచ్ఎం పోస్టు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధిత టీచర్లు -
ముఖానికి మాస్క్.. మెడలో టవల్
గుంతకల్లుటౌన్: సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ వినోద్కుమార్ ఓ సాధారణ వ్యక్తిలా ముఖానికి మాస్క్ ధరించి, మెడలో టవల్ వేసుకుని గుంతకల్లు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బుధవారం రాత్రి గుంతకల్లులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న కలెక్టర్ వినోద్ కుమార్.. తిరిగి అనంతపురం వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరిగ్గా రాత్రి 10.10 గంటల సమయంలో ముఖానికి మాస్క్, మెడలో టవల్ వేసుకుని ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఆయన... తొలుత నూతన ఎంసీహెచ్ భవనం వద్దనున్న ప్రైవేట్ అంబులెన్స్ వద్దకు వెళ్లారు. తమ బంధువులను అనంతపురం తరలించాల్సి ఉందని, ఎంత ఖర్చవుతుందని ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ను అడిగారు. ఆక్సిజన్తో అయితే రూ.5,500, ఆక్సిజన్ లేకుండా అయితే రూ.5 వేలు తీసుకుంటామని డ్రైవర్ చెప్పాడు. సరే మళ్లీ కలుస్తామని చెప్పిన కలెక్టర్.. అక్కడి నుంచి నేరుగా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, ఐడీ, లేబర్ వార్డులను పరిశీలించారు. రోగుల సహాయకులతో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సేవలు, మందులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం టాయిలెట్లను పరిశీలించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీలు చేసినా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి తెలియలేదు. కలెక్టర్ బయటికి వెళ్తున్న సమయంలో బయటి నుంచి స్థానిక పోలీసుల రాకను గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఎవరొచ్చారు.. ఎందుకొచ్చారని తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగుల వద్దకు వెళ్లి కలెక్టర్ ఏమడిగారు.. మీరేం సమాధానమిచ్చారంటూ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రాత్రి వేళ ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఒక్కసారిగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిలో అలజడి మొదలైంది. సెక్యూరిటీ గార్డులకు మెమో ఇవ్వండి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ అంబులెన్స్లను ఎందుకు పార్కింగ్ చేయిస్తున్నారని కలెక్టర్ వినోద్కుమార్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజేంద్రరావును ప్రశ్నించారు. గురువారం డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్రవికుమార్తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ అజేంద్రరావు, డ్యూటీ డాక్టర్ శ్రీనివాసయాదవ్ ను కలెక్టరేట్కు పిలిపించుకున్నారు. ప్రభుత్వ అంబులెన్స్ను ఎందుకు నిరుపయోగంగా ఉంచారని ప్రశ్నించారు. ప్రైవేట్ అంబులెన్స్లను ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేయించడంపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులకు మెమో జారీ చేయాలని, ఆస్పత్రి శానిటేషన్ను మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించినట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఆస్పత్రిలో జరుగుతున్న సాధారణ కాన్పులు, సిజేరియన్ల గురించి ఆరా కలెక్టర్ తీసినట్లు తెలుస్తోంది. సాధారణ వ్యక్తిలా గుంతకల్లు ఆస్పత్రికి కలెక్టర్ వినోద్కుమార్ రాత్రి 10 గంటల సమయంలో వార్డుల్లో ఆకస్మిక తనిఖీ -
పడిగాపులు.. చీకట్లో అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: హెచ్ఎంలుగా పదోన్నతులు తీసుకునేందుకు టీచర్లు గురువారం పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకే శారదా నగర పాలక ఉన్నత పాఠశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి లింక్ రాలేదు.. జాబితా సిద్ధం చేస్తున్నాం తదితర కారణాలు చెబుతూ మధ్యాహ్నం 2 గంటలకు చేపడతామని స్వయంగా డీఈఓ ప్రకటించారు. ఈ క్రమంలో అందరూ భోజనం చేసుకుని 2 గంటలలోపే అక్కడికి చేరుకున్నా అప్పటికీ ప్రారంభం కాలేదు. సాయంత్రం 4 గంటలకు అంటూ మరోమారు ప్రకటించారు. తర్వాత 6 గంటలకు అని చెప్పినా అప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు రాత్రి 7 గంటల తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు ముగిసింది. మొత్తం 148 హెచ్ఎం పోస్టులకు గాను ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన 3 పోస్టులకు ఆర్జేడీ కార్యాలయంలో పదోన్నతులు కల్పిస్తారు. తక్కిన జిల్లా పరిషత్, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించిన 145 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఇదిలాఉండగా కౌన్సెలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. చీకటి పడిన తర్వాత వెలుతురు సరిగా లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ముఖ్యంగా మహిళా టీచర్లు అగచాట్లు పడ్డారు. 133 మంది హెచ్ఎంల బదిలీలు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 133 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. మొత్తం 191 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29 మంది తప్పనిసరి బదిలీ కాగా...162 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 104 మంది బదిలీ కాగా తక్కిన 58 మంది బదిలీ కాలేదు. ఆలస్యమైన సీనియార్టీ జాబితా.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితా శుక్రవారం విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రెండు రోజుల కిందటే జాబితా సిద్ధం కావాల్సి ఉన్నా...హెచ్ఎం పదోన్నతుల కౌన్సెలింగ్ ఉన్న కారణగా ఆలస్యమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎక్కువ పాయింట్ల నమోదుపై జాగ్రత్త.. ఉపాధ్యాయుల పాయింట్ల నమోదును ఎంఈఓలు జాగ్రత్తగా పరిశీలించాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రావాల్సిన పాయింట్ల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అలాంటి వారితో గ్రీవెన్స్ పెట్టించి తగ్గించుకునేలా చూడాలని ఆదేశించారు. తర్వాత ఎక్కువ పాయింట్లు వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ ఉదయం నుంచి రాత్రిదాకా వేచిఉన్న టీచర్లు ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమై 10 గంటలకు పూర్తి -
సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: మెప్మా, గ్రంఽథాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మెప్మా, గ్రంథాలయ శాఖ ఉద్యోగుల కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ వేర్వేరుగా నిర్వహించారు. మెప్మాలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించి లైబ్రేరియన్ గ్రేడ్–3, రికార్డ్ అసిస్టెంట్, కార్యాలయ సహాయకుల బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టారు. కార్యక్రమంలో మెప్మా పీడీ జె.విశ్వజ్యోతి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పామిడి తహసీల్దార్, వీఆర్వోకు నోటీసులు పామిడి: మండలంలోని అప్పాజీపేట గ్రామంలో సర్వే నంబర్ 178–బీలోని 10 ఎకరాల భూమి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన తహసీల్దార్ ఎన్. శ్రీధర్మూర్తి, వీఆర్వో జ్యోతికి ఉన్నతాధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఆ పొలానికి సంబంధించి గత నెల మార్చి7న గ్రీవెన్స్లో అర్జీ వచ్చింది. దీనిపై బుధవారం కలెక్టర్ వినోద్కుమార్ అర్జీదారునికి ఫోన్ చేశారు. భూమి విషయంపై సంబంధిత వీఆర్వో, తహసీల్దార్తోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. సదరు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, దీన్ని ఇరువురు ఆక్రమించుకొని అనుభవిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి అని తెలిసినా స్వాధీనం చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీధర్మూర్తికి కాషన్ నోటీసు, వీఆర్వో జ్యోతికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్ఎస్ తహసీల్దార్ను ఆదేశించారు. భూమి ఆక్రమణదారులపై 22 రోజుల్లో చర్యలు చేపట్టాలని సూచించారు. ‘రెవెన్యూ’లో బదిలీలకు 313 దరఖాస్తులు అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీ కోసం 313 మంది అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. 16 మంది తహసీల్దార్లు, 44 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, 38 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఐదుగురు, గ్రేడ్–1 వీఆర్ఓలు 68 మంది, గ్రేడ్–2 వీఆర్ఓలు 113 మంది, అటెండర్లు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. ‘సూపర్’లో మూడు రోజులు ఓపీ సేవలు అనంతపురం మెడికల్: రోగులకు స్పెషాలిటీ వైద్యాన్ని విస్తృతం చేయడంలో భాగంగా జూన్ 2 నుంచి వారంలో మూడు రోజుల పాటు ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వ రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి సోమ, గురు, శనివారాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, సీటీపీ, ప్రతి మంగళ, బుధ, శనివారాల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, ప్రతి సోమ, బుధ, శనివారాల్లో నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల ఓపీ ఉంటుందని పేర్కొన్నారు. నేటి నుంచి విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్లు అనంతపురం అగ్రికల్చర్: విత్తన వేరుశనగ కోసం శుక్రవారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ ఏడాది జిల్లాకు కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. 40 శాతం రాయితీ ప్రకటించారు. కే–6 రకం 46,692 క్వింటాళ్లు, కదిరి–లేపాక్షి (కే–1812) రకం 900, టీసీజీఎస్–1694 రకం 3 వేల క్వింటాళ్లు మండలాలకు అలాట్ చేశారు. కే–6, టీసీజీఎస్–1694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా రాయితీ రూ.3720 పోనూ రైతుల వాటా రూ.5,580గా ఖరారు చేశారు. కే–1812 రకం ధర రూ.8,200 కాగా రాయితీ రూ.3,280 పోనూ రైతులు తమ వాటా కింద రూ.4,920 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. -
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
● దేవదాయశాఖ మాజీ సలహాదారు శ్రీకాంత్ అనంతపురం కార్పొరేషన్: గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని, ఆలయాల్లో విగ్రహాలు కొట్టేశారని, హుండీలు దోచుకున్నారని, తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్తో కూటమి ప్రభుత్వ పెద్దలు పచ్చి అపద్ధాలు మాట్లాడించారంటూ దేవదాయశాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014–19 మధ్య కాలంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అప్పటి సీఎం చంద్రబాబు నడుచుకున్నారని గుర్తు చేశారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు చేసి మహాపరాధానికి పాల్పడ్డారన్నారు. విజయవాడలో 30 ఆలయాలను కూల్చి వేశారన్నారు. సదాపర్తి భూములను అనుయాయులకు అప్పగించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బ్రాహ్మణులకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారన్నారు. ఆలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం సబబు కాదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేష్ పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రానికి దారి చూపండి
శింగనమల: నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి దారి చూపాలంటూ శింగనమల వాసులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ‘544డీ’ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. దీంతో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్రావు, సీఐ కౌలుట్లయ్య, ఏఎస్ఐ చితంబరయ్య అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా శింగనమల నుంచి అనంతపురానికి రాకపోకలు సాగించేందుకు ఏకై క మార్గం మరువకొమ్మ మీదుగానే ఉండేదని గుర్తు చేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ రహదారిని మూసి వేసి, మరువకొమ్మ నుంచి తాడిపత్రి వైపుగా ఉన్న పెద్దమ్మ గుడి వద్ద క్రాసింగ్ ఇచ్చారన్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో మరువకొమ్మ క్రాస్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే శింగనమల నుంచి అనంతపురానికి రాకపోకలు సాగించే మార్గాన్ని మూసి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి వద్ద చోటు చేసుకున్న ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడ్డారన్నారు. జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిన్నపాటి గ్రామాలైన రెడ్డిపల్లి, రోటరీపురం,కొర్రపాడు వద్ద రెండు బ్రిడ్జిలు, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, పెరవలి, నాయనపల్లి క్రాస్లో అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించారని, అయితే నియోజకవర్గ కేంద్రమైన శింగనమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ ఆందోళనను విరమించబోమని భీష్మించారు. సీఐ కౌలుట్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్రావు మాట్లాడుతూ.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. శింగనమల మరువకొమ్మ వద్ద గ్రామస్తుల ధర్నా అధికారుల హామీతో ఆందోళన విరమణ -
అమ్మవారికే ఎగనామం
●ముసలమ్మ ఆలయ స్థలం ఆక్రమణ ●రూ.5 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం బుక్కరాయసముద్రం: గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండేలా కరుణించిన ముసలమ్మ అమ్మవారికే కబ్జాదారులు ఎగనామం పెట్టారు. రూ.కోట్ల విలువైన ఆలయ భూమిని కబ్జా చేసి, ఆ స్థలంలోకి ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దౌర్జన్యాలను తాళలేక చివరకు అన్యాక్రాంతమైన భూమిని ఆలయానికి తిరిగి స్వాధీనం చేయాలంటూ అనంతపురం ఆర్డీఓకు ముసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సుశీల విన్నవించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి నాడు ప్రాణత్యాగం ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మోరు స్థలానికే ఎసరు ముసలమ్మ ఆలయం వెనుక సర్వే నంబర్ 636–4లో 80 సెంట్ల స్థలం బెంగళూరుకు చెందిన ఆదెమ్మ పేరుపై డైక్లాట్లో ఉంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దకుమార్తె మునిరత్నమ్మ పేరుపై 1933లో రిజిస్టర్ చేయించి ఇచ్చింది. ఆ తర్వాత ఆ స్థలాన్ని 1949, ఫిబ్రవరి 10న ముసలమ్మ ఆలయంలో నిత్యకై ంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా అమ్మవారి వంశస్తులైన తిరుమలరెడ్డి గారి కొండారెడ్డికి దాన విక్రయం కింద మునిరత్నమ్మ రాసిచ్చారు. అప్పటి నుంచి పాత గుడిలో అమ్మవారికి నిత్య పూజలు కొనసాగుతూ వచ్చాయి. కాలక్రమేణ గుడిని అభివృద్ది చేశారు. ఈ క్రమంలో 33 సెంట్ల స్థలాన్ని అనంతపురానికి చెందిన వెంకట్రాముడు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ముసలమ్మ వంశస్తులతోనే ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు. ఆ స్థలం తనదని, అక్కడ ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులకు ఆలయ ధర్మకర్త సుశీల, ఆమె భర్త సూర్యనారాయణరెడ్డి, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ పుణ్యవతిని కలసి ఆలయ భూమిని పరిరక్షించాలంటూ విన్నవించారు. అన్యాక్రాంతమైన భూమి విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని, వెంకట్రాముడితో పాటు మరికొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. -
నాడు రాద్ధాంతం.. నేడు అదే సిద్ధాంతం
అనంతపురం అర్బన్: సమగ్ర భూ సర్వేకు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన మార్గమమే ఉత్తమమని కూటమి ప్రభుత్వ చేపట్టిన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాటను అనుసరిస్తూ భూముల రీ–సర్వే చేపట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా చేపట్టిన భూముల రీ సర్వేపై విష ప్రచారం సాగించిన టీడీపీ కూటమి నేతల నోళ్లు ఇప్పడు మూతపడ్డాయి. దీనికి తోడు భజన పత్రికల చేతులకు బ్రేక్లు పడ్డాయి. గత ప్రభుత్వంలో సర్వే ఇలా సర్వే క్రమంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ను మొబైల్ మెజిస్ట్రేట్గా గత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే పంథాను అనుసరిస్తోంది. జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 31 మండలాల్లో ఉన్న 503 గ్రామాలకు సంబంధించి 25,17,658.52 ఎకరాల రీ సర్వేకు గత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. 499 గ్రామాలకు సంబంఽధించి ఓఆర్ఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే క్రమంలో 198 గ్రామాల్లోని 5,88,615.626 ఎకరాల సర్వే సంపూర్ణ స్థాయిలో పూర్తి చేశారు. ఈ విధానాలతో సర్వే ప్రక్రియను గత ప్రభుత్వం సులభతరం చేసింది. దీంతో తాజాగా మిగిలిన 305 గ్రామాల్లో ఎలాంటి అడ్డంకులూ లేకుండా రీ–సర్వేకు అధికారులు సమాయత్తమయ్యారు. ప్రస్తుతం రెండు దశలుగా 62 గ్రామాల్లో సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున మొదటి దశలో 31 గ్రామాలు, రెండో దశలో మరో 31 గ్రామాల్లో సర్వే చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గతంలో పక్కాగా రీ–సర్వే గత ప్రభుత్వంలో భూముల రీ–సర్వే ప్రక్రియ పక్కాగా జరిగింది. 503 గ్రామాలకు గానూ 198 గ్రామాల పరిధిలోని 1,83,353 భూ కమతాలకు సంబంధించి 5,88,615.626 ఎకరాలు సర్వే చేసి హద్దులు నిర్ధారిస్తూ రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో అధికారులు గ్రామ సభలను నిర్వహించారు. అయితే 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే సర్వే పక్కగా జరిగినట్లుగా స్పష్టమైంది. దీంతో అప్పట్లో రీ సర్వే ప్రక్రియపై విమర్శలు చేసిన నోళ్లు మూతపడ్డాయి. రీ–సర్వేపై విషం చిమ్ముతూ కథనాలు ప్రచురించిన పత్రికలు సైతం మూగబోయాయి. 503భూముల రీ–సర్వే చేయాల్సిన గ్రామాలు సర్వే చేయాల్సిన మొత్తం విస్తీర్ణం రీ–సర్వేపై అప్పట్లో పచ్చ‘బ్యాచ్’ విష ప్రచారం తాజాగా సర్వేకు అప్పటి విధానాలనే అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా రెండు దశల్లో 62 గ్రామాల్లో సర్వే -
నాణ్యత... దేవుడికెరుక!
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అన్నదాతల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. రైతు కష్టనష్టాల గురించి అసలు ఆలోచించడమే లేదు. విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియలో మరోసారి సర్కారు అలసత్వం బయటపడింది. ఈ సారి జిల్లా రైతులకు నాణ్యత లేని విత్తన కాయలు పంపిణీ చేసి ‘మీ చావు మీరు చావండి’ అంటూ చేతులు దులుపుకునే అవకాశం కనిపిస్తోంది. ఖరీఫ్ ప్రారంభమవుతున్న కీలక తరుణంలో అటు టీడీపీ ఎమ్మెల్యేలు ‘మహానాడు’ అంటూ రైతులను గాలికి వదిలేయగా.. ఇటు వ్యవసాయశాఖ అధికారులు బదిలీల మాయలో విత్తన పంపిణీ గురించి పట్టించుకోవడమే లేదు. ఆర్ఎస్కేలకు నాసిరకం సరుకు.. ఈ సారి విత్తన పంపిణీ ప్రక్రియను చాలా ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లాకు 50,592 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడ్స్కు బడ్జెట్ విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో జిల్లాలో రైతులు పండించిన నాణ్యమైన విత్తనం కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో విత్తనం కోసం మిల్లర్లపై ఆధారపడ్డారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, మరోవైపు బదిలీల ప్రక్రియ కొనసాగుతుండటంతో విత్తనశుద్ధి (ప్రాసెసింగ్)పై దృష్టి పెట్టడం లేదు. ఇదే అదునుగా మిల్లర్లు నాసిరకం విత్తనకాయలను మండలాలు, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుమతి ఉన్న 10 ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి 6 వేల క్వింటాళ్ల వరకు ఆర్ఎస్కేలకు సరఫరా చేశారు. అందులో నాలుగైదు లారీల వరకు వేరుశనగ కాయ నాణ్యత లేదని వెనక్కి వచ్చినట్లు సమాచారం. సాధారణంగా పంపిణీ చివరి సమయంలో నాసిరకం, కల్తీ సరుకు సరఫరా అయ్యేది. కానీ చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం కారణంగా నేడు మొదట్లోనే నాసిరకం సరఫరా అవుతుండటం రైతులను కలవరపరుస్తోంది. దిగుబడులపై తీవ్ర ప్రభావం.. అన్నదాతలకు నాణ్యమైన విత్తనం అందించడంలో వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ విఫలమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాల మేరకు 9 శాతం లోపు తేమశాతం, 70 శాతం మొలకశాతం (జర్మినేషన్), 96 శాతం ఫిజికల్ ప్యూరిటీ, 74 శాతం అవుటన్ (షెల్లింగ్), వ్యర్థ పదార్ధాలు (ఇనర్ట్మ్యాటర్) 4 శాతం మేర ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ అవుటన్ శాతం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అవుటన్ తక్కువగా ఉంటే విత్తనం మొలకెత్తినా దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మండలాలకు నాసిరకం విత్తనకాయల సరఫరా ప్రమాణాలపై దృష్టి పెట్టని వ్యవసాయశాఖ రైతుల ఆశలతో సర్కారు చెలగాటం -
230 పోయి 19 పోస్టులు మిగిలాయి!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లకు తీరని అన్యాయం చేశారంటూ టీచర్లు వాపోయారు. 117 జీఓ ఆధారంగా వచ్చిన 230 ఇంగ్లిష్ పదోన్నతుల పోస్టులు ఇప్పుడు కేవలం 19 మాత్రమే మిగులుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో నిరసన తెలియజేశారు. విద్యా శాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఈఓ చాంబరును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెండేళ్ల సర్వీస్ కోల్పోయి నష్టపోయామని, 27 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే రిటైర్డ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఓఈ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు జి.సూర్యుడు, రామాంజినేయులు, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, జయరాం నాయక్, గోపాల్ రెడ్డి, శంకరమూర్తి, కేశవరెడ్డి, ఓబులేసు, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, విజయ శ్రీ, నరసింహులు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, రసూల్ పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిలర్ గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్ మద్దతు తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే..: జేసీ ప్రభాకర్రెడ్డి
తాడిపత్రి టౌన్: సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బుధవారం వైరల్గా మారాయి. ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయనన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి.. అదీ ఇదీ అని 15 వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు. ‘రోడ్లు బాగా లేకుండాలేవు. నీళ్లు తక్కువేమీ లేవు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేశాం. అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే.. నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి. ఒక్కనికీ బుద్ధిలేదు. ఈ జనాలకు బుద్ధిలేద’ని ప్రభాకర్రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నానదిలో ఇసుకను ఇష్టమొచ్చినట్లు ఎవ్వరు పడితే వాళ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్గానే ఇసుక అమ్ముదామనుకుంటున్నానని జేసీ వ్యాఖ్యానించారు. -
మహానాడు కాదది.. దగానాడు
అనంతపురం కార్పొరేషన్: అలివిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదని, కడపలో టీడీపీ నిర్వహించేది మహానాడు కాదని.. దగా నాడుగా ప్రజలు భావిస్తున్నారని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చలేదన్నారు. కనీసం ఇప్పటికై నా రాష్ట్రాభివృద్ధిపై తీర్మానాలు చేయించేలా చూడాలని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందన్నారు. కక్ష సాధింపులకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజుతో పాటు బడుగులు, దళితులపై పోలీసులు సాగించిన చౌర్జన్యంపై మహానాడులో చర్చించగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ పేరుతో ఇచ్చిన చంద్రబాబు హామీల్లో ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. డబ్బులు లేవంటూనే ఏడాదిలో రూ.50 వేల కోట్లు మిగుల్చుకున్నారన్నారు. మొత్తమ్మీద ఒక్క ఏడాదిలోనే రూ.1,30,000 కోట్లు, అమరావతి పేరుతో రూ.30 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. ఏఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒకే ఏడాది లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాకు 2013లో ఎయిమ్స్ మంజూరైతే..దానిని మంగళగిరికి తరలించి జిల్లాకు అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు హైకోర్టు బెంచ్ తీసుకువస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని, జిల్లాలో 20 లక్షల ఎకరాలకు విత్తన వేరుశనగ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారసులెవరు? టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి అధికారంలోకి తీసుకువస్తే.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి తానే అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించుకున్న అంశంలో నేరపూరితమైన భావన కన్పించడం లేదా అని ప్రశ్నించారు. పార్టీకి అసలు వారసుడు బాలకృష్ణ దబిడిదిబిడే అంటూ తిరుగుతున్నాడని, మరొకరు (కుమార్తె) బీజేపీలో కొనసాగిస్తారో... తొలగిస్తారోనని ఆలోచిస్తున్నారని, ఇక జూనియర్ ఎన్టీఆర్ అవునా, కాదా అనే మీమాంశతోనే సరిపోతోందన్నారు. కార్పొరేట్కు సాగిలపడిన చంద్రబాబు.. తన స్వలాభానికి ప్రజల భూములను పావలా, అర్ధరూపాయికి కట్టబెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ -
రాజకీయ కక్షతోనే కాకాణి అరెస్ట్
ఉరవకొండ: రాజకీయ కక్షతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సాఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టును ఖండించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎలాంటి అభివృద్ది లేకపోయినా అక్రమ కేసులు, అణిచివేత చర్యలు, కక్షపూరిత రాజకీయాలకు సీఎం చంద్రబాబు ఊతమిస్తున్నారన్నారు. మాజీ ఐఎఎస్, ఐపీఎస్లను సైతం వదిలిపెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ను అప్రతిష్టపాలు చేసి, ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు సృష్టించి కేసుల్లో ఇరికిస్తున్నా వైనంపై ఇప్పటికే ప్రభుత్వానికి కోర్టులు మందలిస్తున్నా పాలకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు. భార్యభర్తలు, అన్నదమ్ముల మద్య తలెత్తే చిన్నపాటి ఘర్షణల్లో కూటమి నేతలు జోక్యం చేసుకోని రాజకీయంగా వాటిని వినియోగించుకోని గ్రామస్థాయిలో వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే జిల్లాలో జరిగిన మినీ మహానాడులో కొందరు టీడీపీ సీనియర్ నేతలు గళం విప్పారని, ఈ వ్యతిరేక జ్వాలలు మరింత చెలరేగి కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయక తప్పదని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నరసింహులు, ఈడిగ ప్రసాద్, బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, తిప్పయ్య, వీరన్న పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
పీఆర్లో సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: పంచాయతీరాజ్ (పీఆర్) శాఖకు సంబంధించి అనంతపురంలోని పీఆర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి (రాయలసీమ జిల్లాలు) బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, బాలాజీ (తిరుపతి), చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఆ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బాలూనాయక్, ఎస్ఈ జహీర్ అస్లాం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్ఈ మురళి, ఇతర జిల్లాల ఎస్ఈలతో పాటు పీఆర్ఐ ఈఈ ప్రభాకరరెడ్డి, అనంతపురం సబ్ డివిజన్–1, 2 డీఈఈలు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి, సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఖాజా మొహిద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ బదిలీలనూ ఆమోదించారు. గాలిమరలు కూల్చేశారు! పుట్లూరు: మండలంలోని ఎ.కొండాపురం వద్ద కొండలపై ఏర్పాటు చేసిన గాలిమరలు నెల రోజుల వ్యవధిలో రెండు కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ గాలిమరలు కూలిపోలేదని పరికరాల చోరీ కోసం కొందరు దుండగులు సపోర్ట్ దిమ్మెలకు ఉన్న ఇనుప చువ్వలను కత్తిరించి కూల్చేసినట్లు భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధులు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కూల్చి వేసిన గాలిమరల్లోని విలువైన పరికరాలను చోరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హామీల అమలు కోసం పోరుబాట ● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అనంతపురం అర్బన్: అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, హామీల అమలు కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమైనట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విడుదల చేసి, మాట్లాడారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని, సూపర్ సిక్స్ అమలు చేయాలనే డిమాండ్తో జూన్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దారు కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు తలపెట్టామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లేలా చేపట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజేష్గౌడ్, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా పాల్గొన్నారు. -
అన్యాయం జరుగుతోంది
హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులతో ఒక్క రాప్తాడు నియోజకవర్గమే కాదు... మొత్తం రాయలసీమకే అన్యాయం జరుగుతోంది. రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతాయి. భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా రిలే నిరాహార దీక్షలు రాప్తాడు నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తాం. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఉద్యమించాలి. ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు, పోలీసులకు అనుమతులు కోరాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
బాబు స్వార్థం.. సీమకు అన్యాయం
ఆత్మకూరు: జిల్లాలో రైతు మనుగడను కూటమి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే సీఎం చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాప్తాడు నియోజకవర్గ రైతులు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతల్లోనూ వ్యతిరేకత కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీ–నీవా ప్రాజెక్ట్ చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కాలువలో నీరు ప్రవహించే సమయంలో ఎంతో కొంత నీరు భూమిలోకి ఇంకడం ద్వారా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో జిల్లాలో ఉద్యాన పంటలు గణనీయంగా విస్తరించాయి. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకపోవడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. అనంతరం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు తగ్గిపోయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లైనింగ్ పనులను అడ్డుకున్నారు. వట్టిపోనున్న చెరువులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ హంద్రీ–నీవా ద్వారా కొత్త ప్రాజెక్టులకు కూడా నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు (కర్నూలు తాగునీటి పథకం)కు 3 టీఎంసీలు, డోన్లో లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 63 చెరువులకు నీరు ఇచ్చేందుకు 2 టీఎంసీలు, జిల్లాలోని శింగనమల చెరువుకు 1 టీఎంసీ, శింగనమల పాత తాలూకాలోని చెరువులకు 1.3 టీఎంసీలు, జీడిపల్లి, భైరవానితిప్ప, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు 3.7 టీఎంసీలు, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, సోమరాండ్లపల్లి రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు 4.5 టీఎంసీలు, శ్రీసత్యసాయి జిల్లాలోని 193 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 23 టీఎంసీలు కేటాయించడంతో పాటు 40 టీఎంసీల నీటిని రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు అందించేలా బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. కాలువకు లైనింగ్ పనులు చేయడం ద్వారా భవిష్యత్తులో నీరంతా దిగువకు వెళ్లిపోయి చెరువులన్నీ పూర్తిగా వట్టిపోయే ప్రమాదం నెలకొంది. హంద్రీ–నీవా లైనింగ్ పనులతో బీళ్లుగా మారనున్న రాయలసీమలోని 6 లక్షల ఎకరాలు కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడకే ముప్పు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమంటున్న ‘రాప్తాడు’ రైతులు పంటల సాగు కష్టం రాప్తాడు నియోజకవర్గంలో చాలా పొలాలు హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్నాయి. హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరిగి మా వ్యవసాయ బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగింది. దీంతో నాకున్న 4 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశా. ఇప్పుడేమో కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత లేక పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రైతు కష్టాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. లైనింగ్ పనులు ఆపి 83 టీఎంసీల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేయాలి. – సుబ్బర రామాంజినేయులు, సిద్ధరాంపురం, ఆత్మకూరు మండలం రైతుల పొట్ట కొట్టొద్దు హంద్రీ–నీవాలో నీటి ప్రవాహం వల్ల చాలా మంది బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువ పక్కన పొలాల్లో చీనీ, అరటి, టమాట, వరి, అంజూర, ద్రాక్ష, దానిమ్మ వంటి ఉద్యాన పంటల సాగు పెరిగింది. హంద్రీ–నీవా కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయితే బోర్లు ఎండి పోయే ప్రమాదముంది. రైతులు నష్టపోతారు. కాంక్రీట్ లైనింగ్ పనులతో రైతుల పొట్ట కొట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – వెంకటేష్, సింగంపల్లి, ఆత్మకూరు మండలం -
రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం మొదలైన జోనల్ స్థాయి ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం తెల్లవారుజాము సరిగ్గా 6 గంటలకు ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోనల్ స్థాయి కావడంతో ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు సూపరెండెండెంట్లు, 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు రిక్వెస్ట్ కింద ఐదుగురు సూపరెండెండెంట్లు. 32 మంది సీనియర్ అసిస్టెంట్లు, 26 మంది ఏడీఏలు, 122 మంది ఏఓలు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ విభాగాల అసోసియేషన్లకు చెందిన నాయకులు తరలిరావడంతో జాతరను తలపించింది. ఇందులోనూ ఎక్కువగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. 255 మందికి పైగా కౌన్సెలింగ్కు హాజరవుతున్నట్లు తెలిసినా కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం చేయడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రంతా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా ఉద్యోగులు జాగరణతో పడిగాపులు కాసేలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆన్లైన్ పక్రియ అంటూనే భౌతికంగా చేపట్టారు. ప్రతి విషయంలో ఒకరిద్దరు జేడీఏలు జోక్యం చేసుకోవడంతో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఏఓ స్థాయి అధికారులు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. అలాగే రిక్వెస్ట్ కింద, అసోసియేషన్ల వెసులుబాటు, కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులు అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ అంటూనే భౌతికంగా సాగిన కౌన్సెలింగ్ -
తల్లుల వేదన అంతా ఇంతా కాదు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచిన వారం రోజుల్లోనే ‘అమ్మఒడి’ పేరుతో రూ.15 వేలను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కానీ 2024 ఎన్నికల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తానన్న బాబు.. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావొస్తున్నా ‘తల్లికి వందనం’ మాటే ఎత్తడం లేదు. పైగా ఒక్కో రోజు ఒక్కోమాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారికే అని ఒకసారి.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులందరికీ అని మరోసారి.. ఇటీవల మార్గదర్శకాల్లో ఒకరికే అని ఇచ్చి తర్వాత ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 4 లక్షల మంది చిన్నారుల తల్లులు ప్రభుత్వ సాయం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. -
మరణించిన వారికీ ‘ఉపాధి’
పుట్లూరు: మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు తారస్థాయికి చేరాయి. జాబ్కార్డు ఉంటే చాలు పనికి వెళ్లకపోయినా హాజరు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు సిబ్బంది ఏడాదిలో జాబ్కార్డుకు రూ.30 వేలు జమచేయించి లబ్ధిదారుడికి రూ.15 వేలు ఇచ్చి మిగతాది దోచుకుంటున్నారు. దీంతోపాటు క్షేత్ర స్థాయిలో అప్పటికే పూర్తైన పనులను పదే పదే పరిశీలించి కొలతల ఆధారంగా మళ్లీ చెల్లింపులు చేస్తున్నారు. గ్రామాల్లో లేని వారు, ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లపై మస్టర్లు నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. సామాజిక తనిఖీ బృందాలు సైతం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి వెళ్లిపోతుండటంతో ఉపాధి సిబ్బంది అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. జంగంరెడ్డిపేటలో ‘ఆత్మలకు’ ‘ఉపాధి’ కల్పించిన విషయంపై పుట్లూరు ఎంపీడీఓ అలివేలమ్మ వివరణ కోరగా.. ఆమె స్పందించారు. మరణించిన వారి పేరుపై బిల్లులు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నిరుద్యోగులకు మోసం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కూటమి పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసగించాయి. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు.వలంటీర్లకు రూ.10 వేలు వేతనం అన్నారు...ఉన్నవారందరినీ పీకేశారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసి వాటిపై ఆధారపడ్డ సిబ్బందిని రోడ్డుపాలు చేశారు. – కసాపురం రమేష్, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ సాయం కోసం ఎదురు చూస్తున్నాం కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నాం. గత ఏడాది కూడా పెట్టుబడి సాయం మంజూరు కాలేదు. ప్రస్తుతం రైతుల వెరిఫికేషన్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. మా ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందో లేదో చూడాలి. – మునయ్య, ముచ్చుకోట, తాడిపత్రి మండలం పేదలకు శాపంగా మారిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు పేద ప్రజలకు ఏ మేలూ జరగలేదు. సంక్షేమ పథకాల ఊసే లేదు. పట్టణ, గ్రామ పరిధిలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిన మాటను చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. అలాగే సూపర్ సిక్స్ పథకాలను సైతం అమలు చేయకుండా దగా చేశారు. పేద ప్రజలకు ఈ ప్రభుత్వం శాపంలా మారింది. –చిరంజీవి యాదవ్, సీపీఐ పట్టణ కార్యదర్శి, తాడిపత్రి బాబు జీవితమంతా మోసమే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలను ఇచ్చి ప్రజలను వంచించారు. గత ఎన్నికలకు ముందు సూపర్సిక్స్తో పాటు 145 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. చంద్రబాబు జీవితమంతా పచ్చి మోసం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి సంక్షేమం అందించారు. మేనిఫెస్టో అమలు చేయని పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలి. ఆ దిశగా పార్లమెంట్లో చర్చ జరగాలి. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
రైతాంగాన్ని ఆదుకోవాలి
అనంతపురం కార్పొరేషన్: ‘ఖరీఫ్, రబీకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్నా ఇంత వరకు విత్తన కేటాయింపులు జరపలేదు. ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాలు వీడి రైతాంగాన్ని ఆదుకోవాలి’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023–24 ఖరీఫ్లో 17 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, కేంద్ర బృందం పర్యటించి వెళ్లినా ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినా కేవలం 7 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 15 లక్షల ఎకరాలకు పైబడి పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందు కోసం 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం కేవలం 1.14 లక్షల క్వింటాళ్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క రూపాయి ఇచ్చారా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం కింద రైతుకు రూ.13,500 చొప్పున అందజేశామని ‘అనంత’ గుర్తు చేశారు. అప్పట్లో సున్నావడ్డీ, పావలా వడ్డీ వచ్చేవన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. సున్నా, పావలా వడ్డీ అందే పరిస్థితి లేదన్నారు. బ్యాంకు రుణాలను రెన్యూవల్ చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. ఇటీవల జెడ్పీ సమావేశంలో రైతు సమస్యలను ప్రస్తావించిన పాపాన పోలేదన్నారు. ‘ఆ ఫొటో ఇక్కడుండాలి, ఈ ఫొటో అక్కడుండాలి’ అని అనుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రైతులకు ఎటువంటి మేలు జరగడం లేదన్నారు. అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత ఏడాది డీఏపీ, యూరియా, పొటాష్ కృత్రిమ కొరత సృష్టించారని, బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా అమ్ముకున్నారని, ఈ ఏడాదీ అదే పరిస్థితి ఉందన్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రజాప్రతినిధుల దృష్టంతా ఆదాయం, వ్యాపారాలపైనే ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలను, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప మరేమీ చేయడం లేదన్నారు. అసలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉన్నారా అనే పరిస్థితి ఉందన్నారు. తక్షణం సీఎంతో మాట్లాడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజాస్వామ పద్ధతిలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రైతు విభాగం అనంతపురం నియోజకవర్గం అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
తప్పులతడక..గందరగోళం
కుప్పలు తెప్పలుగా విన్నపాలు అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కోసం అధికారులు రూపొందించిన సీనియార్టీ జాబితా గందరగోళంగా మారిందంటూ టీచర్లు వాపోతున్నారు. కామన్ సీనియారిటీ లెక్కించేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొందిన వారికి వారి ర్యాంకుల ప్రకారం వివిధ సబ్జెక్ట్లను కలుపుతూ జాబితా తయారు చేస్తారు. కానీ ఎస్జీటీ నుంచి పాఠశాల సహాయకులుగా ముఖ్యంగా ఒకే డీఎస్సీలో ఎస్జీటీగా ఎన్నికై ఒకేరోజు పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లతో ఉమ్మడి సీనియార్టీ తయారు చేసేటప్పుడు వారి ఫీడర్ కేటగిరీ (ఎస్జీటీ) లో మెరిట్ను ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే, ప్రస్తుత పదోన్నతుల్లో ఈ విధానాన్ని పక్కనపెట్టడంతో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు. మెరిట్కు మంగళం... 1994 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికై ...2002 నవంబరులో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందిన వారి సీనియార్టీ జాబితాలో పరిశీలిస్తే.. డీఎస్సీలో 36వ మెరిట్ ర్యాంకుగా ఉన్న టీచరు కంటే కూడా 397 ర్యాంకు టీచరును ముందు పెట్టారు. 99వ ర్యాంకు పొందిన టీచరుకంటే కూడా 161, 378, 141, 373 ర్యాంకు టీచర్లు ముందున్నారు. ఈ ఐదుగురూ (99,161,378,141,373 ర్యాంకర్లు) కూడా 36 ర్యాంకు టీచరుకంటే ముందున్నారు. అందరూ ఓపెన్ కేటగిరీ టీచర్లు కావడం విశేషం. కోర్టుకు వెళ్లే ఆలోచనలో టీచర్లు హెచ్ఎం పదోన్నతులకు తయారు చేసిన సీనియార్టీ జాబితాలో మెరిట్ను తుంగలో తొక్కి, సీనియర్లకు అన్యాయం చేయడంపై బాధిత టీచర్లు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. 20 ఏళ్లకు పైగా ప్రమోషన్స్ లేక ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులను ‘వింత పద్ధతి’ దెబ్బ తీస్తోందంటూ వాపోతున్నారు. హెచ్ఎంల సీనియార్టీ పదోన్నతుల జాబితాలో తప్పులు పట్టించుకోని అధికారులు.. కోర్టుకెళ్తామంటున్న బాధిత టీచర్లు ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్కు సంబంధించి విన్నపాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో జరిగిన పొరబాట్లు, సాంకేతిక సమస్య కారణంగా చాలామందికి అర్హత ఉన్నా కూడా వివిధ పాయింట్లు నమోదు కాలేదు. కొందరు దరఖాస్తు సమయంలో పొరబాట్లు చేశారు. ఈ కారణంగా వారికి నిబంధన మేరకు రావాల్సిన పాయింట్ల కంటే తక్కువ నమోదయ్యాయి. అర్హత ఉండీ రావాల్సిన పాయింట్ల కంటే తక్కువ రావడంతో ఆందోళన చెందుతూ డీఈఓల వద్దకు టీచర్లు పరుగులు తీస్తున్నారు. పని చేయని ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ ప్రతి టీచరూ వ్యక్తిగత ట్రాన్స్ఫర్ లాగిన్లో వెళ్తే...అక్కడ గ్రీవెన్స్ ఆప్షన్ ఉంచారు. ఆప్షన్ ఓపెన్ చేసి తమ సమస్య విన్నవించుకోవచ్చు. అయితే ఎన్నిమార్లు ప్రయత్నించినా ‘ఎనేబుల్’ కాలేదని చూపుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు డీఈఓతో పాటు వారి పరిధిలోని ఎంఈఓలను కలిసి విన్నవిస్తున్నారు. ఎంఈఓలు తమ లాగిన్లో అప్లికేషన్లు ఓపెన్ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ ఉన్నా...పరిష్కరించే సమయం లేక వెంటనే ఆమోదం తెలుపుతున్నారు. డీఈఓ లాగిన్కు రాగానే ఇక్కడి ఐటీ ఉద్యోగులు కూడా అదే స్పీడ్తో ఆమోదం తెలుపుతుండటం గమనార్హం. -
హామీలిచ్చి మోసం చేయడం ఆయనకు కొత్తకాదు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలతో ఊదరగొట్టడం.. అధికారంలోకి వస్తే వాటిని గాలికొదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘పూర్తిగా రుణమాఫీ చేస్తాను, మీ బంగారంపై తీసుకున్న రుణం పైసా కట్టొద్దు, లోన్లు చెల్లించొద్దు’ అంటూ 201
సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పగ్గాలు చేపట్టి ఏడాది కావొస్తున్నా హామీలు అమలు కావడం లేదు. మేనిఫెస్టోను చిత్తుకాగితంలా భావించిన సీఎం చంద్రబాబు సామాన్యుల నోట మట్టికొట్టారు. ఈ క్రమంలో జిల్లాలో నేడు ఏ పల్లెకు వెళ్లినా, ఏ గల్లీకి వెళ్లినా కూటమి సర్కారు మోసాల గురించి చర్చలు సాగుతున్నాయి.గత ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఏ పథకానికి ఎంత సొమ్ము ఇవ్వాలో బటన్ నొక్కి మరీ వారి ఖాతాలోకి జమ చేశారు. తాజా పరిస్థితుల్లో ‘పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు’ను తెచ్చుకున్నామన్న చందంగా పరిస్థితి తయారైందని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ● ఎన్నికల వేళ సూపర్సిక్స్ పథకాలపై చంద్రబాబు డప్పు ● అధికార పగ్గాలు చేపట్టాక హామీలన్నీ గాలికి ● ఏడాది పూర్తవుతున్నా ఒక్క రూపాయీ అందించని వైనం ● మండిపడుతున్న లబ్ధిదారులు -
‘నవోదయ’ నిర్మాణానికి భూమిని గుర్తించండి
కళ్యాణదుర్గం/కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం నిర్మాణం కోసం అవసరమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కళ్యాణ దుర్గం పట్టణ పరిధిలోని ధర్మవరం రోడ్డులో సర్వే నంబర్ 464లో 17.12 ఎకరాలు, సర్వే నంబర్ 465లో 1.35 ఎకరాలను, అలాగే, ఈస్ట్ కోడిపల్లి సమీపంలో సర్వే నంబర్ 389లోని 37.45 ఎకరాల భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ విద్యాలయం కోసం ప్రభుత్వ భూమి ఉంటే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి, ఆర్డీఓ వసంతబాబు, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులు చేపట్టిన ‘యోగాంధ్ర’ రిజిస్ట్రేషన్ సర్వేను కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, డీపీఓ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 28 పడకలతో కోవిడ్ వార్డు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఈఎన్టీ వార్డులో 28 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. మూడు వెంటిలేటర్లు, 50 వీటీఎం కిట్లను అందు బాటులో ఉంచారు. మంగళవారం ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈఎన్టీ వార్డులో 24 గంటలూ స్టాఫ్నర్సులు ఉండేలా, టెక్నీషియన్, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని నోడల్ ఆఫీసర్ డాక్టర్ రామస్వామిని ఆదేశించారు. రాయదుర్గం, గుమ్మఘట్టకు అత్యధిక అలాట్మెంట్అనంతపురం అగ్రికల్చర్: రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియలో భాగంగా పంట విస్తీర్ణం బట్టి మండలాలకు విత్తన కేటాయింపులు చేశారు. ఈ ఏడాది జిల్లాకు కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. అందులో కే–6 రకం 46,692 క్వింటాళ్లు, కదిరి–లేపాక్షి (కే–1812) రకం 900 క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 3 వేల క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు జారీ చేశారు. తాజాగా డివిజన్లు, మండలాల వారీగా విత్తన వేరుశనగ బస్తాలను అలాట్ చేశారు. రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాలకు అత్యధికంగా 3 వేల క్వింటాళ్ల చొప్పున కేటాయించగా... యల్లనూరు మండలానికి క్వింటా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక పుట్లూరుకు 50 క్వింటాళ్లు, తాడిపత్రి మండలానికి 100 క్వింటాళ్లు ఇచ్చారు. మొత్తమ్మీద కళ్యాణదుర్గం సబ్డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాలకు అత్యధికంగా 14,462 క్వింటాళ్లు కేటాయించారు. ఆ తర్వాత అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో ఆరు మండలాలకు 10,500, రాయదుర్గం డివిజన్లో ఐదు మండలాలకు 10,200, ఉరవకొండ డివిజన్లో నాలుగు మండలాలకు 6,850, గుత్తి సబ్ డివిజన్లో ఐదు మండలాలకు 6,750 క్వింటాళ్లు అలాట్ చేశారు. అత్యల్పంగా తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాలకు 1,830 క్వింటాళ్లు కేటాయించారు. రాయితీ ఇలా.. కే–6, టీసీజీఎస్–1694 రకం క్వింటా పూర్తిధర రూ.9,300 కాగా 40 శాతం రాయితీ రూ.3720 పోనూ రైతుల వాటా కింద రూ.5,580 ఖరారు చేశారు. కే–1812 రకం ధర రూ.8,200 కాగా రాయితీ రూ.3,280 పోనూ రైతులు రూ.4,920 ప్రకారం చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా 30 కిలోల బస్తాలు మూడు పంపిణీ చేయనున్నారు. -
టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్
సాక్షి అనంతపురం : టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది చంద్రబాబే.. టీడీపీకి వారసుడు ఎవరు?. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించారు.జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు.పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
‘ఖరీఫ్’ లక్ష్యం 4.38 లక్షల హెక్టార్లు
● అత్యధికంగా కళ్యాణదుర్గం మండల వ్యాప్తంగా 22,910 హెక్టార్లలో పంటలు ● మొత్తం నీటి వసతి కింద 1,32,321 హెక్టార్లలో సాగు ● వర్షాధారంగా 3,06,450 హెక్టార్ల సాగు అంచనాఅనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు సంబంధించి జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ముంగారు (ఖరీఫ్) వ్యవసాయానికి రైతులు సిద్ధమవుతుండగా... ఇందుకు అనుగుణంగానే ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు అంచనాలు కూడా అధికారులు ఎక్కువగానే అంచనా వేశారు. ఇందులో భాగంగానే నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు తదితర 15 రకాల పంటలు 3,06,450 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. అలాగే నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, ఎండుమిరప, టమాట ఉల్లి, మల్బరీ తదితర పంటలు 1,32,321 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. గత ఐదేళ్లలో ఈ–క్రాప్లో నమోదైన గణాంకాల ఆధారంగా ఈ ఖరీఫ్లో అన్ని రకాల పంటలు 4,38,771 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. కళ్యాణదుర్గం టాప్ ఖరీఫ్లో అటు నీటి వసతి, ఇటు వర్షాధారంగా కళ్యాణదుర్గం మండలంలో 22,910 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారిక అంచనా. ఇందులో నీటి వసతి కింద 6,527 హెక్టార్లు, వర్షాధారంగా 16,383 హెక్టార్లుగా గుర్తించారు. అలాగే తాడిపత్రి మండలంలో అతి తక్కువగా 8,261 హెక్టార్లలో అన్ని రకాల పంటలు వేస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత పెద్దపప్పూరులో 8,372 హెక్టార్లు, పుట్లూరులో 9,412 హెక్టార్లు, యల్లనూరులో 9,728 హెక్టార్లు, బుక్కరాయసముద్రంలో 9,670 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి వస్తాయని లెక్క వేశారు. శింగనమల నియోజక వర్గ పరిధిలో తక్కువ విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. ఇందులోనూ నీటి వసతి కింద ఉద్యాన పంటలు ఎక్కువగానూ, వర్షాధారంగా తక్కువగా పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఓవరాల్గా వర్షాధారంగా యల్లనూరు మండలంలో కేవలం 2,243 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తున్నట్లు అంచనా. వరి పంట ఎక్కువగా ఉన్నందున కణేకల్లు మండలంలో 8,204 హెక్టార్లలో నీటి వసతి కింద పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. -
ఆస్తి పన్ను పెంపు అసంబద్ధం : సీపీఎం
గుంతకల్లు టౌన్: పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు అసంబద్ధంగా ఉందని, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప అన్నారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం చేపట్టిన ప్రజా పోరుయాత్రను సోమవారం ఆయన గుంతకల్లులో జెండా ఊపి ప్రారంభించారు. ఆస్తి పన్నులను 20 శాతం పెంచేలా త్వరలో చేపట్టనున్న సర్వేను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు నాగరాజు, సురేంద్ర, రంగమ్మ, తిమ్మప్ప, ఓబులేసు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి బుక్కరాయసముద్రం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తెలిపారు. 2025–25 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి https://angrau.ac.in/ వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలన్నారు. -
ముచ్చుకోట స్కూల్ హెచ్ఎంకు షోకాజ్
అనంతపురం ఎడ్యుకేషన్: విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు షోకాజ్ నోటీసు జారీ అయింది. కీలకమైన టీచర్ల బదిలీల ప్రక్రియపై అలసత్వం వహించిన ఆయన తన స్కూల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు సంబంధించిన హార్డ్కాపీలపై కౌంటరు సంతకాలు చేయకపోవడమే కాక, వారికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఫోన్లు చేసి అడిగితే.. ‘నేను ఎంఈఓకు చెప్పాను వెళ్లి ఆయనను కలవండి. మీ దరఖాస్తును లాగిన్లో ఆమోదం తెలుపుతారని’ చెపుతూ వచ్చాడు. ఆ టీచర్లు ఎంఈఓను కలవగా... హెచ్ఎం కౌంటర్ సంతకం లేకుండా తాను ఓకే చేయలేనంటూ తెగేసి చెప్పాడు. ఆదివారం చివరి రోజు కావడం... హెచ్ఎం అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన టీచర్లు చివరకు విషయాన్ని డీఈఓ ప్రసాద్బాబు దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ పలుమార్లు ఫోన్ చేసినా సదరు హెచ్ఎం మొబైల్ పని చేయలేదు. చేసేదిలేక ఎంఈఓను ఆఫీసుకు పిలిపించి ఆ టీచర్ల దరఖాస్తులన్నీ ఆమోదం తెలపాలని సూచించారు. డీఓఈ ఆదేశాలతో ఎంఈఓ తన లాగిన్లో ఆమోదం తెలిపారు. ఈ వ్యవహారంపై ‘హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సమస్యను కొందరు పాఠశాల విద్య డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. -
పరాకాష్టకు ‘రెడ్బుక్’ వేధింపులు
● అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం ● వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్ అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్షక్ష పూరిత చర్యలకు పాల్పడడడం దారుణమన్నారు. పల్నాడు జంట హత్య కేసులో టీడీపీకి సంబంధించిన ఇరువర్గాలు గొడవపడి ఓ వర్గం వారిని హత్య చేశారని, మృతుల బంధువుల చెబుతున్నా.. ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి బ్రదర్స్ను కేసులో ఇరికించడం అన్యాయమన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నాయకులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని తిరుగోమనం దిశగా మళ్లించారని మండిపడ్డారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు వస్తారన్నారు. అమరావతి జపం, రెడ్బుక్ రాజ్యాంగం అమలు తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు. ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. హెచ్ఎం పదోన్నతులకు నేడు సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పాఠశాల సహాయకుల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాలో ఉన్న టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. https://deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ప్రొవిజినల్ సీనియార్టీ ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాలోని పీఎస్హెచ్ఎంలు/స్కూల్ అసిస్టెంట్లు తమ విద్యార్హత ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు కుల ధ్రువీకరణ పత్రాలు, పీహెచ్ టీచర్లు తమ ఒరిజనల్ విద్యార్హత పత్రాలతో పాటు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అనంతపురంలోని మొదటి రోడ్డులో ఉన్న శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో చేపట్టిన పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు. -
వ్యవసాయశాఖలో ‘బదిలీల జాతర’
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో సోమవారం బదిలీల జాతర జరిగింది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన జోనల్స్థాయి కౌన్సెలింగ్కు రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్, సిఫారసుల కింద కూడా కొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో అర్హత కలిగిన 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు 120 మందికి పైగా రిక్వెస్ట్ కింద బదిలీ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ సమక్షంలో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, నాగేశ్వరరావు, చంద్రానాయక్, మురళీక్రిష్ణ, వరలక్ష్మి, ప్రసాదరావు, జే.మురళిక్రిష్ణతో పాటు ఆయా జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్లు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా, కౌన్సెలింగ్ జరుగుతున్న తీరుపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొందరివి పరిగణలోకి తీసుకుంటున్నా... మరికొందరివి తీసుకోవడం లేదన్నారు. అలాగే తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుశాఖలో.. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, 23 మంది ఆఫీస్ సబార్డినేట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, ఆఫీస్ మేనేజర్, సూపరెండెండెంట్లు పాల్గొన్నారు. -
ఈ స్థలం నాది.. కాదనేవారెవ్వరు?
తాడిపత్రి: ‘అధికారం మాది.. ఇక్కడ మేము ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుంది. మమ్మల్ని అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు’ అనే ధోరణి టీడీపీ నేతలో వ్యక్తమైంది. గ్రామ కంఠం స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకుని బండలు పాతేయడమే కాక... ఆ స్థలం తనదని, కాదనేవారెవ్వరూ లేరంటూ దౌర్జన్యానికి తెరలేపిన ఘటన తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు... ఇగుడూరు గ్రామంలోని సర్వే నంబర్ 306లో కొంత స్థలం గ్రామ కంఠంగా ఉంది. ఈ స్థలానికి అవతలి వైపు పట్టా భూముల్లో కొందరు పక్కా గృహాలు నివాసముంటున్నారు. వీరి ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు సర్వే నంబర్ 306లోని గ్రామ కంఠంలోని 12 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉన్న స్థలమే ప్రధాన మార్గం. కాగా, ఈ స్థలానికి ఓ వైపు పుల్లన్న అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుని 30 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అతడి ఇంటి ముందర రస్తాకు ఓ వైపు పంచాయతీ బోరును వేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సదరు రస్తాతో పాటు పుల్లన్న ఇంటిని ఆక్రమించుకునేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ వారాది పావులు కదిపాడు. ఇందులో భాగంగానే గత నెల 9న టీడీపీకి చెందిన బాలమద్దిలేటి మరికొందరితో కలసి పంచాయతీ బోరును దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయంగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం బోయ వారాది, బాల మద్దిలేటి మరికొందరు కలసి రస్తాను ఆక్రమించి అటు వైపు నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా దౌర్జన్యంగా బండల పాతారు. ఇది చూసిన స్థానికులు అడ్డుకోబోతే ఆ స్థలం తనదంటూ వారాది దౌర్జన్యానికి తెగబడ్డాడు. రెవెన్యూ అధికారుల అండతోనే టీడీపీ నేతలు బరి తెగించారని, సమస్య పరిష్కారానికి తహసీల్దార్ రజాక్వలి ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ ఇళ్లకు రాకపోకలు సాగించేలా ఉన్న రస్తా ఆక్రమణలను తొలగించాలని కోరారు. గ్రామ కంఠాన్ని ఆక్రమించి బండలు పాతిన టీడీపీ నేత రెవెన్యూ అధికారుల అండతోనే దౌర్జన్యమంటున్న స్థానికులు -
పనిచేసినా పనిష్మెంట్!
● ఎస్జీటీ కేడర్ సర్వీస్ పాయింట్లు కలపని ప్రభుత్వం ● 6–10 ఏళ్ల సర్వీస్ పాయింట్లు కోల్పోతున్న టీచర్లు ● పాయింట్ల నమోదులో 2017 బదిలీ టీచర్లకూ తీవ్ర అన్యాయం ● లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్: ఏళ్ల తరబడి పని చేసినా...తాజా బదిలీల్లో ప్రభుత్వం తమకు పనిష్మెంట్ ఇస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎస్జీటీ కేడర్కు ఎంపికై పని చేస్తూ...కొన్నేళ్లకు మరో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికై సర్వీస్లో ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా పని చేస్తున్న టీచర్లకు ఎస్జీటీ కేడర్లో పని చేసిన సర్వీస్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘టీచర్ల బదిలీ చట్టం–2025’లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నామంటూ బాధిత టీచర్లు వాపోతున్నారు. ఎస్జీటీ కేడర్లో పని చేసిన 6–10 ఏళ్ల సర్వీస్ను కోల్పోతున్నారు. ఒక్కో టీచరు 3–5 పాయింట్లు దాకా నష్టపోతున్నారు. గతంలో జరిగిన పలు బదిలీల్లో తమకు ఎస్జీటీ కేడర్ పాయింట్లు సర్వీస్కు కలిపారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా ఇలాంటి టీచర్లు ఉన్నారు. వారంతా రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మెసేజ్లు పెడుతూ ప్రభుత్వానికి తమగోడు వినిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా విన్నవించుకుంటున్నారు. తప్పనిసరి బదిలీ... పాయింట్లలో అన్యాయం 2017లో బదిలీ అయిన టీచర్లందరినీ తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. 8 ఏళ్లు సర్వీస్ పూర్తికాకపోయినా ఈనెల 31 కటాఫ్ తేదీగా పెట్టి 23.2828 పాయింట్లతో 8 ఏళ్లు పూర్తయినట్లు భావించి వారందరి పోస్టులను ఖాళీలుగా చూపించారు.8 ఏళ్లు అంటే 24 పాయింట్లు ఇవ్వాలి. అదే 2023, 2021 రేషనలైజేషన్కు గురైన వారికి పూర్తిగా 24 పాయింట్లు ఇచ్చారు. దీంతో వారందరూ 2017 బ్యాచ్ వారికంటే ముందుకు వచ్చారని 2017 బదిలీ అయిన టీచర్లు వాపోతున్నారు. 9 ఏళ్లు సర్వీస్ అయినా 8 ఏళ్లకే పాయింట్లు 2014 డీఎస్సీలో ఎంపికై న వారు 2016 జూన్ 1న పాఠశాలల్లో చేరారు. వారందరికీ 2024 జూన్ 1 నాటికి ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయింది. వారంతా అదే ఏడాది తప్పనిసరిగా బదిలీ కావాలి. అయితే ఆ ఏడాది బదిలీలు జరగలేదు. ప్రస్తుతం (9వ సంవత్సరం) కూడా అదే పాఠశాలలో పని చేస్తూ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి గరిష్టంగా 8 ఏళ్లకే స్టేషన్ పాయింట్లు చూపిస్తున్నారు. ఒక ఏడాదికి స్టేషన్ పాయింట్లు పూర్తిగా కోల్పోతున్నారు. 2021, 2023 సంవత్సరాల్లో జరిగిన బదిలీల్లో ఎలాంటి సీలింగు విధించకపోవడం వల్ల గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు పని చేశారో అన్ని సంవత్సరాలకూ స్టేషన్ పాయింట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం గరిష్టంగా 8 ఏళ్లు సీలింగ్ పెట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని 2014 డీఎస్సీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హెచ్ఎంల తుది సీనియార్టీ జాబితా.. బదిలీల్లో భాగంగా మంగళవారం హెచ్ఎంల తుది సీనియార్టీ జాబితా ప్రదర్శించనున్నారు. ఖాళీలను వెబ్సైట్లో ప్రదర్శించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాను ప్రదర్శించనున్నారు. ఎస్జీటీల దరఖాస్తులను నేడు, రేపు పరిశీలించనున్నారు. -
జననాలంటే ‘లెక్కే’లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రైవేటు ఆస్పత్రుల విచ్చలవిడితనం రకరకాల ఇబ్బందుకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో అయినా మారుమూల గ్రామానికి చెందిన మహిళ ప్రసవించినా తల్లీ బిడ్డ వివరాలు నమోదు చేయాలనేది నిబంధన. కానీ మిస్సింగ్ రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జరుగుతున్న ప్రసవాలకు, నమోదవుతున్న వాటికీ పొంతన లేకుండా పోయింది. దీంతో కేంద్రం నుంచి ప్రసవ సమయంలో వచ్చే లబ్ధి కూడా జరగకుండా పోతోంది. జనాభా లెక్కల్లోనూ భారీ తేడా చోటు చేసుకుంటోంది. 8,661 మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు.. 2024–25 సంవత్సరంలో జిల్లాలో వాస్తవానికి 48,224 డెలివరీలు జరిగినట్టు సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం)లో నమోదైంది. ఈ సంఖ్య ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్)లో 34,858గా ఉంది. ఒక్కో కేంద్రం పోర్టల్లో ఒక్కో రకంగా సంఖ్య నమోదై ఉంది. జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే డెలివరీలు, గర్భిణుల నమోదు తప్పుల తడకగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 8,661 ప్రసవాలు అసలే నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఎంతమంది పుడుతున్నారు, ఎవరికి ఎలాంటి లబ్ధి జరుగుతోందన్నది తెలియడం లేదు. 2,800కు పైగా అబార్షన్లు..! జిల్లాలో మిస్సింగ్ ప్రసవాలే కాదు అబార్షన్లు కూడా గుట్టుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రమారమి 2,800కుపైగా అబార్షన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగినట్టు తెలిసింది. వాస్తవానికి ప్రసవం లేదా అబార్షన్ ఏదైనా నమోదు చేసి జిల్లా ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)కు సమాచారం ఇవ్వాలి. ఎందువల్ల అబార్షన్ చేయాల్సి వచ్చిందనేది నివేదికలో పొందుపరచాలి. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాయి. లింగనిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేస్తున్నట్టు కూడా విమర్శలొస్తున్నాయి. ఓవైపు జననాల రేటు తగ్గిపోతుంటే ప్రైవేటు వైద్యులు అబార్షన్లు చేసి మరింత తగ్గిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం బర్త్రేటు 1.5 కంటే తక్కువగా నమోదవుతోంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకూ ప్రసవాల నమోదు ఇలా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,591 ప్రైవేటు ఆస్పత్రుల్లో 20,481 ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదైనవి 34,858 సీఆర్ఎస్లో నమోదైనవి 48,224 మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ 8,661 (ఒక్కో పోర్టర్లో ఒక్కో రకంగా నమోదు కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది) ప్రైవేటు ఆస్పత్రుల మాయాజాలం ప్రసవాల రిజిస్ట్రేషన్స్లో అవకతవకలు నమోదులో లేని 8,661 ప్రైవేటు ఆస్పత్రుల ప్రసవాలు రాష్ట్రంలో అత్యధికంగా మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు జిల్లాలోనే నర్సింగ్ హోంలలో జరిగే ప్రతి ప్రసవంపై సమాచారం ఇవ్వాలని నిబంధన ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకంతో జనగణనలో ఇబ్బందులు -
నాడు
జిల్లాలో చౌక ధరల దుకాణాలు 1,645 రేషన్కార్డు దారులు 6,60,330 ఎండీయూ వాహనాలు 405 వాహనాలపై ఆధారపడిన నిరుద్యోగులు 810 మంది నేడుపొట్ట కొట్టి.. అవస్థలు తెచ్చిపెట్టి! ● కూటమి సర్కార్ కక్ష సాధింపు ● ఎండీయూ వాహనాల రద్దు ● రేషన్ దుకాణాల వద్దే సరుకులు తీసుకునేలా ఆదేశాలు ● ఎండీయూ వాహనదారులు, ఆపరేటర్లకు ఉపాధి కోత ● ‘పాత’ కష్టాలు తలచుకుని కార్డుదారుల గగ్గోలు రాయదుర్గం: పేదల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్కు పేరొస్తుందనే అక్కసుతో నిర్దయగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. ఇంటింటా బియ్యం పంపిణీ చేసే ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేసింది. ఎండీయూ వాహనాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నిరుద్యోగుల పొట్టకొట్టింది. మరోవైపు కూటమి సర్కారు చర్యలపై కార్డుదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. బియ్యం, పప్పుల కోసం ఇక ప్రతి నెలా కుస్తీలు పట్టాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఎండీయూ వాహనాల్లో త్రాసుతో తూకం వేసి బ్యాగులో బియ్యం పోసేవారు. 20 కిలోల కార్డుకు ఆ మేర తూకం పడితేనే సిగ్నల్ చూపేది. గతంలో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేసే క్రమంలో తకరారు చేసి కొంత మిగుల్చుకునేవారు. దీంతో కార్డుదారులకు నష్టం చేకూరేది. అలాంటి అవకతవకలకు చెక్ పెడుతూ పేదలకు సౌలభ్యంగా ప్రవేశపెట్టిన విధానాన్ని మరింత మెరుగుపర్చాల్సింది పోయి పూర్తిగా ఊపిరి తీస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబం వీధిన పడుతుంది గతంలో కూలి పనిచేసుకునేదాన్ని. మాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎండీయూ మంజూరు కావడంతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో గౌరవంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా బాబు వలంటీర్గా ఉండేవాడు. అది తొలగించారు. ఇప్పుడు వాహనాలను తొలగిస్తే మా కుటుంబం వీధిన పడుతుంది. –బండి ముంతాజ్, వైఎస్సార్ కాలనీ, కురుగుంట కంతులు ఎలా చెల్లించాలి? ఎండీయూ వాహనాల్ని రద్దు చేయడంతో ఆపరేటర్లు చిక్కుల్లో పడినట్లయింది. వాహనాలకు సంబంధించి నెలవారీ కంతులు బ్యాంకులకు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేటర్లకే కాదు, కార్డుదారులకూ ఇబ్బందులు తప్పవు. అందరినీ దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన నిర్ణయం తీసుకోవాలి. – సుధాకర్, ఎండీయూ ఆపరేటర్, రాయదుర్గం అనంతపురం అర్బన్: ‘‘ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి మా పొట్ట కొట్టొద్దు. ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడతాయి‘‘ అంటూ ఎండీయూ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎండీయూ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా 2021 నుంచి జిల్లాలో 405 వాహనాల నిర్వాహకులు జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఎండీయూ వాహనాలు తొలగిస్తే తమతో పాటు హెల్పర్లుగా ఉన్నవారు కూడా ఉపాధి కోల్పోయి వీధిన పడతారన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాబావలి, బాబ్జాన్, ఖాసీమ్, గంగాధర్, గణేష్, హనుమంత, పోతయ్య, బషీర్, రమేష్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.నిర్దయపై నిరసనాగ్రహం -
వామ్మో.. ఇన్ని సమస్యలా...
తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో తమ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వారు వీరు. అధికారులు ఊహించని రీతిలో అర్జీదారులు రావడంతో మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. కలెక్టర్ వినోద్కుమార్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ శివ్నారాయణశర్మ, ఇతర జిల్లాధికారులు అర్జీలు స్వీకరించారు. దాదాపు 380 అర్జీలు వచ్చినట్లు తెలిసింది. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలున్నట్లు సమాచారం. ఇక.. అర్జీదారులకు అనుగుణంగా మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం పైఅంతస్తులో కార్యక్రమం నిర్వహించడంతో దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. వినతుల్లో కొన్ని.. 544డీ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన తమకు పరిహారం అందలేదని తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువు గ్రామంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కొందరు కబ్జా చేశారని, భూములను కాపాడాలని ఆలయ అర్చకులు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రిలో ప్రెస్క్లబ్ ఏర్పాటు చేయాలని విలేకరులు ఎమ్మెల్యే, కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే విలేకరులకు ఇంటి స్థలాలివ్వాలని కోరారు. -
కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదా?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇవి ప్రజల్లో మెదలినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కక్ష సాధింపులు తప్ప.. సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదా? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు దారుణ’మని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాని అరెస్టును ఖండించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో భయానకమైన వాతావరణాన్ని తీసుకువస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదని విమర్శించారు. ఆయన జీవితమంతా అబద్ధాలమయ మని దుయ్యబట్టారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గిరిజన పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అనంతపురం రూరల్: గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామాంజినేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఉన్నాయన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి 3 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు ఆయా పాఠశాలల్లో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. యువ వైద్యుడిని మింగిన రోడ్డు ప్రమాదం కోలారు: రోడ్డు ప్రమాదం ఓ యువ వైద్యుడిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కర్ణాటకలోని కోలారు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం నగరానికి చెందిన యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. అనంతపురం నగరంలోని ఇందిరానగర్కి చెందిన వెంకటేశులు కుమారుడు కృష్ణ జగన్ (24) చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం హౌస్సర్జన్గా పని చేస్తున్నాడు. ఇటీవల వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కళాశాలకు కారులో బయలుదేరాడు. కోలారు జిల్లా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఉదయం 8.30 గంటల సమయంలో కృష్ణ జగన్ ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా తీవ్ర గాయాలైన డాక్టర్ కృష్ణ జగన్ ఘటనా స్థలంలోనే మరణించారు. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కృష్ణ జగన్ మరణవార్తను తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. యోగాతో మానసికోల్లాసం తాడిపత్రి రూరల్: యోగాతో మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో సోమవారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పెన్నానది ఒడ్డున గల బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణలో యోగాసనాలు వేయడం సంతోషకరమని తెలిపారు. పట్టణంలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి దేవాలయం, గుత్తి కోట పరిసరాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వరస్వామిని కలెక్టర్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్లు తదితరులున్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘చల్లగా’ వచ్చేసింది ● 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరింపు అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ (సౌత్వెస్ట్ మాన్సూన్స్) ఉమ్మడి అనంతను సోమవారం పలకరించింది. ఉమ్మడి జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో ‘నైరుతి’కి స్వాగతం పలికాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు జూన్ 5 లేదా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే పరిస్థితి ఉండేదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. అయితే ఈ సారి వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈనె 24న కేరళను తాకిన నైరుతి సోమవారం ‘అనంత’లోకి ప్రవేశించాయన్నారు. రుతువపనాల ప్రభావంతో రాగల మూడు రోజులు జిల్లాకు వర్షసూచన ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడవచ్చన్నారు. ఖరీఫ్కు కీలకం.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఖరీఫ్ కింద దాదాపు 8 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చే వ్యవసాయ, ఉద్యాన పంటలకు ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. రుతుపవనాలు ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు కురుస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. -
తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం
గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య రోజా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, తాగునీటి పథకం కార్మికుల సంఘం నాయకుడు పి.చిన్న బాబయ్య గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచిన సూరప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సూరప్ప మృతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు తిమ్మప్ప, సురేంద్ర, కె.రామాంజినేయులు, వెంకటాద్రి, సంతోష్ ఉన్నారు. -
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ● వడ్డెర సేవా సంఘం జిల్లా అద్యక్షుడు లక్ష్మినారాయణ అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక అనంతపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా కృష్ణప్రసాద్, రఘురామానాయుడు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రామునాయక్, అసోసియేట్ ప్రెసిడెంట్గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా అశోక్బాబు, నాగేశ్వరయ్య, వెంకటరాముడు, కలీం అహ్మద్, డాక్టర్ శివారెడ్డి, శశిధర్రెడ్డి, పౌల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కేసీ నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా హనుమంతు, వరప్రసాద్, చంద్రశేఖర్, భారతమ్మ, మహబూబ్బాషా, వసంత, రామాంజినేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రూరల్ కమిటీ అధ్యక్షుడు మారుతీప్రసాద్ పాల్గొన్నారు. ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ మృతిఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బూదగవి గ్రామానికి చెందిన బోయ నాగరాజు (32)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. హెచ్ఎం టీవీ రిపోర్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, జర్నలిస్టులు పి. షెక్షావలి, కె.ఆనందరావు, వడ్డె రమేష్, సాదిక్, వీరేష్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సరిహద్దున ప్రమాదంలో ఇద్దరి మృతి శెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) ఉన్నారు. వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు.. రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మాల రామచంద్ర (61) మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేయడానికి అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి తూర్పున శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గుంత తీసేందుకు కొందరు దళితులు అక్కడికి వెళ్లడంతో ఆ స్థలం తమదంటూ అదే గ్రామానికి చెందిన పలువురు కాలువ గొంచి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలంటూ రోడ్డుపై మృతదేహన్ని ఉంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాప్తాడు, రూరల్ సీఐలు శ్రీహర్ష, శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వందేళ్లుగా తమ పూర్వీకుల అనుభవంలో ఉంటూ వచ్చిన భూమిని దళితుల శ్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారంటూ కాలువగొంచి నిర్వాహకులు మండిపడ్డారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను గత ఏడాది ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి తూర్పున ఉన్న సర్వే నంబర్ 281–4లో 1.08 ఎకరాలను దళితుల శ్మశాన వాటికకు కేటాయించాలంటూ అప్పట్లో ఆర్డీఓకు ఎమ్మెల్యే సూచించారని, దీంతో నాలుగు నెలల క్రితం శ్మశాన వాటికకు కేటాయిస్తూ తహసీల్దార్ విజయకుమారి పట్టాను ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగానే తమకు ఇప్పించారంటూ దళితులు ప్రతిగా స్పందించారు. ఈ విషయంపైనే తాము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్లుగా కాలువగొంచి రైతులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోర్టు స్టే ఆర్డర్ను చూపారు. గ్రామానికి దక్షిణం వైపు 3.80 ఎకరాల శ్మశాన వాటిక ఉందని, అక్కడికెళ్లి ఖననం చేసుకోవాలని సూచించారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమారి అక్కడకు చేరుకుని దళితులతో చర్చించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. ఈ అంశంలో న్యాయం చేస్తానని, శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించి పాత శ్మశాన వాటికలోనే రామచంద్ర మతృదేహాన్ని ఖననం చేశారు. కాగా, ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను ఎమ్మెల్యే పరిటాల సునీత మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి అల్లరి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులు ఆత్మానంద, వెంకటరమణప్ప, గురురాజమూర్తిని ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అమరేంద్ర, తిరుపాలు, పీడీ గోపాల్, హెచ్.నారాయణరావు, గోపాల్రెడ్డి, నగేష్, ఎంపీ శ్రీనివాసులు, రాజశేఖర్, రఘునాథశర్మ నేతృత్వం వహించారు. శేషగిరి, మునిస్వామి, సతీష్కుమార్, శ్రీనివాసులు, సదానందబాబు, వెంకటేశ్వరరావు, పులిశేఖర్ కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, కాలువ గట్లతో పాటు రాయలచెరువు గ్రామ సమీపంలోని చెరువులో మట్టినీ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి, సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులో రోజూ 500 టిప్పర్ల మట్టిని తోలుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఇరిగేషన్ అధికారులు హడావుడి చేసి.. మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాట నిలబెట్టుకున్న పెద్దారెడ్డి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలచెరువు గ్రామ సమీపంలో రిజర్వు కొండ, ఊరుగట్ట, పిచ్చల కొండల మధ్య సర్వే నంబర్ 705లో 525 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ మూడు కొండల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. తవ్వకాలు చేపట్టిన తర్వాత నుంచి క్రమేణా కొండల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. 2017లో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండలం బోగాలకట్ట నుంచి రాయలచెరువు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చెరువును నింపి.. సమీపంలోని కాలువలకు నీటిని విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే అయ్యాక నాలుగు సార్లు రాయలచెరువు చెరువును నింపి.. కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. చెరువును విస్మరించిన జేసీ కుటుంబం తాడిపత్రి నియోజకవర్గం నుంచి గెలిచిన జేసీ సోదరులు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయలచెరువును పూర్తిగా విస్మరించారు. తమ స్వలాభం కోసం చెరువును నీటితో నింపకుండా వదిలేశారు. ఇక్కడ రైతులు, కూలీలు ఎప్పుడూ దయనీయ స్థితిలో ఉండటమే వారు కోరుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పలు సందర్భాల్లో జేసీ సోదరులను విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజల వద్దకు వెళ్లరని, వారికి ఏదైనా సమస్యను చెప్పాలన్నా ప్రజలు భయపడిపోయేవారని అన్నారు. చెరువు మట్టిని దోచేస్తున్నారిలా.. అధికార పార్టీకి చెందిన యాడికి మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్ నుంచి మట్టి దోపిడీ కొనసాగుతోంది. మూడు హిటాచీలతో రోజుకు 500 టిప్పర్ల మేర రాయలచెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వేసినట్లు తెలుస్తోంది. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలైతే టిప్పర్కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి రూ.10వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా పొలాలకు తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరతోనే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు రాయలచెరువు 525 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతులు లేవు. అయితే కొంతమంది రైతులు తమ పొలాలకు మట్టి కావాలని కోరితే ఇరిగేషన్ శాఖ అధికారులకు నివేదిక పంపించాం. – ప్రతాప్రెడ్డి, తహసీల్దార్, యాడికి రాయలచెరువు గ్రామ సరిహద్దులో ఆగని మట్టి దోపిడీ 24 గంటలూ హిటాచీ, జేసీబీలతో తవ్వకాలు రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం -
ఏఐజీడీఏ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆలిండియా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం (ఏఐజీడీఏ) కన్ఫరడేషన్ జోనల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ఒడిశా) సెక్రెటరీగా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పి.రమేష్బాబును నియమించారు. ఆదివారం ఆలిండియా గవర్నమెంట్ డ్రైవర్ల సంఘం కన్ఫడరేషన్ సమావేశం చత్తీస్ఘడ్లో జరిగింది. 18 రాష్ట్రాల నుంచి సంఘం అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐజీడీఏ కన్ఫరడేషన్ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబుకు నియామక ఉత్తర్వులను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు అందజేశారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి పామిడి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన వడ్ల చంద్రశేఖర్(38) అలియాస్ శేఖర్ చీనీ, వేరుశనగ, వడ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారంలో భాగంగా పామిడికి చెందిన పిక్కిలి రామకృష్ణతో కలసి శనివారం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి తిరుగు ప్రయాణమైన భోజనం చేసేందుకు 44వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ధాబాకు చేరుకున్నారు. అప్పటికే మూసేయడంతో ధాబా సమీపంలోనే ద్విచక్ర వాహనం వద్ద నిలబడి మాట్లాడుకుంటుండగా... ఖల్సా ధాబా యజమాని తేజ ట్రాక్టర్పై వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనలో ట్రాక్టర్ అదుపు తప్పి చంద్రశేఖర్పై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, చంద్రశేఖర్కు భార్య లక్ష్మి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం అనంతపురం ఎడ్యుకేషన్: ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి దరఖాస్తుల హార్డ్కాపీలను సంబంధిత హెచ్ఎంలు నిర్ధారించి...వాటిని ఎంఈఓలకు అందజేస్తే వారి లాగిన్లో ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఆదివారం తుది గడువు. ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యం మూడు రోజులుగా పత్తా లేకుండా పోయాడు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంఈఓ రవికుమార్ను అడిగితే...హెచ్ఎం నిర్ధారించిన తర్వాతనే లాగిన్లో అప్లోడ్ చేస్తానని స్పష్టం చేశారు. అయితే స్కూల్ అసిస్టెంట్ల దరఖాస్తులను పరిశీలించి... ఎంఈఓలు తమ లాగిన్లో అప్లోడ్ చేసేందుకు ఆదివారమే చివరి గడువు కావడంతో దరఖాస్తు చేసుకున్న ఆ స్కూల్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని డీఈఓ, గుత్తి డీవైఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వారు నేరుగా ఎంఈఓ రవికుమార్తో మాట్లాడారు. డీఈఓ మౌఖిక ఆదేశాల మేరకు చివరి నిముషంలో ఎంఈఓ అప్లోడ్ చేశారు. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ నాయకులు భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టి కృష్ణా జలాలను జిల్లాకు అందించారని గుర్తు చేశారు. ఈ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులు ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 టీఎంసీలకే పరిమితం చేస్తూ కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారని తెలిపారు. కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, హిందూపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 29వ తేదీ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతులతో కలసి ఆయా మండలంలోనే రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతా అక్రమ ఆదాయమే.. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు హతమార్చారన్నారు. 300కు పైగా అక్రమ కేసులతో దౌర్జన్యాలకు దిగారన్నారు. ఇక దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నారు. లేని భూ సమస్యలను సృష్టించి సెటిల్మెంట్లకు రాకపోతే హత్యలు చేయిస్తున్నారన్నారు. రూ.లక్షల్లోనే మట్టి దోపిడీలు సాగిస్తున్నారన్నారు. కక్కలపల్లి టమాట మండిలో శ్రీరామ్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో బాటిల్పై రూ.10 శ్రీరామ్ ట్యాక్స్ అంటూ వసూలు చేస్తున్నారన్నారు. కంకర మిషన్ నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక అమ్ముకునేందుకు వీలుగా పేరూరు డ్యాంకు నీరు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి తప్ప కూటమి ప్రభుత్వంలో కాదన్నారు. జీడిపల్లి నుంచి ఆత్మకూరుకు నీటిని అందించేందుకు రూ.170 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు సబ్ స్టేషన్లు తీసుకురాగా, వీటిలో తోపుదుర్తి, గొరిదిండ్ల సబ్స్టేషన్ల పనులను ఈ ప్రభుత్వం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. అనంతపురం – తగరకుంట మార్గంలో సగం రోడ్డు పూర్తి చేస్తే ఆ తర్వాత సగం రోడ్డు పనులకు కనీసం కంకర కూడా వేయలేదన్నారు. పీఏబీఆర్ నుంచి రూ.67 కోట్లతో తాగునీటి పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా... నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రకాష్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిటాల సునీత నేతృత్వంలోనే అనంతపురం రూరల్ పరిధిలో ఇళ్లు కూల్చారని, దోపిడీలు, హత్యలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గార్మెంట్ పరిశ్రమ తీసుకువచ్చామని, అలాగే చేతనైతే పరిటాల సునీత కూడా నియోజకవర్గానికి నూతన పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో 68 సెంట్లలో 20 ఇళ్లు కూల్చేసి ఆ స్థలంపై కన్నేస్తే బాధితుల పక్షాన నిలిచి కోర్డుకు వెళ్లి స్టే ఆర్డర్ తెప్పించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రకాష్రెడ్డిని విమర్శించడం మాని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిపెట్టాలని హితవు పలికారు. భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలు హంద్రీ నీవా లైనింగ్ పనులతో రైతులకు తీరని అన్యాయం న్యాయం కోరుతూ ఈ నెల 29 నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు వైఎస్సార్సీపీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
● ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠం
పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇంత కాలం ప్రభుత్వం స్పందించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలా కాకున్నా... కనీసం మరమ్మతులైనా చేపడుతుందని గ్రామీణులు ఆశించారు. అయినా కనుచూపు మేరలో అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రహదారి మరింతగా దెబ్బతినింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు పడరాని పాట్లు పడేవారు. ఇలాంటి తరుణంలో రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపట్టాలంటే ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. విషయాన్ని గమనించిన ఎల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ గంగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్వయంగా రంగంలో దిగి తన రోజు వారి సంపాదన రూ.1,200 చొప్పున రెండు రోజుల ఆదాయం రూ.2,400 వదులుకుని ఒంటరిగానే మట్టితో గుంతలను పూడ్చి వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులు ‘ఏందయ్యా గంగరాజు... ఏమిటీ పని ఒప్పుకున్నావా?’ అన్ని ప్రశ్నిస్తే.. ‘గుంతల వల్ల రోజూ ఎవరో ఒకరు కిందపడుతూనే ఉన్నారు కదన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాలు ఏవీ జరగకూడదని మట్టితో గుంతలను పూడుస్తున్నా’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది చూసిన పలువురు శభాష్ గంగరాజు అంటూ మెచ్చుకున్నారు. -
నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం తాడిపత్రి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. తాడిపత్రి పట్టణ, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ అనంతపురం అగ్రికల్చర్: రైతులకు విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది 50,592 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కే–6తో పాటు టీసీజీఎస్–1,694, కదిరి–లేపాక్షి (కే–1,812) విత్తన రకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కే–6, టీసీజీఎస్–1,694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా అందులో 40 శాతం రూ. 3,720 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కే–1,812 రకం పూర్తి ధర రూ.8,200 కాగా రూ.3,280 రాయితీ పోనూ రైతులు రూ.4,920 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (ఒక్కోటి 30 కిలోలు) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు, 50 శాతం రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు జూన్ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 ప్రాసెసింగ్ ప్లాంట్లలో వేరుశనగ విత్తనశుద్ధి జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆర్ఎస్కేలకు విత్తన సరఫరా చేసినట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి. ఎలుగుబంట్ల హల్చల్ కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని రోషన్ కొండ సమీపంలో ఆదివారం రెండు ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఉరుసు ఉత్సవానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కేకలు వేయడంతో భల్లూకాలు కొండల్లోకి పారిపోయాయి. ఇటీవల కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్లు జనావాసా ల్లోకి చొరబడుతున్నాయి. రెండు రోజుల క్రితం మండల పరిధిలోని మోరేపల్లి గ్రామం వద్ద వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ‘యోగాంధ్ర’కు రిజిస్ట్రేషన్ చేసుకోండి : కలెక్టర్ అనంతపురం అర్బన్:యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర–2025 క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు https://yogandhra.ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్/అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయించారు. కాగా.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సాగిన పరీక్షలో అభ్యర్థుల హాజరు 59.50 శాతంగా నమోదైంది. 2,546 మంది హాజరవ్వాల్సి ఉండగా ఉదయం పేపర్–1 పరీక్షకు కేవలం 1,522 మంది హాజరయ్యారు. 1,024 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,515 మంది హాజరుకాగా 1,031 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు ఎంఎం నాయక్, కలెక్టర్ వి.వినోద్కుమార్, జేసీ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. 59.50 శాతం అభ్యర్థుల హాజరు ప్చ్.. అదృష్టం లేదు! యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరీక్ష సమయాని కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. ఉదయం 9 తరువాత, మధ్యాహ్నం 2 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. అయితే ఆదివారం కొందరు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాల్సిన కదిరికి చెందిన షర్మిల, కర్నూలుకు చెందిన కిరణ్, అనంతపురం నగరానికి చెందిన స్రవంతి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మరికొన్ని కేంద్రాల్లోనూ ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి పంపలేదు. -
చిత్ర విచిత్రాలు.. టీచర్ల గగ్గోలు
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీ దరఖాస్తులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి ఏ పాయింట్లు నమోదవుతున్నాయో, అవి ఎప్పుడు తొలగిపోతాయో అంతుచిక్కడం లేదు. దీంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల దరఖాస్తు ప్రక్రియను సాంకేతికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి. దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన పాయింట్లు హార్డ్కాపీ ప్రింట్ తీసుకునేలోపు మాయమవుతున్నాయి. పాఠశాల ఒక కేటగిరీ కింద ఉంటే...వెబ్సైట్లో మరో కేటగిరీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రీ అపోర్షన్కు గురైన టీచర్లకు స్పెషల్ పాయింట్లు కనిపించడం లేదు. జనరేట్ అయిన స్పౌజ్ ప్రత్యేక పాయింట్లు గల్లంతయ్యాయి. గార్లదిన్నె మండలంలో ఓ గణితం టీచరుకు దరఖాస్తు చేసుకున్న రోజు 43.4898 పాయింట్లు చూపించగా రెండోరోజు 43.4713 పాయింట్లు, మూడోరోజు (ఆదివారం) 38.4713 పాయింట్లు చూపిస్తోంది. ఇక సోమవారం (నేడు) ఎన్ని పాయింట్లు కనిపిస్తాయోనని సదరు టీచరు బెంబేలెత్తుతున్నారు. చివరకు కొందరు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసిన ఫారాలు కూడా వెబ్సైట్లో కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ‘టీచర్ల బదిలీ చట్టం–2025’ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ టీచర్లకు సమస్యగా మారింది. దరఖాస్తు గడువు ముంచుకొస్తుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అనంతపురంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న శారదా స్కూల్కు పరుగులు పెడుతున్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేదంటూ ఇక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎం దరఖాస్తులు మాయం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసి... హార్డ్కాపీలు ప్రింట్ తీసుకుని అధికారులకు అందజేసి నిర్ధారణ చేసిన తర్వాత కొందరు హెచ్ఎంల పేర్లు తాత్కాలిక సీనియార్టీ జాబితాలో కనిపించలేదు. తాడిపత్రి మండలం చుక్కలూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి.సుధాకర్ ఈనెల 21న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. డౌన్లోడ్ చేసుకుని 22న గుత్తి డీవై ఈఓకు సబ్మిట్ చేశారు. ఆన్లెన్ దరఖాస్తు అటు డీవైఈఓ లాగిన్లోనూ, ఇటు డీఈఓ లాగిన్లోనూ కనిపించలేదు. ఈలోగా గడువు ముగిసి తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలైంది. ఇందులో సుధాకర్ పేరే లేదు. డీఈఓను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కాగా సుధాకర్ రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే తప్పనిసరి బదిలీ అయి ఉండి ఇలా ఆన్లైన్లో దరఖాస్తు కనిపించకపోతే పెద్ద సమస్య అయ్యేదని టీచర్లు చెబుతు న్నారు. మరో 10 మందిదాకా హెచ్ఎంలు సుధాకర్ లాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. టీచర్ల బదిలీ ఆన్లైన్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు మాయమైపోతున్న పాయింట్లు ఉన్న పాయింట్లు చూపని వెబ్సైట్ చివరకు దరఖాస్తులూ కనిపించని వైనం డీఈఓ కార్యాలయం చుట్టూ ఉపాధ్యాయుల ప్రదక్షిణలు తమ చేతుల్లో లేదంటున్న అధికారులుస్కూల్ 3వ కేటగిరీ.. పాయింట్లు ఒకటో కేటగిరీవి.. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం టీచరు బి.రామాంజనేయులు 8 ఏళ్లు పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రహారం జెడ్పీహెచ్ఎస్ 3వ కేటగిరీలో ఉంది. అంటే ఏడాదికి మూడు పాయింట్ల చొప్పున 24 పాయింట్లు రావాల్సి ఉంది. ఆన్లైన్లో ఈ స్కూల్ కేటగిరీ–1లో ఉన్నట్టు చూపిస్తోంది. కేటగిరీ–1కు ఏడాదికి ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఈ లెక్కన మొత్తం 8 పాయింట్లు మాత్రమే చూపిస్తోంది. మూడు రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... ఏ ఒక్కరూ స్పందించడం లేదని రామాంజనేయులు వాపోతున్నారు. -
రేయ్ సాయిరాం నిన్ను చంపేస్తాం...
● తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ రెచ్చిపోయిన టీడీపీ మూకలు తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో శనివారం అర్ధరాత్రి టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు సాయిరాం ఇంటిపై రాళ్లదాడికి తెగబడ్డాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్లో నివాసముంటున్న సాయిరాం ఇంటి వద్దకు శనివారం అర్ధరాత్రి 10 మంది టీడీపీ అల్లరి మూకలు మద్యం మత్తులో స్కార్పియో వాహనంలో చేరుకున్నాయి. ‘రేయ్ సాయిరాం.. బయటకు రారా.. నిన్ను చంపేస్తాం’’ అంటూ కేకలు వేస్తూ హల్చల్ చేశాయి. దీంతో సాయిరాం కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ లోపలే ఉండిపోయారు. ఎంత అరిచినా సాయిరాం బయటకు రాకపోవడంతో అల్లరి మూకలు అతని ఇంటిపై రాళ్లదాడికి దిగాయి. ఇంటి తలుపులు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఫోన్లో సాయిరాం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.. మెల్లిగా అక్కడి నుంచి అల్లరి మూకలు జారుకున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. -
ఇదేం తాగుడు బాబోయ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన సొమ్ములో సగం మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు కావడంతో మద్యం ప్రజల చెంతకే వెళ్లినట్టయింది. దీంతో వినియోగం కూడా భారీగా పెరిగింది. రోజుకు రూ.4.60 కోట్ల విలువ చేసే మద్యం తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. సరిగ్గా 8 నెలల క్రితం చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. అప్పటినుంచి శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మద్యం ఏరులై పారుతోంది. రూ.1,100 కోట్లు దాటింది... గడిచిన ఎనిమిది మాసాల్లో అంటే 2024 సెప్టెంబర్ 15 నుంచి మే 15 వరకూ రూ.1,100 కోట్ల మద్యం వినియోగించారు. అంటే సగటున రోజుకు రూ.4.58 కోట్ల మద్యం తాగుతున్నారు. అనంతపురం జిల్లాలో 1,200కు పైగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 750కి పైగా మద్యం షాపులు ఉన్నాయి. ఇవి కాకుండా అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేశారు. గల్లీ గల్లీకి, గ్రామ గ్రామానికి మద్యాన్ని అందుబాటులోకి తేవడం, బహిరంగ మద్యపానంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల మద్య సేవనం విచ్చలవిడిగా మారింది. కూరగాయల షాపులకంటే మద్యం షాపులే ఎక్కువ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయలు అమ్మే షాపుల కంటే మద్యం షాపులు, బెల్టుషాపులు, పర్మిట్ రూములే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలే లిక్కర్ షాపులు నిర్వహిస్తుండటంతో విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వేళా పాళా ఉండటం లేదు. ఉదయం 6 గంటలకే మద్యం షాపులు తెరుస్తున్నారు. గుడులు, బడులు, ఆస్పత్రులు ఏమీ లెక్క చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. ఇదిలాఉంటే.. మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీన్నే ‘లిక్కర్ బేస్డ్ క్రైమ్’గా పోలీసులు చెబుతున్నారు. తాగిన మత్తులో ఇతరులపైనా, కుటుంబ సభ్యులపైనా, భార్యల పైనా దాడులకు దిగడం ఎక్కువైంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 నెలల్లోనే రూ.1,100 కోట్ల విలువైన మద్యం అమ్ముడుబోవడం రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. 8 నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు రూ.1,100 కోట్ల మద్యం వినియోగం -
అన్నదాతను నిండా ముంచారు..
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువ పనుల్లో భాగంగా కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు పంట నష్టపోయాడు. వివరాలు.. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ సమీపంలో హంద్రీ–నీవా 22వ కిలోమీటరు వద్ద కాలువ పనులు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన పి.శ్రీనివాసులు సర్వే నంబర్ 282–1బీలో తనకున్న 5 ఎకరాల్లో 2 నెలల క్రితం వేరుశనగ పంట సాగు చేశాడు. పంట పెట్టుబడుల కోసమని రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హంద్రీ–నీవాలో భారీగా నీరు చేరింది. దీంతో పనులకు అంతరాయం కలగడంతో ఆదివారం కాలువకు కాంట్రాక్టర్ గండి కొట్టి పక్కనే ఉన్న పి.శ్రీనివాసులు పొలంలోకి నీటిని వదిలాడు. దీంతో పంట మొత్తం నీట మునిగింది. విషయం తెలుసుకున్న రైతు అక్కడకు చేరుకుని సైట్ ఇంజినీర్ చంద్రతో మాట్లాడితే.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ.. టీడీపీ నేతలే గండి కొట్టమని చెప్పారని, ఎవరితోనైనా చెప్పుకో పొమ్మంటూ దురుసుగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించాలని, తనకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు విన్నవించాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జాఫర్, ఓ.నల్లప్ప, కౌలు రైతు సంఘం నాయకులు బాలరంగయ్య స్పందించారు. బాధిత రైతుకు పరిహారం చెల్లించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. హంద్రీ–నీవా పనుల్లో ఇష్టారాజ్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐదెకరాల్లో నీట మునిగిన వేరుశనగ పంట -
జిల్లాలో అసైన్డ్ భూమి ఇలా
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు ‘కష్ట’ కాలం నడుస్తోంది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోతున్నా.. పరిహారం ఇవ్వడం లేదు... బీమా రాలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందించడం లేదు. ఈ క్రమంలోనే డీ–పట్టా పొందిన అసైన్డ్ భూములకు అర్హత ఉన్నప్పటికీ ఏడాదిగా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.ఈ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపకుండా కూటమి ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టడంతో సమస్య తలెత్తింది. ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన పేరుతో చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న సాగదీత వైఖరి అసైనీలుగా ఉన్న రైతులకు శాపంగా మారింది. ఆర్థిక అవసరాలకూ భూములను అమ్ముకోలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ సమస్యను బహిరంగంగా చెప్పుకునేందుకూ రైతులు సాహసించలేని పరిస్థితి నెలకొంది. ఆవేదనను బయటకు చెబితే ఎటువైపు నుంచి కొత్త సమస్య వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ● ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1954 జూన్ 18 కంటే ముందు అసైన్డ్ అయిన భూములకు నిరభ్యంతర పత్రం ఉంటుంది. ఇలాంటి భూములు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉండవచ్చని అంచనా. కూటమి ప్రభుత్వం మొత్తం అసైన్డ్ భూములకు సంబంధించి క్రయ, విక్రయాలు, ఇతర ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఏడాదిగా ఫ్రీజింగ్లో పెట్టింది. దీంతో నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందిన అసైన్డ్ భూములు కూడా రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఏడాదవుతున్నా.. ప్రభుత్వ భూములను 20 ఏళ్ల క్రితం అసైన్మెంట్గా పొందిన వారికి ఫ్రీహోల్డ్ ద్వారా యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటు తరువాత కూటమి ప్రభుత్వం రావడంతో ఫ్రీహోల్డ్ భూముల పరిశీలనకు తెరతీసింది. అయితే, ఏడాది అవుతున్నా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఎప్పటికప్పుడు గడువును పొడిస్తూ సాగదీస్తూనే ఉన్నారు. పరిశీలన పూర్తయ్యే వరకు ఫ్రీజింగ్ను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతుల కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేవు.ఏడాదిగా నిలిచిన డీ–పట్టా రిజిస్ట్రేషన్లుఅసైన్డ్ చేసిన మొత్తం భూమి 2,22,902.05 ఎకరాలు డీ–పట్టా పొందిన అసైనీలు 78,040భూమి కలిగిన నిజమైన అసైనీలు 28,115 నిజమైన అసైనీల వద్ద ఉన్న భూమి 75,828 ఎకరాలుఅసైనీల వారసులు 44,156 వారసుల వద్ద ఉన్న భూమి 1,33,425.42 ఎకరాలుఅసైన్డ్ భూమి తీసుకున్న థర్డ్ పార్టీ 5,769 థర్డ్ పార్డీ వద్ద ఉన్న భూమి 13,648.63 ఎకరాలుపరిశీలన జరుగుతోంది ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన ప్రక్రియ జరుగు తోంది. మరో రెండు నెలల్లో పూర్తికావొచ్చు. అటు తరువాత అసైన్డ్ భూములకు సంబంధించి లావాదేవీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. – వి.వినోద్కుమార్, కలెక్టర్ కూటమి ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టడంతో సమస్య ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన పేరుతో సాగదీత వర్ణనాతీతంగా అన్నదాతల ఆవేదన -
వివాహిత ఆత్మహత్యాయత్నం
● సీఐ, ఎస్ఐలే కారణమంటున్న బాధితురాలు అనంతపురం మెడికల్/కదిరి అర్బన్: కదిరి పట్టణానికి చెందిన యషిక సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ వివరాల మేరకు.. కదిరికి చెందిన లక్ష్మీనారాయణ, శిరీష దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శిరీషకు సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ తదితరులను పోలీసుస్టేషన్కు రావాలని పిలుపుస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం యషికకు సీఐ నారాయణరెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో ఆమె స్టేషన్కు వెళ్లింది. అక్కడ సీఐతో పాటు ఎస్ఐ బాబ్జాన్ నానా మాటలు అనడంతో మనస్థాపంతో యషిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తమను వేధిస్తున్నారని, శిరీషతో ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా.. తాను తన మిత్రుడితో కలసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశారని శిరీష కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. శిరీష ఫిర్యాదు మేరకు ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమార్తె యషిక, ఆమె భర్త శివ, జగదీష్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వీఆర్ఓల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్–2 వీఆర్ఓల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయానికి అందరూ కృషి చేయాలన్నారు. నూతన కమిటీ.. : సంఘం జిల్లా అధ్యక్షుడిగా సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా విరూపాక్షరెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజు, ఉపాధ్యక్షులుగా నరేష్కుమార్, కుమారస్వామి, రాఘవేంద్రరాజు, సంయుక్త కార్యదర్శులుగా అనిల్, అశోక్కుమార్, రఘు యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పురుషోత్తం, లిఖిత ఎన్నికయ్యారు. పర్యవేక్షక సభ్యులుగా సయ్యద్ అఫ్రిది, వెంకట రాజేష్, దిల్షాద్, వీరేష్, ఆదినారాయణ, నీలకంఠరెడ్డి ఎన్నికయ్యారు. -
హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి బాధ్యతలు
అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు సర్కిల్–1 ఎస్ఈగా పనిచేస్తున్న ఆయనకు హెచ్చెల్సీ ఎస్ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్ఈకు హెచ్చెల్సీ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. అదృశ్యమైన మహిళలు ఉరవకొండలో ప్రత్యక్షం ఉరవకొండ: కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో ఉన్న ఉజ్వల హోం నుంచి ఈనెల 22న అదృశ్యమైన ఇద్దరు మహిళల ఆచూకీ లభించింది. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది వివరాల మేరకు.. కుందుర్పి, కణేకల్లు మండలాలకు చెందిన యువతులు కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోం నుంచి అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఉరవకొండ బస్టాండ్లో వారిని స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే వారిని కళ్యాణదుర్గం పోలీసులకు అప్పగించామన్నారు. డ్రైవర్ దుర్మరణంవిడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోని 67వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఈరన్న (42) మృతి చెందాడు. కర్ణాటకలోని కంప్లీ నుంచి గుంతకల్లు వైపు వెళ్తున్న లారీ మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని ఆపీ టైరు కింద రాళ్ళను పెట్టేందుకు వెనుక వైపునకు వెళ్ళాడు. అదే సమయంలో గుంతకల్లు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి పంక్చరైన లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ ఈరన్న అక్కడికక్కడే చనిపోయాడు. -
కమీషన్ల కక్కుర్తికి బాలుడి ప్రాణాలు బలి
● బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత జగదీష్ డిమాండ్ గుంతకల్లు: నాసిరకం నిర్మాణ పనులతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ.జగదీష్ విమర్శించారు. శుక్రవారం గుంతకల్లు రైల్వేస్టేషన్లో పెచ్చులూడి పడి మణికంఠ అనే బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం నాయకుల బృందం వేర్వేరుగా స్థానిక రైల్వేస్టేషన్లోని 6–7 నంబర్లు ప్లాట్ఫారాల్లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సీపీఐ నేత జగదీష్ విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వేస్టేషన్ను రూ.కోట్ల ఖర్చుతో ఆధునీకరించారన్నారు. రైల్వే అధికారులు కమీషన్లు, పర్సంటేజీలకు కక్కుర్తిపడి నాసిరకం నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్ట్రును బ్లాక్లిస్ట్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. అంతకుముందు సీపీఐ నాయకుల బృందాన్ని రైల్వేస్టేషన్లోకి వెళ్లాకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్పై అధికారి అనుమతితో వారిని స్టేషన్లోపలికి అనుమతి ఇచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, రామురాయల్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
విలక్షణ కథకుడు ‘బాలగొండ’ ●స్వాతంత్య్రోద్యమంలో కల్లూరు సుబ్బారావు కీలక పాత్ర ●నీలం, తరిమెల, ఐదుకల్లు వంటి వారిలో స్ఫూర్తి నింపిన వైనం ●ఆదివారం జయంతి నిర్వహణకు ఏర్పాట్లు ●కల్లూరు స్మారక పురస్కారానికి ఎంపికై న బాలగొండ అనంతపురం కల్చరల్: చాలా కొద్ది మంది మాత్రమే తమదైన వ్యక్తిత్వంతో విలువలతో కూడిన జీవన విధానంతో గొప్పవారవుతారు. ఆ కోవకు చెందిన ‘అనంత’ త్యాగధనుడు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు. నిరుపమాన త్యాగమయ జీవితంతో, విలక్షణ వ్యక్తిత్వంతో ప్రసిద్ధికెక్కిన కల్లూరు సుబ్బారావు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త , సినీ దర్శకుడు బాలగొండ ఆంజనేయులకు ‘కల్లూరు సుబ్బారావు స్మారక అవార్డు అందిస్తున్నారు. రాయలసీమ పితామహుడు ‘కల్లూరు’ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897 మే 25న కల్లూరు సుబ్బారావు జన్మించారు. 1913లో దివ్యజ్ఞాన సమాజం వ్యవస్థాపకులు అనిబీసెంట్ హిందూపురం రావడంతో ఆమె ప్రసంగాలకు ఆకర్షితులై జాతీయోద్యమంలో చేరారు. స్వాతంత్య్రోద్యమంలో రాయలసీమ జిల్లాల తరఫున శిక్షణ పొంది అందరిలో చైతన్యం తెచ్చారు. మన జిల్లాలో శిక్షణ పొందిన మొట్ట మొదటి రాజకీయ ఖైదీ సుబ్బారావు కావడం విశేషం. 1921 సెప్టెంబర్ 28న శిక్షాకాలం పూర్తయిన తర్వాత బళ్లారి సభలో గాంధీజీతో కలసి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. 1928 నవంబర్లో నంద్యాలలో జరిగిన సభలో దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టిన వారిలో కల్లూరు ప్రముఖులు. నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ వంటి అనంత ఆణిముత్యాలు కల్లూరి సుబ్బారావు స్ఫూర్తితో జాతీయస్థాయిలో రాణించారు. 1937లో రాయలసీమ వారికి అన్యాయం జరగకుండా ‘శ్రీబాగ్ ఒడంబడిక’పై సంతకం చేశారు. అనంతపురంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, టవర్క్లాక్ నిర్మాణంలో ఆయన పాత్ర ఎనలేనిది. పద్మశ్రీతో సత్కారం లలితకళలపై అసమాన అభిమానంతో నగరంలోని విలువైన తన సొంత స్థలాన్ని కల్లూరు సుబ్బారావు ‘లలిత కళాపరిషత్’కు దానంగా ఇచ్చారు. అది ఇప్పటికీ ‘కల్లూరు సుబ్బారావు కళా ప్రాంగణం’ గానే పిలవబడుతోంది. కళాకారులు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం పూజలందుకుంటూనే ఉంది. ఆయన నిరుపమాన సేవలను గుర్తించి ప్రభుత్వం 1967లో ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. అభ్యుదయ కార్యక్రమాలకు నాంది పలికిన రాయలసీమ వైతాళికులు కల్లూరు సుబ్బారావు 1973 డిసెంబర్ 20న కన్నుమూశారు. కన్నడ, తెలుగు భాషా పండితుడిగా, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన కల్లూరు సుబ్బారావు చిరస్మరణీయ జీవితాన్ని భావితరాలు గుర్తుంచుకునేలా లలితకళాపరిషత్తు ఆధ్వర్యంలో ‘కల్లూరు సుబ్బారావు స్మారక అవార్డు’ అందిస్తున్నారు. ఈసారి ఆ అవార్డు బాలగొండ ఆంజనేయులును వరించింది. పోలీసు అఽధికారిగా, కథకుడిగా, కళాకారుడిగా, నవలా రచయితగా ప్రసిద్ధి పొందారు. ఆయన రాసిన కథలు, నవలలు ఎంతో మందిని ఆలోచింపజేశాయి. 1991 నుంచి 2001 వరకూ జిల్లా రచయితల సంఘంలో వివిధ హోదాలలో సాహితీ సేవలందించారు. ‘తిమ్మమ్మ మర్రిమాను’ ప్రాశస్త్యాన్ని నవల రూపంలో రాయడమే కాకుండా దాన్ని సినిమాగా తీసి స్వయంగా దర్శకత్వం వహించారు. అలాగే మొగ్గల్జడ నవల రాసి స్క్రీన్ప్లే, మాటలు అందించారు. గతంలో ఆయన ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాన్ని, మొల్ల సాహితీ పురస్కారాలనందుకున్నారు. బాలగొండ ఆంజనేయులు సేవలను గుర్తిస్తూ పురస్కారానికి ఎంపిక చేయడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎల్కేపిలో పురస్కార ప్రదానోత్సవం, సాంస్కృతిక సంబరాలు జరుగుతాయని, కళాభిమానులు విచ్చేయాలని కార్యదర్శి పద్మజ కోరారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి
పామిడి: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వినోద్కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆయన తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులతో ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారి శివకార్తీక్రెడ్డితో సమీక్ష నిర్వహించారు. సర్జికల్ ప్రొసీజర్స్పై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నెలకు 30 ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. నియోజకవర్గ స్పెషలాఫీసర్లు ఆసుపత్రి వైద్యసేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్, తహసీల్దార్ ఆర్.శ్రీధరమూర్తి, డాక్టర్ మహేష్, హెడ్ నర్స్ శివకుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనంతపురం అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2025పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. పర్యావరణ దినోత్సవం థీమ్ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమేనన్నారు. ఈ క్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుకు కార్యాచరణ తయారు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై శనివారం గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 25న వ్యర్థాల విభజన, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రచారం చేయాలన్నారు. ఇలా జూన్ 4 వరకు నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రశంసాపత్రాలు, బహుమతులు ప్రదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, రేంజ్ అటవీ అధికారి శ్రీనివాసులు, పీఆర్ డీఎల్పీఓ విజయ్కుమార్, డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ మాధవి, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే సమగ్రాభివృద్ధి పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా నిర్ణీత గడువులోపు మంజూరు చేయాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద లబ్ధిదారుల రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను ఆదేశించారు. విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి శిక్షణ, రుణం మంజూరుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిని ఆదేశించారు. బనానా ఫైబర్తో బ్యాగ్లు, టోపీలు తయారు చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఎస్హెచ్జీ సభ్యులకు, రైతులకు పీఎంఈజీపీ కింద రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇండస్ట్రియల్ డెలప్మెంట్ పాలసీ కింద 21 యూనిట్లకు రూ.62.86 లక్షల సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసయాదవ్, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధికారి ప్రతాప్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విఠల.. విఠల.. పాండురంగ విఠల
వైభవంగా రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం బొమ్మనహాళ్: ఆంధ్ర పండపరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లులో రుక్మిణీ పాండురంగస్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం అత్యంత వైభంగా జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు పండరీపుర పీఠాధిపతి గోపాల్ మహరాజ్ ఆధ్వర్యంలో రుక్మిణీ పాండురంగస్వామి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తజన సందోహం నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం నుంచి గ్రామ ప్రధాన వీధి, బసవన్న ఆలయం వరకు రథాన్ని లాగారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ‘విఠల... విఠల.. రుక్మీణీ పాండురంగ విఠల’ అంటూ భజనలు చేశారు. అనంతరం పల్లకీ మహోత్సవం నిర్వహించారు. ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉక్కపోత తగ్గింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
పోలీస్స్టేషన్కు చేరిన కిడ్నాప్ కథ తాడిపత్రిటౌన్: పట్టణంలో కేబుల్ ఆపరేటర్ యజమానుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్త యాసిన్ను కొందరు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డితో పాటు యాసిన్ తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని తనను టీడీపీ నాయకులు ధనుంజయరెడ్డి, పవన్కుమార్రెడ్డి, రామాంజులరెడ్డి, బేల్దారి ప్రసాద్ కిడ్నాప్ చేసి రూములో బంధించి ఇసుప పైపులు, కట్టెలతో చావబాదారని, గురువారం రాత్రి సమయంలో వదిలేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకొన్న తనకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వచ్చానని పేర్కొన్నారు. డిష్ గొడవలు ఉంటే యాజమాన్యాలు చూసుకోవాలి కాని అందులో పనిచేసే తమకు ఏం సంబంధం ఉంటుందని యాసిన్ పోలీసుల ముందు వాపోయారు. నాణ్యమైన విత్తనం అందించాలి అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం స్థానిక జస్వంత్ ప్రాసెసింగ్ ప్లాంట్లో జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓలు రాకేష్నాయక్, శ్రీనాథ్రెడ్డి, ప్లాంట్ యజమాని రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘మా ప్రభుత్వం.. మాదే రాజ్యం.. ప్రశ్నించకూడదు.. ఎదురు చెప్పకూడదు’ అన్నట్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు వ్యవహరిస్తున్నారు. వంగివంగి దండాలు పెడితే సరి.. లేకపోతే దండనకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు పంపుతున్నారు. తప్పు చేయకపోయినా కుట్ర చేసి మరీ బదిలీ బహుమాన
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా.. ముక్కుసూటిగా పని చేయడంతో పాటు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. నంద్యాల జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన్ను కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అనంతపురం జెడ్పీ సీఈఓగా బదిలీ చేసింది. డిసెంబర్ 28న ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పని చేశారు. అనతి కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. అలాంటి అధికారిని అధికార టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఎలాగైనా జిల్లా దాటించాలని కంకణం కట్టుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో సీఎం ఫొటో సరైన స్థానంలో లేదంటూ రచ్చచేసి... దానికి సీఈఓను బాధ్యున్ని చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. రామచంద్రారెడ్డిపై కక్ష ఎందుకంటే.. వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల పదవులకు ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) స్థానానికీ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్కడి ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. ‘ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయం. మా చేతుల్లో ఏమీ ఉండదు సర్’ అంటూ అక్కడి అధికారి సమాధానమిచ్చారని తెలిసింది. దీంతో జెడ్పీ సీఈఓ ద్వారా ఎన్నిక వాయిదా వేయించాలనుకున్నా... అందుకు సీఈఓ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జిల్లాలో 15 మంది డిప్యూటీ ఎంపీడీఓ(ఈఓపీఆర్డీలు)లు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు రాగా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పదోన్నతిపై మరో ఐదుగురు ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వారికి పోస్టింగ్ వేసే క్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ఎంపీడీఓగా విజయసింహారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ముందు ఎమ్మెల్యే తనయుడితో పాటు పీఏకూ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే కూతురి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే తనకు తెలియకుండా ఎంపీడీఓకు పోస్టింగ్ ఇచ్చారని ఆగ్రహించి విజయ సింహారెడ్డిని వెనక్కి పంపేశారని సమాచారం. ఈ రెండు అంశాలను మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు.. మడకశిర, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ను కలుపుకొని.. సీఈఓ రామచంద్రారెడ్డిపై కక్ష గట్టినట్లు స్పష్టమవుతోంది. మహిళా చైర్పర్సన్ చాంబర్లోకి ప్రవేశించి.. బోయ సామాజిక వర్గానికి చెందిన గిరిజమ్మ వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఆమె పదవీకాలం ఇంకా 15 నెలలు ఉంది. బీసీ కులం నుంచి వచ్చిన గిరిజమ్మ తమ అభిమాన నేత, మాజీ సీఎం జగన్ ఫొటోను తన చాంబర్లో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా తన చాంబర్లో ఏర్పాటు చేయించారు. అయితే ఈ నెల 21న జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే...ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి తదితరులు జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రజాప్రతినిధి చాంబర్లోకి దూసుకెళ్లి చంద్రబాబు ఫొటో ఎక్కడంటూ రచ్చ చేశారు. ఈ సమయంలోనే జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. గ్రూప్–1 అధికారి అన్న గౌరవం కూడా లేకుండా అవమానించారు. ఆ తరువాత మాజీ సీఎం జగన్ ఫొటోను బలవంతంగా తీయించి, గాంధీజీ ఫొటో స్థానంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టించారు. అంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల దెబ్బకు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి బదిలీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సహకరించలేదని అక్కసు ఓ ఎంపీడీఓకు పోస్టింగ్ విషయంలోనూ ఎమ్మెల్యే అమిలినేని అసంతృప్తి జెడ్పీ సమావేశానికి వచ్చి చైర్పర్సన్ చాంబర్లో చంద్రబాబు ఫొటో లేదంటూ రగడ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... పోస్టింగ్ కూడా ఇవ్వకుండా కసి తీర్చుకున్న వైనం నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారంటున్న ఉద్యోగులు -
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీపి కబురు చెబుతోంది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈసారి ఈ నెల 26నే తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈ నెల 29 నాటికే ఉమ్మడి ‘అనంత’లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. జూన్ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్స్) అత్యంత కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదు కావాల్సి ఉంటుంది. నైరుతి వర్షాలపై గంపెడాశలు ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 7 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. = ఇదిలా ఉండగా రాగల ఐదు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జూన్ రెండో వారంలోనే జిల్లాకు రుతుపవనాలు అయితే ఈ సారి ఈనెలాఖరుకే ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ‘ఖరీఫ్’కు నైరుతి ప్రభావంతో వర్షాలు 319.6 మి.మీ సాధారణం కన్నా అధిక వర్షపాతంపై అన్నదాత ఆశలు -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
అనంతపురం అర్బన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినోద్కుమార్ శుక్రవారం తెలిపారు. కంట్రోల్ రూమ్ 24, 25 తేదీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 85002 92992 (వాట్సాప్), 08554– 220009ను సంప్రదించవచ్చని తెలిపారు. చుక్కల భూములకు పరిష్కారం అనంతపురం అర్బన్: నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వినోద్కుమార్ స్పష్టం చేశారు. అధికారులు కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కళ్యాణదుర్గం డివిజన్కు సంబంధించి డీఎల్సీ, డీఎల్ఎన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను తొలగించేందుకు ప్రతి వారం షెడ్యూల్ ప్రకారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి ఒక కేసును విచారించి ఆమోదించామన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లతో ఆర్డీఓ పని చేయించాలని ఆదేశించారు. కలెక్టరేట్లో సెక్షన్ వారీగా ఫైళ్లు ఎన్ని పంపారు. ఎన్ని పరిష్కరించారనేది తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ భాస్కర్, మునిసిపల్ కమిషనర్ వంశీకృష్ణ, కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, డీటీ ప్రభంజన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం అనంతపురం అర్బన్: చౌక ధరల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్శర్మ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అంశాలపై జేసీ శుక్రవారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రవాణా చేస్తున్న వారిపై 6ఏ కేసు నమోదు చేయాలన్నారు. ఇదే వృత్తిగా ఎంచుకుని అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం మేరకు కేసు పెట్టడంతో పాటు రౌడీ షీట్ తెరవాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాలను తూనికలు కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని చెప్పారు. చౌక దుకాణాలను ఆర్డీఓలు, తహసీల్దారులు, సీఎస్డీటీలు, డీఎస్ఓ తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్డుదారుల ఈ–కేవైసీ పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
విద్యాశాఖలో ఏమి జరుగుతోంది?
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను గతంలో ఎప్పుడూ లేనివిధంగా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది అత్యంత రహస్యంగా నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని శారదా బాలికల పాఠశాలలో డీఈఓ ప్రసాద్బాబును నిలదీశారు. ఇంత గోప్యతగా ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీల వారీగా మార్కులు, మెరిట్ ర్యాంకుల వివరాలు తెలియజేయాలని మూన్నెళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటిదాకా బయటకు పెట్టకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాంకులు, మార్కులు బయటకు చెప్పకుండా తాము ఇచ్చిన జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అడిగితే ఎలా చెప్పాలని ప్రశ్నించారు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సీనియార్టీ జాబితాలు విడుదలవుతున్నా ఇక్కడ మాత్రం ఏఒక్కటీ చెప్పడం లేదన్నారు. సంఘాలకు చెప్పకూడదనుకుంటున్నారా? బదిలీలకు సంబంధించిన అనేక సందేహాల నివృత్తి కోసం డీఈఓకు వందలసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండి పడ్డారు. బదిలీలకు సంబంధించి రాష్ట్ర అధికారుల నుంచి రోజూ నాలుగైదుసార్లు వెబెక్స్లు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నా ఏఒక్కటీ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పడం లేదన్నారు. ‘అన్నీ ఎంఈఓలకు పంపుతున్నామంటున్నారు. అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పకూడదనుకుంటున్నారా’ అని ప్రశ్నించారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చించకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన డీఈఓ...ఇకపై టీచర్లకు సంబంధించిన ప్రతి సమాచారం సంఘాల నాయకుల వాట్సాప్ గ్రూపులోనూ పెడతామన్నారు. సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు విష్ణువర్దన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్ నాయక్, రామాంజనేయులు, సూరీడు, సిరాజుద్దీన్, రమణారెడ్డి, ఎర్రిస్వామి, వెంకటరత్నం, శ్రీనివాస్ రెడ్డి, రాయల్ వెంకటేష్, లింగమయ్య, నరసింహులు, కులశేఖర్రెడ్డి, హనుమేష్. వెంకటసుబ్బయ్య, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఈఓను నిలదీసిన నాయకులు -
తాడుతో గొంతు బిగించి.. కొడవలితో తలను వేరు చేసి
రాయదుర్గం టౌన్: ఈ నెల 15న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాయదుర్గం పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ జయనాయక్తో కలసి డీఎస్పీ పి.రవిబాబు వెల్లడించారు. రాయదుర్గం మండలం కొంతానపల్లికి చెందిన బోయ అంజినయ్య కుమారుడు వినోద్కుమార్ (22) టైలరింగ్తో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో స్థిరపడిన వినోద్కుమార్... ఇటీవల స్వగ్రామానికి చేరుకుని స్థానిక గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పనిలోకి చేరాడు. ఈ నెల 17న రాయదుర్గంలో జరిగిన ప్రసన్న వేంకటరమణస్వామి రథోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. 18న కొంతానపల్లి వద్ద పొలంలో హతుడై కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కొంతానపల్లికి చెందిన యువకులు నాయకుల రమేష్, నాయకుల బొమ్మలింగను గురువారం బళ్లారి మార్గంలోని చదం రైల్వే గేట్ వద్ద అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు గల కారణాలు వారు వెల్లడించారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన గ్రామంలోని మహిళల పట్ల వినోద్కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా ప్రచారమూ చేసేవాడు. దీంతో వినోద్కుమార్పై కక్ష పెంచుకున్న రమేష్, బొమ్మలింగ.. వినోద్కుమార్ను హతమార్చాలని నిర్ణయించుకుని అవకాశం కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాయదుర్గంలో శ్రీవారి రథోత్సవానికి వినోద్కుమార్ వెళ్లినట్లుగా తెలుసుకుని అదే రోజు దారి కాపుకాచారు. సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వస్తున్న వినోద్కుమార్ను అడ్డుకుని పొలాల్లోకి లాక్కెళ్లి తాడుతో గొంతు బిగించారు. అనంతరం పదునైన కొడవలితో గొంతు కోసి తలను వేరుచేసి గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించారు. హత్యకు ఉపయోగించిన నైలాన్తాడు, కొడవలి, మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ నిందితుల అరెస్ట్ -
స్పష్టత లేని బదిలీల జాబితాలు
● డీఈఓకు విన్నవించిన ఏపీటీఎఫ్ (1938) నాయకులు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు, షెడ్యూలు విడుదలై ఓ వైపు దరఖాస్తు చేసుకుంటున్నా నేటికీ జాబితాల్లో స్పష్టత ఇవ్వలేదంటూ ఏపీటీఎఫ్ (1938) నాయకులు వాపోయారు. ఈ మేరకు గురువారం డీఈఓ ప్రసాద్బాబును కలసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటి వరకూ ఏ స్కూల్లో ఏ ఉపాధ్యాయుడు సర్ ప్లస్ అయ్యాడనే దానిపై సమాచారం లేదన్నారు. ఎవరు బదిలీ కింద దరఖాస్తు చేసుకోవాలనే అంశంపై కూడా క్లారిటీ లేదన్నారు. అన్ని సబ్జెక్టులకు, ఎస్జీటీలకు సంబంధించిన ఫైనల్ వెకెన్సీ, ఫైనల్ ప్రమోషన్ సీనియార్టీ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఈఓ పూల్లో ఉన్న ఎల్పీలు, పీఈటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. డీఈఓ ఆఫీస్ నుంచి పంపుతున్న సమాచారం సరైన రీతిలో సర్కూలేట్ కావడం లేదన్నారు. పీహెచ్, వీహెచ్ ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్న తరుణంలో ప్రాథమికోన్నత పాఠశాలలో సర్ ప్లస్ కింద ఏ సబ్జెక్టు ఉపాధ్యాయులను తీసుకుంటారో.. సబ్జెక్టు వారీగా సీక్వెన్స్ తెలపాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్ర, అదనపు ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వజీర్బాషా, సాయినాథ్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు ఫక్రుద్దీన్, హుస్సేన్ ఖాన్ ఉన్నారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
శింగనమల: సోదనపల్లిలో గురువారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. యల్లమ్మ పరుష, ఆగులూరప్ప స్వామి జల్ది పూజ వైభవంగా జరిగాయి. కురుబల ఆరాధ్య దేవరలైన రేవణ్ణ సిద్దేశ్వర, కాట్నేకాల్వ దేవరాయ గుణాచార్యులు, పెద్దయ్య, ఉజ్జినప్ప, ఆగులూరప్ప, నల్లబొల్లెప్ప, కొండారుపల్లయ్య, నాగులబురజప్ప, అంతరగంగప్ప, పెండేకల్లప్ప, శిలారామప్ప, బీరప్పస్వామి, గుంతకల్లప్ప, తాడిపత్రప్ప స్వామి, అయిలప్ప స్వామి, కోకొండ బీరప్ప స్వాములను పొలిమేర నుంచి అంగన్వాడీ స్కూల్ వరకూ ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. -
‘జాబితా మతలబు’పై కమిషనర్ ఆరా
అనంతపురం ఎడ్యుకేషన్: రివర్షన్ తీసుకున్న టీచరును ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల జాబితాలో ముందు వరుసలో చేర్చిన వైనంపై విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆరా తీశారు. ఫిజికల్ సైన్స్ టీచరుగా పని చేస్తున్న గుత్తా వెంకటనాయుడు 2023 జూలైలో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది ఆత్మకూరు మండలం తోపుదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూన్నెళ్లు పని చేసిన తర్వాత రివర్షన్ (తిరిగి స్కూల్ అసిస్టెంట్గా) కోరుకుని ప్రస్తుతం డి.హీరేహాల్ మండలం 74–ఉడేగోళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల్లో నిబంధనల మేరకు రివర్షన్ తీసుకున్న ఉపాధ్యాయుడిని ఆ కేడర్లో అందరి కంటే జూనియర్గా పరిగణించాలి. అంటే రివర్షన్ వచ్చిన రోజు నుంచి కొత్తగా సర్వీస్ను లెక్కిస్తారు. ఈ లెక్కన ఆయన ఫిజికల్ సైన్స్ టీచర్లలో చివరివాడిగా దాదాపు 730 వరుస సంఖ్యలో ఉంటారు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ కేడర్లో తీసుకుంటే చివరి స్థానం 6,291 నంబరులో ఉండాలి. ఈ విషయం ఇక్కడి అధికారులు, డీఈఓ కార్యాలయ ఉద్యోగులకూ తెలుసు. అయితే ఓ సంఘం నాయకుడు చక్రం తిప్పడంతో చిట్టచివరన ఉండాల్సిన గుత్తా వెంకటనాయుడు పేరు మొదటి స్థానంలోకి వచ్చింది. ఈ వ్యవహారంపై గురువారం ‘సాక్షి’లో ‘పదోన్నతుల జాబితాలో మతలబు ఏమిటో?’ శీర్షికన కథనం వెలువడింది. దీనిని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో గురువారం జరిగిన వెబెక్స్లో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన చర్చ లేవనెత్తారు. విద్యాశాఖ జేడీ సర్వీసెస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 16న ప్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ (ఎఫ్ఏక్యూ)లో ఇదే అంశంపై స్పష్టంగా ఇచ్చినా... అనంతపురం జిల్లాలో రివర్షన్ టీచరును జాబితా ముందు వరుసలోకి ఎలా చేర్చారంటూ ప్రశ్నించారు. పక్కన రిమార్కులు రాశామంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన జిల్లా అధికారులు.. చివరకు జాబితాను మార్పు చేస్తామంటూ వివరణ ఇచ్చారు. అనంతరం గుత్తా వెంకటనాయుడును మోస్ట్ జూనియర్గా పరిగణిస్తూ స్కూల్ అసిస్టెంట్ కేడర్లో చివరి పేరుగా చేర్చారు. ఇదే విషయాన్ని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. -
క్రికెట్ మ్యాచ్ తెచ్చిన తంటా.. రెండు వర్గాల ఘర్షణ
గుంతకల్లు: క్రికెట్ మ్యాచ్లో చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవలో పెద్దలు తలదూర్చడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని సత్యనారాయణపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో ఈ నెల 19న చిన్నపిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడారు. మ్యాచ్లో ఉడదాల గణేష్, ముక్కన్నగారి హస్సేన్ మధ్య ఘర్షణ జరిగింది. విషయాన్ని ఇంట్లో తెలపడంతో అదే రోజు రాత్రి ఇరు కుటుంబాల వారు గొడవపడ్డారు. ఆ సమయంలో ఉడదాల కుటుంబానికి చెందిన అంజి, వరుణ్, గణేష్ గాయపడ్డారు. దీంతో కక్ష పెంచుకున్న ఉడదాల కుటుంబసభ్యులు గురువారం రాత్రి సంజీవనగర్లో నివాసముంటున్న ముక్కన్నగారి హుస్సేన్ చిన్నాన్న సాయిప్రసాద్పై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి కొడవళ్లతో నరికి పరారయ్యారు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైన సాయిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా ఘర్షణ పడిన రెండు వర్గాలూ టీడీపీకి చెందినవే కావడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత : డీఎంఈ గుత్తి: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ప్రమోద్ అన్నారు. గుత్తి రైల్వే డీజిల్ షెడ్లో గురువారం రైల్వే కార్మికులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అఽతిథిగా డీఎంఈ హాజరై, మాట్లాడారు. అనంతరం డీజిల్షెడ్ ఆవరణలో కార్మికులతో కలసి మొక్కలు నాటారు. -
రియల్టర్ ఇంట చోరీ
గుంతకల్లు: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంట్ను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆసీఫ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి వేసిన తాళాలు బద్ధలు గొట్టిన విషయాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆసీఫ్కు సమాచారం అందించారు. దీంతో ఆయన బంధువులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, ఆసీఫ్ ఈ నెల 16న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి అజ్మీర్ యాత్రకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో తాళం వేసిన ఇంటిని గుర్తించిన దొంగలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. బీరువాను తెరచి అందులోని రూ.4.5 తులాల బంగారు నగలతోపాటు 8 తులాల వెండి, రూ.55వేలు నగదు, ఎల్ఈడీ టీవీ, బియ్యం బస్తాలు, ఇంటి ఆవరణలో ఉంచిన వాటర్ పంప్ మోటార్ అపహరించారు. బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వయసు మీరిపోతున్నా... పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్నాటకలోని సండూరు తాలూకా తుమటి గ్రామానికి చెందిన గంగాధర్ (32) తోరనగల్లు సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులో మరో పని చేసుకునేందుకు వెళుతున్న ఇంట్లో చెప్పి నెల రోజుల క్రితం బయటకు వచ్చాడు. అనంతరం కుటుంబసభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం తుమటి గ్రామ శివారున కర్ణాటక సరిహద్దులోని డి.హీరేహాళ్ మండలం సిద్దాపురం గ్రామ శివారులో చెట్టుకు వేసుకున్న ఉరికి వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. విచారణలో మృతుడిని గంగాధర్గా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి నిర్ధారించారు. పెళ్లి ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి తండ్రి సిద్ధేశ్వర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు.వ్యక్తి దుర్మరణంగుత్తి రూరల్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (44) వ్యక్తిగత పనిపై గురువారం గుత్తికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహ ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.‘కేంద్రియ’లో ప్రవేశాలకు దరఖాస్తులుగుత్తి: పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మల్కీ సాబ్ తెలిపారు. స్థానిక విద్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 30 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టెన్త్లో మ్యాథ్స్, సైన్స్లలో 60 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతపురం: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఉంటే కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు చొరబడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోను ధ్వంసం చేయడంపై నిరసన తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్తో కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ భేటీ బచావో..భేటీ పడావో అంటూ దేశంలో మహిళల సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో మాత్రం మహిళలను అవమానపరుస్తున్నార న్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్ లోకి ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా వెళ్లి ఆమె ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో కిందపడేసి, ధ్వంసం చేశారని, సీఈఓను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. జెడ్పీ సమావేశం జరుగుతుండగా, గందరగోళమైన పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా తలదించుకునే రీతిలో ప్రవర్తించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకోవడం ఆమెకు ఉన్న హక్కు అని పేర్కొన్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన గిరిజమ్మను అవమానపరిచే రీతిలో ప్రవర్తించడం చాలా బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలే దౌర్జన్యాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఏకంగా జెడ్పీ చైర్పర్సన్నే అవమానానికి గురిచేయడం, వారి అనుచరులు మేయర్ వసీం సలీం చాంబర్లోనూ ఇదే తరహాలో ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు దాదు, జిల్లా సభ్యులు పావురాల జగదీష్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షులు ఉదయ్, వినీత్, జనరల్ సెక్రెటరీ బిల్లే నాగార్జున, సెక్రెటరీలు వేణు, మైను, బ్రహ్మానంద రెడ్డి, వెంకట సుబ్బారావు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, స్టేట్ స్పోక్ పర్సన్ సాకే చిరంజీవి, నాగార్జున నాయక్, గౌతమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీసీ మహిళ ప్రతిష్టకు భంగం కలిగించారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ -
ఆ టీచర్లకు సర్వీస్ పాయింట్లు ఇవ్వాలి
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: రెండు డీఎస్సీల్లో సెలెక్ట్ అయి ప్రస్తుత బదిలీల్లో తీవ్రంగా నష్ట పోతున్న ఉపాధ్యాయులకు మొదటి నుంచి సర్వీస్ పాయింట్లు కేటాయించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ఉపాధ్యాయుడు మొదట ఎస్జీటీగా ఎంపికై న తర్వాత అన్ని అనుమతులతో ఎస్ఏగా సెలెక్ట్ అయినవారు ఒకే సర్వీస్ పుస్తకంలో అతని సర్వీస్ రాశారని వివరించారు. గత బదిలీల్లో సర్వీస్ పాయింట్లు వచ్చినా.. ప్రస్తుత బదిలీల్లో ఎస్ఏలుగా సెలెక్ట్ అయినప్పటి నుంచి సర్వీస్ పాయింట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో వస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి వారికి క్యాడర్తో నిమిత్తం లేకుండా సర్వీసులో చేరినప్పటి సర్వీస్ పాయింట్స్ ఇవ్వాలన్నారు. అలాగే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు సక్రమంగా రూపొందించలేదన్నారు. కొన్ని మండలాల్లో అన్ని అర్హతలు ఉన్నా యూపీ పాఠశాలలను కొనసాగించకుండా మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేశారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని యూపీ పాఠశాలలుగా కొనసాగించక పోవడం చాలా అన్యాయమన్నారు. గవి మఠం భూముల వేలం రద్దు చేయాలి అనంతపురం అర్బన్: గవి మఠం భూముల వేలాన్ని రద్దు చేయాలని డీఆర్ఓ ఎ.మలోలకు సీపీఐ నాయకులు విన్నవించారు. ఈ మేరకు డీఆర్ఓని గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామంలో గవి మఠానికి సంబంధించి సర్వే నంబరు 590బి లో 12.5 ఎకరాలు, 835లో 39.63 ఎకరాలను 30 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్నారన్నారు. దీనికి సంబంధించి గుత్త కూడా చెల్లిస్తున్నారన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న ఈ భూములను శుక్రవారం వేలం వేసేందుకు దేవదాయ శాఖ సిద్ధపడిందన్నారు. భూములు వేలం వేస్తే సాగుదారులైన పేదల కుటుంబాలు వీధిపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సాగులో ఉన్నవారికే భూములను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రాయుడు, రామాంజినేయులు, సాగుదారులు పాల్గొన్నారు. -
డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ (రెగ్యులర్ లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్) ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత గురువారం ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 6,361 మంది పరీక్ష రాయగా, 6,270 (98.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ కోర్సులో 346 మందికి గాను 339 మంది (97.98 శాతం), బీబీఏ కోర్సులో 530 మందికి గాను 521 (98.30 శాతం) మంది, బీసీఏలో 59 మందికి గాను 59 (100 శాతం) మంది, బీఎస్సీలో 1,809 మందికి 1,780 (98.40 శాతం), బీకాంలో 3,617 మందికి 3,571 (98.73 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలకు జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని కోరారు.వ్యవసాయ శాఖలో బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభంఅనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుజాత, సూపరింటెండెంట్ ప్రభాకర్ సమక్షంలో గురువారం ఉదయం డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఏఈఓ)కు కౌన్సెలింగ్ చేపట్టారు. ఇందులో 70 మందికి పైగా ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు. జాబితాలు కమిషనరేట్కు పంపుతామని అధికారులు తెలిపారు. ఈనెల 26న అనంతపురంలో జోనల్ స్థాయిలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల అధికారులు, ఉద్యోగులు హాజరవుతారన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి జూన్ 2 లోపు బదిలీ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.పశుశాఖలో 91 మందికి బదిలీలుజూన్ 2 లోపు ఉత్తర్వులుఅనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో 91 మందికి (ఉమ్మడి జిల్లావ్యాప్తంగా) స్థానచలనం ఉంటుందని ఆ శాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకట స్వామి తెలిపారు. వీరందరూ ఒకే చోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్నారు. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు, ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, 20 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ (పశువైద్యులు).. ఉండగా ఇరువురు వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్స్ (వీఎల్ఏ), 8 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్, 21 మంది లైవ్స్టాక్ అసిస్టెంట్స్, ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్స్, ఒకరు జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, మరో 23 మంది ఆఫీస్ సబార్డి నేట్స్ బదిలీ కానున్నట్లు తెలిపారు.వీరు కాకుండా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద మరికొందరు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లా, జోనల్స్థాయిలో పరిశీలన చేపట్టి జాబితాలు కమిషన రేట్కు పంపుతామన్నారు. జూన్ 2 లోపు బదిలీ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.17 మండలాల్లో వర్షంఅనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 5.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరవకొండ 30.2 మి.మీ, బెళుగుప్ప 23.8, శెట్టూరు 18.2, కణేకల్లు 17, కళ్యాణదుర్గం 16.4, వజ్రకరూరు 16.2, ఆత్మకూరు 12 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే డీ. హీరేహాళ్, రాయదుర్గం, శింగనమల, బ్రహ్మసముద్రం, కంబదూరు, గుంతకల్లు, విడపనకల్లు, కూడేరు, గుమ్మఘట్ట, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శుక్రవారం కూడా జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
ప్రతి ఇంట్లోనూ అక్షరాస్యులే
ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, ఆహారం కోసం అటు ఇటు తిరిగే సాధు జంతువులు.. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న చెట్లు, తోటలు, పంట చేలతో ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉండే ఊరు. అక్కడ వాహనాల మోతలు వినిపించవు. వ్యవసాయ ఆధారత గ్రామంలో కల్మషం లేని రైతు బిడ్డలు సరస్వతీ పుత్రులుగా రాణిస్తున్నారు. పామిడి: మండలంలోని దేవరపల్లి గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలను పండిస్తున్నారు. దేవరపల్లి పంచాయతీ పరిధిలో మజారా గ్రామంగా ఓబుళాపురం కూడా ఉంది. ఈ గ్రామం కూడా పూర్తిగా వ్యవసాయాధిరతమే. రెండు గ్రామాల్లోనూ 3,200 మంది జనాభా ఉండగా... ప్రతి ఇంట్లోనూ అక్షరాస్యులే కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది టీటీసీ, డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు అభ్యసించి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారూ ఉన్నారు. ఇటీవల కొందరు సివిల్స్కు సిద్ధమవుతున్నారు. మొత్తం 50 మందికి పైగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన వారు ఉన్నారు.స్థితిగతులు మార్చిన చదువుదశాబ్దాల క్రితం దేవరపల్లిలోనూ నిరక్షరాస్యత రాజ్యమేలింది. సంస్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ఈ క్రమంలోనే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు ఎక్కువ కావడం... కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గ్రామస్తుల దృష్టి ఒక్కసారిగా చదువులపై పడింది. తమలా భవిష్యత్తులో పిల్లలు కష్టపడకూడదని భావించిన వారు.. పిల్లలను బడి బాట పట్టించారు. ఇది వారి స్థితిగతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువుల ప్రస్థానం నేడు పదుల సంఖ్యలో చేరుకుంది. కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే 50 మందికి పైగా స్థిరపడ్డారు. మరికొందరు రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ఇంజినీర్లుగా, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. వృత్తి వ్యాపారాల్లోనూ రాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకుని పంటల సాగు చేపట్టారు. పత్తి, వేరుశనగ, జొన్న, కొర్ర, పప్పుశనగ పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలతో ఆదర్శ జీవనం సాగిస్తున్నారు.గురువులే ఆదర్శంమా తల్లిదండ్రులకు పది మంది సంతానం కాగా, వీరిలో ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అందరిలోకి నేనే లాస్ట్. వ్యవసాయం ఒక్కటే మా జీవనాధారం. మా నాన్న నారప్ప అప్పట్లో గ్రామ సర్పంచ్గా పనిచేశారు. వ్యవసాయంలో నష్టాలు చూసి విసిగి పోయిన ఆయన చదువులు ఒక్కటే మా జీవితాలు మారుస్తాయని అనేవారు. అప్పట్లో మా ఊళ్లో పాఠాలు చెప్పేందుకు వచ్చే టీచర్లు పి.జయరాజు, టి.ఈశ్వరయ్య కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పారు. వారి స్ఫూర్తితోనే నేనూ ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. మా అక్క గౌరమ్మ, బావ, నా భార్య సైతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.– రామ్మోహన్, స్కూల్ అసిస్టెంట్, దేవరపల్లి గ్రామంఎంతో సంతృప్తినిస్తోందిమాది వ్యవసాయ కుటుంబమే. మా తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం కాగా, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కరువు పరిస్థితుల వల్ల పంటల సాగులో నష్టాలు వచ్చేవి. దీంతో చదువులు ఒక్కటే మా జీవితాలు మారుస్తాయని నమ్మిన అమ్మ, నాన్న మమ్మల్ని బడి బాట పట్టించారు. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది.– నారాయణస్వామి, దేవరపల్లి గ్రామం -
రేషన్ సక్రమంగా అందించాలి
‘క్లీన్ ఎయిర్’ పనులు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: నగర పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ పనులు పది రోజుల్లో పూర్తవ్వాలన్నారు. రామ్నగర్ బ్రిడ్జి వద్ద గ్రీనరీ అభివృద్ధి, ఇతర పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, నాణ్యతా ప్రమాణాలు లేనట్లు తేలితే సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, ఎస్ఈ చంద్రశేఖర్, డీటీసీ వీర్రాజు, ఈఈ షాకీర్ హుసేన్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్: కార్డుదారులకు డీలర్లు రేషన్ సక్రమంగా అందించేలా చూడాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం సాయినగర్ లోని పలు చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం, తూకం తదితరాలను పరిశీలించారు. కార్డుదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ ఎలా చేస్తున్నారు... తూకం సరిగా ఇస్తున్నారా.. అని ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీజీఎస్ ఫీడ్బ్యాక్లో అనంతపురం అర్బన్లో ఎక్కువ మంది కార్డుదారులు బియ్యం నాణ్యత బాగా లేదని చెప్పారన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడామన్నారు. అనంత పురం రూరల్, గుంతకల్లు మండలాల్లో బియ్యం తక్కువగా ఇస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ రామకృష్ణ, వీఆర్ఓలు పాల్గొన్నారు. బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ‘కిషోరీ వికాసం’లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కిషోరీ వికాసం’లో జూన్ 10 వరకు జరిగే సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్లో డీఆర్డీఏ పీడీ పాల్గొనాలని, బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గోడలపై పెయింటింగ్ వేయించాలని జెడ్పీ సీఈఓని ఆదేశించారు.గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో ముస్లిం వర్గాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. మత పెద్దల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మెమెంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. కలెక్టర్ వినోద్కుమార్ -
మెడికల్ కళాశాల అకౌంటెంట్పై ఫిర్యాదు
అనంతపురం: మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మహిళా విద్యార్థినులకు సంబంధించిన మెస్ బిల్లులను నేరుగా సొంత ఖాతాలో జమ చేసుకున్న అకౌంటెంట్ వాణిపై కేసు నమోదు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ .మాణిక్యరావు కోరారు. ఈ మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. హాస్టల్ బ్యాంకు ఖాతాకు కాకుండా తన వ్యక్తిగత ఫోన్పే నంబర్కు మెస్ బిల్లుల మొత్తాన్ని అకౌంటెంట్ జమ చేయించుకున్నాన్నారు. కొన్ని నెలలుగా మెస్బిల్లుల మొత్తం హాస్టల్ బ్యాంకు ఖాతాకు జమ చేయలేదన్నారు. ప్రొఫెసర్లు కమిటీ విచారణలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. డబ్బు తిరిగి చెల్లించేలా చూడాలని విన్నవించారు. -
ప్రజా ప్రతినిధులా.. వీధి రౌడీలా?
అనంతపురం సిటీ: ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్ ప్రజా ప్రతినిధుల్లా కాకుండా వీధి రౌడీల్లా ప్రవర్తించడం దారుణమని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు విమర్శించారు. చైర్పర్స్న్ బోయ గిరిజమ్మ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉండగా, ఆమె అనుమతి లేకుండా చాంబర్లోకి బలవంతంగా వెళ్లడాన్ని తప్పుబడుతూ అనంతపురం జెడ్పీ కార్యాలయం ఎదుట గల అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం నిరసన తెలిపారు. బీసీ కులానికి చెందిన బోయ గిరిజమ్మను అవమానించడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు జెడ్పీకి వచ్చారని బహుజన యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రచర్ల హరి దుయ్యబట్టారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో పాటు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయవేదిక ప్రతినిధి కుళ్లాయప్ప, కనగానపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న, జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామాంజనేయులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు గంగవరం శశి, నసనకోట ముత్యాలు, మాదాపురం అనిల్, ఉపాధ్యక్షుడు యోహాన్, ఏపీ కార్మిక సంఘం ప్రతినిధి నాగేంద్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్, బేడ, బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు తాటికొండ నాగరాజు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షుడు సాకే వన్నూరుస్వామి పాల్గొన్నారు. -
కుటుంబానికి చేదోడుగా ఉంటూ..
మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం కాగా, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుమారుల్లో నేనే పెద్దవాడిని. అమ్మ, నాన్న ప్రోత్సాహం.. గురువులు జయరాజు, ఈశ్వరయ్య స్ఫూర్తితో చదువులపై ఆసక్తి పెంచుకున్నా. ఓ వైపు వ్యవసాయ పనుల్లో అమ్మ, నాన్నకు తోడుగా ఉంటూనే మరోవైపు స్కూల్కు వెళ్లి వచ్చేవాడిని, ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసిన తర్వాత దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పామిడిలోని పాఠశాలకు సైకిల్పై వెళ్లి వచ్చేవాడిని. పట్టుదలతో చదువుకుని ఎంఏ, బీఈడీ చేశాను. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. నన్ను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని చాలా మంది ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం గర్వంగా ఉంది. – అనంతయ్య, విశ్రాంత టీచర్, దేవరపల్లి, పామిడి మండలం -
30 శాతం రాయితీతో కందులు, పెసలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు ఇవ్వనున్నారు. ఈ మేరకు వాటి ధరలు, రాయితీలు ప్రకటించారు. విత్తన వరికి సంబంధించి జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) అమలు చేస్తున్న జిల్లాల్లో క్వింటా వరి విత్తనాలపై రూ.వెయ్యి రాయితీ వర్తింపజేయగా, ఎన్ఎఫ్ఎస్ఎం అమలులో లేని జిల్లాల్లో రూ.500 రాయితీ ఇవ్వనున్నారు. అంటే క్వింటా 5,204 రకం వరి విత్తనాలు పూర్తి ధర రూ.4,300 కాగా ఎన్ఎఫ్ఎస్ఎం జిల్లాల్లో రూ.1,000 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.3,300 చెల్లించాలి. ఎన్ఎఫ్ఎస్ఎం లేని జిల్లాల్లో రూ.500 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.3,800 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక విత్తన కందులు క్వింటా పూర్తి ధర రూ.10,950 కాగా 30 శాతం అంటే రూ.3,285 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.7,665 ప్రకారం చెల్లించాలి. అలాగే మినుములు పూర్తి ధర రూ.13,800 కాగా అందులో 30 శాతం అంటే రూ.4,140 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.9,660 ప్రకారం చెల్లించాలి. పెసలు పూర్తి ధర రూ.13,500 కాగా అందులో 30 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.9,450 ప్రకారం చెల్లించాలి. కొర్రలు క్వింటా పూర్తి ధర రూ.6 వేలు కాగా.. 50 శాతం రూ.3 వేలు రాయితీ పోనూ మిగతా రూ.3 వేల ప్రకారం చెల్లించాలి. రాగులు పూర్తి ధర రూ.6,900 కాగా అందులో రాయితీ పోనూ రూ.3,450 ప్రకారం చెల్లించాలి. కందులు, పెసరలు, మినుములు 4 కిలోల ప్యాకెట్ల రూపంలోనూ, కొర్రలు, రాగులు 2 కిలోల ప్యాకెట్ల కింద ఇవ్వనున్నారు. భూ విస్తీర్ణం బట్టి కందులు, పెసలు, మినుములు ఒక్కో రైతుకు గరిష్టంగా 10 బ్యాగులు, కొర్రలు 5 బ్యాగులు, రాగులు 6 బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి. ఇక.. వేరుశనగకు సంబంధించి ఇంకా ధరలు, రాయితీ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వేరుశనగ క్వింటా రూ.9,300 కాగా అందులో 40 శాతం రాయితీ రూ.3,720 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం రాయితీతో రాగులు, కొర్రలు విత్తన వరిపై రూ.500, రూ.వెయ్యి రాయితీ -
వాళ్లకు వసూళ్లే ముఖ్యం.. మనతో ఏం పని!
టీడీపీలో పెల్లుబుకుతున్న అసమ్మతి ● ఇటీవల ‘అనంత మినీ మహానాడు’లో కార్యకర్త ఆత్మహత్యాయత్నం ● శింగనమల ఎమ్మెల్యే అవినీతిపై మంత్రికి ఓ తమ్ముడి ఫిర్యాదు ● గుంతకల్లు ఎమ్మెల్యే కుమారుడి దెబ్బకు ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నం ● హామీల అమలులో చేతులెత్తేసి అన్ని వర్గాలకూ ఇప్పటికే మోసం ● తమనూ దగా చేయడంపై ‘తమ్ముళ్లు’ రగిలిపోతున్న వైనం సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి నేడు మోసం చేయడంతో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల తీరుతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇదే క్రమంలో తమను అన్యాయం చేస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన ‘తమ్ముళ్లు’ కూడా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. కూటమి సర్కారులో ఎమ్మెల్యేల దెబ్బకు టీడీపీ కార్యకర్తలే కుదేలవుతున్నారు. పదకొండు నెలలు కూడా తిరక్కముందే ఎమ్మెల్యేలపై బహిరంగంగానే టీడీపీ కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం కలకలం రేపుతోంది. అవినీతి, అక్రమాలు, కబ్జాలు, వసూళ్లతో తమను గాలికొదిలేశారని, పార్టీని గెలిపించి తప్పు చేశామంటుండటం గమనార్హం. ప్లాంట్ అప్పగించాలని వేధింపులు.. పెనుకొండ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ‘గ్రీన్టెక్’ పేరుతో ఓ వ్యక్తి రీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నడుపుతున్నాడు. అయితే, ఈ ప్లాంటుపై కన్నేసిన మంత్రి సవిత తనకు అప్పగించాలంటూ నిర్వాహకుడిని భయపెట్టడం ప్రారంభించింది. కుటుంబానికి జీవనాధారమైన ప్లాంటును ఇవ్వాలనడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. చివరకు విధిలేని పరిస్థితుల్లో మంత్రి ఒత్తిడికి తట్టుకోలేక ఎంపీ పార్థసారధిని భాగస్వామిని చేసుకుని నడుపుకుంటున్నారు. ఉద్యోగులు.. అంగన్వాడీల పరిస్థితి ఘోరం గత ఎన్నికల ముందు ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు టీడీపీ నేతలు ఎన్నో హామీలుఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే ఎమ్మెల్యేలు ఉద్యోగులను దారుణంగా చూస్తున్నారు. మొన్నటికి మొన్న మార్కెట్ యార్డులో ఓ ఉద్యోగిని ‘‘గాడిదలు కాస్తున్నావా’’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి అనడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఇక.. అంగన్వాడీ కార్యకర్తలు వేతనాల పెంపు కోసం ఇప్పటికే చలో విజయవాడ ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మిడ్ డే మీల్స్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించి ఉద్యోగాలు పీకేస్తున్నారు. సీఐలు, తహసీల్దార్లను ఇంట్లో పనిమనుషులకంటే హీనంగా చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులను సైతం ఇష్టారాజ్యంగా తిడుతున్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ‘నేను పార్టీకి ఎంతో కష్టపడి చేసినా న్యాయం చేయలేకపోయారు’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మినీ మహానాడు’ కార్యక్రమంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. పట్టించుకునే దిక్కులేక ఆ కుటుంబం వీధిన పడింది. ఇలాంటి కుటుంబాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలానే ఉన్నాయి. తన కుమారుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానని రూ.4 లక్షలు తీసుకుని మరొకరికి పోస్టు ఇవ్వడంతో గుంతకల్లుకు చెందిన టీడీపీ కార్యకర్త బోలే ఎల్లప్ప ఆత్మహత్యకు యత్నించాడు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ్ముడు గుమ్మనూరు నారాయణ.. బోలే ఎల్లప్ప కుమారుడు గిరీష్కు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తానని రూ.4 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత జయరాం కుమారుడు ఈశ్వర్.. గిరీష్ను తొలగించి మరొకరి దగ్గర రూ.8 లక్షలు తీసుకుని వేరొకరికి ఉద్యోగమిచ్చారు. దీంతో ఎల్లప్ప మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఈ మూడే కాదు.. ఉమ్మడి జిల్లాలో నేడు చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ‘శింగనమలలో వెస్ట్ నరసాపురం నుంచి గెలిచిన ఏకై క టీడీపీ ఎంపీటీసీ నా భార్య అంజనమ్మ. కానీ మాకు ఎమ్మెల్యే ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు’ అంటూ టీడీపీ నేత ప్రసాద్ నాయక్ ఏకంగా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే శ్రావణి ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోలేదని, ఆమె తల్లి లీలావది షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతోందంటూ మంత్రికి వివరించాడు. -
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ
ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా? అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఫొటోల కోసం పాకులాడటమేంటి? అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటేవాటిపై పాలకులు నోరు మెదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు. హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జ్ (ఎఫ్ఏసీ) ఎస్ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉరవకొండ/ఉరవకొండ రూరల్: హంద్రీ–నీవా ప్రాజెక్టు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో.. ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో అనే అంశంపై చర్చకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విసిరిన చాలెంజ్ను ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి స్వీకరించారు. బుధవారం ఆయన తన అనుచరులతో కలిసి ఉరవకొండలో ర్యాలీగా వెళ్లి క్లాక్టవర్ వద్దనున్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ చర్చ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల ప్రాంగణం వద్దకు ఎమ్మెల్సీ తన అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు, అధికారులు తలుపులకు తాళం వేశారు. అయినా ఎమ్మెల్సీ వెనక్కు తగ్గలేదు. ప్రహరీ దూకి శిలాఫలకం వద్దకు చేరుకున్నారు. దాదాపు గంటకు పైగా వేచి చూసినా సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అక్కడకు రాలేదు. అనంతరం శివరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండకు రాకుండా కాలవ శ్రీనివాసులు జీడిపల్లి రిజర్వాయర్ వద్ద చర్చకు రావాలంటూ కొత్త డ్రామాకు తెరదీయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు మొదటి దశ పనులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసి, జీడిపల్లి వరకు నీటిని తీసుకెళ్లారని గుర్తు చేశారు. 40 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో కుదించడానికి చర్యలు చేపట్టడంతో పాటు నిధులు విడుదల చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్యులకు పెంచి, రూ.9,318కోట్లు మంజూరు చేశారని జీఓ కాపీలు చూపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవాను ఆదాయ వనరుగా భావించి 3,600 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను వెడల్పు చేయడానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ఫోన్ చేసి బహిరంగ చర్చకు ఉరవకొండకు రావాలని ఆహ్వానించగా.. జీడిపల్లి వద్దకు రావాలని మెలిక పెట్టడం చూస్తే ఆయన సవాల్కు కట్టుబడి లేరని అర్థమైందని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. హంద్రీ–నీవాపై మాట్లాడే దమ్ములేకే అని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం ఉరవకొండకు రమ్మంటే జీడిపల్లికి రావాలంటూ మెలిక పెట్టిన కాలవ -
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా! ● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి ● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’ ● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు ● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది. అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’ అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. -
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: ప్రభుత్వం పేద ప్రజలకు సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి స్వాఽధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్లదిన్నెకు చెందిన శ్రీనివాసులు 65 క్వింటాళ్ల (140 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని బంగారు పేటకు లారీలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని విజిలెన్స్ సీఐ జమాల్ బాషా, ఏఈ రవీంద్రనాథ్, సీఎస్డీటీ జ్యోతి తమకు అందిన సమాచారం మేరకు మండలంలోని గొల్లపల్లి దగ్గర లారీని ఆపి తనిఖీ చేశారు. బిల్లులు, రసీదులు లేకుండా తరలిస్తున్న 65 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాప్తాడు సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్కు తరలించారు. -
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి. -
జంట హత్యల కేసులో మరొకరు లొంగుబాటు
రాప్తాడు: జంట హత్యల కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు తర్వాత.. తాజాగా మరొకరు కోర్టులో లొంగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, మృతుడు నారాయణరెడ్డి కుమారుడు ప్రదీప్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించడంతో ఈ నెల 19న ఆరుగురు నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల ఇంద్రశేఖర్, నీరుగంటి నిరంజన్రెడ్డి, దండు నరేంద్ర, గంగలకుంటకు చెందిన బుడగ లక్ష్మీనారాయణ, అనంతపురం రూరల్ మండలం కందుకూరుకు చెందిన దయ్యం హన్మంత్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నెల 20న వారిని రిమాండ్కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసుబృందాలు గాలిస్తున్నాయి. హత్య జరిగిన సమయంలో గాయపడిన పామాల కొండప్ప అనే నిందితుడు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన బాల నరసింహారెడ్డి బుధవారం కోర్టులో లొంగిపోయాడని సీఐ శ్రీహర్ష తెలిపారు. కోర్టు ఉత్వర్వుల మేరకు రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల పండయ్య, పామాల్ల కొండప్ప, గొనిపట్ల శీనా, పాత్రికేయుడు గొల్లపల్లికి చెందిన పెద్దింటి జగదీష్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. రాయదుర్గం విద్యార్థినికి ‘షైనింగ్ స్టార్’ అవార్డు రాయదుర్గంటౌన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 587/600 మార్కులతో ప్రతిభ కనబరచిన రాయదుర్గం కేజీబీవీ విద్యార్థిని ఎన్.అక్షయ ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికయ్యింది. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అక్షయ అందుకుంది. గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేసి కేజీబీవీ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మితోపాటు విద్యార్థిని తల్లిదండ్రులు గంగమ్మ, మల్లికార్జునలను అభినందించారు. -
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ (06589)లో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్ చేరుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ (06590)లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజూమున 3 గంటలకు బెంగళూరు జంక్షన్కు చేరుతుందన్నారు. యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాహబాద్, కలబురిగి, హోమ్నాబాద్ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 3–ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఫార్మసీ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ శంకర్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శింగనమల, నార్పల, అనంతపురం, రాయదుర్గం, శెట్టూరు, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, ఉరవకొండ, విడపనకల్లు, బ్రహ్మసముద్రం, కణేకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, యాడికి, కూడేరు, బుక్కరాయసముద్రం, వజ్రకరూరు, కుందుర్పి తదితర మండలాల్లో వర్షం పడింది. కాగా గురువారం కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
25న సివిల్స్ ప్రిలిమినరీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 25న జరగనుందని కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు.చీనీ టన్ను రూ.42 వేలు అనంతపురం మార్కెట్యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.42 వేలు పలికాయి. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025అనంతపురం సిటీ: ‘విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. ఉన్నతాధి కారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పేదల ప్రాణాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి’ అంటూ జెడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్లో ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, శ్రీసత్యసాయి జిల్లా జేసీ అభిషేక్ కుమార్, సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అనంతపురం,మడకశిర, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ముందుగా భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ సహా ఇతర సైనికుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. ఆ తరువాత సభను చైర్పర్సన్ గిరిజమ్మ కొనసాగించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ సహా అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, విడపనకల్లు, శెట్టూరు జెడ్పీటీసీ సభ్యులు జూటూరు చంద్రకుమార్, నీలం భాస్కర్, వాసల్లి హనమంతు, మంజునాథ, వజ్రకరూరు ఎంపీపీ రమావత్ దేవి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాతో పాటు కడప, కర్నూలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల వారికి అనువైన అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదన్నారు. కర్నూలు లేదా బెంగళూరుకు రెఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యులు చాలా మంది ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారన్నారు.సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అసమర్థత, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, కొన్నేళ్లుగా పాతుకుపోయి మామూళ్ల మత్తుకు అలవాటుపడి ఆస్పత్రి పరువు తీస్తున్నారని, వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల ఓ రోగిని అనంతపురం శివారులోని సవీరా ఆస్పత్రికి తీసుకెళ్లగా స్టంట్ వేయాలని, అందుకు రూ. లక్షలు ఖర్చవుతుందంటూ అక్కడి వైద్యులు తెలిపారని, అయితే రోగిని బెంగళూరుకు తరలించి టెస్ట్ చేయించగా ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారని సభ్యులు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ఆపరేషన్లు, స్టంట్లు వేస్తూ సవీరా యాజమాన్యం రోగులను దోచుకుంటోందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, ఆ తరువాత వెళ్లిపోతుండటంతో అత్యవసర కేసులకు దిక్కులేకుండా పోతోందన్నారు. విడపనకల్లు మండలంలో తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదానికి గురి కాగా, ప్రాణాపాయ స్థితిలో స్థానిక పీహెచ్సీకి తరలిస్తే.. ఒక్కరంటే ఒక్కరూ అందుబాటులో లేరని జెడ్పీటీసీ సభ్యుడు హనుమంతు ఆరోపించారు. బళ్లారికి తరలించేలోపే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సవీరా ఆస్పత్రిలో జరిగే వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి పెట్టాలని సూచించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. సర్వజనాస్పత్రిలో పరిస్థితి గాడిన పడుతోందని, రోజూ 2 వేల నుంచి 2,500 వరకు రోగులు వస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జోక్యం చేసుకుంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ మాట్లాడుతూ సర్వజనాస్పత్రితో పాటు పీహెచ్సీ, సీహెచ్సీలను కూడా రాత్రిళ్లు తనిఖీ చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓలను ఆదేశించారు. తాను ఇటీవల కొన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించానని, దయనీయ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘ఉపాధి’లో భారీగా అక్రమాలు ఉపాధి హామీ పథకం అమలులో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆరోపించారు. నిధులను ఎవరు మెక్కుతున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సలీం బాషాను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీలో అతిథి గృహాలు లేక మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు అవస్థలు పడుతున్నారని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేయగా.. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 8లోన్యూస్రీల్ఉమ్మడి జెడ్పీ సమావేశంలో సభ్యుల నిలదీత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఇష్టారాజ్యం గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం ఆరోగ్యశ్రీ బాధితులను హడలెత్తిస్తున్న సైబర్ నేరగాళ్లు చిన్న సమస్యతో సవీరాకు వెళ్లినా ఆపరేషన్లు, స్టంట్లు అంటూ ప్రాణాలతో చెలగాటం ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందంటూ సభ్యుల ధ్వజం -
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ పిలుపునిచ్చారు. అనంత మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. హంద్రీ–నీవా లైనింగ్ పనులను తక్షణం ఆపాలని, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకెళ్లేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించేలా పోరాడదామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. విభజన హామీల్లో జిల్లాకు మంజూరైన ఎయిమ్స్ను గతంలో మంగళగిరికి తరలించారని, ఇప్పుడు రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు.అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 రకాల సమస్యలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ దుశ్చర్యలను గమనించాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అరాచక పాలన చేస్తే ప్రజల నుంచి ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు. డైవర్షన్ కోసమే.. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, హిందూపురం పార్ల మెంట్ పార్టీ పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబ శివారెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ పంచా యతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి -
ఎట్టకేలకు మొదలైన విత్తనశుద్ధి
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టారు. ఖరీఫ్ సమీపిస్తున్నా రైతుల కష్టాలు కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని, వ్యవసాయఽశాఖ మొద్దునిద్ర వీడటం లేదని ‘సాక్షి’లో ఇటీవల వరుసగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో 40 శాతం మేర రాయితీ, అమ్మకం ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించక మునుపే బుధవారం విత్తనశుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉన్న విజయా ఆగ్రోసీడ్స్ ప్లాంట్లో ఏడీఏ ఎం.రవి ఆధ్వర్యంలో విత్తనశుద్ధిని ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించడానికి వీలుగా ప్రాసెసింగ్ చేయాలని ఏడీఏ ఆదేశించారు. ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే ఆర్ఎస్కేలకు సరఫరా చేయాలని సూచించారు. జూన్ మొదటి వారంలో విత్తన పంపిణీ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ! విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు సమాచారం. అలాగే క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.9,300 ప్రకారం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై అటు వ్యవసాయశాఖ, ఇటు ఏపీ సీడ్స్ అధికారులు మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక.. కందులు, చిరుధాన్యాల ధరలు కూడా ఖరారు కాలేదు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తన కేటాయింపులు, ధరలు, రాయితీలు ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా.. ఒక్క క్వింటా కూడా సరఫరా కాకపోవడం విశేషం. -
మహాత్మా.. వారికి మంచి బుద్ధి ప్రసాదించు!
అనంతపురం సిటీ: మడకశిర, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు శాంతియుత నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానమైన సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో ముగ్గురు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లోకి ఎటువంటి ముందస్తు అను మతి లేకుండా వెళ్లడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించిన తీరుపై జెడ్పీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపినట్లు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తెలిపారు. చైర్పర్సన్ చాంబర్లోకి వెళ్లి రచ్చ చేసి.. జాతిపిత మహాత్ముడి చిత్రపటాన్ని తొలగించి సీఎం చంద్రబాబు ఫొటో పెట్టడం, మాజీ సీఎం జగన్ ఫొటో పూర్తిగా తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే జెడ్పీ సమావేశంలో చైర్పర్సన్ గిరిజమ్మ, కలెక్టర్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లకుండా.. అధికారం అండతో దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సీఈఓను ఏకవచనంతో దూషించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. సమావేశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. -
మొత్తం ఖాళీలు 7,710
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేయడంతో జిల్లా అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయనుండగా, ఎస్జీటీ కేడర్ టీచర్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేసేలా షెడ్యూలులో పేర్కొన్నారు. అయితే మ్యానువల్గా నిర్వహిస్తారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు, సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే తప్పనిసరిగా బదిలీ అయ్యే హెచ్ఎంలు, టీచర్ల లెక్కలు తేల్చారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్–మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఈ నాలుగు యాజమాన్యాల కింద జిల్లాలో మొత్తం 14,784 మంది అన్ని కేడర్ల టీచర్లు పని చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో ఏడు రకాల ఖాళీలను గుర్తించారు. మొత్తం 7,710 ఖాళీలను తేల్చారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 193, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 6,225, మునిసిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 231, మునిసిపల్ స్కూళ్లలో 1,061 ఖాళీలున్నట్లు గుర్తించారు. ఏడు రకాల ఖాళీలు ఇలా... అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 5/8 ఏళ్లు పూర్తయిన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ఖాళీలు 3,826 ఉన్నాయి. రీ–అపోర్షన్ ఖాళీలు 2,913, స్పష్టమైన ఖాళీలు 942, ఫారెన్ సర్వీస్ కింద వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలు 5, బాలికల పాఠశాలల్లో పురుష టీచర్లు పని చేస్తూ ఏర్పడిన ఖాళీలు 02, వివిధ డిగ్రీలు చేసేందుకు సెలవులో వెళ్లిన టీచర్ల స్థానాల్లో ఏర్పడిన ఖాళీలు 19, అనధికార గైర్హాజరుతో ఏర్పడిన ఖాళీలు 3 ఉన్నట్లు వెల్లడైంది. బదిలీల షెడ్యూలు ఇలా... హెచ్ఎంల బదిలీలకు సంబంధించి గురువారం ఆన్లైన్ దరఖాస్తు, పరిశీలన, 24న ప్రొవిజనల్ సీనియార్టీ జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 26న అభ్యంతరాల పరిష్కారం, 27న ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల, 28న వెబ్ ఆప్షన్స్, 30న బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. అదేరోజు స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంల పదోన్నతుల వెబ్ ఆప్షన్, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వీరికి 31న పదోన్నతల ఉత్తర్వుల జారీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కేడర్కు సంబంధించి... 24 వరకు ఆన్లైన్ దరఖాస్తు. 25–దరఖాస్తుల పరిశీలన. 26,27 తేదీల్లో ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్లైన్ ప్రదర్శన, 28న అభ్యంతరాల స్వీకరణ, 28,29 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 31న ఫైనల్ జాబితా ప్రకటన, జూన్ 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్, 4న బదిలీ ఉత్తర్వుల జారీ. 05న ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్, 06న పదోన్నతుల ఉత్తర్వుల జారీ. ఎస్జీటీ కేడర్కు సంబంధించి... ఈనెల 27 వరకు ఆన్లైన్ దరఖాస్తు. 28–దరఖాస్తుల పరిశీలన. 31న ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్లైన్ ప్రదర్శన, జూన్ 01న అభ్యంతరాల స్వీకరణ, 01,02 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 06న ఫైనల్ జాబితా ప్రకటన, 07 నుంచి 10 వరకు తేదీల్లో వెబ్ ఆప్షన్, 11న బదిలీ ఉత్తర్వుల జారీ. వీరికి మ్యానువల్ కౌన్సెలింగ్ ఉన్నా ఈ షెడ్యూలు మేరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీచర్ బదిలీల ప్రక్రియ వేగవంతం 30న హెచ్ఎంల బదిలీల ఉత్తర్వులు జూన్ 4న స్కూల్ అసిస్టెంట్, 11న ఎస్జీటీలకు.. -
అనంత జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల అత్యుత్సాహం ప్రదర్శించారు. జెడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేలు హల్చల్ చేశారు. జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, సురేంద్రబాబు, ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగారు. వైఎస్ జగన్ ఫొటో తీసేయాలంటూ రాద్ధాంతం చేశారు. ఉద్యోగం తీసేయిస్తామంటూ జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదు: వెన్నపూస రవీంద్రారెడ్డిఅనంతపురంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. జెడ్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరించారన్నారు. అనుమతి లేకుండా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఛాంబర్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టవా?. చంద్రబాబు ఫోటోపై ఉన్న శ్రద్ధ... సూపర్ సిక్స్ హామీల అమలులో ఎందుకు చూపలేదు?. జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డిపై దౌర్జన్యం సరికాదని వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. -
‘బాబూ.. రేషన్ డెలివరీ వాహనాలపై కుట్రలెందుకు?’
సాక్షి, అనంతపురం/తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ చేసిన సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవు పలికారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదు. వైఎస్ జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదు. కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడం దారుణం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి విదేశీ నిధులు ఆపడం దుర్మార్గం. హంద్రీనీవా లైనింగ్ పనులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని వ్యాఖ్యనించారు.వరదల్లో ఆదుకున్నవి ఇవే కదా: కారుమూరి తాడేపల్లిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కానీ, ఆ సంస్కరణలను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. రేషన్ డెలివరీ వాహనాల వ్యవస్థను చంద్రబాబు తొలగించారు. ఈ వాహనాల ద్వారా పేదలకు ఎంతో ఉపయోగం జరిగింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ఎలా నాశనం చేయగలుగుతున్నారు?. ఎండీయూల తొలగింపు ద్వారా 20వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2.60 లక్షల మంది వాలంటీర్లను కూడా రోడ్డున పడేశారు.ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ రేషన్ బియ్యాన్ని ఆపేయటం ఏంటి?. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ నిలిపేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ ఎండీయూ వాహనాలు ఆ తర్వాత డిపోలు తొలగిస్తారు. చంద్రబాబుది శాడిస్టు బుద్ధి. అందుకే ప్రజలను పట్టి పీడిస్తున్నారు. గోదావరి వరదలు, విజయవాడ వరదల సమయంలో ఎండీయూ వాహనాలే ఆదుకున్నాయి. ఎండీయూ వాహనదారులకు మేము అండగా నిలుస్తాం. ఆ వాహనాలను కొనసాగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎండీయూ వాహనాల ద్వారా ఏం అక్రమాలు జరిగాయో ప్రభుత్వం చెప్పాలి?. సీజ్ ద షిప్ ఎపిసోడ్ ఏమైంది?. ఆ కేసులో ఎంత బియ్యం సీజ్ చేశారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. జగన్ సంస్కరణలను నాశనం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. -
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా చూడాలని కోరారు. వ్యక్తిపై కేసు నమోదు గార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. రేషనలైజేషన్తో తీవ్రంగా నష్టపోతున్నాం అనంతపురం అర్బన్: ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా తీవ్రంగా నష్టపోతామని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్కుమార్ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ వద్ద అసోషియేషన్ ఆఫ్ సెక్రటరీయేట్ రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ బాషా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మైలారప్ప, పవన్కుమార్, ఉపాధ్యక్షుడు అఖిల్కుమార్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అన్ని శాఖల్లో విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా చాలా నష్టపోతామన్నారు. ఈ ప్రక్రియలో రెండు లేదా మూడు సచివాలయాలను క్లస్టర్గా చేస్తున్నారన్నారు. దీంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, మైనర్ ఇరిగేషన్, పంచాయతీ ఇలా అన్ని శాఖల పనులు ఒకేసారి చేయాల్సి వస్తుందన్నారు. దీంతో ఒత్తిడి పెరిగి పనిలో నాణ్యత లోపిస్తుందన్నారు. ఈ క్రమంలో చోటు చేసుకునే తప్పిదాలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శ్రీకాంత్, కులశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విచారణకు 33 మంది ఎల్టీల హాజరు అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ)లో ల్యాబ్ టెక్నీషియన్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం చేపట్టారు. బోధనాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 35 మందికి గాను 33 మంది హాజరయ్యారు. విచారణ కమిటీ సభ్యులుగా డాక్టర శ్యామ్, డాక్టర్ రామస్వామి, డాక్టర్ ఆది నటేష్ వ్యవహరించారు. -
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి.